ఖర్చులకు సూచనలిలా..
● కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన అన్ని రకాల చెత్తకుప్పలు, పాతచెత్త సహా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమా లకు, 2025 డిసెంబర్ వరకు గ్రీన్ అంబాసిడర్లకు అన్ని రకాల బకాయిలు, విద్యుత్ బిల్లులు, నీటి పథకాల నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది.
● మండల పరిషత్లలో లింక్రోడ్లు, హ్యాండ్ పంపుల నిర్వహణ, స్వచ్ రథానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంటుంది.
● జిల్లా పరిషత్లో గ్రామీణ మంచినీటి పథకాలకు సంబంధించిన సీసీ చార్జీల చెల్లింపులు, పథకాల నిర్వహణ, అవసరాలకు అనుగుణంగా లింకు రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు మాత్ర మే ఖర్చు చేయాలని ప్రభుత్వం సూచించింది.
● జిల్లాలో స్థానిక సంస్థల్లో సింహభాగం వైఎస్సార్సీపీకి చెందినవే కావడంతో అధికార కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


