-
NRI: పల్లె నుంచి ప్రపంచస్థాయికి.. కరీంనగర్ వాసి!
కరీంనగర్: తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన ఎన్ఆర్ఐ తన టాలెంట్తో విశ్వవేదికపై మరోమారు మెరిశాడు. ఫోర్బ్స్ జాబితాలో అఫీషియల్ ఎగ్జిక్యూటీవ్గా స్థానం పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా 160కిపైగా విద్యా విషయక జర్నల్స్ రాసినందుకు ఈ గుర్తింపు లభించింది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రకటించింది. చిన్న గ్రామం నుంచి అగ్రరాజ్యానికి.. మక్తపల్లికి చెందిన చింతం రాములు–కనకలక్ష్మి దంపతుల కుమారుడు చింతం నరేందర్. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలో పూర్తిచేశాడు. ఉన్నత విద్య ఎల్ఎండీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ కరీంనగర్లో చదివాడు. 2007లో హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్గా కెరీర్.. చదువు పూర్తయిన తర్వాత నరేందర్ బెంగళూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. తర్వాత వత్తిరీత్యా అమెరికా, ఇటలీ, జర్మనీ, లండన్, స్కాట్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో పర్యటించారు. తక్కువ సమయంలో ఎక్కువ దేశాల్లో పనిచేసి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్గా గుర్తింపు పొందాడు. 2015 నుంచి అమెరికాలో స్థిరపడ్డాడు. రీసెర్చ్ పేటెంట్లు.. అమెరికా వెళ్లిన తర్వాత నరేందర్ 55 కీలక అంశాలపై రీసెర్చ్ చేసి ఇన్నోవేటివ్ పేటెంట్లు పబ్లిష్ చేశాడు. తర్వాత ప్రపంచస్థాయి కాన్ఫరెన్సులకు కీనోట్ స్పీకర్గా వ్యవహరించాడు. 11 ప్రపంచస్థాయి జర్నల్ సంస్థలకు చీఫ్ ఎడిటర్గా పనిచేస్తూ సుమారు 160 ప్రపంచస్థాయి జర్నల్ ప్రచురించాడు. అనేక విద్యాసంస్థల టెక్నికల్ కమిటీ మెంబర్గా కూడా పనిచేస్తున్నాడు. నరేందర్ను ప్రశంసిస్తూ వచ్చిన లేఖ పత్రం, నరేందర్కు వచ్చిన నేషన్ అవార్డు కేంబ్రిడ్జి నుంచి డాక్టరేట్.. నరేందర్ రీసెర్చ్ జర్నల్స్ను గుర్తించిన ప్రపంచంలోని అత్యున్నతమైన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇటీవల చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పట్టా అందజేసింది. అతి తక్కువ సమయంలోనే కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఇన్నోవేషన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో సీనియర్ ఎంటర్ఫ్రైస్ ఆర్కిటెక్ట్ స్థానం సంపాదించాడు. అనేక ఇన్నోవేటివ్ జర్నల్స్ మార్కెట్లో విడుదల చేసి, అత్యంత ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జర్నల్లో అఫీషియల్ ఎక్జిక్యూటీవ్గా స్థానం సంపాదించాడు. పిల్లర్ ఆఫ్ ది నేషన్ పురస్కారం! ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం నరేందర్కు పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రదానం చేసింది. ఈమేరకు స్పీకర్ శ్రీరాం నివాస్గోయల్ ఇటీవల అవార్డును ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈమేరకు నరేందర్ను ప్రశంసిస్తూ లేఖ కూడా పంపించారు. గ్రామంలో సంబరాలు.. తమ ఊరి యువకుడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై మక్తపల్లిలో నరేందర్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు సంబురాలు చేసుకున్నారు. నరేందర్ తల్లిదండ్రులు అందరికీ మిఠాయిలు పంచారు. -
హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. చివరికి..
సాక్షి, కుమరం భీం: తీవ్రజ్వరంతో ఒకరి మృతి చెందిన ఘటన మండలంలోని చింతగూడ గ్రా మంలో చోటు చేసుకుంది. కుటుంబ స భ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అనుమాల నరేందర్ (25) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రీవల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఐదు నెలల పాప ఉంది. నరేందర్ హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 20 రోజుల క్రితం జ్వరం వచ్చింది. ఆసుపత్రుల్లో చూపెట్టుకున్న తగ్గలేదు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్ అసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ప్రమాణం
సాక్షి,అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా గుహనాథన్ నరేందర్ సోమవారం ప్రమాణం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం జస్టిస్ నరేందర్ను గవర్నర్ అభినందించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఈ కార్యక్రమ ప్రొసీడింగ్స్ను నిర్వహించారు. అనంతరం జస్టిస్ నరేందర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు చదివి వినిపించారు. కాగా.. రాజ్భవన్లో జస్టిస్ నరేందర్ను అటు గవర్నర్, ఇటు ముఖ్యమంత్రికి జస్టిస్ ధీరజ్ సింగ్ పరిచయం చేశారు. కార్యక్రమం అనంతరం రాజ్భవన్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో అందరూ పాల్గొన్నారు. 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య జస్టిస్ నరేందర్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. జస్టిస్ నరేందర్ హైకోర్టులో నాలుగో స్థానంలో కొనసాగుతారు. మంగళవారం ఆయన జస్టిస్ దుర్గాప్రసాదరావుతో కలిసి కేసులను విచారిస్తారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే.. విజయనగరంలో జరిగిన రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం, తిరిగి రావడంలో జాప్యం జరగడంతో జస్టిస్ నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొనలేకపోయారు. దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ జి.నరేందర్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. ఆలయ ఏఈవో చంద్రశేఖర్ జస్టిస్ నరేందర్కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు సమర్పించారు. -
ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ సీఐ నరేందర్ తరలింపు
-
‘సాక్షి’ రాసింది.. ఏసీబీ కదిలింది!
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చర్యలకు ఉపక్రమించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్పై దాడి చేశారు. నరేందర్, నవీన్రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్కు, నరేందర్ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్8 దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గంలో తదుపరి గెలుపు ఎవరిది..?
కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పట్నం నరేంద్రరెడ్డి, కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డిపై 9319 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్న నరేంద్ర రెడ్డిని టిఆర్ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొడంగల్లో పోటీకి దించింది. ముఖ్యమంత్రి కెసిఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే రేవంత్ రెడ్డినియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన టిడిపి పక్షాన రెండుసార్లు ఎన్నికయ్యారు. తదుపరి ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు. టిడిపి వర్కింగ్ అద్యక్షుడుగా ఉంటూ, ఆ పార్టీని వదలి కాంగ్రెస్ ఐలో చేరి వర్కింగ్ అద్యక్షుడు అయ్యారు. నరేంద్ర రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి సోదరుడు అవుతారు. నరేంద్ర రెడ్డికి 80754 ఓట్లు రాగా, రేవంత్ రెడ్డికి 71435 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీచేసిన బాలకిషోర్కు నాలుగువేల ఓట్లు వచ్చాయి. కాగా రేవంత్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికలలో మల్కాజిగిరి నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. తదుపరి రేవంత్ పిసిసి అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2014లో ఐదుసార్లు గెలిచిన సీనియర్ నేత గురునాధరెడ్డిని 14614 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన గురునాధ రెడ్డి 2014లో టిఆర్ఎస్లో చేరి పోటీచేశారు. అయినా ఫలితం దక్కలేదు. 2014లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి విఠల్రావు 36304ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికే పరిమితం అయ్యారు. రేవంత్రెడ్డి ఒకసారి శాసనస మండలికి కూడా ఎన్నికయ్యారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి తమ్ముడికి అల్లుడు. కొడంగల్లో గురునాధ రెడ్డి ఐదుసార్లు 1978, 1983, 1989, 1999, 2004లలో గెలుపొందారు. కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి ఐదుసార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. కొడంగల్లో నందారం వెంకటయ్య ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు టిడిపి తరుపున గెలవగా ఆయన మరణం తర్వాత 1996లో జరిగిన ఉపఎన్నికలో వెంకటయ్య కుమారుడు సూర్య నారాయణ గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.అచ్యుతరెడ్డి కొడంగల్లో రెండుసార్లు గెలిచారు. కొడంగల్లో ఇంతవరకు పన్నెండుసార్లు రెడ్లు గెలుపొందితే, నాలుగుసార్లు వైశ్య సామాజికవర్గం గెలవడం విశేషం. అచ్యుత్ రెడ్డి కొంతకాలం పి.వి.నరసింహారావు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కొడంగల్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు
బంజారాహిల్స్: అధికార బీఆర్ఎస్కు చెందిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ఆయన అనుచరులపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఓ భూవిక్రయం విషయంలో ఎమ్మెల్యే, మరికొందరు తనపై భౌతిక దాడికి పాల్పడటంతోపాటు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సామ ఇంద్రపాల్రెడ్డి అనే వ్యక్తి ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ద్వారా స్థలం కొని... బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పరపల్లి నాయుడు కాలనీకి చెందిన సామ ఇంద్రపాల్రెడ్డి అదే ప్రాంతంలో స్థలం కొనేందుకు 2018లో ప్రయత్నాలు సాగించాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితోపాటు రాకేశ్రెడ్డి మధ్యవర్తులుగా ఆయనకు పరిచయమయ్యారు. వారు ఆయనకు ఉప్పర్పల్లిలోని భూయజమానులను పరిచయం చేశారు. స్థలం కొనుగోలుకు అంగీకరించిన ఇంద్రపాల్రెడ్డి... ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు కమిషన్తో కలుపుకొని రూ. 3.65 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. భూయజమానులకు రూ. 90 లక్షలను అడ్వాన్స్ కింద చెల్లించడంతోపాటు రూ. 2.75 కోట్లకు ఖాళీ చెక్కులను ఎమ్మెల్యే వద్ద ష్యూరిటీగా ఉంచాడు. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని యజమానులకు చెల్లించి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంద్రపాల్రెడ్డి... ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, ఆయన అనుచరుడు రాకేశ్రెడ్డికి చెరో రూ. 20 లక్షల చొప్పున కమీషన్ చెల్లించాడు. అయినప్పటికీ వారు ఖాళీ చెక్కులను ఇవ్వకపోగా మరో రూ. 60 లక్షలు డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆయన రుణానికి ప్రయత్నించగా లభించలేదు. దీంతో నాటి నుంచి తరచూ వేధింపులకు గురిచేస్తూ వచ్చిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు 2022 జూన్లో ఇంద్రపాల్రెడ్డిని బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు పిలిపించి తీవ్రంగా కొట్టడంతోపాటు చంపుతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగొలా తప్పించుకున్న ఇంద్రపాల్రెడ్డి దీనిపై 2022 జూన్ 26న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయలేదు. నిందితులపై చర్యలు తీసుకోవాలని వెస్ట్జోన్ డీసీపీని కోరినా స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా ఎమ్మెల్యే, ఇతరులపై కేసు నమోదుకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఫిలింనగర్లో జరగడంతో కేసును ఫిలింనగర్ పీఎస్కు బదిలీ చేశారు. -
బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 12వ పతకం ఖాయం చేసిన నరేందర్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు 12వ పతకం ఖాయమైంది. పురుషుల ప్లస్ 92 కేజీల విభాగంలో నరేందర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్యం ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో నరేందర్ 5–0తో ఇమాన్ (ఇరాన్)పై గెలిచాడు. బుధవారం మొత్తం 12 వెయిట్ కేటగిరీల్లో భారత బాక్సర్లు సెమీఫైనల్ బౌట్లు ఆడనున్నారు. -
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నరేందర్ ముందంజ..
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. నరేందర్ బెర్వాల్ (ప్లస్ 92 కేజీలు), సుమిత్ (75 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), గోవింద్ సహని (48 కేజీలు) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్లో నరేందర్ 4–1తో ఒస్కార్ సఫర్యాన్ (పోలాండ్)పై నెగ్గగా... సుమిత్ 5–0తో డామన్ ఒనీల్ (జమైకా)ను చిత్తు చేశాడు. గోవింద్ 3–2తో అరియస్ ఒరిట్జ్ (ఈక్వెడార్)పై, నిశాంత్ 5–0తో లాస్లో కొజాక్ (హంగేరి)పై విజయం సాధించారు. 86 కేజీల విభాగంలో భారత బాక్సర్ లక్ష్య చహర్ తొలి రౌండ్లో కిమ్ హైంగ్కియు (కొరియా) చేతిలో ఓడిపోయాడు. చదవండి: Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్గా.. టీమిండియా మాజీ కోచ్ -
ఆర్డీవో నరేందర్ ఆచూకీ ఎక్కడ!
సాక్షి, కామారెడ్డి: ఇటీవల సస్పెండ్ అయిన కామారెడ్డి ఆర్డీవో నరేందర్ వారం రోజులుగా కనిపించడం లేదు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తునట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన సమయంలో జిన్నారం మండలం కాజిపల్లిలో మాజీ సైనికుల పేర భూమి కేటాయించిన విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు నరేందర్పై ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన అరెస్ట్కాకుండా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. (అడిషనల్ కలెక్టర్ 'నగేష్' కేసులో మహిళ పాత్ర) ఆరోపణల వెల్లువ.. సంగారెడ్డి జిల్లాలో భూ అక్రమాల్లో సస్పెండ్ అయిన తరువాత నరేందర్పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కామారెడ్డి ఆర్డీవోగా ఆయన మూడు నెలలు పనిచేశారు. ఈ మూడు నెలల్లోనే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భిక్కనూరు మండలం జంగంపల్లి, బస్వాపూర్ గ్రామాల పరిధిలో పలు భూ వివాదాల్లో తలదూర్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా జంగంపల్లి శివారులో ప్రభుత్వ భూములను నిబంధనలను విరుద్ధంగా కట్టబెట్టే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. గతంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్గా కామారెడ్డి ప్రాంతంలో చాలా కాలం పనిచేసిన నరేందర్కు ఇక్కడి భూములపై పూర్తి అవగాహన ఉంది. దీంతో ఆయన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే భూ వివాదాల్లో తలదూర్చారని ఆరోపణలు వస్తున్నాయి. (ఆ ముగ్గురు ఎక్కడ?..) -
రవాణా కమిషనర్ కార్యాలయంలో దాడులు
సాక్షి, హైదరాబాద్: స్వయంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొలువుదీరి ఉండే రవాణా కమిషనర్ కార్యాలయంలోనే లంచావతారం పడగవిప్పింది. కొత్త వాహనాల్లో మార్పుచేర్పులు, అక్షర దోషాలను సవరించడం వంటి విధులు నిర్వహించే పరిపాలనాధికారి జె.నరేందర్ మంగళవారం రూ.36 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలా అవినీ తికి పాల్పడుతూ నరేందర్ ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి. ఖైరతాబాద్లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సంగారెడ్డికి చెందిన సీహెచ్ సందీప్ ట్రేలర్ అండ్ ట్యాంకర్గా వాహనాన్ని మార్పు చేసుకోవడం కోసం రవాణాశాఖ నుంచి ప్రొసీడింగ్స్ను పొందేందుకు గత నెల 13న అడ్మినిస్ట్రేటివ్ అధికారి నరేందర్ను సంప్రదించాడు. సదరు అనుమతుల కోసం రూ.36 వేలు లంచం ఇవ్వాల్సిందిగా నరేందర్ డిమాండ్ చేశాడు. చివరకు రూ.30 వేలు తీసుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో సందీప్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు రూ.36 వేల నగదును నరేందర్కు అందజేశాడు. అప్పటికే నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు నరేందర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. 2016 జనవరి 4న ఒక కేసులో రూ.8,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేందర్ తిరిగి మరోసారి పట్టుబడటం గమనార్హం. అతన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి.. రవాణా శాఖలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్–1064కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ దాడులతో హైదరాబాద్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. దళారులను కార్యాలయాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటించారు. -
విజేత నరేందర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న యూరోపియన్ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్విమ్మర్ బండి నరేందర్ సత్తా చాటాడు. ఇటలీలో జరుగుతోన్న ఈ పోటీల్లో పీర్జాదిగూడకు చెందిన నరేందర్ 800మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్నాడు. ఈ ఈవెంట్లో అమెరికాకు చెందిన వెన్ పీటర్ రజతాన్ని గెలుచుకోగా... రష్యా స్విమ్మర్ బుచర్ రాబర్ట్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఈ క్రీడల్లో నరేందర్ స్విమ్మింగ్తో పాటు ఆర్చరీలోనూ రాణిస్తున్నాడు. ఆర్చరీలో అతను రెండోరౌండ్ పోటీలకు అర్హత సాధించాడు. -
మరో రెండు జిల్లాల ఏర్పాటుకు డిమాండ్
వరంగల్ : పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా రాష్ట్రప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. తెలంగాణలో కొత్త జిల్లాల డిమాండ్ ఆగడం లేదు. తమ ప్రాంతాన్ని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఎక్కడో చోట నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని ‘హెడ్ క్వార్టర్స్’గా ‘వరంగల్’ జిల్లాను ఏర్పాటు చేయాలని, ‘హన్మకొండ’ను మరో జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. సాక్షాత్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, తూర్పు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ డిమాండ్ను తెరపైకి తేవడం గమనార్హం. ప్రస్తుతం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వరంగల్ జిల్లాను విభజించి.. జనగామ్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహాబూబాదాద్ జిల్లాలుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఇప్పటికే ఆరు జిల్లాలుగా విభజించారు. అయితే, వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని ‘హెడ్ క్వార్టర్స్’గా ‘వరంగల్’ జిల్లాను ఏర్పాటు చేయాలని, ‘హన్మకొండ’ను మరో జిల్లాగా ప్రకటించాలని, ఈ మేరకు రెండు జిల్లాల మార్పు అనివార్యమని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తాజాగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా మొదట ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ.. కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
‘కేసీఆర్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించండి’
శంషాబాద్: రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని పీసీసీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు జల్లపల్లి నరేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు, హైకోర్టు న్యాయవాది కాజా హైమద్తో కలసి సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్కుమార్కు ఆయన వినతిపత్రం అందజేశారు. దళితులను సీఎం చేస్తానన్న హామీని తుం గలో తొక్కి ఎస్సీ, ఎస్టీ ప్రజలను వంచించారన్నారు. అడ్డగోలు హామీలతో ప్రజలను మోసగించిన ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే కనీస అర్హతలేదని, ఆయన్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. -
‘నష్టం కలిగిస్తే ఉగ్ర నరసింహుడినే!’
వరంగల్ అర్బన్: ‘‘ఎమ్మెల్యే టిక్కెట్ బాజాప్తా అడుగుతా.. నేనే కాదు.. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు ఆ హక్కు ఉంది. నాకు రాజకీయంగా నష్టం కలిగిస్తే ఉగ్ర నరసింహ అవతారమెత్తుతా’’అని వరంగల్ గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన పలు విమర్శలపై ఘాటు గా బదులిచ్చారు. తాను 2009 నుంచి ఉద్య మంలో పనిచేస్తున్నానని, 2014లో వరంగల్ తూర్పు టిక్కెట్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను అడిగానన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ ఆదేశంతో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశానని పేర్కొన్నారు. సురేఖను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. -
రక్తపు చేతులతోనే మరొకరికి తాళి..
మోత్కూరు (తుంగతుర్తి): ప్రేమించిన అమ్మా యిని హత్య చేసి ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్డాడు ఓ కిరాతకుడు. తనను ప్రేమించి ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటున్నా వని నిలదీసినందుకు ప్రియురాలిని తన వ్యవసాయ బావివద్ద చంపేసి, మట్టిదిబ్బ గోతిలో పూడ్చాడు. హత్యచేసిన మరుసటి రోజే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ దారుణం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో మంగళవారం వెలుగుచూసింది. మాట్లాడుదామని నమ్మించి.. మోత్కూరు మండల బుజిలాపురానికి చెందిన కాసగాని సత్తయ్య–ఆండాలు దంపతుల కుమారుడు నరేందర్(25) అలియాజ్ నందు, మోత్కూరుకు చెందిన బొడ్డుపల్లి లక్ష్మయ్య–లక్ష్మీ దంపతుల రెండవ కుమార్తె భార్గవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆత్మకూర్ లోని వినాయక ఆస్పత్రిలో భార్గవి రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. అదే ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్గా నరేందర్ పనిచేస్తున్న సమయంలో స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల నరేందర్కు జనగాం జిల్లా గుండాల మండలం సుద్దాలకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. 4వ తేదీన పెళ్లి పెట్టుకున్నారు. దీంతో భార్గవి తనను పెళ్లి చేసుకోవాలని నరేందర్ను నిలదీసింది. నరేందర్ 3వ తేదీన మాయమాటలు చెప్పి భార్గవిని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే బండరాయితో మోది హత్య చేశాడు. మృతదేహాన్ని వ్యవసాయ బావి వద్ద పూడ్చిపెట్టాడు. 4వ తేదీన సుద్దాలలో నరేందర్ వివాహం చేసుకున్నాడు. భార్గవి కనిపించకపోవడంతో ఆమె తండ్రి, బంధువులు అక్కడికి వెళ్లి గొడవ చేశా రు. పోలీస్స్టేషన్ను ఆశ్రయించగా 5వ తేదీన భార్గవి అదృశ్యమైనట్లు ఆత్మకూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నరేందర్పై అను మానం వ్యక్తం చేసి విచారణ జరిపారు. దీంతో భార్గవిని హత్యచేసినట్లు అంగీకరించాడు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్గవిని ఎలా హత్య చేశాడు, అతడికి ఎవరైనా సహకరించారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. నరేందర్కు ఇది రెండో పెళ్లి.. నరేందర్ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్లోని కీసర ప్రాంతానికి చెందిన మేనమామ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన నాలుగేళ్లకే ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు రెండో వివాహం చేసుకున్నాడు. -
చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని..
నల్లొండ: మూడేళ్ల పాటు ప్రేమలో మునగితేలిన ఓ జంట.. ఇంట్లో తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆర్య సమాజ్ లో వివాహం చేసుకుంది. గురువారం అచ్చూ సినీ ఫక్కీలో జరిగిన యవతి కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుందర్ నగర్ కు చెందిన గుంటిపల్లి నరేందర్(21), విద్యానగర్ కు చెందిన దీప(20) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీప చదువు(బీ-ఫార్మసీ) పూర్తవడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు. దీప తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి నిరాకరించారు. దీంతో గత నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్ లో ప్రేమ జంట ఒక్కటైంది. అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీని యువజంట ఆశ్రయించింది. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో కాపురం పెట్టిన నరేందర్-దీపలు శుభకార్యం కోసం గురువారం పట్టణానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న దీప తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున నరేందర్ ఇంటికి చేరుకుని ఆందోళన చేశారు. కొద్దిసేపటికి 20 మంది గుర్తు తెలియని దుండగులు నరేందర్ ఇంటిపై దాడి చేసి కుటుంబసభ్యులను చితక్కొట్టారు. దీపను కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. దీంతో నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీప ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. -
కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య
భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఒక వ్యక్తి విషం తాగి తనువు చాలించాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక లక్ష్మారెడ్డిపాలెం మైత్రీకుటీర్ నివాసి చెర్కుపల్లి నరేందర్ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. కాగా, అతనికి కొంతకాలంగా భార్యతో గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నరేందర్ బుధవారం ఉదయం ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నలుగురు నయీం అనుచరులు అరెస్ట్
గ్యాంగ్స్టర్ నయీం గ్యాంగ్కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 40 ఎకరాల స్థలాన్ని కాజేయడానికి యత్నించిన నలుగురు ముఠాను మెదక్ జిల్లా పటాన్చెరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరికి చెందిన 40 ఎకరాల భూమిని తమ పెరు పైకి మార్చాలని నయీం అనుచరులు ప్రతాప్, నరేందర్, మహేష్, అశోక్ ఉద్యోగ సంఘం నేత రవీందర్గౌడ్ను బెదిరించారు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. -
తహసీల్దార్ నరేందర్కు కన్నీటì వీడ్కోలు
ముకరంపుర :గుండెపోటుతో మృతిచెందిన మెట్పల్లి తహసీల్దార్ వి.నరేందర్కు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. కరీంనగర్లోని ఖార్ఖానాగడ్డలోని ఆయన నివాసానికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు చేరుకుని మృతదేహం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఖార్ఖానాగడ్డలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిశాయి. కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ శ్రీదేవసేన, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, జగిత్యాల సబ్కలెక్టర్ శశాంక, కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, సిరిసిల్ల ఆర్డీవో శ్యాంసుందర్, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవ్ తదితరులు నివాళులర్పించారు. తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాÄæూస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్, కార్యదర్శి సుగుణాకర్రెడ్డి, పెన్షనర్స్ సంఘం నాయకులు నర్సయ్య, కేశవరెడ్డి తదితరులు నివాళులర్పించారు. -
గుండెపోటుతో తహశీల్దార్ మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మెట్పల్లి తహశీల్దార్ నరేందర్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్థరాత్రి నరేందర్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే నరేందర్ మార్గమధ్యంలోనే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. నరేందర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
మలేసియా జైళ్లలో తెలుగు కార్మికులు
విజిట్ వీసాలపై మలేసియా వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వారిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ దేశ రాజధాని కౌలాలంపూర్ జలన్భూత్ ప్రాంతంలోని నివాస గృహాలపై రెండు రోజుల క్రితం దాడులు చేపట్టిన అక్కడి పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా ఉంటున్నారనే కారణంతో దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా అక్కడి సూపర్మార్కెట్లో పని చేస్తున్న నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నాగాపూర్ వాసి నరేందర్ ‘సాక్షి’కి ఫోన్లో ఈ మేరకు సమాచారం అందించారు. తాజా దాడులతో మలేసియాలో పని చేస్తున్న తెలుగువారు భయాందోళనలకు గురవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ పట్టుబడిన వారిని జైళ్లలోనూ డిటెన్షన్ సెంటర్లలోనూ ఉంచుతున్నారు. ఆరునెలల కాలంలో రెండోసారి పోలీసులు దాడులు నిర్వహించారని నరేందర్ వివరించారు. అయితే పట్టుబడిన వారి వివరాలను గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి ఇక్కట్లు పడుతున్న తమను స్వగ్రామాలకు చేర్చాలని బాధితులు కోరుతున్నారు. -
హాట్ సీటు!
రెండో స్థానానికి టీఆర్ఎస్లో పోటాపోటీ రేసుగుర్రాలపై స్థానికంగా అసంతృప్తి అభ్యర్థుల ఖరారుపై వ్యూహాత్మక మౌనం నరేందర్కు సీటు దాదాపు ఖరారు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి అభ్యర్థులను ప్రకటించకుండా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థి బలాబలాలను బేరీజు వేసుకున్న తర్వాతే అభ్యర్థులను ఖరారుచేసే అంశాన్ని గులాబీ అధినాయకత్వం పరిశీలిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 9న నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రేసుగుర్రాల ప్రకటనకు మరో ఒకట్రెండు రోజుల సమయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్రెడ్డి అభ్యర్థిత్వానికి గులాబీ బాస్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండో సీటుకు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు కూడా మొదటి సీటు జోలికి వెళ్లకుండా.. రెండో స్థానానికి తమ పేరును పరిశీలించాలని అభ్యర్థిస్తుండడం చూస్తే ‘పట్నం’కు టికెట్ ఖాయం అయినట్లు భావించాల్సివస్తోంది. అధిష్టానం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ, నరేందర్రెడ్డి మాత్రం కొంతకాలం స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు కూడగట్టే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. నిధుల కేటాయింపు, ఇతరత్రా అభివృద్ధి పనుల మంజూరులో కీలకభూమిక పోషిస్తూ ఎంపీటీసీలతో సత్సంబంధాలను ఏర్పరుచుకున్నారు. మరోసారి ఎమ్మెల్సీగా బరిలో ఉంటాననే ముందుచూపుతో నరేందర్.. ముందస్తు వ్యూహాన్ని అమలు పరిచినట్లు తెలుస్తోంది. అయితే, ఈయన అభ్యర్థిత్వాన్ని పార్టీలో ఒకవర్గం అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, హైకమాండ్ ఆదేశాలను శిరసా వహిస్తామని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పట్నం అభ్యర్థిత్వానికి ప్రతిబంధకాలు ఉండకపోవచ్చు. రెండో సీటుపైనే గురి! ఒక స్థానానికి నరేందర్ అభ్యర్థి దాదాపుగా ఖరారైందని ప్రచారం జరుగుతున్న తరుణంలో రెండో సీటునుంచి పోటీ చేసేందుకు ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమదైన శైలిలో పావులు కదుపుతూ అధినాయకుల ఆశీస్సుల కోసం చక్కర్లు కొడుతున్నారు. రెండో సీటు ఖరారులో సామాజిక సమతుల్యత, ఆర్థిక వనరులను పరిగణనలోకి తీసుకుంటారని ఆశావహులు భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శంభీపూర్ రాజు, పార్టీ అధ్యక్షుడు నాగేందర్గౌడ్, సీనియర్ నేతలు రాగం నాగేందర్యాదవ్, సామల వెంకటరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో రేసుగుర్రాలెవరనే అంశంపై మాత్రం ముఖ్యనేతలు నోరుమెదపడంలేదు. పెద్దల సభకు అనుభవజ్ఞులను రంగంలోకి దింపాలని ఇప్పటికే కొందరు అగ్రనాయకులు అధిష్టానం దృష్టికి తెచ్చారు. జిల్లా సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహనలేకుండా అభ్యర్థులను బరిలో దింపడం వల్ల నష్టం జరుగుతుందని సీఎంకు స్పష్టం చేశారు. మరోవైపు రెండో స్థానంపై కన్నేసిన మాజీ కార్పొరేటర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తనయుడు ప్రశాంత్రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులోభాగంగా శుక్రవారం కొంతమంది స్థానిక సంస్థల ప్రతినిధులతో రహాస్య సమావేశం నిర్వహించారు. యువతకు అవకాశం కల్పించాలని భావిస్తే రాజకీయ అనుభవం ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇలా ఎవరికివారు రెండో సీటుపై గురి పెట్టడంతో ఈ స్థానానికి అభ్యర్థిని ఖ రారు చేయడం అధిష్టానానికి ఒకింత తలనొప్పిగా మారింది. ఇదిలావుండగా, రేసుగుర్రాలపై మాత్రం స్థానిక నాయకత్వంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి సీటు కేటాయించడమేకాదు.. అందరినీ సమన్వయం చేయడం పార్టీకి పెద్ద సవాలు కానుంది. -
యువతిని రైలు కిందకు తోసి హత్య
చేగుంట, మాటా మాటా పెరిగి ఆవేశంతో ఓ యువతిని రైలు కింద తోసి హత్యకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మాసాయిపేటకు చెందిన మున్నీబీ, ఆమె కుమార్తె తస్లిం(23) మేడ్చల్లోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. హైదరాబాద్లో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు మున్నీబీ ముందుగానే వెళ్లిపోవడంతో తస్లిం శనివారం పరిశ్రమలో పని ముగించుకుని శ్రీనివాస్నగర్ రైల్వేస్టేషన్కు వచ్చింది. తస్లిం పనిచేసే పరిశ్రమలోనే విధులు నిర్వర్తించే మేడ్చల్కు చెందిన నరేందర్ అక్కడ తారసపడ్డాడు. మాట్లాడుతుండగానే వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన నరేందర్ అటువైపు వస్తున్న రైలు కిందికి తోసేశాడు. దాంతో తస్లిం అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసిన ప్రయాణికులు నరేందర్ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అయితే వారి గొడవకు కారణమేంటో తెలియలేదు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement