-
అందుకే ఆ రెండు నెలలు అక్కడే ఉన్నాం: కోహ్లి
రెండు నెలల పాటు ఆటకు దూరంగా.. కుటుంబానికి దగ్గరగా ఉండటం వింత అనుభూతినిచ్చిందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి గడిపిన మధుర క్షణాలు వెలకట్టలేనివని పేర్కొన్నాడు. ఇప్పుడిక మళ్లీ ఆట మొదలుపెట్టానన్న కోహ్లి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు విరాట్ కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో సెలవు తీసుకున్న ఈ రన్మెషీన్.. ఫిబ్రవరి 15న తమకు కుమారుడు జన్మించాడని ప్రకటించాడు. పిల్లాడికి అకాయ్గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు ఈ ఆర్సీబీ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) బ్యాటర్. సీఎస్కేతో జరిగిన ఆరంభ మ్యాచ్లో కేవలం 21 పరుగులకే పరిమితమైన కోహ్లి.. సోమవారం నాటి మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్తో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో 49 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఆర్సీబీని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 𝗙𝗹𝘂𝗲𝗻𝘁! ✨ King Kohli is off the mark in the chase and how 😎 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS | @imVkohli pic.twitter.com/mgYvM716Gs — IndianPremierLeague (@IPL) March 25, 2024 ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆ రెండు నెలల పాటు సాధారణ జీవితం గడిపే అవకాశం వచ్చింది. అప్పుడు మేము మన దేశానికి దూరంగా.. రోడ్డు మీద నడుస్తున్నా మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రదేశంలో ఉన్నాం. కుటుంబమంతా కలిసే ఉన్నాం. అదొక వింతైన అనుభూతి. ఇద్దరు పిల్లలు ఉన్నపుడు వారితో గడిపే సమయాన్ని కూడా పెంచుకోవాలి కదా! ఏదేమైనా ఆ రెండు నెలలు మొత్తంగా ఫ్యామిలీతో ఉండేందుకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ మధురానుభూతులను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడిక ఆట మొదలైంది. కచ్చితంగా నా బెస్ట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా’’ అని కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా ఆర్సీబీ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. కాగా కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు తొలి సంతానంగా కూతురు వామిక జన్మించిన సంగతి తెలిసిందే. -
విరాట్ కోహ్లి షాకింగ్ నిర్ణయం?!
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు శాశ్వతంగా భారత్ను వీడనున్నారా? ముంబైకి గుడ్బై చెప్పి యునైటెడ్ కింగ్డంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా?.. విరుష్క జోడీ గురించి సోషల్ మీడియాలో తాజాగా నడుస్తున్న చర్చ ఇది. భారత క్రికెట్ జట్టులో అడుగుపెట్టిన అనతికాలంలోనే కీలక సభ్యుడిగా ఎదిగి.. కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు ఢిల్లీ బ్యాటర్ విరాట్ కోహ్లి. నాటి సారథి మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా టీమిండియా పగ్గాలు చేపట్టి జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. నాయకుడిగా తన పాత్ర పూర్తైన తర్వాత కేవలం ఆటగాడిగానే కొనసాగాలని నిర్ణయించుకున్న ఈ రన్మెషీన్ ప్రస్తుతం పూర్తిగా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక కోహ్లి వ్యక్తిగత జీవితానికొస్తే.. బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు. ఈ జంటకు 2021, జనవరిలో తొలి సంతానంగా కుమార్తె వామిక జన్మించింది. అయితే, బాహ్య ప్రపంచానికి, సోషల్ మీడియాకు వామికను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆమె ఫేస్ను రివీల్ చేయలేదు విరుష్క. ఇక ఇటీవలే లండన్లో జన్మించిన(ఫిబ్రవరి 15) తమ కుమారుడు అకాయ్ విషయంలోనూ ఇదే సూత్రం పాటిస్తోంది ఈ స్టార్ జోడీ. పిల్లల గోప్యత, భద్రత దృష్ట్యా వారికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లి- అనుష్క దేశాన్ని వీడి యూకేలోనే సెటిల్ అవ్వనున్నారంటూ నెటిజన్లు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ మేరకు రెడిట్లో.. ‘‘విరాట్ ఐపీఎల్ కోసం ఇండియాకు వచ్చాడు. అయితే, అతడి కుటుంబం యూకేకు షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది.కోహ్లి క్రికెట్కు దూరమైన తర్వాత శాశ్వతంగా అక్కడే సెటిల్ అవుతారనిపిస్తోంది. అవును.. నిజమే తనకు యూకే అంటే ఇష్టమని కోహ్లి చాలాసార్లు చెప్పాడు. అక్కడైతే సామాన్య పౌరుడిలా జీవనం గడపవచ్చని అన్నాడు. తన పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు. నిజానికి డబ్బున్నవాళ్లు యూకేలో ప్రశాంత జీవనం గడపవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ పాపరాజీల గోల ఉండదు. ముంబైలో విరుష్క కూతురిని ఫొటోలు తీసేందుకు వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేశారో చూశాం కదా!’’ అంటూ నెటిజన్ల మధ్య సంభాషణ సాగింది. ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్ సదరు పోస్టులపై మండిపడుతున్నారు. కావాలంటే లండన్కు వెళ్లివస్తారే తప్ప విరాట్ కోహ్లి- అనుష్క శర్మ ఎప్పటికీ దేశాన్ని వీడరని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి ఐపీఎల్-2024 కోసం ఇటీవలే స్వదేశానికి తిరిగి రాగా.. పిల్లలతో కలిసి అనుష్క లండన్లోనే ఉన్నట్లు సమాచారం! It’s time for the arrival video you were waiting for! ❤️👑 Virat Kohli returns to his den in Namma Bengaluru, ahead of the #IPL. Watch what he has to say on @bigbasket_com presents Bold Diaries! Download the Big Basket App now. 📱#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Homecoming… pic.twitter.com/t3MPYtORAF — Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024 -
కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్
వ్యాపారవేత్తలే కాకుండా ప్రముఖులు సైతం కంపెనీలు స్థాపిస్తున్నారు. అందులో పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి అయ్యే మంచి బిజినెస్ మోడల్ ఉన్నవారికి ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. దాంతో ఇరువురికి లాభం జరిగేలా వ్యవహరిస్తున్నారు. అందులో కొన్ని కంపెనీలు మరింత వృద్ధి చెంది ఐపీవోగా స్టాక్మార్కెట్లోనూ లిస్ట్ అవుతున్నాయి. అలాంటి సంస్థ ‘గో డిజిట్’ ఐపీవోకు తాజాగా సెబీ ఆమోదం తెలిపింది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెట్టుబడి పెట్టిన ‘గో డిజిట్’ ఐపిఓకి వెళ్లేందుకు లైన్క్లియర్ అయింది. అందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్లో ఇన్వెస్టర్ అయిన కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ గ్రూప్ కూడా మద్దతు తెలిపింది. ఆగస్టు 2022లో కంపెనీ ఐపీఓ కోసం ప్రిలిమినరీ పత్రాలను దాఖలు చేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) వివరాల ప్రకారం..గో డిజిట్ ఐపీఓలో రూ.1,250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా సమకూరే మూలధనాన్ని కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా నిధులు సేకరించేందుకు కంపెనీ మొదటగా ఆగస్టు 2022లో సెబీకు డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. అయినప్పటికీ, ఉద్యోగులకు సంబంధించి స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ స్కీమ్లోని కొన్ని కారణాల వల్ల కొద్దికాలంపాటు నిలిచిపోయింది. సెబీ జనవరి 30, 2023న గో డిజిట్ డ్రాఫ్ట్ ఐపీఓ పేపర్లను తిరిగి ఇచ్చింది. కంపెనీ నుంచి మరింత సమాచారం కోరింది. ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ సవరించిన సమాచారంతో ఏప్రిల్ 2023లో ప్రిలిమినరీ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అన్ని పరిశీలించిన సెబీ తాజాగా ఐపీవోకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. -
Virushka: అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?!
భారత కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. క్రీడా, సినీ సెలబ్రిటీలు.. వ్యాపార దిగ్గజాలు మూడు రోజుల పాటు జరిగే ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగమయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. గుజరాత్లోని జామ్నగర్కు విచ్చేసి అంబానీ కుటుంబ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ‘‘విరాట్ కోహ్లి- అనుష్క శర్మ.. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. రాజు- రాణి వచ్చేశారు’’ అంటూ ఎయిర్పోర్టులో కోహ్లి- అనుష్క దంపతులు నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే, ఇది పాత ఫొటో. గతేడాది జూన్లో ఈ జంట ఎయిర్పోర్టు వద్ద ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మానవ్ మంగ్లానీ అనే పాపరాజీ అప్పట్లో షేర్ చేశాడు. అయితే, తాజాగా కొంతమంది ఇందులోని ఫొటోలు గ్రాబ్ చేసి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి వెళ్తున్నాడా? విరాట్ కోహ్లి 2017లో బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లాడాడు. ఇటలీ వేదికగా పెళ్లి జరుగగా.. ముంబైలో రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీతో కలిసి హాజరయ్యారు. అయితే, ప్రస్తుతం అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడులకు కోహ్లి దంపతులు హాజరుకావడం లేదని సమాచారం. ఇటీవలే అనుష్క శర్మ లండన్లో తమ రెండో సంతానం అకాయ్కు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమైన విరాట్.. కుటుంబంతో కలిసి లండన్లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జామ్నగర్కు విరుష్క జోడీ రావడం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటికే క్రికెట్ సూపర్స్టార్లు సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ తదితరులు అంబానీ ఇంట సంబరాల్లో పాల్గొనేందుకు గుజరాత్కు విచ్చేశారు. -
Ind Vs Eng: టీమిండియా గెలుపుపై కోహ్లి స్పందన.. పోస్ట్ వైరల్
టీమిండియా సిరీస్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఇంగ్లండ్పై భారత యువ జట్టు అద్భుత రీతిలో గెలుపొందిందని ప్రశంసించాడు. ఆటగాళ్ల పట్టుదల, అంకిత భావమే.. కఠిన సవాళ్లను దాటి ఇక్కడిదాకా తీసుకువచ్చిందని కోహ్లి కొనియాడాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. భార్య అనుష్క శర్మ తమ రెండో బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో అతడు తన కుటుంబానికి సమయం కేటాయించాడు. ఈ నేపథ్యంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత కోహ్లి లేకుండా టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ బరిలో దిగింది. మరోవైపు.. కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కాగా.. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ సమస్యలతో అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో రెండో టెస్టులో రజత్ పాటిదార్, మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేశారు. ఇక నాలుగో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వీళ్లలో రజత్ పాటిదార్ మినహా మిగతా ముగ్గురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో ధ్రువ్ జురెల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా విరాట్ కోహ్లి స్పందిస్తూ.. ‘‘అవును.. టీమిండియా గెలిచింది. అద్భుతమైన సిరీస్లో యువ జట్టు దేశాన్ని గెలిపించింది. పట్టుదల, అంకిత భావం.. సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే తత్వమే ఈ విజయానికి కారణం’’ అని పేర్కొన్నాడు. YES!!! 🇮🇳 Phenomenal series win by our young team. Showed grit, determination and resilience.@BCCI — Virat Kohli (@imVkohli) February 26, 2024 కాగా హైదరాబాద్ టెస్టులో ఓడి పరాజయంతో సిరీస్ ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్కోట్.. తాజాగా రాంచి టెస్టులో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. ఇక కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్ జన్మించిన విషయం తెలిసిందే. కుమారుడి రాక గురించి తెలియజేసే పోస్ట్ తర్వాత.. కోహ్లి తాజాగా టీమిండియా విజయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. చదవండి: #Rohit Sharma: కష్టపడాల్సి వచ్చింది.. అతడు అత్యద్భుతం.. వాళ్లు లేకపోయినా గెలిచాం!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement