-
జగనన్న పాలనలోనే ప్రైవేటు బోధన సిబ్బందికి న్యాయం
ఆమదాలవలస: ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వైఎస్సార్ సీపీ పాలనలోనే న్యాయం జరిగిందని పలువురు బోధన సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమదాలవలస పట్టణంలోని స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు ఆధ్వర్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. ఈపీఎఫ్, ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం, ఎంపీగా పేరాడ తిలక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వ్యయ పరిశీలకుడు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ను వ్యయ పరిశీలకుడు నవీన్కుమార్ సోని గురువారం గౌరవ పూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి చర్చించారు. అనంతరం వ్యయ పరిశీలకుల బృందంతో సమావేశమయ్యారు. -
బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి
గార: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీ వర్గాల అభ్యన్నతికి కృషి చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం శిమ్మపేట జంక్షన్లోని కల్యాణ మండపంలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో పేదలకు ఏ హామీలు ఇచ్చామని, వాటినే మేనిఫెస్టోలో రూపొందించి 99 శాతం అమలు చేశామని చెప్పారు. బీసీ వర్గాలకు రాజికీయంగా అనేక నామినేటడ్ పదవులు ఇవ్వడంతో పాటు పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. బీసీల ఓట్లు వేయించుకున్న టీడీపీ వారి అభ్యన్నతికి ఏం చేసిందని ప్రశ్నించారు. బీసీలను వాడుకొని వదిలేసిన మనస్తత్వం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ప్రజల్లో తారతమ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. పిల్లల బాగు కోసం తల్లి, తండ్రి ఎలా ఆలోచిస్తున్నారో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. జన్మభూమి కమిటీ అనే బ్రోకర్ల ప్రభుత్వం కావాలా.. పేదల సంక్షేమానికి కృషి చేసే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కావాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. చంద్రబాబు హామీలను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో శ్రీశయన కార్పొరేషన్ చైర్మన్ డీపీ దేవ్, సర్పంచ్ గొలివి వెంకటరమణమూర్తి, అంబటి చినబాబు, ఎంపీపీ గొండు రఘురామ్, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పార్టీ కన్వీనర్ పీస గోపి, ముంజేటి కృష్ణమూర్తి, అరవల రామకృష్ణ, బరాటం నాగేశ్వరరావు, శిమ్మ ధర్మరాజు, యాళ్ల నారాయణమూర్తి, కొయ్యాన చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు త్వరితగతిన చెల్లించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజులను త్వరితగతిన చెల్లించాలని, ఈనెల 24వ తేదీతో గడువు ముగుస్తుందని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. ఇటీవలి వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన వారితో పాటు తమ మార్కులకు పెంచుకునేందుకు (ఇంప్రూవ్మెంట్/బెటర్మెంట్) ఆసక్తి చూపే విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 24 తేదీలోగా తమ కళాశాలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నా రు. అలాగే ఇంటర్మీడియెట్ ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్ఐఓ చెప్పారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్దేశించిన ఫీజులను చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ప్రాక్టికల్స్లో ఫెయిలైన విద్యార్థులకు మే ఒకటి నుంచి 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏ ఫారం..బీ ఫారం అంటే..? హిరమండలం: నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అభ్యర్థులు ‘ఏ’ ఫారం, ‘బీ’ ఫారం ప ట్టుకుని ఆర్ఓ ఆఫీసుకు వస్తారు. అసలు ఈ ఫారాలకు అర్థాలేంటో తెలుసా..? గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను ప్రతిపాదిస్తూ ఇచ్చే పత్రాన్ని బీ ఫారం అంటారు. నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థులు తమ రాజకీయ పార్టీలు ఇచ్చిన బీఫారం దాఖలు చేయాలి. అప్పుడే ఆ అభ్యర్థికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ గుర్తు కేటాయిస్తారు. బీ ఫారంను పార్టీ అధ్యక్షుడు నిర్ణయించిన వ్యక్తి జారీ చేస్తారు. బీ ఫారం జారీచేసేందుకు సంబంధిత వ్యక్తికి పార్టీ అధ్యక్షుడు ఆమోదాన్ని తెలుపుతూ ఏ ఫారం అందజేస్తారు. ఏ ఫారం ఎవరి పేరు తో అధ్యక్షుడు ఇస్తారో ఆ వ్యక్తికి పోటీ చేసే అభ్యర్థులకు బీఫారం ఇచ్చే అధికారం ఉంటుంది. తన పేరు మీద అందజేసిన ఏ ఫారంను ఆయా నియోజకవర్గాల్లోని ఎన్నికల అధికారులకు పోటీ చేసే అభ్యర్థి అందజేయాల్సి ఉంటుంది. ‘అప్రమత్తత అవసరం’ ఇచ్ఛాపురం: నామినేషన్ల సమయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి స్పెష ల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ, జాయింట్ డైరెక్టర్ డి.గంగాధరం పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం గేట్ కి ఇరువైపులా 100 మీటర్ల వరకు గల కటాఫ్ పాయింట్లు ఉండేలా చూసుకోవాలని పోలీసులతో అన్నారు. నామినేషన్ల ప్రక్రియకు వచ్చిన అభ్యర్థుల వాహనాలను కటాఫ్ పాయింట్ల వద్ద నిలపాలని సూచించారు. అభ్యర్థితో పా టు నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే తహసీల్దార్ గేట్ వరకు అనుమతి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఇ చ్ఛాపురం, సోంపేట సీఐలు ఇమ్మాన్యూయేల్ రాజు, మల్లేశ్వరరావు, ఇచ్ఛాపురం, కవిటి ఎస్ఐలు వి.సత్యన్నారాయణ, ఎన్.లక్ష్మణరావు, రాము పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
No Headline
●ఆరోగ్య శ్రీ.. ఇది కేవలం ప్రభుత్వ పథకం కాదు. రాత్రి వేళ నాలుగు మెతుకులు తింటూ రేపటికి తిండి ఎలారా దేవుడా అని మదన పడే సామాన్యుడికి ఆత్మీయ నేస్తం. నెలాఖరున బిడ్డకు సుస్తీ చేస్తే నిస్సహాయంగా ఖాళీ పర్సును తడిమి చూసుకునే మధ్య తరగతి మనిషి పాలిట అమృత హస్తం. పొరపాటున పెద్ద జబ్బేదో వస్తే రోగి కంటే ఎక్కువగా యాతన అనుభవించే ఆ ఇంటి పెద్దకు తోడుగా నిలిచే ఆత్మ బంధువు. పేదవాడిది కూడా ప్రాణమేనని, ఆ ప్రాణానికి బాధ్యత తీసుకునే ప్రభుత్వం మీకు ఉందని నిరంతరం గుర్తు చేసే సాధనం. ఈ కార్డు ముక్క ఇంటిలో కనిపిస్తే.. సగటు జీవికి అదో ధైర్యం. ఆ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు కనిపిస్తే నిరుపేదకు అదో భరోసా. – అరసవల్లి/ఎచ్చెర్ల క్యాంపస్/టెక్కలి/నరసన్నపేట/ఇచ్ఛాపురం రూరల్ ● ప్రజల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆరోగ్య శ్రీ ● జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన పథకం ● 2019 నుంచి నేటి వరకు 2.68 లక్షల మందికి శస్త్రచికిత్సలు ● ఐదేళ్లలో రూ.569 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులన్నీ ఆస్పత్రులకు ఖర్చయిపోగా ఆఖరకు ఆప్తులను కూడా పోగొట్టుకున్న వారెందరో. అసలు ఆస్పత్రికి వెళ్లాలనే ఆలోచన కూడా చేయకుండా ఇంటిలోనే ఊపిరి వదిలేసిన వారు ఇంకెందరో. ఇలాంటి గడ్డు పరిస్థితుల గురించి తెలుసుకుని పేదల ప్రాణాలకు రక్షణగా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన మహత్తర పథకం ఆరోగ్య శ్రీ. తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే.. తనయుడు మరో పది అడుగులు ముందుకు వేశా రు. తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పరిధిని పెంచుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని మరింత మందికి చేరవ చేశారు. ఈ పథకం పరిధిలోకి ఏకంగా 3,257 జబ్బులను చేర్చడంతో పాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా రూ.25 లక్షల వరకు పెంచుతూ స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తోంది. దీంతో పేద,సామాన్య వర్గాలకు ఆరోగ్య బెంగ తీరిపోయింది. అలాగే గుండెజబ్బుతో పాటు క్యాన్సర్ వంటి అతిపెద్ద జబ్బులను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. గతంలో ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో 1,059 ప్రొసీజర్స్ ఉండగా, ఇప్పుడు ఏకంగా 3,257 వ్యాధులను (ప్రొసీజర్స్) ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. వెయ్యి రూపాయలు దాటిన ప్రతి ప్రొసీజర్ను ఉచితంగా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2019 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2.68 లక్షల మందికి వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేయగా..రూ.569 కోట్లకు పైగా ఖర్చు భరించి ఆరోగ్యశ్రీ ద్వారానే సేవలందించారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తి ఆరోగ్యశ్రీ పథకంపై క్షేత్ర స్థాయిలో అవగాహన పెరగాలనే సదుద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రత్యేకంగా యాప్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డుల పంపిణీని కొద్ది నెలల క్రితమే ప్రారంభించింది. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజల సొంత ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ను ఇన్స్టాల్ చేయించి, ఎలా వినియోగించాలో ఇప్పటికే ఇంటింటి డ్రైవ్లో ప్రజలకు వైద్య సిబ్బంది వివరించారు. మొత్తం 6,39,427 స్మార్ట్ కార్డుల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఆరోగ్యశ్రీ ఆదుకుంది... టెక్కలి గొల్లవీధికి చెందిన ఈదు చిన్నంనాయుడు గత ఏడాది అక్టోబర్ నెలలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రెండు కాళ్లతో పాటు నడుము కింద భాగం దెబ్బతింది. ముందు రిమ్స్కు తీసుకెళ్లి అక్కడి నుంచి జెమ్స్కు పంపించారు. అక్కడ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తూ నవంబర్ నెలలో ఆపరేషన్ చేశారు. లక్ష రూపాయలకు పైగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సాయం అందింది. ప్రస్తుతానికి ఇంటి వద్ద కోలుకుంటున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ సేవలు ఏడాది జరిగిన ఖర్చు చేసిన శస్త్రచికిత్సలు మొత్తం2019–20 33,312 రూ. 84.40 కోట్లు 2020–21 35,185 రూ. 95.08 కోట్లు 2021–22 61,357 రూ. 145.16 కోట్లు 2022–23 74,206 రూ. 106.45 కోట్లు 2023–24 (ఏప్రిల్1వరకు) 64,829 రూ. 138.68 కోట్లు మొత్తం 2,68,889 రూ. 569.77 కోట్లు -
శ్రీకాకుళం
అభివృద్ధి పథం..శ్రీజగన్నాథపురం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటయ్యాయి. –8లో● ఒక్క ఏడాది..ఈదురుగాలులకు కూలిన చెట్లు పొందూరు: మండలంలోని తోలాపి, పిల్లలవలస, ధర్మపురం, కింతలి, కనిమెట్ట, తదితర గ్రామాల్లో బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు చెట్లు కూలడంతో పాటు స్తంభాలు నేలకొరిగాయి. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా వా తావారణం చల్లబడి గాలులు ప్రారంభమయ్యాయి. క్రమేపీ పెద్దగాలులుగా మారడంతో కింతలి జెడ్పీ ఉన్నత పాఠశాల పక్కన భారీ చెట్టు కొమ్మ విరిగిపడింది. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చిరుజల్లులు పడి నిలిచిపోవడంతో మరింత ఉక్కపోత పెరిగింది. మమేకమవుతూ.. నాయకులు జనాలతో మమేకమవుతున్నారు. వారితో కలిసిపోతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. –8లోశుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024ఏడాది కిందట అక్కడేమీ లేదు. మరిప్పుడు.. నార్త్, సౌత్ బ్రేక్ వాటర్ పనులు పూర్తయ్యాయి. సముద్రంలో భారీ నౌకతో డ్రెడ్జింగ్ జరుగుతోంది. రోడ్డు, రైల్వే లైన్లకు భూములు సేకరించారు. పోర్టు కు భూములిచ్చిన వారికి పరిహారాలు అందాయి. ఇళ్లు, భూములు పోయిన వారి కోసం పునరావాస కాలనీ కడుతున్నారు. ఒక్క ఏడాదిలో జరిగిన మార్పులివి. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 19న సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.4361.91 కోట్లతో నిర్మాణం తలపెట్టిన మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు ఏడాది కాలంలోనే అత్యంత పురోగతిని సాధించాయి. టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట పోర్టుకు అప్రోచ్ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. – టెక్కలిన్యూస్రీల్ -
‘జోడీ’ పండు
ఎచ్చెర్ల మండలంలోని చినరావుపల్లిలో నంబాడ సూర్యనారాయణకు చెందిన జీడిమామిడి తోటలో మంగళవారం ఒకే జీడిపండుకు రెండు పిక్కలు కనిపించాయి. ఈ విషయమై ఎచ్చెర్ల వ్యవసాయాధికారి సురేష్ మాట్లాడుతూ జన్యులోపాల వల్ల ఇటువంటివి ఏర్పడతాయని చెప్పారు. – ఎచ్చెర్ల క్యాంపస్ వాసుదేవుని సన్నిధిలో మంత్రి సీదిరి కాశీబుగ్గ: రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి, పలాస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సమేతంగా గురువారం మందసలోని వాసుదేవ పెరుమాళ్ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. నామినేషన్ వేయనున్న సందర్భంగా సంబంధిత పత్రాలను స్వామివారి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అప్పలరాజు, శ్రీదేవి దంపతులు గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇరువర్గాల కొట్లాట ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఫరీదుపేటలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గురువారం కొట్లా ట జరిగినట్లు ఎచ్చెర్ల ఎస్సై చిరంజీవి తెలిపా రు. శుభకార్యం వద్ద ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడి చేసుకున్నారని, ఈ ఘటనలో కూన కిరణ్కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించామ ని చెప్పారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల సొంత బావపైన జరిగిన దాడి కేసులో కిరణ్కుమార్పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు. భారతీయ వారసత్వ సంపద అమూల్యం శ్రీకాకుళం కల్చరల్: ఇంటాక్ శ్రీకాకుళం చాప్టర్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని డచ్ భవనం వద్ద ప్రపంచ వారసత్వ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇంటాక్ కన్వీనర్ నూక సన్యాసిరావు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం న్యూఢిల్లీ ఇంటాక్ సంస్థ పంపిన శాశ్వత సభ్యత్వాన్ని కన్వీనర్ చేతుల మీదుగా జగన్మోహనరావుకు అందించారు. కార్యక్రమంలో సహాయ ఇంటాక్ సహాయ కన్వీనర్ వి.జగన్నాథంనాయుడు, నటుకుల మోహన్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి రోజు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వ్యాప్తంగా తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. టెక్కలి స్థానానికి తొలి రోజు ఒక నామినేషన్ పడింది. అలాగే ఇచ్ఛాపురంలోనూ ఒకరు నామినేషన్ వేశారు. ఎచ్చెర్లలో తొలిరోజు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారాలను దరఖాస్తు చేశారు. అలాగే ఆమదాలవలస నియోజకవర్గానికి ఇద్దరు నామినేషన్లు వేశారు. పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, నరసన్నపేటలో తొలిరోజు నామినేషన్లు వేయలేదు. ● నామినేషన్ల పర్వం6 -
ప్రాణదానం
ఈమె పేరు వైశ్యరాజు శాంత లక్ష్మి. నరసన్నపేటలోని కలివరపుపేట. భర్త లేరు. ఇద్దరు పిల్లలను తన రెక్కల కష్టం మీదనే పెంచుతున్నారు. అమ్మా యికి వివాహమైంది. కుమారుడు చేతికి అందివచ్చాడు. ఇప్పటికైనా కాసింత విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. కానీ అప్పుడే ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. క్యాన్సర్ చికిత్స అంటే సాధారణ విషయం కాదు. దీంతో ఆమె ప్రాణాల మీద ఆశ వదిలేశారు. ఇంత లో ఆ వీధి వలంటీర్ ఆమె విషయాన్ని తెలుసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా విశాఖ మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్తే అన్ని పరీక్షలు చేశారు. కీమో థెరపీ కూడా చేశారు. ఆపరేషన్ నిర్వహించి 8 నెలలవుతోంది. ఇప్పుడు తాను ప్రాణాలతో ఉన్నానంటే అది ఆరోగ్య శ్రీ పథకం పుణ్యమేనని ఆమె చెబుతున్నారు. -
No Headline
అంకెల్లో అభివృద్ధిసచివాలయ సముదాయానికి ఖర్చుసుమారు రూ.కోటి డ్వాక్రా భవనం, డిజిటల్ లైబ్రరీరూ. 30 లక్షలు రూ.35 లక్షలు పాఠశాలలో నాడు–నేడు పనులురూ.12 లక్షలు ఇంటింటి కుళాయిలురూ.1.5లక్షలు అమ్మవారి గుడి కల్వర్టుపొడుగుపాడులో సీసీ రోడ్డురూ.5లక్షలు రూ.5 లక్షలు ఎస్సీవీధిలో సీసీ రోడ్డుసీసీ కాలువలురామచంద్రపురంలో సీసీ రోడ్డురూ.10లక్షలు రూ.20లక్షలు కుజ్జిపేటలో బీటీ రోడ్డురామచంద్రపురం గ్రావెల్ రోడ్డురూ.4లక్షలు రూ.8లక్షలు ఎర్రచెరువు, కుజ్జిపేట చెరువుల మదుముల నిర్మాణంరూ.50 వేలు పొడుగుపాడు– శ్రీజగన్నాధపురం వీధిలైట్లు -
‘మేమంతా సిద్ధం’
విజయఢంకా మోగించేందుకు టెక్కలి విజయం ఎంతో కీలకం ఈ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం విజయం ఎంతో కీలకం. ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు ఎంపీ అభ్యర్థి సమన్వయంతో నాయకులతో కలిసి విజయం వైపు పయ నించాలి. టెక్కలిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయ సంకేతాలు కనిపించాలి. –మజ్జి శ్రీనివాసరావు, పార్టీ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ జనం సిద్ధంగా ఉన్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేసిన సీఎం వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 24న టెక్కలిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రను అన్ని వర్గాలు విజయవంతం చేయాలి. – ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు. ప్రతిపక్షాల వెన్ను వణకాలి టెక్కలిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రతిపక్షాల వెన్ను వణకాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలు ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలి. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి. ●టెక్కలి: టెక్కలిలో ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ము గింపు కార్యక్రమం నిర్వహించనున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. యాత్రకు సంబంధించి గురువా రం టెక్కలిలో ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గల కీలకమైన నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టెక్క లి నియోజకవర్గంలో గత టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ఇటీవల టీడీపీ నాయకులు చేసిన కుట్ర పూరిత చర్యల వల్ల దివ్యాంగులు, వృద్ధులు ఎలా ఇబ్బంది పడ్డారో ప్రజలకు వివరించాలని సూచించారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్చార్జి పిరియా సాయి రాజ్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, పార్టీ మహిళా విభా గం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, సంతబొ మ్మాళి జెడ్పీటీసీ పి.వసంత్రెడ్డి, నాలుగు మండలాల అధ్యక్షులు కె.అజయ్కుమార్, కె.సతీష్, ఎన్.సత్యరాజ్, టి.పాల్గుణరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, పీఏసీఎస్ చైర్పర్సన్లు ఎస్.సత్యం, బి.మురళీ, కె.జగన్నాయకులు, నాయకులు చింతాడ గణపతి, చింతాడ రవికుమార్, ఎం.స్వరూప్, కె.రాజేశ్వరరావు, టి.కిరణ్, ఆర్.మల్లయ్య, ఎస్.హేమ సుందర్రాజు, ఎం.అప్పారావు, ఎ.కల్యాణి, జేసీఎస్ ఇన్చార్జిలు ఎస్.మోహన్, జె.జయరాం, జి.నాగుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి టెక్కలి నియోజకవర్గంలో ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో దశాబ్దాల అభివృద్ధి జరిగింది. సుమారు 1500 కోట్ల రూపాయలతో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేశారు. మూలపేట పోర్టుతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రూ.7 వేల కోట్లు వెచ్చించారు. టెక్కలి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయాన్ని సీఎంకు కానుకగా ఇస్తాం. – దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, టెక్కలి కుప్పం, టెక్కలి నియోజకవర్గాల్లో విజయ పతాకం ఎగురవేద్దాం 24న టెక్కలిలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు యాత్ర సన్నాహక సమావేశంలో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి -
పునరుజ్జీవం..
చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్యామ్ మజ్జి. ఇచ్ఛాపురం మండలం తిప్పన పుట్టుగ గ్రా మం. గత ఏడాది సెప్టెంబర్లో కొబ్బరి చెట్టు మీద నుంచి పడిపోయారు. వెన్నుపూస ముక్కలైపోయింది. దాదాపు చావు అంచుల వరకు వెళ్లారు. కుటుంబ సభ్యులు బరంపురం ఆస్పత్రికి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. అంత పెద్ద ఆపరేషన్కు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలో తెలీక ఆ కుటుంబం నరకయాతన అనుభవించింది. అప్పుడే వైజాగ్ ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేయించవచ్చని తెలిసింది. అక్కడకు వెళ్లడంతో ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ తమ కుటుంబాన్ని కాపాడిన దేవుడని కుటుంబ సభ్యులు శ్యామ్ జమున, నిరంజన్, శ్రావణిలు అంటున్నారు. ● -
ఎందుకంత అహంకారం..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీపై యాదవ సామాజిక వర్గం సీరియస్గా ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న గొండు శంకర్ తండ్రి జగపతి చేసిన వ్యాఖ్యలు యాదవ సామాజిక వర్గీయులను తీవ్రంగా బాధపెట్టాయి. పరుష పదజాలం, నోటికొచ్చిన బూతులతో యాదవ కులస్తులను దూషించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అహంభావంతో తమపై మాట్లాడారని, రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఆ సామాజిక వర్గం ఇప్పటికే నిర్ణయించుకుంది. తమ సామాజిక వర్గానికి చెందిన, తన పార్టీకి చెందిన వ్యక్తితో జరిపిన ఫోన్ సంభాషణలో శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి, మాజీ ఎంపీపీ గొండు జగపతి అ సందర్భంగా యాదవులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యాదవులను తక్కువ చేసి మాట్లాడారు. తీవ్రపదజాలంతో దూషించారు. ఆ సంభాషణలో కొనసాగింపుగా నోటికొచ్చిన బూతు పురాణం విప్పారు. ఆ ఫోన్ సంభాషణ బయటకు రావడంతో టీడీపీ నాయకుడు అసలు స్వరూపం వెలుగు చూసింది. ఇప్పుడీ వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. యాదవ సామాజిక వర్గాన్ని ఆవేదనకు గురి చేశాయి. గొండు జగపతి చేసిన వ్యాఖ్యల్ని యాదవులంతా సీరియస్గా తీసుకున్నారు. తేలికగా తీసుకుంటే భవిష్యత్లో మరొకరు తప్పుడు ప్రేలాపనకు దిగుతారని, సామాజిక వర్గంపై చులకనగా మాట్లాడిన వారికి సరైన సమయంలో సరైన శిక్ష విధించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా సమావేశాలు పెట్టుకున్నారు. నందిగాంలోనైతే టెక్కలి నియోజకవర్గ యాదవులంతా విలేకర్ల సమావేశం పెట్టి తమ ఆవేదన తెలియజేశారు. ఇప్పటికే టీడీపీపై యాదవులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గానికి టీడీపీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ఒక్క నాయకుడిని గౌరవించిన దాఖలాల్లేవు. రాజకీయంగా వాడుకోవడం తప్ప ఆ సామాజిక వర్గానికి చేసిందేమీ లేదు. అదే వైఎస్సార్సీపీ విషయానికొస్తే యాదవులకు పదవుల్లో పెద్ద పీట వేసింది. ఆ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావుకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది. ఇక్కడొక్క చోటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ యాదవులకు సముచిత స్థానం కల్పించింది. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవులతో గౌరవం పెంచింది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల కన్న ఎక్కువగా వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా ప్రో త్సహించింది. ఒక పక్క వైఎస్సార్సీపీ పదవులు, సంక్షేమ పథకాలతో వారిని ఉన్నతంగా చూస్తుంటే టీడీపీ నాయకులు ఆ సామాజిక వర్గాన్ని చులకన చేసే విధంగా, నీచంగా మాట్లాడి వారి ఆత్మస్థైర్యా న్ని దెబ్బతీస్తున్నారు. ఎన్నికలప్పుడే ఇంత బరితెగిస్తే.. అవసరం తీరాక వారి నైజం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని యాదవుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగపతి వ్యాఖ్యలను ఒక్క టీడీ పీ నాయకుడు కూడా ఖండించలేదని.. ఆ వ్యాఖ్య లు తప్పు అని ఆ పార్టీ సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయలేదని ఆవేదనతో ఉన్నారు. యాదవ సామాజిక వర్గాన్ని దూషించిన గొండు జగపతి టీడీపీ నాయకుడి వ్యాఖ్యలతో గుర్రుగా యాదవ సామాజిక వర్గం అహంభావంతో కుల దూషణ తగదని హెచ్చరిక ఎన్నికల్లో బుద్ధి చెప్పే యోచనలో యాదవులు -
శ్రీజగన్నాథపురం.. అభివృద్ధి పథం..
కోటబొమ్మాళి: శ్రీజగన్నాథపురం.. టీడీపీ అధ్యక్షు డు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతిని ధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోని కోట బొమ్మాళి మండలంలోని ఓ పంచాయతీ. పొడుగుపాడు, బిర్లంగి, కుజ్జిపేట, రామచంద్రాపురం, రామకృష్ణాపురం అనుబంధ గ్రామాలు. గత పాల కుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల కిందట వరకు ఈ పంచాయతీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. ముఖ్యంగా ఇక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నారన్న కక్షతో అచ్చెన్నాయుడి కుటుంబం శీతకన్ను వేసింది. ఫలితంగా మౌలిక సదుపాయాల సమస్యతో గ్రామస్తులు ఇబ్బందులుపడేవారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం దక్కేది కాదు. ఇలాంటి తరుణంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చింది. పేదల సంక్షేమాభివృద్ధే ధ్యేయంగా పాలన సాగించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో అన్ని పంచాయతీల మాదిరిగానే శ్రీజగన్నాథపురం రూపురేఖలు కూడా సమూలంగా మారాయి. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డిజిటల్ లైబ్రరీ, వెల్నెస్ కేంద్రం, పక్కా రోడ్లు, కాలువలు.. ఇలా ఒకటేమిటి ప్రతి సంక్షేమ ఫలం గ్రామానికి అందడంతో అన్ని కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మండలం : కోటబొమ్మాళి పంచాయతీ : శ్రీజగన్నాథపురం అనుబంధ గ్రామాలు : పొడుగుపాడు, బిర్లంగి, కుజ్జిపేట, రామచంద్రాపురం, రామకృష్ణాపురం జనాభా : 2008 మంది -
No Headline
వైఎస్సార్ సీపీ హయాంలోనే.. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే జరిగింది. మా పంచాయతీలో మెజార్టీ ఓటర్లు గతంలో వైఎస్సార్కు, ప్రస్తుతం సీఎం జగన్మోహనరెడ్డికి అనుకూలంగా ఉన్నారు. అందుకే టీడీపీ పాలనలో మా పంచాయతీని నిర్లక్ష్యంగా వదిలేశారు. ఈ ప్రభు త్వం వచ్చాక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సహకారంతో సుమారు రూ.ఆరు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశాం. – నూక సత్యరాజు, సర్పంచ్, శ్రీజగన్నాధపురం పంచాయతీ -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
ఆమదాలవలస రూరల్: పేదలకు నిరంతరం సంక్షే మం అందాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావా లని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నా రు. ఆమదాలవలస మండలం చిట్టివలస పంచాయతీలో కూన నాగు ఆధ్వర్యంలో గురువారం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి 15 కుటుంబాలు చేరాయి. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువ జన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, మండల ప్రత్యేకాహ్వానితుడు తమ్మినేని శ్రీరామ్మూర్తి, జెడ్పీటీసీ బెండి గోవిందరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు గురుగుబెల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు బమ్మిడి అచ్యుతరావు, బొడ్డేపల్లి రమేష్కుమార్, జేకే వెంకుబాబు పాల్గొన్నారు. పాతపట్నం: పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమక్షంలో కొత్తూరు మండలం ఓండ్రుజోల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన బమ్మిడి శివ, బడ్డి అప్పలనాయుడు, నిమ్మగడ్డ తేజ, హడ్డుబంగి మణికంఠ, భీమవరపు కృష్ణారావు, రామారావు, వెంకటేష్, కోర్నాన లక్ష్మినారాయణ, నక్క రమణతో పాటు 21 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో చేరారు. పీఏసీఎస్ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ, సర్పంచ్ గంధవరపు నాగేంద్ర, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోగుల వరప్రసాద్నాయుడు, చింతాడ సూర్యనారాయణ, పడాల లక్ష్మణరావు, బుర్లె శ్రీను, నాగేంద్ర పాల్గొన్నారు. కొత్తూరు: మండలంలోని కొత్తూరు, కర్లెమ్మ గ్రామా లకు చెందిన సుమారు 50 కుటుంబాలు గురువా రం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు మురపాక శంకరరావు, పల్ల రామలింగం, దుక్క అప్పారావు, కోరాడ నూకరాజు, లక్ష్మినారాయణ, కర్లెమ్మకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు ఎద్దు ప్రసాదరావు, కొత్తూరుకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు వడమ శ్రీనివాసరావు, టొంపల వెంకటరావు, దొర్నాన ఎండు నాయుడు, వడమ జవరాజు, జి.పోలయ్య, టి.త్రినాథ్ టి.రాంబాబు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రెడ్డి శ్రావణ్కుమార్, కొత్తూరు సర్పంచ్ పడాల లక్ష్మణరావు, గోగుల వరప్రసాదరావు, బూ ర్లె శ్రీనివాసరావు, బొడ్డేపల్లి రామకృష్ణ పాల్గొన్నారు కాశీబుగ్గ: మందస మండలం దేవుపురం గ్రామానికి చెందిన పది కుటుంబాలు మంత్రి సీదిరి అప్పలరా జు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. కార్యక్రమంలో మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు సవర చంద్రమ్మ, పార్టీ అధ్య క్షులు అగ్గున సూర్యారావు,నాయకులు హనుమంతు వెంకటరావుదొర తదితరులు పాల్గోన్నారు. శ్రీకాకుళం పీఎన్ కాలనీ: శ్రీకాకుళం 34వ డివిజన్లో టీడీపీ మాజీ కౌన్సిలర్ పొందూరు వెంకటరమణ గురువారం మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి కోరారు. -
‘జగనన్న పరిపాలనకు ఆకర్షితులై చేరాం’
కంచిలి: ఐదేళ్లపాటు జగనన్న ప్రభుత్వ పరిపాలనకు ఆకర్షితులపై స్వచ్ఛందంగా వైఎస్సార్ సీపీలో చేరా మని మండలంలోని జాడుపూడి గ్రామానికి చెందిన వారు అన్నారు. జాడుపూడి పంచాయతీ జాడుపూడి కాలనీకి చెందిన బేడ, బుడగ, పూసల, రజక వర్గాలకు చెందిన వారు టీడీపీని వీడి బుధవారం వైఎ స్సార్సీపీలో చేరారు. తమతో పాటు మరో 500 కుటుంబాలు కూడా వైఎస్సార్సీపీ పాలనను ఇష్టపడి పార్టీలో చేరాయని వారు పేర్కొన్నారు. వీరిని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ బల్లిపుట్టుగ లోని తన స్వగృహంలో పార్టీ కండువాలు వేసి ఆ హ్వానించారు. చేరిన వారిలో అయితం వైకుంఠరావు, మర్రిపూడి భైరాగి, గంట మల్లేష్, గంట వేమరాజు, మిర్యాల వెంకటరావు, రమణమూర్తి, బోయశెట్టి సన్యాసి, బోయశెట్టి సాయి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ పైల దేవదాస్రెడ్డి, జాడుపూడి పార్టీ నేతలు పలికల జయరాం, జామి నూకయ్య, కృష్ణారావు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి టీడీపీ నాయకుల చేరిక
కంచిలి: మండలంలోని జె.శాసనాం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు ఇచ్ఛాపురం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అ భ్యర్థి పిరియా విజయ సమక్షంలో ఆ పార్టీలో చేరా రు. జె.శాసనాం గ్రామంలో చేరిన వీరిని పిరియా విజయ సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మర్ల మోహనరావు, గార తులసీదాసు, సైని నాగేశ్వరరావు, మర్ల తాతారావు, జుత్తు సూర్యనారాయణ, కోరుబిల్లి గణేష్, జుత్తు ఢిలీలరావు, మర్ల ఆనంద్, దున్న సూరిబాబు, మర్ల తులసీదాస్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు స్థానిక ఎంపీపీ పైల దేవదాస్రెడ్డి, స్థానిక సర్పంచ్ గుడ్డిపద్ర వేణు, ఎంపీటీసీ సభ్యుడు దుర్గాసి మాధవరావు తదితరులు ఉన్నారు. -
రిటర్నింగ్ అధికారులు వీరే
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గు రువారం నుంచి ప్రారంభం కావడంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు 8 శాసన సభా నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు గాను ఆర్ఓలను నియమించి వారికి ఫోన్ నంబర్లు, కంట్రోల్ రూమ్ నంబర్లు అందుబాటులో ఉంచారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం ఆర్ఓ పేరు బి.సుదర్శన దొర (ఎస్డీసీ) ఫోన్ నంబర్ 9494326124 కంట్రోల్ రూం నంబర్ 9114115363 పలాస ఆర్ఓ పేరు భరత్ నాయక్ ఫోన్ నంబర్ 8333989275 కంట్రోల్ రూం నంబర్ 6302384049 టెక్కలి ఆర్ఓ పేరు నూరుల్ కమర్ (సబ్ కలెక్టర్) ఫోన్ నంబర్ 8333988802 కంట్రోల్ రూం నంబర్ 9063757478 పాతపట్నం ఆర్ఓ పేరు ఎం.అప్పారావు (ఎఫ్ఎస్ఓ) ఫోన్ నంబర్ 9398764880 కంట్రోల్ రూం నంబర్ 8125213524 శ్రీకాకుళం ఆర్ఓ పేరు సీహెచ్ రంగయ్య(ఆర్డీవో) ఫోన్ నంబర్ 9573356699 కంట్రోల్ రూం నంబర్ 9032601471 ఆమదాలవలస ఆర్ఓ పేరు ఎం.నవీన్, జేసీ ఫోన్ నంబర్ 8143193111 కంట్రోల్ రూం నంబర్ 903218521 08942 286602 ఎచ్చెర్ల ఆర్ఓ పేరు ఎస్వీ లక్ష్మణమూర్తి ఫోన్ నంబర్ 9121251111 కంట్రోల్ రూం నంబర్ 08942 298767 నరసన్నపేట ఆర్ఓ పేరు జేవీఎస్ఎస్ రామ్మోహనరావు ఫోన్ నంబర్ 9440422302 కంట్రోల్ రూం నంబర్ 8331995443 శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం ఆర్ఓ పేరు మనజీర్ జిలానీ సమూన్ (జిల్లా కలెక్టర్) ఫోన్ నంబర్ 9849903786 కంట్రోల్ రూం నంబర్లు 08942 2406906 08942 240589 08942 295084 1800 4256625 విశ్రాంత సైనికుడికి సత్కారం కాశీబుగ్గ: పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామంలో విశ్రాంత సైనికుడిని బుధవారం సత్కరించారు. గ్రామంలో పాత బస్టాండ్ వీధికి చెందిన మెట్ట శంకరరావు గత కొన్నేళ్లుగా భారతసైన్యంలో బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనను బ్రాహ్మణతర్లా హెల్పింగ్ వారియర్స్, భగత్సింగ్ గ్రంథాలయం కమిటీ సభ్యులు, గ్రామ యువకులు తదితరులు సత్కరించి గౌరవించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం : ఎస్పీ శ్రీకాకుళం క్రైమ్ : పెండింగ్లో ఉన్న గ్రేవ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిందితులపై కోర్టులో చార్జిషీటు దాఖలయ్యేలా చూడాలని ఎస్పీ జీఆర్ రాధిక పోలీసు అధికారులకు సూ చించారు. బుధవారం సాయంత్రం జిల్లా పోలీ సు కార్యాలయంలో గ్రేవ్, ప్రాపర్టీ, ఎస్సీ, ఎస్టీ, పోక్సో వంటి ముఖ్య కేసుల దర్యాప్తు, పరిష్కారం, నేర నియంత్రణ వంటి అంశాలపై ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసు ల్లో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రాపర్టీ కేసులను త్వరగా ఛేదించాలన్నారు. ఎన్నికల సన్నద్ధత ఈ నెల 18 నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రి య నిర్వహణ ఉన్నందున అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఎస్ఐలు, సీఐలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించాలన్నారు. ఎన్నికలు ముగిసేంతవరకు సరిహద్దు చెక్పోస్టుల వద్ద సీఐలు, డీఎస్పీలు ఆకస్మికంగా వాహనాల తని ఖీ చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్కాజల్, వి.ఉమామహేశ్వరరావు, డీఎస్పీలు డి.బాలచంద్రారెడ్డి, యర్రగుంట శృతి, బి.నాగేశ్వరరెడ్డి, త్రినా ఽథరావు, శ్రీనివాసరావు, విజయ్కుమార్, ఎల్.శేషాద్రినాయుడు, పోలీస్ లీగల్ అడ్వైజర్ యామినీ రాణి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
‘ఉద్దానంలో కలెక్టర్ పర్యటించాలి’
కాశీబుగ్గ: ఉద్దాన ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యలపై కలెక్టర్ పర్యటించి తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని పౌరహక్కుల సంఘ నేతలు కోరారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని తాళభద్ర గ్రామ సమీపంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్దానంలో పండుతున్న జీడి, కొబ్బరి పంట గిట్టుబాటు ధర కోసం పాలకుల దృష్టికి తీసు కుని వెళ్లామని, అయినా ఫలితం లేదని అన్నా రు. ఎన్నికల కోడ్ ఉన్నందున జిల్లాలోని యంత్రాంగం, కలెక్టర్ మొదలు కింద స్థాయి అధికారులంతా తక్షణమే ఈ ప్రాంతాల్లో పర్యటించి ఒక నివేదిక రాష్ట్రస్థాయి వ్యవసాయ అధికారులకు పంపాలని కోరారు. తాగునీరు, సాగునీరు, పండిన పంటకు గిట్టుబాటు ధరపై స్పందించాలని కోరారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు పత్తిరి దానేస్, ఉపాధ్యక్షులు రామారావు, కార్యదర్శి పిండి వెంకట్రావు సహాయక కార్యదర్శి సోమనాదం, జిల్లా కమిటీ సభ్యులు పూర్ణచంద్రరావు, దున్న కృష్ణారావు, లక్ష్మణ్, వైకుంఠరావు, ఢిల్లీరావు, జోగారావు తదితరులు పాల్గొన్నారు. 26 మద్యం బాటిళ్లు స్వాధీనం ఎచ్చెర్ల క్యాంపస్: కొయ్యం పంచాయతీ కేకేనాయుడుపేట గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 26 మద్యం బాటిళ్లను పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి మద్యం నిల్వలు గుర్తించారు. కె.గోపాల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. గ్రంథాలయాలతో విజ్ఞాన సముపార్జన సంతబొమ్మాళి: విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయాల సంఘం ఉత్తరాంధ్ర సమన్వయకర్త డి.గోవిందరావు అన్నారు. మండలంలోని ఎం. సున్నాపల్లిలో రూ.6.50 లక్షల వ్య యంతో కుమారులు, గ్రామస్తులు సౌజన్యంతో నిర్మించిన బైపల్లి వెంకటస్వామి స్మారక గ్రంథాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, సామా న్య ప్రజలకు అవసరమైన పుస్తకాలు, సమా చార పత్రికలు, గ్రంథాలతో ఉన్న ఈ గ్రంథాలయాన్ని గ్రామస్తులు వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో బైపల్లి మోహనరావు, గ్రామ పిళ్లే నరసింహులు, టి. ఎర్రన్న, పలువురు యువకులు పాల్గొన్నారు. నడక పోటీ విజేతకు అభినందన శ్రీకాకుళం అర్బన్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని రైల్వే క్రీడా ప్రాంగణంలో ఈ నెల 13న నిర్వహించిన జాతీయస్థాయి నడక పోటీల్లో శ్రీకాకుళం జిల్లావాసి నళినీ సుధాకర్కు కాంస్య పతకం లభించింది. ఈ సందర్భంగా బుధవారం శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నళినీసుధాకర్కు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్క్లబ్ సభ్యులు ఎస్.జోగినాయుడు, ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ప్రమాదాలపై అవగాహన సోంపేట: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోంపేట అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని గౌరీ శంకర్ అపార్ట్మెంట్ వద్ద గ్యాస్ ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్యాస్ ప్రమాదాలు జరిగేటప్పుడు అప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్నిమాపక శాఖాధికారి ఎస్.మోహనరావు, సిబ్బంది డి.భాస్కరరావు, కె.భాస్కరరావు, సింహాచలం, కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం రూరల్: అప్పుల బాధ తాళలేక వప్పంగి గ్రామానికి చెందిన మంత్రి శ్రీధర్(38) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. రూరల్ ఎస్ఐ వాసుదేవరావు అందించిన వివరాలు మేరకు.. వప్పంగి గ్రామానికి చెందిన మంత్రి శ్రీధర్ నగరంలోని డేఅండ్నైట్ కూడలిలో నాయుడు ట్రేడర్స్ అనే పురుగుల మందు షాపును నడుపుతున్నాడు. ఈయనకు మాధవి అనే మహిళతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. కొంతకాలంగా శ్రీధర్ అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నాడు. వ్యాపారం కూడా సరిగ్గా నడవడం లేదు. దీంతో మంగళవారం రాత్రి షాపు కట్టేసి తన బైక్పై మునసబు పేట వద్ద గల ఓ ప్రైవేటు లేవుట్ లో పురుగు మందు తాగి ఆత్మహ త్యకు పాల్పడ్డా డు. బుధవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన కొంతమంది యువకులు చూసి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి పక్కన ఉన్న ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వప్పంగి వాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
బూర్జ: మండలంలో గల ఉప్పినివలస గ్రామం కోనేరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలియజేసిన సమా చారం మేరకు.. వైకుంఠపురం గ్రామానికి చెందిన తమ్మినేని సింహాచలం రోజు లాగానే పాలు అమ్ముకోడానికి సైకిల్పై ఉప్పినివలస వెళ్తున్నాడు. అదే మండలం కొల్లివలస గ్రామానికి చెందిన బూరవెల్లి రమణ బైక్పై వచ్చి వెనుక నుంచి సింహాచలం సైకిల్ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఇద్దరికీ తలకు గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు క్షతగాత్రులను గుర్తించి 108 కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి వారిని శ్రీకాకుళంలోని మెడీకవర్కు తీసుకెళ్లారు. సింహాచలం తలకు బలమైన గాయం తగలడంతో సీరియస్గా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం అందింది. -
అగ్ని ప్రమాదంలో మూడిళ్లు దగ్ధం
టెక్కలి రూరల్: స్థానిక కండ్రవీధిలో బుధవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మూడు ఇళ్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కండ్రవీధికి చెందిన అనంత కార్తీక్ బెహరా ఇంటిలో ముందుగా మంటలు రేగాయి. అనంతరం ఆ ఇంటికి ఇరువైపులా ఉన్న అనంత ఉపేంద్ర బెహరా, అనంత అమర్ బెహరాలకు చెందిన ఇళ్లకు సైతం మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారి ఎస్.మల్లేశ్వరరావు తెలిపారు. దాదాపు రూ.3 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని చెప్పారు. అగ్ని ప్రమాదంలో జీడితోట దగ్ధం మెళియాపుట్టి: మండలంలోని మెళియాపుట్టి రెవెన్యూ పరిధిలోని సుమారు ఎకరా జీడితోట మంటల్లో కాలిపోయినట్లు బాధితురాలు నక్క ముత్యాలమ్మ తెలిపారు. బుధవారం సాయంత్రం సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు విషయం తెలుసుకుని వెంటనే టెక్కలి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని బాధితురాలు తెలిపారు. -
విజయ గణపతికి అష్టోత్తర శత దీపారాధన
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక పాలకొండ రో డ్డులోని విజయగణపతి దేవాలయంలో స్వామికి అష్టోత్తర శత దీపారాధనలు బుధవారం జరిగాయి. ఆలయ అర్చకులు పెంట శ్రీధర్శర్మ, సూర్యనగేష్ శర్మల ఆధ్వర్యంలో స్వామికి అష్టోత్తర శత దీపారాధనలు జరిగా యి. భక్తులు పాల్గొన్నారు. సేవాభావం చాటుకున్న ఎమ్మెల్యే తనయుడు కొత్తూరు: స్థానిక కాలేజీ రోడ్డులో బుధవారం కొత్తూరుకు చెందిన అక్కాతమ్ముళ్లు ఇద్దరు సైకిల్పై వెళ్తూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో బాలికకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పాతపట్నం ఎమ్మె ల్యే రెడ్డి శాంతి తనయుడు రెడ్డి ఓం శ్రీకృష్ణ బాలికను తన కారులో ఎక్కించుకుని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ దగ్గరుండి వైద్యం చేయించారు. ఎమ్మెల్యే తనయుడు చూపించిన మానవత్వానికి స్థానికులు ముచ్చటపడ్డారు. ఉత్సాహంగా క్రీడా జట్ల ఎంపికలుశ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో బుధవారం జిల్లాస్థాయి బాస్కెట్బాల్, క్రికెట్ జట్ల ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా బాలబాలికల అండర్–18 బాస్కెట్బాల్ జట్ల ఎంపికలు జరిగాయి. తుది జట్లను ప్రకటించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19 నుంచి 22 వరకు కృష్ణా జిల్లా నూజివీడులో జరిగే రాష్ట్రపోటీల్లో పాల్గొంటారని కోచ్ జి.అర్జున్రావురెడ్డి తెలిపారు. ఎమ్మెస్సార్ క్రీడా జట్లకు పోటీలకు వెళ్లేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయాన్ని అందజేశారు. జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక.. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి అండర్–19 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. త్వరలో ఎంపికై న క్రీడాకారుల జాబితాను వెల్లడిస్తామని జిల్లా క్రికెట్ సంఘ బాధ్యులు తెలిపారు. జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ ఇలియాస్ మహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈఎంపికల్లో సెలెక్టర్లు ప్రాబబుల్స్ జాబితాను ఖరారుచేశారు. శైలానీ, ఆర్సీరెడ్డి, దీపక్కుమార్, కోచ్ కె.సుదర్శన్, ఆనంద్కుమార్, వెటరన్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలి
గార: రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది పాఠశాల, ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలకు ఈ నెల 25వ తేదీన జరిగే ప్రవేశ పరీక్షకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని వమరవల్లి గురుకుల ప్రిన్సిపాల్ చిట్టితల్లి ఓ ప్రకటనలో కోరారు. జిల్లా కేంద్రంలో జరిగే ప్రవేశ పరీక్షకు సంబంధించి హాల్టికెట్లను విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీతో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశం కోసం ఏపీఆర్ఎస్ సీఏటీ –2024 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్, డిగ్రీ ప్రవేశ పరీక్ష ఏపీఆర్జేసీ, డీసీ సెట్–2024 కోసం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు జిల్లా కేంద్రంలో పరీక్ష జరుగుతుందన్నారు. జీడి పరిశ్రమల్లో ప్రమాదాలపై అవగాహన కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అనంతపురం, ఇండస్ట్రియల్ పార్కులో జీడి కార్మికులకు, సిబ్బందికి, పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కాశీబుగ్గ అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్నిప్రమాద వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. జీడి పరిశ్రమలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని పరిశ్రమకు నలువైపులా అత్యవసర దారులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి బి.సోమేశ్వరరావు, సిబ్బంది రమేష్నాయుడు, యుగంధర్, ప్రేమ్కుమార్, మన్మధరావు, రామనాయుడు, వల్లభరావు తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ
నేటి నుంచే ● అభ్యర్థుల అర్హతలు.. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి. నామినేషన్ దాఖలు చేసే సమయానికి 25 ఏళ్లు పూర్తయ్యి ఉండాలి. ● రాష్ట్రంలో ఏదైనా ఓ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. ● పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులైతే నలుగురు, స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులను 10 మంది ఓటర్లు బలపర్చాలి. బలపరిచే వారు అదే నియోజకవర్గానికి చెందిన ఓటర్లు అయి ఉండాలి. ● ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సాధారణ కేటగిరీ అభ్యర్థులు రూ. 10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి. ● ఎంపీగా పోటీ చేసేందుకు సాధారణ కేటగిరీ అభ్యర్థులు రూ.25 వేలు. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.12,500లు డిపాజిట్ చేయాలి. ● నామినేషన్ దాఖలు చేయడానికి 48 గంటలకు ముందు అభ్యర్థులు తప్పనిసరిగా తమ పేరిట ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే తమ ఎన్నికల ప్రచారానికి, ఇతర అవసరాలకు వెచ్చించిన సొమ్ము కు సంబంధించిన లావాదేవీలు నిర్వహించాలి. ఖాతా పుస్తకం ప్రతిని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. ● నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటరీతో కూడిన అఫిడవిట్ సమ ర్పించాలి. అందులో అభ్యర్థి, అతని కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తుల వివరాలను చూపించాలి. అదే విధంగా కేసుల వివరాలు క్రైం నంబరుతో సహా పొందుపరచాలి. ● ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేయాలి. రాజీనామాను ఆమోదించినట్టుగా ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని నామినేషన్తో పాటు దాఖలు పరచాలి. ● అభ్యర్థులు ఇంటి, నీటి పన్ను, విద్యుత్ చార్జీ బిల్లు బకాయిలు లేనట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. శ్రీకాకుళం పాతబస్టాండ్: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులంతా గురువారం నుంచి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. జి ల్లాలో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంతో పాటు ఎనిమిది శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ను జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ స్వీకరిస్తారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదా లవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. అభ్యర్థులంతా ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సువిధ యాప్ను ఎన్నికల కమిషన్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యమైన తేదీలివే.. ● సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను ఉదయం 11 నుంచి 3 గంటల లోపు సంబంధిత ఆర్ఓకు దఖలు పరచాలి. ● 26వ తేదీన అప్పటి వరకు వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. ● 27 నుంచి 29 వరకు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంటుంది. ● బరిలో మిగిలిన అభ్యర్థులకు మే నెల 13న పోలింగ్ జరుగుతుంది. ● జూన్ 4న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. నామినేషన్ సమయంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదు. అలాగే వంద మీటర్ల దూరంలో వాహనాలు, ఇతర జనాలు ఉండాలి. మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. నిబంధనలివి.. ● నామినేషన్ను సువిధ యాప్ ద్వారా దాఖలు చేసిన తర్వాత హార్డ్ కాపీలను ఎన్నికల రిట ర్నింగ్ అధికారికి అందజేసే క్రమంలో చాంబర్లోనికి అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్ర మే అనుమతిస్తారు. ● అభ్యర్థులు తమ బి–ఫారం, ఎ–ఫారం ఒరిజినల్ అందించాలి. వీటిని నామినేషన్ గడువు ముగిసే రోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు అందజేయవచ్చు. ● అభ్యర్థులు రెండు ఫొటోలను (ఒకటి స్టాంప్ సైజ్, మరొకటి పాస్పోర్టు సైజ్) నామినేషన్తో పాటు అందజేయాలి. అభ్యర్థి తన ఓటరు కార్డు, బలపరిచే వారి గుర్తింపు పత్రా లు ఇవ్వాలి. ● ఓ అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. ● నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ తప్పనిసరిగా చేయాలి. ప్రతిజ్ఞ చేసిన ధ్రువీకరణ పత్రాలన్నీ తీసుకోవాలి. ● ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి తన సంతకం ఉండే విధానాన్ని విధిగా తెలియజేయాలి. అదే విధంగా బ్యాలెట్ యూనిట్లో తన పేరు ఎలా ముద్రించాలో వివరించి చెప్పాలి. ● అభ్యర్థి చెల్లించిన ధరావత్తుకు సంబంధించి రశీదుతో పాటు, ఎన్నికల ఖర్చును నమోదు చేసేందుకు నిర్ణీత నమూనాలో ఉన్న రిజిస్టర్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి తీసుకోవాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఏవైనా క్రిమినల్ కేసులుంటే, వాటిని మూడు దినపత్రికల్లో ప్రకటన ద్వారా బహిర్గతం చేయాలి. అందుకు అయ్యే ఖర్చు లెక్క చూపాలి. ● ఎన్నికల నామినేషన్ కేంద్రంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు తమ సందేహాలను అక్కడ నివృత్తి చేసుకోవచ్చు. ● అన్ని పత్రాలను సువిధ అప్లికేషన్ (యాప్) ద్వారానే అందజేయాలి. ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలు, వాహనాలు, ఇతర వాటికి ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటేనే అనుమతి ఇస్తారు.. అందుబాటులో అఫిడవిట్లు ● అభ్యర్థులకు సంబంధించిన ఆఫిడవిట్లు అందరికీ తెలిసే లా అందుబాటులో ఉంచుతారు. ప్రజలు కోరితే వాటిని ఉచితంగా అందజేస్తారు. ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి. ● ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆ రోజు వచ్చిన నామినేషన్లపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల కమిషన్కి తెలియజేస్తారు. ● నామినేషన్ల దాఖలు పారదర్శకంగా ఉండేలా ప్రక్రియను మొత్తం వీడియో తీస్తారు. 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు 26న నామినేషన్ల పరిశీలన 27 నుంచి 29 వరకు ఉపసంహరణ సిద్ధమైన యంత్రాంగం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement