-
ఓటింగ్లో యువశక్తి చూపండి
బనశంకరి: లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు యువ ఓటర్లు ముందడుగు వేయాలని బెంగళూరు నగర జిల్లా ఎన్నికల అధికారి బీబీఎంపీ కమిషనర్ తుషార్గిరినాథ్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాగృతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన జాతాను లాల్బాగ్ 1వ మెయిన్గేట్ వద్ద తుషార్గిరినాథ్ ప్రారంభించి మాట్లాడారు. ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు ఈనెల 26న పోలింగ్ బూత్లకు వెళ్లి తమకు నచ్చిన వారికి ఓటు వేయాలన్నారు. బెంగళూరులో గత ఎన్నికల్లో 54 శాతం పోలింగ్ జరిగిందని, ఓటింగ్ శాతం పెంచే దృష్టితో జాగృతి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మహారాణి కాలేజీ, వివేకానందకాలేజీ, విజయకాలేజీ, ప్రభుత్వ ఆర్ట్స్కాలేజీతో పాటు 17 కాలేజీలనుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 4 కిలోమీటర్ల మేర జాగృతి కార్యక్రమం చేపట్టి వాకింగ్ కోసం వచ్చిన వారికి అవగాహన కల్పించారు. స్వీప్ సమితి అధ్యక్షుడు కాంతరాజు, జిల్లా స్వీప్ నోడల్ అధికారి ప్రతిభ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి మారణకాండ
సాక్షి బళ్లారి: గదగ్ నగరంలో గురువారం అర్ధరాత్రి మారణకాండ చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. హతులను నగరసభ ఉపాధ్యక్షురాలు సునంద బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27), పరశురామ (55), లక్ష్మీ (45), ఆకాంక్ష(16)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు పైఅంతస్తులో గాఢ నిద్రలో ఉండగా దుండగులు చొరబడి వేట కొడవవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యోదంతానికి పాల్పడ్డారు. గదిలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రక్తం ఏరులై పారింది. దుండగుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధితులు యత్నించగా వెంటాడి నరికినట్లుగా ఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపించాయి. భీతావహంగా ఘటన స్థలం హత్య జరిగిన స్థలం రక్తం మడుగులతో భీతావహంగా ఉంది. ఇంటిలోని వస్తు సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. మహిళలు అనే కనికరం లేకుండా కొడవళ్లతో నరికి హత్య చేయడం నగరవాసులను కలవరపాటుకు గురి చేసింది. హంతకులు ఎవరు.. హత్యోదంతం కుటుంబ గొడవలతోనే జరిగినట్లు కొందరు చెబుతున్నారు. హంతకులు ఎవరు, ఏ ప్రాంతంనుంచి వచ్చారు..లోపలకు ఎలా చొరబడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ వీఎస్ నేమగౌడ ఆధ్వర్యంలో క్లూస్టీమ్, డాగ్ స్క్వాడ్తో సోదాలు నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గదగ్లో దారుణహత్యలు ఒకే ఇంటిలో నలుగురు హతం మారణాయుధాలతో చెలరేగిన దుండగులు కుటుంబ కలహాలే హత్యలకు కారణమా? ఆ రాత్రి వెళ్లిపోయి ఉంటే.. సునంద ప్రకాష్ బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27) వివాహా నిశ్చితార్థానికి కొప్పళకు చెందిన పరుశురామ్(55), లక్ష్మి (45) దంపతులు తమ కుమార్తె ఆకాంక్ష(17)తో కలిసి వచ్చారు. 18వ తేదీ ఉదయం వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంబరాలు ముగిసిన తర్వాత బంధువులు, మిత్రులు వారి వారి ప్రాంతాలకు తరలి వెళ్లగా పరుశురామ, లక్ష్మి, ఆకాంక్ష కొప్పళకు తిరిగి వచ్చేందుకు గురువారం రాత్రి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బంధువుల ఒత్తిడితో కార్తీక్ బాకళె ఇంటిలోనే వారు బస చేశారు. కార్తీక్బాకళె(27)తో పాటు పైఅంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి జరిగిన హత్యోదంతంలో కార్తీక్ బాకళెతోపాటు పరశురామ, లక్ష్మి, ఆకాంక్షలు కూడా బలయ్యారు. -
పలు ప్రాంతాలకు వర్ష సూచన
బనశంకరి: వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బెంగళూరు నగర, గ్రామాంతర, దక్షిణకన్నడ, గుల్బర్గా, రాయచూరు జిల్లాల్లో కొద్ది గంటల్లో వర్షం కురుస్తుందని భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మూడు చెరువుల పునరుద్ధరణబనశంకరి: రెండు నెలలుగా బెంగళూరు నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చడంతో ప్రజల దప్పిక తీర్చేందుకు రాయల్ చాలెంజర్స్ నడుం బిగించింది. ఇందులో భాగంగా మూడు చెరువులను అభివృద్ధి చేసింది. ఇండియా కేర్స్ ఫౌండేషన్తో కలిసి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇట్టిగల్పుర, సాదేనహళ్లి, కణ్ణూరు చెరువుల్లో పూడిక తొలగించారు. ఇట్టిగల్పుర, సాదేనహళ్లి చెరువులనుంచి సుమారు 1.2 లక్షటన్నుల పూడికను తొలగించారు. పూడిక మట్టిని 52 మంది రైతులు తమ పొలాలకు తరలించారు. చెరువుల్లో పూడిక తొలగించడంతో 17 ఎకరాల మేర నిల్వ ఉంటుంది. కణ్ణూరుచెరువు చుట్టూ ఔషధమొక్కలు, వెదురు ఉద్యానవనం నిర్మించినట్లు ఆర్సీబీ తెలిపింది. 24 నుంచి నిషేధాజ్ఞలు మైసూరు : ఎన్నికల నేపథ్యంలో ఈనెల 24న సాయంత్రం ఆరు గంటలనుంచి 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు మైసూరులోని 200 పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ బీ రమేష్ శుక్రవారం తెలిపారు. నగరంలో ఐదుగురుకంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదన్నారు. ఊరేగింపులు, సభలు, ధర్నాలు నిషేధించినట్లు తెలిపారు. -
పోలీసులపై నైజీరియన్ల దాడి
యశవంతపుర: బెంగళూరు నగరంలో నైజీరియా పౌరుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. సమాచారం సేకరించటానికి వెళ్లిన బెంగళూరు సీసీబీ పోలీసులపై నైజీరియన్లు దాడులు చేశారు. గురువారం అర్ధరాత్రి యలహంక తాలూకా రాజానుగుంట సమీపంలోని మావళ్లిపురలో ఉంటున్న నైజీరియన్లు పోలీసులపై హెల్మెట్లతో దాడి చేయడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఓ డ్రగ్స్ కేసులో నైజీరియా పౌరుడిని విచారణ చేయడానికి సీసీబీ బృందం అక్కడికి వెళ్లిన సమయంలో మొదట వాగ్వాదం జరిగింది. రోడ్డుపైనే దౌర్జన్యానికి పాల్పడారు. అనంతరం ఫోన్లు చేసి 10 మంది తమ వారిని పిలుపించుకున్నారు. పోలీసులను తరిమితరిమి కొట్టారు. ఘటనకు సంబంధించి సీసీబీ అధికారి ఫిర్యాదు ఆధారంగా బాగలగుంటె పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు బెంగళూరు గ్రామీణ ఎస్పీ మల్లికార్జున తెలిపారు. దాడి సమాచారం అందుకున్న రాజానుకుంటె పోలీసులు సీసీబీ పోలీసులకు రక్షణ కల్పించారు. -
నేడు ప్రధాని మోదీ రాక
సాక్షి బెంగళూరు: బెంగళూరులోని వివిధ లోక్సభ నియోజకవర్గాలు, గ్రామీణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వస్తుండడంతో కార్యకర్తల్లో, ఓటర్లలో కొత్త ఉత్సాహం వచ్చిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. నరేంద్ర మోదీ కార్యక్రమం శనివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని విహార్గేట్లో జరగనుందని తెలిపారు. శుక్రవారం ప్యాలెస్ మైదానంలో ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లను విజయేంద్ర పరిశీలించి ఆ తర్వాత జరిగిన ప్రధాని భారీ బహిరంగ సభ కర్టన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విజయేంద్ర మాట్లాడుతూ చిక్కబళ్లాపుర కార్యక్రమం తర్వాత బెంగళూరులో ప్రధాని మోదీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మొత్తం 60 వేల మంది కూర్చొనేలా సీట్లను ఏర్పాటు చేసినట్లు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. హుబ్లీలో జరిగిన ఘటన కేవలం వ్యక్తిగత కారణాలతో జరిగినట్లు సీఎం, హోం మంత్రి చెప్పడం శోచనీయమని, దేశద్రోహులకు రక్షణ కలిగించేలా వారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఒక్కరోజే 8 హత్య కేసులు నమోదు అయ్యాయని, ఇలా నేరాలు రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు, చిక్కబళ్లాపురంలో బహిరంగ సభలు ఓటర్లలో కొత్త ఉత్సాహం వచ్చిందన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర -
నేడు రాయదుర్గం వైఎస్సార్సీపీ ఆత్మీయ భేటీ
బనశంకరి: ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడమే లక్ష్యంగా పార్టీ ఐటీ వింగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి మద్దతుగా బెంగళూరులో నివాసం ఉండే రాయదుర్గం ప్రజలతో ఈనె 20వ తేదీ శనివారం బెంగళూరులో ఐటీ వింగ్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. సుంకదకట్టెలో పీ అండ్ టీ లేఔట్లో మాగడి రోడ్డు శివనంది కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు సమావేశం ఆరంభమవుతుంది. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఐటీ వింగ్ తెలిపింది. హాజయ్యేవారు ఈ లింక్లో https://-docs.googl.com/forms/d/e/1FAlpQLScSNUBRFOiOeQ6Yxaoqvcdnhxtjey9oBLcqW5BT-UsBmt2Q4A/viewform లో రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ముచ్చుమర్రి రాకేశ్రెడ్డి–6302989417 , శరన్– 7893830381, రాజశేఖర్రెడ్డి– 9703518965 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
ఘరానా మోసం
బనశంకరి: ఒక స్థలానికి సంబంధించి నకిలీ రికార్డులు సృష్టించి 22 బ్యాంకుల్లో రుణం తీసుకుని మోసం చేసిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని జయనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఒకే కుటుంబానికి చెందిన నాగేశ్ భరధ్వాజ్, అతని భార్య సుమా, ఆమె సోదరి వేద, భర్త శేషగిరి, తమ్ముడు సతీశ్, అతని స్నేహితుడు వేద ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం నగర సీపీ దయానంద్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు...ఒకే కుటుంబానికి చెందిన నాగేశ్ భరద్వాజ్ బేగూరు గ్రామంలో 2,100 అడుగుల స్థలానికి నకిలీ రికార్డులు సృష్టించి బ్యాంకులో కుదవపెట్టి బ్యాంకు నుంచి కంతుల వారీగా రుణం, యంత్రోపకరణాల కింద రూ.కోటి 30 లక్షలు రుణం తీసుకున్నారు. అనంతరం బ్యాంకుకు చెల్లించకుండా వంచనకు పాల్పడటంతో జయనగర పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన జయనగర ఏసీపీ నారాయణస్వామి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ బృందం శుక్రవారం నాగేశ్ భరద్వాజ్, భార్య సుమా దంపతులను అరెస్ట్చేసి విచారణ చేపట్టగా ఈ వంచనలో కుటుంబ సభ్యులందరూ ఉన్నట్లు వెలుగుచూడటంతో ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఖతర్నాక్ కుటుంబ సభ్యులు : ఒకే స్థలానికి సంబంధించి సర్వే నెంబర్లు నమోదు చేసి పొడవు, వెడల్పులో మార్పులు చేసిన నకిలీ రికార్డులు సృష్టించి నాగేశ్ భరద్వాజ్, అతని భార్య సుమా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విధంగా తన కుటుంబ సభ్యుల సహకారంతో పలు జాతీయ, సహకార బ్యాంకుల్లో కుదువపెట్టి మొత్తం 22 బ్యాంకుల నుంచి రూ.10 కోట్లు అప్పు తీసుకుని వంచనకు పాల్పడినట్లు తేలిందన్నారు. విలేకరుల సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ సతీశ్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఒకే స్థలానికి నకిలీ రికార్డులు సృష్టించి 22 బ్యాంకుల నుంచి రుణం కోట్లాది రూపాయల వంచన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అరెస్ట్ -
రైస్పుల్లింగ్ పేరుతో వంచన
బనశంకరి/కృష్ణరాజపుర: రైస్ పుల్లింగ్పేరుతో నకిలీ తామ్రపాత్ర చూపించి వంచనకు పాల్పడిన ముగ్గురు వంచకులకు బేడీలు పడ్డాయి. పంజాబ్కు చెందిన సన్నిగిల్, తమిళనాడువాసి రమేశ్, బెంగళూరు నగరనివాసి శివశంకర్ అనే నిందితులను శుక్రవారం జయనగరపోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ. 69.79 లక్షల నగదు, నకిలీ తామ్రపాత్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జయనగర 6 వబ్లాక్ యడియూరుచెరువు వద్ద రైస్పుల్లింగ్ తామ్రపాత్ర విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. శుక్రవారం జయనగర పోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్చేశారు. అనంతరం వారిని కోర్టులో హజరుపరిచారు. నిందితులనుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో వారిని 5 రోజులపాటు కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. కాగా నిందితులు చాలా చోట్ల అనేక మందిని వంచించినట్లు పోలీసులు తెలిపారు. రూ.69.79 లక్షలు స్వాధీనం -
కాంగ్రెస్వి తాత్కాలిక గ్యారంటీ పథకాలు
శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారెంటీ పథకాలు తాత్కాలికమని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసే పథకాలు శాశ్వతమైనవని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ దేశాభివృద్ధి నరేంద్ర మోదీతోనే సాధ్యపడుతుందని దేశ ప్రజలు విశ్వసించారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోవటానికి నాయకత్వ విఫలమే కారణమని, అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీని అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. భారతదేశం అభివృద్ధి చెందటంపై ప్రపంచం దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో 28 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. యడియూరప్ప అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందిన బీజేపీ నేత అన్నారు. తనకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించటంలో తన తండ్రి ప్రమేయం లేదన్నారు. 12 సంవత్సరాలుగా పార్టీ కోసం ఓ సైనికుడిలా కష్టపడ్డానని తెలిపారు. తన కష్టాన్ని అధిష్టానం గుర్తించిందన్నారు. శివమొగ్గలో ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యర్థిఽగా పోటీ చేసినా బీజేపీ అభ్యర్థి బీ.వై.రాఘవేంద్ర 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందుతారన్నారు. ప్రధాని మోదీ కృషితో శాశ్వత సంక్షేమ పథకాలు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర -
కాంగ్రెస్లో చేరిన మాలికయ్య గుత్తేదార్
శివాజీనగర: మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్ శుక్రవారం బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. కేపీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాలికయ్య గుత్తేదార్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రులైన ప్రియాంక్ ఖర్గే, కే.ఎన్.రాజణ్ణ తదితరులు ఉన్నారు. మాలీకయ్య గుత్తేదార్కు కాంగ్రెస్ పార్టీ జెండా చేతికందించి పార్టీలోకి చేర్చుకొన్నారు. శారదా మోహన్ శెట్టి చేరిక: ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే శారదా మోహన శెట్టి సైతం కాంగ్రెస్లో చేరారు. ఈ సంద్భంగా ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ మాట్లాడుతూ.. మాలికయ్య గుత్తేదార్ గతంలో తమతోనే ఉండేవారు. అనివార్య కారణాలతో బయటికి వెళ్లారు. ఆయన శుక్రవారం పార్టీలోకి వెనుతిరిగి వచ్చారు. ఆయనతో పాటుగా ఆయన అనుచరులను కూడా పార్టీలో చేరారన్నారు. సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ...మాలికయ్య పార్టీలోకి రావడం మరింత కలిసివస్తుందన్నారు. -
నరేగ పనుల పరిశీలన
రాయచూరు రూరల్: జిల్లాలో జరుగుతున్న నరేగ పనులను జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే పరిశీలించారు. శుక్రవారం తాలూకాలోని చంద్రబండ నల్లోనికుంట చెరువులో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకు సక్రమంగా పనులు లభిస్తున్నాయో లేదో అనే అంశంపై విచారణ జరిపారు. పనులు చేసే ప్రాంతంలో కూలీ కార్మికులకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పించారా? అని ఆరా తీశారు. జెడ్పీ సీఈఓ వెంట ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి సాహిత్య, అధికారులు మానప్ప కట్టిమని, హనుమంతులున్నారు. చలివేంద్రం ప్రారంభం రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్విలో శుక్రవారం సిద్ధార్థ పరపతి సౌహార్ద సహకార సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని అధ్యక్షుడు తిప్పణ్ణ బాగలవాడ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు నెలల పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు తాగునీటిని అందిస్తామన్నారు. ప్రతి ఏటా రెండు నెలల పాటు తాగునీరందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు చెన్నబసవ నాయక్, వీరనగౌడ, చెన్నబసవ, మంజునాథ్, నాగరాజ్, మార్కేండేష్, శివకుమార్, సాజిద్ ఖాద్రిలున్నారు. వడదెబ్బకు వృద్ధురాలు మృతి రాయచూరు రూరల్: రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన జిల్లాలో జరిగింది. శుక్రవారం సాత్మైలు బస్టాండ్ వద్ద వేచి ఉన్న వృద్ధురాలు బూదెమ్మ(61) వయో సహజ వృద్ధాప్యం కారణంగా ఆస్పత్రికి వెళుతుండగా వడ దెబ్బకు గురైంది. ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసింది. ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్ ●● 8 ద్విచక్రవాహనాల స్వాధీనం బళ్లారిటౌన్: నగరంలోని బ్రూస్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బైక్ దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.3 లక్షల విలువ చేసే 8 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు బ్రూస్పేట్ పోలీస్ స్టేషన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 5.30 గంటలకు కేఎస్ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా స్కూటర్ను తీసుకెళ్లడాన్ని గమనించిన పోలీసులు అతడిని విచారించగా మాబాష అని తేలిందని తెలిపారు. అతనిని మరింత లోతుగా విచారణ జరపగా చోర్మాబుతో కలిసి బైక్ల చోరీలకు పాల్పడుతున్నట్లు తేలినందున ఇద్దరినీ విచారించి వారి వద్ద నుంచి 8 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం రాయచూరు రూరల్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలైన ఘటన లింగసూగూరు తాలూకా ముదగల్ సమీపంలోని హాలబావి వీరభద్రేశ్వర ఆలయం వద్ద జరిగింది. శుక్రవారం సాయంత్రం బోలోరో వాహనం టైరు పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో శివబసప్ప(37), హొన్నమ్మ(33) మరణించినట్లు పోలీసులు తెలిపారు. మల్లాపుర నుంచి కుష్టగి తాలూకా తావరగేరలో వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బైక్పై వెళుతుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ముదగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పిడుగుపాటుకు కొబ్బరిచెట్టు దగ్ధం హొసపేటె: కంప్లి సమీపంలోని ముద్దాపుర గ్రామంలో గురువారం సాయంత్రం సుంకలమ్మ దేవాలయం సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టుకు మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు పిడుగుపాటుకు చెట్టుకు సమీపంలో, చుట్టుపక్కల ఎవరూ లేని చోట పడడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొబ్బరి చెట్టుకు మంటలు వ్యాపించడంతో స్థానికులు పరుగులు తీశారు. -
అభ్యర్థి తరఫున ప్రచారం
సాక్షిబళ్లారి: భారత ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లుగా దేశంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీజేపీకి ఓటు వేయాలని మాజీ మంత్రి గాలి జనార్ధన్రెడ్డి సతీమణి, బీజేపీ నాయకురాలు గాలి లక్ష్మీ అరుణ పేర్కొన్నారు. ఆమె శుక్రవారం నగరంలోని 19వ వార్డులోని పటేల్ నగర్, రామయ్య కాలనీల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి శ్రీరాములును గెలిపించాలని కరపత్రాలను అందజేశారు. శ్రీరాములును గెలిపిస్తే జిల్లాకు ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారన్నారు. వికసిత భారత్ కోసం బీజేపీకి వేటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు ప్రజా సంక్షేమం పట్టలేదు
కేజీఎఫ్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజా సంక్షేమం పట్టలేదని, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పదవులు కాపాడుకోడానికే ప్రయత్నిస్తున్నారని బీజేపీ స్వాభిమాన వర్గం నాయకుడు మోహనకృష్ణ తెలిపారు. శుక్రవారం ఎన్డీఎ అభ్యర్థి తరపున నగరంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రైతులపై కాంగ్రెస్కు శ్రద్ధ ఉంటే ఇప్పటికే కరువు పరిహారం అందించేవారన్నారు. అనవసరంగా కేంద్రంపై వేలెత్తి చూపుతూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారెంటీలకు ప్రజలు లొంగవద్దని, అశాశ్వత పథకాలను విశ్వసించవద్దన్నారు. సమాజంలో శాశ్వత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తేవడం కేవలం బీజేపీ వల్లే సాధ్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో నగరసభ మాజీ అధ్యక్షుడు దయానంద్, సురేష్, జీపీకే శ్రీనివాస్, మహేష్గౌడ తదితరులు పాల్గొన్నారు. -
సౌమ్యారెడ్డికి స్వామీజీ ఆశీర్వాదం
బొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి శుక్రవారం కర్ణాటక రెడ్డి సముదాయానికి చెందిన శ్రీశ్రీ వేమాననంద స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు. నగరంలోని మంత్రి రామలింగారెడ్డి నివాసారికి వచ్చిన స్వామీజీ సౌమ్యారెడ్డిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చంద్రప్ప,రెడ్డి జన సంఘం సభ్యులు శేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి(కిట్టి) ప్రముఖులు పాల్గొన్నారు. అవినీతికి పాల్పడిన వారిని ప్రజలు క్షమించరు : సీఎంగౌరిబిదనూరు: కరోనా కాలంలో అవినీతికి పాల్పడిన వారిని ప్రజలు క్షమించరని, అందువల్లే మాజీ మంత్రి డా సుధాకర్ను గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఓడించారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. గురువారం రాత్రి దాకా నగరంలో జరిగిన ఎన్నికల రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. బాగేపల్లి నుండి ఆలస్యంగా వచ్చిన ముఖ్యమంత్రి నగరంలోని బీహెచ్ రోడ్డులోని శనిమహాత్ముని ఆలయం నుంచి రాత్రి దాకా ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ నియోజక వర్గంలో ప్రస్తుతం వున్న ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ, మాజీ మంత్రి శివశంకరరెడ్డి గ్రూపులు ఒకటయ్యిందని, ఇక్కడనే 50 వేల ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి రక్షా రామయ్యకు వస్తుందన్నారు. మోదీ ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రానికి వస్తారని, వరదలు వచ్చినపుడు ఎందుకు రాలేదన్నారు. రోడ్ షోలో శివశంకరరెడ్డి, పుట్టస్వామిగౌడ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీపై పాట, యువకుడిపై దాడి మైసూరు: ప్రధాని మోదీకి మద్దతుగా పాట రాసిన యువకుడిపై ఓ వర్గం తీవ్రంగా కొట్టి హత్య చేస్తామని బెదిరించిన ఘటన మైసూరు నగరంలో చోటుచేసుకుంది. రోహిత్ దుండగుల చేతిలో దాడిలో గాయపడిన యువకుడు. రోహిత్ గతవారం ప్రధాని మోదీ గురించి పాటను రాసి యూట్యూబ్లో పోస్టు చేశాడు. ఈ క్రమంలో మైసూరు నగరంలో ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఉన్న సమయంలో ఓ యువకుడు వచ్చిన సమయంలో అతనికి చూపిస్తుండగా తన స్నేహితులు కూడా చూపిస్తామని చెప్పి తీసుకెళ్లి దాడి చేశారని రోహిత్ వాపోయాడు. బాధితుడు లక్ష్మీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఆకతాయి సెక్యూరిటీ గార్డుకు దేహశుద్ధి
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాలో సెక్యూరిటీ గార్డు కుచేష్టలు అధికమయ్యాయి. మహిళల బాత్ రూంలో వీడియోను రికార్ఢు చేస్తున్న ఘటన నగరంలోని రామ మందిరం సర్కిల్ సమీపంలోని అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. శుక్రవారం అపార్ట్మెంట్లో నివాసమున్న మహిళ బాత్రూంకు వెళ్లినప్పుడు సెక్యూరిటీగార్డు విశ్వనాథ్ వీడియో తీయడాన్ని పసిగట్టిన మహిళ భర్తకు ఫోన్ చేయడంతో అపార్ట్మెంటు వాసులు కలిసి అతనిని స్తంభానికి కట్టేసి చితకబాది స్టేషన్ బజారు పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నేడు చిక్కతిరుపతి బ్రహ్మరథోత్సవంమాలూరు: తాలూకాలోని ప్రసిద్ధ చిక్కతిరుపతి ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయ బ్రహ్మరథోత్సవ వేడుకలను శనివారం నిర్వహిస్తున్నారు. రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి యేటా చైత్ర మాసంలో 10 రోజుల పాటు జాతర మహోత్సవం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు జాతరను చూడడానికి తరలి వస్తారు. బ్రహ్మరథోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ సమితి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. -
వారసుడికి విజయం దక్కేనా ?
లక్షల్లోమైసూరు: దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మైసూరు పేరు సుపరిచితం. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఈ నగరంలో ఇంకా రాచరికపు పోకడలు దర్శనమిస్తాయి. దసరా వేడుకలకు లక్షల మంది పర్యాటకులు దసరా వైభవం చూడటానికి తరలివస్తుంటారు. ఇప్పుడు మరోసారి యావత్ ప్రజలు మైసూరు రాజప్రాసాదం వైపు చూస్తున్నారు. ఎందుకంటే మైసూరు రాజ వంశానికి చెందిన యువరాజు కృష్ణదత్త చామరాజ ఒడెయార్ ఇప్పుడు ఎన్నికల బరిలో ఉండటమే కారణం. ఈ ఎన్నికల్లో బీజేపీ–జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా మైసూరు రాజవంశానికి చెందిన యదువీర్ బరిలో ఉన్నారు. దీంతో అనేక మంది యదువీర్ విజయం నల్లేరుమీద నడకే అన్నట్లు ఉండగా, మరికొంత మంది సీఎం సిద్దరామయ్య సొంత జిల్లా, అది కూడా గతంలో కాంగ్రెస్ కంచుకోటలో విజయం అంత సులభంగా దక్కదని చెబుతున్నారు. ఎన్నికల్లో మళ్లీ వారసుడు : మరోవైపు మూడు దశాబ్ధాల అనంతరం మైసూరు రాజ వంశానికి చెందిన వారసుడు యదువీర్ రాజకీయ రంగంలోకి దిగారు. అంతకు ముందు యదువీర్ తండ్రి శ్రీకంఠ దత్త నరసింహరాజ ఒడయర్ కాంగ్రెస్ నుంచి నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. అనంతరం టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరి పోటీ చేసి పరాజయం పొందారు. తాజాగా ఆయన దత్త కుమారుడు యదువీర్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ కంచుకోట మైసూరు–కొడగు పార్లమెంట్ గతంలో కాంగ్రెస్ పారీ్టకి కంచుకోట, ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ 14సార్లు విజయం సాధించగా బీజేపీ కేవలం నాలుగుసార్లు గెలిచింది. జేడీఎస్ ఖాతా కూడా తెరవలేదు. గడచిన పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ బలోపేతమైంది. యువ నాయకుడు ప్రతాప్ సింహ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన్ను పక్కన పెట్టి యదువీర్ను బరిలోకి దించారు. విజయం కోసం కాంగ్రెస్ వ్యూహాలు : సీఎం సిద్దరామయ్య సొంత జిల్లా కావడంతో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. కాంగ్రెస్ను గెలిపించడానికి అన్ని దారులు వెతుకుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తొమ్మిదిసార్లు ప్రచారం కూడా పూర్తి చేశారు. మరోవైపు జేడీఎస్ సైతం మైసూరులో సిద్దరామయ్యకు ఓటమి రుచి చూపించాలని పట్టుదలతో ఉంది. ఇక వక్కలిగ సముదాయానికి చెందిన అభ్యర్థి లక్ష్మణ్కు సీఎం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఒక్కలిగ ఓట్లను నమ్ముకొని ముందుకు సాగుతోంది. రాచనగరి రాజప్రాసాదం వైపే అందరి చూపు మైసూరు–కొడగు పార్లమెంట్ అభ్యర్థిగా యదువీర్ కాంగ్రెస్ అభ్యర్థిగా లక్ష్మణ్ సొంత జిల్లాలో సీఎంకు కఠిన పరీక్ష గెలుపుపై ఇరుపార్టీల గురి కులాల వారీగా ఓటర్లు ఒక్కలిగలు : 5.50 దళితులు : 3.20 ముస్లింలు : 2.0కురబలు : 2.30లింగాయత్లు 1.90బ్రాహ్మణులు : 1.40 కొడవలు : 1.10 నాయక్లు : 2.0 ఇతరులు : 1.50 -
ఈసీకి బీజేపీ ఫిర్యాదు
శివాజీనగర: దిన పత్రికల్లో బీజేపీ గురించి అవమానకరంగా ప్రకటనలు ఇచ్చిన కేపీసీసీ, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్పై బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. బృందం శుక్రవారం ఈ మేరకు నృపతుంగ రోడ్డులో ఉన్న ఎన్నికల కమిషన్ కార్యాలయానికి భేటీ చేసి ఫిర్యాదు చేసింది. కన్నడ, ఇంగ్లీష్ డైలీ పత్రికల్లో పరువు నష్టం కలిగించే ప్రకటనలను చేసిన కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశించాలని విన్నవించారు. ఈ బృందంలో ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య, న్యాయ విభాగపు రాష్ట్ర సంచాలకుడు వసంత్కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కర్ణాటక జిందాబాద్ అనాలి మండ్య: ప్రధాని మోదీకి జిందాబాద్ కొట్టేవారు మనుషులే కాదని, ప్రతి ఒక్కరూ కర్ణాటక జిందాబాద్ అనాలని విశ్రాంత ప్రాధ్యాపకుడు బీ.పి మహేష్ చంద్రగురు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండ్య నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రాజ్యాంగాన్ని టచ్ చేస్తే రక్తపాతం జరుగుతుందని, తాము ఎప్పటికి గులాంగిరి ఒప్పుకోమన్నారు. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ కులమతాల మధ్య చిచ్చుపెడుతోందని మండిపడ్డారు. -
ఉప్పొంగిన ఉత్సాహం
సాక్షి,బళ్లారి: వచ్చే నెల 7వ తేదీన జరగనున్న రెండో దశ లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. శుక్రవారం రెండో దశలో పోలింగ్ జరగనున్న బళ్లారి, రాయచూరు, హావేరి తదితర లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కోలాహలంగా, ఉత్సాహంగా నామినేషన్లను సమర్పించారు. ముఖ్యంగా హావేరి లోక్సభ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై జనశక్తిని ప్రదర్శించారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తదితర ముఖ్య నేతలు హాజరు కావడంతో హావేరిలో భారీ జన సందోహం కనిపించింది. హుక్కేరి పీఠాధిపతి సదాశివ స్వామీజీ ఆశీర్వాదం తీసుకొని బృహత్ ర్యాలీలో పాల్గొని నామినేషన్ను సమర్పించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి, లోక్సభ సభ్యుడు శివకుమార్ ఉదాసి, మాజీ మంత్రులు సీసీ పాటిల్, బీసీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల నామినేషన్ల హోరు రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాల లోక్సభ బీజేపీ అభ్యర్థిగా రాజా అమరేశ్వర నాయక్ నామినేషన్ వేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో ఎన్నికల అధికారి, జిల్లాధికారి చంద్రశేఖర్ నాయక్కు ఆయన మరొక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. స్వతంత్ర అభ్యర్ధిగా యల్లమ్మ, ఎస్యూసీఐ అభ్యర్థిగా రామలింగప్ప, భారతీయ జన సామ్రాట్ అభ్యర్ధిగా శ్యామ్రావ్ నామినేషన్ అందించారు. పీజేపీ అభ్యర్థి నామినేషన్ హొసపేటె: పీజేపీ(ప్రహార జనశక్తి పార్టీ) అభ్యర్థి మంజునాథ్ ఘోసల్ శుక్రవారం 2వ సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా పీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.వెంకటేష్, కార్యకర్తలు వెంకోబ, పెద్ద విరుపయ్య వెంకటేష్, టీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి లోక్సభ స్థానానికి బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అభ్యర్థిగా నరసణ్ణగౌడ నామినేషన్ వేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో ఎన్నికల అధికారి, జిల్లాధికారి చంద్రశేఖర్ నాయక్కు ఆయన తన నామినేషన్ పత్రాలను అందించారు. -
ఎమ్మెల్యే ముమ్మర ప్రచారం
హొసపేటె: బళ్లారి, విజయనగర జిల్లాల్లో విస్తరించిన లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుకారాం తరపున కంప్లి ఎమ్మెల్యే జేఎన్.గణేష్ శుక్రవారం ముమ్మరంగా ప్రచారం చేశారు. బెళగోడుహాళు, అరళహళ్లి తండా, సణాపుర, ఇటిగి, నెంబర్ 02 ముద్దాపుర, ఆర్.కొండయ్య క్యాంపు, శంకర్సింగ్ క్యాంపు, హళే నెల్లుడి, హొస నెల్లుడి, కొట్టాల గ్రామాల్లో వేలాది మంది కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 7న జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తుకారాంకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. సీఈటీ పరీక్ష ప్రశాంతంకోలారు: జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో నిర్వహించిన సీఈటీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. భౌతికశాస్త్రం పరీక్షకు 338 మంది, రసాయనిక శాస్త్రం పరీక్షకు 339 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. సీఈటీ పరీక్షలను ఎలాంటి గందరగోళం లేకుండా ముగించినట్లు డీడీపీఐ రామచంద్రప్ప తెలిపారు. భౌతిక శాస్త్రానికి 8325 మంది హాజరు కావాల్సి ఉండగా 7987 మంది, అదే విధంగా మధ్యాహ్నం నిర్వహించిన రసాయనిక శాస్త్రం పరీక్షకు 9325 మంది రిజిష్టరు చేసుకోగా 7886 మంది హాజరైనట్లు తెలిపారు. -
ప్రైవేట్ బస్సులను వేరే చోటికి తరలించాలి
రాయచూరు రూరల్: నగరంలో ప్రైవేట్ బస్సులను వేరే చోటికి తరలించాలని జయ కర్ణాటక జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన జిల్లాధ్యక్షుడు శివకుమార్ యాదవ్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రతి నిత్యం ప్రైవేట్ బస్సుల యాజమాన్యం బెంగళూరు, హుబ్లీ, మంగళూరు, హైదరాబాద్లకు వెళ్లే ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రజలకు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ప్రైవేట్ బస్సులకు సరైన దాఖలాలు లేవని, ప్రయాణికుల వాహనాలుగా కాకుండా లగేజీ వాహనాలుగా మారాయన్నారు. అలాంటి వాహనాలను అంబేడ్కర్ సర్కిల్ నుంచి దూర ప్రాంతాలకు తరలించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
విద్యార్థిని హత్యపై పెల్లుబుకిన ఆందోళన
హుబ్లీ: నగరంలోని బీవీబీ కళాశాల ఆవరణలో గురువారం ఎంసీఏ విద్యార్థిని నేహా హిరేమఠ(24)ను సహ విద్యార్థి ఫయాజ్ దారుణంగా హత్య చేసిన ఉదంతంపై ఆందోళన పెల్లుబుకింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జంట నగరాలతో పాటు బళ్లారి, కొప్పళ, హావేరి, గదగ్, దావణగెరె, ఇతర ప్రాంతాల్లో యువసంఘాలు, బీజేపీ యువమోర్ఛా, ఏబీవీపీ తదితర సంఘ సంస్థలు కదం తొక్కాయి. నిందితుడు ఫయాజ్ను ఒక గంటలోపే పోలీసులు అరెస్ట్ చేసినట్లు జంట నగరాల పోలీస్ కమిషనర్ రేణుకా సుకుమార మీడియాకు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచే కళాశాల ఎదుట భారీ ఎత్తున ఆ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నిందితుడిని తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నిందితుడి స్వస్థలమైన బెళగావి జిల్లా సవదత్తి తాలూకా మునవళ్లి పట్టణం బంద్ కూడా శుక్రవారం విజయవంతమైంది. మునవళ్లి పంచలింగేశ్వర దేవస్థానం క్రాస్ వద్ద యరగట్టి– సవదత్తి రాష్ట్ర రహదారిలో రాస్తారోకో చేపట్టారు. ఈ బంద్కు అన్ని వర్గాల వారు మద్దతు పలికారు. ఈ ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఈరణ్ణ కడాడి నేతృత్వం వహించారు. కాగా చెన్నమ్మ సర్కిల్లో మానవహారం ప్రదర్శించి గంటకు పైగా రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేత రోహిత్ మీడియాతో మాట్లాడుతూ సీఎంతో పాటు హోం మంత్రి ఇది వ్యక్తిగత విషయం అంటూ తప్పించుకునేలా నేహా హత్యోదంతంపై వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని మండిపడ్డారు. హత్య కేసును తీవ్రంగా పరిగణించాలి తన కుమార్తె అమాయకురాలు, ప్రేమించాలంటూ నిందితుడు వెంట పడి వేధించే వాడని, తాము గతంలో నిందితుడికి బుద్ధి చెప్పినా ఈ ఘాతకానికి పాల్పడ్డాడని నేహా తండ్రి, కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజనయ్య హిరేమఠ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయం మరే ఆడ పిల్లకు జరగరాదని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలి సాక్షి, బళ్లారి: హుబ్లీలో గురువారం సాయంత్రం కళాశాల విద్యార్థిని నేహా హిరేమఠను దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం బళ్లారిలో వీరశైవ లింగాయత సముదాయం ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేసట్టారు. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న మహాత్మా గాధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేసి జిల్లాధికారికి వినతి పత్రం సమర్పించారు. వీరశైవ సమాజ ప్రముఖులు హెచ్ ఎం గురుసిద్దస్వామి, మంజునాథ్, కిరణ్కుమార్, విరుపాక్షప్ప, వన్ననగౌడ, బండేగౌడ తదితరులు పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: హుబ్లీలో బీవీబీ కళాశాలలో విద్యార్థిని నేహా హత్యను ఖండిస్తూ ఏబీవీపీ అందోళన చేపట్టింది. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు పాండు మాట్లాడారు. కళాశాలను ఆలయంగా కొలిచే ప్రాంగణంలో ఎంసీఏ చదువుతున్న నేహా హిరేమఠను ఫయాజ్ అనే విద్యార్థి చాకుతో హత్య చేయడాన్ని ఖండించారు. లవ్ జిహాది కోసం నీచ కృత్యానికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. హత్య నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన బళ్లారిఅర్బన్: హుబ్లీలో విద్యార్థిని నేహా హిరేమఠ హత్యను నిరసిస్తూ నగరంలో బీజేపీ మహిళా మోర్ఛా నేతలు, కార్యకర్తలు శుక్రవారం రాత్రి స్థానిక కోర్టు రోడ్డు ఈడిగ హాస్టల్ వద్ద నుంచి రాయల్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. బీజేపీ మహిళ మోర్ఛా పదాధికారులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తు నినాదాలు చేశారు. జిల్లా బీజేపీ మహిళా మోర్ఛా అధ్యక్షురాలు సుగుణ, సాధన హిరేమఠ, అలివేలు, పుష్ప, హంపీ రమణ, గుత్తిగనూరు విరుపాక్షిగౌడ, రాజీవ్, అరుణ్బాలచందర్, ఓంప్రకాష్, సుధాకర్, శ్రీనివాస్, సిద్దేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరు సెంట్రల్లో జోరుగా ఎన్నికల ప్రచారం
శివాజీనగర: పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పీ.సీ.మోహన్ పలు నియోజకవర్గాల్లో పర్యటించి ఇంటింటా ప్రచారం చేపట్టారు. శుక్రవారం ఉదయాన్నే శాంతినగర నియోజకవర్గం దొమ్మలూరులోని పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. ఆ తరువాత దొమ్మలూరు వార్డులోని దూపనహళ్లిలో ఇంటింటా ప్రచారం చేపట్టి, మరోసారి బీజేపీకి ఓటు వేసి అభివృద్ధి పనులు జరిగేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి మన్సుర్ అలీఖాన్ శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని రాజాజీనగర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పవిత్ర పారడైస్ సర్కిల్, బసవేశ్వరనగర, శారదా కాలనీ, మంకి పార్క్, గౌతమ్ నగర, భాష్యం నగర, దయానంద్ నగర తదితర ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేపట్టారు. -
వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
చెళ్లకెరె రూరల్: నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో హోమాలు, పూజా విధివిధానాలను నిర్వహించి అనంతరం కల్యాణోత్సవం జరిపారు. స్వామి వారి తరపున బీఎం కృష్ణమూర్తి, పుష్ప దంపతులు, వెంకటాచల, సంధ్యా దంపతులు కూర్చొన్నారు. అమ్మవారి తరపున రఘు, మమతా దంపతులు, వీవీఎస్ నాగరాజ్, జ్యోతి దంపతులు వివాహ మహోత్సవంలో కూర్చొన్నారు. కల్యాణోత్సవం భక్త జనుల మధ్య కన్నుల పండువలా నెరవేరింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు పద్మనాభ శెట్టి, వెంకటనాగరాజ్, కార్యదర్శి చిదానంద గుప్త, ఉపకార్యదర్శి చంద్రశేఖర్, సీ.శ్రీనివాసులు, ఆది భాస్కర శెట్టి, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఆర్యవైశ్య సంఘం వారు భోజన సౌకర్యం కల్పించారు. కల్యాణోత్సవాన్ని వేదపండితులు కుమారస్వామి, బాలాజీ శర్మ, నాగరాజు నెరవేర్చారు. -
ఓటు వినియోగించుకొన్న ప్రముఖులు
హోసూరు వార్తలు..300 పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అభ్యర్థిహోసూరు: క్రిష్ణగిరి జిల్లాలో జాతీయ సామాజిక న్యాయ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి వెంకటేష్ కుమార్ ఏ అభ్యర్థి పర్యటించని విధంగా 300 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. క్రిష్ణగిరి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తూ 27 మంది బరిలో ఉన్నారు. వీరిలో బీజేపీ అభ్యర్థి నరసింహన్, డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థి కే.గోపినాథ్, అన్నాడీఎంకే పార్టీ నుంచి పోటీ చేస్తున్న జే.పి. జయప్రకాష్, నామ్తమిళర్ ఖచ్చి నుంచి పోటీ చేస్తున్న విద్యారాణి, సామాజిక న్యాయపార్టీ అభ్యర్థి వెంకటేష్కుమార్లు మాత్రమే జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు కెలమంగలం: గ్రామాలకు మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపిస్తూ ఖాళీ బిందెలను పట్టుకొని ఎన్నికలు బహిష్కరించి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. డెంకణీకోట తాలూకా బెట్టముగిళాలం గ్రామపంచాయతీ తొలువబెట్ట, గుళ్లట్టి, పళయూరు, గౌండనూరు గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని, ఈ గ్రామాలకు సరైన రోడ్లు వసతులు లేకపోవడంతో పిల్లలు పాఠశాలలకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని, గ్రామాల్లో బోరుబావులు ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ అడ్డుపడుతుందని, గ్రామాలకు మౌలిక వసతులు కల్పించే వరకు ఓటు వేయమని శుక్రవారం ఆందోళన చేపట్టారు. పలు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా ఎన్నికల సమయాల్లో ప్రజా ప్రతినిధులు గ్రామాలకొచ్చి ఉచిత సలహాలు ఇచ్చి వెళ్లుతున్నారని, అనంతరం గ్రామాలవైపు కన్నెత్తికూడా చూడరని, గ్రామాలకు మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఓట్లు వేస్తామని నినాదాలు చేశారు. విషయం తెలుసుకొన్న బీడీవోలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించినా ఫలితంలేకపోయింది. 26న నిషేధాజ్ఞలుమండ్య: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండ్యలో ఈనెల 26 ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు నిషేధాజ్ఞలు విధించారు. ఈ మేరకు కలెక్టర్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ఉంటుందని, దీంతో అన్ని పోలింగ్ స్టేషన్లలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 200 మీటర్ల దూరంలో ఎవరూ కనిపించ కూడదన్నారు. హోసూరు: తమిళనాడు రాష్ట్రంలో శుక్రవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా ఎన్నికల అధికారి, స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలోని బయనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరయు, భర్త కలిసి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. హోసూరులో అన్నాడీఎంకే అభ్యర్థి జే.పి. జయప్రకాష్, కాంగ్రెస్ అభ్యర్థి కే.గోపినాథ్, మేయర్ ఎస్.ఏ.సత్య, బేళగొండపల్లిలో హోసూరు ఎమ్మెల్యే వై. ప్రకాష్ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. హోసూరులో జరిగిన పోలింగ్ కేంద్రాల్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని మండుటెండలను కూడా లెక్క చేయక క్యూలో నిలబడి ఓటును వినియోగించుకొన్నారు. క్రిష్ణగిరి జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో 64.65 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి మృతి క్రిష్ణగిరి: ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో వ్యాపారి మృతి చెందిన ఘటన సూళగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు... కర్ణాటక రాష్ట్రం కోరమంగల ప్రాంతానికి చెందిన ఖాదర్బాషా (32). బెంగళూరులో చిల్లరదుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సొంతపనిపై ద్విచక్ర వాహనంలో సూళగిరివైపు వెళ్తుండగా చప్పడి వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఘటన స్థలంలోనే మృతి చెందాడు. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఉపాధ్యాయురాలు ఆత్మహత్యహోసూరు: కుటుంబ కలహాలతో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకొన్న ఘటన హడ్కో పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు ...పట్టణంలోని బస్తీ ప్రాంతానికి చెందిన పూవరసన్ భార్య సెమ్మలర్ (33) ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తుంది. శుక్రవారం భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవల్లో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. యువకుడి హత్య కృష్ణరాజపురం: బెంగళూరులోని హోరమావులో హత్య జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్న కీర్తి(28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈఘటనకు సంబంధించి నలు గురిని అరెస్ట్ చేసినట్లు హెన్నూరు పోలీసులు తెలిపారు. కుటుంబ గొడవలే హత్యకు కారణమని తెలిపారు. -
సీఎం రోడ్షోకు జనాలు కరువు
దొడ్డబళ్లాపురం: గ్యారంటీల పేరు చెప్పి జనాలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అందులోనూ ముఖ్యమంత్రికి దొడ్డ పట్టణంలో పరాభవం జరిగింది. చిక్కబళ్లాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రక్ష రామయ్యకు మద్దతుగా గురువారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,మంత్రి కేహెచ్ మునియప్ప తదితరులు దొడ్డ పట్టణంలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేసారు. అయితే జనం లేక రోడ్షో వెలవెలబోయింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు జన సమీకరణ చేయడంలో విఫలమయ్యారో లేక జనం ఆసక్తి లేక రాలేదో కాని రోడ్షోలో కనీసం జిందాబాద్లు కొట్టే కార్యకర్తలూ కరువయ్యారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రోడ్షో సగంలో చాలించి వెనుదిరిగారు. నటి హర్షికపై దౌర్జన్యం యశవంతపుర: కారు పార్కింగ్ విషయంపై నటి హర్చికాపూణచ్చ, ఆమె భర్త భువన్పై దాడికి యత్నించారు. ఈ ఘటన బెంగళూరు పులకేశినగరలో జరిగింది. పార్కింగ్ విషయంపై వివాదం మొదలై హర్షికా మెడలోని బంగారు చైన్ను లాక్కొవటానికి యత్నించారు. ఘటనకు సంబంధించి హర్షికా పూణచ్చ వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేక పోవటంతో జరిగిన ఘటనను సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నారు. బెంగళూరు నగరంలో స్థానికులకు ఎంత రక్షణ ఉందో ఈ ఘటనతో అర్థమవుతుందని, తనపై జరిగిన ఘటనను ఆమె చెప్పుకొచ్చారు. తనకు జరిగిన అవమానం, దౌర్జన్యం మరోకరికి జరగకూడదనే ఉద్దేశంతో వీడియోను పోస్ట్ చేసినట్లు తెలిపారు. కూటమికి జై కొట్టండివిజయపుర(బెంగళూరు గ్రామీణ): లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కూటమిని గెలిపిస్తే జోడెడ్లుగా పనిచేస్తూ మంచి పాలన అందిస్తామని చిక్కబళ్లాపుర అభ్యర్థి కే. సుధాకర్ అన్నారు. శుక్రవారం విజయపుర పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జీ చంద్రణ్ణ, పిళ్ళముని శ్యామప్ప, నిసర్గ నారాయణ స్వామితో కలిసి విజయపుర పట్టణంలో వేలాదిమంది కార్యకర్తల మధ్య రోడ్షో నిర్వహించారు. సుధాకర్ మాట్లాడుతూ నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకు దేశం మొత్తం ఎదురు చూస్తోందన్నారు. టిప్పర్ ఢీకొని బైకిస్టు మృతి యశవంతపుర: టిప్పర్ ఢీకొని బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన ఉడుపిలో శుక్రవారం జరిగింది. బ్రహ్మవర మటపాడికి చెందిన ప్రభాకర్ ఆచారి బైక్పై పెరంపల్లి నుంచి అంబాగిలు మొయిన్ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ప్రమాద తీవ్రతకు బైక్ టిప్పర్ కిందకు దూసుకెళ్లింది. ప్రభాకర్ ఆచారి మృతి చెందగా వెనుక కూర్చున్న మరో వ్యక్తికి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని పోలీసులు మణిపాల్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. నినాదాలు చేస్తే దాడులు చేయడం హేయంగౌరిబిదనూరు: రాష్ట్రంలో హిందువుల పరిస్థితి హీనంగా ఉందని, శ్రీరామ నవమి రోజున జైశ్రీరాం వినాదాలు చేసిన హిందూ యువకులపై అల్ప సంఖ్యాక యువకులు దాడి చేయడం హేయమని, ఈ ఘటనతో రాష్ట్రంలో హిందువుల పరిస్థితి అర్థమవుతుందని బీజేపీ నాయకుడు రవినారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రతి హిందువు బీజేపీ పరంగా వుండాలన్నారు. నరేంద్ర మోదీని మరోమారు ప్రధాని చేయాలన్నారు. జేడీఎస్ తాలూకా అధ్యక్షుడు మంజునాథరెడ్డి మాట్లాడుతూ... జేడీఎస్–బీజేపీల మధ్య సమన్వయం లేదనే వారికి ఈ సమావేశం బుద్ధి చెబుతుందన్నారు. సమావేశంలో జేడీఎస్ నాయకుడు సీకల్ రామచంద్రప్ప, బీజేపీ రూరల్ అధ్యక్షుడు రమేశ్ రావ్, జేడీఎస్ సిఆర్ నరసింహమూర్తి, బిజి వేణుగోపాలరెడ్డి, బైపాస్ నాగరాజు, హరీశ్, ముద్దు వీరప్ప తదితరులు పాల్గొన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement