-
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
మీరు ఉద్యోగం చేస్తున్నారా? చాలిచాలనీ జీతంతో ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ సలహా పాటిస్తే మీ ప్రతిభకు తగ్గ వేతనం పొందొచ్చు. డెహ్రడూన్కు చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్ సైనీ ఉద్యోగులకు అప్రైజల్ సీజన్పై అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీల గురించి పచ్చి నిజాల్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ అక్షయ్ సైనీ ఏం చెప్పారంటేమీరు ఎక్కువ జీతం కావాలంటేమీరు ఎక్కువ జీతం కావాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయం. భారత్లో అత్యధిక కంపెనీల్లో ఇంట్రర్నల్ అప్రైజల్స్ ఓ జోక్గా అభివర్ణించారు. అంతేకాదు, సగటు కంటే ఎక్కువ ఉన్న ఇంజనీర్లు, డబుల్ డిజిట్ శాలరీ హైక్ను పొందలేదు. మీ వేతనం తక్కువగా ఉన్నట్లయితే, అతిగా ఆలోచించకండి. వెంటనే ఉద్యోగం మారండి! అంటూ తన పోస్ట్లో తెలిపారు. HARD TRUTH : Switching jobs is the only way to reach high salaries.In most Indian companies, the internal appraisals is a joke. Even above average engineers hardly get a double digit hike %If you're underpaid, don't overthink, just Switch! 🤷♂️— Akshay Saini (@akshaymarch7) May 2, 2024తక్కువ జీతంతో మీ కెరీర్ను ప్రారంభిస్తేమరో కఠినమైన నిజం ఏమిటంటే, మీరు తక్కువ జీతంతో మీ కెరీర్ను ప్రారంభిస్తే, అధిక జీతం (సాఫ్ట్వేర్ ఇంజనీర్గా) పొందాలంటే మీరు ఉద్యోగాలు మారాల్సి ఉంటుంది. కావాలంటే మీరే చూడండి తక్కువ వేతనంతో తమ కెరియర్ను ప్రారంభించిన ఐటీ ఉద్యోగులు జీతాలు పెంచుకునేందుకు తరుచూ ఉద్యోగాలు మారుతుంటారు. తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయికాబట్టి, మీరు తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి శాలరీ హైక్, డిజిగ్నేషన్ కోసం ప్రయత్నించి విఫలమైతే మీరు ఉద్యోగం మారడం మంచింది. మంచి పని ఎంత ముఖ్యమో జీతం కూడా అంతే ముఖ్యం చివరగా గుర్తుంచుకోండి. మీకు తక్కువ జీతం ఉంటే అది మీ తప్పు అని అక్షయ్ సైనీ పేర్కొన్నారు.అక్షయ్ సైనీ అభిప్రాయాలపై నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం పొందాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయమని, ఎక్కువ జీతం పొందేందుకు తాము కూడా సంస్థలు మారినట్లు చెబుతున్నారు. -
ధర్మవరంలో కార్పొరేట్ పాలిటిక్స్
ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ రాజకీయం రంగ ప్రవేశం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చానన్న బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఇక్కడ గల్లీలో ప్రలోభాలు, బెదిరింపులతో నీచరాజకీయాలు చేస్తున్నారు. రూ.కోట్లు కుమ్మరించి అధికార పార్టీ నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వని వ్యాపారులపై సీబీఐ, ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తానంటూ తన వర్గీయుల ద్వారా బెదిరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ధర్మవరం: ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగప్రవేశం చేయగానే ధర్మవరంలో కొత్త సంస్కృతి మొదలైంది. ఆయనకు మద్దతుగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి రెండు వేల మందికిపైగా ధర్మవరంలో దిగారు. పట్టణంలోని అద్దె ఇళ్లు, లాడ్జీలలో తిష్ట వేశారు. వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభాలకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారు. డబ్బు ఇస్తామని, నామినేటెడ్ పదవులు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని.. ఇలా పలు రకాలుగా ప్రలోభపెడుతున్నారు. గ్రామస్థాయి నాయకుడికైతే రూ.10 లక్షలు, ఓ మోస్తరు నాయకుడికైతే అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నాయకుడు గిర్రాజు నగేశ్, ఏపీ కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి బాబు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్లను పెద్దఎత్తున ప్రలోభపెట్టి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేర్చుకున్నట్లు సమాచారం. వీరివెంట భారీగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు వస్తారని భావించినప్పటికీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. వంద మందితో పారీ్టలో చేరుతానని చెప్పిన గిర్రాజు నగేశ్ కనీసం పది మందికి కూడా కండువా కప్పించలేకపోయాడు. కోటిబాబు వెంట కూడా ఎవరూ వెళ్లలేదు. కోటిబాబు బీజేపీలోకి చేరిన మరుసటి రోజే ఆయన సోదరులు మళ్లీ వైఎస్సార్సీపీలో చేరడం విశేషం. అదేవిధంగా తమ ప్రలోభాలకు లొంగని వారిని సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల పేరిట సత్యకుమార్ మనుషులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. పట్టు–చేనేత వస్త్ర వ్యాపారానికి కేంద్రమైన ధర్మవరంలో వ్యాపారులకు ఈ తరహా బెదిరింపులు ఎక్కువైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, సత్యకుమార్ ప్రచారానికి కూడా ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయన నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రొద్దుటూరు, కర్నూలు, రాప్తాడు తదితర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి వాహనాల్లో జనాలను తీసుకురాగా, వారు మధ్యలోనే వెళ్లిపోయారు. బీజేపీపై చేనేతల ఆగ్రహం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించడంతో నేతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. జీఎస్టీ రద్దు చేయాలని నేతన్నలు నిరసన తెలిపినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా గత కేంద్ర బడ్జెట్లో జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచాలని భావించింది. అప్పట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్లు కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి చేనేత వస్త్రాలపై జీఎస్టీని పెంచడం వల్ల కలిగే నష్టాలను వివరించడంతో 5 శాతానికే పరిమితం చేశారు. ఈ క్రమంలో బీజేపీపై నేతన్నలు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
ఫలితాల సీజన్తో జోష్!
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కార్పొరేట్ ఫలితాలు జోష్నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్న టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసిక ఫలితాలతో సీజన్ను ప్రారంభించనుంది. శుక్రవారం(12న) టీసీఎస్ జనవరి–మార్చి(క్యూ4)తోపాటు పూర్తి ఏడాదికి సైతం ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఇదే రోజు ఆర్థిక గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ప్రభుత్వం(ఎన్ఎస్వో) మార్చి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను విడుదల చేయనుంది. అంతేకాకుండా ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో సీపీఐ నామమాత్ర వెనకడుగుతో 5.09 శాతానికి చేరింది. ఇక పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) జనవరిలో 3.4 శాతంగా నమోదైంది. కాగా.. గురువారం(11న) ఈద్(రంజాన్) సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గత వారం రికార్డు గత వారం ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. చివరికి శుక్రవారంతో ముగిసిన గత వారం సెన్సెక్స్ 597 పాయింట్లు(0.8 శాతం) లాభపడి 74,248 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం 187 పాయింట్లు(0.84 శాతం) ఎగసి 22,514 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగడంతో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 3.84 శాతం జంప్చేసి 40,831 వద్ద నిలిచింది. స్మాల్క్యాప్ ఇండెక్స్ మరింత అధికంగా 6.64 శాతం దూసుకెళ్లి 46,033 వద్ద ముగిసింది. చమురు, రూపాయి ఎఫెక్ట్ ప్రపంచ స్టాక్ మార్కెట్లు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు ప్రస్తావించారు. అంతేకాకుండా దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకాగలవని పేర్కొన్నారు. మరోవైపు రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరువైన నేపథ్యంలో ఆరు ప్రపంచ కరెన్సీలతో డాలరు మారకపు విలువ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. విదేశీ అంశాల విషయానికివస్తే గత వారాంతాన మార్చి నెలకు యూఎస్ వ్యవసాయేతర రంగాలలో ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెలువడ్డాయి. వీటితోపాటు ఈ నెల 10న(బుధవారం) యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఇటీవల చేపట్టిన పాలసీ సమీక్షలో యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీయంగా సైతం ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఏడోసారీ యథాతథంగా 6.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. సీపీఐ లక్ష్యాన్ని 4.5 శాతంగా పేర్కొంది. -
సెన్సెక్స్ 671 పాయింట్లు క్రాష్
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో పాటు దేశీయ కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఫలితాల ప్రకటనకు ముందు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సోమవారం దేశీయ మార్కెట్లు దాదాపు ఒకశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 671 పాయింట్లు పతనమై 71,355 వద్ద నిలిచింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 21,513 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 725 పాయింట్లు నష్టపోయి 71,301 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు పతనమైన 21,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మధ్య తరహా షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.87% నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.16.03 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ► అమెరికాలో డిసెంబర్కు సంబంధించి వ్యవసాయేతర రంగాల్లో 2.16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. పేరోల్ డేటా అంచనాలకు మించి నమోదవడంతో ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ ఊహాగాహాలు తెరపైకి వచ్చాయి. చైనా ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు డేటాతో సహా ఆయా దేశాల కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు అప్రమత్తత చోటు చేసుకోవడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ► మెక్వైర్ ఈక్విటీస్ రీసెర్చ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులపై రేటింగ్ డౌన్గ్రేడ్ చేయడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎస్బీఐ 2%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 1.51% నష్టపోయాయి. ► బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.2.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.366 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► నష్టాల మార్కెట్లో కొన్ని చిన్న రంగాల షేర్లు రాణించాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేరు ఇంట్రాడేలో 2.50% పెరిగి రూ.1182 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► ఈక్విటీ షేర్ల బైబ్యాక్కు బోర్డు ఆమోదించినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. షేరుకి రూ. 10,000 ధర మించకుండా 40,00,000 షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 4,000 కోట్లు వెచి్చంచనుంది. -
కార్పొరేట్ బాండ్ల భారీ వృద్ధి.. 2030 కల్లా రూ.110 లక్షల కోట్లకు
ముంబై: రానున్న కాలంలో కార్పొరేట్ బాండ్ల మార్కెట్ భారీగా విస్తరించనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా పేర్కొంది. దీంతో 2030 మార్చికల్లా కార్పొరేట్ బాండ్ మార్కెట్ పరిమాణం రెట్టింపుకానున్నట్లు అభిప్రాయపడింది. వెరసి రూ.110 లక్షల కోట్ల మార్క్ను దాటే వీలున్నట్లు అంచనా వేసింది. పెట్టుబడి వ్యయాలకు దన్ను, ఆకట్టుకుంటున్న మౌలిక సదుపాయాల రంగం, పొదుపును ఫైనాన్షియలైజ్ చేయడం వంటి అంశాలు ఇందుకు దోహదం చేయనున్నట్లు వివరింంది. 2023 మార్చివరకూ గత ఐదేళ్లలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ వార్షికంగా 9 శాతం వృద్ధి చెంది ర. 43 లక్షల కోట్లకు చేరినట్లు నివేదికలో క్రిసిల్ పేర్కొంది. ఈ బాటలో 2030 మార్చికల్లా రెట్టింపునకుపైగా ఎగసి రూ. 100–120 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా వేసింది. నియంత్రణ సంస్థల మధ్యవర్తిత్వం కూడా ఇందుకు సహకరించనున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి పేర్కొన్నారు. గరిష్టస్థాయిలోని సామర్థ్య వినియోగం, కార్పొరేట్ రంగ పటిష్టత, బలమైన బ్యాలన్స్షీట్లు, ఆర్థిక పురోభివృద్ధి అంచనాలు పెట్టుబడి వ్యయాల్లో వృద్ధికి కారణంకానున్నట్లు క్రిసిల్ వివరింంది. దీంతో 2027కల్లా రూ. 110 లక్షల కోట్ల పెట్టుబడులు నవెదుకావచ్చని అభిప్రాయపడింది. అంచనా పెట్టుబడి వ్యయాలలో ఆరో వంతు కార్పొరేట్ బాండ్ మార్కెట్ సమకూర్చవచ్చని పేర్కొంది. మౌలిక రంగానికి మౌలిక రంగ ఆస్తుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ బలపడుతుండటం, వేగవంత రికవరీ వంటి అంశాల నేపథ్యంలో దీర్ఘకాలిక రుణాలకు అవకాశాలు మెరుగుపడనున్నట్లు క్రిసిల్ తెలియజేసింది. ప్రస్తుతం కార్పొరేట్ బాండ్ల జారీ నిధుల్లో 15 శాతం మౌలిక రంగానికి చేరుతున్నట్లు తెలియజేసింది. ఏఏ రేటింగ్ కార్పొరేట్ బాండ్ల జారీపై పెట్టుబడి నియంత్రణలను సరళతరం చేయడంతో పెన్షన్ ఫండ్స్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ను వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక వృద్ధికి సహకరించే వీలున్నట్లు క్రిసిల్ డైరెక్టర్ రమేష్ కరుణాకరన్ వివరించారు. రిటైల్ విభాగంలో పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చేందుకు నాన్బ్యాంక్ రుణదాతల నుంచి సైతం కార్పొరేట్ బాండ్లకు డిమాండ్ కనిపించనున్నట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. నాన్బ్యాంక్ రుణదాతలు అధిక స్థాయిలో రుణాలను రిటైలర్లకు అందిస్తుండటంతో దేశ జీడీపీలో రిటైల్ క్రెడిట్ 30 శాతానికి చేరింది. యూఎస్లో ఇది 54 శాతంకాగా.. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్ ప్రొడక్టులలో గరిష్టంగా పెట్టుబడులు మళ్లుతున్నట్లు తెలియజేసింది. -
ప్రభుత్వాల చెలగాటం...‘న్యాక్’కు నిధుల సంకటం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పరమైన అంశాల్లో నెలకొన్న వివాదాలు ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు అడ్డంకిగా మారాయి. ఈ వివాదం వల్ల న్యాక్కు నిధులు రావటం నిలిచిపోవటంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణ ఇబ్బందిలో పడింది. ఏడాదిగా నిధుల కోసం నానాతిప్పలు పడుతున్న నాక్ యంత్రాంగం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద బడా సంస్థల వద్దకు వెళ్లి నిధులు సమీకరించుకుని కార్యక్రమాలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు కార్పొరేట్ సంస్థలతో పాటు, నాబార్డ్ చేసిన ఆర్థిక సాయంతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరిన్ని సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తే, కొత్త బ్యాచ్లను ఏర్పాటు చేసి మరిన్ని బ్యాచ్లకు శిక్షణ ఇవ్వాలని యత్నిస్తున్నారు. గతంలో విదేశీ యువతకు కూడా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయంగానూ ఖ్యాతి పొందిన న్యాక్కు.. ప్రభుత్వ విభాగాలు ఆర్థిక క్రమశిక్షణ తప్పటంతో నిధుల కోసం రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించింది. నిధుల వ్యయంపై అభిప్రాయభేదాలు.. న్యాక్ కోర్సులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తోంది. ఇది 70:30 దామాషాగా విడుదలవుతున్నాయి. తాను ఇస్తున్న నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సరిగా దాఖలు కావటం లేదని, కొన్ని నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కేంద్రం సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. అవి రానురాను పెద్దవి కావటంతో ఏడాది క్రితం కేంద్రం నిధుల విడుదలను ఆపేసినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా నిలిచిపోయి, న్యాక్కు నిధుల సమస్య ఉత్పన్నమైంది. మూడు నెలల కోర్సులను బ్యాచ్ల వారీగా నిర్వహిస్తున్న న్యాక్ వద్ద పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పోగయ్యాయి. ఈ తరుణంలో చేతిలో నిధులు లేకుండా పోయాయి. దీంతో న్యాక్ ఉన్నతాధికారులు కార్పొరేట్ కంపెనీలను సంప్రదించటం ప్రారంభించారు. అలా తొలుత తాన్లా ప్లాట్ఫామ్స్, జీఐపీఎల్ సంస్థలు 350 మంది శిక్షణకు కావాల్సిన నిధులు అందించాయి. ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష వరకు ఫీజు ఉండే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి పీజీ కోర్సులు కూడా వాటితో నిర్వహిస్తుండటం విశేషం. ఇక మరో 200 మంది అభ్యర్థులతో కూడిన బ్యాచ్ల శిక్షణకు కావాల్సిన నిధులను నాబార్డు సమకూర్చింది. వీటితో ఇప్పటి వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. మరిన్ని సంస్థలు ముందుకొస్తే విస్తరిస్తాం... ‘‘సీఎస్ఆర్ నిధులతో శిక్షణ కార్యక్రమాలు విస్తరించాలని నిర్ణయించాం. ఇప్పటికి తాన్లా ప్లాట్ఫామ్స్, జీఐపీఎల్, నాబార్డు నిధులు అందించాయి. ఈ డిసెంబరులో కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాబోతున్నాయి. వాటికి అదనంగా సీఎస్ఆర్ కింద కార్పొరేట్ కంపెనీలు సాయం అందిస్తే న్యాక్ మరింత ఉన్నతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది’అని న్యాక్ డీజీ బిక్షపతి పేర్కొన్నారు. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి న్యాక్ శిక్షణార్థులను ఎంపిక చేసుకుంటున్నందున కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని న్యాక్ ప్లేస్మెంట్ డైరక్టర్ శాంతిశ్రీ కోరారు. ఇదీ పరిస్థితి.. ఉన్నత విద్య చదువుకోలేని పరిస్థితిలో చదువు మానేసిన ఎంతోమంది యువతీయువకులకు భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో న్యాక్ శిక్షణ ఇస్తోంది. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఫాల్స్ సీలింగ్, భవన నిర్మాణ సూపర్వైజింగ్, వెల్డింగ్, కన్స్ట్రక్షన్ సర్వే అంశాల్లో తర్పి దు పొందుతున్న అభ్యర్థులకు దేశవిదేశాల్లోని నిర్మాణ సంస్థల్లో ఉపాధి దొరుకుతోంది. గతంలో కేవలం భవన నిర్మాణంలోని వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చిన న్యాక్.. ఆ తర్వాత పీజీ కోర్సులను కూడా ప్రారంభించింది. బీటెక్ సివిల్ అభ్యర్థులు, ఇంజినీర్లకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో నిధుల సమస్య ఉత్పన్నమై న్యాక్ను గందరగోళంలో పడేసింది. -
ఆ కంపెనీల ఆదాయ వ్యయాలు అధికం
డెబ్బై గంటల పని వారాలపై ఇటీవల తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగులు ఎన్నిగంటలు పనిచేసినా కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత పెరుగుతోంది. మరొకొన్నింటిలో తక్కువగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగికి చేసే ఖర్చు, ఆ ఉద్యోగి సంస్థకు చేకూర్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సంస్థలు చేసిన సర్వేలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం..గత ఐదేళ్లలో కంపెనీలకు వచ్చే మొత్తం రాబడిలో సిబ్బంది ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. అయితే 2019లో రూ.1.46 కోట్లుగా ఉన్న టాప్ 500 లిస్టెడ్ కంపెనీల రాబడి 36% పెరిగి 2023లో దాదాపు రూ.2 కోట్లకు చేరుకుంది. కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. దాంతోపాటు కొన్ని సంస్థలు ఉద్యోగులపై చేసే వ్యయం కూడా అధికమవుతుంది. దాదాపు కంపెనీల వ్యయంలో 10శాతం ఉద్యోగుల జీతాలకు కేటాయిస్తున్నాయి. 2020-21 కరోనా సమయంలో ఉద్యోగుల ఆదాయం పడిపోయింది. కానీ గత రెండేళ్లలో వారి ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో కంపెనీల ఉత్పాదకత తగ్గి ఉద్యోగుల ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తాయి. దాంతో వారి ఆదాయాలు పెరిగినట్లు అవుతుంది. కానీ ద్రవ్యోల్బణ భయాలు సమసిపోతున్నపుడు క్రమంగా ఆదాయ వ్యయాలు సర్దుబాటవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీస్, ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉత్పాదకత వాస్తవానికి మెరుగుపడింది. ఆయా రంగాలు వారి ఉద్యోగులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకున్నట్లు సర్వేలు తెలిపాయి. ఆ కంపెనీల ఆదాయవ్యయాలు పెరుగుతున్నాయి. రవాణా, లాజిస్టిక్స్, మ్యానుఫాక్చరింగ్, మైనింగ్, రిటైల్ రంగాలు ఇప్పటికీ తక్కువ స్థాయిలో కార్మికులను ఉపయోగిస్తున్నాయి. అయితే 2019 నాటికి టాప్ 500కంపెనీల్లో దాదాపు 6 కోట్ల ఉద్యోగులు ఉండేవారు. 2023 నాటికి వారి సంఖ్య 7 కోట్లకు చేరింది. గడిచిన ఐదేళ్లలో కంపెనీలు ఏటా 12.6శాతం మేర వృద్ధి చెందాయి. అదేవిధంగా వారి ఉద్యోగులకు చేసే ఖర్చు సైతం ఏటా 12.5శాతం చొప్పున పెరిగింది. -
ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్
రద్దు చేసుకున్న, పనిచేయని మొబైల్ నంబర్లను కనీసం మూడు నెలల తర్వాతే వేరేవారికి కేటాయిస్తామని భారత టెలికాం నియంత్రణ సంస్థ-ట్రాయ్ తెలిపింది. డియాక్టివేట్ లేదా డిస్కనెక్ట్ చేసిన మొబైల్ నంబర్లు వాడిన వారి సమాచార గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు చెప్పింది. మొబైల్ నంబర్లు డిస్కనెక్ట్, డీయాక్టివేట్ చేసిన తర్వాత వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందని గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అందుకు ప్రతిగా ట్రాయ్ స్పందించింది. ఇదీ చదవండి: పేదల నుంచే జీఎస్టీ గరిష్ఠ వసూళ్లు ఈ రిట్పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ట్రాయ్ తన స్పందనను తెలియజేసింది. గతంలో ఫోన్ నంబరు వాడిన చందాదారుడి గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే 90 రోజుల వ్యవధి విధించినట్లు చెప్పింది. సబ్స్క్రైబర్లు సైతం తమ వంతుగా వ్యక్తిగత సమాచారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సూచించింది. వాట్సప్ సైతం తన స్పందనను కోర్టుకు తెలియజేసింది. ఒకవేళ 45 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు వాడకంలోలేని ఫోన్నంబర్లు ఆ తర్వాత కొత్త డివైజ్లో యాక్టివేట్ అయితే అందులోని డేటా మొత్తం తొలగిపోతుందని తెలిపింది. దాంతో గతంలో ఫోన్నంబర్తో వాట్సాప్ వాడిన వారి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుందని వివరించింది. -
వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. డిజిటల్ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్లైన్ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు. అందరినీ ఇంతగా ప్రభావితం చేస్తోన్న ఆ ఆటల రూపకల్పన వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. దాంతోపాటు ఆన్లైన్ గేమ్ల ద్వారా దేశీయంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు రోజూ పుట్టుకొస్తున్నాయి. భారత్లోని డిజిటల్ గేమింగ్ మార్కెట్ రానున్న ఐదేళ్లలో 750 కోట్ల డాలర్ల (దాదాపు రూ.62,250 కోట్ల) స్థాయికి చేరుకోనుంది. ప్రధానంగా యాప్ల కొనుగోళ్లు, ప్రకటనల రాబడులు, వినియోగదారుల సంఖ్య పెరగడం ఇందుకు కారణమని గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికై తన నివేదికలో వెల్లడించింది. గురువారం హైదరాబాద్లో 15వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) ప్రారంభమైంది. దాదాపు 100కు పైగా సంస్థలు తమ గేమింగ్ ఉత్పత్తులను ఈ కార్యాక్రమంలో ప్రదర్శిస్తున్నాయి. నవంబర్ 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్ గేమింగ్ రంగంలోని నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా లుమికై, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇదీ చదవండి: కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్ నివేదిక తెలిపిన వివరల ప్రకారం..దేశంలో 56.8 కోట్ల మంది గేమర్లు ఉన్నారు. ఇందులో 25 శాతం మంది చెల్లింపులు చేస్తున్నారు. భారత్లో మొత్తం డిజిటల్ గేమ్లు ఆడేవారిలో మహిళలు 41శాతం, పురుషులు 59 శాతం ఉన్నారు. 18-30 ఏళ్లవారు 50శాతం మంది, 31-45 ఏళ్లలోపు 29శాతం మంది, 45 ఏళ్లు దాటిన గేమర్లు 21శాతం ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ గేమింగ్ పరిశ్రమ 310 కోట్ల డాలర్ల (రూ.26,000 కోట్ల) ఆదాయం సంపాదించింది. రానున్న ఐదేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. రియల్ మనీ గేమింగ్ ఆదాయం వృద్ధిరేటు ఏటా పెరుగుతుంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 50 శాతానికి పైగా వివిధ డిజిటల్ గేమ్లు ఆడుతున్నారు. గత ఏడాది భారత్లో గేమర్ల సంఖ్య 12 శాతం పెరిగింది. చెల్లింపులు చేసే గేమర్ల సంఖ్యలో 17 శాతం వృద్ధి కనిపించింది. 15వందల కోట్ల గేమ్ డౌన్లోడ్లతో భారత గేమింగ్ రంగం అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. -
ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు! 18 ఏళ్ల అనుభవం.. అయినా..
2023 ప్రారంభం నుంచి ఐటీ సంస్థల ఆదాయం తగ్గడంతో.. ఖర్చులను తగ్గించుకోవడానికి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి, ఇప్పటికీ తొలగిస్తూనే ఉన్నాయి. ఒక వైపు ఆర్ధిక మందగమనం.. మరోవైపు ఊడిపోతున్న ఉద్యోగాల మధ్య టెక్ ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు . ఐటీ కంపెనీలు ఇప్పటికి లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో కేవలం ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా కొన్ని ఏళ్లుగా సంస్థలకు సేవలందిస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. సెప్టెంబర్లో గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుంచి వందలాది మంది ఉద్యోగుల్ని గూగుల్ తొలగించింది. ఇందులో ఏకంగా 18 సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన 'రీటా' కూడా ఉండటం గమనార్హం. గూగుల్లో మేనేజర్గా పనిచేసిన రీటా 18 ఏళ్లుగా గూగుల్ సంస్థకు సేవలందించినట్లు, ఇటీవలే ఉద్యోగం పోయినట్లు లింక్డ్ఇన్లో షేర్ చేసింది. అంతే కాకుండా హెచ్ఆర్, టాలెంట్ అక్విజిషన్, కెరీర్ డెవలప్మెంట్ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. ప్రముఖ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించడం, వారు సోషల్ మీడియాలో భావోద్వేగాలను పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో గూగుల్ మాత్రమే కాకుండా అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ ఐటీ దిగ్గజాలు కూడా ఉన్నాయి. -
కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్
ఒక దేశ ప్రగతికి అవరోధంగా నిలిచే ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. చేయడానికి పని లేక.. ఉపాధి లేక.. అర్హతలుండి కొందరు, అర్హతల్లేక మరికొందరు నిరుద్యోగితను ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని ఓ కంపెనీ వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుందనే సమాచారంతో పెద్దఎత్తున యువత ఒక్కసారి రావడంతో గేట్లు మూసివేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కొవిడ్ కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీల వృద్ధిరేటు తగ్గిపోయింది. దానికితోడు అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల బ్యాంకింగ్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాలో సాఫ్ట్వేర్ అప్డేట్లు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. దాంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయింది. గ్లోబల్గా నెలకొన్ని యుద్ధభయాల వల్ల కొన్ని దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. సిబ్బందికి లేఆఫ్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్నాయంటే చాలు వందల్లో ఉద్యోగార్థులు వస్తున్నారు. ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం Situation of walk-in interviews in India. This is in Hyderabad. pic.twitter.com/DRyz4R4YgM — Indian Tech & Infra (@IndianTechGuide) November 1, 2023 -
Zomato Jobs: ఉద్యోగ నియామకాలపై జొమాటో కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటో ఉద్యోగాల నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తులను తమ కంపెనీలో ఇకపై ఉద్యోగాలు ఇవ్వబోమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఇటీవల యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. సంస్థ ఉద్యోగ నియామకం భిన్నమైందని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వమని, ఎలాంటి పనిగురించి వెతకకుండా, నమ్మకంగా పని చేసే స్వభావం ఉన్న వారికే తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జొమాటో ప్రారంభించి 15 ఏళ్లు అయిందన్నారు. సంస్థలో గత 5-6 ఏళ్ల అనుభవం ఉన్న కంపెనీ అవసరాలకు సరిపడా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల వల్ల కొత్తవారిని నియమించుకోవాలంటే మాత్రం వారి నైపుణ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ‘కొత్తవారిని నియమించాలంటే ఇంటర్వ్యూకు మూడు నెలలు సమయం అయిపోతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ పాసైతే పాత సంస్థలో మరో మూడు నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది. సంస్థ కార్యకలాపాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మరింత సమయం పడుతుంది. అభ్యర్థి పనితనం గురించి తెలియాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మొత్తం దాదాపు 2 ఏళ్లు వృథా అవుతాయి’అని గోయల్ అభిప్రాయపడ్డారు. దానికిబదులుగా సంస్థలోని వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతస్థానంలో నియమిస్తే కంపెనీ విధానాలు తెలిసి ఉంటాయి కాబట్టి పెద్దగా సమస్య ఉండదని చెప్పారు. -
దీపావళికి ముందే అంబానీ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలు ఇవే..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పండగ ముందే రిలయన్స్ రిటైల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా క్రెడిట్కార్డులను తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో రెండు కోబ్రాండెడ్ రిలయన్స్ ఎస్బీఐ కార్డులను విడుదల చేయనుంది. వీటిని 100 శాతం రీసైకిల్ ప్లాస్టిక్తో తయారు చేసినట్లు సమాచారం. రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో వస్తున్న కొత్త క్రెడిట్ కార్డులను రిలయన్స్ ఎస్బీఐ కార్డ్, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ పేరుతో విడుదల చేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో లావాదేవీలపై వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు, ఆఫర్లను అందించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కిరాణా వస్తువులపై ఆఫర్లు పొందనున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రయోజనాలు: ఈ కార్డ్ వార్షిక రుసుం రూ.499. ఏడాదిలో కార్డు ద్వారా రూ.1,00,000 ఖర్చు చేసిన వినియోగదారులకు వార్షిక రుసుం మినహాయింపు ఉంటుంది. ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్లోడ్ మినహా ఇతర కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కి ఒక రివార్డు పాయింట్ అందించబడుతుంది. జాయినింగ్ ఫీజు చెల్లింపుపై రూ.500 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ కార్డు పొందుతారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో, డైనింగ్, సినిమాలపై ఖర్చు చేసిన చెల్లింపులపై ప్రతి రూ.100కి 5 రివార్డు పాయింట్లు అందించబడతాయి. వివిధ రిలయన్స్ రిటైల్ స్టోర్ల నుంచి రూ.3,200 విలువైన అదనపు తగ్గింపు వోచర్లు అందించబడుతున్నాయి. అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపును కార్డు అందిస్తోంది. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ ప్రయోజనాలు: ఈ కార్డ్ వార్షిక రుసుం రూ.2,999. రూ.3,00,000 వార్షిక ఖర్చు చేసిన వారికి వార్షిక రుసుం మినహాయింపు ఉంటుంది. కార్డు హోల్డర్లు రిలయన్స్ రిటైల్ స్టోర్లలో చేసే కార్డు కొనుగోళ్లపై ప్రతి రూ.100కి 10 రివార్డు పాయింట్లను అందుకుంటారు. డైనింగ్, సినిమాలు, దేశీయ విమానయాన సంస్థలు, అంతర్జాతీయ వ్యయంపై ఖర్చు చేసిన రూ.100 ఖర్చుకు 5 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి. ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్లోడ్ మినహా.. ఇతర రిటైల్ కొనుగోళ్లపై రూ.100 ఖర్చుకు 2 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి. జాయినింగ్ ఫీజు చెల్లింపుపై కార్డు హోల్డర్లు రూ.3,000 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ అందుకుంటారు. అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. బుక్మైషోలో ప్రతి నెలా రూ.250 విలువైన 1 సినిమా టిక్కెట్ కార్డు అందిస్తున్నారు. -
వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
వర్క్ ఫ్రం హోమ్ విషయంలో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ ఇంట్లోంచే విధులు నిర్వర్తిస్తున్న వారు ఇకపై నెలకు కనీసం పది రోజులపాటు ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎంట్రీ లెవెల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా ఉద్యోగులకు తెలియజేసినట్లు తెలిపింది. ‘‘బ్యాండ్ 5, 6 స్థాయుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల (మిడ్-లెవల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ హెడ్లు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు)కు నెలలో 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాలని మెయిల్ పంపారు. కరోనా అనంతరం చాలా కంపెనీలు ఆఫీస్ నుంచి పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రిమోట్ వర్క్తోపాటు హైబ్రిడ్వర్క్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది’ అని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవల కంపెనీ క్యూ2 ఫలితాల సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థలో అందరూ కలిసి ఒకచోట పనిచేయాలని భావిస్తున్నట్లు సలీల్ పరేఖ్ చెప్పారు. సాధారణంగా సౌకర్యవంతమైన విధానానికి తాము మద్దతిస్తామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు కొన్ని రోజులు కార్యాలయంలో పనిచేయడంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ పన్ను పెంపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇటీవల వర్క్ ఫ్రం ఆఫీస్కే మొగ్గు చూపింది. దీనివల్ల సంస్థ అసోసియేట్లు, కస్టమర్ల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందని టీసీఎస్ భావిస్తోంది. సంస్థ ఉత్పత్తులను కస్టమర్లకు డెలివరీ చేయాలన్నా, వర్క్ అవుట్పుట్ మెరుగుపడాలన్నా వర్క్ఫ్రం ఆఫీస్ ద్వారానే సాధ్యం అని చెప్పింది. ఆఫీస్ సంస్కృతి, సహోద్యోగులతో ఎలా వ్యవహరించాలో తెలుస్తుందని, అందుకు సంబంధించి కంపెనీ మెంటార్గా వ్యవహరిస్తుందని టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ వివరించారు. -
ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రారంభించిన డోర్ తయారీ సంస్థ
జర్మన్ ఆధారిత హర్మన్ సంస్థ అనుబంధ కంపెనీ అయిన శక్తి హర్మన్ తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, దిల్లీలో రెండు ‘ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ప్రారంభించింది. బుధవారం బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో హర్మన్ గ్రూప్ యాజమాన్య భాగస్వామి మార్టిన్ జే.హర్మన్ పాల్గొని మాట్లాడారు. స్టీల్ డోర్, వుడెన్ డోర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందన్నారు. సంస్థ ప్రస్తుతం హైదరాబాద్ ప్లాంట్లో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇండియావ్యాప్తంగా మార్కెట్ను పెంచనున్నట్లు తెలిపారు. సంస్థ ప్రారంభించిన ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ కేంద్రాల ద్వారా వినియోగదారులు నేరుగా ఉత్పత్తులను చూసి వాటి ఉపయోగాలపై అవగాహన పొందే వీలుంటుందన్నారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో కలిపి ఏటా 1.1లక్షల డోర్లు అమ్ముడవుతున్నాయన్నారు. శక్తి హర్మన్ సంస్థ ఎండీ శశిధర్రెడ్డి మాట్లాడుతూ కంపెనీ విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలోపు జైపుర్లోని మహేంద్రాసిటీలో రెండో ప్లాంట్ అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్లోని ప్లాంట్ ద్వారా ఏటా 2లక్షల డోర్లు, 10వేల ఇండస్ట్రీయల్ డోర్లు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. జైపుర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఏటా మరో 1.3లక్షల డోర్లు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే దాదాపు 450 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం రూ.175కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్, ఇండస్ట్రీయల్, రెసిడెన్షియల్ విభాగాల్లో అధునాతన టెక్నాలజీతో డోర్లు తయారుచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, దిల్లీలో ప్రారంభించిన ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ల ద్వారా కస్టమర్లు నేరుగా సంబంధిత ప్రోడక్ట్ను చూసి దాని ఉపయోగాలు తెలుసుకుని నిర్ణయం తీసుకునే వీలుంటుందన్నారు. కేటలాగ్ చూసి డోర్లను కొనుగోలు చేయడం కంటే అనుభవపూర్వంగా వాటి గురించి తెలుసుకుని, చూసి కొనాలో వద్దో నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని వివరించారు. దేశవ్యాప్తంగా రియాల్టీ రంగం విస్తరిస్తుంది. దానికి అనువుగా డోర్ల అవసరం ఉంటుందన్నారు. హైదరాబాద్ మెట్రోతోపాటు చాలా ప్రభుత్వ, ప్రైవేట్రంగాల్లో తమ సంస్థకు చెందిన డోర్లను వాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగం, రెసిడెన్షియల్ విభాగాల్లో 2.5కోట్ల డోర్లు అవసరం ఉందన్నారు. అయినప్పటికీ డోర్ల తయారీలో అసంఘటిత రంగానికి ఇప్పటికీ 50 శాతం కంటే ఎక్కువ వాటా ఉందన్నారు. గతేడాది కంపెనీ రూ.270కోట్ల రెవెన్యూ సంపాదించినట్లు చెప్పారు. ఇండస్ట్రీయల్, కమర్షియల్ డోర్లు తయరుచేసే శక్తి హర్మన్ సంస్థ ప్రతిష్టాత్మక జర్మన్ ఆధారిత హర్మన్ బ్రాండ్ అనుబంధ కంపెనీ. హర్మన్ సంస్థ డోర్ సెగ్మెంట్లో 1935 నుంచి ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. ఇప్పటికే గ్లోబల్గా తమ సంస్థకు చెందిన దాదాపు 2కోట్ల డోర్లు వినియోగిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 6000 మంది సంస్థలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆసియా, ఉత్తర అమెరికా, యూరప్తో కలిపి మొత్తం 40 ఫ్యాక్టరీల్లో తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. అయితే 1994 నుంచి శక్తి హర్మన్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థ..2012 నుంచి ఇండియావ్యాప్తంగా తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసేలా చర్యలు తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.8వేల కోట్ల టర్నోవర్ ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
సాక్షి మనీ మంత్ర: రెండు రోజుల లాభాలు ఆవిరి.. నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
భారతీయ బెంచ్మార్క్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 19,100 దిగువకు చేరింది. సెన్సెక్స్ 237.72 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 63,874.93 వద్ద, నిఫ్టీ 61.30 పాయింట్లు లేదా 0.32 శాతం క్షీణించి 19,079.60 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ ముగిసే వరకు అదే తంతు కొనసాగించింది. అంతకుముందు గడిచిన రెండు సెషన్ల్లో మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతుండడంతో మదుపర్లు కొంత జాగ్రత్త వహిస్తున్నారు. దాంతో మంగళవారం మార్కెట్లో లాభాలు స్వీకరించినట్లు తెలుస్తుంది. రియాల్టీ మినహా అన్ని రంగాల షేర్లల్లో అమ్మకాలు కొనసాగాయి. నిఫ్టీలో ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, ఎల్టీ మైండ్ట్రీ, ఓఎన్జీసీ అత్యధికంగా నష్టపోయాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో స్థిరపడ్డాయి. సెక్టార్ వారీగా అయితే మాత్రం రియాల్టీ మినహా ఆటో, బ్యాంక్, హెల్త్కేర్ విభాగాల్లోని అత్యధిక స్టాక్లు ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది. -
‘స్టేట్ స్పాన్సర్డ్ అటాక్’ వివాదం.. యాపిల్ స్పందన ఇదే..
పలువురు లోక్సభలోని ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్లు వారి ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పటికే త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ ప్రియాంక చతుర్వేదికు అలర్ట్లు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన మెసేజ్లను తమ ఎక్స్ ఖాతాద్వారా ప్రముఖులు పంచుకున్నారు. ఈ అలర్ట్లను ఉద్దేశించి యాపిల్ స్పందించింది. స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ నోటిఫికేషన్లు కొన్నిసార్లు తప్పుడు అలారాలు కావచ్చని యాపిల్ చెప్పింది. అలా అటాక్ చేసేవారి వద్ద అధునాతన టెక్నాలజీ ఉంటుందని పేర్కొంది. దాంతో వారు ఎలాంటి దాడికైనా పాల్పడే అవకాశం ఉందని చెప్పింది. అయితే అలా వస్తున్న అలర్ట్ల్లో కొన్ని తప్పుడు నోటిఫికేషన్లు ఉండవచ్చని యాపిల్ వివరించింది. ఈ నోటిఫికేషన్ల జారీకి గల కారణాలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ నిరాకరించింది. ఎందుకంటే పూర్తి వివరాలు వెల్లడిస్తే భవిష్యత్తులో దాడిచేసే వారిని గుర్తించకుండా తప్పించుకోవడానికి సహాయపడినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది. -
బోయింగ్ 777లో సౌకర్యాలు మెరుగుపరిచిన ఎయిర్ ఇండియా
టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానాల్లోని సౌకర్యాలను మెరుగుపరించింది. ఈ విమానాల ద్వారా అమెరికాలోని మూడు స్థానాలకు నేరుగా చేరుకునేలా నాన్స్టాప్ సేవలు అందిస్తుంది. ముంబై నుంచి న్యూయార్క్ జేఎఫ్కే విమానాశ్రయం, నెవార్క్ లిబర్టీ ఎయిర్పోర్ట్ (న్యూజెర్సీ), శాన్ ఫ్రాన్సిస్కోకు సర్వీసులు ఉన్నాయి. అయితే గతంలో ఆ విమానాల్లో కల్పిస్తున్న సేవలపై వినియోగదారులు అంతగా సంతృప్తికరంగా లేకపోవడంతో వాటిని మెరుగుపరిచారు. అందుకు సంబంధించిన వీడియోలు సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. Nice to see @airindia’s new 777s. (From Etihad apparently) Finally an international quality experience.They will use them for the US route which is a relief given how bad the old 777s are! pic.twitter.com/kVTsjzPxNq — vir sanghvi (@virsanghvi) October 30, 2023 -
వీచాట్, క్యాస్పర్స్కైపై నిషేధం.. కారణం ఇదే..
కెనడా ప్రభుత్వం చైనా మెసేజింగ్ అప్లికేషన్ వీచాట్ను, రష్యన్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ కాస్పర్స్కైను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీచాట్ యాప్ విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగించే యాప్స్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా దక్షిణాసియా వాసులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. వీచాట్ యాప్ నుంచి కీలకమైన డేటా లీక్ అవుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు లభించకపోయినప్పటికీ.. రిస్క్ను అంచనావేసి ముందు జాగ్రత్తగా ప్రభుత్వ పరికరాల నుంచి దీన్ని తొలగించాలని ఆదేశించినట్లు కెనడా ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలు అనితా ఆనంద్ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై వీచాట్ యజమాని అయిన టెన్సెంట్ సంస్థ స్పందించలేదు. మరోవైపు రష్యాకు చెందిన క్యాస్పర్స్కైపై కూడా చర్యలు తీసుకొంటున్నట్లు వెల్లడించారు. దాంతో కంపెనీ వర్గాలు మాట్లాడుతూ కెనడా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని, నిరాశను కలిగించిందని తెలిపాయి. ప్రభుత్వ ఆందోళనలను పరిష్కరించడానికి సంస్థకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ రెండు అప్లికేషన్లను డౌన్లోడ్ చేయకుండా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
వరుసగా బెదిరింపు ఈమెయిళ్లు.. అంబానీ భద్రత గురించి తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. గతంలో రూ.20 కోట్లు, రూ.200 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్తో మెయిళ్లు రాగా.. తాజాగా రూ.400 కోట్ల డిమాండ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులు ముఖేశ్ అంబానీపై ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆయనకు కల్పిస్తున్న భద్రత అలా ఉంది మరి! ప్రస్తుతం అంబానీకి జెడ్ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతేడాది నుంచే భద్రతను పెంచింది. గతంలో ముంబైలోని ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో బాంబు భయం తర్వాత పారిశ్రామిక వేత్తల భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. భద్రత ఎవరికంటే.. ప్రముఖులకు సంఘ విద్రోహశక్తుల నుంచి అపాయం ఉందని భావిస్తే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేస్తుంది. వీరిలో అత్యధిక ప్రజాదరణ కలిగి..వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని నిఘా సంస్థలు అందించే సమాచారం ఆధారంగా భద్రత అందిస్తారు. సంఘ విద్రోహశక్తుల నుంచి వీరిని కాపాడడం వారి విధి. నిఘా సంస్థ అందించే రిపోర్ట్ ఆధారంగా వివిధ రకాల భద్రతా కేటగిరీలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారికి కేటాయిస్తుంది. ప్రమాదాలను అంచనా వేసి భద్రతా వర్గాన్ని ఐదు గ్రూపులుగా విభజించింది. వాటిలో ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్పీజీ వర్గాలున్నాయి. భారత్లోని వీఐపీలు, వీవీఐపీలు, ఇతర ఉన్నత స్థాయి లేదా రాజకీయ ప్రముఖులకు ఈ రకమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. అయితే గతేడాది నుంచి ముకేశ్ అంబానీకి జెడ్ప్లస్ కేటగిరీ భద్రత అందిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత అంటే.. రక్షణలో ఎస్పీజీ తర్వాత జెడ్ ప్లస్ భద్రత అనేది రెండో అత్యధిక స్థాయి భద్రతా. ఇందులో భాగంగా 10+ ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసు అధికారులతో కలుపుకుని 55మంది సిబ్బంది వీరికి రక్షణగా ఉంటారు. వీరంతా మార్షల్ ఆర్ట్స్, పోరాట శిక్షణలో నైపుణ్యం పొందినవారు. ఈ కేటగిరీలో భాగంగా 5+ బులెట్ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. దేశంలో ఇప్పటివరకు కేవలం 43 ప్రముఖులకు మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు. భద్రత సిబ్బంది వేతనాలు, ప్రయాణ భత్యాలు, వాహనాలు వంటి ఖర్చులను సందర్భాన్ని బట్టి వివిధ ఏజెన్సీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రత పొందే వ్యక్తులు, సంస్థలు భరిస్తాయి. ఎస్పీజీ మాత్రం దేశ ప్రధానికి భద్రత కల్పిస్తుంది. -
ఈసారి రూ.400 కోట్లు డిమాండ్..అంబానీకి వరుసగా మూడో బెదిరింపు ఈమెయిల్
ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్ వస్తున్నాయి. గతంలో రూ.20కోట్లు, రూ.200కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈమెయిల్ ఇచ్చాయి. ఈసారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. నాలుగు రోజుల్లో అంబానీకి పంపిన మూడో బెదిరింపు ఈమెయిల్ ఇదని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు అక్టోబర్ 27న ఓ వ్యక్తి రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ ఈమెయిల్ రావడంతో అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జీ చేసిన ఫిర్యాదు ఆధారంగా గామ్దేవి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అక్టోబర్ 28న రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో ఈమెయిల్ వచ్చింది. తాజాగా కంపెనీకి సోమవారం మూడో ఈమెయిల్ వచ్చినట్లు అధికారి తెలిపారు. ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచి, సైబర్ బ్రాంచి బృందాలు ఈమెయిల్ పంపిన వారిని కనుగొనే పనిలో ఉన్నాయని ఆయన అన్నారు. అంబానీ, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు గాను గతేడాది బిహార్లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్ను పేల్చివేస్తామని నిందితులు గతంలో బెదిరించారు. -
గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్న నీతాఅంబానీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ 2023 సంవత్సరానికి గాను దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్-ఇండియా ఎస్పీఎఫ్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్పర్సన్ నీతా అంబానీ మహిళాసాధికారత, పిల్లల విద్య, భారతీయ కళలు, క్రీడలను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూఎస్ఐఎస్పీఎఫ్ పేర్కొంది. అవార్డు తీసుకున్న సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ..రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు 7 కోట్ల ప్రజలకు సేవ చేశామన్నారు. సీఎస్ఆర్ ప్రవేశపెట్టక ముందే రిలయన్స్ సొంతంగా ‘కార్పొరేట్ మోరల్ రెస్పాన్స్బిలిటీ’ ద్వారా సేవలందించినట్లు చెప్పారు. దేశ ప్రయోజనం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. భారత్, యూఎస్ మధ్య బంధాలను మరింతగా పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తున్న యూఎస్ఐఎస్పీఎఫ్కు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. USISPF was proud to honor Mrs. Nita M Ambani, Founder and Chairperson at @ril_foundation with the 2023 Global Leadership Award for Philanthropy and Corporate Social Responsibility. Mrs. Ambani is noted for her work in women's empowerment, education, promoting Indian arts & sports pic.twitter.com/rBuVQgvM97 — US-India Strategic Partnership Forum (@USISPForum) October 29, 2023 -
ఇకపై ‘కాలీ పీలీ’ ట్యాక్సీలు ఖాళీ!
ముంబైలో పదిహేనేళ్లు పైబడిన ట్యాక్సీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ నలుపు-పసుపు రంగుతో కూడిన ఐకానిక్ టాక్సీ(కాలీ పీలీ) ఇకపై రోడ్లపై కనిపించదనే వార్తలు వచ్చినప్పటి నుంచి ప్రజలతోపాటు ప్రముఖులు ఆ ట్యాక్సీతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోమవారం ముంబైలోని ఐకానిక్ టాక్సీలకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర శబ్దం చేస్తూ రోడ్లపై వెళ్లేవారికి అసౌకర్యంగా ఉన్నప్పటికీ, అవి చాలా మందికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చాయని గుర్తుచేశారు. ‘నేటి నుంచి ఐకానిక్ ప్రీమియర్ పద్మిని టాక్సీ ముంబై రోడ్ల నుంచి అదృశ్యమవుతుంది. అవి చేసే శబ్దం అసౌకర్యంగా ఉన్నా, ఎక్కువ మంది ప్రయాణించే వెసులుబాటు లేకపోయినా ప్రజలకు అవి టన్నుల కొద్దీ జ్ఞాపకాలను మిగిల్చాయి. ఇక ఈ కాలీ-పీలీ టాక్సీలకు సెలవు’అని తన ‘ఎక్స్(ట్విటర్)’ ఖాతాలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు) పబ్లిక్ ట్రాన్స్పోర్టర్ బృహన్ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) సంస్థ నుంచి డీజిల్తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను అధికారులు తొలగించినట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రసిద్ధ ప్రీమియర్ పద్మిని మోడల్ కార్లును సైతం ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 15 ఏళ్లు ముగిసిన డబుల్డెక్కర్ బస్సులను రద్దు చేశారు. అయితే ఫియట్ కంపెనీ తయారుచేసిన ఈ ప్రీమియర్ పద్మిని కార్లును ముంబయిలో ఎక్కువగా ట్యాక్సీలుగా వాడుతున్నారు. ఇవి నలుపు పసుపు రంగులో ఉండడంతో వాటికి కాలీపీలీ ట్యాక్సీలుగా పేరు వచ్చింది. ఈ ట్యాక్సీలకు కేటాయించిన రన్నింగ్ పీరియడ్ 20 సంవత్సరాలు. అక్టోబర్ 29, 2023తో ఆ సమయం ముగిసింది. From today, the iconic Premier Padmini Taxi vanishes from Mumbai’s roads. They were clunkers, uncomfortable, unreliable, noisy. Not much baggage capacity either. But for people of my vintage, they carried tons of memories. And they did their job of getting us from point A to… pic.twitter.com/weF33dMQQc — anand mahindra (@anandmahindra) October 30, 2023 -
దిగ్గజ ఎఫ్ఎమ్ సంస్థను కొనుగోలు చేయనున్న కంపెనీలు ఇవేనా..
ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఇండియా లిమిటెడ్ (ఈఎన్ఐఎల్)లో భాగంగా ఉన్న రేడియో మిర్చితో పాటు రేడియో ఆరెంజ్... బిగ్ ఎఫ్ఎమ్ రేడియో నెట్వర్క్ను కొనుగోలు చేసేందుకు రూ.251 కోట్ల చొప్పున బిడ్ వేశాయని సమాచారం. దివాలా ప్రక్రియలో ఉన్న బిగ్ ఎఫ్ఎమ్ రేసులో హర్యానాకు చెందిన సఫైర్ ఎఫ్ఎమ్ కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సఫైర్ ఎఫ్ఎమ్ కూడా బిగ్ ఎఫ్ఎమ్ కోసం రూ.251 కోట్ల రూపాయల బిడ్ వేసింది. రేడియో మిర్చి, ఆరెంజ్ ఎఫ్ఎమ్ , సఫైర్ ఎఫ్ఎమ్ల బిడ్ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తామని ప్రకటించాయి. తమ బిడ్ల విలువను మరింత పెంచాలని లెండర్లు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కంపెనీ ఖాతాల్లో ఉన్న రూ.60 కోట్ల నగదు కూడా లెండర్లకే వెళ్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బిగ్ ఎఫ్ఎం ఖాతాల్లోని నగదును లెక్కలోకి తీసుకున్న తర్వాత, లెండర్లకు ఇంకా రూ. 578 కోట్లు రావాలి. ఇది దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్. 1,200 పట్టణాలకు, 50 వేలకుపైగా గ్రామాలకు ప్రసారాలను అందిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు దివాలా ప్రక్రియకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇంకా బిగ్ఎఫ్ఎమ్ సంస్థ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. -
వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్..
ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈ అభిప్రాయంపై ఏకీభవిస్తే, మరికొందరు వ్యతిరేకించారు. టైమ్ యూస్ సర్వే (Time Use Survey) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో వారానికి సరాసరి 61.6 గంటలు పనిచేస్తున్నట్లు తెలిసింది. వారానికి 65.4 గంటలు పనిచేస్తూ తెలంగాణ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! తక్కువ పని గంటలున్న రాష్ట్రాల్లో మణిపూర్ (46.9 గంటలు), నాగాలాండ్ (46.8 గంటలు) ఉన్నాయి. అండమాన్ & నికోబార్ దీవుల్లో కూడా వారానికి 58.7 గంటలు పనిచేస్తున్నట్లు ఈ జాబితాలో చూడవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ యువకులు చేసినట్లు భారతీయలు ఎక్కువ గంటలు పనిచేస్తే తప్పకుండా ఇండియా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని వెల్లడించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- IPL 2024: ప్లే ఆఫ్స్ ఛాన్స్లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే..
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement