-
గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
సహజ వజ్రాలు భూగర్భంలో తీవ్ర ఒత్తిడి, ఉష్ణోగ్రతలలో ఏర్పడటానికి వందల, లక్షల ఏళ్లు పడుతుంది. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన సింథటిక్ వజ్రాలు కొన్ని వారాల్లో తయారు చేయవచ్చు. ఇపుడిక కొన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చు. ఎక్కడ? ఎలా అంటారా. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!వజ్రాలు.. డైమండ్స్.. పేరు చెబితేనే ఖరీదైన వ్యవహారం అని అనుకుంటాం. జేమ్స్ బాండ్ మూవీ టైటిల్ ట్రాక్ ‘‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’’ లో చెప్పినట్టు వజ్రాలు శాశ్వతం. అందుకే తమ ప్రేమ కలకలం నివాలని ప్రేమికులు డైమండ్ రింగులను ఇచ్చి పుచ్చుకోవడం ఫ్యాషన్. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తయారైన వజ్రాలు ఫ్యాషన్ మార్కెట్లలోకి రాబోతున్నాయి. దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకుల బృందం డైమండ్స్ తయారీలో ఒక వినూత్న విధానాన్ని కొనుగొంది. దీంతో సింథటిక్ వజ్రాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పురానుందని, సరసమైన ధరల్లో డైమండ్స్ అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది. అయితే ల్యాబ్లో వజ్రాల తయారీకి కూడా కొంత సమయం ఎక్కువ పడుతుంది. కానీ పరిశోధకులు కేవలం 150 నిమిషాల్లో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను గుర్తించారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయడం విశేషం.అయితే వజ్రాలకోసం కార్బన్ను ద్రవ లోహంలో కరిగించడం కొత్తదేమీ కాదు. కరిగిన ఇనుము సల్ఫైడ్ను ఉపయోగించే ప్రక్రియను 50 ఏళ్ల క్రితమే జనరల్ ఎలక్ట్రిక్ అభివృద్ధి చేసింది. అయితే ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. కొత్త విధానంలో గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్ లను మీథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ చాంబర్ లో అత్యంత వేగంగా వేడి చేస్తారు. దీనివల్ల కార్బన్ అణువులు ద్రవ లోహంలో పారదర్శక స్పటికాలుగా మారి తరువాత డైమండ్ సీడ్స్ తయారవుతాయి. అలా మొత్తంగా 150 నిమిషాలకు వజ్రం ముక్కలు ఏర్పడతాయి. ఈ కొత్త పద్ధతి ద్వారా పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగ పడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధన వివరాలను నేచర్లో ప్రచురించారు. -
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
సౌత్ కొరియా సింగర్ ఆండా రెండేళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. అప్పటివరకు ఎంతో యాక్టివ్గా ఉన్న ఈ బ్యూటీ ఉన్నట్లుండి సామాజిక మాధ్యమాలను ఎందుకు దూరం పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా ఇన్స్టాగ్రామ్లోకి రీఎంట్రీ ఇచ్చింది ఆండా. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర వార్త బయటపెట్టింది.ఓ విషయం చెప్పాలితనకు పెళ్లైందని, ఓ బిడ్డ కూడా పుట్టిందని వెల్లడించింది. ఈమేరకు భర్తతో కలిసున్న వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసింది. 'హలో, నా పేరు ఆండా. చాలాకాలంగా నేను సైలెంట్గా ఉండటంతో నేనెలా ఉన్నానని కంగారుపడుతున్నారేమో! నేను బాగున్నాను.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఇది సాంగ్కు సంబంధించినది కాదు.. ఇదెలా చెప్పాలా? అని చాలాకాలంగా టెన్షన్ పడుతున్నాను. ఇక దాన్ని చెప్పేస్తున్నాను.పెళ్లి - పాపగతేడాది ఓ అద్భుతమైన వ్యక్తిని కలిశాను. మేమిద్దరం శీతాకాలంలో పెళ్లి చేసుకున్నాం. మాకు ఓ పాప పుట్టింది. మీరు ఇకపై ఆండా 2.0ను చూడబోతున్నారు. తల్లిగా, భార్యగా, సింగర్గా అన్ని పనులు నిర్వర్తించనున్నాను. మీ అందరికోసం మరింత కష్టపడతాను. థాంక్యూ' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Anda🎈 (@anda_kiss) -
ధీరజ్ బృందం సంచలనం
షాంఘై (చైనా): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది. టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన రికర్వ్ టీమ్ విభాగం ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్లతో కూడిన భారత జట్టు 5–1 (57–57, 57–55, 55–53)తో సంచలన విజయం సాధించింది. తద్వారా 14 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీలో టీమ్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకుంది. చివరిసారి భారత్ 2010 ఆగస్టులో షాంఘైలోనే జరిగిన ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలో స్వర్ణం సాధించింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ధీరజ్ –అంకిత ద్వయం కాంస్య పతకం గెలిచింది. కాంస్య పతక మ్యాచ్లో ధీరజ్–అంకిత జోడీ 6–0 (35–31, 38–35, 39–37)తో వలెన్సియా–మతియాస్ (మెక్సికో) జంటపై నెగ్గింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో భారత స్టార్ దీపిక కుమారి 0–6 (26–27, 27–29, 27–28)తో ఆసియా క్రీడల చాంపియన్ లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకుంది. -
ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్లో ఫ్యాన్స్
ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ పార్క్ బోరామ్ అనుమానాస్పద మరణం మ్యూజిక్ ప్రపంచాన్ని, ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 30 ఏళ్ల వయసులో దక్షిణ కొరియా గాయని పార్క్ బో రామ్ కన్నుమూసింది. దక్షిణ కొరియాలో గాయనిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న పార్క్ బోరామ్ మరణాన్ని అభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు. నమ్యాంగ్జు పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటర్లు దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఆమె చనిపోయే కొద్ది గంటల ముందు ఒక ప్రైవేట్ ఈవెంట్కు వెళ్లింది. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించింది. ఆ తరువాత రాత్రి 9:55 గంటలకు రెస్ట్రూమ్కి వెళ్లింది. 'సింక్పైకి వంగి’, అపస్మారక స్థితిలో చనిపోయి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని పోలీసులు విచారణ చేపట్టారు. Park Boram has passed away at the age of 30. pic.twitter.com/E2PfluIwfc — Kpop Charts (@kchartsmaster) April 11, 2024 దక్షిణ కొరియా సంగీత పరిశ్రమలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. రచయిత కూడా అయిన బో రామ్ తన పదేళ్ల మైలురాయిని చేరుకున్నందుకు గౌరవసూచకంగా ఈ ఏడాది చివర్లో రెండు కొత్త పాటలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆమె మరణంపై పలువురు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. కె-పాప్ సింగర్ పార్క్ బో రామ్ పార్క్ బో-రామ్ 2010లో 17 ఏళ్ల వయస్సులో రియాలిటీ సింగింగ్ ఛాలెంజ్ 'సూపర్ స్టార్ K2'లో కనిపించి మెప్పించింది. తరువాత 'బ్యూటిఫుల్' పాటతో కరియర్ ప్రారంభించింది. ‘రీప్లే 1988’ లాంటి ఆల్బమ్స్లో మెలోడియస్ వాయిస్తో బాగా పాపులర్ అయింది. 2014 గావ్ చార్ట్ మ్యూజిక్ అవార్డ్స్లో, ఆమె ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ถ้าเคยดู reply 1988 คงจะจำเพลงนี้ได้ ตอนนี้เจ้าของเพลงไม่อยู่แล้ว 😢 รู้จักพี่โบรัมตั้งแต่เพลง Beautiful เขาเป็นคนที่เป็นแรงบันดาลใจให้ใครหลายคนในการ ลนน และเดินตามความฝันของตัวเอง เขาเก่งมากๆนะ เป็นอีกครั้งที่วงการเกาหลีต้องสูญเสียคนเก่งๆไป #RIP #ParkBoram #พัคโบรัม pic.twitter.com/sBORRZMBp2 — Miànbāo hé nǎichá 🍞 (@Magic_pink00) April 12, 2024 -
దక్షిణకొరియాలో నేడే ఎన్నికలు
సియోల్: దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 300 స్థానాలున్న పార్లమెంట్లో 254 స్థానాలను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన 46 స్థానాలను చిన్నాచితక పారీ్టలకు వాటికి లభించిన ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పీపుల్ పవర్ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ పోటీ పడుతున్నాయి. దేశంలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈసారి రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు పీపుల్ పవర్ పార్టీ నేత, అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రిఫరెండమ్ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆయన 2022లో అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారు. మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో పీపుల్ పవర్ పార్టీకి తక్కువ స్థానాలు వస్తే యూన్ సుక్ ఇయోల్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకోవచ్చు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నాయకుడు లీ జే–మ్యూంగ్ ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. సర్వే కూడా అదే అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిక్యం పెరిగితే పరిపాలన పరంగా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్కు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. -
అమెరికా, సౌత్కొరియాలకు నార్త్ కొరియా వార్నింగ్
ప్యాంగ్యాంగ్: సౌత్ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న మిలిటరీ విన్యాసాలు తమ దేశంపై దాడి కోసమేనని, ఇందుకు తాము సరైన రీతిలో స్పందిస్తామని ఉత్తరకొరియా హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 11 రోజుల పాటు నిర్వహించే మిలిటరీ డ్రిల్ను సౌత్కొరియా, అమెరికా కలిసి తాజాగా ప్రారంభించాయి. ఈ డ్రిల్లో భాగంగా గత ఏడాది కంటె రెట్టింపు విన్యాసాలను రెండు దేశాలు చేయనున్నాయి.‘ఇవి పూర్తి బాధ్యతా రహితమైన మిలిటరీ విన్యాసాలు, సార్వభౌమ దేశమైన నార్త్కొరియాను ఆక్రమించేందుకు సౌత్కొరియా, అమెరికాలు కలిసి మిలిటరీ డ్రిల్ ముసుగులో ప్రయత్నిస్తున్నాయి’అని నార్త్కొరియా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు..39 మంది మృతి -
South Korea: మాతృత్వానికి దూరం.. దూరం!
ఆమె పేరు యెజిన్. టీవీ యాంకర్. ఓ సాయం వేళ స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతుండగా మొబైల్లో ఓ పాపులర్ మీమ్ ప్రత్యక్షమైంది. ‘మాలా మీరూ అంతరించిపోకముందే జాగ్రత్త పడండి’ అని ఓ కార్టూన్ డైనోసార్ హితబోధ చేయడం దాని సారాంశం. దాంతో వారందరి మొహాల్లోనూ విషాద వీచికలు. 30 ఏళ్లు దాటుతున్నా వారెవరికీ ఇంకా పిల్లల్లేరు మరి! వారే కాదు, లో చాలామంది మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం...! దక్షిణ కొరియా చాలా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులే. ఇంటిపట్టున ఉండేవారు చాలా తక్కువ. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘ పనిగంటలు. పైగా తరచూ ఓవర్ టైమ్ చేయడం తప్పనిసరి. నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలారకాలుగా పడుతుంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పంచుకోరు. పైగా వేతనాలతో పాటు చాలా అంశాల్లో మితిమీరిన. దీనికి తోడు దాల్ చేసేలా కంపెనీలు ఒత్తిడి చేయడం సర్వసాధారణం. దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ ఒకసారి వెనకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదీగాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కని, సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు మహిళలకు ఏ మాత్రమూ ఉండటం లేదు. పిల్లలు, కెరీర్లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి. అత్యధికులు రెండో ఆప్షన్కే ఓటేస్తున్నారు. అలా మొత్తంగా మాతృత్వానికే దూరమవుతున్నారు! అట్టడుగుకు జననాల రేటు ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింట్లోనూ చాలాకాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానిదే ప్రపంచ రికార్డు! పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం విడుదలైన గణాంకాలైతే ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది! ఫలించని ప్రోత్సాహకాలు... పిల్లల్ని కనేలా జనాలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో ప్రభుత్వాలు చేయని ప్రయత్నాల్లేవు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివెన్ని ప్రకటించినా లాభముండటం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించనంత కాలం ఇటువంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని సామాజికవేత్తలు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Seoul: సౌత్కొరియాలో డాక్టర్ల పోరుబాట.. పేషెంట్ల విలవిల
సియోల్: సౌత్ కొరియాలో డాక్టర్లు వారం రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కోర్సుల్లో ఏడాదికి 2 వేల సీట్లు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో పేషెంట్లు డాక్టర్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని సియోల్లోని 5 పెద్ద ఆస్పత్రుల్లో ఇప్పటికే షెడ్యూల్ అయిన సగం సర్జరీలు రద్దవుతున్నాయి. దీనిపై దేశ వైద్యశాఖ సహాయ మంత్రి పార్క్ మిన్సూ స్పందించారు. డాక్టర్ల ప్రాథమిక కర్తవ్యం పేషెంట్ల ప్రాణాలు కాపాడటమని, నిరసనల కంటే వారు ఈ విషయానికే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పనిచేసే చోటే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల వల్ల ఇప్పటివరకు 7813 మంది డాక్టర్లు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారని, ఇందుకే మరింత మంది డాక్టర్లు అవసరమని చెప్పారు. అయితే స్టే ఎట్ వర్క్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం డాక్టర్ల సంఖ్యను పెంచే బదులు వారి వేతనాలు, పని ప్రదేశంలో సౌకర్యాలు పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిండం కోసమే మెడికల్ సీట్ల సంఖ్యను పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతుంటే ఏప్రిల్లో జరిగే సాధారణ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ స్టంట్ ప్లే చేస్తోందని డాక్టర్లు అంటున్నారు. ఇదీ చదవండి.. అలెక్సీ నావల్ని కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ -
పండంటి బిడ్డకు జన్మ: ఆసుపత్రికి భారీ విరాళమిచ్చిన ముద్దుగుమ్మ
దక్షిణ కొరియా ఒలింపియన్ జిమ్నాస్ట్ సన్ యోన్ జే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సంబంధిత వర్గాలు మంగళవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆమె సెవెరెన్స్ హాస్పిటల్ ప్రసూతి విభాగానికి భారీ ఎత్తున (సుమారు 62 లక్షల రూపాయలు) విరాళాన్ని కూడా ప్రకటించడం విశేషంగా నిలిచింది. దీంతో రిథమిక్ జిమ్నాస్ట్ సన్ యోన్ జేకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రసూతి, గైనకాలజీకి చాలా మద్దతు అవసరమని భావించానని, అందుకే ఈ విరాళమని సన్ యోన్ జే ప్రకటించింది.హై-రిస్క్ మెటర్నల్ అండ్ ఫీటల్ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ సెంటర్ కోసం ఈ విరాళాన్ని ఉపయోగిస్తామని ఆసుపత్రి ప్రతినిధి వెల్లడించారు. అయితే ఆసుపత్రికి విరాళం ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తమ పెళ్లి సందర్బంగా 37,400డాలర్లను సెవెరెన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ల జిమ్నాస్ట్ ప్రీ-టీనేజ్లోనే బరిలోకి దిగి సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడలలో ఆల్ రౌండర్ ఛాంపియన్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2010 ఆసియా గేమ్స్ ఆల్రౌండ్ కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకోవడంతోపాటు, వరుసగా మూడుసార్లు ఆసియా గేమ్స్ ఆల్ రౌండర్ ట్రోఫీ దక్కించుకుంది. అలాగే దక్షిణ కొరియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్గా నిలిచింది. 2022, ఆగస్టులో సౌత్ కొరియాలో హెడ్జ్ ఫండ్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది సన్ యోన్ జే. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. -
North korea: ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు
ప్యాంగ్యాంగ్: దక్షిణ కొరియా తమకు ప్రధాన శత్రువని ప్రకటించిన ఉత్తర కొరియా వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా ఆ దేశం మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది. దానిపై నుంచి 240ఎమ్ఎమ్ బాలిస్టిక్ రాకెట్ లాంచర్ షెల్స్ను విజయవంతంగా ప్రయోగించింది. షెల్ అండ్ బాలిస్టిక్ కంటట్రోల్ సిస్టమ్ను అభివృద్ధి చేయడంలో ఈ పరీక్ష కీలకం కానుందని నార్త్ కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. జనవరిలోనూ పొరుగు దేశం దక్షిణ కొరియా సరిహద్దులోని ఓ ఐలాండ్లో ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించింది ఉత్తర కొరియా. దక్షిణ కొరియా తమపై దాడికి దిగితే ఆ దేశాన్నే లేకుండా చేస్తామని ఇటీవలే ఉత్తర కొరియా నియంతా కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇదీ చదవండి.. కాల్చేసే కాంతి పుంజం -
హైదరాబాద్లో కాస్మొటిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మొటిక్ తయారీ సంస్థ డూసన్ హైద రాబాద్లో కాస్మొటిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలి కాస్మొటిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్ను దాదాపు రూ. 5 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో డూసన్ ప్రతినిధులు సమావేశమై తమ పెట్టుబడుల గురించి ప్రభుత్వా నికి సవివరమైన నివేదిక (డీపీఆర్)ను అందజే శారు. తాము కల్పించే ఉద్యోగాలు, పెట్టుబడుల ద్వారా స్థానికులకు కలిగే ప్రయోజనాల గురించి మంత్రికి విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ సంస్థ చైనా, వియత్నాం, కంబోడియా తదితర దేశాల్లో 46 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, తమ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసర మైన అనుమతులు, కంపెనీ ఏర్పాటుకు భూకేటా యింపులు, రాయితీల గురించి మంత్రితో డూసన్ ప్రతినిధులు చర్చించారు. వేల మందికి ఉపాధి కల్పిస్తాం: డూసన్ ప్రతినిధి తమ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేసే కాస్మొటిక్ హబ్ ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 3 వేల మందికి... పరోక్షంగా మరో 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని డూసన్ ప్రతినిధి మూన్ కీ జూ తెలిపారు. ఒరిజనల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం), ఒరిజనల్ డిజైన్ మాన్యుఫాక్చరర్స్ (ఓడీఎం) పద్ధతిలో తమ సంస్థ కార్యకలాపాలు ఉంటాయన్నారు. సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలను ఉత్పత్తి చేసే రైతుల నుంచే కొనుగోళ్లు చేస్తామని... తద్వారా స్థానిక రైతులు, ఉత్పత్తిదారులకు మరింత ఉపాధి పెరుగుతుందని మంత్రికి వివరించారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను స్థానికంగా వ్యాపారం చేయడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తామని తెలియజేశారు. అనుమతుల మంజూరుకు మంత్రిహామీ దేశంలోకెల్లా తెలంగాణ సులభతర వాణిజ్యంలో మొదటిస్థానంలో ఉందని, పరిశ్రమలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వారికి తెలియజేశారు. దిగ్గజ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయని, హైదరాబాద్ పారిశ్రామిక వాతావరణం, పారిశ్రామిక విధానం ఇతర దేశాలు, వ్యాపార సంస్థలకు స్వర్గధామంగా ఉందని డూసన్ ప్రతినిధులకు వివరించారు. సీఎం రేవంత్రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ ఏర్పాటు చేయడానికి కావల్సిన అనుమ తులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. -
Kim Jong Un: ద.కొరియా మన శత్రువు
సియోల్: గతంలో ఉత్తరకొరియా నేతలు దక్షిణకొరియా, ఉత్తరకొరియాలను కలిపేందుకు పునరేకీకరణ పనుల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వసంస్థలను శాశ్వతంగా మూసేయాలని ఉ.కొరియా నియంత కిమ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉ.కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగం వివరాలను అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘‘ అమెరికా, జపాన్ల అండతో కయ్యానికి కాలు దువ్వుతున్న దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే మాటే లేదిక. దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే భావనను రాజ్యాంగం నుంచి తొలగించండి. పునరేకీకరణ, సయోధ్యను ప్రోత్సహిస్తూ అందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను మూసేయండి. దక్షిణకొరియాను శత్రుదేశంగా ప్రకటించండి. యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు. తప్పని పరిస్థితి ఎదురైతే యుద్ధానికి దిగుతాం’’ అని పార్లమెంట్సభ్యులకు కిమ్ ఆదేశాలిచ్చారు. రైల్వే బంధం తెంపేద్దాం, స్మారకం కూల్చేద్దాం కిమ్ ఆదేశాల మేరకు కమిటీ ఫర్ ది పీస్ఫుల్ రీయూనిఫికేషన్, నేషనల్ ఎకనమిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మిని్రస్టేషన్ సంస్థలను మూసేయనున్నారు. ‘‘ ద.కొరియా, అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు, అమెరికా వ్యూహాత్మక సైనిక బలగాల మొహరింపు, ద.కొరియా, అమెరికా, జపాన్ల త్రిముఖ భద్రతా సహకారం.. కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధం అంచుకు నెట్టుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ద.కొరియాతో స్నేహం, సహకారం అసంభవం. ద.కొరియా, ఉ.కొరియాల మధ్య ఉన్న రైల్వే రైళ్లను మూసేయండి. ప్యాంగ్యాంగ్లోని పునరేకీకరణ స్మారకాన్ని కూల్చేయండి’’ అని కిమ్ ఆదేశాలిచ్చారు. ‘ ద్వీపకల్పంలో అణు యుద్ధం మొదలైతే ద.కొరియాను ఈ భూపటంపై లేకుండా చేస్తాం. అమెరికా కనీవినీ ఎరుగని అపార నష్టాన్ని చవిచూస్తుంది’ అని కిమ్ హెచ్చరించారు. దీనిపై ద.కొరియా స్పందించింది. ‘‘ అతను జాతి వ్యతిరేకి. చరిత్రను ఒప్పుకోని మనిíÙ. కవి్వంపు చర్యలకు దిగితే అంతకు మించి సైనిక చర్యలతో మట్టికరిపిస్తాం’’అని ద.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం కేబినెట్ భేటీలో అన్నారు. -
సౌత్ కొరియా ఆక్రమణే లక్ష్యం: కిమ్
ప్యాంగ్యాంగ్ : కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల వల్లే కిమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ‘దక్షిణ కొరియాతో కలవడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు. మనం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. యుద్ధం వస్తే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోలేం. మన రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంది. దక్షిణ కొరియా మన ప్రధాన శత్రువని రాబోయే తరాలకు తెలియజేయాలి. దక్షిణ కొరియాను ఆక్రమించుకునేందుకు మనం ప్రణాళిక రచించాలి. రెండు దేశాల మధ్య ఇక ఎలాంటి సమాచార పంపిణీ ఉండకూడదు. ప్యాంగ్యాంగ్లో ఉన్న కొరియా పునరేకీకరణ ఐకాన్ను ధ్వంసం చేయండి. కొరియా దేశాల పునరేకీకరణ కోసం పని చేస్తున్న సంస్థను మూసేయండి. ఇరు దేశాల మధ్య పర్యాటకాన్ని వెంటనే ఆపండి’ అని నార్త్ కొరియా పార్లమెంట్లో కిమ్ ప్రసంగించారు. ఇదీచదవండి.. నౌకలపై దాడులతో ఇంధన సరఫరాపై ప్రభావం -
అంతర్జాతీయ బ్యాంకులకు షాకిచ్చిన దక్షిణ కొరియా
రెండు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులకు దక్షిణ కొరియా ఆర్థిక నియంత్రణ సంస్థ షాకిచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో భాగంగా ఆ రెండు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులపై భారీ జరిమానా విధించే ప్రణాళికను ఆదివారం ప్రకటించింది. ఈ రెండు బ్యాంకులు అక్రమమైన నేక్డ్ షార్ట్ సెల్లింగ్ (సరైన రుణాలు తీసుకోకుండానే షేర్లను విక్రయించడం) లావాదేవీలకు పాల్పడ్డాయని దక్షిణ కొరియా ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ (FSC) పేర్కొంది. అయితే ఈ బ్యాంకులు ఏవి అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ వెల్లడించలేదు. తమ దేశ స్టాక్ మార్కెట్ నుంచి అక్రమ షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలను నిర్మూలించడానికి ప్రపంచ పెట్టుబడి సంస్థల పరిశీలనను ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ విస్తృతం చేస్తోంది. అక్రమ షార్ట్ సెల్లింగ్ పపద్ధతులను అరికట్టడానికి దక్షిణ కొరియా గతేడాది నవంబర్ నుంచి 2024 జూన్ చివరి వరకు షార్ట్-సెల్లింగ్పై పూర్తి నిషేధాన్ని విధించింది. ఇందులో భాగంగా అక్రమ షార్ట్ సెల్లింగ్ లావాదేవీలకు పాల్పడిన రెండు అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకులు, ఒక స్థానిక బ్రోకరేజ్ సంస్థకు 26.5 బిలియన్ వోన్లు ( సుమారు రూ. 167 కోట్లు) జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. -
North korea: సౌత్ కొరియాకు కిమ్ మళ్లీ వార్నింగ్
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్జాంగ్ఉన్ మరోసారి దక్షిణ కొరియాపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడమే తమకు ముఖ్యమని, అయితే తమ పై ఆ దేశం మిలిటరీ చర్యలకు దిగితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. తమ వద్ద ఉన్న మొత్తం సామర్థ్యం మొత్తం వినియోగించైనా సరే దక్షిణ కొరియాను లేకుండా చేస్తామని కిమ్ అన్నట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. పరోక్షంగా అణుబాంబులు వేయడానికి కూడా వెనుకాడబోమని కిమ్ వ్యాఖ్యలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత వారంలో దక్షిణ కొరియాకు సరిహద్దులో ఉన్న సముద్రంలోని ఓ ఐలాండ్లో ఉత్తర కొరియా 200 రౌండ్ల ఆర్టిలరీ బాంబులు వేసింది. దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా అక్కడ ఉంటున్న కొంత మంది ప్రజలను ఖాళీ చేయించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు కిమ్ ఈ ఏడాది జరగనున్న సౌత్కొరియా, అమెరికా సార్వత్రిక ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. రెండు దేశాల్లో తనకు అనుకూలమైన వారు ఎన్నికవుతారని ఆయన ఆశిస్తున్నట్లున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు దక్షిణ కొరియాలో లిబరల్స్ అమెరికాలో తిరిగి ట్రంప్ అధికారంలోకి వస్తారని, వీరు గనుక ఎన్నికైతే తమకు కొంత వరకు మేలు జరుగుతుందని కిమ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..వామ్మో 2023 -
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు
సియోల్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ కొరియా దేశాలు పరస్పరం కవ్వింపు చర్యలకు దిగాయి. వివాదాస్పద సముద్ర సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం ఇరు దేశాల సైన్యాలు సముద్రంలోకి పెద్ద సంఖ్యలో ఆరి్టలరీ షెల్స్ను ప్రయోగించాయి. 2018లో కుదిరిన ఇంటర్–కొరియన్ మిలటరీ ఒప్పందాన్ని ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఉల్లంఘించాయి. తమ పశి్చమ సరిహద్దు వద్ద ఉత్తర కొరియా దాదాపు 200 ఆరి్టలరీ షెల్స్ ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు వెల్లడించారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. గత ఏడాది కాలంలో కిమ్ జోంగ్ ఉన్ సైన్యం ఈ స్థాయిలో ఫైరింగ్కు పాల్పడడం ఇదే మొదటిసారి. ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా సైన్యం సైతం ధీటుగా బదులిచి్చంది. ఆరి్టలరీ షెల్స్ ప్రయోగించింది. తాజా ఘటనతో రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఆయుధ పరీక్షలను ఉత్తర కొరియా మరింత ఉధృతం చేసే అవకాశం ఉందంటున్నారు. కొరియా ద్వీపకల్ప పశి్చమ తీరంలో సముద్ర సరిహద్దును పూర్తిగా నిర్ధారించలేదు. ఇక్కడ ఘర్షణలు జరగడం పరిపాటిగా మారింది. 1999, 2002, 2009, 2010లో రెండు దేశాల నడుమ కాల్పులు చోటుచేసుకున్నాయి. -
North Korea: కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత
సియోల్: దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య ఉన్న వివాదాస్పద సముద్ర సరిహద్దుపై శుక్రవారం ఉదయం ఉత్తర కొరియా బాంబ్ షెల్స్ వర్షం కురిపించింది. 200 ఆర్టిలరీ రౌండ్ల షెల్స్ వేసింది. దీంతో అక్కడే ఉన్న దక్షిణ కొరియాకు చెందిన రెండు ఐలాండ్లలోని ప్రజలను స్థానిక యంత్రాంగం తరలిస్తోంది. దక్షిణ కొరియా మిలిటరీ అధికారుల విజ్ఞప్తి మేరకే ఐలాండ్ ప్రజలను తరలిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఐలాండ్లలోని ప్రజల తరలింపు ఉత్తర కొరియా బాంబు దాడుల వల్లనా లేదంటే దక్షిణ కొరియా చేపట్టిన మిలిటరీ డ్రిల్ వల్లా అనేదానిపై దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇవ్వలేదు. ‘దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ఉన్న వివాదస్పద సముద్ర సరిహద్దు లైన్పై ఉత్తర కొరియా శుక్రవారం ఉదయం 200 ఆర్టిలరీ షెల్స్ ప్రయోగించింది. ఈ షెల్స్ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదు. ఉత్తర కొరియా కావాలని రెచ్చగొడుతోంది. ఇది 2018 మిలిటరీ ఒప్పందం ఉల్లంఘనే. ఉత్తర కొరియా షెల్లింగ్పై సరైన రీతిలో స్పందిస్తాం’అని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. ఇదీచదవండి..ఆదిత్య ఎల్1.. రేపు కీలక పరిణామం -
దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై దాడి
దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత దాడి లీ జే మ్యుంగ్ జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన బూసన్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్ పోర్టు సైట్ను సందర్శించారు. అనంతరం లీ జే మ్యుంగ్ మీడియాతో మాట్లాడున్న సమయంలో పెద్ద సంఖ్యయలో యువకులు చుట్టూ చేరారు. ఒక్కసారిగా ఓ యువకుడు లీ జే మ్యుంగ్పై దాడి చేశాడు. కత్తి వంటి ఓ ఆయుధంతో ఆయన మెడపై బలంగా పొడిచాడు. దీంతో లీ జో కుప్పకూలిపోయాడు. వెంటనే స్పదించిన భద్రత అతన్ని అక్కడి నుంచి లాక్కువెళ్లి అరెస్ట్ చేశారు. లీ జే మ్యుంగ్ను స్థానికఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందాల్సి ఉంది. Footage showing the Stabbing Attack earlier against the Leader of the Democratic Party of South Korea, Lee Jae-myung while he was Speaking to a Crowd in the Southeastern City of Busan. pic.twitter.com/uEAabsxzmX — OSINTdefender (@sentdefender) January 2, 2024 దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రతిపక్ష నేత లీ జే పై జరిగిన దాడి ఘటనను దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిటం సరికాదని అన్నారు. అయితే 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీ యూన్ సుక్ యోల్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ దాడులు -
మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్
సియోల్(దక్షిణ కొరియా): కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణాకొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తరకొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తామూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో అదనంగా మూడు నిఘా ఉపగ్రహాల ప్రయోగాలు చేపడతామని ప్రకటించారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ తయారు చేస్తామన్నారు. ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్ఏ వార్తాసంస్థ ఈ మేరకు వెల్లడించింది. ట్రంప్ హయాంలో అమెరికాతో చర్చలు విఫలమయ్యాక అగ్రరాజ్యం నుంచి ఆక్రమణ, దాడి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కిమ్ ఆయుధ సంపత్తి విస్తరణకు తెర తీశారు. ‘‘అమెరికా, దక్షిణకొరియా కవి్వంపు చర్యలు కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. వాటి మెరుపుదాడులను తట్టుకుని నిలబడాలంటే మా సాయుధ, శక్తి సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడం అత్యవసరం’’ అన్నారు. -
భారత్– దక్షిణ కొరియా బంధం బలీయం: మోదీ
న్యూఢిల్లీ: భారత్, దక్షిణకొరియాల సంబంధం పరస్పర గౌరవం, ఉమ్మడి విలువల ఆధారంగా మరింత బలపడుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘భారత్, దక్షిణ కొరియాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి నేటితో 50 ఏళ్లు పూరయ్యాయి. ఇది పరస్పర గౌరవం, ఉమ్మడి విలువలు, పెరుగుతున్న భాగస్వామ్యాలు కలగలిసిన ప్రయాణం’అని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు ఆయనతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఏర్పడిన సంబంధాలకు 50 ఏళ్లయిన సందర్భంగా ఆయన ఆదివారం ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
800 ఏళ్ల నాటి చెట్టు! చూస్తే బంగారంలా..!
ఇంతవరకు ఎన్నో పురాతనమైన చెట్ల గురించి విన్నాం. మహా అయితే రెండొందలు లేదా నూటయాభై ఏళ్లు అంతే. కానీ ఏకంగా 800 ఏళ్ల నాటి చెట్ల గురించి విని ఉండం. పైగా అన్నేళ్ల పాటు సజీవంగా చెట్లు ఉన్న దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడూ ఈ చెట్టు అందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందేమో!. ప్రస్తుతం ఈ చెట్టు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ చెట్టు ఎక్కడ ఉంది? ఏంటా విశేషాలంటే.. ఆ పురాతనమైన చెట్టు దక్షిణ కొరియాలో ఉంది. పరిశోధకులు దీన్ని 800 ఏళ్ల నాటి వృక్షంగా చెబుతారు. ఇది దక్షిణ కొరియా జాతీయ స్మారకంగా చిహ్నంగా పిలుస్తారు. అంతేగాదు అత్యధికంగా పర్యాటకులు సందర్శించే చెట్టుగా కూడా చెబుతుంటారు. ఈ చెట్టు సుమారు 17 మీటరల చుట్టుకొలతను కలిగి విశాలమైన కొమ్మలతో పరుచుకుని ఉంది. ఈ చెట్టు బంగారు రంగులో మెరుస్తూ ఓ దేవతా వృక్షం మాదిరిగా కనిపిస్తుంది. అందువల్ల నెటిజన్లు ఈ చెట్టుకి "ప్రపంచంలోనే అత్యంత అందమైన చెట్టు"గా కితాబిచ్చారు. ఇది క్రీస్తూ పూర్వం సిల్లా రాజవంశ కాలంలోనే మొలకెత్తిందని చరిత్రకారులు చెబుతున్నారు. మరికొంతమంది పురాణాల ప్రకారం సిల్లా చివరి రాజు సన్యాసిగా మారేందుకు కుమ్గాంగ్ పర్వాతానికి వెళ్తుండగా.. తన గుర్తుగా ఈ చెట్టుని నాటాడని కథలుకథలుగా చెబుతుంటారు అక్కడి ప్రజలు. ఐతే అందుకు సరైనా ఆధారాలు లేవు. కానీ పరిశోధకులు ఈ చెట్టు వయసుని వెయ్యి ఏళ్ల క్రితం నాటిదిగా పేర్కొన్నారు. ఈ చెట్టును జోసోన్ రాజవంశ కాలంలోనే అప్పటి ప్రభుత్వం దీన్ని గుర్తించి సమున్నత స్థానం కల్పించిందని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు. ఈ చెట్టుని జింకో చెట్టుగా పిలుస్తారు దక్షిణ కొరియా వాసులు. శాస్త్రవేత్తలకు ఈ చెట్టు పెరుగుదల అంతు చిక్కని మిస్టరీలా ఉంది. దీనిపై ఇప్పటికీ పలు పరిశోధలనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనలో..జింకో అనేది తూర్పు ఆసియాకు చెందిన జిమ్నోస్పెర్మ్ చెట్టు జాతి చెందినదిగా గుర్తించారు. పైగా ఇది 290 మిలియన్ సంవత్సరాల క్రితం మొదటిసారిగా కనిపించిన చివరి జీవజాతి అని చెప్పుకొచ్చారు పరిశోధకులు. This ginkgo tree, in the village of Bangye-ri in South Korea, is thought to be at least 800 years old pic.twitter.com/0NxlFQ0USd — Science girl (@gunsnrosesgirl3) December 4, 2023 (చదవండి: ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా? డైనోసర్ని చూసొండొచ్చా?) -
యువ భారత్ శుభారంభం
కౌలాలంపూర్: జూనియర్ పురుషుల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పూల్ ‘సి’ తొలి మ్యాచ్లో టీమిండియా 4–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. భారత్ తరఫున అరైజీత్ సింగ్ హుండల్ మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ సాధించాడు. అరైజీత్ 11వ, 16వ, 41వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. మరో గోల్ను అమన్దీప్ (30వ ని.లో) సాధించాడు. కొరియా తరఫున డోహున్ లిమ్ (38వ ని.లో), మిన్క్వాన్ కిమ్ (45వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. రేపు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో స్పెయిన్తో భారత్ ఆడుతుంది. మంగళవారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్ల్లో ఫ్రాన్స్ 3–1తో ఈజిప్ట్పై, జర్మనీ 5–3తో దక్షిణాఫ్రికాపై, స్పెయిన్ 7–0తో కెనడాపై, అర్జెంటీనా 1–0తో ఆ్రస్టేలియాపై, మలేసియా 7–1తో చిలీపై గెలుపొందాయి. -
చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది!
ఆమె పేరు జుంగ్ యూ జుంగ్. వయసు 23 ఏళ్లు. ఉండేది దక్షిణ కొరియాలోని బుసాన్లో. నేరాలు, ఘోరాలంటే మహా పిచ్చి. ఎంతగా అంటే, టీవీల్లో రియల్ క్రైమ్ స్టోరీలను విపరీతంగా చూసేది. క్రైం నవలలు కూడా తెగ చదివేది. వాటి స్ఫూర్తితో, హత్య చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నిజంగానే ఘోరానికి తెగబడింది. హత్య ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో నెలల పాటు సెర్చ్ చేసి మరీ రంగంలోకి దిగింది. ముక్కూ మొహం తెలియని ఓ అమాయక టీచర్ను విచక్షణారహితంగా పదేపదే పొడిచి పొట్టన పెట్టుకుంది! చివరికి శవా న్ని మాయం చేసే క్రమంలో అద్దెకు తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఉప్పందించడంతో కటకటాల పాలైంది! నేరాల సంఖ్య తక్కువగా ఉండే దక్షిణ కొరియా లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది... విద్యార్థి తల్లిగా నమ్మించి... జుంగ్ ఓ నిరుద్యోగి. తాతతో కలిసి నివసించేది. చేసేందుకు పనేమీ లేకపోవడంతో క్రైం ప్రోగ్రాంలు, సంబంధిత రియాల్టీ షోలకు, క్రైం నవలలకు బానిసగా మారింది. హత్యానుభవం ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నాక సంబంధిత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెదికింది. అనంతరం తగిన వ్యక్తి కోసం ట్యూటరింగ్ యాప్ల్లో నెలల పాటు వేట సాగించింది. హోం ట్యూషన్లు చెబుతారా అంటూ కనీసం 50 మందిని సంప్రదించింది. చివరికి గత మే నెలలో ఒక 26 ఏళ్ల మహిళను ఎంచుకుంది. తనను తాను ఓ హైస్కూలు స్టూడెంట్ తల్లిగా పరిచయం చేసుకుంది. తన బిడ్డకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలంటూ నమ్మించింది. అందుకామె సమ్మతించాక ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్కూల్ యూనిఫాం కూడా తెప్పించుకుంది! అది వేసుకుని ట్యూటర్ ఇంటికి వెళ్లింది. ఆమె తలుపు తీసి లోనికి రానివ్వడమే ఆలస్యం, వెంట తీసుకెళ్లిన కత్తితో పదేపదే దాడికి దిగింది. ఏకంగా 100 సార్లకు పైగా పొడిచింది! చనిపోయిన తర్వాత కూడా దాడి ఆపలేదట! ఆ తర్వాత తాపీగా మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. వాటిని సూట్కేస్లో కుక్కి, ఓ ట్యాక్సీలో తీసుకెళ్లి దూరంలో నది దగ్గర పడేసి చేతులు దులుపుకుంది. రక్తమోడుతున్న సూట్కేసును ఓ అమ్మాయి అడవిలో పడేసిందంటూ ట్యాక్సీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జుంగ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కూరగాయల బాక్స్ అనుకొని వ్యక్తి ప్రాణం తీసిన రోబో..
వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి కారణంగా ఎంత మేలు జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతోంది. సాంకేతిక విస్తరణలో భాగంగా ఇటీవల కాలంలో రోబోల వినియోగం బాగా పెరిగింది. మనిషులు చేసే చాలా పనులను రోబోలు చిటికెలో చేసేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు సాంకేతికతను మనం మంచి పనుల కోసం ఉపయోగించినా.. కొన్నిసార్లు చెడుగా మారుతుంది. టెక్నాలజీలో లోపాలుంటే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పే ఘటన దక్షిణ కొరియాలో బుధవారం వెలుగుచూసింది. మనిషిని, కూరగాయల డబ్బాను వేరు చేసి గుర్తించడంలో విఫలమైన రోబో వ్యక్తి మరణానికి కారణమైంది. వివరాలు.. దక్షిణ జియోంగ్సాంగ్ ప్రావిన్స్లోని వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ పరిశ్రమంలో రోబోటిక్ మిషిన్లను వినియోగిస్తున్నారు. అవి కూరగాయాలతో నింపిన డబ్బాలను గుర్తించి కన్వేయర్ బెల్ట్పై ఎక్కిస్తాయి. ఈ క్రమంలో ఓ రోబో దాని పక్కనే ఉన్న ఓ వ్యక్తిని కూరగాయాల డబ్బాగా భావించి.. అతన్ని ఎత్తి కన్వేయర్ బెల్ట్పై పడేసింది. రోబో వ్యక్తిని గట్టిగా పట్టుకోవడంతో అతని ఛాతీ భాగం, ముఖం ఛిద్రమయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అయితే బాక్సులను గుర్తించాల్సిన రోబోలో సాంకేతిక లోపం తల్లెత్తడం కారణంగానే అది మనిషిని, కూరగాయలతో ప్యాక్ చేసిన పెట్టెతో పోల్చుకోవడంలో విఫలమైందని సదరు కంపెనీ తెలిపింది. ఇదే ప్రమాదానికి దారితీసిందని పేర్కొంది. మూడు రోజుల క్రితం రోబో సెన్సర్లో లోపం ఉందని గుర్తించగా.. దాన్ని బాగు చేయడానికి తయారీ కంపెనీకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని.. పైగా మరమ్మతు నిర్వహిస్తున్న వ్యక్తినే అది పొరబడిందని పేర్కొంది. ఇక దక్షిణ కొరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. మార్చిలో ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలో పనిచేస్తున్న 50 ఏళ్ల వ్యక్తి రోబో చేతిలో నలిగి తీవ్ర గాయాలతో మరణించాడు. చదవండి: కంపెనీ సీఈవోకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్ -
ఫైనల్లో భారత మహిళలు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ
రాంచీ: మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీస్లో భారత్ 2–0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. భారత్ తరఫున సలీమా టెటె 11వ నిమిషంలో ఫీల్డ్ గోల్ సాధించగా...19వ నిమిషంలో పెనాల్టీ ద్వారా వైష్ణవి విఠల్ ఫాల్కే గోల్ నమోదు చేసింది. ఆసియా క్రీడల రజతపతక విజేత కొరియా తీవ్రంగా పోరాడినా ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. మరో సెమీస్లో జపాన్ 2–1తో చైనాను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో చైనాతో భారత్ తలపడుతుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement