అభ్యర్థి తరఫున ప్రచారం | Sakshi
Sakshi News home page

అభ్యర్థి తరఫున ప్రచారం

Published Sat, Apr 20 2024 1:40 AM

ప్రచారం చేస్తున్న గాలి లక్ష్మీఅరుణ  - Sakshi

సాక్షిబళ్లారి: భారత ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లుగా దేశంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీజేపీకి ఓటు వేయాలని మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి సతీమణి, బీజేపీ నాయకురాలు గాలి లక్ష్మీ అరుణ పేర్కొన్నారు. ఆమె శుక్రవారం నగరంలోని 19వ వార్డులోని పటేల్‌ నగర్‌, రామయ్య కాలనీల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి శ్రీరాములును గెలిపించాలని కరపత్రాలను అందజేశారు. శ్రీరాములును గెలిపిస్తే జిల్లాకు ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారన్నారు. వికసిత భారత్‌ కోసం బీజేపీకి వేటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement