-
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్లు, ఎయిర్పోర్టులు, హాస్పిటల్స్ ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఢిల్లీలోని తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ అందింది.దీంతో జైలు అధికారులు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. జైలులోని ప్రముఖ రాజకీయ నాయకులతోపాటు కొందరు ఉన్నతస్థాయి ఖైదీలు ఉన్న సెల్లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ టీమ్, పోలీసులు సోదాలు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించలేదు. కాగా ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలు, ఆసుపత్రులు, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐఏ) విమానాశ్రయానికి కూడా ఇలాంటి హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే -
క్రిప్టో కింగ్కు 25 ఏళ్ల జైలు శిక్ష: కారణం ఇదే..
బ్లాక్ చెయిన్ ఆధారంగా పనిచేసే క్రిప్టో కరెన్సీల గురించి చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది. ప్రభుత్వం, బ్యాంకుల జోక్యం లేకుండా జరుగుతాయి. దీని విలువ.. డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంటుంది. క్రిప్టో కరెన్సీల ద్వారా కుబేరులు కూడా ఒక్కోసారి భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇందులో దివాళా దీసిన బిలియనీర్లలో ఒకరు FTX ఫౌండర్, సీఈఓ, అమెరికా యువ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ 'శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్'. ఎఫ్టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు శామ్ బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్కు మార్చి 29న (గురువారం) 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. FTX కస్టమర్లు డబ్బును పోగొట్టుకోలేదని బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ చేసిన వాదనను తిరస్కరించిన తర్వాత ఈ శిక్షను విధించారు. అమెరికా చరిత్రలోనే ఆర్థిక మోసాలలో ఒకటిగా FTX అని, బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ 2022 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అది తప్పు అని తెలిసినప్పటికీ.. మోసాలకు పాల్పడ్డాడని న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్టీఎక్స్ కస్టమర్లు బాధపడ్డారని 20 నిమిషాల విచారణ తరువాత బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ తరువాత సహోద్యోగులకు క్షమాపణలు చెప్పాడు. FTX కస్టమర్లు 8 బిలియన్ డాలర్లు, ఈక్విటీ పెట్టుబడిదారులు 1.7 బిలియన్ డాలర్లను కోల్పోయారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ రుణదాతలు కూడా 1.3 బిలియన్ డాలర్లను కోల్పోయారు. దీంతో ఇతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎవరీ శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ అమెరికాకు చెందిన శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ పూర్తి పేరు 'శామ్యూల్ బెంజమిన్ బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్'. ఈయన 2014లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ (డిగ్రీ) పూర్తి చేశారు. ఆ తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్లో మూడేళ్ల పాటు ట్రేడర్గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్టీఎక్స్ను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీగా అవతరించింది. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. -
‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు. -
అక్కడ ఇద్దరమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాల్సిందే!..లేదంటే జైలు శిక్ష!
వివాహాలకు సంబంధించి పలు దేశాల్లో పలు ఆచారాలు ఉంటాయి. కొన్ని చూడటానికి, వినటానికి చాలా వింతగా ఉంటాయి. ఎంతలా అంటే..ఇదేం ఆచారం రా ! బాబు అని నోటిపై వేలేసుకునేలా ఉంటాయి. పైగా వాళ్లు ఆ ఆచారాలను చాలా నిబద్ధతతో ఆచరించడం మరింత విస్తుపోయేలా ఉంటుంది. ఇంతకీ ఈ గమ్మతైన వింత ఆచారం ఏదేశంలో ఉంది? ఏంటా వింత ఆచారం అంటే..? ఇలాంటి వింత ఆచారాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ ఏరిత్రియ అనే తెగ ఒకటి ఉంది. ఈ తెగల ప్రజలు వివాహ సమయంలో చాలా వింతైన ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తారు. సాధారణంగా ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకునే ఆచారమే ఏ సంప్రదాయంలోనైనా ఉంటుంది. కానీ ఇక్కడ సంప్రదాయంలో మాత్రం ఇద్దరు మహిళలను తప్పనిసరిగా వివాహం చేసుకోవాలట. ఏంటీ బై వన్ గెట్ వన్ ఆఫర్ అనుకుంటున్నారా..? కానీ ఆఫ్రికా ఖండంలోని ఈ ఎరిత్రియ తెగ మాత్రం ఈ సంప్రదాయన్ని నేటికి పాటిస్తోంది. ఒక వేళ అలా గనుకు ఎవరైన చేయకపోతే దాన్ని అతిపెద్ద నేరంగా పరిగణించి వారిని జైల్లో వేయిస్తారట. అందేకాదండోయ్ ఏకంగా జీవత ఖైదు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందట. అందువల్లే అక్కడ ప్రాంతంలోని ప్రతి స్త్రీ కూడా తన భర్తను మరో స్త్రీతో పంచుకునేందుకు రెడీ అవుతుందట. అయితే ఈ తెగలో దశాబ్దకాలంగా పురుషుల కంటే స్త్రీ జనాభానే ఎక్కువగా ఉటుందట. దీంతో ఆ తెగ పెద్దలు స్త్రీ-పురుషుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నారట. (చదవండి: ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం!ఆస్తుల జాబితా వింటే షాకవ్వుతారు!) -
హైతీలో తీవ్ర అరాచకం
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీలో అరాచకం రాజ్యమేలుతోంది. రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్లోని జైలుపై సాయుధ దుండగులు ఆదివారం దాడులు చేశారు. అంతకుముందు పలు పోలీస్స్టేషన్లపైనా దాడులు చేశారు. జైలుపై దాడి ఘటనలో 12 మంది చనిపోగా, సుమారు 3,700 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, అధ్యక్షుడు మెయిజెను హత్య చేసిన కొలంబియా మాజీ సైనికులు సహా సుమారు 100 మంది ఖైదీలు జైలులోని తమ బ్యారక్లలోపలే ఉండిపోయారని సీఎన్ఎన్ తెలిపింది. బయటికొస్తే సాయుధ ముఠాలు చంపేస్తాయని వారంతా భయపడుతున్నట్లు పేర్కొంది. కాగా, రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్ నగరాన్ని గుప్పెట పెట్టుకున్న ప్రధాన సాయుధ ముఠా ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ గద్దె దిగాలంటూ డిమాండ్ చేసింది. 2021లో అధ్యక్షుడు జొవెనెల్ మొయిజెను ఆయన నివాసంలో హత్య చేయడం వెనుక ఈ ముఠాయే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదివారం 72 గంటల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 2023లో హైతీలో సాయుధ ముఠాల హింసాత్మక చర్యల కారణంగా 8,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస అంచనా. -
ప్రేయసిని పెళ్లాడిన ఖైదీ.. జైల్లో జరిగిన వివాహం
భువనేశ్వర్: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమే కానీ, ఇది మాత్రం జైలులో భిన్నంగా జరిగిన పెళ్లి. ప్రియురాలి వర్గాల నేరారోపణతో జైలు పాలైన ప్రేమికుడితో చట్టపరమైన లాంఛనాలతో పెళ్లి జరిగింది. జైలు అధికారుల అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఝరపడా ప్రత్యేక జైలు సోమవారం పెళ్లి కళతో కళకళలాడింది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా అమ్మాయి తరపువారు ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలానుక్రమంగా వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు సంతోషకరమైన మలుపు దక్కింది. ఇరువురి కుటుంబాలు తమ మనసు మార్చుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రేమికులకు పెళ్లి జరిపించేందుకు హృదయపూర్వకంగా ముందుకొచ్చారు. దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి వివాహాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. -
ప్రియుడిని 100సార్లు పొడిచి చంపినా.. అమెకు శిక్షపడలేదు.. ఎందుకు!?
కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొందరు అనుకోకుండా ప్రమాదవశాత్తు నేరం చేసినందుకు ఏళ్ల కొద్ది జైల్లో మగ్గి శిక్ష అనుభవిస్తుంటారు. మరికొందరూ అత్యంత కిరాతకంగా హత్య చేసి కూడా చిన్న లాజిక్తో చాలా సునాయాసంగా బయటపడతారు. అయితే ఆ వ్యక్తులు చేసిన నేరం చూస్తే క్షమించేలా ఉండదు. కానీ వాళ్లకు శిక్ష ఎందుకు పడలేదనే ప్రశ్న మిగిలుంటుంది. అదృష్టమా లేక తలరాత అనుకోవాలో కూడా తెలియదు. అలాంటి షాకింగ్ ఘటనే అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. కాలిఫోర్నియాలో బ్రైన్ స్పెజ్చెర్ 32 ఏళ్ల మహిళ తాను ఎంతగానో ప్రేమించిన 26 ఏళ్ల చాడ్ ఓ మెలియాను దారుణంగా కత్తితో పొడిచి చంపేసింది. విచారణలో ఏకంగా వందసార్లు పైగా కత్తితో అతికిరాతకంగా పొడిచినట్లు వెల్లడైంది. పైగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికీ కూడా ఆమె చేతితో కత్తినే పట్టుకునే ఉంది, ఓమెలియా రక్తపు మడుగులో ఉన్నాడు, అదీగాక పోలీసులు ఆమె చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆమె ఆ కత్తిలో తన గొంతుపై గాయం చేసుకునే యత్నం కూడా చేసింది. స్పెజ్చెర్నే చంపిందనేందుకు పూర్తిసాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఆమెకు శిక్షపడలేదు. పైగా జడ్జీ ఆమెకు కొద్దిపాటి జైలు శిక్ష విధించి వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ స్పెజ్చెర్ పూర్తి స్ప్రుహలో ఉద్దేశపూర్వకంగా చేసింది కాకపోవడమే ఆమెను జైలు పాలు కాకుండా చేసింది. నిజానికి ఈ ఘటనకు కొద్దిరోజులు ముందు ఇద్దరు కలుసుకుంటూ హాయిగా ఉన్నారు. సరిగ్గా 2018లో థౌజండ్ ఓక్స్లోని ఓ మెలియా అపార్ట్మెంట్లో ఇరువురు కలిసి గంజాయి తాగారు. అయితే స్పెజ్చెర్ ఫస్ట్ షాట్ గంజాయి తీసుకున్నప్పుడు అంతగా మత్తులో లేదు. అయితే ఆమెను మరింత గంజాయి తీసుకోవాల్సిందిగా ఓమెలియా ఒత్తిడి చేయడంతో మరో షాట్ తీసుకుంది. దీంతో ఇరువురు పూర్తిగా మత్తులో జోగుతున్నారు. ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. అధికంగా గంజాయి తీసుకోవడంతో స్పెజ్జెర్ సైకోటిక్గా మారిపోయింది. తాను ఏం చేసిందో తెలియని ఉన్మాద స్థితిలోకి వెళ్లిపోయింది. తాను ఎంతో ఇష్టపడ్డ వ్యక్తే అతి కిరాతకంగా 100 సార్లు పొడిచి మరీ హతమార్చింది. ఆ రోజు ఆమె పోలీసులు వచ్చిన తర్వాత కూడా మాములు స్థితికి రాకపోగా అదే ఉన్మాదస్థితితో తనను తాను హతమార్చుకునేంత దారుణ స్థితికి వచ్చేసింది. సమయానికి పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి స్పెజ్చెర్ ప్రాణాతో బతికిబట్టగట్టగలిగింది. అయితే పోలీసులు ఓ మెలియా ఆ ఘటనలో అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు. అయితే కోర్టులో స్పెజ్చెర్ తరుఫు న్యాయవాది ఆమె స్ప్రుహలో ఉండి చేసిన నేరం కాదని గట్టిగా వాదించారు. పైగా అతడే ఆమెను గంజాయి తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడని అన్నారు. తన క్లయింట్ నాటి ఘటనలో ఏం జరగుతుంది, తానేం చేస్తుంది అనేది కూడా తెలియని దారుణ స్థితిలో ఉందని అన్నారు. వాస్తవానికి ఆమె కావాలని చేసిన హత్య మాత్రం కాదని కూడా అన్నారు. దీంతో న్యాయమూర్తి ఆమె ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం కాదు. పైగా ఇరువురు ఇష్టపూర్వకంగా గంజాయి సేవించి ఉండటంతో జరిగిన ఘటనే అని ఈ కేసుని కొట్టిపడేసింది కోర్టు. అంతేగాదు తెలియని స్థితిలో చేసిన నేరానికిగానూ ఆమెకు రెండేళ్ల ప్రోబేషన్ శిక్ష తోపాటు వంద గంట సామజికి సేవ కూడా చేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పు పట్ల బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఇక్కడ గంజాయి తాగిన ప్రతి ఒక్కరూ మరో వ్యక్తి చంపేయొచ్చు అనేలా ఉంది ఈ తీర్పు అని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక స్పెజ్చెర్ న్యాయవాది మాత్రం జడ్డి ఓర్లీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని మరీ ఈ విధంగా తీర్చు ఇచ్చారని ప్రశంసించాడు. ఈ తీర్పు పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నాని అన్నారు. ఆయన దీన్ని మత్తులో జరిగిన అనుకోని ఘోరమే తప్ప తన క్లయింటే స్వతహాగా మంచిదే అని వెనుకేసుకొచ్చాడు స్పెజ్చెర్ తరుఫు న్యాయవాది. ఏదీమైన మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలు తమకే గాక తామెంత ఇష్టపడ్డ వాళ్లను కూడా దూరం చేసుకునేలా చేస్తుంది. సరిదిద్దుకోలేని తప్పులను చేయిస్తుంది. ఇలాంటి ఉందంతాలు కోకొల్లలు కూడా. అందువల్ల దయచేసి ఇలాంటి వ్యసనాలకు బానిసలై ఉన్మాదులుగా మారి మిమ్మల్ని మీరు కోల్పోయి, మీ వాళ్లను దూరం చేసుకోకండి. (చదవండి: ఇదేం ఆఫర్ సామీ! ఇల్లు కొంటే భార్య ఉచితమా?) -
మరో కాలాపానీ: అల్కట్రాజ్.. ఒకనాటి కారాగారం
బ్రిటిష్ హయాంలో అండమాన్లోని కాలాపానీ జైలు గురించి అందరికీ తెలుసు. ఇది అమెరికన్ ద్వీప కారాగారం. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో తీరానికి ఆవల ఉన్న చిన్న దీవి అల్కట్రాజ్. ఒకప్పుడు అమెరికన్ ప్రభుత్వం కరడుగట్టిన నేరగాళ్లను బంధించేందుకు ఇక్కడ కారాగారాన్ని నిర్మించింది. కేవలం 2.01 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ఏకాంత దీవిలో కట్టుదిట్టమైన జైలును 1775లో నిర్మించారు. ఇది 1963 వరకు పనిచేసింది. పెలికాన్ పక్షులకు విడిది కేంద్రంగా ఉన్న ఈ దీవిలోని జైలు నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం. జైలు గోడలు దాటి బయటపడినా, చుట్టూ భీకరమైన సముద్రం. సముద్రంలో ఈతకొట్టాలని తెగించినా, ఇక్కడి సముద్ర జలాలు గడ్డకట్టించేంత చల్లగా ఉంటాయి. అవతలి తీరం చేరేంత వరకు ఈతకొడుతూ బతికి బట్టకట్టడం మానవమాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడి జైలు మూతబడిన తర్వాత ఇది కేవలం చారిత్రక కట్టడంగా మాత్రమే మిగిలింది. అప్పుడప్పుడు పర్యాటకులు ఇక్కడికి వచ్చి, ఈ జైలును చూసి పోతుంటారు. -
ఖైదీల రూటు జ్యూట్ వైపు
కలకత్తా వాసి చైతాలి దాస్ వయసు 50 ఏళ్లు. గోల్డెన్ ఫైబర్గా పిలిచే జ్యూట్ పరిశ్రమను స్థాపించడంలోనే కాదు అందుకు తగిన కృషి చేసి గోల్డెన్ ఉమన్గా పేరొందింది చైతాలి. ముఖ్యంగా ఖైదీలతో కలిసి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తూ, వ్యాపారిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ‘జనపనారను పర్యావరణ అనుకూలమైన, విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది మన సాంస్కృతిక గొప్పతనాన్నీ పెంచుతుంది. నా ఫౌండేషన్ ద్వారా ఖైదీలను ఆదుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని వివరించే చైతాలి ఆలోచనలు మన దృష్టి కోణాన్ని కూడా మార్చుతుంది. చైతాలి మొదలు పెట్టిన ప్రయాణం ఆమె మాటల్లోనే... ‘‘నేను పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్లోని అలీపూర్. మా ఇల్లు సెంట్రల్ జైలు, ప్రెసిడెన్స్ కరెక్షనల్ హోమ్ మధ్య ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆ జైలు జీవితం గడుపుతున్నవారి గురించి తెగ ఆలోచించేదాన్ని. మా నాన్న లాయర్ కావడం కూడా అందుకు మరో కారణం. నాన్నతో కలిసి ఆయన ఆఫీసుకు, పోలీస్ స్టేష¯Œ కు, సెంట్రల్ జైలుకు వెళ్లడం వల్ల నాలో అక్కడి వాతావరణం ఒక ఉత్సుకతను రేకెత్తించేది. జైలు గోడల లోపలి జీవితం ఆశ్చర్యపోయేలా చేసేది. కటకటాల వెనుక ఉన్న జీవితాలను, అక్కడ వాళ్లు ఎలా ఉంటారో చూపించే సినిమాలను చూడటం స్టార్ట్ చేశాను. రాత్రిళ్లు నిద్రపోయాక మా ఇంటికి సమీపంలో ఉన్న జూ నుంచి పులుల గర్జనలు వినిపించేవి. అర్ధరాత్రి సమయాల్లో పోలీసుల విచారణ, ప్రజల అరుపులు, కేకలు వినిపిస్తుండేవి. ఆ శబ్దాలు నాలో భయాన్ని కాకుండా దృష్టికోణాన్ని మార్చాయి. శాశ్వత ముద్ర నా చిన్నతంలో కొన్నిసార్లు మా నాన్నగారు కోర్టుకు తీసుకెళ్లారు. మొదటిసారి వెళ్లినప్పుడు నిందితులను కోర్టు హాలుకు తీసుకురావడం, పోలీసు వ్యాన్లో నుంచి వ్యక్తులు దిగడం గమనించాను. నా ఉత్సుకత తారస్థాయికి చేరుకుంది. మా నాన్న సహోద్యోగులలో ఒకరిని ‘ఎవరు వాళ్లు’ అని అడిగాను. తప్పు చేసినవారిగా ముద్రపడి, పర్యవసనాలను ఎదుర్కొనేవారు అని చెప్పారు. నేను అక్కడే నిలబడి గమనిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు వారి వైపు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వెంటనే వారి మధ్య ఉద్వేగభరితమైన సంభాషణలు విన్నాను. వారి బాధలు చూస్తుంటే ఏదైనా సాయం చేయాలనిపించేది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. కాలక్రమంలో చదువుతోపాటు ఇతరులకు సాయం చేసే మార్గం కోసం చాలా అన్వేషించాను. అందులో భాగంగా వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. 2015లో చైతాలి రక్షక్ ఫౌండేషన్కు పునాది పడింది. ఈ ఫౌండేషన్ మగ, ఆడ ఖైదీలు, ఇతర నిరుపేద మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. మొదటిసారి కరెక్షనల్ హోమ్లో నా పనిని ప్రారంభించాను. మొదట్లో స్పోకెన్ ఇంగ్లిషుపై దృష్టి పెట్టాను. మహిళలు, ఖైదీలతో కుకీలను తయారు చేయించడం, యోగాను పరిచయం చేయడం, చెక్కపనిలో పాల్గొనడం, పెయింటింగ్ సెషన్లు నిర్వహించడం వంటి అనేక ప్రాజెక్ట్లు చేపట్టాను. ఆ ప్రాజెక్ట్లు విభిన్న కార్యక్రమాలను ప్రతిబింబించేవి. అంతర్జాతీయంగా... బెంగాల్ జనపనార పరిశ్రమలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు. నేను, ఖైదీలతో జనపనార ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాను. వివిధ ప్రదేశాలలో వారి సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడుతుండేదాన్ని. ఆ తర్వాత వివిధ ఈ–ప్లాట్ఫార్మ్స్, జాతీయ– అంతర్జాతీయ వేదికలపైకి కూడా వారి జనపనార ఉత్పత్తులను తీసుకెళ్లాను. ౖఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ జ్యూట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎన్జెబి)తో కనెక్ట్ అయ్యాను. శిక్షణ ద్వారా ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా జ్యూట్ ఉత్పత్తుల తయారీలో దాదాపు మూడు వేల మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చాం. దీంతో ఈ ప్రాజెక్ట్ ‘రూట్ టు జ్యూట్’గా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంక్యుబేట్ చేసింది. మా స్టార్టప్ హస్తకళలు, రగ్గులు, హ్యాండ్బ్యాగులు వంటి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2021 జనవరి 7న రూపొందించిన అతిపెద్ద జ్యూట్ బ్యాగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. యువత కోసం.. ప్రత్యేకంగా విభిన్నరకాల ఉత్పత్తులను అందిస్తున్నాం. ఫ్యాషన్లో భాగంగా యువతకు చూపుతున్నాం. యూనివర్శిటీ లేదా కాలేజ్ నుండి బయటికి వచ్చే విద్యార్థులు జ్యూట్ బ్యాగ్లను ధరించి వెళుతుండగా చిత్రీకరించి ప్రదర్శిస్తుంటాం. ఇది వారిలో ఆసక్తిని పెంచుతుంది. తప్పు చేసిన వారిని ప్రజలు నేరస్తులుగా చూస్తారు. అయినప్పటికీ ఈ వ్యక్తులు ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమైనప్పుడు వారి అవగాహనలో మార్పు కలుగుతుంది. జనం కూడా వారిని అభినందించడం ప్రారంభిస్తారు. ఇలా క్రమంగా అందరిలోనూ అంగీకారం పెరుగుతుంది. తప్పు చేసినవారు లేదా దోషులుగా ముద్రపడిన వ్యక్తులు కూడా మార్పు చెందగలరు’ అని తన కృషి ద్వారా చూపుతోంది చైతాలి. -
పిల్లలపై వేధింపులు.. నిందితునికి 707 ఏళ్లు జైలు శిక్ష..!
కాలిఫోర్నియా: అమెరికాలో పిల్లలపై వేధింపులకు పాల్పడిన ఓ రాక్షసునికి న్యాయస్థానం 707 ఏళ్ల జైలు శిక్ష విధించింది! 16 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు గురిచేయడంతోపాటు అశ్లీల చిత్రాలు చూపించిన కేసుల్లో ధర్మాసనం దోషిగా తేల్చింది. మొత్తం 34 కేసుల్లో నిందితునికి ధర్మాసనం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. మాథ్యూ జక్ర్జెవ్స్కీ(34) బేబీకేరింగ్ తరహా సేవలు అందించేవాడు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న 16 మంది మగ పిల్లలను లైంగికంగా వేధించాడు. చిన్నారులకు అశ్లీల చిత్రాలు కూడా చూపించేవాడని న్యాయస్థానం గుర్తించింది. ఈ నేరాల్ని నిందితుడు 2014 నుంచి 2019 మధ్య పాల్పడ్డాడు. 2 నుంచి 12 ఏళ్ల పిల్లలపై మాథ్యూ వేధింపులు జరిపాడు. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న మ్యాథ్యూ విదేశాలకు వెళ్తుండగా.. 2019 మే 17న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో తాజాగా తుది తీర్పును న్యాయస్థానం వెలువరించింది. దోషిపై ఎలాంటి దయ చూపించవద్దని, ఉరిశిక్ష విధించాలని ధర్మాసనాన్ని ఇద్దరు పిల్లలకు చెందిన బామ్మ కోరింది. తమ పిల్లలను చూసుకోవడానికి ఇలాంటి రాక్షసున్ని నియమించుకున్నందుకు బాధపడుతున్నామని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాథ్యూ తన రహస్యాలను బయటకు చెప్పకుండా పిల్లలను హెచ్చరించేవాడని ఓ బాలుడి తల్లి దుయ్యబట్టింది. న్యాయస్థానం తీర్పు వెలువరించిన తర్వాత మ్యాథ్యూ నేరాలకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. నవ్వుకుంటూ ముందుకు కదిలాడు. తాను పిల్లలకు ఆనందాన్నే పంచానని న్యాయమూర్తికి తెలిపాడు. పిల్లల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాడు. తాను ఎలాంటి అపరాధం చేయలేదని, తన చర్యలను సమర్థించుకున్నాడు. ఇదీ చదవండి: Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే.. -
ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చాను..!
తమిళనాడు: పెరోల్పై బయటకు వెళ్లి మళ్లీ జైలుకు వచ్చిన జీవిత ఖైదీ సంచలన ఆరోపణలు చేశాడు. జైలులో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు రూ.3 వేల చొప్పున ఇచ్చినట్లు అధికారులకు తెలిపాడు. వివరాలు.. సేలం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ, చైన్నె తండయార్పేటకు చెందిన హరి అలియాస్ హరికృష్ణన్ (35) గతేడాది జూన్న్లో 3 రోజుల పెరోల్పై వెళ్లాడు. అతన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన వార్డెన్ రామ కృష్ణన్ను అరెస్టు చేశారు. అనంతరం ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కేసులో జీవిత ఖైదీ హరిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సోమవారం రాత్రి సేలం సెంట్రల్ జైలుకు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఖైదీ హరి అపస్మారక స్థితికి చేరుకోగానే జైలు అధికారులకు వాయిస్ మెసేజ్ పంపాడు. పెరోల్పై వెళ్లి తిరిగి వచ్చినందుకు అధికారులకు డబ్బులు చెల్లించాలని.. చిత్రహింసలకు గురిచేశారని అందులో పేర్కొన్నాడు. కోయంబత్తూరు జైలు శాఖ డీఐజీ షణ్ముగసుందరం విచారణ చేపట్టారు. విచారణ జరిపి పెరోల్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు మెమో ఇచ్చారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో పెరోల్పై వచ్చిన ఖైదీని 3 రోజుల పాటు సెల్ఫోన్లో మాట్లాడుతూ చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరు వార్డెన్లు కూడా పట్టుబడ్డారు. వారిపై కూడా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. పెరోల్ తర్వాత జైలుకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి ఒక్కొక్కరికి రూ. 3 వేలు చెల్లించినట్లు ఖైదీ హరి అధికారులకు తెలిపాడు. -
పుతిన్ బద్ధశత్రువు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల జైలు శిక్ష
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించారు. ఈ మేరకు విచారణకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. వీడియోలో నవాల్నీ నల్లని దుస్తులు ధరించి ఉన్నారు. చేతులు జోడించుకుని నిలబడి తీర్పును వింటున్నట్లు కనిపించారు. వీడియోలో న్యాయమూర్తి వెలువరించిన తీర్పుకు సంబంధించిన ఆడియో అస్పష్టంగా ఉందని నవాల్నీ అనుచరలు అన్నారు. తీర్పును విని నిర్దారించడం కష్టంగా ఉందని చెప్పారు. రష్యాలో పుతిన్కు ఏకైక ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నవాల్నీపై ఉగ్రవాదం సహా పలు కేసులు నమోదు చేశారు. ఇందులో ఆయన ఇప్పటికే 11 ఏళ్లకు పైగా శిక్ష పడగా.. తాజాగా మరికొన్ని అభియోగాల్లో మరో 19 ఏళ్లు కారాగార శిక్ష ఖరారైంది. పుతిన్ తన ప్రత్యర్థిని బయటకు వెళ్లకుండా జైళ్లోనే మగ్గే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని నవాల్నీ అనుచరులు ఆరోపిస్తున్నారు. నవాల్నీ ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో ఉన్నారు. కాగా తాజా తీర్పుతో అతని అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదీ చదవండి: Putin Critic Alexei Navalny: రష్యా అధ్యక్షుడు పుతిన్కు బద్ధశత్రువుపై మరిన్ని కేసులు -
కేసుల వలయంలో డోనాల్డ్ ట్రంప్.. ఇప్పట్లో బయటపడేనా..
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొత్తంగా 78 కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయనకు ఈ అభియోగాలు అన్నిటిలోనూ శిక్ష పడి, ఏకకాలంలో శిక్ష అనుభవించినా జీవితకాలం పాటు కారాగారంలోనే గడపాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉండగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పిదాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఒక్కొక్కటిగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 76కు చేరుకుంది. ఒకవేళ అభియోగాలన్నీ నిరూపణ అయ్యి ఆయన దోషిగా తేలితే మాత్రం ఆయా నేరాల శిక్షా సమయాన్ని బట్టి ట్రంప్ జీవితకాలం ఖైదును అనుభవించాల్సిందే. శృంగార తారకు చెల్లింపుల వ్యవహారంతో మొదలైన కేసుల పరంపర వైట్ హౌస్ రహస్య పత్రాల కేసుతో ఆయన మెడకు ఉచ్చు మరింత బిగిసింది. తాజాగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మరో కేసు నమోదై ఆయనకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధృవీకరించకుండా ట్రంప్ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు వైట్ హౌస్ అధికారులు వాంగ్మూలం ఇవ్వడంతో ట్రంప్ ఇరుకున పడ్డారు. అసలే వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడి అభ్యర్థి రేసులో కూడా డోనాల్డ్ ట్రంప్ ముందున్నారు. సమయం కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ ఈ కేసుల ఊబి నుండి బయట బయట పడతారా? బయటపడినా వైట్ హౌస్ చేరుకుంటారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇది కూడా చదవండి: సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే.. -
లైంగికదాడి కేసు: రూ.10 లక్షలు నష్టపరిహారం 20 ఏళ్ల జైలు శిక్ష
అన్నానగర్: పరమక్కుడి సమీపంలో ప్లస్టూ విద్యార్థినిపై లైంగికదాడి చేసిన కేసులో రామనాథపురం మహిళా కోర్టు గురువారం ఓ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలోని పొన్నకరై గ్రామానికి చెందిన సంజీవిగాంధీ (35). ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు. ఇతను ప్లస్టూ విద్యార్థినిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంజీవిగాంధీ పలుమార్లు లైంగికదాడి చేశాడు. దీంతో విద్యార్థిని గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన సంజీవిగాంధీపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని నవంబర్ 12, 2019న పరమకుడి మహిళా పోలీస్స్టేషన్న్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సంజీవిగాంధీని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ రామనాథపురం కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం న్యాయమూర్తి గోపినాథ్ సమక్షంలో కేసు విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో సంజీవిగాంధీకి 20 ఏళ్ల జైలు శిక్ష, బాధిత విద్యార్థినికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చింది. -
జైల్లో ప్రేమించుకుని.. పెరోల్పై బయటకువచ్చి పెళ్లి!
కోల్కతా: వివాహాలు స్వర్గంలో నిర్ణయిస్తారని పెద్దలు అంటుంటారు. సరిగ్గా ఇద్దరి ఖైదీల జీవితంలో అలానే జరిగింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వారిద్దరూ అనుకోకుండా జైలులో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని ఓ జైలులోని ఇద్దరు ఖైదీల ప్రత్యేక ప్రేమకథ చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. అస్సాంకి చెందిన అబ్దుల్ హసీమ్, పశ్చిమబెంగాల్ కి చెందిన షానారా ఖతున్ వేర్వేరు హత్య కేసుల్లో బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ లో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. హసీమ్కు 8 ఏళ్లు, షహనారాకు 6 ఏళ్లు శిక్ష విధించి ఇద్దరినీ తీసుకొచ్చి ఈ జైలులో ఉంచారు. అనుకోకుండా జైల్లో ఉండగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. వీరిద్దరికీ జైలులో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది. ఖైదీలిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి వారి కుటుంబాలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే పెరోల్పై విడుదలైన తర్వాత వాళ్లి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. తూర్పు బర్ధమాన్లోని మోంటేశ్వర్ బ్లాక్లోని కుసుమ్గ్రామ్లో ముస్లిం చట్టం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెరోల్ అనంతరం వీరువురు అదే జైలుకు తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. చదవండి ఫ్రెండ్స్ తో కలిసి యువతిపై గ్యాంగ్రేప్.. యువతి ఆత్మహత్యాయత్నం -
సినిమాల్లో నటి నుంచి సెక్స్ రాకెట్ దాకా..
యువతులతో బలవంతంగా సెక్స్ రాకెట్ నడిపిన వ్యవహారంలో ప్రముఖ అమెరికన్ నటి ఎలిసన్ మాక్కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నటి ఎలిసన్ పలువురు యువతులను బలవంతంగా ఈ రొంపిలోకి లాగిందనే ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఆమెపై దర్యాప్తు చేపట్టిన అనంతరం బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు ఈ విధమైన తీర్పును వెలువరించింది. ఆమెకు ఈ శిక్ష సెప్టెంబరు 29 నుంచి అమలుకానున్నదని సమాచారం. కాగా అదే కోర్టులో జడ్జిల సమక్షంలో తాను చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నానని ఎలిసన్ పేర్కొంది. కాగా ఈ తీర్పు వెలువడక ముందు ఎలిసన్ బాధితులతో, వారి కుటుంబ సభ్యుల ముందు ఏడుస్తూ తాను చేసిన పనులు అమానవీయమైనవని, తాను ఎన్ఎక్స్ఐవీఎం నేత కీథ్ రెనాయర్ను పూర్తిగా విడిచిపెట్టేశానని తెలిపింది. అతనికి కొంతకాలం క్రితం అపహరణ, ఇతర నేరాల కింద 120 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కీథ్ ఎన్ఎక్స్ఐవీఎం పేరుతో ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. దానిలో ఆయన మినహా మిగిలినవారంతా మహిళా సభ్యులే ఉన్నారు. ఈ గ్రూపు సభ్యులు మహిళలతో జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించేవారు. ఈ గ్రూపులోని మహిళా సభ్యులు కీథ్తో శారీరక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు ఇతర మహిళలపై ఒత్తిడి తీసుకువచ్చేవారు. ఈ గ్రూపులోని ఎలిసన్ ఇటువంటి పనులకు ఎంతగానో సహకరిస్తుంటుంది. యువతులను అపహరించడం లాంటి అక్రమ కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహించేది. ‘స్మాల్ విలే’తో అనూహ్య ఆదరణ ఎలిసన్ మాక్ డబ్ల్యుబీ టెలివిజన్ సిరీస్ ‘స్మాల్ విలే’తో ఎంతో ప్రజాదరణ పొందింది. ఎలిసన్ అత్యధిక వెబ్సిరీస్లలో నటించింది. ఆమె నటించి బోల్డ్ సీన్స్ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. 1982 జూలై 29న జన్మించిన ఎలిసన్ చిన్న వయసులోనే తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. 2001 నుంచి 2011 వరకూ ప్రసారమైన సూపర్మ్యాన్ స్టోరీ ఆధారంగా రూపొందిన టెలివిజన్ షోలో ఆమె విలేకరి క్లో సులివన్గా నటించి అందరి అభినందనలు అందుకుంది. ఇది కూడా చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ! -
కోడి దొంగతనంపై గొడవ..హత్యాయత్నం.. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు
అమలాపురం టౌన్: భార్యాభర్తలపై హత్యాయత్నం చేయడమే కాకుండా భార్యపై అత్యాచారం చేసిన నేరం రుజువు కావడంతో పి.గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేటకు చెందిన పచ్చిమాల శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరంలోని జిల్లా 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పీఆర్ రాజీవ్ పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. ముద్దాయికి రూ.5 వేల జరిమానా కూడా విధించారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం జనవరి నెలలో ఊడిమూడి శివారు చింతావారిపేటలో తమ సొంత ఇంట్లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. అదే ఇంట్లో ఓ పోర్షన్లో ఉంటున్న పచ్చిమాల శ్రీనివాసరావు హత్యాయత్నం, అత్యాచారం కేసుల్లో నిందితుడు. కోడి దొంగతనంపై జరిగిన విషయమై ఆరా తీసిన భర్తపై కోపంతో పచ్చిమాల శ్రీనివాసరావు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. తొలుత భర్త తలపై సన్నికల్లు పొత్రంతో కొట్టి తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా భార్యను కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఇదే సందర్భంగా ఆమైపె అత్యాచారం కూడా చేశాడన్నది ముద్దాయి శ్రీనివాసరావుపై అభియోగం. అప్పట్లో ఈ కేసులకు సంబంధించి శ్రీనివాసరావుపై పి.గన్నవరం పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అప్పటి డీఎస్పీ వై.మాధవరెడ్డి సమగ్ర దర్యాప్తు చేసి బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా చార్జి షీటు నమోదు చేశారు. కోర్టులో సోమవారం జరిగిన తుది విచారణలో ముద్దాయి శ్రీనివాసరావుపై మోపిన నేరాలు రుజువు కావడంతో న్యాయమూర్తి రాజీవ్ పై విధంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. ప్రత్యేక పర్యవేక్షణ వల్ల ఘటన జరిగిన నాలుగు నెలల్లోనే ముద్దాయికి శిక్షలు పడ్డాయని ఎస్పీ సుసరాపు శ్రీధర్ తెలిపారు. -
రష్యా జర్నలిస్టుకు పాతికేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని తప్పుబట్టినందుకు వ్లాదిమిర్ కారా–ముర్జా జూనియర్(41) అనే జర్నలిస్టు, రాజకీయ కార్యకర్త జైలు పాలయ్యాడు. దేశద్రోహం నేరకింద రష్యా కోర్టు ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సైనిక చర్యను బహిరంగంగా విమర్శిస్తున్న ఆయనపై ఇప్పటికే రెండుసార్లు విషప్రయోగం జరిగింది. జైలుశిక్షను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. -
జైలుకు పోవాలన్న ఆతృత వాళ్లకెందుకు?
సంగారెడ్డి టౌన్: జైలు.. ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఖైదీలు. తెల్లని చొక్కా, దాని మీద నెంబరు.. తెల్ల నిక్కర్.. తెల్ల టోపీ. అయితే జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే వారికోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో ‘ఫీల్ ది జైల్’ పేరుతో సంగారెడ్డిలో ప్రత్యేక కారాగారం ఏర్పాటు చేసింది. దేశంలోనే మొదటి మ్యూజియం, జైలు కూడా ఇదే. నిజాం కాలంలో.. నిజాం కాలంలో మొదట సంగారెడ్డి జైలు ఏరియాలో గుర్రపుశాల నిర్మించారు. ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం అదే ఏరియాలో 1.5 ఎకరాల్లో జైలు ఏర్పాటు చేశారు. ఇందులో పదుల సంఖ్యలో బ్యారక్లు ఉన్నాయి. ఒక్కోదానికి తెలంగాణ, మొఘల్, నిజాం చరిత్ర, భారత స్వాతంత్య్ర ఉద్యమ సంఘటనల పెయింటింగ్ వేయించారు. బ్రిటీష్ కాలం నాటి ఫొటోలు కూడా గదుల్లో ఏర్పాటు చేయించారు. టైపు రైటర్లు, అప్పటి రేడియోలు, పెన్నులు, వాల్ క్లాక్ లు, గంటలు.. ఇలా ప్రతీ వస్తువు ప్రదర్శన కోసం ఉంచారు. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి.. జైలు మ్యూజియమే కాదు.. జైలు జీవితాన్ని అనుభవించాలనుకునేవారికి అధికారులు సంగారెడ్డి జైలులో అవకాశం కల్పించారు. ఇందుకోసం రోజుకు రూ. 500 చెల్లించాలి. వారికి సాధారణ ఖైదీలాగే ఖాదీ దుస్తులు, చొక్కా, నిక్కర్ లేదా ప్యాంట్, ప్లేట్, గ్లాస్, మగ్గు, సబ్బు, మంచి భోజనం, నిద్రించేందుకు దుప్పట్లు తదితర సౌకర్యాలు కల్పించారు. టీ, టిఫిన్ ఇచ్చేవారు. యోగా, క్రమశిక్షణ నేర్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాకప్లో ఉంచేవారు. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరిగేవి. జాతిరత్నాలు సినిమాతో పాటు ఇతర సినిమాల్లో జైళ్ల్ల సీన్ల షుటింగ్ కూడా ఇక్కడే జరిగాయి. ఉదయం 6.30 నుంచే.. ఉదయం 6.30 గంటల నుంచి వ్యాయామం, యోగా శిక్షణ ఉండేది. 7.30 గంటలకు టీతో పాటు టిఫిన్, తర్వాత పరేడ్ 8 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యాదానం ఉండేది. 9.30 గంటలకు మ్యూజియం సూపర్వైజర్ రౌండ్కు వచ్చేవారు. ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు మధ్యాహ్న భోజనం వడ్డించేవారు. 11 గంటల నుంచి తిరిగి విద్యాదానం కొనసాగేది. మధ్యాహ్నం 12.30 గంటలకు టీ, 12.35 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి. 1.30 నుంచి సాయంత్రం 4 గంట ల వరకు కంప్యూటర్ విద్య, ఇతర అంశాలపై అవ గాహన కల్పించేవారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు యోగా, 4.30 గంటల నుంచి బ్యారక్ను శుభ్రం చేయడం వంటి ట్రైనింగ్ ఉండేది. సాయంత్రం 5.30 గంటలకు భోజనం ముగిసిన తర్వాత 6 గంటలకు లాకప్లో ఉంచేవారు. ఇలా ఇక్కడ సుమారు 50 మంది వరకు జైలు జీవితం కూడా గడిపారు. ఇదంతా గతం. కరోనా ఎఫెక్ట్తో జైలు మూతబడింది. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరింది. భారీ వర్షాలకు కాంపౌండ్ వాల్ పడిపోయింది. ప్రభుత్వం స్పందించి ఫీల్ ది జైల్ను పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఫీల్ ది జైల్ ప్రారంభించాలి శిథిలమైన ఫీల్ ది జైల్కు రిపేర్ చేయించాలి. పర్యాటకశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలి. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి అవకాశం కల్పించాలి. ఈతరం వారికి జైలు అంటే ఎలా ఉంటుందో తెలియజేయాలి. – అఖిల్ యాదవ్, సంగారెడ్డి ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి సంగారెడ్డిలోని మ్యూజియం జైలును పునరుద్ధరించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. జైలు జీవితంపై యువతకు అవగాహన కల్పించాలి. చెడుమార్గంలో నడవకుండా, నిజజీవితంలో జైలు జీవితమంటే ఎంత నరకమో తెలియజేయాలి. – కూన వేణు, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు -
రాజమండ్రి జైలు చూశారా? ఎంతలో ఎంత మార్పు.?
(డెస్క్–రాజమహేంద్రవరం): చదువు దారి చూపుతుంది. దారి తప్పిన వారిని సన్మార్గంలోనూ నడుపుతుంది. రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారంలోని కొందరు ఖైదీల గురించి తెలుసుకుంటే ఇది అక్షర సత్యమని అర్థమవుతుంది. వివిధ పరిస్థితుల నేపథ్యంలో.. క్షణికావేశంలో కొందరు నేరానికి పాల్పడుతుంటారు. వీరంతా జైలుకు వచ్చి శిక్ష అనుభవిస్తారు. అయితే ఇక్కడి కారాగారం అధికారులు మాత్రం వీరి శిక్షను శిక్షణగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా వీరిలో విద్యావెలుగులు నింపుతున్నారు. జైలులో జీవితం వృథా కాకుండా ఖైదీలను విద్యాబాట పట్టిస్తున్నారు. పరివర్తన దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఆగిన చదువకు నడక సెంట్రల్ జైలుకు రాకమునుపు ఆపేసిన విద్యను చాలామంది ఇక్కడికి వచ్చాక కొనసాగించగలుగుతున్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా వీరంతా పట్టభద్రులవుతున్నారు. కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం 135 మంది డిగ్రీ చదువుతుండగా 87మంది ఎంఏ చదువుతున్నారు. 638 మంది ఇప్పటికే డిగ్రీ పూర్తి చేయడం విశేషం. వీరికోసం జైలు ప్రాంగణంలోనే పరీక్ష సెంటరు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్గా వీరికి క్లాసులు చెప్పడానికి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకుంటున్నట్లు సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద వయసుండీ నిరక్షరాస్యులైన ఖైదీలకు సైతం రాయడం చదవడం నేర్పుతున్నారు. ప్రస్తుతం 28మంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అనంతలక్ష్మి అనే టీచరు బోధిస్తున్నారు. అబ్బురపరిచే లైబ్రరీ ఖైదీలు చదువుకునేందుకు లైబ్రరీ ఉంది. ఇందులో 4,300 పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు..ఆధ్మాత్మిక భావన కలిగించేందుకు దోహదపడే పుస్తకాలు ఉన్నాయి. లక్ష రూపాయల విలువైన పుస్తకాలను జైలు అధికారులు కొనుగోలు చేశారు. చదువుతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు ఒక సెంటరును నిర్వహిస్తున్నారు. వెల్డింగ్..ప్లంబింగ్ కోర్సులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. ఖరీదైన శిక్షణ పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 30 మంది వంతున ఖైదీలు ఈ కోర్సులు నేర్చుకుంటున్నారు. గోల్డు మెడలిస్టులూ ఉన్నారు సెంట్రల్జైలులో శిక్షను అనుభవిస్తూ పట్టభద్రులైన కొందరు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. షేక్ అజారుద్దీన్ బీఏలో స్వర్ణ పతకాన్ని సాధించారు. షేక్ సుభానీ ..టి వెంకటేశ్వరరావులు కూడా ఇదీ డిగ్రీలో గోల్డు మెడల్ సాధించారు. విజయవాడకు చెందిన జీ విజయరామ్ జైలులోనే పీజీ చదివి విడుదలయ్యాక వీఆర్ఓ ఉద్యోగాన్ని పొందారు. సారేపల్లి శ్రీనివాస్ మూడు డిగ్రీలు చదివారు. రంపచోడవరానికి చెందిన శ్రీనివాస్ కూడా మూడు పీజీలు చేశారు. ఇక్కడ పీజీ చదివాను మాది గుంటూరు. 30సంవత్సరాలుగా ఇక్కడ జైలులో ఉంటున్నాను. జైలుకు రాకమునుపు కరస్పాండెన్స్ కోర్సు డిగ్రీ చేయాలనుకున్నాను. ఇక్కడకు వచ్చాక పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాను. ఎంఏ చదివాను. ఇక్కడి అధికారుల ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని పెంచింది. నాకు ఇప్పుడు 54 సంవత్సరాల వయసు వచ్చింది. చదవడం వల్ల చాలా తెలుసుకున్నాను. విద్య మనిషిలో సత్ప్రవర్తనను పెంచుతుందని గ్రహించాను. విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. – గంటెల విజయవర్దన్ మూడు ఎంఏలు చేశాను మాది రంప చోడవరం. నేను జైలుకు వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది. ఓ హత్య కేసులో నాకు శిక్ష పడింది. జైలుకు వచ్చే ముందు ఎమ్మెస్సీ బీఈడీ చదివాను. ఇప్పుడు మూడు ఎంఏలు చేశాను. పాలిటిక్స్..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్..సోషియాలజీలతో ఈ పీజీలు చదివాను. ఈ శిక్షా కాలం నా జీవితంలో ఊరికే పోలేదని భావిస్తున్నాను. జైలు అధికారుల తోడ్పాటుతో మళ్లీ చదువుకోగలిగాను. చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. గౌరవమూ పొందగలుగుతుండటం నాకు సంతోషం కలిగిస్తోంది. – శ్రీనివాస దొర పరివర్తనే ధ్యేయంగా.. ఖైదీలలో పరివర్తనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. శిక్షాకాలంలో విద్య లేదా నైపుణ్య కోర్సు నేర్చుకునో బయటకు వెళ్లాక ఉపాధిబాట పట్టేలా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలను రూపొందించి అనుసరిస్తున్నాం. మళ్లీ నేరాల వైపు మనసు మళ్లకుండా ఉద్యోగం లేదా ఉపాధి వైపు దృష్టి పెట్టాలనేది మా అభిమతం. అందుకే జైలులో శిక్షాకాలం వృథా కానీయడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు మంచి సహకారం లభిస్తోంది. ఖైదీలు చదువుకోడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిని ఉత్సాహపరిచేలా సహకారం అందిస్తున్నాం. – రాజారావు, జైలు సూపరింటెండెంట్ -
ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..
మనం ఎంతగానో ప్రేమించే భాగస్వామీ లేదా ప్రియమైన వాళ్లు దూరమైతేనే తట్టుకోలేం. అలాంటిది ఎవరి వల్లనో మనవాళ్లను పోగొట్టుకుంటే.. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ మాదిరి రివేంజ్ తీర్చుకోవడం అందరి వల్ల సాధ్య కాదు కూడా! కానీ కొందరూ మాత్రం చూస్తూ కూర్చోలేరు. ఏం చేసేందుకైనా తెగించి మరీ తమ రివేంజ్ తీర్చుకుంటారు. అచ్చం అలాంటి కోవకు చెందినదే కొలంబియాకు చెందిన మహిళ. వివరాల్లోకెళ్తే.. కొలంబియాకు చెందిన మహిళ భర్త.. పేరు మోసిన డ్రగ్ వ్యాపారి రుబెన్ డారియో విలోరియా బారియోస్ చేతిలో హతమయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని సదరు మహిళ ఎలాగైనా అతడిపై రివేంజ్ తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ఆ మహిళ.. డ్రగ్ వ్యాపారి కోసం గాలిస్తున్న ఇంటిలిజెన్స్ అధికారులతో చేతులు కలిపింది. ఆమె అనుకున్న ప్లాన్ ప్రకారమే..వలపు వల విసిరి మరీ అతడిని ప్రేమలోకి దించింది. అతడితో ప్రేమాయాణం సాగిస్తూనే అతడికి సంబంధించిన విషయాలన్నింటిని ఎప్పటికప్పుడూ ఇంటిలిజెన్స్ అధికారులకు చేరవేసింది. ఒక రోజు ఆ మహిళ తన ‘ప్రియుడి’కి మోంటారియా అనే వ్యక్తిని కలిసేలా ఏర్పాటు చేసింది. ముందుగానే అతడికోసం మాటువేసి ఉన్న ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని పట్టుకోవడం కోసం గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. అతడిపై డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారి కల్నల్ గాబ్రియేల్ గార్సియా అన్నారు. అతడిని జువాంచో అని కూడా పిలుస్తారని చెప్పారు. ఆ మహిళ సాయంతో పేరు మోసిన నిందితుడిని పట్టుకోగలిగామని అన్నారు. చివరికి బాధిత మహిళ తన భర్తను పొట్టనబెట్టుకున్న నిందితుడు రుబెన్ డారియోకి 22 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేసి తన ప్రతీకారం తీర్చుకుంది. (చదవండి: అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు') -
వెరైటీ వెడ్డింగ్: 4 గంటలు బెయిల్.. జైలులో యువతి వివాహం
స్నేహం, ప్రేమ.. వీటి కోసం మనకు నచ్చిన వాళ్లని ఎంచుకుంటుంటాం, అయితే పెళ్లి విషయంలో మాత్రం అలా కుదరదు. ఎందుకంటే వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని మన పెద్దలు అంటుంటారు. అందుకు తగ్గట్టే కొందరికి ఊహించని రీతిలో వివాహాలు కూడా జరుగుతుంటాయి. ఇటీవల ఓ యువతి పెళ్లి ఈ తరహాలోనే జైలులో జరిగింది. అసలేం జరిగిందంటే.. పశ్చిమ చంపారన్లోని బగాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్గావ్ గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ హాజీపూర్లో ఇంజనీరింగ్ చదివాడు. రాహుల్ తన కుటుంబంతో కలిసి లక్నోలో సత్సంగానికి వెళ్లాడు. జైలులో పెళ్లి... అక్కడ అతనికి యూపీలోని కప్తంగంజ్కు చెందిన 21 ఏళ్ల కాజల్ ప్రజాపతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ గోపాల్గంజ్లోని తావే దుర్గా గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా జీవితం మొదలుపెట్టారు. ఇటీవల మార్చి 5న కాజల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను రాహుల్ ఆసుపత్రిలో చేర్చాడు. అయితే విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. రాహుల్ కుమార్పై అత్యాచారం చేశాడని ఆరోపణలతో పోలీసులతో అతడిని అరెస్ట్ చేయించి జైలుకు తరలించారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. చివరికి వారిద్దరికి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. అయితే రాహుల్ జైలులో ఉండడంతో గోపాల్గంజ్లోని సీజేఎం కోర్టులో కుటుంబం తరపున ఒక దరఖాస్తు దాఖలు చేశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో కోర్టు పెళ్లికి అనుమతించింది. దీంతో అతని పెళ్లికి నాలుగు గంటల పెరోల్ బెయిల్ లభించింది. గోపాల్గంజ్లోని చనావే జైలు నుంచి నాలుగు గంటలపాటు పెరోల్పై వచ్చిన ఓ ఖైదీ తావే దుర్గా ఆలయంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. తావే దుర్గా ఆలయంలో జరిగిన ఈ అపూర్వ వివాహానికి అబ్బాయి, అమ్మాయితో పాటు పోలీసులు కూడా పెళ్లికి అతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో వివాహ వేడుక తర్వాత, థావే వాలి కోర్టులో దంపతులు భార్యాభర్తలుగా నిర్ధారించింది. తావే దుర్గ గుడిలో ఓ నేరస్థుడి వివాహ వేడుక సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నారు. అమ్మవారి ఆలయంలో జరిగిన ఈ వినూత్న వివాహం ప్రస్తుతం వైరల్గా మారింది. -
పాక్లో దారుణం..కస్టడీలో ఉన్న వ్యక్తిపై హత్యయత్నం
పాకిస్తాన్ ఓ గుంపు కస్టడీలో ఉన్న వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో పోలీసులు వెంటనే అప్పమత్తమయ్యారు. వివరాల్లోకెళ్తే..దైవదూషణ ఆరోపణలపై 20 ఏళ్ల మహ్మద్ వారిస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనుకోకుండా ఓ గుంపు పోలీస్టేషన్లోకి ప్రవేశించి వారిస్పై దాడి చేసి హతమార్చింది. అంతేగాదు వారిసి మృతదేహానికి నిప్పు పెట్టేందుకు యత్నిస్తుండగా అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కొంతమంది అధికారులు పోలీస్స్టేషన్లో ఉండటంతో ఆ గుంపును అడ్డుకోలేకపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి పాక్లో దైవదూషణ కూడా నేరమే, దీనికి మరణశిక్ష విధిస్తుంది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇలాంటి ఘటనలు పాక్లో గతంలో చాలానే జరిగాయి. అంతేగాదు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ విషయమై పలుమార్లు పాక్ని విమర్శించింది కూడా. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ సంఘటనపై తక్షణమే విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించనట్లు సమాచారం. అలాగే ఆ గుంపు కస్టడీలో ఉన్న వ్యక్తిని చంపకుండా అడ్డుకోవండంలో విఫలమైనందుకు పలవురు పోలీసులను కూడా సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. (చదవండి: అమెరికా గగనతలంలో మరో బెలూన్ కలకలం) -
భూకంపంతో జైలు గోడలు ధ్వంసం.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు జంప్..!
టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించి వేల భవనాలు నేలమట్టం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా కొందరు ఖైదీలకు జైలు నుంచి తప్పించుకునేందుకు అవకాశం లభించింది. టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతం రాజోలోని జైలు భూప్రకంపనల కారణంగా పాక్షికంగా దెబ్బతింది. గోడలకు పగుళ్లు వచ్చి కులిపోయాయి. దీన్నే అదునుగా భావించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఖైదీలు జైలులో తిరుగుబాటు చేశారు. జైలులోని ఓ భాగాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం 20 మంది జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరంతా ఐసిస్ సంస్థకు చెందిన వారేరని అధికారులు తెలిపారు. ఈ జైలును టర్కీ అనుకూల గ్రూప్లే నియంత్రిస్తాయి. మొత్తం 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్ ఉగ్రసంస్థకు చెందినవారే. వీరితో పాటు సిరియా అనుకూల ఖుర్షీద్ దళాలకు చెందిన ఫైటర్లు ఉన్నారు. అయితే జైలులో తిరుగుబాటు జరిగిన విషయం నిజమేనని, కానీ 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ధ్రువీకరించలేమని బ్రిటన్కు చెందిన సిరియన్ అబసర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. ఐసిస్ ఖైదీలను తప్పించేందుకు గతేడాది డిసెంబర్లో సెక్యూరిటీ కాంప్లెక్స్పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఖుర్దీష్ దళాలకు చెందిన ఆరుగురు చనిపోయరు. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
జైల్లో పాట.. దెబ్బకు ఫేమస్.. ఫేట్ మారింది
వైరల్: ఊచల వెనుక పాడిన పాటను పోలీసు వాళ్లే చిత్రీకరించారు. అతని మధుర గాత్రానికి ఫిదా అయ్యి వైరల్ చేశారు. కటకటాల వెనుక పాడిన పాటకు ఇంటర్నెట్ ఫిదా అయ్యింది. ఆ వ్యక్తి మరింత ఫేమస్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక.. తన పాట ఫేమస్ కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడతను. దానికి కొనసాగింపుగానూ అతనికి ప్రభుత్వ సాయం ప్రకటనతో పాటు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్లోని కైమూర్ దహ్రక్ గ్రామానికి చెందిన కన్హయ్యరాజ్ను.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో బక్సర్ పోలీసులు అరెస్టు చేశారు. యూపీ నుంచి తాగొచ్చాడని(బీహార్లో మద్యపాన నిషేధం అమలు ఉండడంతో) పోలీసులు అతని ఆ రాత్రి జైల్లో ఉంచారు. అయితే ఆ పూట జైలు శిక్ష అతని జీవితాన్ని మార్చేసింది. ఉదయం విడుదలై బయటకు వచ్చిన కన్హయ్యను.. ఆ తర్వాత అంతా కొత్తగా చూడడం మొదలుపెట్టారు. అతని పాట ఫేమస్ అయ్యిందని వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లలో చక్కర్లు కొడుతోందని స్నేహితులు చెప్పారు. దీంతో తన గొంతు విన్న కన్హయ్య తెగ ఖుష్ అయ్యాడు. అయితే.. మద్యం సేవించినందుకు తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, పవన్ సింగ్(భోజ్పురి హీరో) పాట పాడినందుకు.. ఆ పాటలో ఒక పదం అభ్యంతకరంగా ఉందని ఆ హీరో ఫ్యాన్ ఫిర్యాదు చేసినందుకే తనను అరెస్ట్ చేశారని కన్హయ్య చెప్తున్నాడు. కానీ, ఆ వీడియోను తాను అప్పుడే డిలీట్ చేశానని వివరణ ఇచ్చాడతను. ఇక ఆ రాత్రి జైల్లో గడిపిన తాను సరదాగా పాట పాడనని, అది ఎవరు వీడియో తీశారు, ఎలా వైరల్ అయ్యిందో కూడా తనకు తెలియదని అంటున్నాడతను. ఆర్థిక కష్టాలతో చిన్నతనంలోనే చదువుకు తాను దూరం అయ్యానని, రిపబ్లిక్డే, ఇతర ఫంక్షన్లకు పాటలు కూడా పాడతానని చెప్తున్నాడు కన్హయ్య. ఇక జైలు వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ అంకిత్ తివారీ తన మ్యూజిక్ ఆల్బమ్లో పాడేందుకు కన్హయ్యకు అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి మట్టిలో మాణిక్యాలను రాటు దేల్చాల్సిన అవసరం ఉందని, అతని కుటుంబానికి అవసరమయ్యే సాయం అందిస్తామని ప్రకటించడం గమనార్హం. తనలో దాగున్న ప్రతిభ నలుగురికి తెలియడం, దాని ద్వారా తన కుటుంబ పరిస్థితిని మార్చుకునే అవకాశం దొరికినందుకు ఆ దేవుడికి, తనను వైరల్ చేసినవాళ్లకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడతను. नशा एक सामाजिक बुराई है और सिर्फ कला में शक्ति है इस बुराई को हराने की ।@shalabhmani जी मैं इस व्यक्ति को अपनी म्यूजिक कंपनी @MistMusic_ की तरफ से एक गाना गाने का मौका देता हूं । 🙏 https://t.co/qug7cto5Rp — Ankit Tiwari (@officiallyAnkit) January 9, 2023
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement