-
Tamannaah Bhatia: బార్బీ బొమ్మలా మెరిసిపోతున్న తమన్నా!
-
దిమ్మతిరిగే ఫొటోస్ వదిలిన హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
రష్మిక స్టయిలిష్ లుక్..ఎవరికోసం అంత ప్రేమ?
సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన యానిమల్ సక్సెస్ జోష్లో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ స్టైలింగ్లో కూడా తన ఫ్యాన్స్ను ఫిదా చేస్తుంది. సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ మూమెంట్స్, స్టయిలిష్ పిక్స్తో ఎపుడూ యాక్టివ్గా ఉండే రష్మిక తాజాగా లవ్లీ ఫోటోలతో సందడి చేస్తోంది. తనదైన స్టయిల్లో, నార్మల్ లుక్ దుస్తులతో రష్మిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్ ఓటీటీలో సందడి చేస్తోంది. ఇదే విషయాన్ని సూచిస్తూ ఆమె తన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఎవరికోసం అంత ప్రేమ అంటున్నారు. లైట్ బ్లూకలర్ ఫుల్-స్లీవ్ బ్లేజర్, స్ట్రెయిట్-ఫిట్ టైలర్డ్ ప్యాంట్తో చేసిన ఫోటో షూట్తో పాటు, చెవులకు ధరించిన వెండి ఇయర్కఫ్లు, లవ్ సింబల్స్ మరింత ఎట్రాక్టివ్గా మారాయి. అంతకుముందు, ముదురు ఎరుపు రంగు ప్యాంట్సూట్లోనూ, ఇటీవల రెడ్ చీరలోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) -
బేబీ బంప్తో అమలాపాల్.. భర్తతో హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)
-
నది మధ్యలో ఫోటోషూట్: అనుకోని అతిథిని చూసి భయంతో యువతి..
ఈరోజుల్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. కళ్లు చెదిరే లొకేషన్లలో అద్భుతమైన సెట్టింగులతో, ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేనకడుగు వేయడం లేదు. సినిమా స్టైల్ను తలపించే లైటింగ్స్, ఎఫెక్ట్స్, రిచ్నెస్తో ఫోటోషూట్స్ పెట్టుకుంటున్నారు. దీనికోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను నియమించుకుంటున్నారు. తమ క్రియేటివిటీకి పదును పెట్టి ఢిపరెంట్ స్టైల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు అందరి దృష్టని ఆకర్షిస్తున్నాయి. రీసెంట్గా ఓ జంట తీయించుకున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఓ నదిలో కాబోయే జంట అందంగా ఫోటోలకు ఫోజులిస్తుండగా పాము అనుకోని అతిథిలా ఫ్రేమ్లోకి వచ్చింది. దీంతో యువతి భయపడి కేకలు వేయగా, ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పాడు. కాసేపట్లోనే ఆ పాము అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ మొత్తం తతంగాన్ని ఫోటోగ్రాఫర్ కెమెరాలో బంధించాడు. వైల్డ్ ఫోటోషూట్ అంటూ వీడియోను ఇన్స్టాలో షేర్ చేయగా.. ఇప్పటికే 53 లక్షల మంది ఆ వీడియోను చూశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పాము ఒంటిపై నుంచి వెళ్లినా అదరకుండా, బెదరకుండా చాలా చిల్ మూడ్లో ఉన్నారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పామును చూసి ఆ అమ్మాయి భయపడినప్పుడు ఆమె కాబోయే భర్త ధైర్యం చెప్పిన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by 🅟🅐🅡🅢🅗🅤 🅚🅞🅣🅐🅜🅔 🅟🅗🅞🅣🅞🅖🅡🅐🅟🅗🅨 (@parshu_kotame_photography150) -
కెప్టెన్ల ఫోటో షూట్: దీని వెనుక సంచలన స్టోరీ, కనీవినీ ఎరుగని అద్భుతం
వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (నవంబరు 19, ఆదివారం) జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోవరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ల ఫొటో షూట్ ఆకర్షణీయంగా నిలిచింది. అసలీ ఫోటో షూట్ ఎక్కడ? దీని వెనుక ఉన్న కథ ఏంటి? తెలుసుకుందాం రండి..! అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద ఇరు జట్ల సారధులు అదాలజ్ వావ్ను సందర్శించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. దిదీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ, గుజరాత్ టూరిజం విభాఘం తమ ఎక్స్( ట్విటర్)లో పోస్ట్ చేశాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి అహ్మదాబాద్కు ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ జిల్లాకి సమీపంలోని అదాలాజ్ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెట్ల బావి ఉంది. గుజరాత్లో మార్వాడీ భాషలో, స్టెప్వెల్ను ‘వావ్’ అంటారు. ఇలాంటి ఇక్కడ చాలా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి అదాలజ్ ని వావ్? Rohit Sharma, the captain of the Indian #Cricket Team, and Pat Cummins, the captain of the Australian Cricket Team, visited #AdalajStepwell. They were mesmerized by the architectural marvel of the stepwell and overwhelmed by the warm hospitality of #Gujarat. VC: @ICC pic.twitter.com/93MncfCIUR — Gujarat Tourism (@GujaratTourism) November 18, 2023 అదాలజ్ ని వావ్ అదాలజ్ ని వావ్ లేదా అదాలజ్ స్టెప్వెల్ ను 1499లో తన భర్త జ్ఞాపకార్థం వాఘేలా రాజవంశం అధినేత వీర్ సింగ్ భార్య రాణి రుదాదేవి నిర్మించారు. ఇదొక అద్భుతంగా శిల్పాలతో నిండివున్న ఈ కట్టడం ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప అద్భుతానికి గొప్ప నిదర్శనం. గుజరాత్లోని అత్యుత్తమ స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచిన ఈ మెట్ల బావి ఐదు అంతస్తుల లోతులో ఉంటుంది. తూర్పు ప్రవేశం నుండి బావి వరకు మొదటి అంతస్తులో ఉన్న పాలరాతి స్లాబ్పై అదాలజ్ స్టెప్వెల్ చరిత్రను సంస్కృతంలో ఒక శాసనం లిఖించారు. భర్త చివరి కోరిక కోసం, భార్య ప్రాణత్యాగం పురాణాల ప్రకారం, 15వ శతాబ్దంలో,రణవీర్ సింగ్ అప్పట్లో దండై దేశ్ అని పిలిచే ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడ ఎపుడూ విపరీతమైన నీటి ఎద్దడి ఉండేది. కేవలం వర్షాలే ఆధారం. దీంతో అతిపెద్ద, లోతైన బావిని నిర్మించమని ఆదేశించాడు. కానీ అది పూర్తి కాకముందే, పొరుగున ఉన్న ముస్లిం పాలకుడు మహమ్మద్ బేగ్డా దండాయి దేశ్పై దండెత్తాత్తుతాడు. ఈ యుద్ధంలో వీర్ సింగ్ అసువులు బాస్తాడు. దీంతో అప్పటి సంప్రదాయం ప్రకారం అతని భార్య రాణి సతీసహగమనం కోసం సిద్ధమవుతుండగా, బేగ్డా ఆమెను వివాహం చేసుకోవాలను కుంటున్నట్లు చెప్తాడు. అయితే ఈ ప్రాంత రక్షణ, భర్త చివరి కోరికను నెరవేర్చాలనే ఆశయంతో ఇక్కడ ముందుగా మెట్ల బావి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతుతో అతని ప్రతిపాదనను అంగీకరిస్తుంది. ఫలితంగా రికార్డు సమయంలో స్టెప్వెల్ నిర్మాణానికి పూనుకుంటాడు. కానీ రాణి పథకం వేరే ఉంటుంది. ఇది పూర్తికాగానే ప్రార్థనలతో మెట్ల బావికి ప్రదక్షిణలు చేసి, ఆతరువాత బావిలోకి ప్రాణ త్యాగం చేస్తుంది. ఈ సంఘటనలు బావి గోడలపై చిత్రీకరించి ఉన్నాయి. ఈ బావి ప్రత్యేకలు ఏంటంటే సంవత్సరాల తరబడి నీటి ఎద్దడి కారణంగా నీటి మట్టంలో కాలానుగుణ హెచ్చుతగ్గుల స్థాయిలోని భూగర్భ జలాలకోసం ఇంత లోతుగా దీన్ని నిర్మించారు. సోలంకి నిర్మాణ శైలిలో ఇసుకరాయితో నిర్మించబడిన అదాలజ్ మెట్ల బావి పైభాగంలో అష్టభుజాకారంలో 16 స్తంభాలు, 16 ప్లాట్ఫారమ్లతో ఉంటుంది. మూడు మెట్ల మార్గాలు భూగర్భంలో కలుస్తాయి. 16 మూలల్లో దేవతలతోపాటు, పలు విగ్రహాలు చెక్కారు. దేవతలు ఇక్కడికి నీరు నింపడానికి వస్తుంటారని గ్రామస్తుల నమ్మకం. అలాగే యాత్రికులు, వ్యాపారులకు ఆశ్రయం ఇచ్చింది. బావి అంచున ఉన్న చిన్న చిన్న నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలు దుష్టశక్తుల నుండి స్మారక చిహ్నాన్ని కాపాడుతాయని స్థానికులు నమ్ముతారు. అష్టభుజి పైకప్పు తో తక్కువ గాలి లేదా సూర్యకాంతి ల్యాండింగ్లోకి ప్రవేశించి, లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ బయట కంటే చల్లగా ఉండటానికి కారణమని ఆర్కిటెక్చర్, ఆర్కియాలజీ రంగంలోని నిపుణులు అంచనా. భయంకరమైన ఎండాకాలంలో కూడా ఇక్కడి ఉష్ణోగ్రత బయటకంటే దాదాపు ఐదు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇంకా అమీ ఖుంబోర్ (ప్రాణాదార నీటికి ప్రతీకాత్మక కుండ) , కల్పవృక్షం (జీవిత వృక్షం) ఏక శిలా విగ్రహాలు, పై అంతస్తులలో ఏనుగులు (3 అంగుళాలు (76 మిమీ) చెక్కడాలు. మజ్జిగ చిలకడం, స్త్రీల అలంకరణ, రోజువారీ పనుల దృశ్యాలతోపాటు నృత్యకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శన లాంటివి ఇక్కడి గోడల నిండా కనిపిస్తాయి. మేస్త్రీలకు మరణ శిక్ష బావికి సమీపంలో దొరికిన సమాధుల ద్వారా ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ బావిని నిర్మించిన ఆరుగురు మేస్త్రీలవే సమాధులే. వారి నిర్మాణ శైలి, నిర్మాణ నైపుణ్యానికి, ప్రతిభకు ముగ్దుడైన బేగ్డా ఇలాంటిదే మరొక బావిని నిర్మించగలరా అని మేస్త్రీలని అడిగాడట. దానికి సరే అని వారు సమాధానం చెప్పడంతో వారికి మరణశిక్ష విధించాడు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కట్టడం మరొకటి ఉండకూడదని భావించాడట. -
Janhvi Kapoor Latest Photos: జాన్వీ కపూర్ అందాల వయ్యారాలు..చూస్తే మైండ్ బ్లాకే! (ఫోటోలు)
-
Shakeela: ఒకప్పుడు గ్లామర్ డాల్.. ఇప్పుడు ట్రెడిషనల్ అవతార్ (ఫోటోలు)
-
గ్లామర్తో మెరిసిపోతున్న తెలుగు అందం స్రవంతి చొక్కారపు (ఫొటోలు)
-
మురికి కాలువలో రొమాంటిక్ ఫోటోషూట్.!
-
నటి నగ్న ఫోటోలు.. ఫ్రెండ్ చేసిన పనికి తీవ్ర భావోద్వేగం!
సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్తో నిండిన ప్రపంచం. అవకాశాలు రావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ కూడా అలానే ఉంటోంది. కాస్త గ్లామర్ ఒలకబోస్తేనే చూసేవారు కష్టమైపోయారు. అలాంటి ఈ ఫీల్డ్లో నగ్న ఫోటో షూట్లకు సైతం నటీమణులు వెనుకకాడడం లేదు. అలానే గతంలో ఓ సంఘటనను గుర్తు చేసుకున్న ఓ నటి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆమె ఫ్రెండ్ చేసిన పనికి ఎమోషనలైంది. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్లో షాహిద్ కపూర్ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో పని మనిషిగా నటించిన మరాఠీ నటి వనితా ఖరత్. ఆమె చేసిన నగ్న ఫోటోషూట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె చేసిన పనికి పలువురు విమర్శించారు కూడా. అయితే తనకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయని ఆమె వెల్లడించింది. ఇదే ఫోటోలను చూసిన ఆమె ఫ్రెండ్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడట. ఆమె ఫోటోలను తన గదిలో గోడకు తగిలించుకుంటానని అడిగాడట. ఆ సమయంలో ఆమె చాలా ఎమోషనల్ అయినట్లు వెల్లడించింది. నగ్న ఫోటో షూట్ కోసం ఎలాంటి స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోలేదని తెలిపింది. ఈ విషయాన్ని ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ అంటే ఇష్టమని.. ఆయనతో కలిసి పని చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు మనసులో మాట బయటపెట్టింది. View this post on Instagram A post shared by Vanita Kharat (@vanitakharat19) View this post on Instagram A post shared by Vanita Kharat (@vanitakharat19) -
ఇంటర్నెట్ని షేక్చేస్తున్న విద్యాబాలన్ బోల్డ్ ఫోటోషూట్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె బోల్డ్ ఫోటోషూట్ ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ కోసం విద్యాబాలన్ సెమీ న్యూడ్గా ఫోటోలకు ఫోజులిచ్చింది. కేవలం న్యూస్ పేపర్ను అడ్డుపెట్టుకొని కూర్చీలో కూర్చొని ఒక చేతిలో న్యూస్ పేపర్.. మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకొని రొమాంటిక్ స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం విద్యాబాలన్ దిగిన ఈ ఫోటోషూట్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 40ఏళ్ల వయసులో ఇలాంటివి అవసరమా అంటూ విద్యాబాలన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇది మరో డర్టీ పిక్చర్లా ఉందంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీని కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. హీరోయిన్లను ఇలా నగ్నంగా చూపించడంలో క్రియేటివిటీ ఏముంది అంటూ అతడ్ని కూడా ఏకిపారేస్తున్నారు. View this post on Instagram A post shared by Dabboo Ratnani (@dabbooratnani) -
సింగర్ గీతా మాధురి ఫోటో షూట్
-
ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ ఎంట్రీ?
దివంగత ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆ వార్త నిజం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత హీరో ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ద్వారా జాన్వీ తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారని సమాచారం. గత వారం జాన్వీ హైదరాబాద్ వచ్చారని తెలిసింది. ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఫోటోషూట్లో పాల్గొనడానికే భాగ్యనగరంలోకి ఈ బ్యూటీ అడుగుపెట్టారట. ఇక ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా నటించడం కోసం ఓ బాలీవుడ్ మూవీని కూడా జాన్వీ వదులుకున్నారని టాక్. సో... జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లే అని ఊహించవచ్చు. ఈ నెల 24న ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కానుందట. మరి ఆ రోజు హీరోయిన్ని ప్రకటిస్తారేమో చూడాలి. -
హీరో గోపీచంద్ చిన్నకొడుకును చూశారా? ఎంత క్యూట్గా ఉన్నాడో..
మ్యాచో హీరో గోపీచంద్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండరన్న సంగతి తెలిసిందే. సినిమాలు తప్ప ఆయన పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాల్లో చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటారు. తాజాగా గోపీచంద్ తన చిన్న కొడుకు వియాన్తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్సులో కనిపించారు. ఫోటోలకు ఫోజులిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న వియన్ క్యూట్ లుక్స్ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో లౌక్యం, లక్ష్యం చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
దీపికా పదుకొనె ఫోటోషూట్పై రణ్వీర్ సింగ్ కామెంట్
హీరోయిన్ దీపిక పదుకొనె తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకంది. స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇక దీపికా ఫ్యాషన్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్తో మెస్మరైజ్ చేసే దీపిక తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోషూట్ని షేర్ చేసింది. లూయిస్ విటాన్ బ్రాండ్కు చెందిన అవుట్ఫిట్లో ఫిదా చేసింది. ఈ ఫోటోపై ఆమె భర్త రణ్వీర్ సింగ్ హార్ట్ ఎమోజీ షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. కాగా కొంతకాలంగా రణ్వీర్-దీపికల మధ్య విబేధాలు తలెత్తాయంటూ పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీపిక పోస్టుకు రణ్వీర్ కామెంట్ చేయడంతో అలాంటి రూమర్స్లో నిజం లేదంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక దీపిక ఫోటోషూట్ చూసి ఆలియాభట్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్స్.. ఫోటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలె ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు త్వరలోనే గాడ్ ఫాదర్ సినిమాతో అలరించనున్నారు. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే చిరంజీవి లేటెస్ట్గా ఫోటోషూట్లో సందడి చేశారు. ఇందులో భాగంగా పలు కాస్ట్యూమ్స్ ధరించి కెమెరాకి ఫోజులిచ్చారు. యమ స్టైలిష్ట్గా కనిపిస్తున్న చిరు తన లుక్స్తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. -
అందుకే రణ్వీర్ నూలు పోగు లేకుండా ఫోటో షూట్ చేశాడేమో: ఆర్జీవీ
ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్ చేయించుకున్నాడు. ఈ ఫోటోని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. దీనిని కొంతమంది సమర్థిస్తుంటే..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ముంబైలో రణ్వీర్పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో రణ్వీర్గా మద్దతుగా నిలిచాడు సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లింగ సమానత్వానికి న్యాయం చేయడం కోసమే రణ్వీర్ ఇలా ఫోటో షూట్ చేసి ఉండోచ్చని అభిప్రాయపడ్డాడు. (చదవండి: పవన్తో సినిమాకి భయపడుతున్న దర్శకులు...కారణం?) మహిళలు తమ శరీరాన్ని ప్రదర్శించగా లేనిది.. పురుషులు ఎందుకు అలా చూపించొద్దని ప్రశ్నించాడు. మహిళలతో సమానంగా మగవారికీ హక్కులు ఉన్నాయని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా.. మగవాళ్లు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం కంటే.. అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి అమ్మాయిలు ఎక్కువ ఆనందం పొందుతారనేది నిజమా? కాదా? అంటూ ఓ పోల్ క్వశ్చన్ కూడా పెట్టాడు. I personally applaud and I am also thrilled to see the majority applauding @RanveerOfficial ‘s new age boldness💪💪💪 ..and I hope that the same majority will applaud a woman as much if she does the same ..There has to be a GENDER EQUALITY 💐💐💐 pic.twitter.com/9kVGMrYro1 — Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022 In the context of the new age nude pics of @RanveerOfficial ,here’s a question…Do women enjoy watching a man’s nude pics as much as men enjoy watching a woman’s nude pics? — Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022 -
పచ్చని ఆకులే డ్రెస్గా.. అదాశర్మ రచ్చ.. ఫోటోలు వైరల్
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అదాశర్మ. ఆ తర్వాత అడపదడప సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మకి యమ క్రేజీ ఉంది. నిత్యం కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆకులతో డిజైన్ చేసిన గౌను ధరించి ఫోటోషూట్ చేయించుకుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేస్తూ.. ‘‘ప్రకృతి చాలా గొప్పది. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనిస్తుంది. అన్ని జీవరాసులను స్వీకరించే శక్తి మానవులకే ఇచ్చింది’’ అని రాసుకొచ్చారు. అదా షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ఫొటోషూట్లో లైట్స్.. కెమెరా.. యాక్షన్.. ప్రస్తుతం జరుగుతోంది ఇదే
ఈ పదాలను సినిమా షూటింగ్లో నిత్యం వింటుంటాం. కానీ ఫొటోషూట్లోనూ ఈ పదాలు వినిపిస్తే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతోంది అదే. డ్రోన్, క్రేన్ షాట్స్తో సినిమా షూటింగ్ను తలపించేలా నగర శివారులో ఫొటోషూట్ చేయడం ట్రెండ్గా మారింది. చాలా మంది ఫొటోషూట్ను సినిమా షూటింగ్ అనే భ్రమపడుతున్నారు. దానికి సినిమా షూటింగ్ తరహాలో చేయడమే కారణమంటున్నారు ఫొటోగ్రాఫర్లు. అందుకే ఫొటోషూట్ను ఈ తరహాలో చేస్తున్నామని స్టుడియో నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఫొటోగ్రఫీపై ఆసక్తి (ఫొటోనాసక్తి) ఉన్న యువత తమ పనితనానికి మెరుగులు దిద్దుకుంటూ ఫొటోనాసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: గతంలో పెళ్లిళ్లు, పేరంటాలకు మాత్రమే ఫొటోలు తీయించుకునేవారు. ప్రస్తుతం పెళ్లితో పాటు ప్రీ–వెడ్డింగ్, పోస్ట్–వెడ్డింగ్ ఫొటోషూట్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫొటోగ్రాఫర్ స్వయంగా వెళ్లి తీయలేని యాంగిల్స్లో కూడా ఫొటోలను తీసే అవకాశం డ్రోన్ షాట్స్, క్రేన్ షాట్స్తో ఏర్పడుతోంది. అంతేకాకుండా సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆ వీడియోలను సినిమా పాటల తరహాలో ఎడిటింగ్ చేయించుకుంటున్నారు. అపురూపమైన ఈ ఫొటోలు, వీడియోలను కరిజ్మా, క్యాన్వేరా ఆల్బామ్, డీవీడీలలో పొందు పరిచి అందజేస్తున్నారు. సినిమా షూటింగ్ తరహాలో ఫోటో షూట్ రూ.70వేల నుంచి రూ.3.5లక్షల వరకు.. ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త ట్రెండ్లను నగర ప్ర జలు ఆహ్వానిస్తుండటంతో ఈ రంగంలోకి వచ్చే వారికి ఉపాధి లభిస్తోంది. ప్రీ–వెడ్డింగ్, పోస్ట్–వెడ్డింగ్ ఫొటోషూట్లతో కలుపుని సినిమా ఫొటో గ్రఫీ, వీడియో క్యాన్వేరా, ఎల్ఈడీ స్క్రీన్స్, క్యాన్డెట్ ఫొటోగ్రఫీ ఆల్బంతో సహా మొత్తం క్వాలిటీని బట్టి దాదాపు రూ.70 వేల నుంచి రూ.3.5లక్షల వరకు ఫొటోగ్రాఫర్లు తీసుకుంటున్నారు. జవహర్నగర్లో 200 స్టూడియోలు, 3 కలర్ల్యాబ్లు ఫొటోగ్రఫీలో కొత్త ట్రెండ్లు రావడంతో పాటు మార్కెట్ రోజురోజుకు విస్తరించడంతో ఫొటోగ్రఫీ రంగంవైపు రావడానికి నేటితరం జవహర్నగర్ యువత ఆసక్తి చూపుతున్నారు. దానినే ఉపాధిగా మలుచుకుంటున్నారు. 15 ఏళ్ల క్రింద జవహర్నగర్ పరిసర ప్రాంతాలలో 5 నుంచి 10 ఫొటో స్టూడియోలు ఉండేవి. కానీ ప్రస్తుతం దాదాపు 200 వరకు ఫొటోస్టూడియోలు, 3 కలర్ల్యాబ్లు ఉన్నాయి. తక్కువ ఖర్చులోనే.. తక్కువ ఖర్చులోనే సినిమాను తలపించే రీతిలో అన్ని కోణాల్లో దశ్యాలను చిత్రీకరిస్తున్నాం. ఎక్కువ శాతం క్రేన్ షాట్స్ తీయాలని వినియోగదారులు కోరుతున్నారు. సీజన్లో గిరాకీ బాగుండటంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. – శ్రీకాంత్యాదవ్, జవహర్నగర్ ఎంతో మందికి ఉపాధి.. ఫొటో రంగంలోకి యువత రావడానికి ఇష్టపడుతున్నారు. నూతన టెక్నాలజీ ద్వారా షాట్స్ తీయడమే కాకుండా వారికి అనుకున్న రీతిలో ఫొటోఆల్బమ్ తీసి ఇస్తున్నాం. అంతే కాకుండా ఎంతో మంది ఉపాధిని కూడా పొందున్నారు. – సంపత్, అంబేడ్కర్నగర్ -
ఒక్కరాత్రిలో.. ఆమె జీవితమే మారిపోయింది!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది ఏ రూపంలో అయినా సరే!. కానీ, సమయానికి అది బయటపడితేనే.. గుర్తింపు దక్కేది. అందుకు ఎవరో ఒకరి ప్రోత్సాహం అవసరం కూడా. ఇవాళ రేపు ఓవర్నైట్ సెన్సేషన్స్కి ఒక వేదిక అయ్యింది ఇంటర్నెట్. బచ్పన్ కా ప్యార్, కచ్చా బాదామ్ లాంటి వాళ్లు ఇలా పాపులర్ అయినవాళ్లే. ఈ లిస్ట్లో ఇప్పుడు చేరిపోయింది బెలూన్లు అమ్ముకునే యువతి కిస్బూ. కిస్బూ రాజస్థానీ కుటుంబానికి చెందిన అమ్మాయి. కేరళలో ఆమె కుటుంబం సెటిల్ అయ్యింది. రోడ్ల మీద, సిగ్నళ్ల దగ్గర బెలూన్లు, బొమ్మలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తోంది ఈమె కుటుంబం. అయితే అండలూర్ కవూ జాతరకు బుగ్గలు అమ్మడానికి వెళ్లిన కిస్బూ జీవితం.. రాత్రికి రాత్రే ఊహించని మలుపు తిరిగింది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అయిన అర్జున్ కృష్ణన్.. సరదాగా జాతరకు వెళ్లి ఫొటోలు తీయసాగాడు. అక్కడ అర్జున్.. అనుకోకుండా అక్కడే బుగ్గలు అమ్ముకుంటున్న కిస్బూను క్లిక్మనిపించాడు. ఆ ఫొటో అద్భుతంగా వచ్చింది. దీంతో ముగ్దుడైన అర్జున్..ఆ ఫొటోను కిస్బూ, ఆమె తల్లికి చూపెట్టాడు. ఆపై సోషల్ మీడియాలోనూ ఆ ఫొటో వైరల్ కావడానికి ఎంతో టైం పట్టలేదు. దీంతో స్టైలిష్ రమ్య ఆధ్వర్యంలో ఆమెతో కొన్ని ఫొటోషూట్లు చేయించారు. దీంతో ఇప్పుడామె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) సిగ్నళ్ల దగ్గర బుడగలు అమ్ముకునే కిస్బూ.. మోడలింగ్ ఫొటోషూట్లు వైరల్ కావడం, ఆమెకు పలు బ్రాండ్స్ అవకాశాలు దక్కడంపై ఫొటోగ్రాఫర్ అర్జున్ స్పందించాడు. తాను తీసిన ఒక్క ఫొటో వల్ల ఆమె జీవితం మారిపోవడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇంత గుర్తింపునకు కారణమైన అర్జున్కు కృతజ్ఞతలు చెబుతున్నారు కిస్బూ, ఆమె తల్లి. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) -
Keerthy Suresh: వెరైటీ చీరకట్టులో కీర్తిసురేష్ ఫోటోషూట్
Keerthy Suresh Latest Photo Shoot Goes Viral:ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా క్రేజ్ సందించుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడపుకున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పడు తన లేటెస్ట్ అప్డేట్స్తో అభిమానులతో టచ్లో ఉంటుంది. తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వెరైటీ చీరకట్టులో కీర్తి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తి నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’.నేడు(డిసెంబర్2)న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె తొలిసారిగా మోహన్లాల్తో కలిసి నటించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్లాల్ (మోహన్లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. -
‘అదేమన్నా పిక్నిక్ స్పాటా’.. మోడల్పై ప్రధానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వద్ద ఫోటోషూట్ చేయడమే కాక.. తలపై వస్త్రం ధరించనందుకు గాను పాకిస్తాన్ మోడల్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పాకిస్తాన్కు చెందిన దుస్తుల కంపెనీ మన్నత్ కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఓ యాడ్ని షూట్ చేసింది. దీనిలో నటించిన మోడల్ తలపై వస్త్రం ధరించకుండా షూట్లో పాల్గొని.. ఫోటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు కంపెనీ, మోడల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గం వారు ఈ యాడ్పై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్ షూట్ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ విమర్శిస్తున్నారు. (చదవండి: కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!) ఈ నేపథ్యంలో శిరోమణి అకాళీ దల్ నేత (ఎస్ఏడీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కోరారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మినిస్టర్ పవాద్ చౌదరి స్పందిస్తూ.. సదరు దుస్తుల కంపెనీ, మోడల్ తమ చర్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు) వివాదం కాస్త పెద్దదవడంతో మన్నత్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అంతేకాక ‘‘సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫోటోల ప్రకారం కర్తార్పూర్ కారిడార్ వద్ద ఫోటో షూట్ చేసింది తాము కాదని.. థర్డ్ కంపెనీ వారు తమ మన్నత్ వస్త్రాలు ధరించి.. అక్కడ యాడ్ షూట్ చేశారని’’ తెలిపారు. The Designer and the model must apologise to Sikh Community #KartarPurSahib is a religious symbol and not a Film set….. https://t.co/JTkOyveXvn — Ch Fawad Hussain (@fawadchaudhry) November 29, 2021 చదవండి: మోడల్ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి -
వైరల్: సరదా తీర్చిన యువతి ఫోట్షూట్.. కొంచెం బొద్దుగా ఉండటంతో..
ఈ మధ్య కాలంలో ఫంక్షన్ ఏదైనా ఫోటో షూట్లు మాత్రం పక్కా ఉండాల్సిందే. బర్త్డే అయినా, పెళ్లి అయినా చిరకాలం గుర్తుండి పోవాలంటే ఫోటో షూట్ తప్పనిసరి. ఇక పెళ్లి ముందే అయితే వెడ్డింగ్ షూట్ల శర మామూలు అయిపోయాయి. లక్షలు ధారపోసి మరీ ప్రదేశాలకు వెళ్లి మరీ వీడియోలు, ఫోటోలు తీయించుకుంటున్నారు. అచ్చం ఓ ఇలాగే ఓ యువతి ఫోటో షూట్ ప్లాన్ చేసింది. ఇది తన జీవితంలో ఎప్పటికీ మధురానుభూతిగా మిగిలిపోవాలనుకుని నది దగ్గర ఫోటో షూట్ ఏర్పాటు చేసింది. కెమెరామెన్, అసిస్టెంట్, మెకప్మెన్.. ఇలా అందరూ రెడీగా ఉన్నారు. చదవండి: వీడియో వైరల్: ప్రియుడితో పారిపోయిందని.. సీరా పూసి.. గుండు కొట్టించి యువతి కూడా అందమైన గులాబి రంగు గౌనులో మరింత అందంగా ముస్తాబు అయ్యింది. నది ఒడ్డున కొన్ని అడుగుల లోతు నీటిపై క్రేన్ సాయంతో అమర్చిన సన్నని ఊయల మీద కూర్చొని ఫోటోషూట్కు ఫోజిచ్చింది. పక్క నుంచి ఓ వ్యక్తి యువతి గౌనులో గాలో ఎగిరేలా ప్రయత్నిస్తున్నాడు.. అయితే యువతి కొంచెం బొద్దుగా ఉండటం, బ్యాలెన్స్ తప్పడంతో ఒక్కసారిగా ఊయల మీద నుంచి జారీ అమాంతం నీళ్లలో పడిపపోయింది. చదవండి: ఫెయిల్ అవ్వడం ఎలా ?: ఫన్నీ వైరల్ వీడియో అనంతరం నీటి నుంచి బయటకు వచ్చిన యువతి, అక్కడి వారంతా జరిగింది తలుచుకొని పగలబడి నవ్వుకున్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో నెటిజన్లు తెగ నవ్వుకకుంటున్నారు. అయితే ‘ రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించకుంటే ఇలాంటి మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇది చాలా ఇంకొంచెం కావాలా’అఅంటూ పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by punjabi industry (@punjabi_industry__) -
చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?
ఇటలీ: గతంలో వేషధారణకు ఒక ప్రత్యేకతే ఉండేది. ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ఇప్పటి వరకు మగవాళ్లు వేసుకునే బట్టలను ఆడవాళ్లు వేసుకున్నారు. కానీ ఆడవాళ్లు ధరించే వాటిని మగవాళ్లు ఎప్పుడూ వేసుకోలేదు. కానీ ఇటీవల కాలంలో ఆడవాళ్ల వేషధారణను మగవాళ్లు ధరించటం ఒక ఫ్యాషన్గా మారింది. అయితే హ్యారీ స్టైల్స్, రణవీర్ సింగ్ మరియు కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ వంటి స్టార్లు సైతం ఈ ఫ్యాషన్ ప్రస్తావన ముందుకు తీసుకు వచ్చారు గానీ ఆచరణ సాధ్యం కాలేదు. (చదవండి: హృదయాన్ని కదిలించే "స్వీట్ రిక్వస్ట్") అయితే ఈ ఫ్యాషన్ని ఆండ్రోజినస్ ఫ్యాషన్గా పిలుస్తారు. అంతేకాదు కొల్కతాకు చెందిన వ్యక్తి ఈ ఫ్యాషన్ అనుకరించేలా ఇంటర్నెట్లో ఒక విప్లవాన్ని తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురుచేస్తున్నారు. ఏంటి ఇందంతా అని అనుకోకండి. అసలు విషయం ఏంటంటే కోల్కతాకు చెందిన పుష్పక్ సేన్ ఎరుపు రంగు చీర, నలుపు కళ్ల జోడు ధరించి పాతకాలంలో మాదిరిగా కూడా ఒక గొడుగు వెంట తెచుకుని ఫ్యాషన్ రాజధానులుగా పేరుగాంచిన వీధులో తిరుగుతాడు. అయితే ఈ విధంగా సేన్ ప్రపంచంలోని ప్రధాన ఫ్యాషన్ హబ్లలో ఒకటైన మిలన్ వీధుల్లో ఫోటోషూట్లకి ఫోజు ఇస్తాడు. అంతేకాదు సేన్ ఇటలీలోని ఫ్లోరెన్స్లో ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థి కావడం విశేషం. ఈ మేరకు సేన్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలతో పాటుగా "చీరలో ఉన్న మనిషిని ఎవరు తమతో పాటు తీసుకువెళ్లరు. ప్రపంచంలోని ప్రధాన ఫ్యాషన్ రాజధానులలో ఒకటైన వీధుల్లో ఎవరు నడుస్తున్నారో ఊహించండి?" అంటూ క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేస్తాడు. దీంతో ఈ ఫోటో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిన్లు సేన్ని ఎంత అద్భతంగా కనిపిస్తున్నాడో అంటూ తెగ మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. (చదవండి: కూరగాయల దండతో అసెంబ్లీకి)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement