-
Maithri Rao: తెలుగు నేల మీద తుళు అడుగులు
మహిళలు చదువుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. మహిళలు అభిరుచిని కెరీర్గా మలుచుకోగలుగుతున్నారు. మహిళలు సాధికారత లక్ష్యంలో విజేతలవుతున్నారు. ‘సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నాట్యమే నా మాధ్యమం’ అంటున్నారు మైత్రి రావు. భరతనాట్యం ద్వారా ప్రదర్శించగలిగేది పౌరాణిక ఐతిహాసిక కథనాలనే కాదు, సామాజిక అంశాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కూడా ఇది దీటైన మాధ్యమం అన్నారామె. సమాజం పెట్టే పరీక్షలను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే ప్రతి మహిళా ఒక శక్తిస్వరూపిణే అన్నారామె. అందుకే ప్రతి భావాన్నీ లోతుగా వ్యక్తీకరించే ఈ మాధ్యమం ద్వారా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చెబుతూ, నాట్యాన్నే కెరీర్గా మలుచుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు స్త్రీ శక్తి పురస్కార గ్రహీత మైత్రిరావు. ‘‘మహారాష్ట్రలోని మాలేగావ్లో పుట్టాను. మా మూలం దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల. నేను పెరిగింది, చదువుకున్నది మైసూర్లో. ఇప్పటికీ ఇంట్లో తుళు భాష మాట్లాడతాం. మైసూర్లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. డాన్, యోగాలను పూర్తి స్థాయి కెరీర్గా మార్చుకోవడానికి ముందు నోకియా కంపెనీలో రెండేళ్లపాటు డెవలపర్గా బెంగళూరులో ఉద్యోగం చేశాను. డాన్ మీద ఆసక్తి నాలుగేళ్ల వయసులోనే బయటపడింది. నా ఆసక్తిని గమనించి మా అమ్మానాన్న నాకు ఎనిమిదవ ఏట నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. 2010లో అరంగేట్రం జరిగింది. నాట్యంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ప్రతి చిన్న పెద్ద క్లిష్టమైన కీలకమైన సున్నితమైన లోతైన భావాలన్నింటినీ చాలా స్పష్టంగా, సునిశితంగా వ్యక్తీకరించగలిగిన మాధ్యమం ఇది. సాధన ద్వారా సాధించిన ఈ నైపుణ్యాన్ని దూరం చేసుకోవడానికి కళాకారులెవ్వరూ ఇష్టపడరు. అందుకే ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే కళాసాధన ద్వారా వచ్చే సంతృప్తికి సమానం కాదు, కాలేదు. మయూరి, మాధురి ఉపాధ్యాయ ఇద్దరూ నాకు ఇష్టమైన నాట్యకారిణులు, స్ఫూర్తిప్రదాతలు కూడా. మా డాన్ టీచర్లు, సీనియర్ స్టూడెంట్స్ నుంచి కూడా స్ఫూర్తి పొందాను. ఒక్కొక్కరిలో ఒక్కో అంశం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకోవాలన్నంత ఆసక్తిగా గమనిస్తే ప్రతి వ్యక్తిలోనూ గురువు కనిపిస్తారు. భరతనాట్యంతోపాటు కలరియపట్టు, అట్టక్కలరి, వ్యాలికవల్ రీతులను కూడా సాధన చేశాను. నాట్యాన్ని విస్తరింపచేయడమే నా బాధ్యత అనుకున్నాను. బెంగళూరులో శివాన్ష్ స్కూల్ ఆఫ్ డాన్ 2017లో స్థాపించాను. ఆ తర్వాత శివాన్ష్ శాఖలను హైదరాబాద్లోని సన్ సిటీ, కిస్మత్పూర్, కొండాపూర్, బంజారా హిల్స్లకు విస్తరించాను. శాస్త్రీయ నాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు అరుదైన ఇతివృత్తాలతో రూపకల్పన చేశాను. కళలనే కెరీర్గా తీసుకున్న మహిళలే నాతోపాటు మా ‘టీమ్ శివాన్ష్’లో ఉన్నారు. సాధించాం... ఇంకా ఉంది నాట్యం నాకు చాలా ఇచ్చింది. టీవీ రియాలిటీ షోలలో విజేత కావడం ఒక సరదా. అయితే మైసూర్ లిటరరీ అండ్ కల్చర్ ఫౌండేషన్ నుంచి యువశ్రీ పురస్కారం, ఉత్కళ యువ సాంస్కృతిక సంఘ్ నుంచి నృత్యమణి, హైదరాబాద్ డాన్ ఫెస్టివల్ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో స్త్రీ శక్తి పురస్కారాలందుకోవడం గర్వకారణం. నాట్యం ఇతివృత్తంగా రెండు సినిమాలు చిత్రీకరించారు. వాటికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇక నా వంతుగా నాట్యం మాధ్యమంగా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. సమాజంలో మహిళలు తమకెదురైన సమస్యలను ఎదుర్కొంటూ శక్తిమంతులుగా మారుతున్నారు. మహిళ సాధికారత కోసం ఎన్ జీవోలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒక తరానికి మరో తరానికి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మహిళల స్థితి చాలా మెరుగైంది. మహిళల్లో అక్షరాస్యత పెరగడం తొలి విజయం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు కచ్చితంగా ఉంటున్నాయి, అలాగే శిక్షల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మహిళాభివృద్ధి పురోగమనంలో సాగుతోందనే నాకనిపిస్తోంది. అయితే ‘మనం సాధించేశాం’ అని సంతృప్తి చెందగలిగిన స్థితికి మాత్రం చేరలేదు. కానీ... సమానత్వ స్థాయిని మా తరంలోనే చూడగలమనే భరోసా కలుగుతోంది’’ అని మహిళాభివృద్ధి పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మైత్రి రావు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. స్టార్ కొరియోగ్రాఫర్ ఎంట్రీ!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇటీవలే ఈ మూవీ రెండో షెడ్యూల్ను న్యూజిలాండ్లో ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇండియాలోని ప్రముఖ స్టార్స్ భాగం కానున్నారు. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్లో ప్రభు దేవాకు కన్నప్ప టీం స్వాగతం పలికింది. ఇండియాలోనే స్టార్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా 'కన్నప్ప' సెట్స్లో జాయిన్ అయ్యారు. ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా రేంజ్ మరో లెవెల్కు వెళ్లింది. ప్రభు దేవా కొరియోగ్రఫీ ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం న్యూజిలాండ్, థాయ్లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లు షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్లోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. #Prabhudeva joins @iVishnuManchu on #Kannappa shoot in #NewZealand pic.twitter.com/StgCcLO3Os — FridayWall Films (@FridayWallMag) March 4, 2024 -
అలా సినిమాలు తీయడం సులభం కాదు
‘‘నేను దాదాపు 95మందికి పైగా దర్శకులతో పని చేశాను. చక్కని క్లారిటీతో సినిమాలు చేసే కొద్దిమంది దర్శకుల్లో విజయ్ ఒకరు అని నాకనిపించింది. ‘నా సామిరంగ’ మూవీని ఓ పాటలా అందంగా తీసి, కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. సినిమాకి ఎంత కావాలో సరిగ్గా అంతే తీశాడు. ఇలా తీయడం అంత సులభం కాదు’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ‘నా సామిరంగ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ – టీవీ డ్యాన్సర్స్ – డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లు కలిసి విజయ్ బిన్నీని సన్మానించాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు రావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి చిరునవ్వులు చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోయింది. విజయ్తో వండర్ఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు. మరో అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని కావాలనుకున్న తన కలను సక్సెస్ఫుల్గా నెరవేర్చుకున్నారు విజయ్. ఇక్కడున్న డ్యాన్స్ మాస్టర్స్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నాగార్జునగారు నన్ను దర్శకుడిగా ఎంచుకోవడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘విజయ్గారు డైరెక్టర్గా గొప్ప విజయాన్ని అందుకోవడం మా అందరికీ గర్వకారణం’’ అన్నారు శేఖర్ మాస్టర్. -
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ.. బిగ్బాస్ కంటెస్టెంట్ స్పెషల్ వీడియో!
ఎటు చూసినా జై శ్రీరామ్ పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆ అయోధ్య రాముని నామ జపం చేస్తోంది భారతావని. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఆ రాముని పట్ల తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్, బిగ్బాస్ కంటెస్టెంట్ తనదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. జై శ్రీరామ్ అంటూ తన భార్య జ్యోతిరాజ్ సందీప్తో కలిసి నృత్యం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు మీ కొరియోగ్రఫీ సూపర్గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు జై శ్రీరామ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
శేఖర్, సందీప్ మాస్టర్ సంపాదన ఎంతో తెలుసా? ఒక్క సంగీత్కు..
ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నవాళ్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. రాకేశ్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న ఇతడు తర్వాతి కాలంలో గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో పెద్ద హీరోలతో స్టెప్పులేయిస్తూ టాప్ కొరియోగ్రాఫర్గా రాణిస్తున్నాడు. రాకేశ్ మాస్టర్ దగ్గర శిష్యుడిగా చేరి డ్యాన్స్లో మెళకువలు నేర్చుకున్న మరో వ్యక్తి బషీర్ మాస్టర్. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ అందుకునే పారితోషికాన్ని బయటపెట్టాడు. బషీర్ మాస్టర్ నేను లక్ష తీసుకుంటా బషీర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'సంగీత్ వేడుకల కోసం నేను ఐదు రోజులపాటు కొరియోగ్రఫీ చేసి రూ.1 లక్ష తీసుకుంటాను. అదే అమెరికా వాళ్లకు ఆన్లైన్లో ఒక్క పాటకు డ్యాన్స్ నేర్పించినందుకుగానూ రూ.30 వేలు తీసుకుంటాను. నా పార్ట్టైమ్ సంపాదన ఇదే! ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లందరూ ఇలా సంగీత్ వేడుకలు చేసినవారే! సందీప్ కూడా.. శేఖర్ మాస్టర్ ఒక్క సంగీత్ కోసం రూ.40 లక్షలు తీసుకుంటాడు. జానీ మాస్టర్, సత్య మాస్టర్, సందీప్ అందరూ సంగీత్లలో చేసినవారే! మొన్నటివరకు సందీప్ కూడా రూ.2-3 లక్షలకు సంగీత్ చేశాడు. నాక్కూడా మంచి రేంజ్ వచ్చినప్పుడు రూ.50 లక్షలు తీసుకుంటాను. బిగ్బాస్ షోలో పాల్గొనడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఛాన్స్ వస్తే వెళ్తానేమో, అంతా ఆ దేవుడి చేతిలో ఉంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: డిసెంబర్లో నటుడి మరణం.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని ఫ్యామిలీ! -
కథ విన్నారా?
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు నవీన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఇటీవల నాగార్జునను కలిసి, ఓ కథ వినిపించారట నవీన్. స్క్రిప్ట్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్కు పూర్తిస్థాయిలో మెరుగులుదిద్దే పనిలో నవీన్ ఉన్నారనే ప్రచారం ఫిల్మ్నగర్లో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. నాగార్జున కెరీర్లో ఇది వందో చిత్రమట. మరోవైపు ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా చేస్తున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘నా సామిరంగ’ విడుదల కానుంది. -
'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!
సినిమా ఇండస్ట్రీలో వేధింపులు ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువగా ఈ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. తాజాగా షూటింగ్లో పాల్గొన్న ఓ హీరోయిన్కు అలాంటి సంఘటనే ఎదురైందిృ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సినిమా సెట్స్లో తనను లైంగిక వేధింపులకు గురిచేయడంతో వెంటనే షూటింగ్ నుంచి వచ్చేశానని తెలిపింది. (ఇది చదవండి: టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్!) కోల్కతాకు చెంది బెంగాలీ నటి, రాజకీయవేత్త అయిన సయంతిక బెనర్జీ ఇటీవలే బంగ్లాదేశ్లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. అయితే సెట్స్లో తనపట్ల కొరియోగ్రాఫర్ మైఖేల్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. షూటింగ్ సమయంలో నా అనుమతి లేకుండానే చేతులు పట్టుకున్నాడని తెలిపింది. అయితే ఈ విషయాన్ని నిర్మాతకు చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించింది. నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో షూట్ మధ్యలోనే ఆపేసి ఇండియాకు తిరిగొచ్చానని పేర్కొంది. (ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) అయితే ఈ ఘటనపై నిర్మాతలు ఇంకా స్పందించలేదు. బంగ్లాదేశ్ నుంచి తిరిగొచ్చిన సయంతిక తన రాబోయే చిత్రం 'చాయాబాజ్' షూటింగ్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె షూటింగ్లో జరిగిన సంఘటనను వివరించింది. కాగా.. ప్రస్తుతం తాజు కమ్రుల్ దర్శకత్వం వహిస్తోన్న 'ఛాయాబాజ్' చిత్రంలో జయేద్ ఖాన్ సరసన సయంతిక నటిస్తోంది. View this post on Instagram A post shared by Sayantika Banerjee (@iamsayantikabanerjee) -
ఆ కొరియోగ్రాఫర్ చేసిన పనికి గట్టిగా ఏడ్చాను: కృతి సనన్
కృతి సనన్..ఇప్పుడొక స్టార్ హీరోయిన్. అయితే ఆ స్టార్డమ్ వెనుక చాలా కష్టం ఉంది. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. మోడల్గా కెరీర్ని ఆరంభించి.. టాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. ఆమె తొలి సినిమా ‘వన్:నేనొక్కడినే’. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది కానీ.. కెరీర్ పరంగా మాత్రం కృతికి చాలా ఉపయోగపడింది. ఆ మూవీ తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడం..ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా మారింది. తాజాగా ఈ భామకు ‘మీమీ’ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు గాను జాతీయ అవార్డు లభించింది. అయితే తన కెరీర్ ప్రారంభంలో మాత్రం ఎన్నో ఇబ్బందులకు గురయ్యిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను మోడలింగ్ కోసం ముంబైకి వచ్చిన కొత్తలో జరిగిందది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల కోసం ట్రై చేస్తున్నాను. నా అదృష్టం కొద్ద ఒకేసారి రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిలో ఒకటి టాలీవుడ్ మూవీ వన్: నేనొక్కడినే, రెండోది ‘హీరోపంతీ’. ఈ రెండు సినిమాల షూటింగ్కి కొద్ది రోజుల ముందు నేను ఒక ర్యాంప్ షోలో పాల్గొనడానికి వెళ్లాను. పచ్చికలా ఉన్నర లాన్లో క్యాట్వాక్ చేస్తున్నాడు. నేను ధరించిన హీల్స్ గడ్డిలో కూరుకొని పోయాయి. దీంతో నేను కాస్త గందరగోళానికి గురైయ్యాను. మధ్యలోనే ఆగిపోయాడు. దీంతో ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ నాపై గట్టిగా అరిచింది. దాదాపు 50 మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టి అవమానించింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. పక్కకెళ్లి చాలాసేపు ఏడ్చాను. ఇప్పటివరకు మళ్లీ ఆమెతో కలిసి పని చేయలేదు’అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ ‘ఆదిపురుష్’సినిమాలో సీతగా నటించిన మెప్పించిన కృతి.. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్తో కలిసి గణపత్:పార్ట్వన్ 1 చిత్రంలో నటిస్తోంది. అలాగే ఓ ప్రొడక్షన్ హౌస్ని స్థాపించి, కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. (చదవండి: ఫ్యాన్స్కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్) -
నాగార్జున నెక్ట్స్ సినిమా ప్రకటన ఎప్పుడంటే..
‘ది ఘోస్ట్’ చిత్రం విడుదల తర్వాత నాగార్జున నెక్ట్స్ సినిమా గురించిన ప్రకటన రాని విషయం తెలిసిందే. అయితే ఆ సమయం ఆసన్నమైందని, ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా ప్రకటన అధికారికంగా వెల్లడి కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారని, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారని తెలిసింది. -
త్వరలో జైలర్ నటుడి పెళ్లి, తలైవా ఆశీర్వాదాలు కూడా..
మాస్ ఫైటింగ్స్.. హీరోయిన్తో డ్యూయెట్స్.. ఇవేవీ లేకుండా సినిమా తీయొచ్చు.. హిట్టు కొట్టనూవచ్చు అని నిరూపించాడు తలైవా. తను స్లోమోషన్లో నడుచుకుంటూ వస్తే చాలు రికార్డులు వాటంతటవే తన ముందు మోకరిల్లుతాయని జైలర్తో చెప్పకనే చెప్పాడు. ఇప్పటికీ జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంంగా దూసుకుపోతూనే ఉంది. ఈ చిత్రంలో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అందులో జాఫర్ సాదిఖ్ కూడా ఒకరు! ఈయన తమిళనాడులో ఫేమస్ కొరియోగ్రాఫర్. విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేసిన పావ కథైగల్ సిరీస్లో తొలిసారి నటించాడు. ఈ సిరీస్లోని ఓ ఎపిసోడ్లో మాత్రమే ఆయన నటించాడు. తర్వాత అతడు వేందు తనైంతాతు కాదు అనే చిత్రంలో నెగెటివ్ రోల్లో మెరిశాడు. కానీ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ పీస్ విక్రమ్ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బ్లాక్బస్టర్ హిట్ జైలర్లో నటించి మరిన్ని మార్కులు కొట్టేశాడు. జైలర్ సినిమాలో జాఫర్ రజనీకాంత్ను కత్తితో భయపెట్టాలని చూస్తాడు.. అందుకుకానీ శివరాజ్కుమార్.. అతడిని ఫ్యాన్కు కట్టేసి తిప్పుతాడు. ఈ సీన్ చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. ఇకపోతే త్వరలో ఇతడు పెళ్లిపీటలెక్కబోతున్నాడట. జాఫర్ కొంతకాలంగా తన కో డ్యాన్సర్ షెరిన్తో ప్రేమలో ఉన్నాడు. తనతో కలిసి అప్పుడప్పుడు రీల్స్ కూడా చేస్తుంటాడు. జైలర్ షూటింగ్ సమయంలో జాఫర్ తన ప్రియురాలిని రజనీకి పరిచయం చేశాడట. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ రజనీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారట. మరి తన పెళ్లి తేదీ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి! ఇకపోతే సైతాన్ వెబ్ సిరీస్లోనూ నటించిన జాఫర్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. చదవండి: క్రికెటర్తో కూతురి ప్రేమాయణం.. దగ్గరుండి పెళ్లి చేసిన ప్రముఖ నటుడు 400కు పైగా సినిమాలు, మోసం చేసిన కూతురు.. చితికి డబ్బుల్లేని దుస్థితి.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు! -
ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహమా? పుల్లయ్యలా ఉందంటూ విమర్శలు
రాకేశ్ మాస్టర్ తెలుగు హీరోలకు డ్యాన్స్ నేర్పించాడు, డ్యాన్స్లో స్టైల్ ఎలా ఉంటుందో పరిచయం చేశాడు. వెండితెరపై ఎన్నో హిట్ సాంగ్స్కు కొరియోగ్రఫీ చేశాడు. టాప్ కొరియోగ్రాఫర్గా వెలుగు వెలిగిన ఆయన తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన రాకేశ్ మాస్టర్ జూన్ 18న మరణించాడు. ఆయనకు గుర్తుగా విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. రాకేశ్ మాస్టర్కు అత్యంత సన్నిహితుడు, తన చివరి శ్వాస వరకు పక్కనే ఉండి అన్నీ చూసుకున్న ఆలేటి ఆటం ఈ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఓ డ్యాన్స్ షోలో వైష్ణవుడి వేషధారణలో బీభత్సమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు రాకేశ్ మాస్టర్. ఇది చాలామందికి ఇప్పటికీ గుర్తుండిపోయింది. అందుకే ఆ వైష్ణవుడి వేషధారణలోనే రాకేశ్ మాస్టర్ గెటప్ ఉండేలా విగ్రహాన్ని రెడీ చేయిస్తున్నారు. ఎవరి దగ్గరా సాయం కోసం చేతులు చాచకుండా సొంత డబ్బుతోనే దీన్ని రెడీ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రాకేశ్ మాస్టర్ శిష్యుడు, కొరియోగ్రాఫర్ బషీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రాకేశ్ మాస్టర్ విగ్రహం ఎలా ఉందో వీడియో రిలీజ్ చేశాడు. విగ్రహం ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండని కోరాడు. అయితే చాలామందికి ఈ విగ్రహం నచ్చినట్లు లేదు. ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహంలా లేదు, పుల్లయ్యగాడి విగ్రహంలా ఉంది, మీకు ఏ ఫోటో దొరకలేదా భయ్యా? అస్సలు మ్యాచ్ కాలేదు అని కామెంట్లతో తిట్టిపోస్తున్నారు. ఒకరైతే.. వీడు దేనికి పనికిరాని వెధవ అని కామెంట్ చేయగా బషీర్ అందుకు సేమ్ టు యూ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఈ విగ్రహం పూర్తిగా తయారవడానికి మరో నెల రోజులు పడుతుందని మరో వీడియోలో వెల్లడించాడు బషీర్. పూర్తిగా సిద్ధమైన తర్వాతైనా అందరికీ నచ్చుతుందో, లేదో చూడాలి! చదవండి: బతికుండగానే అంత్యక్రియలు, బ్యూటీ క్వీన్ కన్నుమూత -
రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత కూడా రాకేశ్ మాస్టర్ పేరుతో పలు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాకేష్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మిపై పలువురు దాడి చేశారు. హైదరాబాద్లోని పంజాగుట్ట ఏరియాలో ఆమెపై ఐదుగురు మహిళలు ఒక్కసారిగా వచ్చి దాడిచేశారు. తను స్కూటర్పై వెళ్తుండగా లల్లీ అనే యూట్యూబర్ మరో నలుగురి మహిళలతో వచ్చి దాడి చేయడం జరిగింది. ఆమెను నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్టు జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులకు స్ధానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై లక్ష్మిని స్టేషన్కు తరలించారు. దాడి చేసిన మహిళలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: నయనతార జంటపై కేసు నమోదు చేసిన విఘ్నేశ్ శివన్ బాబాయ్) కొంత సమయం తర్వాత లల్లీతో పాటు నలుగురు మహిళలు కూడా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. మొదట లక్ష్మినే తమను దూసించిందని వారు కూడా పలు ఆధారాలతో ఆమెపై కేసు పెట్టారు. ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారించి వారిని పంపించేశారు. లక్ష్మితో పాటు వారందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. ఇదే విషయంలో వీరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవపై లక్ష్మి ఏం చెప్పిందంటే.. తనను రెండు నెలలుగా చంపేస్తామని బెదిరిస్తున్నారని లక్ష్మి తెలిపింది. వీరందిరకి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి.. నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ ఇదంతా చేయించిందని ఆమె ఆరోపిస్తుంది. తనకు ఉన్న యూట్యూబ్ ఛానల్ను క్లోజ్ చేసుకోవాలని కొంతకాలంగా వీరందరూ బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చింది. దుర్గ, లల్లీ,పెరుగు పెద్దమ్మ, నెల్లూరుకు చెందిన భారతి తనపై దాడి చేశారని చెప్పింది. ఎందుకు కొట్టామంటే: లల్లీ లక్ష్మిపై దాడి చేసిన లల్లీ కూడా స్పందించింది. ఆమెతో ముందుగా తనకు ఎలాంటి గొడవలు లేవని, తన కూతురును ఉద్దేశిస్తూ పలుమార్లు యూట్యూబ్లో లక్ష్మి అసహ్యకరంగా మాట్లాడుతూ.. బూతులు తిట్టడం వల్లే ఆమెను క్టొటామని చెప్పింది. ఆమె మాట్లాడే మాటల వల్ల తన కూతురు మానసికంగా బాధపడుతుందని పేర్కొంది. అంతేకాకుండా లక్ష్మిని కొట్టినట్టు పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నానని చెప్పింది. (ఇదీ చదవండి: 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్కు పరిచయం చేయనున్న టాప్ హీరో) రాకేష్ మాస్టర్ వద్దకు సుమారు రెండేళ్ల క్రితం వంట చేసేందుకు వచ్చిన లక్ష్మిని తన భార్యగా పలు యూట్యూబ్ ఛానల్స్లలో పరిచయం చేసిన విషయం తెలిసిందే. అప్పటికే రాకేష్ మాస్టర్కు యూట్యూబ్ ఛానల్ ఉండేది. అయనకు భారీగానే ఫాలోవర్స్ కూడా ఉండేవారు. రాకేష్ మాస్టర్, లక్ష్మిల మధ్య గొడవలు రావడంతో ఆమె మరో ఇంటికి షిఫ్ట్ అయిపోయింది. ఆ సమయంలో రాకేష్ మాస్టర్కు చెందిన యూట్యూబ్ ఛానల్ను ఆమె లాక్కుందని, ఇప్పుడు దానిని ఆయన కుటుంబసభ్యులు తీసుకునేందకు ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగానే వీరందరూ కొట్టారని సమాచారం. -
రాకేశ్ మాస్టర్ కోసం ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమంది మాస్టర్లను తయారు చేసిన ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ఆయన మృతిపట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన పడిన కష్టాలను వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!) పరుచూరి మాట్లాడుతూ..' రాకేశ్ మాస్టర్తో ఎక్కువగా పనిచేయలేదు. ఆయన గురువైన ముక్కురాజుతో నేను ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశా. రాకేశ్ మాస్టర్ ఇక లేరంటూ టీవీలో చూడగానే షాకయ్యాను. తాజాగా వాళ్ల అబ్బాయి మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయండి అని చెప్పగానే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.' అంటూ విచారం వ్యక్తం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'రాకేశ్ మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో ఆయన అద్భుతాలు సృష్టించాడు. దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ , జానీ అనే ఇద్దరు అద్భుతమైన మాస్టర్లను తీర్చిదిద్దాడు. వాళ్లంతా వచ్చి ఆయన మృతదేహం దగ్గర కన్నీరు పెట్టుకుంటుంటే అందరికీ బాధేసింది. ఆయన ఆవేదనను ఎవరైనా పట్టించుకుని ఉంటే ఆయన జీవితం ఇంకో రకంగా ఉండేది. కానీ ఎవరూ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆయన జీవితానికి మంచి మార్గాన్నిచ్చే ప్రయత్నం చేయలేదు.' అని అన్నారు. అలా జరిగి ఉంటే.. పరుచూరి మాట్లాడుతూ.. 'టాలీవుడ్లో ప్రస్తుతమున్న అప్కమింగ్ హీరోలు, అప్ కమింగ్ దర్శకులో ఎవరో ఒకరు మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని నా అభిప్రాయం. ఆయన షో చూస్తే నాకు అనుక్షణం ఆవేదనే కనిపించేది. ఎంతలా ఆవేదన అనుభవించాడో. మిత్రులారా.. ఆయన జీవితాన్ని ఉదాహరణగా తీసుకోండి. మనకు భగవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడు. మన జీవితంలో జరిగే స్ట్రగుల్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆయన ఆత్మ పరమాత్మను చేరుకుని.. శివుడి కూడా ఆయన లయ, విన్యాసాలు చూడాలని ఆశిస్తున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో జూన్ 18న ఆదివారం ఆకస్మాత్తుగా మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమందికి సాయంగా నిలిచిన డ్యాన్స్ మాస్టర్ మృతిని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. (ఇది చదవండి: Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్) టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే. అలాంటి మాస్టర్కు తోటి కొరియోగ్రాఫర్స్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఇవాళ హైదరాబాద్లోని బోరబండలో అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ విషాద సమయంలో ఆయనతో పనిచేసిన కొరియోగ్రాఫర్స్, స్టూడెంట్స్ సగర్వంగా తుది వీడ్కోలు పలికారు. సత్య, బషీర్ మాస్టర్తో పాటు మరికొందరు కొరియోగ్రాఫర్లు డ్యాన్స్ చేస్తూ సాగనంపారు. రాకేశ్ మాస్టర్ అంత్యక్రియల్లో భారీగా అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం (జూన్ 18న) కన్నుమూశారు. రక్త విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే! ఎందుకో తెలియదు కానీ శేఖర్ మాస్టర్, రాకేశ్ మాస్టర్ల మధ్య దూరం పెరిగింది. గురుశిష్యుల బంధం చెదిరిపోయింది. శేఖర్ మాస్టర్ పేరెత్తితే చాలు నిప్పులు చెరిగేవారు రాకేశ్. అటు శేఖర్ మాత్రం.. ఆయన ఎప్పటికీ తన గురువే అని చెప్తూ ఉండేవారు. ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ తన గురువును చివరి చూపు చూసేందుకు వచ్చారు. దీనవదనంతో అక్కడికి చేరుకున్న శేఖర్ మాస్టర్ తన గురువును నిర్జీవంగా చూసి కంటతడి పెట్టుకున్నారు. జానీ మాస్టర్ సైతం రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం -
రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో సడన్ గా చనిపోయారు. ఒకప్పటి జనరేషన్ కు డ్యాన్స్ మాస్టర్ గా తెలిసిన ఆయన.. ఇప్పటి జనరేషన్ కి మాత్రం యూట్యూబ్ వీడియోలతో బాగా పరిచయం. పలు ఫన్నీ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో చాలామంది హ్యాపీనెస్ కు కారణమయ్యారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలాంటి టైంలోనూ వాళ్లు గుండె నిబ్బరం చేసుకుని ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తిరుపతికి చెందిన రాకేశ్ మాస్టర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆదివారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఈయన్ని చేర్చారు. అలా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో చనిపోయారు. అయితే తను చనిపోతానని కొన్నిరోజుల ముందే పసిగట్టిన రాకేశ్ మాస్టర్.. తన అవయవాల్లో పనికొచ్చే వాటిని దానం చేయాలని సూచించారట. ఈ విషయాన్ని ఆయన అసిస్టెంట్ సాజిద్ బయటపెట్టాడు. ఇదే విషయాన్ని డాక్టర్లకు చెప్పిన సాజిద్.. పోస్టుమార్టం చేసి, బాడీపార్ట్స్ తీసుకున్న తర్వాత తమకు అప్పజెప్పాలని, దహన సంస్కారాలు చేసుకుంటామని వాళ్లకు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఇక చూపులేని వారికి రాకేశ్ మాస్టర్ కళ్లని దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు సాజిద్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా తన అవయవాలని దానం చేయాలనే గొప్ప మనసు రాకేశ్ మాస్టర్ కు ఉందని తెలిసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్ మాస్టర్ లాస్ట్ వీడియో) -
Rakesh Master: రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తొలి సినిమా ఏదంటే?
తెలుగు చలన చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నృత్య దర్శకుడు ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్(53) ఆదివారం మృతిచెందారు. వారం క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం, భీమవరం వెళ్లి వచ్చిన ఆయన అప్పటినుంచి అనారోగ్యం పాలయ్యారు. ఆదివారం రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 10 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ వైపు అడుగులు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ప్రాంతంలో రాకేష్ మాస్టర్ జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. 10 ఏళ్ల వయస్సులో డిస్కో డాన్స్ చూసి డ్యాన్సర్గా మారాలనుకున్నారు. కానీ, ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరు నేర్పుతారు? అని తెలియక టీవీలో వచ్చే పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతి టౌన్కి వెళ్లి ఓ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. తొలిరోజుల్లో కేవలం రూ.5 ఫీజుతో డ్యాన్స్లో శిక్షణ ఇచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. ప్రభుదేవాపై సంచలన వ్యాఖ్యలు చాన్స్లు రాకపోవడంతో మళ్లీ తిరుపతికి వచ్చి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను నడిపారు. ఆ తర్వాత ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశారు రాకేష్ మాస్టర్. ‘ఆట’, ‘ఢీ’ లాంటి డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ను మొదలు పెట్టారాయన. ‘ఢీ’ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్గా వ్యవహరిస్తున్న సమయంలో ఆ షోకి ఓ జడ్జిగా వ్యవహరించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు ప్రభుదేవాతో ‘తెలుగు తెలిసిన వాళ్లే జడ్జిలుగా ఉండాలి’ అంటూ కామెంట్స్ చేసి, వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. చిరునవ్వుతో సినిమాతో మొదలైన ప్రయాణం వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ లో ‘నిన్నలా మొన్నలా లేదురా..’ పాటతో సినిమాల్లో కొరియోగ్రాఫర్గా తొలి అవకాశం అందుకున్నారాయన. ఆ తర్వాత ‘లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతారామరాజు, యువరాజు, గర్ల్ ఫ్రెండ్, బడ్జెట్ పద్మనాభం, మనసిచ్చాను, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు’ వంటి దాదాపు 1500 చిత్రాలకుపైగా కొరియోగ్రఫీ చేశారు రాకేష్ మాస్టర్. ‘గ్లోబల్ పీస్ యూనివర్సిటీ’ నుంచి డాక్టరేట్ను అందుకున్నారాయన. ప్రభాస్ వంటి పలువురు హీరోలకు డ్యాన్స్లో శిక్షణ ఇచ్చారు. కామెడీ షోలోనూ పార్టిసిపేట్ చేసిన రాకేశ్ టాలీవుడ్లోని పలువురు స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం తెలుగులో అగ్ర కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం విశేషం. ఓ టీవీ చానల్లో ప్రసారం అవుతున్న షోలో పలు స్కిట్లు చేసి, బుల్లితెర ప్రేక్షకుల్ని తనదైన శైలిలో నవ్వించారు రాకేష్ మాస్టర్. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. యూట్యూబ్ చానల్స్ వేదికగా పలువురు సెలబ్రిటీలపై వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చి ఇటీవల మళ్లీ ట్రెండ్ అయ్యారాయన. వివాదాలతో కుటుంబానికి దూరం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారి అభిమానుల నుంచి రాకేష్ మాస్టర్కి, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చేవి. ఈ కారణంగా ఆయన కుటుంబానికి దూరంగా అబ్దుల్లాపూర్మెట్లోని ఓ అనాథ ఆశ్రమంలో ఉంటూ వచ్చారు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు చరణ్తేజ్, కుమార్తె శ్రీజ ఉన్నారు. రాకేష్ మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. కాగా హైదరాబాద్లోని బోరబండలో నేడు రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తోనే.. ‘‘ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్ని గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. డయాబెటిక్ పేషెంట్ కావడం, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి సాయంత్రం 5గంటలకు మృతి చెందారు’’ అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మీడియాకు తెలిపారు. చదవండి: డబ్బులు తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలు.. రెడ్ నోటీసులిచ్చేందుకు చిత్రమండలి రెడీ -
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
-
Rakesh Master: రాకేశ్ మాస్టర్ మృతి.. వైద్యులు ఏమన్నారంటే?
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం(జూన్ 18న) సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే ఆయన మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ.. 'వాంతులు, విరోచనాలు అవుతున్నాయని రాకేశ్ మాస్టర్ను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. అడ్మిట్ అయిన గంటకే ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన్ను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మరణించారు' అని పేర్కొన్నారు. చదవండి: శేఖర్ మాస్టర్తో గొడవ.. కానీ ఎందుకో ఇప్పటికీ తెలియదు కాగా రాకేశ్ మాస్టర్ లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్గా పని చేశారు. దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత -
Rakesh Master: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్ మాస్టర్ వీడియో వైరల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతోమంది స్టార్ హీరోలతో పని చేసిన ఆయన రియల్ లైఫ్లో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఆయన కుటుంబానికి సైతం దూరంగా ఉన్నారు. ఆయన తన చావును ముందే పసిగట్టాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. 'నాకు మోకాళ్ల నొప్పులు.. నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. తెలుసు, నేను అస్తమించే సూర్యుడిని.. నాకన్నీ తెలుసు' అంటూ బాధతో మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు బాధగా ఉంది మాస్టర్, మీ మాటలు వింటుంటే ఏడుపొస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by CELLULOID PANDA (@celluloid_panda) చదవండి: ఒక్కమాటతో ఫేమస్ అయిన రాకేశ్ మాస్టర్ రక్త విరోచనాలు, కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి -
Rakesh Master: అనాథాశ్రమంలో జీవితం వెల్లదీసిన రాకేశ్ మాస్టర్, ఎందుకంటే?
టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్గా కీర్తి గడించిన రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆయన ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. గత కొంతకాలంగా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్న రాకేశ్ మాస్టర్ వేరు, అంతకుముందున్న మాస్టర్ వేరు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్.. ఇలా ఎంతో కీర్తి పొందిన ఆయన కొంతకాలం క్రితమే అబ్దుల్లాపూర్మెట్లోని అనాథాశ్రమంలో చేరారు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథగా చివరి రోజుల వరకు అదే ఆశ్రమంలో జీవించారు. మానసికంగా కుంగిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో అనాథాశ్రమానికి వెళ్లానని రాకేశ్ మాస్టరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 'నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. అదే నాకు సమస్యలు తెచ్చిపెట్టింది. మణికొండలో కారు పార్కింగ్ విషయంలో ఇంటి యజమానితో గొడవ జరిగింది. అక్కడెందుకు ఉండటమని నా భార్య దగ్గరకు వెళ్లిపోయా. అక్కడికి వెళ్లగానే గొడవ మొదలైంది. ఆమె.. మీరు రావొద్దండీ.. మీ వల్ల నా పిల్లలకు హాని అన్నారు. నా ఇంటర్వ్యూ వల్ల పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నా కొడుకు చరణ్ను కొట్టారు. చదవండి: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేశ్ మాస్టర్ అందుకే ఆమె అలా మాట్లాడింది. ఎక్కడికైనా వెళ్లిపోండి, ఆఖరికి నేను చచ్చిపోయినా రానని అనేసింది. తన మాటల్లోని బాధ నాకు అర్థమైంది. అందుకే కుటుంబానికి దూరమయ్యాను. అయితే ఓ మహిళ నాకు అన్ని పనుల్లో సాయంగా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నావెంటే వచ్చేది. కొంతమంది.. ఆమెను నా మూడో భార్య అని రాశారు. అందరి ముందు ఆమె పరువు పోతుందని, తనతో సహజీవనం చేస్తున్నానని చెప్పాను. ఎవరూ పట్టించుకోనప్పుడు తను నాకు సమయానికి తిండి పెట్టిందని నెత్తిన పెట్టుకున్నాను. కానీ ఆమె నా డబ్బులే దోచుకుంటూ నన్ను, నా కుటుంబాన్ని నిలువెల్లా ముంచింది. నా పరువుప్రతిష్టలు బజారునపడేసింది. నన్ను వశీకరణ చేయాలనుకుంది. తనవల్ల నా కుటుంబానికి మరింత దూరమై మనోవేదనకు గురయ్యాను. అందుకే అనాథాశ్రమంలో చేరాను' అని చెప్పుకొచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రక్త విరోచనాలు.. రాకేశ్ మాస్టర్ కన్నుమూత -
Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. రాకేష్ మాస్టర్ సినీ పరిశ్రమలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరు. 10 సంవత్సరాల వయస్సులో అతను డిస్కో డాన్సర్ని చూసి డ్యాన్సర్గా మారాలని అనుకున్నారు. కానీ డ్యాన్స్ ఎవరు నేర్పుతారు..? ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు. దీంతో అతనే టీవీలో వచ్చే వైవిధ్యమైన పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతికి వెళ్లి అక్కడ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. కేవలం రూ. 5 ఫీజుతో చాలా మంది విద్యార్థులను చేర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. అందుకోసం మద్రాసు వెళ్లిపోయారు. తన టాలెంట్కి అక్కడ విలువ లేదని మళ్లీ తిరుపతికి వచ్చి ఇన్స్టిట్యూట్ను నడిపారు. (ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత) రాకేష్ మాస్టర్కు టర్నింగ్ పాయింట్ ఇదే.. ఢీ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాకు సవాల్ విసిరి వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. తెలుగు గురించి తెలిసిన వాళ్లే జడ్జిలుగా వ్యవహరించాలని, తెలుగు వాళ్లే వచ్చి ఈ షోలో పాల్గొని మన దమ్ము ఏంటో చూపించాలని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. తెలుగు డ్యాన్సర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఢీ వేదికగా ప్రపంచానికి తెలియజేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే! ప్రభుదేవా అప్పటికే స్టార్ హీరోగా, కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు రాకేష్ మాస్టర్. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు అందరికీ పరిచయం అయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్న చాలా మంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం పొందినవారే. శేఖర్ మాస్టర్తో విబేదాలు టాలీవుడ్లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్ కూడా ఆయన శిష్యుడే.. కానీ వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై శేఖర్ మాస్టర్ పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఒకరోజు ఫేస్బుక్ లైవ్ చాట్లో రాకేష్ మాస్టర్తో మీ గొడవ ఏమిటి? అని ఓ అభిమాని ప్రశ్నకు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. తనపై మాస్టర్కు ఉన్న కోపానికి కారణం ఏంటో తెలియదు. కానీ ఆయన మాటల చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపాడు. గొడవకు కారణం ఇప్పటికీ సస్పెన్సే రాకేష్ మాస్టర్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ శేఖర్తో గొడవకు గల కారణాలను తెలపకుండానే కొన్ని ఆరోపణలు చేసేవారు. వారి మధ్య ఏం జరిగింది? అని అడిగితే అసలు విషయం చెప్పకుండా దాటవేసేవారు. వారి మధ్య జరిగిన విషయాలు చెప్పకుండా వాళ్ల పాప బర్త్ డేకు పిలవలేదు, చిరంజీవి సాంగ్ చేస్తే చెప్పలేదు అని శేఖర్పై ఫైర్ అయ్యేవారు. దీంతో ఇప్పటికీ వారి మధ్య గొడవకు కారణం మాత్రం సస్పెన్స్గానే ఉండిపోయింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?) -
Rakesh Master Unseen Photos: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (ఫొటోలు)
-
Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. ఆదివారం ఉదయం ఆయన రక్తవిరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా హైదరాబాద్లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్.. ఆ తరువాత లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫర్గా పని చేశారు. ఆ గొప్ప డ్యాన్సర్లు ఈయన శిష్యులే దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! రాకేశ్ మాస్టర్ మరణవార్త గురించి ఆయన అసిస్టెంట్ సాజిత్ మాట్లాడుతూ.. 'హనుమాన్ క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు రాకేశ్ మాస్టర్కు విరోచనాలు, వాంతులు జరిగాయి. అప్పుడు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. కాళ్లు, చేతులు పడిపోవడంతో ఈయన బతకడం కష్టమని డాక్టర్లు అప్పుడే చెప్పారు. జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు అవుతోంది. వారం రోజుల క్రితం ఓ ప్రాజెక్ట్ షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం, భీమవరం వెళ్లి ఈ మధ్యే హైదరాబాద్ వచ్చారు. అప్పటినుంచి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన కాళ్లు, చేతులు పడిపోయాయి అని ఫోన్ వచ్చింది. పక్షవాతంలాగా అనిపిస్తోందని ఇంటిసభ్యులు చెప్పారు. ఇంతలోనే ఆయన మరణించినట్లు తెలిసింది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: శ్రీజతో విడాకులు.. కన్ఫర్మ్ చేసిన కల్యాణ్ దేవ్ -
ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి
కొరియోగ్రాఫర్ చైతన్య ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. జబర్దస్త్లో కన్నా ఢీలో తక్కువ పారితోషికం ఇస్తారని, ఇక్కడ పేరు మాత్రమే వస్తుందని ఆయన వాపోయాడు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం చైతన్యకు అప్పులుండే అవకాశమే లేదని చెప్తూ వస్తున్నారు. తాజాగా చైతన్య తల్లి లక్ష్మి రాయ్ ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 'కాస్ట్యూమ్స్కు డబ్బులు కావాలంటూ రెండు, మూడు వేలు నా దగ్గర తీసుకునేవాడు. మీకు తెలియని ఇంకో విషయమేంటంటే.. ఢీ ఫైనల్ కోసం రూ.3,50,000 అడిగాడు. మా ఆయన్ని అడిగితే ఒప్పుకోలేదు. వాడిని చెడగొడుతున్నావు, డబ్బులివ్వను అన్నాడు. ఒక రోజంతా అలిగి కూర్చుంటే ఆ డబ్బంతా తెచ్చి ఇచ్చాడు. అమ్మ, నేను గెలిస్తే రూ.7,50,000 వస్తాయి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాడు. కానీ ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలియలేదు. ఇలా రెండుసార్లు జరిగింది. ఢీ షోకి వెళ్లిన తర్వాత దాదాపు రూ.6 లక్షల దాకా ఇచ్చాను. ఇంత చేసినదాన్ని ఏదైనా అప్పులున్నాయంటే తీర్చకపోయేదాన్నా? అప్పుల వల్ల చనిపోయాడనే మరక ఉండకూడదనే నా బాధ. ఢీ షోలో పేమెంట్స్ ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఢీ లేకపోతే మా అబ్బాయి లేడు. వాడికి ఇంత గుర్తింపు ఢీ వల్లే వచ్చింది' అని చెప్పుకొచ్చింది చైతన్య తల్లి. చదవండి: క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్చరణ్ నావల్ల హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందన్నారు: నవదీప్
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
- కొత్త రికార్డు స్థాయిని తాకి, వెనక్కి..
- Israel–Hamas war: రఫాపై దాడుల్లో 45 మంది మృతి
- మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
- అమెరికాలో టోర్నడోల బీభత్సం
- కోర్టులో ఎంపీ కన్నీరు
- Amit Shah: ‘ఉగ్ర’ సంబందీకులకు ఉద్యోగాలు రావు
- Lok sabha elections 2024: మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో
- ఇంటర్లో ఇక ఆన్లైన్ మూల్యాంకనం
- మరో 10,542 టెన్త్ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్
Advertisement