-
MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఓటమితో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్రేట్ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. -
SRH Vs RCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన సన్రైజర్స్ ఉప్పల్లోనూ ఆ సీన్ను రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) సాధించిన రైజర్స్... హైదరాబాద్లో తమ రికార్డును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది.ప్యాట్ కమిన్స్ బృందం జోరు చూస్తుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చనే అనిపిస్తోంది. మరోవైపు.. ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.The crossover we all love to see 🤩 pic.twitter.com/nLlDlUcH7E— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024ఇదిలా ఉంటే.. ఈ కీలక పోరుకు ముందే సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ను తన మాటలతో ఖుషీ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా? మాస్.. ఊరమాస్.. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’’ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ములేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన ఆరెంజ్ ఆర్మీ.. ‘‘కెప్టెన్ ఓ రేంజు.. మామ మనోడే.. సూపర్ కమిన్స్’’ అంటూ కామెంట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్రైజర్స్ తలరాత మారిపోయింది. గత మూడేళ్లుగా వైఫల్యాలతో చతికిల పడ్డ రైజర్స్ను తన కెప్టెన్సీతో ఈ సీజన్లో హాట్ ఫేవరెట్గా మార్చాడు ఈ పేస్ బౌలర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో తన కెప్టెన్సీ వ్యూహాలకు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్లో సన్రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఎనిమిదింట ఏడు ఓడి అట్టడుగున ఉంది.చదవండి: IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్రైజర్స్ మాత్రమే..!ఓవైపు కెప్టెన్గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩చూడండి#TATAIPLHyderabad v Bengaluru | రేపు 6 PM నుంచిమీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024 -
SRH vs RCB: ఉప్పల్లో 300 కొడతారా..!
సాక్షి, హైదరాబాద్: 266... 277... 287... ఇదంతా ఒకే ఐపీఎల్ సీజన్లో, ఒకే టీమ్, వేర్వేరు మ్యాచ్లలో చేసిన పరుగుల విధ్వంసం. విశేషం ఏమిటంటే ఈ 287 పరుగులే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు. ఈ పరుగుల సునామీ సృష్టించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కాగా... ఇందులో 277 పరుగులు నమోదు చేసింది నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగానే.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈసారి ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ‘ఢీ’ కొట్టనుంది. 10 రోజుల క్రితం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ జట్టు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ (262/7) చేధించినంత పనిచేసింది. ఈ ఇరు జట్లే మళ్లీ నేడు తలపడనుండటంతో క్రికెట్ అభిమానుల చూపంతా ఈ మ్యాచ్పైనే ఉంది. ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకోనుందా? హైదరాబాద్ తన హవాను కొనసాగించనుందా? అనే ఆసక్తికి ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్లో ఓడితే బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ చేరే అవకాశాలు ఆవిరవుతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఆడుతున్న ‘లోకల్ బాయ్’ మొహమ్మద్ సిరాజ్, భారత స్టార్ విరాట్ కోహ్లి ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ చెలరేగితే సన్రైజర్స్ స్కోరు ఈసారి 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సన్రైజర్స్ భీకరమైన ఫామ్లో ఉండటం... కోహ్లిలాంటి దిగ్గజం బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ సీజన్లోని గత మ్యాచ్ల్లాగే ఈసారీ అభిమానులకు టికెట్ల ఇక్కట్లు తప్పట్లేదు. ఆన్లైన్లో టిక్కెట్లు క్షణాల్లో అయిపోవడంతో చేసేదేమిలేక క్రికెట్ అభిమానులంతా బిగ్ స్క్రీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న పలు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి. 🧡❤️ pic.twitter.com/3ho5bxzGSZ— SunRisers Hyderabad (@SunRisers) April 25, 2024 -
ఐపీఎల్లో సన్రైజర్స్ రికార్డులు.. పుష్ప టీమ్ స్పెషల్ ట్వీట్!
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్గా కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా పుష్ప టీమ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ టీమ్ తన రికార్డ్ను తానే అధిగమించింది. ముంబయిపై 277 పరుగుల అత్యధిక స్కోరు చేసిన ఎస్ఆర్హెచ్.. మరోసారి బెంగళూరుపై 287 రన్స్ చేసి తన రికార్డ్ను తానే బద్దలు కొట్టింది. దీంతో మొదటి మ్యాచ్ను పుష్ప పార్ట్-1గా.. రెండో మ్యాచ్ను పుష్ప-2గా పోలుస్తూ పోస్ట్ చేసింది. రెండుసార్లు అత్యధిక స్కోరు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు అభినందనలు తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది చూసిన కొందరు అభిమానులు పుష్ప డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది అనే డైలాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఏ టీమ్ సాధించని రికార్డ్ను రెండుసార్లు సన్రైజర్స్ అధిగమించడం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోనుంది. HUPPPP!!! 💥💥 277/3 - SRH: The Rise 😎 287/3 - SRH: The Rule 🤙 Congratulations on scoring the Highest-ever IPL team totals twice in this season! 🔥 @SunRisers https://t.co/kcfJBj5E0Z pic.twitter.com/co0o1zIw7T — Pushpa (@PushpaMovie) April 16, 2024 -
IPL 2024 RCB VS SRH: ఓడినా ఆల్టైమ్ రికార్డు సెట్ చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్లో నిన్న (ఏప్రిల్ 15) అత్యంత రసవత్తరమైన సమరం జరిగింది. ఆర్సీబీ, సన్రైజర్స్ మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్లో ఎన్నో టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్.. ఓ టీ20 మ్యాచ్లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక స్కోర్ (సన్రైజర్స్ 287 + ఆర్సీబీ 262 = 549 పరుగులు).. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆర్సీబీ-22).. ఓ టీ20 మ్యాచ్లో నమోదైన అత్యధిక బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81).. ఇలా ఈ మ్యాచ్లో చాలావరకు పొట్టి క్రికెట్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇదే మ్యాచ్లో మరో భారీ రికార్డు కూడా నమోదైంది. ఆర్సీబీ మ్యాచ్ ఓడినప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ (262) చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ముంబై ఇండియన్స్ ఇదే సీజన్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ (సన్రైజర్స్తో మ్యాచ్లో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ) 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆర్సీబీ.. మరో రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా.. సెకెండ్ ఇన్నింగ్స్లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా డ్యూయల్ రికార్డు నమోదు చేసింది. 2017 సీజన్లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 49 పరుగులకే ఆలౌటైంది. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్గానూ రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో ఆర్సీబీ.. సన్రైజర్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
నితీశ్ ‘షో’
ముల్లన్పూర్: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇంట గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు రచ్చ గెలిచింది. పంజాబ్ గడ్డపై ఆంధ్ర బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగాడు. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ముందుగా సన్రైజర్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్తో పాటు అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 25; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు. అర్షదీప్ కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, అశుతోష్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడగా ఆడాడు. ఆఖరి ఓవర్లో 29 పరుగులు కావాల్సి ఉండగా బౌలర్ ఉనాద్కట్ పట్టు తప్పాడు. వైడ్లతో పాటు పేలవ బంతులు వేయడంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు పంజాబ్ 3 సిక్స్లు సహా 26 పరుగులే రాబట్టడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. నితీశ్ వీరబాదుడు... ఓపెనర్ ట్రవిస్ హెడ్ (15 బంతుల్లో 21; 4 ఫోర్లు), మార్క్రమ్ (0)లను ఒకే ఓవర్లో అర్షదీప్ అవుట్ చేయగా, అభిషేక్ శర్మ (16)కు సామ్ కరన్ కళ్లెం వేశాడు. 39 పరుగులకే టాప్ 3 వికెట్లను కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి (11) ‘ఇంపాక్ట్’ చూపలేకపోయాడు. సగం (10) ఓవర్లు ముగిసే సరికి జట్టు 66/4 స్కోరు చేసింది. అయితే నాలుగో ఓవర్లోనే క్రీజులోకి వచి్చన నితీశ్ పదో ఓవర్దాకా చేసిన స్కోరు 14! ఒకటే బౌండరీ కొట్టాడు. ఇలా ఆడిన విశాఖ కుర్రాడు ధనాధన్కు స్విచ్చాన్ చేసినట్లుగా 11వ ఓవర్ నుంచి అనూహ్యంగా దంచేశాడు. హర్ప్రీత్ బౌలింగ్లో 4, 6 బాదగా, క్లాసెన్ ఓ ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. రబడ, సామ్ కరన్ ఓవర్లలో చెరో సిక్సర్తో దూకుడు పెంచాడు. క్లాసెన్ (9) అవుటయ్యాక సమద్ రావడంతో దూకుడు ‘డబుల్’ అయింది. హర్ప్రీత్ 15వ ఓవర్నూ పూర్తిగా ఎదుర్కొన్న నితీశ్ 0, 4, 6, 4, 6, 2లతో 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో 32 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. 17వ ఓవర్ వేసిన అర్షదీప్ 3 బంతుల వ్యవధిలో సమద్, నితీశ్లను అవుట్ చేయడంతో రైజర్స్ డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగుల్ని చేయలేకపోయింది. దెబ్బకొట్టిన భువీ... ఓపెనర్ బెయిర్స్టో (0)ను రెండో ఓవర్లోనే కమిన్స్ డకౌట్ చేయగా, భువనేశ్వర్ వరుస ఓవర్లలో ప్రభ్సిమ్రన్ (4)తో పాటు మరో శిఖర్ ధావన్ (14)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 20 పరుగులకే టాపార్డర్ కూలింది. సామ్ కరన్ (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు), సికందర్ రజా (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కాసేపు పోరాడారు. నటరాజన్ పదో ఓవర్లో సామ్ కరన్ బౌండరీ కోసం ప్రయత్నించగా మిడాఫ్లో కమిన్స్ కళ్లు చెదిరే క్యాచ్తో అతని ఆట ముగించాడు. జట్టు స్కోరు 91 పరుగుల వద్ద రజా ని్రష్కమించడంతో సన్రైజర్స్ గెలుపు దాదాపుగా ఖాయమైంది. అయితే ఆఖరి ఓవర్లో ఉనాద్కట్ 3 వైడ్లు వేయడంతో 2 బంతుల్లో 10 పరుగుల సమీకరణం పంజాబ్కు అవకాశమిచ్చింది. అశుతోష్ మరో షాట్ ఆడగా డీప్ మిడ్ వికెట్ వద్ద రాహుల్ త్రిపాఠి క్యాచ్ జారవిడిచాడు. ఒకే పరుగు రావడంతో ఇక ఆఖరి బంతికి 9 పరుగులు అసాధ్యమవడంతో హైదరాబాద్ గెలిచింది. అయితే చివరి బంతిని శశాంక్ సిక్స్ కొట్టడంతో సన్రైజర్స్ 2 పరుగులతో నెగ్గింది. సన్రైజర్స్ జట్టులో విజయకాంత్ శ్రీలంక యువ లెగ్స్పిన్నర్ విజయకాంత్ వియస్కాత్ ఐపీఎల్ టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయంతో టోర్నీకి దూరమైన లంక లెగ్స్పిన్నర్ వనిందు హసరంగ స్థానంలో కనీస విలువ రూ. 50 లక్షలకు రైజర్స్ యాజమాన్యం విజయ్కాంత్ను ఎంచుకుంది. 22 ఏళ్ల విజయ్కాంత్ ఆసియా క్రీడల్లో లంక తరఫున ఒకే ఒక అంతర్జాతీయ టి20 ఆడాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) ధావన్ (బి) అర్షదీప్ 21; అభిషేక్ (సి) శశాంక్ (బి) సామ్ కరన్ 16; మార్క్రమ్ (సి) జితేశ్ (బి) అర్షదీప్ 0; నితీశ్ కుమార్ (సి) రబడ (బి) అర్షదీప్ 64; రాహుల్ త్రిపాఠి (సి) జితేశ్ (బి) హర్షల్ 11; క్లాసెన్ (సి) సామ్ కరన్ (బి) హర్షల్ 9; సమద్ (సి) హర్షల్ (బి) అర్షదీప్ 25; షాబాజ్ నాటౌట్ 14; కమిన్స్ (బి) రబడ 3; భువనేశ్వర్ (సి) బెయిర్స్టో (బి) సామ్ కరన్ 6; ఉనాద్కట్ నాటౌట్ 6; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–39, 4–64, 5–100, 6–150, 7–151, 8–155, 9–176. బౌలింగ్: రబడ 4–0–32–1, అర్షదీప్ 4–0–29–4, సామ్ కరన్ 4–0–41–2, హర్షల్ 4–0–30–2, హర్ప్రీత్ బ్రార్ 4–0–48–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 14; బెయిర్స్టో (బి) కమిన్స్ 0; ప్రభ్సిమ్రాన్ (సి) నితీశ్ (బి) భువనేశ్వర్ 4; సామ్ కరన్ (సి) కమిన్స్ (బి) నటరాజన్ 29; సికందర్ రజా (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 28; శశాంక్ నాటౌట్ 46; జితేశ్ (సి) అభిషేక్ (బి) నితీశ్ 19; అశుతోష్ నాటౌట్ 33; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–2, 2–11, 3–20, 4–58, 5–91, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–32–2, కమిన్స్ 4–0–22–1, నటరాజన్ 4–0–33–1, నితీశ్ కుమార్ 3–0–33–1, ఉనాద్కట్ 4–0–49–1, షహబాజ్ 1–0–10–0. అదరగొట్టాడు ఏడేళ్ల క్రితం...బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్మర్చంట్ ట్రోఫీ..రాజ్కోట్లో నాగాలాండ్తో ఆంధ్ర మ్యాచ్. అద్భుత బ్యాటింగ్తో చెలరేగిన నితీశ్ కుమార్ రెడ్డి 345 బంతుల్లో ఏకంగా 441 పరుగుల స్కోరు సాధించి సంచలనం సృష్టించాడు. ఈ క్వాడ్రపుల్ సెంచరీ మాత్రమే కాకుండా టోర్నీ మొత్తం అదరగొట్టిన అతను 8 ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా 176.71 సగటుతో ఏకంగా 1237 పరుగులు నమోదు చేశాడు. విజయ్మర్చంట్ ట్రోఫీ చరిత్రలో ఒక్క సీజన్లో ఎవరూ చేయని పరుగుల రికార్డు అది. ఆ ఏడాది బీసీసీఐ వార్షిక అవార్డుల్లో ‘బెస్ట్ అండర్–16 క్రికెటర్’గా నిలవడంతో దేశవాళీ క్రికెట్లో అందరి దృష్టీ ఈ కుర్రాడిపై పడింది. ఓపెనర్గా కెరీర్ మొదలు పెట్టిన నితీశ్ అండర్–19 స్థాయి వినూ మన్కడ్ ట్రోఫీ, చాలెంజర్ టోర్నీ వరకు అలాగే కొనసాగించాడు. అయితే మరో వైపు మీడియం పేస్ బౌలింగ్పై కూడా దృష్టి పెట్టిన అతను కొత్త బంతితో బౌలింగ్ చేశాడు. దాంతో భారం ఎక్కువ కావడంతో అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మిడిలార్డర్లోకి మార్చారు. వైజాగ్లో పుట్టిన నితీశ్ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో సత్తా చాటిన తర్వాత 2020–21 సీజన్లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి ఆల్రౌండర్గా జట్టుకు కీలకంగా మారాడు. రెండేళ్ల తర్వాత రంజీ సీజన్లో 25 వికెట్లు పడగొట్టిన నితీశ్ తన బౌలింగ్ పదును కూడా చూపించాడు. తాజా సీజన్ రంజీ ట్రోఫీలో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నితీశ్ బాధిత బ్యాటర్లలో పుజారా, రహానే, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. బ్యాటింగ్లో చెలరేగుతూ మీడియం పేస్ బౌలింగ్ చేసే హార్దిక్ పాండ్యాను అతను అభిమానిస్తాడు. తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్తాన్ జింక్ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవాడు. అయితే రాజస్తాన్కు బదిలీ కావడంతో ఆయన ఉద్యోగంకంటే కొడుకు భవిష్యత్తే ముఖ్యమని భావిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో నితీశ్కు మార్గనిర్దేశం చేసి నడిపించారు. ఇప్పుడు ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్తో నితీశ్ అందరికీ తెలిశాడు. 2023 సీజన్లో సన్రైజర్స్ తరఫున 2 మ్యాచ్లు ఆడినా బ్యాటింగ్ రాకపోగా, వికెట్ కూడా దక్కలేదు. ఈ సీజన్లో చెన్నైతో మ్యాచ్లో 8 బంతుల్లో ఫోర్, సిక్స్తో 14 పరుగులు చేసి ట్రైలర్ చూపించిన నితీశ్ తానేంటే ఈ మ్యాచ్లో అసలు షో ప్రదర్శించాడు. చాలా కాలం తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక స్థానిక ఆటగాడు చెలరేగి జట్టును గెలిపించడం మరో విశేషం. - (సాక్షి క్రీడా విభాగం) -
IPL 2024: సమిష్టిగా రాణించిన టైటాన్స్..సన్రైజర్స్కు శృంగభంగం
అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. ఫలితంగా భీకర ఫామ్లో ఉండిన సన్రైజర్స్కు శృంగభంగం ఎదురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ సిక్సర్ బాది మ్యాచ్ ముగించాడు. సన్రైజర్స్ దూకుడుకు ఆడ్డుకట్ట వేసిన గుజరాత్ బౌలర్లు.. సూపర్ ఫామ్లో ఉన్న సన్రైజర్స్ బ్యాటర్లకు ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి సన్రైజర్స్ను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. తొలి రెండు మ్యాచ్ల్లో 200 పరుగుల మార్కును క్రాస్ చేసిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కే పరిమితమైంది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు. ఆడుతూపాడుతూ.. 163 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆది నుంచి నిలకడగా ఆడిన గుజరాత్ బ్యాటర్లు ఒక్కో పరుగు పేర్చుకుంటూ విజయం దిశగా సాగారు. సాహా (25), గిల్ (36), సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ (44 నాటౌట్), విజయ్ శంకర్ (14 నాటౌట్) తలో చేయి వేసి గుజరాత్ను గెలిపించారు. సన్రైజర్స్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, మార్కండే, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. -
విధ్వంసకర బ్యాటింగ్..మరోసారి మోత మోగేనా ?
-
సన్ రైజర్స్ విజయోత్సాహం: దటీజ్ కావ్య మారన్, వైరల్ వీడియో
పురుషులకే సొంతమనుకున్న క్రికెట్లో మహిళలు తామేం తక్కువ అన్నట్టు రాణిస్తున్నారు. రిక్డార్డులతో తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు క్రికెట్ ఫ్రాంచైజీ యజమానులుగా కూడా మహిళలు దూసుకుపోతుండటం విశేషం. ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్గా నీతా అంబానీ, ఇంకా శిల్పా శెట్టి, ప్రీతి జింటా ఇప్పటికే స్పెటల్ ఎట్రాక్షన్. తాజాగా కావ్య మారన్ రూపంలో యువకెరటం దూసుకొచ్చింది. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు. ఈ సక్సెస్ కిడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ 2024లో బాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టూడియంలో జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్కు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరీ హోరీగా సాగిన ఈ పోటీ ఆద్యంతం అభిమానులను అలరించింది. తొలి పది ఓవర్లలోనే 100 పరుగులు, మొత్తం మ్యాచ్లో పరుగుల వరద, రికార్డులు వర్షం కురిసింది. ముఖ్యంగా ఎంఐపై జట్టు రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని సాధించడంతో సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆకర్షణీయమైన ఆరెంజ్ కలర్ డ్రెస్లో ఉత్సాహంగా గెంతులు వేసింది. తన జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచిన దృశ్యాలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. "Kavya Maran shines as the happiest person on Earth today! "Exciting #SRHvsMI clash! 🔥 #IPLUpdate with #RohitSharma𓃵 and Travis Head. Keep up with the action on #IPLonJioCinema! 🏏 #HardikPandya #LEAKED #IPLHistory #Klassen #NitaAmbani #SunriseHyderabad #CricketCaptaincy" 🌟… pic.twitter.com/5RmTRRKQlR — Rakesh Yadav 𝕏 (@RAKESHYADAV4) March 28, 2024 నిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్రైజర్స్ ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సౌజన్యంతో ఆతిథ్య జట్టుకు బలమైన ఆరంభం లభించడంతో ఎస్ఆర్హెచ్ సీఈవో ఈ ప్రపంచంలోనే ఇంతకుమించిన ఆనందం లేదన్నట్టుగా ఉద్వేగానికి లోనైంది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్ కొట్టినప్పుడు ఆమె ఆనందం చూసి తీరాల్సిందే. క్లాసెన్ 34 బంతుల్లో నాలుగు ఫోర్లు,ఏడు సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతేనా 64 పరుగులతో ముంబై విజయాన్నివ్వడం ఖాయం అనుకుంటున్న తరుణంలో తిలక్ ఔటవ్వడంతో సన్రైజర్స్ అభిమానులే కాదు కావ్య కూడా ఊపిరి పీల్చుకుంది. తిలక్ మైదానాన్ని వీడుతుంటే ఆమె దండం పెట్టడం వైరల్గా మారింది. Brilliant innings by Tilak 👌 Reaction of Kavya Maran 🙏#SRHvsMi pic.twitter.com/8zpKU6s3Fp — Cricket Uncut (@CricketUncutOG) March 27, 2024 అద్భుతమైన బ్యాటింగ్తో SRH టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఈ మ్యాచ్లో31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2013లో పూణే వారియర్స్పై ముంబై ఇండియన్స్ 263/5 రికార్డును బద్దలు కొట్టింది.SRH కెప్టెన్ కమ్మిన్స్ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 👉: సన్రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప -
IPL 2024 Full Schedule: ఐపీఎల్ 2024 రెండో విడత షెడ్యూల్ విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ రెండో విడత షెడ్యూల్ ఇవాళ (మార్చి 25) విడుదలైంది. తొలి విడతలో 21 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా మిగతా 53 మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించింది. ప్రస్తుత సీజన్లో ఓవరాల్గా 74 మ్యాచ్లు (ప్లే ఆఫ్స్తో కలుపుకుని) జరగాల్సి ఉన్నాయి. సీఎస్కే వర్సెస్ కేకేఆర్.. రెండో విడత షెడ్యూల్ మ్యాచ్లు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమవుతాయి. ఈ విడత ఆరంభ మ్యాచ్లో సీఎస్కే.. కేకేఆర్తో తలపడనుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ను విడతల వారీగా ప్రకటించారు. ఎన్నికల తేదీలు క్లాష్ కాకుండా ఉండేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అన్ని కసర్తులు పూర్తి చేసిన అనంతరం ఇవాళ పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. IPL 2024 SCHEDULE....!!! ⭐ pic.twitter.com/M80vWCBE40 — Johns. (@CricCrazyJohns) March 25, 2024 చెన్నైలో ఫైనల్.. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనుంది. మే 21న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1, మే 22న అదే నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న చెపాక్ వేదికగా క్వాలిఫయర్-2 జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో ఐదు.. రెండో విడతలో హైదరాబాద్లో ఐదు మ్యాచ్లు జరుగనున్నాయి. హైదరాబాద్లో జరుగబోయే మ్యాచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 25- సన్రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ (రాత్రి 7:30 గంటలకు) మే 2- సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (రాత్రి) మే 8- సన్రైజర్స్ వర్సెస్ లక్నో (రాత్రి) మే 16-సన్రైజర్స్ వర్సెస్ గుజరాత్ (రాత్రి) మే 19- సన్రైజర్స్ వర్సెస్ పంజాబ్ (రాత్రి) -
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్రైజర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
KKR Vs SRH: శభాష్ సుయాష్.. సన్రైజర్స్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు..!
ఐపీఎల్ 2024 సీజన్లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్ను అందించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య నిన్న (రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హెన్రిచ్ క్లాసెన్ తొలి బంతికే సిక్సర్ బాది సన్రైజర్స్ శిబిరంలో గెలుపుపై ధీమా పెంచగా.. కేకేఆర్ ఆటగాళ్లు హర్షిత్ రాణా, సుయాష్ శర్మ ఆ ఆనందాన్ని వారికి ఎంతో సేపు నిలబడనీయలేదు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన రాణా వైవిధ్యమైన బంతులు సంధించి సన్రైజర్స్ గెలుపుకు అడ్డుకోగా.. సుయాష్ శర్మ కీలక దశలో (2 బంతుల్లో 5 పరుగులు) మెరుపు క్యాచ్ (క్లాసెన్) పట్టి ఆరెంజ్ ఆర్మీ చేతుల్లో నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ONE OF THE GREATEST CATCHES IN IPL HISTORY...!!! - Take a bow, Suyash Sharma. 🫡pic.twitter.com/CAq18gb8EO — Johns. (@CricCrazyJohns) March 23, 2024 సుయాష్ ఆ క్యాచ్ మిస్ చేసి ఉంటే బౌండరీ లభించి సన్రైజర్స్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేది. ఒకవేళ ఆ క్యాచ్ డ్రాప్ అయ్యి, పరుగు రాకపోయినా అప్పటికే శివాలెత్తి ఉన్న క్లాసెన్ ఆఖరి బంతికి సిక్సర్ బాది సన్రైజర్స్ను గెలిపించేవాడు. సుయాష్ అందుకున్న ఈ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఇందుకే అంటారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆఖర్లో రసెల్ 7 సిక్సర్లు, 3 బౌండరీలతో విరుచుకుపడి కేకేఆర్ 200 పరుగుల మార్కును దాటేందుకు దోహదపడ్డాడు. చివర్లో రమన్దీప్ సింగ్ (35; ఫోర్, 4 సిక్సర్లు), రింకూ సింగ్ (23; 3 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సన్రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్రైజర్స్.. ఆదిలో తడబడినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్తో (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) మ్యాచ్ రూపురేఖల్నే మార్చేశాడు. అయితే గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో అతడు ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్పైపు మలుపు తిరిగింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సన్రైజర్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) ఓ మోస్తరు స్కోర్లతో శుభారంభాన్ని అందించగా.. వన్డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి జిడ్డు బ్యాటింగ్తో (20 బంతుల్లో 20) సన్రైజర్స్ ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ తమ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
బ్రూక్ కి అంత.. ఫిలిప్స్కి ఇంతే ఫైనల్ 4 లో ఎస్ ఆర్ హెచ్
-
ఛల్.. హట్ రే.. కావ్య మారన్ ఆన్ ఫైర్
-
అన్ని విభాగాల్లోనూ సన్రైజర్స్ ఫ్లాప్ షో
-
వచ్చేశారు..ఇక తగ్గేదేలే..SRHకి గుడ్ న్యూస్
-
కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఆ జట్టు స్టార్ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్లు తమ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫోటోలను సన్రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే విధంగా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఎస్ఆర్హెచ్ అభిమానులతో పంచుకుంది. కాగా ఎస్ఆర్హెచ్ తమ పాత జెర్సీలో పూర్తి స్థాయిలో మార్పులు చేయకుండా.. కాషాయానికి కాస్త నల్లరంగును అద్దింది. అదే విధంగా ఆరంజ్ కలర్ లో ఉన్న ట్రాక్ ప్యాంటు స్థానంలో పూర్తి బ్లాక్ కలర్ ప్యాంటు తీసుకొచ్చారు. కాగా ఆరెంజ్ ఆర్మీ కొత్త జెర్సీ.. మొట్టమొదటి సౌతాఫ్రికా20 లీగ్లో టైటిల్ నెగ్గిన సన్రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జెర్సీని పోలి ఉంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ కొత్త కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్కరమ్ను ఎంపిక చేసింది. అతని సారథ్యంలోని సన్ రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జట్టు తొట్ట తొలి సౌతాఫ్రికా20 లీగ్ టైటిల్ను సొంతం చేసుకుంది. Idhi, Orange Fire 🔥 Buy your tickets now to watch your favourite #Risers in this brand new jersey soon 💥 🎟️ - https://t.co/ph5oL4pzDI#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/lRM75Yz6kO — SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023 ℍ𝔼ℝ𝔼. 𝕎𝔼. 𝔾𝕆. 🧡 Presenting to you, our new #OrangeArmour for #IPL2023 😍@StayWrogn | #OrangeArmy #OrangeFireIdhi pic.twitter.com/CRS0LVpNyi — SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023 చదవండి: IPL 2023: శ్రేయస్ అయ్యర్ దూరం..! కేకేఆర్ కొత్త కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్! -
SRH: విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేసేది, సన్రైజర్స్ కెప్టెన్ కూడా అతడే!
IPL Mini Auction 2023- Sunrisers Hyderabad: ఐపీఎల్ మినీ వేలం-2023కి సమయం దగ్గరపడింది. కొచ్చి వేదికగా శుక్రవారం(డిసెంబరు 23)న ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కొనుగోలు అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్రైజర్స్ జట్టు గతేడాది దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్లకు గానూ ఆరింట మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో కేన్ మామ కోసం గతంలో 14 కోట్ల భారీ పెట్టిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మినీ వేలానికి ముందు అతడితో బంధం తెంచుకుంది. మయాంక్ అగర్వాల్ కేన్ మామ స్థానాన్ని భర్తీ చేసేది అతడే ఈ నేపథ్యంలో విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఇతడేనంటూ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా క్రికెటర్ పేరును సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్ను కొనుగోలు చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్లకు.. దూకుడుగా ఆడగల ఓపెనర్ అవసరం ఎంతగానో ఉంది. అంతేకాదు గతంలో కెప్టెన్గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ కూడా ఇప్పుడు లేడు. అనుభవజ్ఞుడైన, ఓపెనింగ్ బ్యాటర్ కేన్ సేవలను ఎస్ఆర్హెచ్ కచ్చితంగా మిస్సవుతుంది. కాబట్టి కేన్ స్థానంలో మయాంక్ అగర్వాల్ను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఓపెనర్గా తను దూకుడు ప్రదర్శించగలడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడగలడు. బహుశా వాళ్లు అతడిని తమ కెప్టెన్గా చేసే ఆలోచనలో కూడా ఉన్నారేమో!’’ అని చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్ ప్రస్తుతం కోటి రూపాయల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక సారథిగా నియమించిన సమయంలో మయాంక్ కోసం పంజాబ్ 14 కోట్లు వెచ్చించగా.. ఈసారి అతడు ఎంత ధరకు అమ్ముడుపోతాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిజంగానే సన్రైజర్స్ మయాంక్ను కొనుగోలు చేస్తే ఓపెనింగ్ స్థానానికి చక్కటి ఆప్షన్ దొరుకుతుంది. చదవండి: IPL 2023 Mini Auction Players List: వేలంలో 405 మంది ఆటగాళ్లు.. షార్ట్లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలు IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు -
లివింగ్స్టోన్ విధ్వంసం.. చివరి పోరులో పంజాబ్ చేతిలో చిత్తైన సన్రైజర్స్
ముంబై: ఎనిమిది జట్లు పాల్గొన్న గత ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఎనిమిదో స్థానం... పది జట్లు పాల్గొన్న ఈసారి ఐపీఎల్లోనూ అదే స్థానం...అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్! మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తూ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ను పేలవంగా ముగించింది. టోర్నీపరంగా ప్రాధాన్యత కోల్పో యిన చివరి లీగ్ మ్యాచ్లో ఆదివారం పంజాబ్ కింగ్స్ 5 వికెట్లతో హైదరాబాద్ను ఓడించింది. ముందుగా సన్రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (32 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా... రొమారియో షెఫర్డ్ (15 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), మార్క్రమ్ (21), రాహుల్ త్రిపాఠి (20) తలా ఓ చేయి వేశారు. పంజాబ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్ప్రీత్ బ్రార్, ఎలిస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం పంజాబ్ 15.1 ఓవర్లలో 160 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ (22 బంతుల్లో 49 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించగా, శిఖర్ ధావన్ (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఫజల్ హఖ్ ఫారూఖీకి 2 వికెట్లు దక్కాయి. -
ధవన్, రబాడలను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఐపీఎల్ 2022 సీజన్ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారై, సన్రైజర్స్, పంజాబ్ జట్లు ఇదివరకే రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. రికార్డులు ఎలా ఉన్నాయంటే.. క్యాష్ రిచ్ లీగ్లో పంజాబ్పై సన్రైజర్స్ పూర్తి ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన 19 మ్యాచ్ల్లో సన్రైజర్స్ 13, పంజాబ్ 6 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ప్రస్తుత సీజన్ తొలి అర్ధ భాగంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా సన్రైజర్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 7 వికెట్ల తేడాతో పంజాబ్ను మట్టికరిపించింది. నేటి మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే.. - పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్లో మరో బౌండరీ సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో 700 బౌండరీల మార్కును అందుకున్న తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే నేటి మ్యాచ్లో ధవన్ 5 బౌండరీలు బాధితే పంజాబ్ తరఫున 50 బౌండరీలు పూర్తి చేసుకుంటాడు. - పంజాబ్ పేసర్ రబాడ నేటి మ్యాచ్లో మరో 2 వికెట్లు పడగొడితే క్యాష్ రిచ్ లీగ్లో 100 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఐపీఎల్లో 100 వికెట్లు సాధించిన తొలి సౌతాఫ్రికా బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. - పంజాబ్ బౌలర్ రాహుల్ చాహర్ మరో 2 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్ల మార్కును చేరుకుంటాడు. - పంజాబ్ హిట్టర్ లివింగ్స్టోన్ మరో 2 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్లో 4500 పరుగుల మార్కును క్రాస్ చేస్తాడు. - సన్రైజర్స్ డాషింగ్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి మరో 3 బౌండరీలు బాధితే టీ20ల్లో 250 బౌండరీల మార్కును, అలాగే మరో 4 సిక్సర్లు కొడితే 100 సిక్సర్ల క్లబ్లో చేరతాడు. - పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ మరో 3 సిక్సర్లు బాధితే టీ20ల్లో 150 సిక్సర్ల అరుదైన క్లబ్లో చేరతాడు. అలాగే మయాంక్ నేటి మ్యాచ్లో మరో 6 ఫోర్లు కొడితే ఐపీఎల్లో పంజాబ్ తరఫున 150 బౌండరీలను పూర్తి చేసుకుంటాడు. - సన్రైజర్స్ ప్లేయర్ నికోలస్ పూరన్ మరో 6 బౌండరీలు సాధిస్తే టీ20ల్లో 300 బౌండరీల మార్కును అందుకుంటాడు. - సన్రైజర్స్ బౌలర్ శ్రేయస్ గోపాల్ మరో వికెట్ పడగొడితే ఐపీఎల్లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. - సన్రైజర్స్ హిట్టర్ అబ్దుల్ సమద్ మరో 4 సిక్సర్లు కొడితే టీ20ల్లో 50 సిక్సర్ల క్లబ్లో చేరతాడు. చదవండి: సన్రైజర్స్తో తలపడనున్న పంజాబ్.. ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఎవరంటే..! -
IPL 2022: అదరహో హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో ముంబైపై విజయం
ముంబై: ఓడితే ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయే స్థితిలో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సత్తా చాటింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత కీలక విజయంతో తమ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి (44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా... ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్లు), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 2 ఫోర్లు, 4 సిక్స్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. కీలక భాగస్వామ్యాలు... ఓపెనర్ అభిషేక్ శర్మ (9) వైఫల్యం తర్వాత రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు సన్రైజర్స్కు భారీ స్కోరును అందించాయి. త్రిపాఠి ఈ రెండింటిలోనూ భాగంగా ఉన్నాడు. గార్గ్తో రెండో వికెట్కు 78 పరుగులు (43 బంతుల్లో), పూరన్తో మూడో వికెట్కు 76 పరుగులు (42 బంతుల్లో) త్రిపాఠి జోడించాడు. త్రిపాఠి తన ఫామ్ను కొనసాగించగా, సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న గార్గ్ కూడా కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. బుమ్రా ఓవర్లో వరుస బంతుల్లో త్రిపాఠి 6, 4, 4 బాదగా... 10.1 ఓవర్లలోనే సన్రైజర్స్ స్కోరు 100 పరుగులకు చేరింది. పూరన్ కూడా దూకుడు ప్రదర్శించాడు. మెరిడిత్ ఓవర్లో వరుస సిక్సర్లు కొట్టిన అతను, మర్కండే వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. 32 బంతుల్లో త్రిపాఠి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత మరింత చెలరేగిన త్రిపాఠి... స్యామ్స్ ఓవర్లో ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టాడు. అయితే మూడు పరుగుల వ్యవధిలో పూరన్, త్రిపాఠి, మార్క్రమ్ (2) వెనుదిరగడంతో హైదరాబాద్ జోరుకు బ్రేకులు పడ్డాయి. భారీ ఓపెనింగ్... ఛేదనలో ముంబైకి మెరుపు ఆరంభం లభించింది. రోహిత్, ఇషాన్ తొలి వికెట్కు 66 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. అయితే ఆరు పరుగుల తేడాతో రోహిత్, ఇషాన్లను అవుట్ చేసి రైజర్స్ పట్టు బిగించింది. తిలక్ వర్మ (8), స్యామ్స్ (15), స్టబ్స్ (2) విఫలం కావడంతో హైదరాబాద్ గెలుపు సులువే అనిపించింది. ముంబై 35 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన స్థితిలో టిమ్ డేవిడ్ చెలరేగిపోయాడు. నటరాజన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అతను 4 సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు. అయితే స్ట్రయికింగ్ను కాపాడుకునే ప్రయత్నంలో అదే ఓవర్ చివరి బంతికి డేవిడ్ రనౌటవ్వడం ముంబై ఆశలను దెబ్బ తీసింది. 19వ ఓవర్లో ఒక్క పరుగూ ఇవ్వకుండా భువనేశ్వర్ సత్తా చాటాడు. ముంబైకి చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సి ఉండగా, తొలి మ్యాచ్ ఆడుతున్న ఆఫ్గాన్ పేసర్ ఫారుఖీ ఒత్తిడిని అధిగమించి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు: సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మర్కండే (బి) స్యామ్స్ 9; గార్గ్ (సి అండ్ బి) రమణ్దీప్ 42; త్రిపాఠి (సి) తిలక్ వర్మ (బి) రమణ్దీప్ 76; పూరన్ (సి) మర్కండే (బి) మెరిడిత్ 38; మార్క్రమ్ (సి) డేవిడ్ (బి) రమణ్దీప్ 2; విలియమ్సన్ (నాటౌట్) 8; సుందర్ (బి) బుమ్రా 9; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–18, 2–96, 3–172, 4–174, 5–175, 6–193. బౌలింగ్: సామ్స్ 4–0–39–1, మెరిడిత్ 4–0–44– 1, సంజయ్ 2–0–23–0, బుమ్రా 4–0– 32–1, మర్కండే 3–0–31–0, రమణ్దీప్ 3–0–20–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) (సబ్) సుచిత్ (బి) సుందర్ 48; ఇషాన్ (సి) గార్గ్ (బి) ఉమ్రాన్ 43; స్యామ్స్ (సి) గార్గ్ (బి) ఉమ్రాన్ 15; తిలక్ (సి) విలియమ్సన్ (బి) ఉమ్రాన్ 8; డేవిడ్ (రనౌట్) 46; స్టబ్స్ (రనౌట్) 2; రమణ్దీప్ (నాటౌట్) 14; సంజయ్ (సి) (సబ్) సుచిత్ (బి) భువనేశ్వర్ 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–95, 2–101, 3–123, 4–127, 5–144, 6–175, 7–175. బౌలింగ్: ఫారుఖీ 4–0–31–0, భువనేశ్వర్ 4–1–26–1, సుందర్ 4–0–36–1, నటరాజన్ 4–0–60–0, ఉమ్రాన్ 3–0–23–3, అభిషేక్ శర్మ 1–0–10–0. -
ధోని ఈజ్ బ్యాక్... ఎస్ఆర్హెచ్పై సీఎస్కే విజయం
పుణే: సారథ్యం మారేసరికి సర్వస్వం మారిపోయింది. చెన్నై ఆటతీరు అదిరిపోయింది. ధోని కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ మ్యాచ్లో చెన్నై మళ్లీ అచ్చంగా సూపర్ కింగ్స్ అయ్యింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ధోని బృందం 13 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై గెలిచింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 202 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓపెనింగ్లో చెలరేగారు. తర్వాత హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (33 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అందివచ్చిన లైఫ్లతో అర్ధసెంచరీ చేశాడు. రుతురాజ్ సెంచరీ మిస్ చెన్నై బ్యాటింగ్ నింపాదిగా మొదలైంది. రుతురాజ్, కాన్వే తొలి ఐదు ఓవర్లలో బంతిని మూడుసార్లు మాత్రమే బౌండరీ (2 ఫోర్లు, 1 సిక్స్)ని దాటించారంతే! కానీ తర్వాత ఆట రూటే వేరు! ఇదే జోడీ దాదాపు 18 ఓవర్లు (17.5) ఆడేసింది. ఒక్క భువనేశ్వర్ మినహా అందరినీ రుతురాజ్, కాన్వే చితకబాదేశారు. ముఖ్యంగా తన పేస్తో నిప్పులు చెరుగుతున్న ఉమ్రాన్ మలిక్ (0/48) బౌలింగ్ను రుతురాజ్ ఫోర్లు, కళ్లు చెదిరే సిక్సర్లతో తుత్తునీయలు చేశాడు. 8వ ఓవర్లో 50 స్కోరు చేసిన చెన్నై 11వ ఓవర్ (10.5) ముగియక ముందే 100 మార్కు దాటింది. మరో 9 ఓవర్లలో (19.5) 200 పరుగుల్ని అవలీలగా దాటింది. రుతురాజ్ 33 బంతుల్లో, కాన్వే 39 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తిచేసుకున్నారు. పరుగు తేడాతో రుతురాజ్ సెంచరీని చేజార్చుకున్నాడు. ముకేశ్ దెబ్బకు... హైదరాబాద్ లక్ష్యాన్ని ధాటిగా ఛేదించేందుకు ప్రయత్నించింది. ఓపెనర్లు విలియమ్సన్ (37 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆటతో పరుగు పెట్టించారు. దీంతో ఓవర్కు 10 పైచిలుకు పరుగులు వచ్చాయి. అయితే ముకేశ్ ఆరో ఓవర్లో వరుస బంతుల్లో అభిషేక్తో పాటు రాహుల్ త్రిపాఠి (0)ని ఔట్ చేసి దెబ్బ మీద దెబ్బ తీశాడు. తర్వాత మార్క్రమ్ (17; 2 సిక్సర్లు), విలియమ్సన్ క్రీజులో ఉన్నంత వరకు 11 ఓవర్ల దాకా పటిష్టంగా కనిపించినా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. 3 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన ముకేశ్ చౌదరి తన ఆఖరి, ఇన్నింగ్స్ 20వ ఓవర్లో 6, 4, 0, వైడ్, 6, 6, 1లతో ఏకంగా 24 పరుగులు సమర్పించుకోవడంతో ధోని అసహనం వ్యక్తం చేయగా, గెలుపు అంతరం తగ్గింది. -
సీఎస్కే ఆల్రౌండ్ షో.. సన్రైజర్స్కు వరుసగా రెండో ఓటమి
-
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. సన్రైజర్స్ ఖాతాలో నాలుగో విజయం
-
కేకేఆర్ను ఢీకొట్టనున్న సన్రైజర్స్.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?
KKR VS SRH: ఐపీఎల్ 2022 సీజన్లో వరుసగా రెండు విజయాలు సాధించి జోరుమీదున్న సన్రైజర్స్ (4 మ్యాచ్ల్లో 2 విజయాలతో 8వ స్థానం).. ఇవాళ (ఏప్రిల్ 15) టేబుల్ సెకెండ్ టాపర్ కేకేఆర్ను (5 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఢీకొట్టనుంది. ఈ ఆసక్తికర మ్యాచ్ ముంబైలోని బ్రబోర్న్ మైదానం వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గతేడాది రన్నరప్ కేకేఆర్ ప్రస్తుత సీజన్లో సీఎస్కే, పంజాబ్, ముంబైలపై విజయాలు సాధించి ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలవగా, ఎస్ఆర్హెచ్.. రాజస్థాన్, లక్నో జట్ల చేతిలో ఓడి చెన్నై, గుజరాత్ జట్లపై వరుస విజయాలు సాధించింది. ఇరు జట్ల మధ్య గత రికార్డులను పరిశీలిస్తే.. సన్రైజర్స్పై కేకేఆర్ పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది. ఇరు జట్లు ముఖాముఖి తలపడిన 21 సందర్భాల్లో కేకేఆర్ 14, ఆరెంజ్ ఆర్మీ 7 మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేశాయి. గత 4 మ్యాచ్ల్లో అయితే ఎస్ఆర్హెచ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 2020 సీజన్ నుంచి ఆరెంజ్ ఆర్మీ కేకేఆర్పై ఒక్క మ్యాచ్ గెలిచింది లేదు. బలాబలాల ప్రకారం చూస్తే.. ప్రస్తుత సీజన్లోనూ కేకేఆర్ ఆరెంజ్ ఆర్మీ కంటే బలంగా కనిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రసెల్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్ వంటి స్టార్లతో కేకేఆర్ పటిష్టంగా కనిపిస్తుండగా.. విలియమ్సన్, పూరన్, భువనేశ్వర్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్ల మెరుపులపై సన్రైజర్స్ ఆధారపడి ఉంది. చెరో మార్పుతో ఇరు జట్లు.. నేటి మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేసే అవకాశం ఉంది. గుజరాత్తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ స్థానంలో సన్రైజర్స్ శ్రేయస్ గోపాల్ను బరిలోకి దించవచ్చు. కేకేఆర్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అంతగా ఆకట్టుకోని రసిక్ సలామ్కు తప్పించి శివమ్ మావికి ఆడించవచ్చు. ఎస్ఆర్హెచ్ తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, పూరన్, మార్క్రమ్, శ్రేయస్ గోపాల్, శశాంక్ సింగ్, జన్సెన్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ కేకేఆర్ తుది జట్టు (అంచనా): రహానే, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్, సామ్ బిల్లింగ్స్, నితీశ్ రాణా, రసెల్, నరైన్, కమిన్స్, ఉమేశ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి చదవండి: GT VS RR: హార్ధిక్ చేసిన ఆ పని వల్ల జరిగిన నష్టం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement