-
కమల్ హాసన్- మణిరత్నం కాంబో.. ఆ హీరోలు మళ్లీ..!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సాధించిన సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షెడ్యూల్ వాయిదా పడడంతో నటుడు జయం రవి ఆ తరువాత దుల్కర్ సల్మాన్ ఇటీవల సిద్ధార్థ్ కూడా థగ్స్ లైఫ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అలాగఇందులో నటుడు శింబును ఒక ముఖ్యపాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ముందుగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిన జయంరవి, దుల్కర్ సల్మాన్లు మళ్లీ ఈ చిత్రంలో నటించడానికి తిరిగి వస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే కమలహాసన్ థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారన్నది తాజా సమాచారం. -
గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్
తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే స్టార్స్ అయిన హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు. అందులో మృణాల్ ఠాకుర్ ఒకరు. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది. కానీ 'ఫ్యామిలీ స్టార్'తో ఈమెకు ఫస్ట్ దెబ్బ పడింది. అయితే ఈమెని ఇప్పటికీ 'సీతారామం' బ్యూటీ అనే పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. ఆ చిత్ర అనుభవాలని పేర్కొంది. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'నా ఫ్రెండ్, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మానే. 'సీతారామం' షూటింగ్ టైంలో ఆయన సహకారం అస్సలు మరిచిపోను. చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్తున్నప్పుడు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా పూర్తిగా మారిపోతా. అలా నటించిందే 'సీతారామం'లోని సీతామహాలక్ష్మి పాత్ర. ఈ పాత్ర నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది' తెలుగులో ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లోనూ ఒకే తరహాలో డబ్బింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన మృణాల్.. హిందీలో మాత్రం గ్లామరస్ రోల్స్ చేసింది. తెలుగులోనూ ఈమెకు అలాంటి పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తే, మృణాల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా ఈమెని 'సీతారామం' బ్యూటీగానే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. తమిళంలోకి త్వరలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) -
'లక్కీ భాస్కర్' బ్యాంక్ ఖాతాలో కోట్లలో డబ్బు.. ఆసక్తిగా టీజర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా లక్కీ భాస్కర్.. పుష్కర కాలం పాటు ఆయన ఎన్నో చిత్రాలతో మెప్పించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సమయం నుంచి ఆసక్తిని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను విడుదల చేశారు మేకర్స్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. 'మగధ బ్యాంక్లో క్యాషియర్గా పని చేసే పాత్రలో దుల్కర్ కనిపించారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించనున్న సినిమా ఇది. ‘లక్కీ భాస్కర్’ టీజర్ను గమనిస్తే డబ్బు చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. జులై నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. -
మణిరత్నంకు నో చెప్పిన దుల్కర్ సల్మాన్
-
‘లక్కీ భాస్కర్’తో దుల్కర్ అసాధారణమైన ప్రయాణం
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కెరీర్ ఆరంభమై పుష్కర కాలం అయింది. ఇన్నేళ్లల్లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. ‘‘ఈ చిత్రంలో మగధ బ్యాంక్లో క్యాషియర్గా పని చేసే దుల్కర్ లుక్ని విడుదల చేశాం. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
స్టూడెంట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ కీలక పాత్రలు పోషించనున్నారు. పీరియాడికల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా 1970 నేపథ్యంలో ఉంటుందని, సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, అందులో ఒకటి స్టూడెంట్ రోల్ అని కోలీవుడ్ సమాచారం. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందట. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రంగరాయ శక్తివేల్ నాయకర్.. థగ్లైఫ్
‘నాయగన్ ’(1987) చిత్రం తర్వాత హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూ΄÷ందుతున్న తాజా చిత్రానికి ‘థగ్ లైఫ్’ టైటిల్ని ఖరారు చేసి, టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను సోమవారం రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ చిత్రంలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి కీలక ΄ాత్రలు ΄ోషించనున్నట్లు కూడా వెల్లడించారు. ‘రంగరాయ శక్తివేల్ నాయకర్.. నాది కాయల్ పట్టినమ్’, ‘రంగరాయ శక్తివేల్ నాయకర్ అంటే క్రిమినల్, గూండా, యాకుజా. యాకుజా అంటే జపనీస్లో గ్యాంగ్స్టర్ అని అర్థం’, ‘చావు నా కోసం ఎదురుచూడటం ఇదేం తొలిసారి కాదు. చివరిసారి కూడా కాదు’, ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్.. మర్చి΄ోవద్దు’ అని కమల్హాసన్ చెప్పే డైలాగ్స్ ‘థగ్స్ లైఫ్’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో ఉన్నాయి. కమల్హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నేడు కమల్ బర్త్ డే సందర్భంగా ‘థగ్ లైఫ్’కి సంబంధించిన విశేషాలను సోమవారం వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: రవి కె.చంద్రన్. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్ కాంబో రిపీట్ అవుతోంది. -
ఓటీటీలో దుల్కర్ యాక్షన్ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ప్రేమకథలకు చిరునామాగా మారిన దుల్కర్ సల్మాన్ తొలిసారి యాక్షన్ అవతారమెత్తిన చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించాయి. అన్ని భాషల్లోనూ దుల్కర్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆగస్టు 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 22న ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. సడన్గా ఓటీటీలో వస్తుందేమో అంటే అదీ జరగలేదు. దీంతో ఈ నెల 28 లేదా 29న ఏదో ఒకరోజు ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెర దించుతూ అధికారిక ప్రకటన వెలువడింది. హాట్స్టార్లో సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు హాట్స్టార్ ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారా? లేదా? అన్నది మాత్రం స్పష్టత లేదు. సినిమా కథేంటంటే.. కింగ్ ఆఫ్ కొత్త కథ 80,90వ దశకంలో సాగుతుంది. కోతా అనే టౌన్కి చెందిన రాజు(దుల్కర్ సల్మాన్) తండ్రి రవిలాగే తాను కూడా ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. దాన్ని సాకారం చేసుకుంటాడు. అతనికి చెల్లి రీతూ(అనికా సురేంద్రన్)అంటే చాలా ఇష్టం. కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడేది కాదు. దీంతో కోతా టౌన్లోనే స్నేహితుడు కన్నా(షబీర్ కళ్లరక్కల్)తో కలిసి వేరుగా ఉండేవాడు. రాజుకి అదే ప్రాంతానికి చెందిన తార(ఐశ్వర్య లక్షీ) అంటే చాలా ఇష్టం. ఆమె కోసమే కోతాలో డ్రగ్స్ అనేది లేకుండా చేస్తాడు. ఓ కారణంగా రాజుకు తాగుడు బానిసైతాడు. నెమ్మదిగా కోతా ప్రాంతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న కన్నా.. కన్నాభాయ్గా మారి ఆ ప్రాంతంలో డ్రగ్స్ని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాడు. అయితే ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ని మట్టుపెట్టిన సీఐ శావుల్(ప్రసన్న) కోతాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. కన్నాభాయ్కి చెక్ పెట్టేందుకుగానూ రాజుని మళ్లీ కోతా వచ్చేలా చేస్తాడు. అసలు రాజు ఎందుకు కోతాని వదిలి వెళ్లాడు? ప్రాణ స్నేహితులుగా ఉన్న కన్నా, రాజులు ఎందుకు శత్రువులుగా మారారు? చివరకు కోతా ఎవరి ఆధీనంలోకి వెళ్లింది? అనేది తెలియాలంటే ‘కింగ్ ఆఫ్ కోతా’ను ఓటీటీలో చూడాల్సిందే. చదవండి: శరత్ బాబు రెండో భార్యగా నా ఫోటోలు.. చాలా బాధేసింది!! -
లక్కీ భాస్కర్ షురూ
‘మహానటి, సీతారామం’ వంటి హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’ షూరూ అయింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోంది. ‘సార్’(తమిళంతో ‘వాతి’) చిత్రం తర్వాత వెంకీ అట్లూరితో మేము నిర్మిస్తున్న రెండో పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
దుల్కర్కు జోడీగా..?
తెలుగు పరిశ్రమలో కథానాయికగా మీనాక్షీ చౌదరికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మహేశ్బాబు ‘గుంటూరు కారం’, వరుణ్తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారీ బ్యూటీ. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘లక్కీభాస్కర్’ చిత్రంలోని హీరోయిన్ చాన్స్ కూడా మీనాక్షీకే లభించిందని టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం. పాన్ ఇండియా ఫిల్మ్గా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. నవంబరులో షూటింగ్ ప్రారంభం కానుందట. -
కింగ్ ఆఫ్ కొత్త.. దుల్కర్ సినిమాకు పేలవమైన కలెక్షన్స్
దుల్కర్ సల్మాన్.. ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్లను ఎంచుకుంటూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తుంటాడీ హీరో. సీతారామం సినిమాతో తెలుగువారికీ దగ్గరైన ఈ హీరో తొలిసారి పూర్తి మాస్ యాక్షన్ సినిమా చేశాడు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించాయి. తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న ఈ సినిమా రిలీజైంది. అన్నట్లు అన్ని భాషల్లోనూ దుల్కర్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. గురువారం విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ గ్యాంగ్స్టర్ సినిమా అంతగా వర్కవుట్ కానట్లు కనిపించింది. ఫలితంగా ఈ చిత్రం రూ.7.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 కోట్ల మేర బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే పది కోట్లు కూడా రాబట్టలేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. రానున్న రోజుల్లోనూ కలెక్షన్స్ ఇలాగే ఉంటే డిజాస్టర్ దిశగా ప్రయాణించడం ఖాయం అని చెప్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయానికి వస్తే.. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు పెద్దగా పాజిటివ్ బజ్ లేదు, కలెక్షన్స్ కూడా డల్ ఉన్నందున వచ్చే నెలలో ఓటీటీలో ప్రత్యక్షం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదట్లో ఈ సినిమా పేరును కింగ్ ఆఫ్ కోతగానే ఉంచారు. దుల్కర్ సైతం అలాగే పలికాడు. కానీ మలయాళంలో కొత్త అంటే టౌన్ అని అర్థం వస్తుండటంతో దాన్ని మార్చేసి కింగ్ ఆఫ్ కొత్తగా రిలీజ్ చేశారు. చదవండి: థియేటర్లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్.. ఎక్కడంటే? -
ఈ సినిమాలో ప్రతి పాత్ర.. కథని మలుపు తిప్పేదే
‘‘నేను ఇప్పటి వరకూ గ్యాంగ్స్టర్ సినిమాలు చేయలేదు. తొలిసారి ‘కింగ్ ఆఫ్ కొత్త’ చేశాను. ఈ కథ రెండు పీరియడ్స్లో ఉంటుంది. పాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఫుట్ బాల్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్నాయి. ఇందులో ప్రతి పాత్ర కథని మలుపు తిప్పుతుంది. అది నాకు చాలా నచ్చింది’’ అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ పంచుకున్న విశేషాలు.... ► అభిలాష్, నేను చిన్ననాటి స్నేహితులం. ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటే ‘కింగ్ ఆఫ్ కొత్త’కి కుదిరింది. మంచి గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. స్నేహం కూడా ఉంటుంది. నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను. కానీ, ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ఇవ్వాలని ఈ మూవీ కోసం ఏడాది శ్రమించా. సాంకేతికంగా ఈ మూవీ పెద్ద స్థాయిలో ఉంటుంది. ► కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అదొక ఫిక్షనల్ టౌన్. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్లో కోత అని చెప్పాం. ప్రేక్షకులకు నేను ఎక్కువగా లవర్ బాయ్గా గుర్తుంటాను(నవ్వుతూ). ఒకేరకమైన కథలు, పాత్రలు చేయాలని ఉండదు. ప్రేక్షకులతో పాటు నటుడిగా నాకు నేను సర్ప్రైజ్ అయ్యే పాత్రలు చేయాలని ఉంటుంది. ఈ మూవీ కోసం తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ఓ రకంగా ఇప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా (నవ్వుతూ). ► ఐశ్వర్య లక్ష్మి చాలా ప్రతిభ ఉన్న నటి. ఈ మూవీలో తన పాత్ర కీలకంగా ఉంటుంది. నిమేష్ రవి విజువల్స్, జాక్స్ బిజోయ్ సంగీతం సినిమాకు ప్లస్. సినిమాని కాపాడాలి, మంచి సమయంలో రిలీజ్ చేయాలంటే మనమే నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్లో ఉండాలని వేఫేరర్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. ప్రస్తుతం నేను, రానా కలిసి ‘కాంత’ చేస్తున్నాం. తెలుగు, ఇతర పరిశ్రమల నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాలను మలయాళంలో అనుసరిస్తున్నాను. ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరిగారి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నాను. మరికొన్ని కథలు వింటున్నాను. ప్రభాస్గారి ‘కల్కి 2898 ఏడీ’లో నేను నటిస్తున్నానా? లేదా? అన్నది మేకర్సే చెప్పాలి. -
ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్
సీతారామం సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బాలీవుడ్తో పాటు మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కింగ్ ఆఫ్ కోతా' అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న దుల్కర్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహిళ అభిమానులు తన పట్ల వ్యవహరించిన తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మహిళా అభిమాని తనను అనుచితంగా తాకిందని వెల్లడించారు. (ఇది చదవండి: అలా చేయమని ఒత్తిడి.. డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించా: నటి) దుల్కర్ మాట్లాడుతూ..'సాధారణంగా అభిమానులు సెలబ్రిటీలకు హాని కలిగించాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తారు. కానీ ఓ సంఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ మహిళ తన కాళ్లపై చేతులతో రుద్దింది. ఆమె అలా ఎందుకు చేసిందో తెలియదు. ఆ సమయంలో నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఆమె వయసులో నాకన్న చాలా పెద్దది. ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అక్కడే వేదికపై చాలా మంది ఉన్నారు.' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. కొందరు తమ చేతులను ఎక్కడ ఉంచుకోవాలో తెలియనప్పుడు ఇలా జరుగుతుందని దుల్కర్ సల్మాన్ అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఏం జరుగుతుందోనని ఆశ్చర్యపోయా.. దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలేదంటూ దుల్కర్ పంచుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన 'గన్స్ అండ్ గులాబ్స్' ఆగస్టు 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాజ్కుమార్ రావు, పూజా గోర్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోత ఆగస్టు 24న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!) -
నా స్క్రీన్ టైమ్ తక్కువే కానీ..
‘‘దర్శకుడు అభిలాష్ జోషి ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమా స్కేల్ గురించి చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రొడక్షన్ పరంగా చాలా పెద్ద సినిమా. ప్రతి షాట్ చాలా నిండుగా అచ్చమైన తెలుగు సినిమాలా ఉంటుంది. మలయాళంలో ఇంత పెద్ద స్కేల్ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి’’ అని హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మి అన్నారు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్యా లక్ష్మి జంటగా అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా లక్ష్మి మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’లో తార పాత్ర చేశాను. దుల్కర్ పేరు రాజు. తార, రాజు మధ్య అందమైన లవ్ స్టోరీ ఉంటుంది. నా పాత్రకి స్క్రీన్ టైమ్ తక్కువగానే ఉన్నప్పటికీ కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చేసినప్పుడు సవాల్గా అనిపించింది. నాకంటూ డ్రీమ్ రోల్స్ ప్రత్యేకంగా లేవు. కానీ, నేను చేసిన పాత్రలు గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
దుల్కర్తో వన్స్మోర్ అంటున్న హీరోయిన్!
మాలీవుడ్ సూపర్స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు దుల్కర్ సల్మాన్. తక్కువకాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యభరిత చిత్రాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. మాతృభాష మలయాళంలో నటిస్తూనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సత్తా చాటుతున్నాడు. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్ కణ్మణి, హే అనామికా వంటి కొత్త తరహా కథా చిత్రాల్లో నటించి అలరించాడు. తెలుగులో మహానటి, సీతారామం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. తమిళం, మలయాళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్ర తమిళ వెర్షన్కు కోలి అనే టైటిల్ను నిర్ణయించారు. అట్లీ శిష్యుడు కార్తీకేయన్ వేలప్పన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దుల్కర్సల్మాన్కు జంటగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ నటించనున్నట్లు తెలిసింది. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని జీ.స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా మానాడు చిత్రంలో శింబు సరసన నటించిన కల్యాణి ప్రియదర్శన్ తాజాగా కోలీ చిత్రం ద్వారా కోలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దుల్కర్, కల్యాణి ఇద్దరూ గతంలో వరనే అవశ్యముంద్(తెలుగులో పరిణయం) సినిమాలో నటించారు. చదవండి: ఈ ప్రేమకథలకు ట్రెండ్తో సంబంధం లేదు -
అతి చేసిన బాలీవుడ్ హీరోయిన్.. కోపంతో నేలకేసి కొట్టా..: రానా
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భళ్లాల దేవ రానా దగ్గుబాటి దుల్కర్ సహనంపై పొగడ్తలు కురిపిస్తూ ఓ హీరోయిన్పై విమర్శలు గుప్పించారు. షాపింగ్ గురించి కబుర్లు రానా మాట్లాడుతూ.. 'దుల్కర్ చాలా పద్ధతైన మనిషి. ఆయన గతంలో ఒక హిందీ సినిమా చేశాడు. దాని నిర్మాతలు నా ఫ్రెండ్సే! ఒకరోజు మా ఇంటి దగ్గరే షూటింగ్ జరుగుతుంటే వెళ్లాను. బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ ఆ సినిమాలో నటించింది. నేను సెట్కు వెళ్లేసరికి మూడో టేక్ తీసుకుంటున్నారు. దుల్కర్ ఎండలో నిలబడ్డాడు. ఆమె ఫోన్ మాట్లాడుతోంది. ఏమైనా అర్జంట్ విషయమా? అంటే ఆమె భర్త లండన్లో షాపింగ్ చేస్తున్నాడట! ఆ షాపింగ్ గురించి మాట్లాడుతోంది. తర్వాత ఫోన్ కట్ చేసి వచ్చాక నన్ను చూసి హాయ్ అంటూ పలకరించింది. డైలాగులు మర్చిపోతోంది కెమెరా ముందుకు వెళ్లాక డైలాగులు మర్చిపోతోంది.. అంతలోనే మళ్లీ ఫోన్ మాట్లాడుతోంది. ఇదంతా చూసి కోపమొచ్చి నా చేతిలోని బాటిల్ నేలకేసి కొట్టాను. దుల్కర్ మాత్రం ఓపికగా అలాగే నిల్చుంటూ ఎన్ని టేకులైతే అన్ని టేకులు చేస్తూనే పోయాడు. ప్యాకప్ అయిపోయాక ఆమె తన స్టాఫ్తో మూడు, నాలుగు కార్లలో వెళ్తే మనవాడు మాత్రం తన అసిస్టెంట్తో చిన్న ఇన్నోవా కారులో వెళ్లిపోయాడు. అప్పుడు నేను సెట్స్లో హీరోయిన్ ప్రవర్తన గురించి లైట్ తీసుకుంటున్న నిర్మాతలను అరగంటసేపు తిట్టిన తర్వాత బయటకు వెళ్లిపోయాను. అలాంటి దుల్కర్ ఈరోజు వైల్డ్ సినిమా చేస్తుంటే నాకన్నా ఎగ్జయిట్గా ఎవరూ ఉండరు' అని రానా చెప్పుకొచ్చాడు. ఆ హీరోయిన్ తనేనా? ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే చాలామంది ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అని అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరిద్దరూ 'ద జోయా ఫ్యాక్టర్' అనే సినిమా చేశారు. కాగా సోనమ్ 2018లో ఆనంద్ అహుజాను పెళ్లాడింది. వీరికి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయి. లండన్లో వీరికి సొంతిల్లు కూడా ఉంది. సోనమ్ తరచూ అక్కడికి వెళ్లి వస్తూ ఉంటుంది. సోనమ్.. రానా భార్య మిహికా బజాజ్కు మంచి స్నేహితురాలు కూడా! చదవండి: జైలర్కు ఈ రేంజ్ కలెక్షన్సా? నాలుగోసారి రూ.300 కోట్ల క్లబ్బులో -
'King Of Kotha' Pre Release Event: దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ పదం నాకు పెద్దగా నచ్చదు
‘‘మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్కు నిజ మైన నిర్వచనం ఇదే’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ , ఐశ్వర్యా లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘దుల్కర్ ‘ఓకే బంగారం’ సినిమాలో నా వాయిస్ ఉంది. తన జర్నీలో నా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు నేను ఫీలవుతున్నాను. ‘సీతారామం’తో తను తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు. ఈ సినిమాతో ఆ ప్రేమ నెక్ట్స్ లెవల్కు వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘కింగ్ ఆఫ్ కోత’ పెద్ద విజయం సాధించాలి. ’’ అన్నారు. హీరో రానా మాట్లాడుతూ–‘‘దుల్కర్ ఓ వైల్డ్ యాక్షన్ ఫిల్మ్ చేశాడంటే నాకు చాలా ఎగ్జయిటింగ్గా ఉంది’’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ–‘‘ నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘కింగ్ ఆఫ్ కోత’. నాలుగు భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో దుల్కర్ కొత్తగా కనిపిస్తారు’’ అన్నారు జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ్స ఐశ్వర్యా లక్ష్మి, అనిఖా సురేంద్రన్ , నటుడు షబ్బీర్, నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ చిత్రంగా 'సీతారామం'.. మృణాల్ను వరించిన అవార్డ్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. (ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం) ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీతారామం' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందకుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిని తాకుతుంది. హను రాఘవపూడి దర్శకుడుగా తెరక్కెకిన ఈ చిత్రంలో సీత, రామ్గా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ అద్భుతంగా మెంప్పించారు. తాజాగా ఈ రొమాంటిక్ పిరియాడిక్ చిత్రానికి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది. (ఇదీ చదవండి: ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్కుమార్) ఉత్తమ వెబ్ సిరీస్గా విభాగంలో 'జూబ్లీ' ఉండగా ఉత్తమ డాక్యుమెంటరీగా 'టు కిల్ ఏ టైగర్' నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో అదిరిపోయే నటనతో మెప్పించిన రాణీ ముఖర్జీకి బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) అవార్డు దక్కింది. మోహిత్ అగర్వాల్ (ఆగ్రా) బెస్ట్ యాక్టర్ మేల్ కాగా పృథ్వీ కొననూర్కు బెస్ట్ డైరెక్టర్గా అవార్డు వరించింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ అవార్డు అందుకున్నారు. View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
అసాధారణ ప్రయాణం
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్ నిర్మించాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ ట్రైలర్స్ని హీరోలు నాగార్జున, షారుక్ ఖాన్, మోహన్ లాల్, సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’ ఒక అసాధారణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్. -
పోటీ లేదులే..
‘కొత్త ఊరిలో తోపు మనమే.. పోటీ లేదులే... కొట్టలేరులే..’ అంటూ సాగే పాట ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం లోనిది. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందిన మలయాళ యాక్షన్ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘హల్లా మచారే’ పాట తెలుగు వెర్షన్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, కృష్ణ కాంత్ సాహిత్యం సమకూర్చారు. ఎల్వీ రేవంత్, సింధూజ శ్రీనివాసన్ పాడారు. -
సౌత్లోనే క్రేజీ హీరో.. కానీ ఈయన్ని నటుడిగానే చూడని భార్య!
చిన్న వయసులోనే కారు నడుపుతున్న ఈ హీరో ఇప్పుడు పెద్ద స్టార్. ఇతడి కంటే ఆయన తండ్రి ఇంకా పెద్ద స్టార్. అగ్రహీరో వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మాతృ భాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ టాప్ హీరోగా రాణిస్తున్నాడు. మహానటిలో ఓ ముఖ్యపాత్రలో నటించిన ఇతడు గతేడాది తెలుగులో హీరోగా చేసి బ్లాక్బస్టర్ హిట్ సాధించాడు. తాజాగా మరో తెలుగు డైరెక్టర్తో కలిసి పని చేసేందుకు రెడీ అయ్యాడు. అతడే దుల్కర్ సల్మాన్. రెండో సినిమాతో సక్సెస్ మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్. ఇతడు 1986 జూలై 28న జన్మించాడు. ముందు చదువుపైనే ధ్యాస పెట్టిన ఇతడు దుబాయ్లో ఐటీ ఉద్యోగం చేశాడు. అయితే తండ్రి బాటలోనే నడవాలని మనసు లాగడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా తిరిగొచ్చేశాడు. ముందుగా నటనలో శిక్షణ తీసుకుని సెకండ్ షో అనే మలయాళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంతోనే సినీప్రపంచంలో అడుగుపెట్టాడు కానీ అంత గుర్తింపు అయితే రాలేదు. తర్వాత చేసిన ఉస్తాద్ హోటల్ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు సైతం పొందాడు. ఆ తర్వాత ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసుకుంటూ పోయాడు. సీతారామంతో అమాంతం పెరిగిన క్రేజ్ తమిళ, మలయాళంలోనూ సినిమాలు చేశాడు. తెలుగులో ఓకే బంగారం, మహానటి చిత్రాలతో కావాల్సినంత గుర్తింపు సంపాదించాడు. సీతారామం సినిమాతో దుల్కర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లెఫ్టినెంట్ రామ్గా అభిమానులు ఆయన్ను ఆరాధించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఉప్పొంగిపోయిన ఇతడు ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోట అనే మలయాళ సినిమా చేస్తున్నాడు. జూలై 28న ఆయన బర్త్డే రోజు తెలుగులో మరో కొత్త సినిమాకు కూడా సంతకం చేసినట్లు వెల్లడించాడు. సార్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్రానికి లక్కీ భాస్కర్ టైటిల్ ఫిక్స్ చేశారు. నేను ఎంతపెద్ద స్టార్ అయినా నా భార్య మాత్రం నన్ను కనీసం నటుడిగా కూడా చూడదు. మరోపక్క నాన్న(మమ్ముట్టి).. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయకపోతే ఇంట్లోకి కూడా రానివ్వనని కండీషన్ పెట్టాడు. ఒక్క సినిమా చేయడానికి ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు? అని ప్రశ్నిస్తాడు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టనిస్తానని సరదాగా హెచ్చరిస్తూ ఉంటాడు. - దుల్కర్ సల్మాన్ -
'సీతారామం' హీరో మరో తెలుగు మూవీ.. అలాంటి కాన్సెప్ట్తో!
దుల్కర్ సల్మాన్ పలు భాషల్లో స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత ఉత్తమ నటులలో ఒకడిగా ఫేమ్ సంపాదించాడు. తన గత చిత్రం 'సీతారామం'తో బ్లాక్ బస్టర్ కొట్టిన దుల్కర్.. ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో పనిచేసేందుకు రెడీ అయిపోయాడు. హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) ధనుష్ తో చేసిన 'సార్'(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి.. ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. 'నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాతలు చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి 'లక్కీ భాస్కర్' టైటిల్ ఫిక్స్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. Presenting to you #LuckyBaskhar - Embark on a Captivating Journey, The Unraveling Triumphs of an Ordinary Man! 📈🎬#VenkyAtluri @gvprakash @vamsi84 @Banglan16034849 @NavinNooli #SaiSoujanya @sitharaents @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/NwNaZ9NAwC — Dulquer Salmaan (@dulQuer) July 28, 2023 (ఇదీ చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!) -
అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!
స్టార్ హీరోలు.. తమ అభిమానుల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు! దారుణంగా మోసం చేస్తున్నారు! అవును మీరు విన్నది నిజమే. ఈ మధ్య కాలంలో ఈ తరహా సంఘటనలు మరీ ఎక్కువవుతున్నాయి. తాాజాగా స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, రామ్ చరణ్ చేసిన పనికి ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అవుతున్నారు. తమని తామే తిట్టుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? వీడియో దానికోసమా? మిగతా హీరోల సంగతేమో గానీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఏం చేసినా సరే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. కొన్నిరోజుల ముందు ఓ వీడియో పోస్ట్ చేసి, డిలీట్ చేసేశాడు. తనకు సరిగా నిద్రపట్టడం లేదని ఆ వీడియోలో బాధపడ్డాడు. కట్ చేస్తే.. ఇదంతా కూడా ఓ ఫోన్ బ్రాండ్ ప్రమోషన్ కోసమేనని తాజాగా క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) రామ్చరణ్ కూడా పైన దాంట్లో దుల్కర్ వీడియో పెట్టి కావాలని డిలీట్ చేసి, అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అలా ఏం చేయలేదు. కాకపోతే రెండు రోజుల ముందు ఓ వీడియో రిలీజ్ చేయగా.. అందులో రామ్ చరణ్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కనిపించారు. ఇదేదో వెబ్ సిరీస్ లేదా సినిమా కోసమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఇదీ ఓ బట్టలు విక్రయించే ఓ యాప్ కోసం ప్రమోషన్ అని తేలిపోయింది. ఇలా పైన చెప్పిన రెండు సందర్భాలే కాదు.. ఈ మధ్య పలువురు హీరోహీరోయిన్లు ఇలానే ఏదో ఓ వీడియో రిలీజ్ చేయడం, అభిమానుల్లో హైప్ వచ్చేలా చేయడం, తీరా చూస్తే అది ఏదో బ్రాండ్ ప్రమోషన్ కోసం అని తెలిసి మోసపోవడం. ఫ్యాన్స్ కి అలవాటు అయిపోయింది. ఈ క్రమంలో సొంత హీరోహీరోయిన్లనీ ఏం అనలేక అభిమానులు తమని తామే తిట్టుకుంటున్నారు. కాబట్టి స్టార్స్ ఏదైనా వీడియో, పోస్ట్ పెట్టేటప్పుడు కాస్త ఆలోచించండి. మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. యువ హీరోయిన్ ఫిర్యాదు)
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చంద్రబాబు రీ కౌంటింగ్..
'లంగ్స్ ఆఫ్ చత్తీస్గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్మ్యాన్..
వామ్మో! ఇంతపెద్ద నీటితొట్టెనా!?
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్
T20WC: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)
YSRCPదే ప్రభంజనం..
నిజమే..! ఇది ముక్కుసూటి రహదారే..!! సుమారు..
దశాబ్ది ఉత్సవాలకు సిద్ధం
Advertisement