-
అక్కడ బ్యాటింగ్ చేయడం కష్టం.. అతడు అద్భుతం!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో అదరగొడుతున్న రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. అందరి కంటే ముందుగానే టాప్-4లో బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడింది.ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. అదే విధంగా రాయల్స్ను గెలుపుతీరాలకు చేర్చడంలో తనకు అండగా నిలిచిన ధ్రువ్ జురెల్పై ప్రశంసలు కురిపించాడు.ఫామ్లేమితోగతేడాది ఐపీఎల్లో అదరగొట్టి టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు.. ఐపీఎల్-2024 ఆరంభంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఫామ్లేమితో సతమతమైన అతడు లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ కంటే ముందు ఆడిన ఐదు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 50 పరుగులే చేశాడు.అయితే, శనివారం నాటి మ్యాచ్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్ సుడిగాలి ఇన్నింగ్స్(33 బంతుల్లో 71 నాటౌట్)తో విరుచుకుపడగా మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించాడు.మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు రాబట్టాడు. తద్వారా సంజూ శాంసన్తో కలిసి నాలుగో వికెట్కు 121 పరుగులు జోడించి ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘ఫామ్ టెంపరరీ. నిజానికి టీ20 క్రికెట్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే, ధ్రువ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు పిచ్ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని రాణిస్తుండటం సానుకూలాంశం.టీమిండియా తరఫున టెస్టుల్లో తన ప్రదర్శన మనం చూశాం. ఆరంభంలో తడబడ్డా అతడిపై మా నమ్మకం సడలలేదు. నెట్స్లో రెండు నుంచి మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాడు. అతడు తప్పక రాణిస్తాడని మాకు తెలుసు. అదే జరిగింది కూడా’’ అని ధ్రువ్ జురెల్ ఆట తీరును కొనియాడాడు.రాజస్తాన్ వర్సెస్ లక్నో స్కోర్లు:వేదిక: లక్నోటాస్: రాజస్తాన్.. బౌలింగ్లక్నో స్కోరు: 196/5 (20)రాజస్తాన్ స్కోరు: 199/3 (19)ఫలితం: లక్నోపై ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్.చదవండి: డీకే అవసరమా?: యువీ Winning streak continues 🩷A Sanju Samson special & Dhruv Jurel's attractive innings propel Rajasthan Royals to their 8th win this season🙌Scorecard ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/cam0GepXVo— IndianPremierLeague (@IPL) April 27, 2024 -
రాజస్తాన్ దర్జాగా...
లక్నో: ఈ సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ రాయల్స్ అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ చేరేందుకు మరింత చేరువైంది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. తొలుత లక్నో సూపర్జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.ఆరంభంలోనే ఓపెనర్ డికాక్ (8), హిట్టర్ స్టొయినిస్ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సూపర్జెయింట్స్ను కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ హుడా (31 బంతుల్లో 51; 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్కు 115 పరుగులు జోడించారు.మిగతావారిలో పూరన్ (11), బదోని (18 నాటౌట్), కృనాల్ పాండ్యా (15 నాటౌట్) పెద్ద స్కోర్లేమీ చేయలేదు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.కెప్టెన్ సంజు సామ్సన్ (33 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అబేధ్యమైన నాలుగో వికెట్కు 121 పరుగులు జోడించి మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) బౌల్ట్ 8; రాహుల్ (సి) బౌల్ట్ (బి) అవేశ్ ఖాన్ 76; స్టొయినిస్ (బి) సందీప్ 0; దీపక్ హుడా (సి) పావెల్ (బి) అశి్వన్ 50; పూరన్ (సి) బౌల్ట్ (బి) సందీప్ 11; బదోని నాటౌట్ 18; కృనాల్ నాటౌట్ 15; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–126, 4–150, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–41–1, సందీప్ 4–0–31–2, అవేశ్ ఖాన్ 4–0–42–1, అశ్విన్ 4–0–39–1, చహల్ 4–0–41–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) బిష్ణోయ్ (బి) స్టొయినిస్ 24; బట్లర్ (బి) యశ్ ఠాకూర్ 34; సామ్సన్ నాటౌట్ 71; పరాగ్ (సి) బదోని (బి) అమిత్ 14; జురేల్ నాటౌట్ 52; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–78. బౌలింగ్: హెన్రీ 3–0–32–0, మొహసిన్ 4–0–52–0, యశ్ ఠాకూర్ 4–0–50–1, స్టొయినిస్ 1–0–3–1, కృనాల్ 4–0–24–0, అమిత్ మిశ్రా 2–0–20–1, రవి బిష్ణోయ్ 1–0–16–0. -
అతడికి ప్రమోషన్ ఇవ్వండి.. దంచికొడతాడు: గవాస్కర్
ఐపీఎల్ 2024 సీజన్కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. శుక్రవారం(మార్చి 22)న చెపాక్ స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కీలక సూచనలు చేశాడు. ఆ జట్టు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024లో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కచ్చితంగా ఆకట్టుకుంటాడు. అతడు ప్రస్తుతం మంచి రిథమ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ సిరీస్లో అతడు ఏమి చేశాడో మనమందరం చూశాం. గత ఐపీఎల్లో కూడా ధ్రువ్ మెరుపులు మెరిపించాడు. కానీ అతడు బ్యాటింగ్కు మాత్రం చాలా ఆలస్యంగా వస్తున్నాడు. కాబట్టి ఈ ఏడాది సీజన్లో అతడి బ్యాటింగ్ ఆర్డర్ను కచ్చితంగా మార్చాల్సిందే. అతడికి ప్రమోషన్ ఇచ్చి కాస్త ముందు పంపాలని" స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో జురెల్ అదరగొట్టాడు. కీలక ఇన్నింగ్స్లతో అందరి ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో సైతం చోటు దక్కింది. అతడితో పాటు సర్ఫరాజ్ ఖాన్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. -
సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్కు జాక్ పాట్.. కేవలం మూడు మ్యాచ్లకే
టెస్టు క్రికెట్ అరంగేట్రంలోనే సత్తాచాటిన టీమిండియా ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ జాక్ పాట్ తగిలింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. వీరిద్దరికి గ్రేడ్-సీ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం (మార్చి 18) జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బీసీసీఐ కాంట్రాక్టు పొందాలంటే ప్రస్తుత సీజన్ లో కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ ఇంగ్లండ్ తో చెరో మూడు టెస్టులు ఆడిన కారణంగా నేరుగా సీ-గ్రేడు జాబితాలో బీసీసీఐ చేర్చింది. సీ-గ్రేడ్ కేటగీరీ కింద వీరు రూ. కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు. ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ అదరగొట్టాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సైతం సత్తాచాటాడు. రాంచీ టెస్టులో 90, 39 స్కోర్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ధ్రువ్ నిలిచాడు. వీరిద్దరి అద్బుత ప్రదర్శన కారణంగానే కేవలం మూడు మ్యాచ్లకే బీసీసీఐ కాంట్రాక్ట్లు అప్పగించింది. కాగా 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గత నెలలో ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అనూహ్యంగా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు ఈ జాబితాలో చోటు దక్కలేదు. -
అప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం.. బాకీలన్నీ తీర్చేసా!
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో ధ్రువ్ జురెల్ ఒకడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను ఐపీఎల్-2022 వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది. అయితే, ఆ ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్కు తుదిజట్టులో చోటు దక్కలేదు. బెంచ్కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో వేచి చూసి..గతేడాది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 11 ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ 152 పరుగులు చేశాడు. ఇక దేశవాళీ క్రికెట్లోనూ రాణించిన ఈ యూపీ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసి.. తనదైన ముద్ర వేయగలిగాడు. ముఖ్యంగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించి సత్తా చాటాడు. అయితే, చాలా మంది క్రికెటర్లలాగే ధ్రువ్ జురెల్ కూడా అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. తనలాగే కొడుకును కూడా సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెటర్ అవుతానని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అతడి తల్లి అండగా నిలిచి.. తన వద్ద ఉన్న చిన్నపాటి బంగారు వస్తువులు కూడా అమ్మేసి కిట్ కొనేందుకు డబ్బులిచ్చారు. ఎల్లవేళలా కొడుకుకు మద్దతుగా నిలిచారు. తండ్రి కూడా అర్థం చేసుకుని బాసటగా నిలవడంతో ధ్రువ్ జురెల్ తన కలలు నెరవేర్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గతాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నాకు మొట్టమొదటిసారి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కిన సమయంలో నా తల్లిదండ్రులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. నేను ఆ బాకీలన్నీ తీర్చేశాను. మా అమ్మ కోసం కొన్ని నగలు కూడా కొన్నాను’’ అని ధ్రువ్ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. తల్లిదండ్రులు తనకోసం పడిన కష్టం వెలకట్టలేనిదని పేర్కొన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్ తాజా సీజన్ మొదలుకానుండగా.. రాజస్తాన్ మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
ఎందుకంత మిడిసిపడుతున్నావు?.. గిల్- బెయిర్స్టో గొడవలో సర్ఫరాజ్
India vs England, 5th Test- Shubman Gill- Sarfaraz Khan Vs Jonny Bairstow: టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్లో భాగంగా తొలిసారి ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో వాగ్యుద్ధం మొదలుపెట్టగా.. భారత యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ అతడికి ఘాటుగా బదులిచ్చారు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం గొడవను చల్లార్చేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ధర్మశాల వేదికగా ఐదో టెస్టు శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 473/8 ఓవర్నైట్ స్కోరుతో భారత్ ఆటను మొదలుపెట్టింది. ఈ స్కోరుక కేవలం నాలుగు పరుగులు జతచేసి అంటే.. 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు టాపార్డర్ కుప్పకూలడంతో కష్టాల్లో పడింది. 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో జో రూట్, జానీ బెయిర్ స్టోతో కలిసి భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశాడు. ఆది నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన బెయిర్స్టో.. 18 ఓవర్లో కుల్దీప్ యాదవ్ బాల్ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్మన్ గిల్ను ఉద్దేశించి.. స్లెడ్జ్ చేశాడు. ఈ క్రమంలో గిల్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా బెయిర్స్టోకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. వారి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైకులో రికార్డైంది. Full sledging encounter between Gill & Bairstow:#INDvsENGTest #INDvsENG #ShubmanGill #JonnyBairstowpic.twitter.com/HjdkESr38z — Ashu 🖤 (@Ashu_x18) March 9, 2024 సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ఆ సంభాణ ఇలా జానీ బెయిర్స్టో: ‘‘జిమ్మీతో నువ్వేమన్నావు? తన రిటైర్మెంట్ గురించి.. తుదిజట్టు నుంచి తప్పించడం గురించి మాట్లాడతావా? కానీ అతడి బౌలింగ్లోనే నువ్వు అవుటయ్యావు కదా?’’. శుబ్మన్ గిల్: ‘‘అయితే.. ఏంటి.. నా శతకం పూర్తైన తర్వాతే అతడు నన్ను అవుట్ చేయగలిగాడు. అయినా.. నువ్వు ఇక్కడ ఎన్ని పరుగులు చేశావేంటి?’’. జానీ బెయిర్స్టో: ‘‘బాల్ స్వింగ్ అవుతున్నపుడు నువ్వెన్ని పరుగులు చేయగలిగావు?’’. ధ్రువ్ జురెల్: ‘‘జానీ భాయ్ ఊరుకోండి!’’ సర్ఫరాజ్ ఖాన్: ‘‘ఈరోజు ఏవో కొన్ని పరుగులు చేశాడని.. తెగ ఎగిరెగిరిపడుతున్నాడు’’. కాగా ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ విలువైన 56 పరుగులు చేశాడు. ఇక వందో టెస్టు ఆడిన బెయిర్ స్టో తొలి ఇన్నింగ్స్లో 29, రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులు(31 బంతుల్లో) చేశాడు. . ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 4-1తో సొంతం చేసుకుంది. ఇక బెయిర్స్టో- గిల్, సర్ఫరాజ్ వాగ్వాదంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది బయిర్స్టోది తప్పు అంటే.. మరికొందరు వందో టెస్టు ఆడుతున్న క్రికెటర్(బెయిర్స్టో)కు గౌరవం ఇవ్వాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: BCCI: బీసీసీఐ కీలక ప్రకటన.. ఒక్కో మ్యాచ్కు ఏకంగా రూ. 45 లక్షలు That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 -
ధ్రువ్తో అట్లుంటది మరి.. చెప్పి మరి ఔట్ చేశాడు! ధోనిలా
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత వికెట్ కీపర్ మరోసారి తన స్కిల్స్ను ప్రదర్శించాడు. తన సమయస్ఫూర్తితో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ను జురెల్ బోల్తా కొట్టించాడు. ఏం జరిగిందంటే? భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రోజు లంచ్ విరామానికి ముందు 26 ఓవర్ వేసే బాధ్యతను కుల్దీప్ యాదవ్కు అప్పగించాడు. ఆ ఓవర్లో తొలి బంతిని జాక్ క్రాలే సింగిల్ తీసి ఓలీ పోప్కు ఇచ్చాడు. పోప్ రెండో బంతికి ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించగా.. అది మిస్స్ అయ్యి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ చేతికి వెళ్లింది. అయితే జురెల్ కుల్దీప్ వద్దకు వెళ్లి తర్వాతి బంతికి పోప్ క్రీజును వదిలి ఆడుతాడని చెప్పాడు. యాదృచ్ఛికంగా జురెల్ చెప్పటినట్లగానే పోప్ క్రీజును వదలి బయటకు వచ్చి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ధ్రువ్ సూచనతో కుల్దీప్ టర్న్ ఎక్కువగా చేయడంతో బంతి జురెల్ బ్యాట్కు మిస్స్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే జురెల్ బెయిల్స్ను పడగొట్టి స్టంపౌట్ చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జురెల్ స్కిల్స్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోనిని గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND vs ENG: ఎంత పనిచేశావు రోహిత్? అంతా ధ్రువ్ వల్లే! పాపం సర్ఫరాజ్ -
ఎంత పనిచేశావు రోహిత్? అంతా ధ్రువ్ వల్లే! పాపం సర్ఫరాజ్
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ క్రాలే మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఓవరాల్గా 108 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్తో క్రాలీ 79 పరుగులు చేశాడు. అయితే 61 పరుగుల వద్ద క్రాలే ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం వల్ల క్రాలే బతికిపోయాడు. ఏం జరిగిందంటే? లంచ్ విరామం తర్వాత కుల్దీప్ యాదవ్ 26 ఓవర్ పూర్తి చేసేందుకు బౌలింగ్ ఎటాక్లోకి వచ్చాడు. ఈ క్రమంలో ఆ ఓవర్లో ఐదో బంతిని క్రాలే డౌన్ లెగ్ వైపు ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్ అయ్యి బ్యాట్, ప్యాడ్కు దగ్గరకు వెళ్తూ వికెట్ కీపర్ దిశగా వెళ్లింది. అయితే బంతిని ధ్రువ్ జురెల్ సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. కానీ బంతి జురెల్ గ్లౌవ్కు తాకి కాస్త గాల్లోకి లేవగా.. షార్ట్ లెగ్లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ డైవ్ చేస్తూ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. వెంటనే సర్ఫరాజ్తో పాటు భారత ఆటగాళ్లు క్యాచ్కు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. వెంటనే సర్ఫరాజ్ పూర్తి నమ్మకంతో రివ్యూ తీసుకోమని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించాడు. రోహిత్ మాత్రం వికెట్ కీపక్ ధ్రువ్ జురెల్ సలహా తీసుకున్నాడు. జురెల్ బంతి బ్యాట్కు కాకుండా ప్యాడ్కు తాకిందని చెప్పడంతో రోహిత్ రివ్యూకు వెళ్లలేదు. కానీ తర్వాత రిప్లేలో మాత్రం బంతి క్లియర్గా బ్యాట్కు తాకినట్లు కన్పించింది. ఇది చూసిన రోహిత్ ఎంత పనిపోయిందని అన్నట్లు నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా నేను చెప్పా కదా భయ్యా అన్నట్లు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Team India missed out on a big chance, but the skipper made sure that the feels were positive. ROHIT SHARMA IS A MOOD! 🤣 Watch Till End#INDvsENG #TeamIndia #RohitSharma pic.twitter.com/DGUJcobu8G — R.Sport (@republic_sports) March 7, 2024 -
ధోని ఒకే ఒక్కడు.. నా ఉద్దేశ్యం అది కాదు: గవాస్కర్
టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన అరంగేట్ర సిరీస్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరిగిన రాజ్కోట్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ధ్రువ్ జురెల్.. తన రెండో టెస్టులోనే హీరోగా మారిపోయాడు. రాంఛీ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన నాలుగో టెస్టులో ధ్రువ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. భారత విజయంలో జురెల్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన వేళ తొలి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 90 పరుగులు చేయడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో అతడిపై సర్వత్ర ప్రశంసల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ధ్రువ్ జురెల్ టీమిండియాకు మరో ధోని అంటూ ప్రశంసించాడు. అయితే రెండు మ్యాచ్లకే జురల్ను ధోనితో పోల్చడాన్ని చాలా మంది తప్పుబట్టారు. తాజాగా తను చేసిన వ్యాఖ్యలపై సన్నీ క్లారిటీ ఇచ్చాడు. ధోనితో జురెల్ను పోల్చలేదని, అతడి సమయస్పూర్తిని చూస్తే ధోని గుర్తు వచ్చాడని అన్నానని లిటిల్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. "భారత క్రికెట్కు ధోని లాంటి ఆటగాడు మరొకడు దొరకడు. భారత క్రికెట్లో ఒకే ఒక్క ధోని ఉన్నాడు. జురెల్ను నేను ధోనితో పోల్చలేదు. నా ఉద్దేశ్యం ప్రకారం జురెల్ ధోనితో సమానం అని కాదు. అటువంటి సమయస్పూర్తిని కలిగి ఉన్నాడని చెప్పా. అయితే ధోని సాధించిన దాంట్లో జురెల్ సగం సాధించినా భారత క్రికెట్కు చాలా మంచిది. ధ్రువ్ అద్బుతమైన ఆటగాడు. అతడికి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేయగలడు. ఆఖరిలో వచ్చి బ్యాటింగ్కు వచ్చి ధోనిలా మ్యాచ్ను ఫినిష్ చేసే సత్తా కూడా ఉందని స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గావస్కర్ పేర్కొన్నాడు. -
అతడిని ధోనితో పోల్చడమేంటి? : గంగూలీ
టీమిండియా నయా సంచలనం ధ్రువ్ జురెల్ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడే అతడిని మహేంద్ర సింగ్ ధోని వంటి దిగ్గజ ఆటగాడితో పోల్చకూడదని సరికాదన్నాడు. కాగా ఇంగ్లండ్తో తాజా టెస్టు సిరీస్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్కోట్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో అరంగేట్ర మ్యాచ్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. అయితే, రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన వేళ తొలి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 90 పరుగులు చేయడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే జట్టు సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ధ్రువ్ జురెల్ టీమిండియాకు మరో ధోని అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాత్రం భిన్నంగా స్పందించాడు. రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని విభిన్నమైన ఆటగాడు. ధ్రువ్ జురెల్ టాలెంట్ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే, ఇప్పుడే అతడిని ధోనితో పోల్చడం సరికాదు. అతడిని స్వేచ్ఛగా ఆడనిస్తే మంచిది. ధోని ఎంఎస్ ధోని అనే బ్రాండ్ సంపాదించుకోవడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఏదేమైనా జురెల్ స్పిన్, పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం సానుకూల అంశం. అంతేకాదు.. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడటం అతడి ప్రతిభ, పట్టుదలకు నిదర్శనం’’ అని సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ గురించి ప్రస్తావన రాగా.. అతడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటగల క్రికెటర్ అని గంగూలీ కితాబులిచ్చాడు. -
సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్లకు జాక్పాట్
టీమిండియా బ్యాటింగ్ సంచలనాలు సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్లకు జాక్పాట్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇంగ్లండ్తో జరుగబోయే తదుపరి టెస్ట్లో ఈ ఇద్దరు తుది జట్టులో ఉంటే, వీరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లు దక్కనున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కాలంటే ఆటగాళ్లు టీమిండియా తరఫున కనీసం 3 టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరు ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్లే ఆడారు. ఈ రెండు మ్యాచ్ల్లో వీరిద్దరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. మూడు మ్యాచ్ల అనంతరం వీరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల తాజా ఫామ్ను బట్టి చూస్తే వీరు ఐదో టెస్ట్కు తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖాయమేనని చెప్పాలి. దీంతో వీరికి గ్రేడ్ సి కింద బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడం దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. కాగా, 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్లను కోల్పోగా.. రింకూ సింగ్ (సి), తిలక్ వర్మ (సి), ప్రసిద్ద్ కృష్ణ (సి), అవేశ్ ఖాన్ (సి), రజత్ పాటిదార్ (సి), జితేశ్ శర్మ (సి), ముకేశ్ కుమార్ (సి), రవి బిష్ణోయ్కు (సి) కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ (బి), ఇషాన్లతో (సి) పాటు యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్లు కోల్పోయారు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
దూసుకొస్తున్న జైస్వాల్.. కెరీర్ బెస్ట్ సాధించిన జురెల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్తో ముగిసిన నాలుగో టెస్ట్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసిన యశస్వి జైస్వాల్ (73, 37), శుభ్మన్ గిల్ (38, 52 నాటౌట్), దృవ్ జురెల్ (90, 39 నాటౌట్) ర్యాంకింగ్స్ భారీ జంప్ కొట్టి కెరీర్ అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. యశస్వి మూడు స్థానాలను మెరుగుపర్చుకుని టాప్ 10 దిశగా (12వ స్థానం) దూసుకువస్తుండగా.. గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జురెల్ 31 స్థానాలు మెరుగుపర్చుకుని 69 స్థానానికి ఎగబాకారు. ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో అజేయ సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి టాప్-10లో విరాట్ కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్కు దూరంగా ఉండటంతో అతని ర్యాంక్ ఏడు నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానాన్ని కోల్పోయి 13వ ప్లేస్కు పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజా ఒకటి, రెండు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా.. రబాడ, కమిన్స్, హాజిల్వుడ్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మరో భారత స్పిన్నర్ కుల్దీప్ రాంచీ టెస్ట్లో మెరుగైన ప్రదర్శన కారణంగా 10 స్థానాలు మెరుగపర్చుకుని కెరీర్ అత్యుత్తమ 32వ ర్యాంక్కు చేరుకున్నాడు. భారత్తో నాలుగో టెస్ట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 80వ ర్యాంక్కు ఎగబాకాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లోనూ పెద్దగా మార్పులేమీ జరగలేదు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ జో రూట్ మాత్రం మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ప్లేస్కే చేరాడు. -
చరిత్ర సృష్టించిన దృవ్ జురెల్
టీమిండియా నయా సంచలనం దృవ్ జురెల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో జరిగిన రాంచీ టెస్ట్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడం ద్వారా అరంగేట్రం సిరీస్లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. జురెల్కు ముందు భారత వికెట్కీపర్ కమ్ బ్యాటర్ అజయ్ రాత్రా ఈ ఘనత సాధించాడు. 2002 వెస్టిండీస్ పర్యటనలో రాత్రా.. తన డెబ్యూ సిరీస్లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జురెల్ అరంగేట్రం సిరీస్ రెండో మ్యాచ్లో ఈ అవార్డు అందుకుంటే.. రాత్రా తన డెబ్యూ సిరీస్లోని నాలుగో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఆంటిగ్వా వేదికగా విండీస్తో జరిగిన నాటి మ్యాచ్లో రాత్రా సెంచరీ (115) చేసి ఈ అవార్డును దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే, ఆ సెంచరీ తర్వాత రాత్రా కనీసం ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్కును తాకలేకపోయాడు. రాత్రా ఆ ఘనత సాధించిన 22 ఏళ్ల తర్వాత జురెల్ మరోసారి ఆ ఫీట్ను రిపీట్ చేశాడు. ఓవరాల్గా చూస్తే.. భారత్ తరఫున టెస్ట్ల్లో కేవలం ఆరుగురు మాత్రమే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. వీరిలో ఎంఎస్ ధోని, రిషబ్ పంత్ రెండు సార్లు ఈ ఘనతను సాధించగా.. నయన్ మోంగియా, వృద్దిమాన్ సాహా, అజయ్ రాత్రా, దృవ్ జురెల్ చెరోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. కాగా, రాంచీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో అజేయమైన 39 పరుగులు చేసి జురెల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనలో (192) తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. జురెల్, శుభ్మన్ గిల్ (52 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. -
ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. ‘రాంచి హీరో’ భావోద్వేగం
India vs England, 4th Tes: రాంచి టెస్టు హీరో ధ్రువ్ జురెల్ భావోద్వేగానికి లోనయ్యాడు. తనపై నమ్మకం ఉంచినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ధన్యవాదాలు తెలిపాడు. ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా రాజ్కోట్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ధ్రువ్ జురెల్. వికెట్ కీపర్ బ్యాటర్గా తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఈ యూపీ ఆటగాడు.. అరంగేట్ర మ్యాచ్లో ఫర్వాలేదనిపించాడు. రాజ్కోట్లో కీపింగ్ నైపుణ్యాలతో పాటు బ్యాటింగ్ మెరుపులనూ చూపించాడు 23 ఏళ్ల జురెల్. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులతో మెరవగా.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే లేకుండా సహచరులు జట్టును గెలిపించారు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 ఇలా అరంగేట్రంలో అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయిన ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో మాత్రం అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో మునిగిపోయిన తొలి ఇన్నింగ్స్లో విలువైన 90 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అంతకంటే గొప్ప ఇన్నింగ్సే ఆడాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో శుబ్మన్ గిల్(52- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా.. 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియాను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘రోహిత్ భయ్యా, రాహుల్ సర్.. ఈ కుర్రాడిని నమ్మినందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ వాళ్లిద్దరు తన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు పంచుకున్నాడు. కాగా ధ్రువ్ జురెల్ తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. Thank you Rohit bhaiya, Rahul sir for believing in this boy 🙏🇮🇳❤️ pic.twitter.com/pBlojvB10p — Dhruv Jurel (@dhruvjurel21) February 26, 2024 కొడుకును కూడా తనలాగే సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెట్పై మక్కువతో అనేక కష్టనష్టాలకోర్చి టీమిండియా తరఫున ఆడే స్థాయికి చేరుకున్నాడు. చదవండి: #Sarfaraz Khan: గోల్డెన్ డకౌట్.. అయినా సర్ఫరాజ్ అలా!.. -
#IndvsEng: కష్టపడాల్సి వచ్చింది.. అతడు అత్యద్భుతం: రోహిత్ శర్మ
India vs England, 4th Test- Rohit Sharma Comments After Series Win: భారత గడ్డపై కూడా తగ్గేదేలేదు అంటూ దూకుడు ప్రదర్శించాలనుకున్న ఇంగ్లండ్కు టీమిండియా కళ్లెం వేసింది. ఉపఖండంలో ఇలాంటి పప్పులు ఉడకవంటూ ‘బజ్బాల్’ పగిలేలా వరుస విజయాలతో మోత మోగించింది. నాలుగో మ్యాచ్లో నాలుగో రోజు ఆటలోనే ఫలితం తేల్చి సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. ఆరంభ మ్యాచ్లో తడ‘బ్యా’టుకు గురైనా.. హ్యాట్రిక్ విజయాలతో సొంతగడ్డపై ఆధిపత్యాన్ని చాటుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లు లేకపోయినా కుర్రాళ్లు ఆ లోటును తీర్చి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా బ్యాటర్లు ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తమదైన ముద్ర వేయగలిగారు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లే అధికంగా ఉన్న జట్టుతో ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ సిరీస్ ఆసాంతం గెలుపు కోసం మేము ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అయినా.. నాలుగో టెస్టులోనే సిరీస్ ఫలితం తేల్చగలిగాం. కుర్రాళ్ల ఆట తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. మేము సాధించిన విజయాల పట్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాను. స్థానిక, దేశవాళీ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లు ఇక్కడ ఇలాంటి అద్భుతాలు చేయగలరో చూపించారు టెస్టు క్రికెట్లో రాణించాలంటే కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్లు అవన్నీ దాటుకుని ఇక్కడి దాకా వచ్చి తమను తాము నిరూపించుకున్నారు. ఈ మ్యాచ్లో ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్లో మరింత పరిణతితో ఆడాడు. కూల్గా, కామ్గా తన పని పూర్తి చేశాడు’’ అని రోహిత్ శర్మ.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్పై ప్రశంసలు కురిపించాడు. ఇది సమిష్టి విజయమని.. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనా ఇలాంటి గెలుపు రుచి చూడటం ఎంతో ఆనందంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. డ్రెస్సింగ్రూం వాతావరణం బాగానే ఉన్నా.. బయట తమ జట్టు గురించి వచ్చే వార్తలు, చేసే వ్యాఖ్యలు కుర్రాళ్లపై కాస్త ఒత్తిడి పెంచాయని తెలిపాడు. అయితే, ఒత్తిడిని జయించి అద్బుత ప్రదర్శనలతో వారు తమను నిరూపించుక్ను తీరు అమోఘమని రోహిత్ శర్మ ఈ సందర్భంగా కొనియాడాడు. ఆఖరి టెస్టులోనూ గెలుపొంది 4-1తో ట్రోఫీని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మార్చి 7 నుంచి నామమాత్రపు ఐదో టెస్టు జరుగనుంది. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 -
టీమిండియా సరికొత్త చరిత్ర.. 11 ఏళ్ల తర్వాత!
స్వదేశంలో ఇంగ్లండ్ను మరోసారి భారత్ మట్టికరిపించింది. రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. రాంఛీ టెస్టులో 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. అయితే 40/0 ఓవర్ నైట్ స్కోర్ నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఉచ్చులో చిక్కుకున్న భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన క్రమంలో భారత జట్టును యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్(52), ధ్రువ్ జురెల్(39) అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 72 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. వీరిద్దరితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(55) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ.. కాగా టెస్టుల్లో భారత గడ్డపై 150 పైగా పరుగుల లక్ష్యాన్ని టీమిండియా విజయవంతంగా చేధించడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారత జట్టు చివరగా 2013లో ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 150 ప్లస్ టార్గెట్ను ఛేదించింది. తాజా విజయంతో చెత్త రికార్డును భారత్ చెరిపేసింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు స్కోర్లు ఇంగ్లండ్ - 353 & 145 ఇండియా- 307 & 192/5 ఫలితం- ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ధ్రువ్ జురెల్ -
#Ind vs Eng: టీమిండియాదే సిరీస్.. రసవత్తర మ్యాచ్లో ఆ ఇద్దరు ‘హీరోల’ వల్లే!
India vs England, 4th Test- India Beat England By 5 Wickets: రసవత్తరంగా సాగిన రాంచి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. గిల్, జురెల్ హీరోచిత ఇన్నింగ్స్ వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్ అద్భుత అజేయ అర్ధ శతకం(52)తో మెరవగా.. ధ్రువ్ జురెల్(39 నాటౌట్) మరో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయాలకు చేర్చాడు. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది భారత్. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 కాగా ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు భారత్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ తొలి టెస్టులో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆ మరుసటి మ్యాచ్లోనే తిరిగి పుంజుకున్న టీమిండియా.. వరుసగా విజయాలు సాధించింది. విశాఖపట్నం తర్వాత రాజ్కోట్.. తాజాగా రాంచి టెస్టులో గెలుపొంది ఇంగ్లండ్పై ఆధిపత్యాన్ని చాటుకుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, మిడిలార్డర్లో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ లేకున్నా యువ ఆటగాళ్లతోనే సిరీస్ గెలిచి సత్తా చాటింది రోహిత్ సేన. రాంచి టెస్టు రసవత్తరంగా సాగిందిలా.. రాంచి వేదికగా శుక్రవారం ఇంగ్లండ్తో మొదలైన మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. తొలిరోజు ఆట ఆరంభంలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ వరుసగా వికెట్లు పడగొట్టడంతో మొదటి సెషన్లో పైచేయి సాధించింది. ఆ తర్వాత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలా ఓ చెయ్యి వేయగా.. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను జో రూట్ అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల చేసి పైచేయి సాధించింది. జురెల్ ‘జువెల్’ ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో భాగంగా ఇంకో 51 పరుగులు జతచేసి.. 353 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 2 పరుగులకే అవుట్ కాగా.. రజత్ పాటిదార్ (17), రవీంద్ర జడేజా(12), సర్ఫరాజ్ ఖాన్(14) విఫలమయ్యారు. వన్డౌన్బ్యాటర్ శుబ్మన్ గిల్(38) ఫర్వాలేదనపించాడు. అయితే, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో జట్టును ఆదుకోగా.. మూడో రోజు ఆటలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అదరగొట్టాడు. వికెట్లు పడుతున్నా కుల్దీప్ యాదవ్(28) సహకారంతో పట్టుదలగా నిలబడి 90 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఆదివారం నాటి ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులు పూర్తి చేయగలిగింది. అశూ దెబ్బకు ఇంగ్లండ్ కుదేలు ఇక అదే రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. 145 పరుగులకే ఆలౌట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. అయితే, నాలుగో రోజు ఆరంభంలోనే సీన్ రివర్స్ అయింది. ఇంగ్లండ్ పేసర్ యశస్వి జైస్వాల్(37)ను పెవిలియన్కు పంపగా.. స్పిన్నర్ టామ్ హార్లే రోహిత్ శర్మ(55)ను అవుట్ చేశాడు. బషీర్ భయపెట్టాడు.. గిల్, జురెల్ పూర్తి చేశారు ఇక రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ను యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు పంపాడు. అతడి స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్నూ డకౌట్గా వెనక్కి పంపాడు. ఇలా షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న టీమిండియాను వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కలిసి గట్టెక్కించారు. ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి టీమిండియాను గెలిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో గిల్ అర్ధ శతకం(52), జురెల్ 39 పరుగులతో అజేయంగా నిలిచి హీరోలయ్యారు. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు స్కోర్లు ఇంగ్లండ్ - 353 & 145 ఇండియా- 307 & 192/5 ఫలితం- ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ధ్రువ్ జురెల్ -
నా సహోదరుడా.. అంటూ రింకూ సింగ్ భావోద్వేగం
India vs England, 4th Test- Rinku Singh's Emotional Post: టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. దురదృష్టవశాత్తూ సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితేనేం.. అతడు సాధించిన ఆ 90 పరుగులు భారత ఇన్నింగ్స్లో అత్యంత ముఖ్యమైనవి. టీమిండియా 307 పరుగులు మార్కును అందుకుందంటే అందుకు జురెలే కారణం. ముఖ్యంగా మూడో రోజు ఆటలో భాగంగా కుల్దీప్ యాదవ్(28)తో కలిసి ఎనిమిదో వికెట్కు 76 విలువైన పరుగులు జోడించిన తీరు అద్భుతం. అలా తొలి ఇన్నింగ్స్లో 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్.. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్.. జురెల్ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాశాడు. జురెల్తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘నా సహోదరుడా... కలలు నిజమయ్యే తరుణం ఇది’’ అంటూ సహచర ఆటగాడిపై ప్రేమను కురిపించాడు. కాగా రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్కు ఆడతారన్న విషయం తెలిసిందే. అలా పరిచయమైన వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇదిలా ఉంటే.. మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ధ్రువ్ జురెల్ నైపుణ్యాలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు. ఇక ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్.. రాంచి మ్యాచ్లో తాను సాధించిన విలువైన అర్ధ శతకాన్ని తన తండ్రికి అంకితమిచ్చాడు. మరోవైపు.. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో అద్బుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న రింకూ సింగ్.. గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. టీ20 ఫార్మాట్లో నయా ఫినిషర్గా అవతరించిన ఈ యూపీ బ్యాటర్.. వన్డేల్లోనూ తనదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు. చదవండి: ఏంటి సర్ఫరాజ్.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్ సీరియస్! View this post on Instagram A post shared by Rinku 🧿🇮🇳 (@rinkukumar12) -
'అతడేం తప్పు చేశాడు.. ధ్రువ్ జురెల్కు తీవ్ర అన్యాయం'
ధ్రువ్ జురెల్.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో మారు మ్రోగుతున్న పేరు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ జురెల్.. ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. ఈ క్రమంలో జురెల్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అయితే మరో ఎంఎస్ ధోని దొరికాడంటూ దృవ్ను కొనియాడాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ధ్రువ్ విరోచిత పోరాటం కనబరిచాడు. టీమిండియా 307 పరుగుల మెరుగైన స్కోర్ చేయడంలో జురెల్ ముఖ్య పాత్ర పోషించాడు. లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్తో కలిసి ఎనిమిదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ రెండు సిక్స్లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవ శాత్తూ జురెల్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో జురెల్ను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు. జురెల్కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయని సెహ్వాగ్ కొనియాడు. అయితే ధ్రువ్ ఇన్నింగ్స్కు మీడియాలో సరైన గుర్తింపు లభించలేదని, తీవ్ర అన్యాయం జరిగిందని వీరూ ఆరోపించాడు. "ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో ఉన్న జట్టును అదుకున్నాడు. కానీ మీడియాలో ధ్రువ్ ఇన్నింగ్స్కు అంత హైప్ దక్కలేదు. కనీసం ఆ చర్చే లేదు. ఏదేమైనప్పటికీ చాలా బాగా ఆడావు. ధ్రువ్కు శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. కాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. అవున్ సర్ మీరు చెప్పిందే నిజమే అంటూ కామెట్లు చేస్తున్నారు. ఆ తర్వాత మొదటి పోస్ట్కు వివరణ ఇస్తూ సెహ్వాగ్ మరో ట్వీట్ చేశాడు. "ఎవరినీ కించపరచాలి లేదా అవమానించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆటగాళ్ల ప్రదర్శనపై సమానమైన హైప్ ఉండాలి. ఈ మ్యాచ్లో ఆకాష్ దీప్ వంటి డెబ్యూ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. కానీ అతడికి కూడా అంత ఆదరణ దక్కలేదు. ధ్రువ్ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ ట్వీట్(ఎక్స్) చేశాడు. -
'అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో ధోని దొరికేశాడు'
రాంఛీ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఆటగాడు ధృవ్ జురెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. క్లిష్ట పరిస్ధితుల్లో తన విరోచిత పోరాటంతో జట్టును దృవ్ అదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గించాడు. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 307 పరుగుల మెరుగైన స్కోర్ చేయడంలో దృవ్ది కీలక పాత్ర. ఈ క్రమంలో ధృవ్ జురెల్పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో జురెల్ను లిటిల్ మాస్టర్ పోల్చాడు. "ధృవ్ జురెల్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతడి ఏకాగ్రత, అంకిత భావం చూస్తుంటే మరో ఎంఎస్ ధోని అవుతాడని నాకు అన్పిస్తోంది. ఈ మ్యాచ్లో జురెల్ తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ ఇదే ఏకగ్రాతతో ఆడితే భవిష్యత్తులో ఎన్నో సెంచరీలు సాధిస్తాడని" స్పోర్ట్స్ 18లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సన్నీ పేర్కొన్నాడు. కాగా ఓవరాల్గా 149 బంతులు ఆడిన ధ్రువ్ రెండు సిక్స్లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు. సెంచరీ చేయడం ఖాయం అనుకునే దశలో టామ్ హార్ట్లీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్కు కుల్దీప్ యాదవ్తో కలిసి ధ్రువ్ 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక రాంఛీ టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది.192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(24), యశస్వీ జైశ్వాల్ ఉన్నారు. చదవండి: IND vs ENG: ఏంటి సర్ఫరాజ్.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్ సీరియస్! వీడియో వైరల్ -
సొంతమా... సమమా!
అటో...ఇటో... కాదు! స్పిన్ ఎటు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. దీంతో రాంచీ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. మూడో రోజు ఆటలో 13 వికెట్లు రాలితే... ఇందులో 12 స్పిన్ వలలోనే చిక్కాయి. ఈ నేపథ్యంలో భారత్ ముందు ఊరించే 192 పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ... ఇంకా 152 పరుగుల దూరం స్పిన్ టర్న్ దృష్ట్యా భారత్కు అంత సులభం కాదు. భారత బ్యాటర్లు స్పిన్కు నిలబడితే సిరీస్ 3–1తో మన సొంతమవుతుంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు 10 వికెట్లు తీస్తే మాత్రం సిరీస్ 2–2తో సమమవుతుంది. రాంచీ: మూడో రోజు పూర్తిగా స్పిన్ మలుపు తీసుకున్న నాలుగో టెస్టులో భారత్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయిన టీమిండియా... ప్రత్యర్థి రెండో ఇన్నింగ్స్ను 150 పరుగుల్లోపే కూల్చేసింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు, సిరీస్ చేజిక్కించుకొనేందుకు 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ (24 బ్యాటింగ్), యశస్వి (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయానికి భారత్ 152 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు ఆట సాగిందిలా... ఓవర్నైట్ స్కోరు 219/7తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ 103.2 ఓవర్లలో 307 పరుగుల వద్ద ఆలౌటైంది. ధ్రువ్ జురెల్ (149 బంతుల్లో 90; 6 ఫోర్లు, 4 సిక్స్) అద్భుతమైన పోరాటం చేశాడు. ఓవర్నైట్ సహచరుడు కుల్దీప్ (131 బంతుల్లో 28; 2 ఫోర్లు)తో ఎనిమిదో వికెట్కు 76 పరుగులు జోడించిన జురెల్ తొలి అర్ధసెంచరీ సాధించాడు. వెంటనే జురెల్ సెల్యూట్ చేసి మాజీ సైనికుడు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తన నాన్నకు ఈ అర్ధ సెంచరీ అంకితమిచ్చాడు. 253 స్కోరు వద్ద కుల్దీప్ అవుటైనా... అప్పు డే జట్టు ఆలౌట్ కాలేదు. ఆకాశ్దీప్ (9)తో తొమ్మి దో వికెట్కు 40 పరుగులు జతచేసి జట్టు స్కోరు 300 దాటాకే జురెల్ అవుటయ్యాడు. మూడో రోజు భారత్ 88 పరుగులు చేస్తే అందులో 68 పరుగులు జురెలే సాధించి టాప్స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ కూలిందిలా... తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులు ఆధిక్యం పొందిన ఇంగ్లండ్ లంచ్ తర్వాత రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే తొలి ఓవర్ నుంచే కెపె్టన్ రోహిత్ ఇంగ్లండ్ మెడకు అశ్విన్తో స్పిన్ ఉచ్చు బిగించాడు. ఇది ఐదో ఓవర్ నుంచి ఫలితాల్ని ఇవ్వడంతో ఇంగ్లండ్ కుదేలైంది. ఐదో ఓవర్లో అశ్విన్ ఓపెనర్ డకెట్ (15), పోప్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ క్రాలీ (91 బంతుల్లో 60; 7 ఫోర్లు) అశ్విన్, జడేజా, కుల్దీప్ల స్పిన్ త్రయానికి కాసేపు ఎదురునిలిచాడు. కానీ ఈ లోపే రూట్ (11)ను అశ్విన్, అర్ధ శతకం తర్వాత క్రాలీ, స్టోక్స్ (4) వికెట్లను కుల్దీప్ పడేశాడు. జడేజా కూడా బెయిర్ స్టో (30)ను అవుట్ చేయడం ద్వారా 120/6 స్కోరు వద్ద ఇంగ్లండ్ బ్యాటింగ్ బలగమంతా పెవిలియన్లో కూర్చుంది. మిగిలిన టెయిలెండర్లలో హార్ట్లీ (7), రాబిన్సన్ (0)లను కుల్దీప్ వెనక్కి పంపగా, అండర్సన్ (0)ను అవుట్ చేసిన అశ్విన్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్కు 145 పరుగుల వద్ద తెరదించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు భారత స్పిన్నర్లకే (అశ్విన్ 5/51; కుల్దీప్ 4/22; జడేజా 1/56) దక్కడం విశేషం. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353; భారత్ తొలి ఇన్నింగ్స్: 307; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 60; డకెట్ 15; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 0; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 11; బెయిర్స్టోక్ (సి) పటిదార్ (బి) జడేజా 30; స్టోక్స్ (బి) కుల్దీప్ 4; ఫోక్స్ (సి అండ్ బి) అశ్విన్ 17; హార్ట్లీ (సి) సర్ఫరాజ్ (బి) కుల్దీప్ 7; రాబిన్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 0; బషీర్ (నాటౌట్) 1; అండర్సన్ (సి) జురెల్ (బి) అశ్విన్ 0; ఎక్స్ట్రాలు 0; మొత్తం (53.5 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–65, 4–110, 5–120, 6–120, 7–133, 8–133, 9–145, 10–145. బౌలింగ్: అశ్విన్ 15.5–0–51–5, జడేజా 20–5–56–1, సిరాజ్ 3–0–16–0, కుల్దీప్ 15–2–22–4. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బ్యాటింగ్) 24; యశస్వి (బ్యాటింగ్) 16; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 40. బౌలింగ్: రూట్ 4–0–17–0, హార్ట్లీ 3–0–22–0, బషీర్ 1–0–1–0. -
పాపం దృవ్.. జస్ట్ సెంచరీ మిస్! అయినా హీరోనే
అరంగేట్ర మ్యాచ్లో సత్తాచాటిన టీమిండియా యువ వికెట్ కీపర్ దృవ్ జురల్.. తన రెండో మ్యాచ్లోనూ అదరగొట్టాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో దృవ్ జురల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రోహిత్ శర్మ, జడేజా, గిల్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట జురల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన జురల్ ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. తన విరోచిత పోరాటాన్ని మాత్రం కొనసాగించాడు. లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్తో కలిసి భారత జట్టును ఈ యూపీ ఆటగాడు అదుకున్నాడు. కుల్దీప్తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని దృవ్ నెలకొల్పాడు. అయితే జురల్ దురదృష్టవశాత్తూ తృటిలో తన తొలి సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో దృవ్ 90 పరుగులు చేశాడు. సెంచరీకి చేరువలో టామ్ హార్ట్లీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్కు చేరాడు. సెంచరీ చేయకపోయనప్పటికీ తన అద్బుత ఇన్నింగ్స్తో అభిమానుల మనసును ఈ యువ వికెట్ కీపర్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక దృవ్ జురల్ విరోచిత పోరాటం ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 300 పరుగుల మార్క్ను దాటింది. మొదటి ఇన్నింగ్స్లో 307 పరుగులకు భారత్ ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 25 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 149 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: PSL 2024: పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్లో షాహీన్ -
దృవ్ జురల్ సూపర్ ఇన్నింగ్స్.. 307 పరుగులకు భారత్ ఆలౌట్
రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో 307 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. 219/7 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా 88 పరుగులు జోడించి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్కు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక భారత బ్యాటర్లలో దృవ్ జురల్ అద్బుతమైన పోరాట పటిమను కనబరిచాడు. తృటిలో తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని జురల్ కోల్పోయాడు. 149 బంతులు ఎదుర్కొన్న జురల్.. 6 ఫోర్లు, 4 సిక్స్లతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు జైశ్వాల్(73), కుల్దీప్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు టామ్ హార్ట్లీ 3 వికెట్లు, జేమ్స్ ఆండర్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలలో వెటరన్ ఆటగాడు జో రూట్(122) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తాచాటగా.. ఆకాష్ దీప్ 3 వికెట్లు, సిరాజ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: IND vs ENG: మీకు రూట్ ఉంటే.. మాకు కుల్దీప్ సార్ ఉన్నారు! అంతేగా? -
Day 2: చెలరేగిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. ఆదుకున్న జైస్వాల్
India vs England, 4th Test Day 2 Score: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలిరోజు ఆటలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో చెలరేగగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అయితే, జో రూట్ రాకతో సీన్ మారిపోయింది. ‘బజ్బాల్’ కాన్సెప్ట్నకుకు విరుద్ధంగా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడుతూ రూట్ అజేయ సెంచరీతో చెలరేగిన కారణంగా.. తొలి రోజు ఇంగ్లండ్ తిరిగి పుంజుకోగలిగింది. ఆట పూర్తయ్యే సరికి 300 పరుగుల మార్కు దాటేసింది.ఈ క్రమంలో 302/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవరాల్గా భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. 𝙅𝙖𝙖𝙙𝙪𝙞 𝙅𝙖𝙙𝙙𝙪 weaving magic with the ball 🪄 Three quick wickets helped #TeamIndia bowl out the visitors early! 💪🏻#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/iiWyPgAn4C — JioCinema (@JioCinema) February 24, 2024 ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సర్ ఆదిలోనే షాకిచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత యువ బౌలర్ షోయబ్ బషీర్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. పాక్ మూలాలున్న ఈ రైటార్మ్ స్పిన్నర్ దెబ్బకు శుబ్మన్ గిల్(38), రజత్ పాటిదార్(17) లెగ్ బిఫోర్ వికెట్లుగా వెనుదిరిగారు. ఇక జట్టును ఆదుకుంటాడనుకున్న రవీంద్ర జడేజా(12)ను కూడా బషీరే పెవిలియన్కు పంపడం గమనార్హం. Bashir breaks the crucial partnership between Gill and Jaiswal! 🥲 #INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/hCKcWdJq5A — JioCinema (@JioCinema) February 24, 2024 ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకుని దానిని సెంచరీగా మలిచే ప్రయత్నం చేయగా.. బషీర్ అద్బుత రీతిలో అతడి బౌల్డ్ చేశాడు. దీంతో 73 పరుగులకే జైస్వాల్ ఇన్నింగ్స్కు తెరపడింది. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 ఇక సర్ఫరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్(1)లను మరో స్పిన్నర్ టామ్ హార్లే పెవిలియన్కు పంపాడు. ఫలితంగా 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఈ క్రమంలో జైస్వాల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, అశూ స్థానంలో వచ్చిన కుల్దీప్ యాదవ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట ముగిసే టీమిండియా 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుబడి ఉంది. చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఆట పూర్తయ్యే సరికి జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ టీమిండియాపై పైచేయి సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. చదవండి: బంతితో చెలరేగిన బషీర్.. అంతకంటే ముందు సర్ఫరాజ్కు షాకిచ్చాడిలా! Kuldeep Yadav spinning surprises with both bat & ball! 🤩#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSport pic.twitter.com/D7hDjNf04x — JioCinema (@JioCinema) February 24, 2024
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement