-
వలపు వల విసిరి.. చర్మం వలిచి.. ముక్కలుగా నరికి
కోల్కతా: బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనపై వలపు వల(హనీ ట్రాప్) విసిరి కోల్కతాకు రప్పించి, దారుణంగా హత్య చేసి, చర్మం వలిచి ముక్కలు ముక్కలుగా నరికినట్లు తేలింది. వలపు వల విసిరిన యువతిని బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను శిలాంతి రెహమాన్గా గుర్తించారు. బంగ్లాదేశ్ జాతీయురాలైన శిలాంతి ప్రధాన నిందితుడు, అమెరికా పౌరుడైన అఖ్తరుజమాన్ షహీన్కు ప్రియురాలు అని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో అక్తరుజమాన్ అద్దె ఇంట్లో ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శిలాంతి రెహమాన్ కోల్తాలోనే ఉన్నట్లు వెల్లడయ్యింది. మరో నిందితుడు అమానుల్లా అమన్తో కలిసి ఈ నెల 15న బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లిపోయింది. తన మిత్రుడు అన్వరుల్ అజీమ్ అనర్ను బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకు రప్పించడానికి ప్రధాన నిందితుడు అఖ్తరుజమాన్ తన ప్రియురాలు శిలాంతిని ప్రయోగించినట్లు పోలీసులు తేల్చారు. అన్వరుల్ అజీమ్ అనర్, అఖ్తరుజమాన్ మధ్య ఆర్థికరమైన వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడి హత్యాకాండ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ను చంపడానికి నిందితులు పక్కా పథకం వేశారు. జంతువులను వధించడంలో అనుభవం ఉన్న మాంసం వ్యాపారి జిహాద్ హవల్దార్ను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు రప్పించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు. కొంతకాలం ముంబైలో తలదాచుకున్నాడు. పథకం ప్రకారం హత్యకు రెండు నెలల ముందు కోల్కతాకు చేరుకున్నాడు. అఖ్తరుజమాన్ అద్దె ఇంట్లో అన్వరుల్ అజీమ్ను ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడు. -
Hyderabad: తవ్వినకొద్దీ తల్లీకూతుళ్ల లీలలు
బంజారాహిల్స్: రియల్ ఎస్టేట్ వ్యాపారి పుట్టా రాము హత్య కేసులో నిందితులైన తల్లీకూతుళ్లు హిమాంబీ, నసీమా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తల్లీ కూతుళ్ల అరాచకాలకు చాలామంది బలికాగా, ప్రస్తుతం వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నిందితురాలు హిమాంబీ ఆ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించి యజమానిపై తప్పుడు కేసులు బనాయించింది. ఇటువైపు తొంగిచూస్తే తమపై అత్యాచారం చేశావంటూ కేసు పెడతానని బెదిరిస్తుండడంతో ఇంటి యజమాని అటువైపు తొంగి చూడడం లేదు. ఇదే అదనుగా హిమాంబీ, ఆమె కూతురు నసీమా ఇద్దరూ ఈ ఇంటిని వ్యభిచార కూపంగా మార్చారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని యూసుఫ్గూడ ఎల్ఎన్నగర్లో ఇటీవల రియల్టర్ పుట్టా రామును 11 మంది కత్తులతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. నసీమా హనీట్రాప్ చేసి రామును ఇంటికి పిలిపించి ఈ విషయాన్ని ప్రధాన నిందితుడు మణికంఠకు మెసేజ్ చేసి హత్య కుట్ర కారణమై జైలు పాలైంది. హిమాంబీపై ఇప్పటికే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మేడిపల్లి తదితర పోలీస్స్టేషన్లలో ఐదు ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. బెయిల్పై వస్తూ.. 2017 జూన్లో హిమాంబీ.. ఓ యువతితో వ్యభిచారం చేయిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడింది. 2018లో మరో అమ్మాయితోనూ వ్యభిచారం చేయిస్తూ అరెస్టయ్యింది. 2020లో జూబ్లీహిల్స్లోని వెంకటగిరిలో వ్యభిచార గృహంపై దాడి చేయగా పోలీసులకు మరోసారి పట్టుబడింది. 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుంచి బ్లాక్మెయిల్ చేసి రూ.3 లక్షలు వసూలు చేసింది. 2019లో తన కూతురు నసీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు కేసు పెట్టింది. పోలీసులకు పట్టుబడిన ప్రతిసారీ బెయిల్పై వస్తూ.. కూతురు నసీమాను ఎరగా వేసి ఏడేళ్లుగా హిమాంబీ స్థానికంగా అరాచకాలకు, బ్లాక్మెయిల్ వ్యవహారాలకు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. కానిస్టేబుల్పైనే కేసులు పెట్టించి.. ఓ కానిస్టేబుల్కు చెందిన ఈ ఇంటిని అద్దెకు తీసుకుని అతడిపైనా తప్పుడు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేసింది. ఇంటిని ఖాళీ చేయించాలంటూ కోర్టు ఆర్డర్ ఉన్నా హిమాంబీ పట్టించుకోకుండా పోలీసుల పైనే తిరగబడింది. మహిళ కావడంతో పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ తమకెందుకులే అని పెద్దగా పట్టించుకోకపోవడంతో హిమాంబీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి కబ్జా చేసిన ఇంట్లోనే దర్జాగా వ్యభిచార గృహాన్ని నిర్వహించింది. పుట్టా రాము హత్యతో తల్లీకూతుళ్ల గుట్టు రట్టయ్యింది. -
ఇదేం దోపిడీ.. బాబోయ్..
మైసూరు: వలపు వల విసిరి ట్రాప్లోకి లాగే కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా బలవంతంగా ఎత్తుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, కేరళలోని తిరునెల్లికి చెందిన వ్యాపారవేత్త సున్నీ ఫిర్యాదు మేరకు ఒక మహిళతో పాటు ముగ్గురిని మైసూరు నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు...కేరళలోని తిరునెల్లికి చెందిన వ్యాపారవేత్త సున్నీ మార్చిలో చైన్నె నుంచి కారులో వస్తున్న సమయంలో మైసూరు మానంద వాడి రోడ్డులో దుండగులు అడ్డుకుని బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం ఒక ఇంటిలోకి తీసుకెళ్లి ఆయనను బెదిరించి ఓ మహిళ పక్కన నగ్నంగా పడుకోబెట్టి, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అనంతరం అతని ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరం తీసుకుని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని బెదిరించి ఉడాయించారు. దీంతో ఆయన రూ. 5 లక్షలు వారికి ఇచ్చాడు. మళ్లీ బెదిరింపులు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిఘా ఉంచి నిందితులు ఫజలుల్లా రెహామన్, రిజ్వాన్, మోనాలను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
హనీట్రాప్లో మాజీ జవాన్
కర్ణాటక: గుర్తుతెలియని మహిళ హనీ ట్రాప్లో పడిన విశ్రాంత సైనికుడు డెత్నోట్ రాసి అదృశ్యమైన ఘటన కొడగు జిల్లా మడికెరిలో చోటుచేసుకుంది. అదృశ్యమైన సైనికుడు సందేశ్ (40)గా గుర్తించారు. మంగళవారం ఇంటి దగ్గర ఉన్న చెరువు గట్టున అతని మొబైల్ఫోన్, చెప్పులు లభించాయి. దీంతో అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. చెరువులో ఫైర్ సిబ్బంది, మడికెరి పోలీసులు గాలిస్తున్నారు. సందేశ్కు కొంతకాలం కిందట ఫేస్బుక్లో వివాహిత మహిళ పరిచయం చేసుకుంది. ఇద్దరూ ప్రైవేటు ఫోటోలను పంపుకున్నారు. షికార్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆపై ఆమె పదే పదే డబ్బు ఇవ్వాలని, లేకపోతే గుట్టు రట్టు చేస్తానని సందేశ్పై వేధింపులకు పాల్పడింది. ఆమె పోరు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సందేశ్ డెత్నోట్ రాశాడు. న్యాయం చేయాలని సందేశ్ భార్య భోరున విలపించింది. -
హనీట్రాప్ కలకలం.. కపిల్పై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో హనీట్రాప్ కేసులో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మంగళవారం సీపీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్కు చెందిన హనీట్రాప్ కేసులో కపిల్పై కేసు నమోదు చేశాం. కపిల్ వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ ఫోరెన్సిక్కు పంపించాము. కానిస్టేబుల్ కపిల్ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్కు చెందిన కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహంచి 2022 ఆగస్టు నెలలో విశాఖకు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం అతడు సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగంలో పనిచేస్తునే పేస్బుక్ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్పై అంతరంగిక భద్రత చట్టం కింద కేసులు పెట్టామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్.. సీఎం జగన్ సాయం -
హానీట్రాప్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్ చేతిలోకి?
సాక్షి, విశాఖపట్నం: పాకిస్తాన్ ఎప్పటిలానే తన కపట బుద్దిని ప్రదర్శిస్తోంది. భారత అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు ఉద్యోగులపై హానీ ట్రాప్ వల విసురుతోంది. తాజాగా పాక్ హానీ ట్రాప్లో ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చిక్కుకున్నాడు. అనుమానం రావడంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ మురారీ పని చేస్తున్నాడు. అంతకు ముందు రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహించేవాడు. దీంతో అతని నుంచి కీలక సమాచారం తెలుసుకునే క్రమంలో పాకిస్తాన్ అతనిపై హనీట్రాప్ ప్లాన్ని ప్రయోగించింది. ఓ ఉగ్రవాద సంస్థకి చెందిన పెద్ద నాయకుడి పీ.ఏకి తమిషా అనే పాకిస్తాన్ యువతితో పరిచయం ఉంది. ఆ యువతితో సోషల్ మీడియా ద్వారా కపిల్తో పరిచయం పెంచుకుంది. రెండేళ్ల పాటు ట్రాప్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టింది. న్యూడ్ వీడియో కాల్స్తో మొదలై.. రహస్యంగా ఓ గదిలో కలిసేంత వరకు వీరి కథ నడిచింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కపిల్ కుమార్ కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా కపిల్ కుమార్ ఏడాది క్రితం హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి విశాఖలో పని చేస్తున్నాడు. కీలక సమాచారం పాకిస్థాన్ గూఢచార సంస్థకు చేరినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కపిల్ కుమార్ మొబైల్స్ స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ ఫోరెన్సిక్ విచారణకు పంపింది. తదుపరి విచారణ కోరుతూ స్టీల్ ప్లాంట్ పోలీసు స్టేషన్లో సీఐఎస్ఎఫ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేశారు. అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ అంశం అంతరంగిక భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో వివిధ ఏజెన్సీలు దర్యాప్తులోకి దిగాయి. చదవండి వచ్చినవాడు గద్దర్.. ఆ హెడింగ్ చూసి ఆశ్చర్యపోయాం! -
బెంగళూరు హనీట్రాప్.. అమ్మాయి పిలిచిందని ఆ ఇంటికి వెళ్తే..
బనశంకరి: సోషల్ మీడియా టెలిగ్రాం ద్వారా యువకులను పరిచయం చేసుకుని వారితో స్నేహంగా ఉంటూ యువతులతో హానీట్రాప్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం పుట్టేనహళ్లి పోలీసులు అరెస్ట్చేశారు. శరణ ప్రకాష్బళిగేర, అబ్దుల్ ఖాదర్, యాసిన్ పట్టుబడిన నిందితులు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు యువతితో పాటు మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ బృందంలోని యువతి, యువకులను పరిచయం చేసుకుని జేపీ.నగర ఐదోస్టేజ్ వినాయకనగర ఇంట్లోకి పిలిపించుకునేది. యువకులు ఇంట్లోకి రాగానే ప్లాన్ ప్రకారం హనీట్రాప్ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి యువకుల మొబైల్ లాక్కుని యువతితో ఏం పని అని మాట్లాడుతూనే మొబైల్లో ఫొటో, వీడియో తీసి డబ్బు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులకు ఫొటో పంపించి పరువుతీస్తామని బెదిరించి రూ.50 వేలు లాక్కున్నారు. ఈ ఘటనపై బాధితుడు పుట్టేనహళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల: పక్కా ప్లాన్తో ఇంటికి పిలిచి..
కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్యా శశి (32) మలయాళ టీవీ సీరియల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈజీ మనీ కోసం తన స్నేహితుడు బినుతో కలిసి అడ్డదారులు తొక్కింది. తిరువనంతపురంలో ఉండే ఆర్మీ రిటైర్ ఉద్యోగి అయిన 75 ఏళ్ల పెద్దాయనకు తన స్నేహితుడితో కలిసి నిత్య వలేసింది. ఇల్లు అద్దెకు కావాలనే వంకతో ఆ సీనియర్ సిటిజన్తో నిత్య పరిచయం పెంచుకుని ట్రాప్ చేసి డబ్బులు గుంజే ప్లాన్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. (ఇదీ చదవండి: నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్) కేరళకు చెందిన సీరియల్ నటి, న్యాయవాది అయిన నిత్య అద్దెకు ఉండేందుకు ఇంటిని వెతుకుతుండగా వృద్ధుడిని సంప్రదించింది. అక్కడ ఏర్పడిన పరిచయంతో నిరంతర ఫోన్ కాల్స్ ద్వారా వృద్ధుడితో నిత్య స్నేహం పెంచుకుంది. అలా వారిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగింది. దీంతో ఒకరోజు కలకోటేలోని తన అద్దె ఇంటికి రావాలని ఆ వృద్ధుడిని నటి నిత్య పిలిచింది. నిత్య ఆహ్వానాన్ని మన్నించి వృద్ధుడు కూడా ఆమె ఇంటికి వెళ్లాడు. నిత్య ఇంట్లో ఏం జరిగిందో పోలీసులకు ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు. 'నేను.. నిత్య ఇంటికి వెళ్లగానే నన్ను మాటల్లో ఉంచి ఆమె నా దుస్తులు తొలగించింది. ఆపై ఆమె కూడా దుస్తులు తొలగించుకుంది. ఇంతలో నిత్య స్నేహితుడు బిను వచ్చి నా ఫోటోలతో పాటు.. కొన్ని ఇద్దరం ఉన్న ఫోటోలను కూడా తీశాడు. ఆపై అడిగినంత డబ్బు ఇవ్వాలని లేదంటే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని వారిద్దరు బెదిరింపులకు దిగారు. దీంతో ఇప్పటికే వారికి రూ.11 లక్షలు ఇచ్చాను. కానీ వారు రూ. 25 లక్షలు డిమాండ్ చేశారు. అంత డబ్బు లేదని, ఇక ఇవ్వలేనని వారికి తెలిపాను. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారు' అని పోలీసులకు తెలిపాడు. (ఇదీ చదవండి: BRO Movie Twitter Review: పవన్ కల్యాణ్ ‘బ్రో’మూవీకి ఊహించని టాక్!) దీంతో పోలీసుల సూచన మేరకు ఆ వృద్ధుడు రూ.25 లక్షలు డబ్బు ఇస్తానని వారిద్దరికి ఆఫర్ చేశాడు. కానీ డబ్బు కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. పక్కా ప్లాన్తో పోలీసులు అక్కడే ఉండి నిత్య,బినూను అరెస్ట్ చేశారు. ఆపై వారిద్దిరని కోర్టులో హాజరుపరిచారు. నిత్య ఇప్పటికే పలు ప్రముఖ సీరియల్స్తో పాటు అక్కడి ప్రసిద్ధ షోలలో కూడా కనిపించింది. -
ఆ ఎమ్మెల్యే హనీట్రాప్ చేసి.. అందుకోసం స్టూడియోలు కూడా
యశవంతపుర(బెంగళూరు): ఆర్ఆర్ నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్న హనీట్రాప్నకు పాల్పడేవారని బీబీఎంపీ మాజీ కార్పొరేటర్ వేలు నాయ్కర్ ఆరోపించారు. ఆదివారం తన మద్దతుదారులతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ... మునిరత్న హనీట్రాప్ చేసి బెదిరించడం పనిగా పెట్టుకున్నట్లు ఆరోపించారు. జేపీ పార్క్, డాలర్స్కాలనీలో దీని కోసం స్టూడియో ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. 2023 ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలనే విషయమై మునిరత్నను అడిగాం. అప్పుడు నీది ఈస్ట్మన్ కలర్ పిక్చర్ ఉంది చూపించాలా, లేక నోరు మూసుకొని పని చేస్తారా అని బెదిరించినట్లు వేలు నాయ్కర్ ఆరోపించారు. నిర్మాతగా మునిరత్న చేసిన మొదటి సినిమా అంటీ ప్రీత్సే. ఆయన మంత్రి అయిన తరువాత అందరూ అంటీలే ఆయన వెంట ఉండేవారని హేళన చేశారు. నాపై కుట్రలు: మునిరత్న ఆర్ఆర్ నగరను దక్కించుకోవడానికి కొందరు చేస్తున్న కుట్రలని మాజీ మంత్రి మునిరత్న అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పరోక్షంగా డీకే శివకుమార్ బ్రదర్స్పై నిప్పులు పోశారు. వేలు నాయక్కర్ చేసిన వ్యాఖ్యలు అతడివి కాదు. చెప్పిస్తున్న మాటలని డీకేశి బ్రదర్స్పై మండిపడ్డారు. చదవండి మణిపూర్ మంట చల్లార్చేందుకు కేంద్రం మల్లగుల్లాలు -
ఐటీ ఉద్యోగిని.. ఎన్జీవో.. ఓ డేటింగ్ యాప్.. వీళ్ల ప్లానే వేరు..
గురుగ్రామ్: ఇటీవలి కాలంలో హానీట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. ఎరక్కపోయి కొందరు కిలేడీల చేతికి చిక్కి మోసపోతున్నారు. తాజాగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ కిలేడీ డేటింగ్ యాప్లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్కు తీసుకెళ్లింది. అక్కడ సదరు వ్యక్తికి అనుకోని అనుభవం ఎదురైంది. అనంతరం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు డ్రామా క్రియేట్ చేసి డబ్బు కాజేయాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో హానీట్రాప్కు దిగిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన బినితా కుమారి(27) గురుగ్రామ్లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అలాగే, హర్యానా రోహతక్లోని భాలతో గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహేశ్ ఫోగట్ ఓ ఎన్జీవోలో పని చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి డేటింగ్ యాప్(బంబుల్ డేటింగ్ యాప్)లో అమాయకులకు గాలం వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా, డేటింగ్ యాప్లో బినితా కుమారి.. ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో గురుగ్రామ్ సెక్టార్-23లోని ఓ హోటల్కు రావాలని ఆఫర్ ఇచ్చింది. దీంతో, దొరికిందిలే ఛాన్ అని బాధితుడు హోటల్కు వెళ్లాడు. అయితే, హోటల్కు వెళ్లిన తర్వాత మనోడికి ఊహించని విధంగా షాక్ తగిలింది. బినితా కుమారి సదరు వ్యక్తిని బీర్ తాగమని బలవంతం చేసింది. తాను ఊహించినదానికి పరిస్థితులు వేరుగా కనిపించడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించావని, లైంగికంగా వేధించావని బెదిరించింది. రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే.. పోలీసు కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. She is Binita Kumari Known as B on Bumble Befriended men on dating apps Chose hotel as meeting place Said she wants to have "beer & fun" Few minutes into meeting cried Rape Went to police & filed complaint NGO guy then called to "strike deal" The gang Extorted LACS ARRESTED!! pic.twitter.com/rXDmX95HvM — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 అనంతరం, ఆమె గురించి ఆలోచించేలోపే మహేష్ ఫోగట్ నుంచి బాధితుడికి ఫోన్ వెళ్లింది. రూ. 5 లక్షలు ఇస్తేనే సమస్య సెటిల్మెంట్ అవుతుందని బెదిరింపులకు దిగాడు. దీంతో, కంగారుపడిన బాధితుడు చేసేదేమీలేక డీల్కు ఒప్పుకుంటూ రూ.2 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ రూ. 50 వేలు ఇచ్చి భరోసా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు త్వరలోనే ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. భాదితుడి ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై డీఎల్ఎఫ్ ఫేజ్-3 పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ అయింది. I was previously contacted by a victim in October too. Same modus operandi. Girl was different in that case. So we don't yet know how big is the gang or how many total victims Their latest victims got in touch We approached higher authorities and @gurgaonpolice swung in action pic.twitter.com/qlVB0b7auk — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 కాగా, ఈ కేసుపై రంగంలోకి దిగిన పోలీసులు.. మిగిలిన డబ్బులు తీసుకోవడానికి మౌల్సరి మార్కెట్ సమీపంలోని సాయి టెంపుల్కు రావాలని బాధితుడు ఆ ఇద్దరికీ కాల్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా మహేష్ను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత బినితా కుమారిని డీఎల్ఎఫ్-3 యూ బ్లాక్ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇక, వీరిద్దరూ ఇప్పటి వరకు 12 మందిని మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: వీడియో: అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు.. షాకింగ్ విషయాలు వెల్లడి -
ప్రియురాలినే ఎరగా వేసి.. ప్రతీకార హత్య!
క్రైమ్: ఆ ఇద్దరికీ పాత గొడవలు ఉన్నాయి. అది మనసు పెట్టుకుని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశాడు శిబిల్. అందుకు తన ప్రియురాలినే ఎరగా ఉపయోగించాడు. హనీట్రాప్ ద్వారా ప్రత్యర్థిని రప్పించి.. అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కేరళలో సంచలనం సృష్టించిన రంజిపాలెం మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. శుక్రవారం అట్టప్పడి వద్ద అనుమానాస్పద రీతిలో పడి ఉన్న రెండు ట్రాలీ బ్యాగ్లు పోలీసుల దృష్టికి వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. మనిషి శరీరం ముక్కలు కనిపించాయి. దీంతో ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే సమయంలో.. త్రిస్సూర్ చెరుతుర్తి వద్ద ఓ హోండా సిటీ కారును వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ కారుకు.. అటవీ ప్రాంతంలో దొరికిన ట్రాలీ బ్యాగులకు ఏదైనా కనెక్షన్ ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు.. ఆ కేసు ప్రతీకార హత్యగా తేలుస్తూ చిక్కుముడిని విప్పారు. మల్లప్పురం తిరూర్కు చెందిన సిద్ధిఖ్(58) ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చాడు. రంజిపాలెంలో ఓ హోటల్ నడుపుతూ స్థిరపడ్డాడు. అందులో శిబిల్(22) మేనేజర్గా పని చేసేవాడు. అయితే తన హోటల్ పేరుతో శిబిల్ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే విషయం సిద్ధిఖ్ దృష్టికి వచ్చింది. దీంతో.. అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు సిద్ధిఖ్. ఈ పరిణామంతో శిబిల్ కోపంతో రగిలిపోయాడు. మరో స్నేహితుడితో కలిసి సిద్ధిఖ్ అంతుచూడాలని అనుకున్నాడు. అందుకు తన ప్రియురాలు ఫర్హానా(18)ను సాయం చేయమని కోరాడు. ఫర్హానా సిద్ధిఖ్తో ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుంది. చివరకు.. శారీరక సుఖం అందిస్తానని, ఎర్హనిపాలెంలోని ఓ హోటల్కు రావాలంటూ కబురు పంపింది. మే 18వ తేదీన హోటల్ వద్దకు సిద్ధిఖ్ చేరుకున్నాడు. గదిలోకి వెళ్లిన అతన్ని.. శిబిల్, ఫర్హానా కలిసి హతమార్చారు. చంపేశాక ఆ బాడీని ముక్కలు ముక్కలు చేసి.. రెండు ట్రాలీ బ్యాగుల్లో కుక్కేసింది ఆ ప్రేమ జంట. ఆపై మరో స్నేహితుడి సాయంతో ఆ ట్రాలీ బ్యాగులను సిద్ధిఖ్ కారులోనే తీసుకెళ్లి అట్టప్పడి వద్ద పడేసి వెళ్లిపోయారు. తండ్రి కనిపించకుండా పోవడంతో.. విదేశాల నుంచి తిరిగొచ్చాడు కొడుకు. నాలుగు రోజుల తర్వాత అంటే మే 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. రెండు రోజులకే సిద్ధిఖీ అకౌంట్ నుంచి ఏటీఎం కార్డు ద్వారా భారీగా నగదు విత్డ్రా అయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈలోపు ట్రాలీ బ్యాగులో మృతదేహం బయటపడడం.. అది సిద్ధిఖీదేనని పోలీసులు నిర్ధారించుకోవడం జరిగిపోయాయి. డబ్బు విత్డ్రా అయిన ప్రాంతం గురించి పోలీసులు ఎంక్వైయిరీ చేయగా.. చెన్నై నుంచి ఆ డబ్బు విత్ డ్రా అయినట్లు తేలింది. దీంతో చెన్నై పోలీసుల సాయం కోరగా.. వాళ్లు శిబిల్, ఫర్హానాను అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు అషిఖ్ను సైతం కస్టడీలోకి తీసుకున్నారు. -
దేశ రహస్యాలు పాక్కు లీక్ చేసిన డీఆర్డీఓ శాస్త్రవేత్త.. నిఘా వైఫల్యమేనా?
న్యూఢిల్లీ: కొన్ని సార్లు.. అంతా సవ్యంగానే ఉంటుందనుకుంటాం. దేశం సురక్షితంగా ఉందని భావిస్తాం. అనుభవజ్ఞులైన అధికారులు, సరిహద్దుల్లో సైన్యం కంటికి రెప్పలా ఉంటుందని భావిస్తాం. నిజమే.. మనం అనుకుంటున్న దాంట్లో 99% నిజమే. అయితే ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు నమ్మక ద్రోహానికి సిద్ధంగా ఉంటారు. మదర్ ఇండియాకు వెన్నుపోటు పొడిచేందుకు వెనక్కు రారు. అలాంటి వారిలో అత్యున్నత అధికారులు ఉండడమే ఆశ్చర్యకరం. పైగా పాకిస్తాన్, చైనాలాంటి దేశాలు విసిరే హానీ ట్రాప్లో చిక్కడం మరింత విస్మయకరం. మహిళ అందాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే జాబితా పెరిగిపోతోంది. గత నెల రోజులుగా భారత రక్షణ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న వ్యక్తి ప్రదీప్ కురుల్కర్. భారత రక్షణ వ్యవస్థలోని కీలక వింగ్ DRDOలో అత్యున్నత అధికారిగా ఉన్న ప్రదీప్.. ఇప్పుడు దేశ రహస్యాలను లీక్ చేసిన మాయగాడిగా మిగిలిపోయాడు. వలపు వలలో చిక్కి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు లీక్ చేశాడు డీఆర్డీవో టాప్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్. ఓ అజ్ఞాత మహిళ మాయలో పడి అడిగిన వివరాలన్నీ అందించాడు. భారత ఆయుధ సంపత్తిలో కీలకంగా ఉన్న బ్రహ్మోస్, అగ్ని, యాంటి శాటిలైట్ క్షిపణులకు సంబంధించిన రహస్యాలను శత్రు దేశానికి చేరవేశాడు. ప్రదీప్కు వలపు వల విసిరి రహస్యాలు రాబట్టుకున్న మహిళ తనను తాను జర్దాస్ గుప్తా. లండన్ లో నివసిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. పక్కా స్కెచ్ వేసి ఈయన్ను ట్రాప్ చేసింది. గతేడాది సెప్టెంబర్లో సోషల్ మీడియా ద్వారా ప్రదీప్ను పరిచయం చేసుకుంది. మొదట ఆకట్టుకునే మెసెజ్లు, ఆ తర్వాత అందాలు ఆరబోసే వీడియో కాల్స్, రాత్రుళ్లు కవ్వించే మాటలు.. తనను ట్రాప్ చేస్తోందని తెలుసుకోలేక పోయిన ప్రదీప్ ఆమె మాయలో పడ్డాడు. వేరే దేశానికి రమ్మని పిలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లిపోయాడు. భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను కూడా తిలకించారు. ఇద్దరూ కొన్నాళ్లు ఎంజాయ్ చేశారు. ఈ మహిళ అందానికి దాసోహమైన ప్రదీప్.. ఆమె ఏం అడిగినా కాదనకుండా అన్ని వివరాలు వెల్లడించాడు. దేశభద్రత గురించి పట్టించుకోకుండా తెలిసిన రహస్యాలన్నీ లీక్ చేశాడు. ఈ మత్తులో జరుగుతున్న ద్రోహం గురించి ప్రదీప్ కనిపెట్టలేకపోయాడా అన్నది ఓ మిలియన్ డాలర్ క్వొశ్చన్. ఇలాంటి ఆపరేషన్స్పై సైన్యంలో ఎందరికో అవగాహన కల్పించిన ప్రదీప్.. తానే ఆ గోతిలో పడ్డాడు. బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయాడు. 1988 నుంచి డీఆర్డీఓలో 1988 నుంచి పనిచేస్తున్నారు ప్రదీప్. గ్రేడ్-హెచ్ ఔట్ స్టాండింగ్ కేటగిరీ సైంటిస్ట్గా ఉన్నారు. ఇది అత్యంత కీలకమైన హోదా. కేంద్రంలో అదనపు కార్యదర్శి హోదాతో సమానం. ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి దేశ సమాచారాన్ని లీక్ చేయడం ఒకింత విస్మయం కలిగించే విషయం. దీన్ని ఆరంభంలోనే నిఘావర్గాలు కనిపెట్టలేకపోడవంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సెక్యూరిటీ వైఫల్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశభద్రతలో డీఆర్డీఓ అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా 50 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 5వేల మందికిపైగా శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పడు ప్రదీప్ వలపు వ్యవహారం బహిర్గతం కావడంతో వీరిపైనా విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. ప్రదీప్ విషయం తెలిసిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)పుణెలో రెండు వారాల క్రితం అతడ్ని అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరు పరచి కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన కస్టడీలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రదీప్ ఏ ఏ రహస్యాలు చేరవేశాడన్నది లెక్క తేలాల్సిన అంశం. భారత రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా ఆయుధ వ్యవస్థలో అంతర్గత లోపాలను బయటకు రానివ్వరు. సైన్యంలో టాప్ అధికారులకు మాత్రమే కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రదీప్ ఎంతవరకు ఉప్పందించాడు, ఎక్కడెక్కడ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి? వేటిని మార్చుకోవాలి? ఇవీ ఇప్పుడు సైన్యంలోని టాప్ అధికారుల ముందున్న పెద్ద ఛాలెంజ్. చదవండి: చైనా చాట్జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా? -
Delhi Lodge Murder Case: హనీ ట్రాప్లో భాగమే..ఐతే ఆ 'సారీ నోట్'..
ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన వ్యాపారవేత్త హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆ కేసుకి సంబంధించి ప్రధాన నిందితురాలు 29 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె హర్యానాలోని హనీ ట్రాప్తో దోచుకునే ముఠాకు చెందిన మహిళ అని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బల్జీత్ లాడ్జిలో తన గదిలో నురగలు కక్కుతూ శవమై కనిపించిన వ్యాపరవేత్త దీపక్ సేథీని హనీట్రాప్ ప్లాన్తోనే హత్య చేసినట్లు తెలిపారు. సదరు మహిళ పేరు ఉషా అని ఆమె నిక్కీ, అంజలి, నిఖిత వంటి మారుపేర్లతో వ్యక్తులతో స్నేహం చేసి వారిని హోటళ్లుకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి దోచుకునేదని చెప్పారు. ఈ ప్లాన్తోనే ఆ రోజు కూడా ఉషా దీపక్ సేథీని ట్రాప్ చేసి హోటల్ల్కి తీసుకువెళ్లిందన్నారు. ఐతే ఆరోజు అనుకోకుండా ఓవర్ డోస్ అవ్వడంతో అతను మృతి చెందాడని తెలిపారు. దీపక్ సేథీ(53) మార్చి 30న రాత్రి 9.30 గంటలకు ఉషతో కలిసి గెస్ట్హౌస్కి వెళ్లిందని, అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో డబ్బు, నగలతో బయటకు వచ్చినట్లు తెలిపారు. ఐతే అనుకోకుండా దీపక్ చనిపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేస్తూ.. 'సారీ అంటూ నోట్' రాసిందన్నారు. అదే ఆమెను పోలీసులకు పట్టించేలా చేసిందని చెప్పారు. ఈ ఘటనలో బాధితుడిని సంప్రదించిన ఫోన్ నెంబర్లలో ప్రధాన నిందితురాలితో సహా ఉన్న కొనఇన అనుమానిత నంబర్లను కూడా గుర్తించారు పోలీసులు. నిందితురాలు ఉష నెంబర్ సంత్గఢ్ ప్రాంతంలో రీఛార్జ్ అవ్వడంతో ఆ లోకేషన్ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని నైజరియన్ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. అతడి లివ్ఇన్ భాగస్వామీ మధుమిత స్నేహితురాలి నిక్కీ అలీయాస్ ఉషా అని తేలడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఆమె 2022లో పానిపట్లో నమోదైన కేసులో జైలులో ఉంది. అక్కడే మధుమితతో పరిచయం ఏర్పడిందని, ఆమె దీపక్ సేథీని ఉషకు పరిచయం చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితురాలు ఉషా తనకు దీపక్ సేథీని చంపే ఉద్దేశ్యం లేదని, అందువల్లే ఆ గది నుంచి బయటకు వెళ్లే ముందు సారీ నోట్ని వదిలి వెళ్లినట్లు తెలిపింది. అలాగే ఆమె సేథీ నుంచి తీసుకున్న మొబైల్ ఫోన్, నగదు, డబ్బు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: బార్లో సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం..పదిమంది అరెస్టు) -
తేనె పూసిన కత్తులు! హనీ ట్రాప్లు ఎన్నో రకాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హనీట్రాప్ (వలపు వల). ఎదుటివారిని తమ వైపు ఆకర్షింపజేసుకుని, తమకు కావాల్సిన పని చేయించుకునేందుకు యువతులు/యువతుల పేరిట కేటుగాళ్లు వాడుతున్న అస్త్రం. గతంలో దేశ సరిహద్దుల రక్షణలో ఉండే కీలక అధికారులను లొంగ తీసుకునేందుకు శత్రుదేశాల గూఢచారులు ఈ విధమైన వల విసిరేవారు. ఇప్పుడిది అన్నిరకాల పనులకూ విస్తరిస్తోంది. తాజాగా టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్ లీకేజీ ఉదంతంలో కూడా ఇదే తరహాలో టీఎస్పీఎస్సీ సిబ్బందిని ట్రాప్ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ విధమైన వలపు వలలను ముందుగానే గుర్తించవచ్చని, తగిన జాగ్రత్తలు పాటిస్తే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. నిత్యం సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ సోషల్ ప్రొఫైలింగ్కు గురికాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని హనీ ట్రాప్లు భారతీయురాలి పేరిట పాక్ నుంచి వాడుతున్న ఓ ఫేస్బుక్ అకౌంట్తో.. సరిహద్దుల్లో సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైన్యంలోని 60 మంది జవాన్లు టచ్లో ఉన్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల హనీ ట్రాప్లో చిక్కుకుని క్షిపణుల తయారీకి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశాడన్న ఆరోపణలపై డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి దుక్క మల్లికార్జున్రెడ్డిని 2022 జూన్లో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఏజెంట్ల హనీ ట్రాప్లో చిక్కి భారత నౌకాదళ సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న 13 మంది ఇండియన్ నేవీ అధికారులను ఏపీ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్లో పట్టుకున్నారు. వీరందరినీ అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. హనీ ట్రాప్లు.. ఎన్నో రకాలు సోషల్ మీడియా ఆధారిత ట్రాప్లు: అందమైన యువతుల ఫొటోలు, పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేస్తున్నారు. ఆన్లైన్ వీఓఐపీ కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)తో వల: వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) టెక్నాలజీ ఆధారిత కాల్స్ చేసి హనీ ట్రాప్కు పాల్పడతారు. తర్వాత వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం సేకరిస్తారు. ఇన్స్టంట్ మెసేజ్ ప్లాట్ఫాంల ద్వారా: ఆన్లైన్లో రియల్ టైం టెక్ట్స్ చాటింగ్ యాప్ల ద్వారా మెసేజ్లు పెడుతూ పరిచయం పెంచుకుని సైబర్ నేరగాళ్లు వలపు వలలోకి దించుతారు. అశ్లీల వెబ్సైట్ల ఆధారిత హనీ ట్రాప్లు: అశ్లీల వెబ్సైట్లు, అశ్లీల వీడియోలు, ఫొటోల లింక్లు పంపి, వాటి ద్వారా ఎదుటి వారిని లోబరుచుకుంటారు. ఈ మెయిల్లో లింక్ల ద్వారా..: ఈ మెయిల్స్లో లింక్లు పంపుతారు. క్రమంగా పరిచయం పెంచుకుని కావాల్సిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. డేటింగ్ యాప్లతో: డేటింగ్ యాప్లలో నగ్న వీడియో కాల్స్, ఫొటోలు పంపి ఆకర్షిస్తారు. ఎదుటి వారి నగ్న వీడియోలు, ఫొటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ♦ అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంగీకరించవద్దు. ♦ పనిచేసే కార్యాలయం వివరాలు, వృత్తి పరమైన అంశాలు సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవద్దు. ♦ మిలటరీ, పోలీస్, ఇతర కీలక ఉద్యోగాల్లో ఉండేవారు వారి వృత్తిపరమైన సమాచారం, ఫొటోలు సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టకపోవడమే ఉత్తమం. ♦ సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోర్న్ వీడియో లింకులను ఓపెన్ చేయవద్దు. సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటి? సైబర్ నేరగాళ్లు, తమకు అనుకూలంగా ఇతరులను మార్చుకోవాలనుకునే వారు సోషల్ ఫ్రొఫైలింగ్ ద్వారా టార్గెట్స్ను ఎంచుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను విరివిగా వాడేవారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కుటుంబ, వృత్తి సంబంధిత వివరాలను వీరు సేకరిస్తారు. వాటి ద్వారా ఎదుటివారి బలహీనతలపై ఒక అంచనాకు వస్తారు. దాని ఆధారంగా వలపు వలలోకి లాగుతారు. అలా అడిగితే అనుమానించాల్సిందే హనీ ట్రాప్ల ముప్పు పెరుగుతోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంగీకరించవద్దు. మన వ్యక్తిగత, వృత్తిపరమైన సున్నిత సమాచారం అడుగుతున్నారంటే అనుమానించాలి. వెంటనే అలాంటి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయాలి. వారిని అన్ఫ్రెండ్ చేయాలి. అవసరమైతే పోలీసుల్ని సంప్రదించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ -
‘హనీట్రాప్’తో లీక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పరీక్ష పేపర్ లీకేజీ వెనుక హనీట్రాప్ ఉన్నట్టు బయటపడింది. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్కుమార్ తనకు సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రోద్బలంతో ప్రశ్నపత్రాన్ని బయటికి తెచ్చినట్టు తేలింది. ఆ టీచర్ కోరిక మేరకే ప్రవీణ్ ప్రశ్నపత్రాన్ని తీసుకురాగా.. సదరు టీచర్ మాత్రం ఓ దళారీ సాయంతో ముగ్గురు అభ్యర్థులకు పేపర్ను విక్రయించినట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే పేపర్ లీకేజ్ విషయం బహిర్గతమైంది. దీనిపై టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పోస్టులకు ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా.. దీనిని టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోదరుడి కోసమంటూ అడిగి హైదరాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకకు కొన్నాళ్లుగా ప్రవీణ్కుమార్తో పరిచయం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీఎస్పీఎస్సీ పరీక్షలకు రేణుక సోదరుడు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రాయాల్సి ఉంది. పోటీ ఎక్కువగా ఉండటంతో తన సోదరుడిని ఎలాగైనా గట్టెక్కించాలని భావించిన రేణుక తన భర్తతో కలిసి ప్రవీణ్ను సంప్రదించింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కావాలని కోరింది. అప్పటికే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రవీణ్ వెంటనే అంగీకరించాడు. టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అడ్మిన్గా పనిచేస్తున్న రాజశేఖర్తో కలిసి పేపర్ తస్కరణకు పథకం వేశాడు. ఈ పేపర్లు కమిషన్కు చెందిన సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ ఆధీనంలో, ఆమె కంప్యూటర్లోనే ఉంటాయి. ఈ విషయం తెలిసిన ప్రవీణ్, రాజశేఖర్ ఆ కంప్యూటర్పై నిఘా పెట్టారు. 28న తస్కరణ.. 2న కాల్చివేత.. ప్రవీణ్, రాజశేఖర్ పలుమార్లు శంకరమ్మకు చెందిన కంప్యూటర్ను పరిశీలించారు. సరైన లాక్, ఫైర్వాల్స్ లేవని నిర్థారించుకుని.. గత నెల 28న రంగంలోకి దిగారు. కార్యాలయం నుంచి అంతా వెళ్లిపోయేదాకా వేచిచూసిన ఈ ఇద్దరూ.. మెల్లగా ఆ పేపర్ను ఓ పెన్డ్రైవ్లోకి కాపీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాజశేఖర్ కంప్యూటర్ నుంచి ప్రింట్ ఔట్ తీసుకున్నారు. ప్రవీణ్ ఈ ప్రశ్నపత్రాన్ని తీసుకువెళ్లి రేణుక, ఆమె భర్తకు అప్పగించాడు. కేవలం రేణుక సోదరుడు చదువుకోవడానికే వినియోగించాలని, మరునాడే తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు. దీనికి అంగీకరించిన రేణుక, ఆమె భర్త ఆ పేపర్ తీసుకువెళ్లారు. అయితే రేణుక పేపర్ను సోదరుడికి ఇవ్వడంతోపాటు జిరాక్సు తీసి పెట్టుకుంది. తమ స్వగ్రామం సర్పంచ్ కుమారుడితో తన వద్ద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే విక్రయిస్తానని చెప్పింది. సర్పంచ్ కుమారుడు తనకు తెలిసిన ముగ్గురు అభ్యర్థులను ఏర్పాటు చేశాడు. వారికి రూ.14 లక్షలకు పేపర్ను విక్రయించిన రేణుక రూ.4 లక్షలు తాను తీసుకుని, రూ.10 లక్షలను ప్రవీణ్కు ఇచ్చింది. అతడు ఇచ్చిన పేపర్ను ఈ నెల 2న తిరిగి ఇచ్చేసింది. ఓ అభ్యర్థి రూమ్మేట్కు తెలియడంతో.. రేణుక పరీక్ష ప్రశ్నపత్రాన్ని విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవీణ్.. తనకు తిరిగిచ్చిన పేపర్ను సైదాబాద్లోని తన ఇంటికి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే ప్రశ్నపత్రం కొన్న అభ్యర్థుల్లో ఒకరు హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో స్నేహితులతో కలిసి రూమ్లో ఉంటున్నాడు. అతడి రూమ్మేట్ సైతం కొన్నాళ్లుగా టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం రాత్రి మాటల సందర్భంలో సదరు అభ్యర్థి పేపర్ లీకేజీని రూమ్మేట్కు చెప్పాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకవడంపై కంగుతిన్న రూమ్మేట్ ఇతర స్నేహితులతో కలిసి శనివారం టీఎస్పీఎస్సీ వద్దకు వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నుంచే ‘డయల్–100’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసులు.. ఈ విషయం ఆరా తీసి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు టీఎస్పీఎస్సీ సెక్రటరీ దృష్టికి విషయం తీసుకువెళ్లడంతోపాటు పరిశీలన జరపగా పేపర్ లీకేజీపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పేపర్ సైతం లీక్? టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీపై బేగంబజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి.. ప్రవీణ్, రాజశేఖర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో రేణుకతోపాటు ఇతరుల పాత్ర బయటికి వచ్చింది. పోలీసులు మొత్తం 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో చేతులు మారిన రూ.14 లక్షలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితులను బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. వీరిని విచారిస్తున్న నేపథ్యంలోనే.. గత వారం టీఎస్పీఎస్సీ నిర్వహించిన ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను సోమవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. పేపర్ లీకేజీ అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు కూడా అంతర్గత విచారణ ప్రారంభించారు. -
TSPSC: పేపర్ లీక్లో కొత్త కోణం.. ఆమె కోసమే ఇదంతా..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. అయితే, పేపర్ లీక్ ఎపిసోడ్లో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. ఈ క్రమంలో హ్యాకింగ్ జరగలేదని నిర్ధారణ అయ్యింది. అయితే, కమిషన్కు చెందిన ఓ ఉద్యోగి.. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. పేపర్ లీకేజీ ఘటన కేసు దర్యాప్తులో హానీట్రాప్ జరిగినట్టు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ఆఫీసుకు ఇటీవల తరచుగా ఓ యువతి రావడాన్ని గమనించారు. ప్రవీణ్ కోసం సదరు యువతి తరచూ వస్తూ ఆఫీసులో కలుస్తోంది. సదరు యువతి.. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్కు గాలం వేస్తూ సన్నిహితంగా ఉంది. ఈ క్రమంలో తనకు పేపర్ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆమె కోసం పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. యువతి కోసం టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీ జరిగిందని అధికారులు నిర్ధారించారు. దీంతో, నిందితుడు ప్రవీణ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్షలు వాయిదా.. టౌన్ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షలను టీఎస్పీఎస్సీ పరీక్షను వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే అనుమానంతో కమిషన్ ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు ముందే దానికి సంబంధించిన సమాచారాన్ని, పరీక్ష తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ మేరకు అభ్యర్థులకు సంక్షిప్త సమాచార రూపంలో రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లకు ఆదివారంనాటి పరీక్ష రద్దు సమాచారాన్ని అందించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం రాత్రి కమిషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. -
Honey Trapping: తియ్యని మాటలు.. కవ్వించే గొంతుతో రూ.కోటి కొట్టేసింది..
సాక్షి, హైదరాబాద్: ఓ అమ్మాయి తియ్యని గొంతుతో వేర్వేరుగా ఇద్దరితో మాట కలిపింది. టెలిగ్రామ్ వేదికగా కవ్వింపు మాటలు మాట్లాడి కోటీశ్వరులు అయ్యే ఉపాయం చెప్తానన్నది. ఇంకేముంది?..దీనికి అంగీకరించిన ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకున్నారు. ఒకరి నుంచి రూ.56 లక్షలు, మరొకరి నుంచి రూ.51 లక్షలు కాజేశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా సోమవారం సిటీ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. బంజారాహిల్స్కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఇటీవల టెలిగ్రామ్ వేదికగా ఓ అమ్మాయి పరిచయమయ్యింది. రెండురోజుల పాటు ఇద్దరూ చాటింగ్ చేస్తూ పరిచయాన్ని కాస్త స్నేహంగా మలుచుకున్నారు. తాను ఇన్వెస్టర్ని అంటూ నమ్మబలికింది. నాలా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అంటూ కోరింది. ఆమె మాటలకు బుట్టలో పడ్డ వ్యక్తి ఆమె చెప్పినట్లుగా ఇన్వెస్ట్ చేశాడు. తొలుత రెండు, మూడు పర్యాయాలు లాభాలు ఇచ్చింది. ఆ తర్వాత సుమారు రూ.20 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయించి ఒక్క రూపాయి లాభం ఇవ్వలేదు. ఈ రూ.20 లక్షలు రావాలంటే మరికొంత కట్టాలన్నది. ఇలా ఆమె చెప్పినట్లు పలు దఫాలుగా రూ.52 లక్షలు వెచ్చించాడు. మెహదీపట్నంకు చెందిన 30 ఏళ్ల యువకుడికి ఇదే మాదిరిగా ఓ అమ్మాయి పరిచయమైంది. ఇన్వెస్ట్మెంట్ నుంచి క్రిప్టో కరెన్సీ వైపు అడుగులు వేయించింది. పలు దఫాలుగా యువకుడి నుంచి రూ.56 లక్షలు స్వాహా చేసింది. ఈ ఇద్దరిదీ ఒకేరకమైన వలపు వల కావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ముక్కూ మొహం తెలియని అమ్మాయి తియ్యగా మాట్లాడితే అన్ని లక్షలు ఎలా ఇస్తారంటూ ఏసీపీ కేవీఎం ప్రసాద్ మందలించారు. వీరిద్దరి వేర్వేరు ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
HYD: హనీట్రాప్.. అందమైన రూపంతో ఎర.. ఒంటిపై నూలుపోగు లేకుండా వీడియో కాల్!
సాక్షి, హైదరాబాద్: ఓ అందమైన యువతి అనుకోకుండా వీడియో కాల్ చేయడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆమె మాయలో పడ్డాడు. మాయలేడి మాయ మాటలు చెప్పి ఆయనను పీకల్లోతు ప్రేమలోకి తీసికెళ్లింది. కట్ చేస్తే ఆ వీడియోను అడ్డం పెట్టుకుని రూ.లక్షలు కాజేసింది. ఆ వీడియో బయటకు వస్తే తన పరువుపోతుందని భావించిన అతను తనకు న్యాయం చేయాలని కోరుతూ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంపాపేటకు చెందిన వ్యక్తి ఓ ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్నాడు. విధుల్లో ఉన్న ఆయనకు ఓ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. దానిని లిఫ్ట్ చేయగా అవతలి వైపు అందమైన అమ్మాయి కనిపించింది. మీతో స్నేహాన్ని పంచుకోవాలనుకుంటున్నానంటూ తియ్యని మాటలతో అతడిని రెచ్చగొట్టింది. ఇంటికెళ్లిన తర్వాత కాల్ చేస్తానంటూ చెప్పి అతను కాల్ కట్ చేశాడు. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటరిగా సదరు యువతికి కాల్ చేశాడు. వీడియో కాల్లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఓ వ్యక్తి కాల్ చేసి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. మీరు ఓ యువతిని భయపెట్టి ఆమెతో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడారని, మేం చెప్పినట్లు వినకపోతే వీడియోకాల్ను సోషల్ మీడియాలో పెట్టడమే కాక కేసు ఫైల్ చేస్తామన్నారు. ఈ విషయం బయటికి వస్తే తన పరువు పోతుందనే భయంతో అతను వారికి రూ.5లక్షలు ముట్టజెప్పాడు. ఇంకా కావాలని ఫోన్ చేసి వేధిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హైదరాబాద్ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు -
సహచరుడి గర్ల్ ఫ్రెండ్తో న్యూడ్ వీడియో కాల్.. స్పందించిన బాబర్ ఆజమ్
Babar Azam Honey Trap Episode: సహచరుడి గర్ల్ ఫ్రెండ్తో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్.. తాజాగా ఈ ఉదంతంపై స్పందించాడు. తనపై సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ.. సుఖంగా ఉండేందుకు మరీ అంత రిస్క్ చేయనన్న అర్ధం వచ్చేలా ట్వీట్ చేస్తూ, తనపై వస్తున్న ఆరోపణలకు పరోక్షంగా చెక్ పెట్టాడు. Doesn't take too much to be happy ☺️ pic.twitter.com/udKmZTHl6V — Babar Azam (@babarazam258) January 16, 2023 నదీ తీరాన, ఆహ్లాదకరమైన వాతావరణంలో తీసుకున్న తన ఫోటోను షేర్ చేస్తూ బాబర్ ఈ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్లో బాబర్ నవ్వుతూ ఇచ్చిన పోజ్ను బట్టి చూస్తే.. తనపై వస్తున్న ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో పాటు అభిమానులు కూడా బాబర్కు అండగా నిలిచారు. సోషల్మీడియాలో వైరలవుతున్న వీడియోలో ఉన్నది బాబర్ కాదని, గిట్టని వారు మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పట్టీపట్టనట్లుగా ఉండటంతో బాబర్కు మద్దతుగా నిలుస్తోందని స్పష్టమవుతోంది. The war against Babar Azam has started 😢#BabarAzam𓃵 #BabarAzam pic.twitter.com/JOSmHd9A32 — Muhammad Noman (@nomanedits) January 15, 2023 కాగా, వైరలవుతున్న వీడియోలో బాబర్.. తన సహచరుడి (పాక్ జట్టులో సభ్యుడు) గర్ల్ ఫ్రెండ్తో అసభ్య పదజాలం ఉపయోగించి చాటింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. నియో యాదవ్ అనే ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో బాబర్, తన సహచర పాకిస్తాన్ ఆటగాడి గర్ల్ ఫ్రెండ్తో సెక్స్ చాటింగ్ చేస్తున్నాడు. తనతో చాటింగ్ కొనసాగిస్తే.. సదరు అమ్మాయి ప్రియుడికి జట్టులో స్థానానికి ఢోకా ఉండదని ప్రామిస్ చేశాడు. ఈ వీడియోతో పాటు పలు అసభ్య చాట్ మెసేజ్లు, ఆడియో రికార్డింగ్లు, బాబర్కు సంబంధించిన పర్సనల్ ఫోటోలు కూడా సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పటికే స్వదేశంలో వరుస సిరీస్ల్లో జట్టును గెలిపించలేక, కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో ఉన్న బాబర్కు తాజా ఉదంతం మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది. -
Hyderabad: వలపు వల హనీ ట్రాప్తో నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రాంతానికి చెందిన చోటామోటా వ్యాపారుల్లో అమాయకులను ఎంచుకోవడం... యువతులతో వారికి ఎర వేసి ఫొటోల వరకు తీసుకువెళ్లడం... వాటితో యువతుల బంధువులుగా రంగంలోకి దిగడం... దాడులు, బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేసి అందినకాడికి దండుకోవడం... ఈ పంథాలో రెచ్చిపోతున్న “హనీట్రాప్స్ బందిపోటు’ ముఠాను ముషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అరెస్టైన 12 మందిలో ఓ మాజీ హోంగార్డు, బౌన్సర్ ఉన్నట్లు మధ్య మండల డీసీపీ ఎం.రాజేష్ చంద్ర తెలిపారు. చిక్కడపల్లి ఏసీపీ ఎస్.యాదగిరితో కలిసి సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. హోంగార్డుగా పని చేస్తూ నేరాలు... ముషీరాబాద్ పరిధిలోని దయారా మార్కెట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ విఖార్ మెహ్దీ గతంలో నగర భద్రతా విభాగంలో హోంగార్డుగా పని చేశారు. 2013లో పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ, బెదిరింపులకు పాల్పడి జైలుకు వెళ్లాడు. 2016లో నోట్ల రద్దు తర్వాత పాత నోట్లకు కొత్త నోట్లు మార్పిడి పేరుతో దందా చేసి పలువురిని మోసం చేశాడు. దీనిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో మరోసారి జైలుకు వెళ్లాడు. ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. విఖార్ జైల్లో ఉండగా తలాబ్కట్టకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్తో పరిచయమైంది. వీళ్లిద్దరూ కలిసి పంజగుట్టలో విఖార్తో కలిసి అరెస్టు అయిన సంతోష్నగర్ వాసి మహ్మద్ కలీం ఖాన్, ముషీరాబాద్కు చెందిన పాత నేరగాడు, విఖార్ సోదరుడైన సిరాజ్ జట్టు కట్టారు. పహాడీషరీఫ్, మెహదీపట్నం ప్రాంతాలకు చెందిన షేక్ సమీర, సైదా ఫాతిమా, మహ్మద్ ఇస్మాయిల్, అలీ, మజీద్ అహ్మద్, అహ్మద్ రిజ్వాన్, సయ్యద్ రఫీఖ్, షేక్ బషీర్, స్టేజ్ డ్యాన్సర్ హీనాలతో ముఠా ఏర్పాటు చేశారు. చిరు వ్యాపారులను ఎంపిక చేసుకుని... ఈ గ్యాంగ్లోని పురుషులు తమ ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల్లో అమాయకులను టార్గెట్గా చేసుకుంటారు. వీరి ద్వారా విషయం తెలుసుకునే ముఠాలోని యువతులు, మహిళలు అతడి వద్దకు వెళ్తారు. ఆయా వ్యాపారాలకు సంబంధించి ఆర్డర్లు ఇవ్వడానికంటూ వ్యాపారుల ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ఆపై వారికి వాట్సాప్లో సందేశాలు పంపి చాటింగ్స్ చేస్తారు. ఓ ప్రాంతంలో కలుసుకోవడానికి రమ్మని పిలిచి వారితో ఫొటోలు దిగుతారు. ఈ ఫొటోలను తీసుకుని ముఠా సభ్యులు అసలు కథ మొదలెడతారు. ఆ వ్యాపారి వద్దకు వెళ్లి సదరు మహిళ తమ భార్య లేదా కాబోయే భార్య అని చెప్పి, ఆమెను లోబరుచుకుంటున్నావని బెదిరించి దాడి చేస్తారు. పోలీసులుగా ఎంట్రీ ఇచ్చే విఖార్, ఇమ్రాన్లు కేసుల పేరుతో, విలేకరి రూపంలో వచ్చే రిజ్వాన్ ఫొటోలు మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తాడు. దీంతో వారు సదరు వ్యక్తి నుంచి భారీ మొత్తం డిమాండ్ చేసి అందినకాడికి దండుకుంటారు. మూడు ఠాణాల్లో నాలుగు కేసులు... ఈ ఏడాది జూన్ నుంచి నేరాలు చేస్తున్న ఈ గ్యాంగ్పై ఇప్పటి వరకు ఆసిఫ్నగర్, సంతోష్నగర్, ముషీరాబాద్ల్లో కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్కు చెందిన ఖమ్రుద్దీన్ను రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. వీరి వేధింపులు తట్టుకోలేక అతడు తన ఇంటిని తాకట్టు పెట్టి రూ.5 లక్షలు ఇచ్చాడు. ఇదే ప్రాంత వాసి ఖలీల్ పాషా రూ.2.5 లక్షలు మరో ఇద్దరి నుంచి ఇంకొంత రాబట్టారు. ఇలా మొత్తం రూ.8.5 లక్షలు కాజేసిన, బెదిరింపులకు డమ్మీ పిస్టల్స్, కత్తులు వాడే వీరిపై ముషీరాబాద్లో బందిపోటు దొంగతనం సహా వివిధ ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. చిక్కడపల్లి ఏసీపీ ఎస్.యాదగిరి నేతృత్వంలో రంగంలోకి దిగిన నాలుగు బృందాలు హీనా సహా మిగిలిన 12 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.5 లక్షల నగదు, రెండు డమ్మీ తుపాకులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో అర్హులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, వీరి బారినపడిన బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని డీసీపీ రాజేష్ చంద్ర కోరారు. -
HYD: కి‘లేడీ’ ప్లాన్.. హోం డెలివరీ పేరిట మహిళ హనీ ట్రాప్
సాక్షి, హైదరాబాద్: నగరంలో హనీ ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. తెలంగాణ పోలీసులు హనీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా ఓ మహిళతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. హోమ్ డెలివరీ పేరిట ఓ మహిళ నగరంలో కొందరు వ్యక్తులను హనీ ట్రాప్ చేస్తోంది. ఈ క్రమంలో యువకులతో పరిచయం పెంచుకున్న సదరు మహిళ.. వారితో సన్నిహితంగా ఫొటోలు దిగుతోంది. ఇలా వారిలో ఫొటోలు దిగిన మరుసటి రోజే.. సదరు మహిళతో పాటు వారి గ్యాంగ్ యువకుల ఇంటి వద్ద ప్రత్యక్షమవుతున్నారు. యువకులు.. ఆమెతో ఫొటోలు దిగి మహిళను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఇంటిపై దాడి చేసి హంగామా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో మహిళ గ్యాంగ్.. బాధిత యువకుల వద్ద రూ. లక్షలు వసూలు చేస్తోంది. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జోన్ పరిధిలోని పోలీసులు వారిపై ఆరు కేసులు నమోదు చేశారు. అనంతరం, హనీ ట్రాప్కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. -
వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు..
ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ భారీ స్మగ్లింగ్ను నిలువరించారు. ఓ వ్యక్తి నుంచి రూ.28 కోట్లు విలువ చేసే కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. అతను బ్యాగులో దీన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. బ్యాగును చింపి కొకైన్ను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #WATCH | Mumbai Airport Customs y'day arrested an Indian pax carrying 2.81 Kg cocaine worth Rs 28.10 Cr, concealed in a duffle bag. Probe shows that pax was lured to carry drugs by persons whom he met only over social media. He was honey trapped to indulge in smuggling: Customs pic.twitter.com/oCxBG5F2CP — ANI (@ANI) January 10, 2023 ఈ వ్యక్తి బ్యాగులో మొత్తం 2.81కిలోల కొకైన్ దొరికింది. దీని విలురు రూ.28.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యక్తి ఓ మహిళ వలపు వలలో చిక్కుకునే స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ, ఇతడ్ని కొకైన్ ఢిల్లీకి తీసుకెళ్లి మరో వ్యక్తికి ఇవ్వమని చెప్పిందని పేర్కొన్నారు. ఆమె మాయలో పడిన ఇతడు స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు వివరించారు. గతవారం కూడా ముంబై విమానాశ్రయంలో రూ.47 కోట్లు విలువ చేసే కొకైన్, హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 4.47 కేజీల హెరాయిన్, 1.6 కిలోల కొకైన్ను పట్టుకున్నారు. చదవండి: ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి -
యువతుల వలపు వల! అందంతో టెంప్ట్ చేసి.. ఆపై టార్చర్..
సాక్షి, వరంగల్: న్యూడ్ కాల్స్ న్యూసెన్స్ చేస్తున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో.. అదే స్థాయిలో సైబర్ క్రిమినల్స్ కూడా మరింతగా అప్డేట్ అవుతున్నారు. వాట్సాప్ ద్వారా నేరుగా వీడియో కాల్స్ చేస్తున్న యువతులు ఆ ఫోన్ వినియోగదారుడిని టెంప్ట్(ప్రేరేపిస్తూ) చేసి.. వారిని కూడా వివస్త్రలు కావాలని చెప్పి మరీ ఆ సీన్ను వీడియో రికార్డు చేస్తున్నారు. ఆ తర్వాత వారు మొదలు పెట్టే అసలు ఆటలో ఈ విషయాలు బయటకు చెప్పుకోలేక రూ.లక్షలు సమర్పించుకుంటున్నారు. ఇంకొందరు ఈ వేధింపులు తారస్థాయికి చేరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ గడపతొక్కుతున్నారు. మరికొందరేమో తమ పరిధిలోని ఠాణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదికి పైగా కేసులు కూడా నమోదయ్యాయి. అందంతో టెంప్ట్ చేసి.. ఆపై టార్చర్.. అదిరే డ్రెస్సు.. ఆకర్షించే అందచందాలతో చూడచక్కగా ఉండే యువతులు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. ఇలా వీడియో కాల్ రాగానే.. ఇటు నుంచి యువకులు కూడా వారు చెప్పే మా టలకు ఫిదా అవుతున్నారు. ఓ అమ్మాయి నేరుగా వీడియో కాల్ చేయడంతో ఉబ్బితబి్బబ్బవుతున్నా రు. ఆ తర్వాత మాటల్లోకి దింపి సదరు యువతి డ్రెస్ తీసేసి ఇటువైపు నుంచి ఉన్న యువకులను టెంప్ట్ చేస్తుంది. మీరు కూడా బాత్రూమ్కు వెళ్లి బ ట్టలు తీసేయండి అంటూ చెప్పడంతో ఆ మోజులో చాలా మంది అలానే చేస్తున్నారు. ఈ సమయంలో సదరు యువతి మాటలతో రెచ్చగొట్టి యువకులు చేసే సీన్లను వీడియో రికార్డు చేస్తున్నారు. పోలీసుల పేరుతో కాల్స్.. ఇక్కడ్నుంచి నేరస్తుల అసలు కథ మొదలవుతుంది. వీడియో కాల్ పూర్తయ్యాక.. కాసేపటికి బాధితుడికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఢిల్లీ సైబర్ క్రైమ్ ఏసీపీ, సీఐని మాట్లాడుతున్నానని.. మీతో న్యూడ్ వీడియో కాల్ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని సదరు బాధితుడిని బెదిరిస్తారు. ఢిల్లీలో కేసు నమోదైందని.. అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తారు. అమ్మా యి సెల్ఫోన్న్వీడియోల రికార్డ్ అంతా రికవరీ చేశామంటారు. ఆ వీడియో సదరు యువకులకే పంపడంతో నిజమేనని నమ్మేస్తారు. కేసులు, తలనొప్పులు లేకుండా ఈజీగా బయటపడాలంటే కొంత డబ్బు పంపించాలని కొరతారు. కొందరు అధికారులను మేనేజ్ చేయాల్సి ఉందని నమ్మబలుకుతారు. ఇలా విడతలవారీగా రూ.లక్షల్లో డబ్బులను ఆన్లైన్లో కొందరు బాధితులు సమర్పించుకున్నారు. ఈ విధంగా వరంగల్లోని 36వ డివిజన్ చింతల్కు చెందిన ఓ వ్యక్తికి అనుభవం ఎదురుకావడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆ వీడియో కాల్స్కు స్పందించొద్దు.. సైబర్ నేరగాళ్ల ముసుగులో కొందరు యువతులు వీడియో కాల్స్ చేసి తియ్యటి మాటలతో నగ్నంగా ఉండి టెంప్ట్ చేసి ఆ తర్వాత బెదిరించి డబ్బు వసూలు చేసే కేసులు పెరుగుతున్నాయి. సమాజంలో గౌరవం ఉన్నవారు బయటకు చెప్పుకోలేక పీకల్లోతు వేధింపులు వచ్చాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా న్యూడ్ వీడియో కాల్స్కు స్పందించకపోవడమే మంచిది. ఒకవేళ అలాంటివి ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలి. నిందితులను టెక్నికల్ డాటా ఆధారంగా పట్టుకునే అవకాశం ఉంటుంది. – ఏవీ రంగనాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
అందంగా ట్రాప్.. కిలాడీ టిక్ టాకర్ అరెస్ట్ ..!
-
హైదరాబాద్ లో వెలుగులోకి మరో వలపు వల
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఈటల చేతికి తెలంగాణ బీజేపీ పగ్గాలు
మినిమం 30.. తగ్గేదేలే..! ఇది కదా పానీ పూరీ మజా....వీడియో వైరల్
కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
ఎన్నికల ఫలితాల రోజు మార్కెట్ పతనంపై సుప్రీం కోర్టులో పిటిషన్
ఏపీలో మూడు రోజుల పాటూ భారీ వర్షాలు
టీడీపీ అరాచకాలపై వైఎస్ఆర్ సీపీ యాక్షన్ ప్లాన్
వరదరాజు గోవిందం మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే!
ఎవరికి ఏ శాఖ ?..మోదీ కేబినెట్ మీటింగ్
Advertisement