-
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సగటు సీనీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా సంచలనాలను క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నాగ్ అశ్విన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు.అలాగే ఈ మూవీలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు . ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపఠాని లాంటి స్టార్స్ను ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో మరో స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా కనిపించబోతున్నాడట. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ మహేశ్ బాబును సంప్రదించారట. అయితే ఇందులో మహేశ్ కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేశ్ని రంగంలోకి దించబోతున్నాడట నాగ్ అశ్విన్. ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలోనూ మహేశ్ పలువురు స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్షా’, చిరంజీవి ‘ఆచార్య’సినిమాలకు మహేశ్ తన గాత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ కోసం మళ్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
ప్రభాస్ కల్కి.. ఆ పోస్టర్ కూడా కాపీనేనా?
యంగ్ రెబల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్లో డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకొణె నిలబడి ఉండగా.. ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న ఈ పోస్టర్ వైరల్గా మారింది.అయితే తాజా పోస్టర్ చూసిన నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. అచ్చం హాలీవుడ్ మూవీ డూన్ను పోలి ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ సినిమా నుంచే కాపీ కొట్టారా? సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా పోస్టర్పై వస్తున్న విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. అలాంటిదేం లేదంటూ ఆయన కొట్టిపారేశారు. ఈ పోస్టర్లో ఇసుక కనిపిస్తున్న కారణంగా అలా పోల్చడం సరైంది కాదని అన్నారు. కేవలం ఇసుక ఉండటం వల్ల సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు భావించొద్దని ఆయన సూచించారు.కాగా.. కల్కి 2898 ఏడీ మహాభారతంతో ముడిపడి ఉంటుందని గతంలోనే నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ సినిమా మహాభారతంలో మొదలై 2898 ఏడీలో ముగుస్తుందని తెలిపారు. గతంలోనూ కాన్సెప్ట్, మేకింగ్, క్రాప్ట్ , విజువలైజేషన్ సైతం హాలీవుడ్ సినిమాలను పోలి ఉన్నాయంటూ విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. All the forces come together for a better tomorrow on 𝟐𝟕-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/kItIJXvbto— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2024 -
శక్తులన్నీ ఏకమయ్యాయి
థియేటర్స్లో ‘కల్కి’ రాక ఖరారైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ ఈ ఏడాది జూన్ 27న విడుదల కానుంది. ‘‘మెరుగైన భవిష్యత్ కోసం అన్ని శక్తులు ఏకమయ్యాయి’’ అనే క్యాప్షన్తో ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ డేట్ పోస్టర్ను శనివారం విడుదల చేశారు మేకర్స్.మహాభారతం కాలంలో ఆరంభమై 2898 ఏడీలో ఈ సినిమా ముగుస్తుందనీ, ఆరువేల ఏళ్ల కాలమానంలో ఈ కథ సాగుతుందనీ సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్. -
'కల్కి' కొత్త రిలీజ్ డేట్..? ప్రభాస్ ఫ్యాన్స్కు శుభవార్త
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్రి యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. కానీ పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. ఆ సమయంలో ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో కల్కి తెరకెక్కుతున్న సినిమా కావడం.. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండటంతో దాదాపు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం. కల్కి వాయిదా పడుతుందని భారీగానే వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంతమేరకు నిరాశచెందుతున్నారు. ఇంతలో వారికి ఒక శుభవార్త నెట్టింట వైరల్ అవుతుంది. మే 9న విడుదల కావాల్సిన కల్కి.. మే 30న విడుదల కానున్నట్లు నెట్టింట ఓ వార్త ట్రెండ్ అవుతుంది. ఈమేరకు చిత్ర యూనిట్ కూడా త్వరలో అధికారకంగా ప్రకటన కూడా చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్లో కనిపించే ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ల పాత్రలకు సంబంధించిన పూర్వాపరాలను, ఆ పాత్రల తీరు తెన్నులను చెబుతూ ఓ యానిమేటేడ్ వీడియోను రెడీ చేస్తున్నారట. అది డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేయున్నారట. అదే సమయంలో కల్కి విడుదల తేదీని కూడా ఫైనల్ చేస్తారట. ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
కల్కి ప్రాజెక్ట్లో టాలీవుడ్ సీనియర్ నటుడు.. ప్రభాస్తో తొలి సినిమా
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా టాలీవుడ్కు చెందిన ఓ సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్లో ఇప్పటికే టాప్ నటీనటులు భాగమయ్యారు. కల్కిలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయనే ఓ కార్యక్రమంలో ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి టాప్ యాక్టర్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చుంటారనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో పరకాయప్రవేశం చేయగల సత్తా ఆయనలో ఉంది. అలాంటి నటుడ్ని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటారో తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రభాస్తో కూడా రాజేంద్ర ప్రసాద్ తొలిసారి నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపకా పదుకొణె, దిశా పటానీ, గౌరవ్ చోప్రా వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
కల్కి 6 వేల సంవత్సరాల కథ: హను రాఘవపూడి
-
అందుకే ఆ టైటిల్!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్ని తొలుత ప్రాజెక్ట్ కె’ అని నిర్ణయించారు. ఆ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’గా మార్చారు. కొత్త టైటిల్పై ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ ఎందుకు పెట్టామనే విషయాన్ని వెల్లడించారు. ‘‘నేను మహాభారతం గురించి వింటూ, స్టార్ వార్స్ని చూస్తూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ ఆలోచన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టాం. ఈ మూవీలో ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని సృష్టించాం. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. గతంలో హాలీవుడ్లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘బ్లేడ్ రన్నర్’ మూవీ పోలికలు ‘కల్కి 2898 ఏడీ’లో ఎక్కడా కనిపించవు. ఓ రకంగా ఇది నాకు సవాల్’’ అన్నారు. సి. అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మే 9న విడుదల కానుంది. -
'కల్కి 2898' టైటిల్ సీక్రెట్ ఇదే: నాగ్ అశ్విన్
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి నిత్యం ఏదొ ఒక వైరల్ న్యూస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్లో పాల్గొన్నాడు. అక్కడ కల్కి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అశ్విన్ పంచుకున్నాడు. మహాభారతం, స్టార్ వార్స్... రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టిందని నాగ్ అశ్విన్ అన్నారు. ఈ సినిమా కూడా మహాభారతం కాలం నుంచి మొదలయి 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టడం జరిగింది. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ కూడా ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం.' అని తెలిపారు. ఈ ఏడాది సమ్మర్లో మే 9న ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 విడుదల కానుంది. -
ఇట్స్ రొమాంటిక్ టైమ్!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘ కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, అన్నాబెన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ మూవీకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో ్రపారంభమైంది. ఈ షెడ్యూల్లో సినిమాలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్, దిశాపటానీ కాంబి నేషన్లో ఓ రొమాంటిక్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట దర్శకుడు నాగ్అశ్విన్. ఈ సాంగ్ పూర్తయిన తర్వాత కొంత టాకీ పార్టు, ఓ యాక్షన్ సీక్వెన్స్ను కూడా ప్లాన్ చేశారట. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. -
చివరి ఘట్టానికి చేరుకున్న ప్రభాస్ 'కల్కి'
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైంటిఫిక్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోలు నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మేజర్ షెడ్యూల్ ఈ నెల రెండో వారంలో చిత్రీకరించేలా ప్లాన్ చేశారట నాగ్ అశ్విన్. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె.. ఇలా ఈ సినిమా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. ఈ షెడ్యూల్తో ఈ సినిమా ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న విడుదల కానుంది. -
Kalki 2898 AD Update: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్
సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్. 'కల్కి 2989 ఏడీ' విడుదలపై క్లారిటీ వచ్చేసింది. గతేడాది సలార్తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ ఈ ఏడాది కూడా దూకుడు పెంచనున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న మన డార్లింగ్ కల్కి చిత్రంతో పాన్ వరల్డ్కు రీచ్ కావడం దాదాపు ఖాయం అని చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న కల్కి చిత్రాన్ని మే 9న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కల్కి రిలీజ్ డేట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి కానుకగా కల్కి టీజర్ను కూడా విడుదల చేసి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. సుమారు 83 సెకన్ల పాటు టీజర్ను కట్ చేశారని సమాచారం. వైజయంతి బ్యానర్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మే 9 అంటే వైజయంతి మూవీస్కు మంచి సెంట్మెంట్ ఉంది. అదేరోజు అంటే 9 మే 1990లో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం వచ్చింది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్గా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ను వైజయంతి మూవీస్ ఫాలో అతుంది. Raiders Arrived into AAA Cinemas, Hyderabad... Our God KALKI is coming to save the world #Kalki2898AD #Prabhas pic.twitter.com/uUQWmfe9iK — ivd Prabhas (@ivdsai) January 12, 2024 -
Cinematic Expo 2023 : సినిమాటిక్ ఎక్స్ పో ప్రారంభించిన హీరో నాగార్జున (ఫొటోలు)
-
ప్రభాస్ కల్కిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్.. ఇప్పటికే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఇన్ని రోజులు ప్రాజెక్ట్-కె పేరుతో నిర్మించిన ఈ మూవీ టైటిల్ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే బాలీవుడ్, కోలీవుడ్ నుంచి అగ్రతారలు సైతం ఈ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ నటించినున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారనేది లేటెస్ట్ టాక్. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: అమ్మాయిగా మారేందుకు సర్జరీ చేయించుకున్న జబర్దస్త్ సాయి?) ప్రభాస్ కల్కి చిత్రంలో టాలీవుడ్ డైరెక్టర్స్ రాంగోపాల్ వర్మ గెస్ట్ రోల్ పోషిస్తున్నరంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి సైతం నటిస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా ఆర్జీవీ పేరు తెరపైకి రావడం మరింత ఆసక్తిగా మారింది. అంతే కాకుండా ఇప్పటికే వీరిద్దరు తమ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరీ దీనిపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఏదేమైనా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో వైరలవుతోంది. కాగా.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపిక పదుకొణె నటిస్తోంది. (ఇది చదవండి: 'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!) #Prabhas & RGV Will be Seen Together in #Kalki2898AD . RGV Has Completed his Shooting Part in @Kalki2898AD pic.twitter.com/ujUlw9OqdP — Team PraBOSS (@Team_PraBoss) September 6, 2023 Rgv & Prabhas will be seen together in #ProjectK https://t.co/suP5MxM1Bj pic.twitter.com/PX7SZIKB4Q — Freaking REBELS (@FreakingRebels) September 6, 2023 -
కల్కికి అతిథిగా...
దర్శకుడిగా ఎక్కువగా కెమెరా వెనకాల ఉండే రాజమౌళి అప్పుడప్పుడూ నటుడిగా కెమెరా ముందుకు వస్తుంటారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘సై’, ‘మగదీర’, ‘బాహుబలి: ది బిగినింగ్’ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో సిల్వర్ స్క్రీన్పై కనిపించారు రాజమౌళి. ఇతర దర్శకుల చిత్రాలైన ‘రెయిన్ బో’, ‘మజు్న’ల్లో అతిథి పాత్రల్లో కనిపించారు. తాజాగా ‘కల్కి 2898ఏడీ’ చిత్రంలో అతిథిగా కనిపించేందుకు రాజమౌళి అంగీకరించారని సమాచారం. ప్రభాస్ హీరోగా నాగ్ అశి్వన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. నేడు ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ ఒక్క రోజుతో రాజమౌళి పాత్ర చిత్రీకరణ పూర్తవుతుందని భోగట్టా. ఇక దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898' షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్కు జంటగా దీపిక పదుకొణె నటిస్తుండగా విలన్ పాత్రలో కమల్హాసన్ కనిపించనున్నారు. ఒక కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్లో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ 'కల్కి' గ్లింప్స్ను మేకర్స్ గ్రాండ్గా విడుదల చేశారు. అందుకు రెస్పాన్స్ కూడా అదిరిపోయే రేంజ్లో వచ్చింది. హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ ఉన్నాయని చాలామంది కామెంట్లు కూడా చేశారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసుపై వరలక్ష్మీ శరత్కుమార్ వివరణ.. ఆదిలింగం ఎవరంటే?) ఈ గ్లింప్స్పై రాజమౌళి కూడా 'కల్కి' టీమ్పై ప్రశంసలు కురిపించారు. గ్రేట్ జాబ్ అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ని ఆయన కొనియాడారు. ఇలాంటి సినిమాలు తీయడం పెద్ద టాస్క్. అయినా మీరు సాధించగలిగారని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగ ఈ సినిమాపై సెన్సేషనల్ విషయం ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమాలోకి దిగ్గజ దర్శకుడు రాజమౌళి అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమల్హాసన్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు అశ్వినిదత్ కూడా ఈ మధ్యే చెప్పాడు. దీంతో రాజమౌళి కూడా ఇప్పటికే కల్కి ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాడని సమాచారం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరిన జక్కన్న నాగ్ అశ్విన్కు తోడుగా షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ విషయం సోషల్మీడియాలో ప్రచారం అవుతుండటంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్కు వెళ్లడం ఖాయం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అలాంటిదేమి లేదు జక్కన్న కల్కీ ప్రాజెక్ట్లో ఉన్నాడు కానీ డైరెక్షన్ టీమ్లో కాదు అంటున్నారు. కల్కీ సినిమాలో ఆయన కామియో రోల్ పోసిస్తున్నట్లు మరికొందరు తెలుపుతున్నారు. (ఇదీ చదవండి: మోసం చేశారు.. అలా నన్నుచూసి మా అమ్మ ఏడ్చింది: టాప్ హీరోయిన్) అంటే 'జైలర్' సినిమాలో శివరాజ్ కుమార్,మోహన్లాల్ లాంటి పాత్రలలో ఆయన కనిపించనున్నారని కూడా టాక్ నడుస్తోంది. ముందుగా 2024 సంక్రాతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ 2024 మే 9న విడుదల చేయాలని చిత్ర టీమ్ భావిస్తున్నట్లు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అఫిషియల్గా కల్కీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. -
'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త.. దానికి భయపడి!
జీవితంలో రెండో ఛాన్స్ ఉంటుందేమో గానీ సినిమాల్లో ఉండదు. అందుకే తీస్తున్నప్పుడు సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మధ్య అలా 'ఆదిపురుష్' విషయంలో జరిగింది. దర్శకుడు ఓం రౌత్ని అయితే ప్రతి ఒక్కరూ ట్రోల్ చేశారు. బండబూతులు తిట్టారు. దీంతో ప్రభాస్ 'కల్కి' జాగ్రత్త పడింది. అలా జరగకూడదని ముందే డిసైడ్ అయి ఓ పని చేసింది. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కల్కి 2898 AD'. ప్రాజెక్ట్ k అనే వర్కింగ్ టైటిల్తో మొన్నటివరకు నడిపించారు. కొన్నిరోజుల ముందు అమెరికాలో జరిగిన కామికాన్ ఫెస్ట్లో టైటిల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్పై బోలెడన్ని విమర్శలు రాగా, గ్లింప్స్ మాత్రం బాగానే అనిపించింది. ఇప్పుడు వీటన్నింటిపై వచ్చిన రివ్యూలని చిత్రబృందం పరిశీలిస్తోంది. (ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?) ఇందులో భాగంగా గ్లింప్స్ వీడియోలో గ్రాఫిక్స్పై ఎలాంటి రివ్యూలు వచ్చాయనేది దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఆ ఫొటోని నిర్మాత ప్రియాంక దత్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. వీటిని బట్టి ముందు ముందు గ్రాఫిక్స్ ఎలా ఉండనేది జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం వల్ల 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్కి కౌంటర్లు పడుతున్నాయి. అదేంటి 'కల్కి' గ్లింప్స్ గ్రాఫిక్స్ రివ్యూలని చిత్రబృందం పరిశీలిస్తే.. ఓం రౌత్ని ఎందుకు తిడుతున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది సెప్టెంబరులో 'ఆదిపురుష్' టీజర్ విడుదల చేయగానే ప్రతి ఒక్కరూ దర్శకుడిని విమర్శించారు. గ్రాఫిక్స్ సరిచేసేందుకు మరో ఆరు నెలలు సమయం తీసుకున్నప్పటికీ పెద్దగా మార్పులేం చేయలేకపోయాడు. దీంతో సినిమా రిలీజైన తర్వాత ఆ తిట్లు తప్పలేదు. ఇలా తమ మూవీ విషయంలో తప్పు జరగకుండా 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త తీసుకోవడం మంచి పనే. (ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!) -
ప్రభాస్ 'కల్కి' వాయిదా?.. అదే ప్రధాన కారణమా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. ఇటీవలే ఈ చిత్రానికి టైటిల్ రివీల్ చేసిన చిత్రబృందం.. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా వచ్చిన గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని ఆశించిన అభిమానులకు చిత్రబృందం పెద్ద షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని అభిమానులు భావించగా.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దర్శకధీరుడు రాజమౌళి సైతం ట్వీట్ చేస్తూ రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే?) ఈ నేపథ్యంలో కల్కికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. రిలీజ్ ప్రకటించకపోవడంతో వాయిదా పడనుందనే వార్తలు వినిపించాయి. మరోవైపు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని.. మొదటి పార్ట్ను మే 9న విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ సెంటిమెంట్ కోసమేనా? అయితే మరీ ముఖ్యంగా మే 9వ తేదీ అశ్వనీదత్కు చాలా సెంటిమెంట్ అని సమాచారం. గతంలో మే9న విడుదలైన మహానటి మళ్లీ బ్లాక్ బస్టర్ అందించింది.. చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా అదే రోజు రిలీజై వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాకు సైతం ఆయన ఇదే సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారని భావిస్తున్నారు. దీంతో ఈ సినిమా వాయిదా వేయడమే మంచిదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ కమల్హాసన్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: కలెక్షన్స్లో 'బేబీ' ఆల్టైమ్ రికార్డ్!) -
'అదొక్కటే మిగిలి ఉంది'.. కల్కిపై రాజమౌళి ఆసక్తికర ట్వీట్!
యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ దీపికా పదుకొణె నటించిన 'కల్కి 2898 AD'. ఈ మూవీకి సంబంధించి ఇవాళ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. శాన్ డియాగోలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్కి హాజరైన చిత్రబృందం.. ఈ మూవీ టైటిల్ను 'కల్కి 2898 AD' గా ఖరారు చేసింది. టైటిల్తో పాటు హాలీవుడ్ను తలపించేలా గ్లింప్స్ వీడియోను గ్రాండ్గా రిలీజ్ చేసింది. ఇది చూసి ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయిపోతున్నారు. తాజాగా ప్రాజెక్ట్-కె గ్లింప్స్పై దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర ట్వీట్ చేశారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్పై అత్యాచారయత్నం!) రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ.. ' గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. భవిష్యత్పై సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టమైన పని. కానీ మీరు ఆ సాహసం చేశారు. అంతే కాదు సాధ్యం చేసి చూపించారు. ఇందులో డార్లింగ్ లుక్ అదిరిపోయింది. ఇక ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది. అదే రిలీజ్ డేట్.' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. 'కల్కి' చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. (ఇది చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్) Great job Nagi and Vyjayanthi movies. Creating an authentic futuristic movie is such a difficult task and you guys made it possible..👏🏻👏🏻 Darling looks smashing.. Only one question remains... Release date...🥰 #Kalki2898AD https://t.co/kKefpCvovr — rajamouli ss (@ssrajamouli) July 21, 2023 -
ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్
డార్లింగ్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. శాన్ డియాగోలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్కి హాజరైన చిత్రబృందం.. 'కల్కి 2898 AD' అనే పేరుని టైటిల్గా ఫిక్స్ చేసింది. గ్లింప్స్ వీడియోని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేసింది. ఇది చూసి ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయిపోతున్నారు. అలానే వీడియోలో కమల్ హాసన్ ఎక్కడా అని తెగ వెతికేస్తున్నారు. 'కల్కి' చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటిస్తున్నారని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కొన్ని రోజుల ముందు.. కమల్ హాసన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు బయటపెట్టారు. ఇందులో ఆయన విలన్ లేదా మరేదైనా పాత్ర చేస్తున్నారా అని అందరూ అనుకున్నారు. కామికాన్ ఈవెంట్కి హాజరైన కమల్.. సినిమాలో తన రోల్పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్లో కమల్హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) 'ఓ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. విలన్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ సినిమాలో నేను విలన్గా కనిపించబోతున్నాను. ప్రతినాయకుడు పాత్ర కాబట్టే దీన్ని అంగీకరించాను. అలానే ఓ చిత్రానికి ప్రేక్షకులు ఎంతో ముఖ్యం. మా లాంటి యాక్టర్స్ని స్టార్స్ చేసేది వాళ్లే' అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. అయితే 'కల్కి' సినిమాలో విలన్గా చేసేందుకు కమల్ హాసన్ ఒప్పుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. 'విక్రమ్' లాంటి బ్లాక్బస్టర్తో మళ్లీ సక్సెస్ ట్రాక్పై వచ్చిన కమల్.. 'కల్కి'లో నటించడం వెనక అలనాటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు హస్తం ఉందని తెలుస్తోంది. 'కల్కి'కి మెంటార్గా ఉన్న ఆయనే.. కమల్తో మాట్లాడి ఒప్పించారని టాక్. సరే ఇదంతా పక్కనబెడితే ప్రభాస్-కమల్ మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయా అని అందరూ వెయిటింగ్. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్సయ్యిందా?) -
ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్లో కమల్హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?
Kamal Haasan In Kalki Glimpse: డార్లింగ్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. 'కల్కి 2989 AD' అనే టైటిల్ని ఫిక్స్ చేస్తూ, గ్లింప్స్ వీడియోని అర్థరాత్రి ఒంటి గంటకు విడుదల చేశారు. సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇందులో చూపించారు. గ్లింప్స్ కాబట్టి పెద్దగా స్టోరీని ఏంటనేది రివీల్ చేయలేదు. కేవలం ప్రధాన పాత్రల్ని మాత్రమే చూపించారు. అయితే ఈ గ్లింప్స్లో కమల్హాసన్ ఎక్కడా కనిపించలేదు. ట్విస్ట్ బయటపెట్టిన నాగీ శాన్ డియాగోలో జరిగిన కామికాన్ ఈవెంట్లో ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్ని విడుదల చేశారు. చిత్రబృందంతోపాటు రానా అక్కడికి వెళ్లాడు. ఇతడే మొత్తం 'కల్కి' టీమ్ని స్టేజీపై పిలిచి అందరికీ పరిచయం చేశాడు. అయితే మాటల్లో భాగంగా.. 'గ్లింప్స్లో అందరూ ఉన్నారు కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు ఏంటి?' అని రానా అడిగాడు. దీనికి బదులిచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. 'గ్లింప్స్ మొత్తంలో ఆయన ఉన్నారు. కానీ మీకు తెలియదు' అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ప్రేక్షకుల బుర్ర తిరిగిపోయింది. (ఇదీ చదవండి: ఆ టాలీవుడ్ హీరోతో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్) కమల్ ఎక్కడ? ఎందుకంటే గ్లింప్స్ చూస్తే ప్రభాస్ కల్కిగా కనిపించబోతున్నాడని అర్థమైంది. ఈ కథంతా 2989 సంవత్సరంలో జరగబోతుందని క్లారిటీ వచ్చింది. అశ్వత్థామ పాత్రని అమితాబ్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ గ్యాంగ్ బంధించిన వాళ్లలో దీపిక పదుకొణె ఉన్నట్లు అనిపిస్తుంది. మిగతా పాత్రలు కూడా చూపించారు. అయితే 75 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు. కమల్ది ఆ పాత్రేనా? అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ ప్రకారం.. 'కల్కి' మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఇందులో హీరో ఒకరు విలన్ ఒకరు అని అంటున్నారు. ఆ విలన్ కమల్ హాసన్ అని, కాకపోతే ప్రభాస్ రూపంలో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. టీజర్ మొత్తంలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మనకు ఎవరెవరనేది తెలియకపోవచ్చు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. నిజమెంత అనేది 'కల్కి' థియేటర్లలోకి వస్తే గానీ తెలియదు. (ఇదీ చదవండి: ప్రాజెక్ట్- కె.. తన క్యారెక్టర్పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్!) -
ప్రాజెక్ట్- కె.. తన క్యారెక్టర్పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్లో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి వరుస అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్,గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) ఈ భారీ బడ్జెట్ టైమ్ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్ను ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్ ఖరారు చేశారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తిలా కల్కి ఉద్భవిస్తుందని మన పురాణాల్లో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు హాజరైన హీరో ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి స్థానికి మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్పై ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఇది ఒక సూపర్ హీరో సినిమా. ఇందులో అతి ముఖ్యమైన అంశం కామెడీ. నాగ్ అశ్విన్ ఈ స్టోరీని డిజైన్ చేసిన విధానం నాకు నచ్చింది. నా క్యారెక్టర్ను అలా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్లో ఫన్నీ క్యారెక్టర్ నాదే అనుకుంటా. ఈ చిత్రంలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా నాగ్ చూపించాడు. ఐ యామ్ ది కమెడియన్ ఇన్ దిస్ మూవీ. అంటూ' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: ఆ టాలీవుడ్ హీరోతో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్) Prabhas on his character bringing the humor in #Kalki2898 AD #SDCC 2023 pic.twitter.com/tAqpF1iOT6 — Deadline Hollywood (@DEADLINE) July 21, 2023 -
ప్రభాస్ ప్రాజెక్ట్ K ( కల్కి 2898 AD) ఫస్ట్ గ్లింప్స్ విజువల్స్ ట్రీట్ (ఫొటోలు)
-
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ కే' ప్రమోషన్స్ జోష్ పెంచింది. ఇప్పటికే జులై 20న కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో ‘ప్రాజెక్ట్ కె’ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని లాంచ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (ఇదీ చదవండి: నయనతార ఆస్తుల వివరాలపై మళ్లీ చర్చ) తాజాగా 'ప్రాజెక్ట్ కే' అంటే ఏమిటి..? అని రాసి ఉన్న ఓ టీషర్ట్ని అందుబాటులో ఉంచారు. అయితే.. దీన్ని సొంతం చేసుకోవాలంటే మాత్రం అంత సులువు కాదు. డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ అలా ఉంటుంది. కాబట్టి టీ షర్ట్ కావాలనుకునే వారు చాలా వేగంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వైజయంతి ట్విటర్ అకౌంట్ నుంచి లింక్ను షేర్ చేశారు. దీనిని ఇప్పటికే ప్రాజెక్ట్ -కే టీమ్ కూడా ప్రమోట్ చేస్తుంది. (ఇదీ చదవండి: గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్) ఇలా బుక్ చేసుకోండి వారు షేర్ చేసిన లింక్ని క్లిక్ చేసి.. ఆపై ఓపెన్ అయిన విండో 'పసుపు రంగులో' ఉంటే కంటిన్యూ బటన్ని కానీ వైజయంతి మూవీస్ లోగోనైనా నొక్కాలి. దాన్ని నొక్కగానే.. మీ పేరుతో పాటు ఈమెయిల్ని పొందుపరచాలి. అంతే సింపుల్ మీకు కావాల్సిన సైజ్లో టీషర్ట్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా వస్తుంది. ఈ విధంగా ప్రాజెక్ట్ కే టీషర్ట్ని ఏవరైనా సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే మొదటి డ్రాప్ పేరుతో లింక్ విడుదల చేశారు. మరోసారి నేడు కూడా విడుదల చేయనున్నట్లు ట్విటర్లో సినిమా యూనిట్ తెలిపింది. Brace yourselves, First Drop 'The Force' is getting ready for dispatch. Get ready for the next drop. Stay Tuned🔗 https://t.co/0rC0ez8o2N#ProjectK #WhatisProjectK pic.twitter.com/4Ni9hT0YVJ — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 8, 2023 -
ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!
ప్రభాస్ అభిమానులు సలార్ టీజర్తో ఫుల్ జోష్లో ఉండగానే 'ప్రాజెక్ట్-కె' మేకర్స్ కడా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఇది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్,కమల్ హాసన్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే 'ప్రాజెక్ట్-కె' పోస్టర్స్ అదిరిపోయే విదంగా ఉన్నాయి. సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్తో పాటు గ్లింప్స్ను జులై 20న విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ నుంచి ఇదే విషయాన్ని అదికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో వచ్చిన 7:11 పీఎమ్ మూవీ రివ్యూ) అమెరికాలో జరిగే శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) వేడుకలో 'ప్రాజెక్ట్-కె' ఫస్ట్ గ్లింప్స్తో పాటు టైటిల్ను రివీల్ చేయడమే కాకుండా రిలీజ్ డేట్ను కూడా ప్రకటించనున్నారు. అమెరికాలో జూలై 19 నుంచి కామిక్- కాన్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాగా, జులై 20న ఈ వేడుకలకు ప్రభాస్, కమల్,అమితాబ్, దీపికా, నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొననున్నారు. ఆపై చిత్రానికి సంబంధించిన టైటిల్ను ఆ వేదిక మీద రివీల్ చేస్తారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు మా డార్లింగ్ క్రేజ్ వెళ్తోంది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: Rangabali Review In Telugu: 'రంగబలి' రివ్యూ) 𝐏𝐑𝐎𝐔𝐃 𝐌𝐎𝐌𝐄𝐍𝐓! San Diego @Comic_Con, here we come.#ProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/uodkNyPmSk — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 6, 2023 -
ప్రభాస్ 'ప్రాజెక్ట్- కె'.. ఆ విషయంలో ఆదిపురుష్ను దాటేయనుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకున్నప్పటికీ విమర్శల పాలైంది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. డైలాగ్స్, పాత్రలతో పాటు సీత ఇండియాలో జన్మించినట్లు చూపించడం వివాదాలకు కేరాఫ్గా నిలిచాయి. తొలి మూడు రోజులు వసూళ్లు సాధించినా ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఈ చిత్రం కోసం దాదాపుగా రూ.600 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. (ఇది చదవండి: టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో తెలుసా?) ఇక ప్రభాస్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్-కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. అంతేకాకుండా సీతారామం స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇంతటి భారీ తారగణంతో రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ చిత్రంలోని నటీనటులు రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. భారీస్థాయిలో గ్రాఫిక్స్ ఉండనుండడంతో ఈ మూవీ బడ్జెట్ రూ. 600 కోట్లకు పైగానే ఉండనుందని టాక్ వినిపిస్తోంది. అదే గనుక నిజమైతే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రాజెక్ట్-కె నిలవనుంది. ప్రాజెక్ట్-కె రెమ్యూనరేషన్స్ ప్రాజెక్ట్- కె కోసం ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ఎంత తీసుకుంటున్నారనే దానిపై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ప్రభాస్ ఈ చిత్రం కోసం రూ.150 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కమల్ హాసన్ ఈ చిత్రంలో కేవలం అతిథి పాత్రకే రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె ఈ చిత్రానికి రూ. 10 కోట్లు వసూలు చేస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీతో కలిపి ఇతరులకు మరో రూ.20 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. దీంతో కేవలం ప్రాజెక్-కె రెమ్యూనరేషన్ కోసమే దాదాపు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం.వైజయంతీ మూవీస్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2024న విడుదల కానుంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. (ఇది చదవండి: ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement