-
మనవరాలితో అదానీ మురిపెం : బిలియనీర్ ఫోటో వైరల్
అసలు కంటే వడ్డీ ముద్దు అనేది నానుడి. అంటే బిడ్డలతో పోలిస్తే మనవలు మనవరాళ్లపైనే తల్లితండ్రులకు ఎక్కువప్రేమ అభిమానం ఉంటుంది అని. చాలా సందర్బాల్లో ఇది అక్షరాలా అనిపిస్తుంది. ఇందులో బడా పారిశ్రామికవేత్తలైనా, సెలబ్రిటీలైనా ఎవ్వరూ అతీతులు కారు. తాజాగా బిలియనీర్, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ తన ముద్దుల మనవరాలిని చూసి తెగమురిసిపోతున్నారు. నీ కళ్లలోని మెరుపుతో పోలిస్తే ఈ ప్రపంచంలోని సంపద అంతా దిగ దుడుపే అన్నట్టు రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతోంది. 14 నెలల మనవరాలు కావేరిని ఎత్తుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ప్రపంచంలో ఇంతకుమించిన సంపద ఏముందంటూ ఒక కవితా పదాలను రాయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్టాపిక్గా నిలిచింది. "ఇన్ ఆంఖోన్ కీ చమక్ కే ఆగే దునియా కీ సారీ దౌలత్ ఫీకీ హై. (నీ కళ్ల మెరుపులో ప్రపంచంలోని సంపద అంతా మసకబారుతుంది)" అంటూ ఉద్వేగంతో రాసుకొచ్చారు. గౌతమ్ అదానీ- ప్రీతి అదానీ దంపతులకు ఇద్దరు కుమారులు కరణ్, జీత్. వీరిలో పెద్ద కుమారుడు కరణ్- పరిధి ముద్దుల తనయ కావేరి. కాగా లండన్లోనే సైన్స్ మ్యూజియంలో న్యూ అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ చిన్నారితో ఫోటో తీసుకున్నారు. తన జీవితంలో మనవరాళ్లతో గడపడమే తనకు పని ఒత్తిడి (బిగ్గెస్ట్ స్ట్రెస్ రిలీవర్స్) పెద్ద ఉపశమనం అని గతంలో పేర్కొన్నారు. "నా మనుమరాళ్లతో సమయం గడపడం చాలా ఇష్టం, వారు నా ఒత్తిడిని తగ్గిస్తారు. నాకు రెండు ప్రపంచాలు ఒకటి ఉద్యోగం, రెండోది. కుటుంబం, కుటుంబమే నాకు గొప్ప శక్తి’’ గౌతమ్ అదానీ. इन आँखों की चमक के आगे दुनिया की सारी दौलत फीकी है। 🙏 pic.twitter.com/yd4nyAjDkR — Gautam Adani (@gautam_adani) April 2, 2024 -
స్టైయిలిష్ లుక్లో స్లిమ్గా కనిపిస్తున్న బోనీ కపూర్! ఎలా తగ్గారంటే..?
చిత్ర నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోని కపూరు స్లిమ్గా కనిపిస్తున్నారు. చాలా బరువు ఉండే ఆయన మంచి ఫిట్నెస్ లుక్లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. తాను బరువుత తగ్గేందుకు ఎలాంటి కసరత్తులు చేశారో వెల్లడించారు. అంతేగాదు తనలా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇంతకీ బోనీ కపూర్ వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే.. గతంలో 2004లో శ్రీదేవితో కలిసి ఉన్న ఫోటోల్లో బోనీ కపూర్ చాలా లావుగా, ఏజ్డ్ పర్సన్లా కనిపించారు. ఆ తర్వాత కూడా శ్రీదేవి చనిపోయిన తర్వాత పలు సందర్భాల్లో కెమరాకు చిక్కిన పోటోల్లో కూడా లావుగానే ఉన్నారు. అలాంటి ఆయాన అనూహ్యంగా 12 కిలోలలకు పైగా బరువు తగ్గడమే గాక న్యూలుక్లో కనిపిస్తున్నారు. బోనీ కపూరేనా అనిపించలా కొత్త స్టయిలిష్ లుక్లో దర్శనమిచ్చారు. 20 ఏళ్ల క్రితం ఉన్న బోనీకపూర్కి ఈ న్యూలుక్లో ఉన్న బోనీ కపూర్కి ఎంత తేడా అని షాకయ్యేలా విజయవంతంగా బరువుతగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ మేరకు బోనీకపూర్ మాట్లాడుతూ.."బరువు తగ్గేందుకు తాను చాలా కష్టపడ్డానని అన్నారు. అలాగే తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారే తొందరగా బరువు తగ్గగలరని అన్నారు. అందుకోసం క్రమశిక్షణతో కూడిని జీవనశైలిని అవలంభించాల్సి ఉంటుందన్నారు. తాను బరువు తగ్గే క్రమంలో నటి జాన్వీ కపూర్ ఉత్సహాపరిచేలా ప్రోత్సహించిన విషయాన్ని కూడా పంచుకున్నారు. జాన్వీ సోషల్ మీడియాలో "నా పాపా బరువు తగ్గడంలో విజంయ సాధించినందుకు గర్వంగా ఉంది." అని పోస్ట్ చేసింది. ఇలా తన పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహమే తనను తొందరగా బరువు తగ్గేలా చేసేందుకు దోహదపడిందన్నారు. అలాగే తన మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్ కూడా బరువు తగ్గే ప్రయత్నంలో కష్టాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆమెకి ప్రేరణ కలిగించేలా తాను బరువు తగ్గేందుకు ఉపక్రమించినట్లు తెలిపారు. అయితే తన కూతురు కూడా చక్కగా బరువు తగ్గి న్యూలుక్ మంచి ఫిట్నెస్తో అందంగా ఉందని చెప్పడమే గాకా ఆమె ఫోటోలను కూడా షేర్ చేశారు. తనలా బరువు తగ్గాలనుకునేవారు తగ్గలేకపోతున్నాననే నిరాశకు లోనవ్వకూడదు. చివరి నిమిషం వరకు ఆశను కోల్పోకుండా ఉత్సాహభరితంగా కసరత్తులు చేస్తే దెబ్బకు బరువు తగ్గడం ఖాయ అని అన్నారు. అందుకు తానే నిదర్శనమని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు." బోనీ కపూర్. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) (చదవండి: సెలబ్రెటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!) -
అతడితో చహల్ భార్య ధనశ్రీ ఫొటో.. రచ్చ రచ్చ.. పదే పదే ఇలా?
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి విమర్శల పాలయ్యారు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న ఈ డాక్టరమ్మ తీరు చహల్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘‘చహల్ భయ్యా కూడా మీతో పదే పదే ఇదే తరహాలో వ్యవహరిస్తే భరించగలరా? లేదంటే.. ప్రచార యావ కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి చేస్తున్నారా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ధనశ్రీని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?! టీమిండియా బౌలర్గా కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు చహల్. డిసెంబరు 22, 2020లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో.. స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ తొలుత తనకు నృత్య పాఠాలు నేర్పిందని.. ఈ క్రమంలోనే తాము ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చినట్లు చహల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ధనశ్రీకి భర్తతో కలిసి దిగిన ఫొటోలు, అతడితో కలిసి చేసిన రీల్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. అలాగే తన వృత్తిగత విషయాలను ఆమె షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతేడాది తన ఇన్స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును ఆమె తొలగించడంతో విడాకుల వదంతులు తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో ధనశ్రీ సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణమని కొంతమంది నెటిజన్లు అసభ్యకరరీతిలో కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్- ధనశ్రీ వర్మ స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని కొట్టిపారేశారు. అయినప్పటికీ ధనశ్రీ చర్యలను జడ్జ్ చేయడం మానలేదు నెటిజన్లు. చహల్కు అప్పట్లో ఉన్న క్రేజ్ దృష్ట్యానే అతడిని ఆమె పెళ్లాడిందనే తమ సొంత అభిప్రాయాలను వీరి బంధానికి ఆపాదిస్తూ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. తాజాగా ధనశ్రీ వర్మ దిగిన ఓ ఫొటో మరోసారి ఇలాంటి ట్రోల్స్కు కారణమైంది. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా అనే టీవీ షోలో భాగమయ్యారు. ఈ క్రమంలో మరో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటో బయటకు వచ్చింది. ప్రతీక్ స్వయంగా ఈ పిక్చర్ను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ధనశ్రీ తీరును విమర్శిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం వృత్తిగతం(యాక్టింగ్, డ్యాన్స్)గా ప్రమోషన్స్లో భాగంగా ఇలాంటి ఫొటోలను చేయడాన్ని తప్పుపట్టని వారు.. ఒక్క ఫొటోతో ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఝలక్ దిఖ్లా జా షోలో ఫైనల్స్ వరకు వెళ్లిన ధనశ్రీ వర్మ విజేతగా నిలవలేకపోయింది. ఈ సీజన్లో ఫైనల్ వరకూ వచ్చిన మనీషా రాణి అనే మరో ఫిమేల్ కంటెస్టెంట్ ట్రోఫీని అందుకున్నారు. What will be the Dhanashree Verma reaction if Yuzvendra Chahal does this constantly with his ladies friends ? We all are human and any husband who loves his wife will be hurt by these incidents. This is utter nonsense, and needs to be stopped. pic.twitter.com/xKW2tf7K9v — Sujeet Suman (@sujeetsuman1991) March 2, 2024 I wouldn't post such an intimate pic on instagram even if it was with my wife #ShameOnDhanshree #YuziChahal pic.twitter.com/9pEhXEmtAi — brigadier🇮🇳 (@brigadierdude) March 2, 2024 -
ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. ‘రాంచి హీరో’ భావోద్వేగం
India vs England, 4th Tes: రాంచి టెస్టు హీరో ధ్రువ్ జురెల్ భావోద్వేగానికి లోనయ్యాడు. తనపై నమ్మకం ఉంచినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ధన్యవాదాలు తెలిపాడు. ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా రాజ్కోట్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ధ్రువ్ జురెల్. వికెట్ కీపర్ బ్యాటర్గా తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఈ యూపీ ఆటగాడు.. అరంగేట్ర మ్యాచ్లో ఫర్వాలేదనిపించాడు. రాజ్కోట్లో కీపింగ్ నైపుణ్యాలతో పాటు బ్యాటింగ్ మెరుపులనూ చూపించాడు 23 ఏళ్ల జురెల్. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులతో మెరవగా.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే లేకుండా సహచరులు జట్టును గెలిపించారు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 ఇలా అరంగేట్రంలో అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయిన ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో మాత్రం అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో మునిగిపోయిన తొలి ఇన్నింగ్స్లో విలువైన 90 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అంతకంటే గొప్ప ఇన్నింగ్సే ఆడాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో శుబ్మన్ గిల్(52- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా.. 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియాను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘రోహిత్ భయ్యా, రాహుల్ సర్.. ఈ కుర్రాడిని నమ్మినందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ వాళ్లిద్దరు తన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు పంచుకున్నాడు. కాగా ధ్రువ్ జురెల్ తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. Thank you Rohit bhaiya, Rahul sir for believing in this boy 🙏🇮🇳❤️ pic.twitter.com/pBlojvB10p — Dhruv Jurel (@dhruvjurel21) February 26, 2024 కొడుకును కూడా తనలాగే సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెట్పై మక్కువతో అనేక కష్టనష్టాలకోర్చి టీమిండియా తరఫున ఆడే స్థాయికి చేరుకున్నాడు. చదవండి: #Sarfaraz Khan: గోల్డెన్ డకౌట్.. అయినా సర్ఫరాజ్ అలా!.. -
Viral Photo: ఢిల్లీలో టెస్లా క్రాస్బ్రీడ్.. మస్క్ చూస్తే ఏడుస్తాడు!
ఢిల్లీలోని కరోల్ బాగ్ ఏరియాలో ఓ టెస్లా కారు కనిపించి ఆశ్చర్యపరిచింది. అయితే ఇది అసలైన టెస్లా కారు కాదు. వేరే కంపెనీ కారుకు టెస్లా లేబుల్ తగిలించి తిప్పుతున్నారు. ఇది భారత్ పే మాజీ ఎండీ ఆష్నీర్ గ్రోవర్ కంట్లో పడింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. భారత్ పే మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇంటర్నెట్లో వినోదభరితమైన, అబ్బురపరిచే విషయాలను పంచుకొంటుంటారు. ఇదే క్రమంలో టెస్లా లోగోతో ఉన్న బీవైడీ అట్టో3 కారు ఫొటోను షేర్ చేశారు. ‘బహుశా ప్రపంచంలోనే తొలి క్రాస్ బ్రీడ్ టెస్లా కారు ఇదేనేమో’ అంటూ కాప్షన్ను జోడించారు. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దేశంలో క్రియేటివిటీకి కొదవ లేదని ఓ యూజర్ కామెంట్లు పెట్టారు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ ఫొటో చూస్తే టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ఓ మూలన కూర్చుని ఏడుస్తాడని కామెంట్ చేశాడు. World’s first ‘cross - breed’ Tesla ! Some Delhi boy literally ‘built his dream’ in Karol Bagh @Tesla pic.twitter.com/zxuilgyvAV — Ashneer Grover (@Ashneer_Grover) February 3, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement