కోర్టుకెళ్తా.. ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌ | Sakshi
Sakshi News home page

కోర్టుకెళ్తా.. ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌

Published Tue, Apr 2 2024 1:59 PM

KTR Slams Phone Tapping Allegations

సాక్షి, హైదరాబాద్‌:      రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌గా స్పందించారు. ఆ ఆరోపణలకు ఖండించిన ఆయన.. లీగల్‌ యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. 

‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే.. లీగల్‌గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే..   వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

 

 


 

Advertisement
Advertisement