-
కావ్య చావుకు ఫిట్స్ కారణమా..?
నల్గొండ: మండల పరిధిలోని పర్వతగిరి గ్రామంలో మంగళవారం సాయంత్రం యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చనగాని కావ్య(20) గత రెండు సంవత్సరాలుగా ఫిట్స్తో బాధపడుతోంది. తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది. సోదరుడు నవీన్ ఇంటికి వచ్చి కావ్యను గమనించి, నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కావ్య తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
వరంగల్ లో ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు
-
లోక్ సభ ఎన్నికల్లో కావ్య భారీ మెజారిటీతో గెలుస్తారు: శ్రీహరి
-
ఆయన నమ్మరు.. ఆయన్ను నమ్మరు
కావ్య ఎంట్రీతో కావలిలో టీడీపీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వంతో టీడీపీ భవితవ్యం తేలిపోయింది. చంద్రబాబు కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభతో అది ప్రస్ఫుటమైంది. కావ్యను టీడీపీ కేడర్ ఆది నుంచి వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆయన తన క్వారీల్లో పని చేసే సిబ్బందితో సొంత దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనను వ్యతిరేకిస్తున్నారనే కారణంతో టీడీపీ వీరాభిమానులను సైతం కావ్య పక్కన పెట్టేశారు. టీడీపీకి మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ నేతలను సైతం దూరంగా ఉంచారు. ఎన్నికల కార్యాచరణలో వీరిని దూరంగా పెట్టి.. తన గుమాస్తాల చేతికే పెత్తనమంతా కట్టబెట్టారు. ఖర్చులకు సైతం డబ్బులివ్వకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ కావ్యను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలే చంద్రబాబు సభకు జనసమీకరణకు కూటమి నేతలు ముఖం చాటేయడంతో ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కావలి: టీడీపీ కావలి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏక్ నిరంజన్గా మిగిలిపోయాడు. ఆయన నేతలను నమ్మడం లేదు. నేతలు ఆయన్ను నమ్మడం లేదు. కావ్య అభ్యర్థత్వాన్ని టీడీపీ నేతలు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. టికెట్ రేస్లో పోటీపడి చివరకు సీటు దక్కించుకున్నాడు. అయితే ఎన్నికల కార్యాచరణలో తన గెలుపు కంటే.. తన వద్ద ఉండే డబ్బు కోసమే పని చేస్తారనే ఆలోచనతో సొంత పార్టీ నేతలనే కాదు.. మిత్రపక్షాలను సైతం దూరం పెట్టేశాడు. తన వద్ద పని చేసే ఉద్యోగులు, దగ్గరి బంధువులతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీ నిర్ణయాన్ని కాదనలేక సర్దుకుపోదామని ప్రయత్నించినా మిత్ర పక్షాలకు, పార్టీ కేడర్కు కావ్య వర్గం నుంచి ప్రతి రోజూ అవమానాలు ఎదురవుతుండటంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. కావ్య శిబిరంలో కలవరం టీడీపీ అధినేత చంద్రబాబు కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభ అట్టర్ఫ్లాప్ కావడంతో కావ్య శిబిరంలో కలవరం మొదలైంది. ముందుగానే ప్రజాగళం షెడ్యూల్ ప్రకటించినప్పటికీ జన సమీకరణ చేయడంలో చతికిల పడ్డారు. జన సమీకరణ పేరుతో డబ్బులు తినేస్తారనే భావనతో కావ్య ప్రజాగళం బహిరంగ సభకు సంబంధించిన బాధ్యతలను కార్యకర్తలు, నాయకులను కాదని తన క్వారీల్లో పని చేసే గుమాస్తాలకు, తన దగ్గరి బంధువులకు అప్పగించారు. తమపై నమ్మకం లేక గుమాస్తాలకు బాధ్యతలు అప్పగించిన వ్యక్తి కోసం తాము ఎందుకు పని చేయాలంటూ సొంత పార్టీ కేడర్తో పాటు మిత్రపక్షాలు బీజేపీ, జనసేన సైతం ముఖం చాటేశారు. కావ్య అహంకార వైఖరితో ఇప్పటికే నియోజకవర్గంలో బీద రవిచంద్ర వర్గీయులు, మాలేపాటి వర్గీయులు పారీ్టకి దూరదూరంగా ఉంటున్నారు. ఎవరూ సహకారం అందించకపోవడంతో తన దళాలను రంగంలోకి దింపి జన సమీకరణకు సిద్ధమయ్యారు. అసలే టీడీపీ సభలంటే జనం ముఖం చాటేస్తున్నారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగినా.. జనం లేకపోవడంతో గంటా పది నిమిషాలు హెలిప్యాడ్లో ఉన్న బస్సులోనే పడిగాపులు పడ్డారు. ఎట్టకేలకు వెయ్యి.. రెండు వేల మందిని సభా స్థలికి చేర్చడంతో, రద్దీగా ఉండే ట్రంక్రోడ్లో జనం వచ్చే జనం, పోయే జనం పోగుకావడంతో సభ వద్దకు చంద్రబాబు వచ్చారు. ఆయన మాట్లాడుతుండగానే జనం పొలోమని వెళ్లిపోవడంతో అసహనంతో సభను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. ప్రజాగళం ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఆగ్రహంతో వెళ్లిన చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన నెలకొంది. మిత్రపక్షాలకు దక్కని ప్రాధాన్యం టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకులను కూడా కావ్య కృష్ణారెడ్డి చిన్నచూపు చూస్తున్నారని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తాజాగా ప్రజాగళం సభలో జనసేన ఊసే లేకపోవడంతో పవన్ అభిమానులకు మింగుడు పడటం లేదు. బీజేపీ నాయకులను కూడా పట్టించుకోలేదు. కావలి పట్టణ బీజేపీ అధ్యక్షుడి సహా సీనియర్ నాయకులంతా కూడా ప్రజాగళంలో జనాల మధ్య సాధారణ కార్యకర్తల్లా ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో బీజేపీ, జనసేన నాయకులు కూడా కావ్యకు మద్దతు తెలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. దొంగల్లా చూస్తున్నారని... 40 ఏళ్ల నుంచి పార్టీ కోసమే పని చేస్తున్నాం. పైసా ఆశించకుండా అభిమానంతో పార్టీ జెండా మోస్తున్నాం. కొత్తగా వచ్చిన కావ్య కృష్ణారెడ్డి మమ్మల్ని దొంగల్లా చూస్తున్నాడు. ప్రచార ఖర్చులకు అడిగినా కూడా అనుమానిస్తూ తన గుమాస్తాలకు లెక్కలు చెప్పమంటున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఇంత వరకూ చూడలేదు. ఇలాంటి అనుమానపు వ్యక్తి ఉన్న పారీ్టలో కొనసాగడం మా వల్ల కాదంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నందమూరి అభిమానులు, సీనియర్ నాయకులు పారీ్టకి, కావ్యకు దండం పెట్టి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదే బాటలో మరికొంత మంది సీనియర్ నాయకులు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. -
కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కడియం శ్రీహరి, కావ్యకు దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కే. కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఫిరాయింపులు మొదలయ్యాయి. పలువురు నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ గుడ్బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో వరసగా కీలక నేతలు కాంగ్రెస్లో చేరటం ప్రతిపక్ష బీఆర్ఎస్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో భారి విజయం సొంతం చేసుకున్న కాంగెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ అధిక సీట్ల గెలుపే టార్గెట్గా పావులు కదుపుతోంది. -
కాంగ్రెస్లోకి కడియం.. వరంగల్ ఎంపీ అభ్యర్థిపై ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో మరో సీనియర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరిక దాదాపు ఖరారైంది. కాంగ్రెస్లోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నేతల బృందం శుక్రవారం ఉదయం కడియం ఇంటికి వెళ్లింది. ఆ బృందంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో పాటు మల్లు రవి, సంపత్ కుమార్, రోహీన్ రెడ్డి ఉన్నారు. దాదాపు అరగంటకు పైగా కడియం నివాసంలో వీళ్లంతా సమావేశం అయ్యారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి, కావ్యలను కాంగ్రెస్లోకి ఆహ్వానించాం.. వీళ్లు అధికారికంగా మా పార్టీలోకి చేరతారు అని ప్రకటించారు దీపాదాస్ మున్షీ. అలాగే.. ఏఐసీసీ ప్రతినిధిగా దీపాదాస్ తమను కలిశారని కడియం చెప్పారు. ఏఐసీసీ, పీసీసీ నన్ను కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారు. నేను కాంగ్రెస్ లో ఇంకా చేరలేదు. నేను బీఆర్ఎస్ పార్టీ వీడడానికి చాలా కారణాలు ఉన్నాయి. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. అనుచరులు, అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని ఏఐసీసీ ప్రతినిధికి చెప్పా అని కడియం మీడియాతో అన్నారు. కావ్య పేరు దాదాపు ఖరారు ఇదిలా ఉంటే.. కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలోనే.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ సీటును కావ్య వద్దని చెబుతూ.. కేసీఆర్కు లేఖ రాసింది. మరోవైపు కడియం ఫ్యామిలీ కాంగ్రెస్లో చేరతుందనే ప్రచారం తెర మీదకు రాగానే.. వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ తరఫున కడియం శ్రీహరి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఆ సీటును కావ్యకే కాంగ్రెస్ పార్టీ కేటాయించునున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో వీళ్లు చేరిన వెంటనే.. అభ్యర్థుల జాబితా ద్వారా కావ్య పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. రేవంత్తో కేకే భేటీ ఇదిలా ఉంటే.. కాంగ్రెస్లో చేరతానని అధికారికంగా గురువారం ప్రకటించిన సీనియర్ నేత కేకే.. ఈ ఉదయం పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్లో చేరికపై అరగంట పాటు వీళ్లిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. కుదిరితే రేపు.. లేకుంటే ఏప్రిల్ 6వ తేదీన కేకే కాంగ్రెస్ గూటికి చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. -
పోటీ నుంచి తప్పుకుంటున్నా
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్లో బీఆర్ఎస్ గట్టి షాక్ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు గురువారం రాత్రి లేఖ రాశారు. పార్టీపై వచి్చన అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లోనే పోటీనుంచి విరమించుకుంటున్నానని తెలిపారు. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి, కావ్య? కడియం శ్రీహరి, కడియం కావ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే కావ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా తప్పుకున్నారని అంటున్నారు. ఇందుకోసమే ఇప్పటివరకు కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించ లేదని చెబుతున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్న తండ్రీకూతుళ్లు ఈ నెల 30న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి బరిలోకి దిగే అవకాశం ఉందని, కానిపక్షంలో కావ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. ఒకవేళ కడియం శ్రీహరిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే... ఆయన ఎంపీగా గెలిచిన అనంతరం కావ్యను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ బరిలోకి దింపవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ హామీల మేరకే శ్రీహరి, కావ్యలు బీఆర్ఎస్కు గుడ్బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత కోసం శ్రీహరి, కావ్యలను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు. కావ్య ఎపిసోడ్లో ప్రభుత్వ సలహాదారు, కడియం శ్రీహరికి చిరకాల మిత్రుడు వేం నరేందర్రెడ్డి చక్రం తిప్పారన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
వరంగల్: బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఎప్పటి నుంచో వేచిచూస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఎట్టకేలకు బీఆర్ఎస్ ‘బీ’ఫామ్ దక్కింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ను ఈసారికి పోటీ నుంచి తప్పించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిట్టింగ్ ఎంపీని మార్చడం తథ్యమన్న నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ మొదలైంది. వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో పార్టీలో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు రాజీ నామా చేయడంతో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, కడియం కావ్య పేర్లు ప్రధానంగా వినిపించాయి. అరూరి రమేష్ మొదట ఆసక్తి చూపినా.. ఆ తర్వాత ఎందుకో పార్టీ మారాలనే యోచనలో పడటం పార్టీలో గందరగోళానికి తెరతీసింది. ఇదే సమయంలో ఆయన మంగళవారం హైదరాబాద్లో కేంద్ర మంత్రులను కలవడం.. బుధవారం హనుమకొండలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్మీట్లో మాట్లాడేకంటే ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు ఆయనను తమ వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లి కేసీఆర్ను కలిపించారు. ఉమ్మడి వరంగల్ కీలక నేతలు, ప్రజాప్రతినిధులతో సుమారు గంటన్నర పాటు చర్చించిన కేసీఆర్.. కడియం కావ్య పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఉన్నత విద్యాభ్యాసం.. సామాజిక సేవలో సీనియర్ రాజకీయ నాయకులు కడియం శ్రీహరి పెద్ద కూతురైన కావ్య దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాక, ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీ (పాథాలజీ) పూర్తి చేసి వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా పనిచేశారు. గతంలో వర్ధన్నపేట సామాజిక వైద్యకేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తూనే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఆమె బాలికల విద్యా వ్యాప్తి కి విశేషించి కృషి చేస్తున్నారు. మెనుస్ట్రువల్ హైజీన్పై కడియం ఫౌండేషన్ ద్వారా వందలాది చైతన్య కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా హైజీన్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డాక్టర్ కావ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. మానుకోట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీతారాంనాయక్.. మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ను ప్రకటించారు. ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలో అలా చేరారో.. లేదో.. ఇలా టికెట్ తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన సీతారాంనాయక్ కేయూ ప్రొఫెసర్గా కొనసాగుతూనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇలా బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్కు దగ్గరైన ఆయన.. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. మానుకోట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్పై 34,992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన స్థానంలో మాలోత్ కవితకు టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఇవ్వాలని కోరగా.. అదీ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న సీతారాంనాయక్ టికెట్ రాదని తెలిసి, ఈ నెల 10న బీజేపీలో చేరారు. చేరిన మూడు రోజులకే మానుకోట టికెట్ కేటాయించడం గమనార్హం. ఇవి చదవండి: బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
అడ్డదారుల్లో కోట్లు ఆర్జించాడు.. డబ్బు సంచులతో సీటు కొనుగోలు!
టీడీపీ కావలి సీటు విషయంలో ఆ పార్టీ అధిష్టానం చివరకు క్యాష్ వైపే మొగ్గు చూపింది. కావ్య కృష్ణారెడ్డికే జై కొట్టి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచి డబ్బుసంచుల వైపు చూడడంతో దీనిని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. దశాబ్దాల నుంచి కావలిలో టీడీపీని కాపు కాసిన బీద రవిచంద్ర మాట కూడా చెల్లుబాటు కాలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడికి సైతం మొండిచేయి చూపడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీ ఇన్చార్జిగా కావ్య కృష్ణారెడ్డి (దగుమాటి వెంకట కృష్ణారెడ్డి)ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. స్థానికుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అభ్యర్థి ప్రకటన చేయడంపై క్యాడర్ మండిపడుతోంది. బీద రవిచంద్ర దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఆ కుటుంబానికే పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతో వారే అన్నీ తామై నడిపించేవారు. కానీ ఈ దఫా బీద రవించంద్ర, ఆయన సతీమణిని ఎన్నికల బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగినా స్థానికంగా పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో తన ప్రధాన అనుచరుడిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడిని ఇన్చార్జిగా నియామకం చేయించారు. కష్టకాలంలో మాలేపాటి పార్టీ కోసం నిలబడ్డారు. గత టీడీపీ హయాంలో అడ్డగోలుగా దోపిడీ చేసిన సొమ్ములో కాస్త కరిగించేలా చేశారు. చివరకు ఎన్నికల సమయంలో మాలేపాటికి టికెట్ ఇప్పించే ప్రయత్నంలో బీద మాట చెల్లుబాటు కాకపోవడంతో మిన్నకుండిపోవాల్సివచ్చింది. కావ్య వర్సెస్ బీద కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీలోకి ఎంట్రీ ఇవ్వకముందే బీద రవిచంద్రతో అమీతుమీకి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. డబ్బు సంచులతో పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని టికెట్ ఖరారు చేయించుకుని వచ్చిన కావ్య కావలిలో హడావుడి చేశారు. బీదకు వ్యతిరేక వర్గాన్ని కూడదీయడంతోపాటు ఇకపై బీద మాట వినాల్సిన అవసరం లేదని, అంతా తన కనుసన్నల్లోనే జరుగుతుందనే సంకేతాలను కూడా ఆ పార్టీ కార్యకర్తల్లోకి పంపారు. కావ్య కృష్ణారెడ్డి ముందుగానే పార్టీ ఫండ్ పేరుతో రూ.కోటి విరాళం ఇచ్చారు. అంతేకాక ఏకంగా రూ.20 కోట్లు పార్టీ ఫండ్ కింద జమ చేసి మరో రూ.50 కోట్లు ఇచ్చే దానికై నా సిద్ధంగా ఉన్నానని సంకేతం పంపి లోకేశ్ వద్ద మార్కులు కొట్టేసి టికెట్ ఖరారు చేయించుకున్నారని తెలుస్తోంది. అడ్డదారులు తొక్కుతూ.. సుమారు పాతికేళ్ల క్రితం కామర్స్ అధ్యాపకుడిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి తాను నివాసం ఉండే ఇంటికి అద్దె చెల్లించలేని స్థితి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రూ.వేల కోట్లకు అధిపతి అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే మైనింగ్ డాన్గా ఎదిగారు. అడ్డగోలుగా ఎదిగిన కావ్య కృష్ణారెడ్డి అందించిన డబ్బు సంచులకు సాగిలపడిన టీడీపీ ఆయనకు కావలి సీటు ఖరారు చేయడంపై ఆ పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పదవి పేరుతో ముంచేసి.. మండలస్థాయి నేతగా ఉన్న తనను కావలి నియోజకవర్గ ఇన్చార్జి పదవి పేరుతో ముంచేశారని మాలేపాటి సుబ్బానాయుడు తన అంతరంగీకుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన మాలేపాటిని కావలి సీటు పేరుతో బీద ఊరించి అతని చేత ఖర్చు పెట్టించారని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అతనిని నట్టేట ముంచారని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
Kavya Gowda Baby Shower Pics: వైభవంగా కన్నడ నటి కావ్య గౌడ సీమంతం (ఫోటోలు)
-
కిక్కెక్కుతోందే జన్మ...
సందీప్ కిషన్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నా వల్ల కాదే బొమ్మ.. నీ కళ్లు చూస్తే అమ్మా.. కిక్కెక్కుతోందే జన్మ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, తిరుపతి జావన లిరిక్స్ అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ఈ సినిమాకు సహనిర్మాత: బాలాజీ గుత్తా. -
ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం!
సాక్షి, మహబూబ్నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు బలవంతంగా మాత్రలు మింగించి కడతేర్చాడో భర్త. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్ వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శివకావ్య (26) బీటెక్ చదువుతున్న సమయంలో స్థానిక బీసీకాలనీకి చెందిన వడ్ల భరత్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు అన్విధ్ ఉన్నాడు. కట్నం కోసం శివకావ్యను వేధించడంతో రెండు పర్యాయాలు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది, అయినప్పటికీ ఇంకా డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శివకావ్య గర్భం దాల్చింది. డబ్బులు ఇచ్చేంత వరకు పిల్లలను కనేదిలేదని చెబుతూ 45 రోజుల కిందట భార్యతో బలవంతంగా మాత్రలను మింగించాడు. అవి వికటించడంతో శివకావ్య తీవ్ర అనారోగ్యానికి గురైంది. పలు ప్రవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా కోలుకోకపోవడంతో తల్లిదండ్రులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఆరెకటిక కిషన్జీ ఫిర్యాదు మేరకు వడ్ల భరత్, వేణుగోపాలాచారి, శారద ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం! -
చిన్నారి 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు'! మంత్రి హరీశ్రావు అభినందన!!
సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మూడేళ్ల ఐదు నెలల వయసు ఉన్న అరుషి తన అద్భుత మేథాశక్తితో ఔరా అనిపిస్తుంది. బుడిబుడి అడుగులు వేస్తూ, ముద్దులొలికించే మాటలతో బుజ్జిగా కనిపించే చిన్నారి అరుషి ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 5 సెకన్ల సమయంలోనే చకాచకా చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. పట్టణానికి చెందిన సురేశ్, కావ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు అరోహి గౌడ, అరుషి గౌడ ఉన్నారు. తండ్రి బేకరీ షాపు నిర్వహిస్తుంటాడు. తల్లి కావ్య ఇంటి వద్ద ఉంటుంది. ఈ ఇద్దరు చిన్నారులు మేథస్సులో దిట్ట. చిన్న పాప అరుషి గౌడ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. అరుషి జ్ఞాపక శక్తిని గుర్తించిన తల్లి ఏదో ఒక అంశంలో ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాలని సంకల్పించింది. ప్రతీరోజు 5 దేశాల రాజధానులపై శిక్షణ.. చిన్నారి అరుషిగౌడకు తల్లి కావ్య ప్రతీ రోజు ఐదు దేశాలకు సంబంధించిన రాజధానుల పేర్ల గురించి ఆడుకునే సమయంలో, అన్నం తినేటప్పుడు ప్రాక్టీస్ చేయించేది. నెలన్నరలో 195 దేశాల రాజధానుల పేర్లు అతి తక్కువ సమయంలో సునాయసంగా చెప్పేలా కంఠస్తం చేయించింది. ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఆ ప్రొసీజర్ను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంది. వెంటనే మూడేళ్ల 5 నెలల అరుషిగౌడతో 195 దేశాల రాజధానుల పేర్లు 5 నిమిషాల 5 సెకన్లలో చెప్పేలా ఆన్లైన్ యాప్ ద్వారా వీడియోను చిత్రీకరించి రికార్డు చేసింది. ఆ వీడియోను ఢిల్లీలోని ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు జూలై 31న పంపించారు. ఢిల్లీ కార్యాలయంలో ముగ్గురు జడ్జిల సమక్షంలో ఆ వీడియోను పరిశీలించారు. అరుషిగౌడ ప్రతిభకు గిన్నిస్ బుక్లో చోటు దక్కినట్లు చీఫ్ ఎడిటర్ డాక్టర్ బైస్వారూప్ రాయ్ చౌదరి ఆగస్టు 7న ప్రకటించారు. ఈ విషయాన్ని ఫోన్, మెయిల్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇటీవల ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు (2023) పుస్తకం, మెడల్, ప్రశంసా పత్రాలను అరుషి గౌడ తల్లిదండ్రుల అడ్రస్కు పోస్ట్ ద్వారా పంపించారు. పెద్ద కూతురు కూడా.. సురేష్, కావ్య దంపతుల పెద్దకూతురు అరోహిగౌడ సైతం మేథస్సులో దిట్ట. ఆ చిన్నారి సైతం 2021లో మూడెళ్ల 9 నెలల వయస్సులో ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 30 సెకన్లలో చెప్పి ఇండియన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. అలాగే భారత దేశంలోని 28 రాష్ట్రాల పేర్లను 1 నిమిషం, 28 సెకండ్లు, ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లను 4 నిమిషాల్లో చెప్పి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.. పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తిస్తే ఏదైనా సాధించగలుగుతారు. మాకు ఇద్దరు ఆడపిల్లలని ఏనాడూ బాధపడ లేదు. వీరిద్దరూ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడం సంతోషంగా ఉంది. – సురేష్, కావ్య దంపతులు, హుస్నాబాద్ మంత్రి హరీశ్రావు అభినందన.. అరుషి గిన్నిస్ బుక్లో స్థానం పొందడం పట్ల ఈ నెల 4న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్లు అరుషిగౌడను అభినందించి సన్మానించారు. భవిష్యత్లో ఇంకా ఎన్నో మెడల్స్ను గెలుచుకోవాలని వారు ఆకాంక్షించారు. -
స్వీయ దర్శకత్వంలో నచ్చినవాడు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
దర్శకుడిగా, హీరోగా లక్ష్మణ్ చిన్నా స్వీయ దర్శకత్వంలో తొలిసారిగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'నచ్చినవాడు'. ఈ చిత్రంలో కావ్య రమేశ్ అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. 'నా మనసు నిన్ను చేర' అనే లవ్ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి మిజో జోసెఫ్ సంగీతమందించారు. ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ‘రుద్రమాంబపురం’పై మంత్రి తలసాని ప్రశంసలు) లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ..' నచ్చినవాడు మూవీ మహిళల ఆత్మ గౌరవమే కథాంశంగా చేసుకుని తెరకెక్కించి ప్రేమ కథా చిత్రం. హాస్యానికి పెద్దపీట వేశాం. నేటి యూత్కు కావాల్సిన ప్రతి అంశాన్ని చూపించాం. త్వరలోనే చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. కర్ణాటక, పాండిచ్చేరిలోని బ్యూటిఫుల్ లొకేషన్స్లో పాటలు చిత్రీకరించామని తెలిపారు. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చుతుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. (ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్) -
లోకేశ్ యాత్రలో బీద జ్యోతి ఎంట్రీతో అయోమయం
కావలి టీడీపీ ఆది నుంచి చుక్కాని లేని నావలా ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కావలిలో గెలిచింది. జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి మాత్రమే అత్తెసరు ఓట్లతో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి ఆ పార్టీ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో పార్టీని నడిపించేందుకు బీద రవిచంద్ర రాజకీయ డ్రామాకు తెర తీశారు. నాలుగేళ్లుగా పార్టీని నడిపించేందుకు మాలేపాటిని వాడుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి పార్టీకి ఫండ్ ఇప్పించి కావ్యను ఊరించారు. చివరికి రవిచంద్ర భార్య జ్యోతిని ఎంట్రీ చేయించి ట్విస్ట్ ఇచ్చాడు. తాజా పరిణామాలు ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. నేటి లోకేశ్ బహిరంగ సభకు జన సమీకరణపై అయోమయం నెలకొంది. నెల్లూరు: ఉనికి కోల్పోయిన టీడీపీని బతికించాలని లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రతో కావలిలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తోంది. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో బీద సోదరులు రాజకీయంగా లైమ్లైట్లోకి వచ్చారు. టీడీపీలో బీద మస్తాన్రావు అండతో ఆయన సోదరుడు బీద రవిచంద్ర రాజకీయంగా ఎదిగాడు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ విజయాలను తన విజయాలుగా భ్రమింపచేశారు. 2009లో బీద మస్తాన్రావు ఎమ్మెల్యే అయినప్పటికీ వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై ఉండడంతో బీద రవిచంద్ర కావలిలో షాడో ఎమ్మెల్యేగా హడావుడి చేశాడు. ఆ సమయంలోనే రవిచంద్ర నియోజకవర్గంలో తన కోటరీని సృష్టించుకున్నాడు. కావలి టికెట్పై ఆశలు పెంచుకుని 2014 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే టికెట్ తన సోదరుడు బీద మస్తాన్రావుకే ఇవ్వడంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని హామీ ఇవ్వడంతో మిన్నకుండిపోయాడు. ఆ ఎన్నికల్లో బీద మస్తాన్రావు ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా తన సతీమణిని బరిలోకి దింపాలని తెరవెనుక రాజకీయం నెరిపినా.. చివరికి మస్తాన్రావు తన పలుకుబడి ఉపయోగించి కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డిని బరిలోకి దింపడంతో రవిచంద్ర ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత బీద మస్తాన్రావు, విష్ణువర్ధన్రెడ్డి పార్టీకి దూరం కావడంతో కావలి బాధ్యతలను రవిచంద్రకు అప్పగించారు. 2019లో ఓటమి తర్వాత.. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడం, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఈ దశలో పార్టీని నడిపించేందుకు మాలేపాటిని కావలి నియోజవకర్గ ఇన్చార్జిగా నియమించి రాబోయే ఎన్నికల్లో టికెట్ నీదేనంటూ నాలుగేళ్లుగా వాడుకున్నాడు. అయినప్పటికీ పెత్తనమంతా బీద తన చెప్పు చేతుల్లోనే పెట్టుకున్నాడు. కావ్యకు టికెట్ ఆశలు తన జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కాకపోయినా.. కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిని అనిపించుకోవాలని తహతహలాడుతున్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ( కావ్య కృష్ణారెడ్డి) ఈ పార్టీ.. ఆ పార్టీ అని తేడా అన్ని పార్టీల్లో ప్రయత్నించారు. ఇతను అయితే పార్టీకి ఉపయోగపడుతాడు.. చివరి వరకు వాడుకోవచ్చునని పార్టీ పెద్దలతో మాట్లాడించి అతనికి టికెట్ ఆశలు రేపాడు. దీంతో కావ్య కృష్ణారెడ్డి చేత పార్టీకి మహానాడులో ఫండ్ ఇప్పించాడు. కావలి టికెట్ తనకే అంటూ ఇటు మాలేపాటి, అటు కావ్య ఇద్దరూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నా.. అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. యువగళంలో బీద సతీమణి ఎంట్రీ ట్విస్ట్ కావలిలో లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయడానికి రవిచంద్ర పెట్టిన సమావేశంలో మాలేపాటి సుబ్బానాయుడు అంతా భారం తనపైనే వేయాలని, ఏ ఒక్కరిని భాగస్వామ్యం చేయొద్దని ఖరాఖండిగా చెప్పారు. లోకేశ్ పాదయాత్ర ఏర్పాట్లు, ఖర్చు అంతా కూడా మాలేపాటి చూసుకుంటారు, ఎవరూ ఎక్కడా జోక్యం చేసుకోవద్దని నాయకులకు చెప్పేశాడు. దీంతో వీరిద్దరూ సైలెంట్ అయిపోయారు. లోకేశ్ యాత్ర కావలి నియోజకవర్గంలోకి అడుగుపెట్టే సమయానికి కాలు బాధతో రెస్ట్లో ఉన్న బీద తన సతీమణి జ్యోతిని ఎంట్రీ చేయించారు. లోకేశ్ యాత్రలో ఆమె అంతా తానై వ్యవహరిస్తుండడంతో అంతా అయోమయం నెలకొంది. గతంలోనే తన సతీమణికి టికెట్ ఇప్పించుకోవాలని చూశారు. కావ్య, పసుపులేటి కేవలం టికెట్ ఇస్తేనే ఉంటారు.. లేదంటే బయటకు పోతారు. కానీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రవిచంద్రను కాదని మరెవరికి టికెట్వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తన సతీమణిని రంగంలోకి దింపడానికే యువగళంలో బీద జ్యోతిని ఎంట్రీ ఇప్పించాడని ప్రచారం. అయితే సోమవారం కావలిలో లోకేశ్ బహిరంగ సభకు జన సమీకరణకు ఉత్సాహంగా ఉన్న నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. నేటి లోకేశ్ సభ పరిస్థితిపై అయోమయం నెలకొంది. -
మైనింగ్ డాన్ కావ్య కృష్ణారెడ్డికి ముకుతాడు
పాతికేళ్ల క్రితం అతనో కామర్స్ అధ్యాపకుడు. తాను ఉండే ఇంటికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. జలదంకి ఎంపీపీగా ఎన్నికై మైనింగ్ డాన్గా ఎదిగాడు. రియల్ ఎస్టేట్ నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయనే గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి. ఇన్నాళ్లు తెరచాటుగా సాగిస్తున్న అతని అవినీతి బాగోతం ఇటీవల సమాచారహక్కు చట్టంతో బయటపడింది. ‘స్పందన’ ఫిర్యాదుతో వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వం అతని అక్రమాలపై విచారణ జరిపి రూ.140 కోట్ల జరిమానా విధించి ఆ మైనింగ్ డాన్ దురాగతాలకు ముకుతాడు వేసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జలదంకి మండలానికి చెందిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి 2008లో రోడ్డు మెటల్ పేరుతో లీజుకు తీసుకున్న క్వారీలే అడ్డాగా సమీపంలోని అనధికార భూముల్లో మెటల్ తవ్వేసి వందల కోట్ల రూపాయల దోపిడీకి తెరతీశాడు. పదేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకుని గడువు ముగిసి ఐదేళ్లు దాటిపోయినా యథేచ్ఛగా మైనింగ్ చేస్తున్నాడు. క్వారీ మైనింగ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్లు, కూలీల నివాసాలు, పెట్రోల్ బంకుల వంటివి ఏర్పాటు చేశాడు. అక్రమాలను తరచి చూస్తే.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరు మీద డీవీ కృష్ణారెడ్డి, డి.కవిత పేరుతో జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వేనంబర్ 1015లో 9.47 ఎకరాల భూమిని రోడ్డు మెటల్ తవ్వకానికి పదేళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందాడు. అదే మండలం అన్నవరంలో సర్వేనంబర్ 851/2పీలో 5.36 ఎకరాల భూమిని రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో రోడ్డు మెటల్ తవ్వకానికి 10 ఏళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందాడు. అయితే గట్టుపల్లి క్వారీలో టన్ను మెటల్ కూడా తవ్వకుండా అక్కడే క్రషర్లు, పెట్రోల్ బంకు, కూలీల నివాస భవనాలు, కార్యాలయం వంటివి ఏర్పాటు చేశాడు. అయితే ఈ క్వారీ నుంచి 28 వేల క్యూబిక్ మీటర్ల మెటల్ రవాణాకు పర్మిట్లు జారీ చేయడం గమనార్హం. ఈ క్వారీకి సంబంధించి పదేళ్ల లీజు కాలపరిమితి 2018 ఫిబ్రవరి 25వ తేదీ నాటికే పూర్తయితే 15 ఏళ్ల లీజు కాలపరిమితి పెంచమని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది మైనింగ్శాఖ వద్ద పరిశీలనలో ఉండడంతో ఆ లీజు కొనసాగుతూనే ఉంది. గట్టుపల్లి క్వారీ పక్కనే ఉన్న ఇతరుల భూములు, ప్రభుత్వ భూముల్లో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను అక్రమంగా తవ్వేసినట్లు ఇటీవల మైనింగ్శాఖ తనిఖీల్లో బట్టబయలైంది. అన్నవరం క్వారీకి లీజు గడువు పెంచమనే అభ్యర్థనను కూడా మైనింగ్ శాఖ తిరస్కరించింది. అన్నవరం క్వారీతోపాటు పక్కనే ఉన్న భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేపట్టి 5 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను తవ్వేసినట్లు వెలుగుచూసింది. ఈ క్వారీ లీజు గడువు ముగిసినప్పటికీ గత ఐదేళ్లుగా గట్టుపల్లి క్వారీ పరి్మట్తోనే విచ్చలవిడిగా మైనింగ్ చేపట్టాడు. మొత్తంగా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను అక్రమంగా తవి్వనట్లు మైనింగ్ శాఖ లెక్కలు తేల్చింది. అక్రమంగా తవ్వేసిన మెటల్ విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.200 కోట్లు ఉంటుందని, మార్కెట్ ధర ప్రకారం రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై స్థానికులు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా సదరు వ్యక్తులు ‘స్పందన’లో ఫిర్యాదు చేయడంతో అక్రమాల బాగోతం బయటపడింది. కరెంట్ బిల్లు ఆధారంగా.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్, రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో తీసుకున్న లీజు క్వారీల్లో అక్రమ మైనింగ్ జరగలేదని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. క్రషర్లకు వినియోగించిన కరెంట్ బిల్లుల ఆధారంగా లెక్కలు తీయగా, 89 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగించినట్లు తేలింది. టన్ను మెటల్ ప్రాసెస్ చేయడానికి 2.5 యూనిట్లు ఖర్చవుతుందని, ఆ మేరకు 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను అక్రమంగా తవ్వేసినట్లు నిర్ధారించారు. చితికిన ప్రాణాలు అక్రమ మైనింగ్ వాహనాల కింద పడి పదేళ్ల కాలంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. నిత్యం వందలాది వాహనాల్లో రోడ్మెటల్ నుంచి పెద్ద బండరాళ్లు, కంకర, మట్టి లాంటి సహజ వనరులను లూటీ చేశారు. ఈ అక్రమ రవాణా వాహనాల కిందపడి పలువురు ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి కేసులు లేకుండా భయపెట్టి రాజీచేసి పంపించేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనధికార బ్లాస్టింగ్లు చేస్తూ ఊరినే వణికిస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులను ప్రలోభపెట్టి.. అక్రమ మైనింగ్కు స్థానిక రెవెన్యూ, పోలీస్, మైనింగ్శాఖల సహకారం ఉన్నట్లు ఆ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని అక్రమ మైనింగ్పై ఎన్నోమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. ఈ అక్రమాల గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడంతోపాటు ఇళ్లకు వెళ్లి బెదిరించేవారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా మధ్యస్తం చేసి పంపేవారని స్థానికులు పేర్కొంటున్నారు. గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లతో.. డీవీ కృష్ణారెడ్డి అక్రమాల దందా ఈనాటి కాదు. కొన్నేళ్ల క్రితమే నెల్లూరు పెన్నానది, నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీతీరంలో గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్కు కంకర, సిమెంట్ కొనుగోలు చేసినా.. ఇసుకను మాత్రం నదీ తీరాల్లోనిదే వాడినట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్ల నుంచి నిత్యం వందల ట్యాంకర్ల కాంక్రీట్ మిక్సింగ్ వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. గతంలో ఇసుక ఉచితంగా ఉండడంతో రూపాయి ఖర్చు లేకుండా నదీతీరాలను తవ్వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ అమలు చేసి ధర నిర్ణయించింది. అయితే గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లలో ఈ నాలుగేళ్లలో ఎంత ఇసుక వినియోగించారు.. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలను పరిశీలిస్తే అందులోని అక్రమాలు కూడా బట్టబయలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు క్రషర్ల వద్ద కరెంట్ వినియోగాన్ని లెక్కిస్తే మరికొన్ని నిజాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ యజమాని డీవీ కృష్ణారెడ్డి ఎన్నో ఏళ్లుగా సహజ వనరులను దోచుకుంటున్నాడు. అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించాడు. మా గట్టుపల్లి పంచాయతీలో సహజ వనరులు దోచుకుంటున్నా ఒక్క రూపాయి కూడా పంచాయతీకి సీనరేజ్ చెల్లించేవాడు కాదు. అతని అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నా. అక్రమాలను ప్రశ్నించినందుకు మా కుటుంబంపై దాడులు చేయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా తొమ్మిదేళ్ల పోరాటానికి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం మద్దతుగా నిలిచింది. విచారణ జరిపి జరిమానా విధించడం ద్వారా అక్రమ మైనింగ్కు అడ్డుకట్టపడింది. – గుమ్మలపాటి సుబ్బారావు, ఉప సర్పంచ్, గట్టుపల్లి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ ద్వారా గట్టుపల్లి పంచాయతీలో దోపిడీ చేస్తున్నారు. అనుమతు లు లేకుండా సహజ వనరులను దోచుకుంటున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామస్తులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. – దివి నరేంద్రచౌదరి, గట్టుపల్లి, జలదంకి మండలం -
నర్సింగ్ విద్యార్థి కావ్య ఆత్మహత్య
ఖమ్మంక్రైం: ఖమ్మంలో ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన కోడెం కృష్ణ – రమాదేవి రెండో కుమార్తె కావ్య(19) ఖమ్మంలోని పారా మెడికల్ కాలేజీలో నర్సింగ్ (ఏఎన్ఎం) చదువుతోంది. ఖమ్మం, బీకే బజార్లోని ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తూ స్నేహితురాలు సీతామహాలక్ష్మితో కలిసి అద్దె గదిలో ఉంటోంది. అయితే, మంగళవారం నైట్ డ్యూటీకి వెళ్లి వచ్చిన ఆమె బుధవారం ఉదయం నిద్రపోయింది. స్నేహితురాలు సీతామహాలక్ష్మి విధులకు వెళ్లింది. తరువాత కావ్య మరో స్నేహితురాలు తనుశ్రీ వచ్చి కాసేపు మాట్లాడి తిరిగి కిందకు వెళ్తుండగా పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగిందోనని తనుశ్రీ వెళ్లి చూడగా కావ్య ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవడంతో వచ్చి కిందకు దించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. తాను మాట్లాడినప్పుడు కావ్య నీరసంగా ఉందని తనుశ్రీ తెలిపింది. ఘటనకు ముందు కావ్య తనకు ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పిందని తల్లి రమాదేవి వెల్లడించింది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంది. తల్లి ఫిర్యాదుతో ఖమ్మం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ -
అనుబంధాలు గుర్తుకొస్తాయి
‘‘తెలంగాణకి చెందిన పల్లెటూర్లో జరిగే కథ ‘బలగం’. మా సినిమా చూస్తే కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. వేణు చక్కగా తీశాడు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. ప్రియదర్శి, కావ్య, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్లో వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్, హన్షిత నిర్మించారు. -
జడలు విప్పుతున్న వికృత హింస.. చుట్టూ పరిస్థితులు మారాలి
ఇటీవల హైదరాబాద్లోని ఓ పాఠశాలలో ముక్కు పచ్చ లారని చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. దీనిని చూస్తుంటే ఆడ పిల్లలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా లైంగిక దాడికి గురయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. జడలు విప్పుతున్న ఈ వికృత అమానవీయ హింస ఆడ పిల్లల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లైంగిక దాడులకు ప్రేరేపించే సంస్కృతి మన చుట్టూ విశృంఖల స్థాయిలో విస్తరిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... లైంగిక దాడులు కొనసాగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రక్త సంబంధీకులు, టీచర్లు, డ్రైవర్లు... ఇలా మన చుట్టుపక్కల ఉండే మనకు పరిచయం ఉన్నవారూ, లేనివారి రూపాల్లో లైంగికదాడులు పొంచి ఉంటున్నాయి. ఈ ఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో పలుకుబడి ఉన్న నిందితులు బెదిరించడం వల్ల చాలామంది బాధిత కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ భయపడుతున్నారు. అలాగే లైంగిక దాడి సంగతి బయటికి తెలిస్తే పరువు పోతుందన్న భయం భారతీయ సమాజంలోని తల్లిదండ్రులకు సహజంగానే ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పు కోలేక తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. అటువంటి కుటుంబాలపై దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉంది. అందుకే బాధిత కుటుంబాలు వెంటనే పోలీస్ సహాయం పొందాలి. చిన్నపిల్లల విషయంలో ఆడ, మగ అన్న తేడాను చూపించకుండా ఇద్దరిపైనా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రూరులు మరో అడుగు ముందుకువేసి చైల్డ్ సెక్స్, చైల్డ్ పోర్నోగ్రఫీల రూపంలో ఈ భయంకర సంస్కృతిని ఇంటర్నెట్లో పెట్టి డబ్బు చేసుకునే పనీ చేస్తున్నారు. అంటే వీళ్లు ఈ అసాంఘిక, అమానవీయ కార్యకలాపాలను ‘మార్కెట్ సరుకు’గా మార్చేశారన్న మాట. ‘వర్జిన్ సెక్స్’ పేరుతో టీనేజ్ పిల్లలపై లైంగికదాడులు చేస్తూ అంతర్జాలంలో ఆ వీడియోలు వైరల్ చేసి డబ్బులు సంపాదించడం ఇందులో భాగంగానే చూడాలి. ఈ దాడులకు గురైన పిల్లలు క్రమంగా సెక్స్ వ్యాపారం ఊబిలో కూరుకుపోయి జీవితాలను కోల్పోతున్నారు. ఆధునిక యాంత్రిక ప్రపంచంలో తల్లిద్రండులు పిల్లలకు పట్టించుకునే తీరిక లేకపోవడం వల్ల నేరస్థులు పిల్లలను ట్రాప్ చేయగలుగుతున్నారు. అలాగే పిల్లలకు సెల్ఫోన్ అందుబాటులో ఉండటం వల్ల అన్నీ చూసే అవకాశం ఏర్పడుతోంది. మాదక ద్రవ్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా వారు దారితప్పుతున్నారు. టీవీల్లో ప్రసారం అవుతున్న కంటెంట్ కూడా ఈ దురాగతాలకు కారణమవుతున్నది. ఈ పరిస్థితి మారాలంటే పాఠశాల స్థాయిలోనే మోరల్ సైన్స్ క్లాస్లను తప్పని సరిగా విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ల గురించిన అవగాహన పిల్లలకు కల్పించాలి. పిల్లలపై లైంగిక దాడుల నియంత్రణ, వాటిని ఎదుర్కోవడానికి రూపొందించిన ‘పోక్సో’ తరహా చట్టాల పట్ల అవగాహన కూడా సమాజాన్ని అప్రమత్తం చేయటంలో ఉపకరిస్తాయి. (క్లిక్ చేయండి: ఆపన్నులకు ఫ్యామిలీ డాక్టర్ భరోసా) - డా. కడియం కావ్య కడియం ఫౌండేషన్ ఛైర్పర్సన్ -
అప్పుడు చైల్డ్ఆర్టిస్ట్.. ఇప్పుడేమో హీరోయిన్ రేంజ్ (ఫొటోలు)
-
అడవుల్లో ఉండిపోయింది
‘ఒక సమయం వస్తుంది. ఈ నగరాలకు దూరం వెళ్లిపోవాలనిపిస్తుంది. కాకుంటే నేను ఆ పిలుపు ముందు విన్నాను’ అంటుంది 35 కావ్య. నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల రంగంలో పని చేసిన కావ్య గత పదేళ్లుగా సెలవుల్లో భారతీయ పల్లెలను తిరిగి చూస్తూ తన భవిష్యత్తు పల్లెల్లోనే అని గ్రహించింది. ‘ఒరిస్సా అడవులకు మారిపోయాను. ఈ ఆదివాసీల కోసం పని చేస్తాను’ అంటోంది కావ్య. ఆమెలా బతకడం ఎందరికి సాధ్యం. చుట్టూ దట్టమైన అడవులు. అమాయకంగా నవ్వే ఆదివాసీలు. స్విగ్గి, జొమాటో, అమెజాన్ల గోల లేకుండా దొరికేది తిని సింపుల్గా జీవించే జీవనం, స్వచ్ఛమైన గాలి, స్పర్శకు అందే రుతువులు... ఇంతకు మించి ఏం కావాలి. నగరం మనిషి సమయాన్ని గాయబ్ చేస్తోంది. మరో మనిషిని కలిసే సమయం లేకుండా చేస్తుంది. కాని పల్లెల్లో? సమయమే సమయం. మనుషుల సాంగత్యమే సాంగత్యం. ‘ఆ సాంగత్యం అలవాటైన వారు అడవిని వదల్లేరు’ అంటుంది కావ్య సక్సెనా. 35 ఏళ్ల కావ్య ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ల సరిహద్దులో ఉండే కోరాపుట్ ప్రాంతంలో సెటిల్ అయ్యింది. ఒక్కత్తే. అక్కడి పల్లెల్లో ఆమె నివాసం. ఆ ఊరివాళ్లే ఆమె మనుషులు. అక్కడి ఆహారమే ఆమె ఆహారం. కాని ఆ జీవితం ఎంతో బాగుంటుంది అంటోంది కావ్య. నోయిడా నుంచి జైపూర్లో జన్మించిన కావ్య చదువు కోసం అనేక ప్రాంతాలు తిరిగింది. కొన్నాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పని చేసింది. ఆ తర్వాత నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల కార్పొరెట్ సంస్థకు మారింది. అయితే ఎక్కడ పని చేస్తున్నా పల్లెలను తిరిగి చూడటం ఆమెకు అలవాటు. ‘అందరూ అందమైన బీచ్లను, టూరిస్ట్ ప్లేస్లను చూడటానికి వెళతారు. నేను కేవలం పల్లెటూళ్లు చూడటానికి వెళ్లేదాన్ని. పల్లెల్లో భిన్నమైన జీవితం ఉంటుంది. అది నాకు ఇష్టం’ అంటుంది కావ్య. అయితే 2020లో వచ్చిన లాక్డౌన్ ఆమె కాళ్లకు బేడీలు వేసింది. అక్టోబర్లో ఆంక్షలు సడలింపు మొదలయ్యాక ‘మహీంద్రా’ వారితో కలిసి ‘కావ్యాఆన్క్వెస్ట్’ అనే సోలో ట్రిప్కు బయలుదేరింది. దీని ఉద్దేశ్యం పల్లెల్లో ఉండే హస్తకళలను డాక్యుమెంట్ చేయడమే. ఆ దారిలో ఆమె అనేక పల్లెల్లో గ్రామీణులు, ఆదివాసీలు చేసే హస్తకళలను గమనించింది. ‘కాని వాటిని మార్కెట్ చేసే ఒక విధానం మన దగ్గర లేదు. పల్లెల్లోని ఉత్పత్తులకు పట్నాల్లోని మార్కెట్కు చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను పూడ్చాలి అనిపించింది’ అంది కావ్యా. ఇక ఆమెకు జీవిత గమ్యం అర్థమైంది. ‘నగరానికి తిరిగి వచ్చాక నాకు ఊపిరి ఆడలేదు. జూలై 2021లో ఇక నేను శాశ్వతంగా నగరానికి వీడ్కోలు చెప్పేశాను. ఒరిస్సాల్లోని ఈ అడవులకు వచ్చి ఉండిపోయాను’ అంటుంది కావ్య. క్రాఫ్ట్ టూరిజం ఇది కొత్తమాటగా అనిపించవచ్చు. కాని హస్తకళలు ఉన్న గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా ప్రోత్సహించడమే క్రాఫ్ట్ టూరిజం. కావ్య ఇప్పుడు కోరాపుట్ ప్రాంతంలోని నియమగిరి కొండల దగ్గర నివశిస్తోంది. ఆ ప్రాంతంలో డోంగ్రియా తెగ ఆదివాసీలు ఎక్కువ. ‘వారు గడ్డితో చాలా అందమైన వస్తువులు చేస్తారు. అవి బాగుంటాయి. అంతేకాదు వారు 47 రకాల బియ్యాన్ని పండిస్తారు. వారి వంటలు మధురం. అవన్నీ నగరాల్లో ఎక్కడ తెలుస్తాయి. ఈ తెగవారు ‘కపడగంధ’ అనే శాలువాను అల్లుతారు. అది చాలా బాగుంటుంది. చెల్లెలు శాలువా అల్లి అన్నకు ఇస్తే అన్న తాను వివాహం చేసుకోదలిచిన అమ్మాయికి దానిని బహుమతిగా ఇస్తాడు. ఆ శాలువాలకు మంచి గిరాకీ ఉంది’ అంటుంది కావ్య. అయితే గ్రామీణ హస్తకళల ఉత్పత్తుల పేరుతో మార్కెట్లో డూప్లికేట్లు ఉండటం గురించి ఆమెకు బెంగ ఉంది. ‘ఒరిజినల్ ఉత్పత్తులను కస్టమర్లకు అందించడానికి ‘క్రాఫ్ట్ పోట్లీ’ అనే సంస్థ స్థాపించి పని చేస్తున్నాను. ఒక గ్రామాన్ని నా వంతుగా దత్తత చేసుకున్నాను. ఆ గ్రామంలో ఉండే 50 మంది మహిళలకు హస్తకళల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాను’ అంది కావ్య. ఈమె చేస్తున్న పని చూసి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ హస్తకళల ప్రమోషన్కు ఆహ్వానించింది. అక్కడి ఆదివాసీలను తరచూ కలిసి వస్తోంది కావ్య. త్వరలో ఆమె దేశంలోని అందరు ఆదివాసీలను ఒక ప్లాట్ఫామ్ మీదకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందరో మహానుభావులు అని మగవాళ్లను అంటారు. కాని ఎందరో మహా మహిళలు. కావ్య కూడా ఒక మహా మహిళ. -
ప్రేయసితో యంగ్ హీరో ఎంగేజ్మెంట్.. ఫోటో వైరల్
యంగ్ హీరో నాగ అన్వేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో నాగ అన్వేష్ నిశ్చితార్థం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడకకు ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా గత కొన్నాళ్లుగా నాగ అన్వేష్, కావ్య ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి. నాగ అన్వేష్ తండ్రి ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అన్న విషయం తెలిసిందే. -
మానసిక ఆరోగ్యం మనకాలపు అవసరం
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్– 19 మహమ్మారి ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల లోనే కాకుండా మానసిక సంక్షోభాన్ని కూడా తెచ్చి పెట్టింది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్లయిన వైద్య సిబ్బంది, పోలీస్, శానిటేషన్ సిబ్బందితో పాటు ఒంటరిగా జీవించేవారిని మరింత కృంగదీసింది. అభివృద్ధి చెందుతున్న భారత్లాంటి దేశాలలో 6–7% ప్రజలు మానసిక వ్యాధులతో సతమతమవు తున్నారు. వారు కోల్పోయే ఆరోగ్యవంతమైన రోజులు మలేరియా, టీబీ, డయేరియా కన్నా ఎక్కువే. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001 రిపోర్టు, ప్రతి నాలుగు కుటుంబాలలో ఒక కుటుంబంలోని సభ్యులు ప్రవ ర్తనా సంబంధిత రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ రుగ్మతలు వీరి విద్య, ఉపాధి మార్గాలను దెబ్బకొట్టడమే కాకుండా, వీరి కుటుంబ సభ్యుల పైన కూడా ప్రభావం చూపుతాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్య పరిరక్షణకు కూడ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. దీనికి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఒక సందర్భం చేసుకోవాలి. ఈ 2021 థీమ్ను ‘మెంటల్ హెల్త్ ఇన్ ఆన్ అన్ఈక్వల్ వరల్డ్’గా ప్రకటించారు. మానసిక ఆరోగ్య సేవలు అందించడంలో ఎలాంటి అసమానతలు ఉండకూడ దని ఈ థీమ్ ముఖ్యోద్దేశం. ఎందుకంటే బాధితుల్లో 75–95 శాతం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. వీరంతా వైద్యానికి ఆమడదూరంలో ఉన్నారు. ధనిక దేశాలలోనూ సేవలు ఆశాజనకంగా లేవు. దీనికి కారణం, ‘ఆరోగ్య బడ్జెట్’లోని నిధులలో మానసిక ఆరోగ్య సేవలకు కేటాయించేవి అత్యల్పం కావడం. చాలా కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి, అనేక ఆర్థిక ఇబ్బందులతోపాటు ఆ తరువాత జరిగిన పలు పరిణామాలకు తీవ్ర నైరాశ్యానికి గురయ్యాయి. లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోవడం, సామాజిక దూరం పాటిస్తూ ఉండటం, ఇంటి నుండి పనులు చేయడం వలన కూడ కొందరిలో డిసోసియేటివ్, సైకోటిక్, హైపోకాండ్రి యాక్ లక్షణాలు కనిపించ డంతో పాటు, ఓసీడీలతో కూడా సతమతవుతున్నారు. మానసిక వైద్యుడిని సంప్రదించడానికి నిరాసక్తతతో పాటు, మానసిక వ్యాధులను ఒక కళంకంగా భావించడం వలన వ్యాధి తీవ్రత పెరిగి ఆత్మహత్యా ప్రయత్నాల వరకు వెళ్ళుతున్నారు. కరోనాను అధిగ మించడం కోసం ఎంచుకున్న లాక్డౌన్ల వలన ఈ మానసిక రుగ్మతలు కౌమారదశ వారిలో అధికంగా బయటపడుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించేలా ‘మెంటల్ హెల్త్ డే’ నాడు లోకల్గానూ, గ్లోబల్గానూ యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. సివిల్ సొసైటీలుగా ఏర్పడి, వారి ప్రాంతంలో మానసిక వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి, వారి గురించి అందుబాటులో ఉండే పీహెచ్సీ, ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం అందించే విధంగా అవగాహన కలిగించాలి. మొదట సమస్యను గుర్తించి, దాని గురించి బయట చెప్పుకొనే విధంగా ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం 1982లో ‘నేషనల్ మెంటల్ హెల్త్ మిష న్’ను ఏర్పాటు చేసింది. ‘బళ్ళారీ మోడల్’ నమూ నాతో ‘డిస్ట్రిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్’ ఆవిష్కరించి మొదట నాలుగు జిల్లాలతో మొదలుపెట్టి వంద జిల్లాలలో అమలు చేయడానికి ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా కమ్యూనిటీ స్థాయి నుండి సమాజం పాత్ర ఉండేలాగ, వ్యాధిని ముందుగా గుర్తించడం, వైద్య సిబ్బందికి తగు శిక్షణ ఇవ్వడం, పరిశోధన, ప్రజావగాహన కార్యక్రమాలు నిర్వహిం చడం చేయాలి. ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు సొంతం చేసుకొని మానసిక ఆరోగ్య సేవలను విస్తృతంగా అందుబాటులోకి తేవాలి. డాక్టర్ కడియం కావ్య వ్యాసకర్త పాథాలజీ విభాగ స్పెషలిస్ట్, వర్ధన్నపేట కడియం ఫౌండేషన్ చెయిర్ పర్సన్ (అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
‘వల్లంకి పిట్టా’ బేబీ ఇప్పుడెలా ఉందో చూశారా?
కావ్య కల్యాణ్రామ్ తెలుసా మీకు? ఆమె ఎవరు అంటారా? సరే, అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రిలోని ‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ రమ్మంటా’వీడియో సాంగ్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అందులో ఓ బుడ్డి పాప క్యూట్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ బుడ్డి పాప పేరే కావ్య కల్యాణ్రామ్. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన ‘గంగోత్రి బేబీ’ ప్రస్తుతం ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? హైదరాబాద్కి చెందిన కావ్య కల్యాణ్ రామ్ ‘గంగోత్రి’సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ ‘విజయేంద్రవర్మ’, చిరంజీవి ‘ఠాగూర్’ నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’ పవన్ కల్యాణ్ ‘బాలు’తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత చదువుపై శ్రద్దపెట్టి, సినిమాలకు దూరమైంది. 2019లో ‘లా’ పట్టాపుచ్చుకుంది. గతేడాది ‘మసూద’ అనే సినిమాతోనే కావ్య హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ హీరోయిన్గా రాణించాలనుకుంటుందట. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం కావ్య లుక్స్.. మంచి హీరోయిన్ కి ఎగ్జాక్ట్ గా స్యూట్ అయ్యేలా ఉంది. హాట్ బేబీగా మారిన క్యూట్ బేబీ కావ్యకు మంచి ఆఫర్లు వచ్చి స్టార్ హీరోయిన్గా రాణించాలని ఆశిద్దాం. View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
అచ్చ తెలుగు అమ్మాయిని
కావ్య... ఈ పేరు బహుశా ఎవరికీ తెలియకపోచ్చు. కానీ అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట...’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. ఇప్పుడు తను హీరోయిన్ కాబోతోంది. తెలుగమ్మాయి అయిన కావ్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ – ‘‘బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ’తో పాటు ఇంకా చాలా సినిమాల్లో బాలనటిగా చేశాను. పుణెలోని ఓ కాలేజీలో లా పూర్తి చేసి, ఇప్పుడు సినిమా వైపు దృష్టి పెట్టాను. తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలకు కూడా ఆడిష¯Œ ్స చేస్తున్నాను. నిజానికి లాక్ డౌన్కి ముందుగానే ట్రయిల్స్ స్టార్ట్ చేశాను. లాక్ డౌన్ రాకుండా ఉంటే ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యేది. నేను తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్గా ఫీలవుతున్నాను. మన తెలుగు కల్చర్, నేటివిటీ అనేది హిందీ హీరోయిన్ల కన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే, ఇంట్రెస్టింగ్ , ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ఓటీటీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. అలాంటి అవకాశం నాకు వచ్చి, పాత్ర ఆసక్తిగా అనిపిస్తే చేస్తాను’’ అని చెప్పారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్ కుట్ర
విషాదం నింపిన క్యాన్సర్
No Headline
అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రూ.14.05లక్షలు పట్టివేత
రాజన్న సేవలో ఐజీ
పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
జిల్లా ప్రజలను నిరాశపరచిన ప్రధాని మోదీ
వెండితెరపై పల్లెటూరు పిల్లాడు
విద్యుత్షాక్తో యువకుడి మృతి
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement