-
ఓటు మా బాధత్య.. పల్లెకు బయల్దేరిన నగరవాసులు (ఫొటోలు)
-
శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
రైలు ఎక్కేటప్పుడు.. దిగెటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. రైలు కదులుతుంటే పట్టాలు, ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కొని కొంత మంది ప్రాణాలు కోల్పోతే.. మరికొంత మంది అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( ఆర్పీఎఫ్) పోలీసుల సాహసంతో ప్రాణాలు దక్కించుకున్నవారు ఉన్నారు. అటువంటి ఘటనే ఒకటి హరిద్వార్లో చోటుచేసుకుంది. ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రైలు కింది పడిన వ్యక్తిని సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్లితే... ఉత్తరాఖండ్ హరిద్వార్కు సమీపంలోని లక్సర్ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు ఆహారం కోసం రైలు దిగాడు. అతను దిగిన రైలు కదలటంతో పరుగుపెట్టి మరీ ఎక్కడానికి ప్రయిత్నించాడు. కానీ, రైలు వేగంగా ఉండటంతో ఒక్కసారిగా డోర్ వద్ద అదుపుతప్పి రైలు పట్టాలు, ప్లాట్ మధ్యలో పడిపోయాడు. అప్పటికే రైలు కదులుతోంది. ప్రయాణికుడు రైలు కింద పడినట్లు శబ్దంతో రావటంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే వచ్చి.. ముందుగా ఆ ప్రయాణికుడి తలను ప్లాట్పైకి లాగింది. వెంటనే రైలును అత్యవసరంగా ఆపారు. తర్వాత ఆ ప్రయాణికుడిని ప్లాట్ఫామ్కి లాగారు. క్షణాలో సమయస్ఫూర్తితో స్పందించిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. ప్రయాణికుడిని రక్షించి కానిస్టేబుల్ కే. సుమతి రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని కాపాడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. #viralvideo At Haridwar's Laksar railway station a passenger carrying food items from the railway station boarded the Calcutta-Jammutvi Express During this, his foot slipped and he got stuck between the train and the platform Woman constable Uma pulled him out safely#Uttarakhand pic.twitter.com/BvfnMqlPtQ— Siraj Noorani (@sirajnoorani) April 28, 2024 -
రైలులో నోట్ల కట్టలు.. రూ. 4 కోట్లకు పైగా సీజ్
చెన్నై, సాక్షి: చెన్నై తాంబరం రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నెల్లూరు ఎక్స్ప్రెస్ రైలులో 4 కోట్లకు పైగా నగదును పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు వ్యక్తులు ఎనిమిది బ్యాగులతో ఎగ్మోర్లో రైలు ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు, తాంబరంలో విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్లు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తాంబరం రైల్వే స్టేషన్కు చేరుకుని నిందితులను పట్టుకున్నారు. నిందితులను అగరానికి చెందిన ఎస్ సతీష్, అతని సోదరుడు ఎస్ నవీన్, తూత్తుకుడికి చెందిన ఎస్ పెరుమాల్గా గుర్తించారు. సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ (ఏ1)లో వెతకగా వారి వద్ద ఉన్న బ్యాగుల్లో రూ. 500 నోట్ల కట్టలు దొరికాయి. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశారు. ఐటీ బృందాలు నిందితులను ఆదివారం లేదా సోమవారం విచారించనున్నాయి. తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నైనార్ నాగేంద్రన్కు చెందిన కిల్పాక్, ట్రిప్లికన్, సాలిగ్రామం ప్రాంతాలలో కూడా పోలీసులు సోదాలు చేశారు. నిందితులు నగదును ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లే ముందు బీజేపీ నేతకు సంబంధించిన ప్రదేశాల్లో ఉంచినట్లు తెలిసింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరునెల్వేలి లోక్సభ నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు ఈ డబ్బును తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలకు మొదటి దశ అంటే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
Krishna Express: కృష్ణా ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగి పెద్ద శబ్ధం రావడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో, ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో భారీశబ్దం వినిపించింది. దీంతో హడలిపోయిన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. అనంతరం పట్టాలను పరిశీలించగా రైలు పట్టా విరిగినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే మరమ్మతులు చేశారు. అనంతరం రైలు బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం
-
కాజీపేట్ రైల్వే యార్డులో అగ్ని ప్రమాదం
సాక్షి, హనుమకొండ: కాజీపేట్ రైల్వేస్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ కోసం నిలిపిన రైల్ బోగీ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మంటలు అదుపు చేశారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నమని పోలీసులు తెలిపారు. -
డ్రైవర్ లేకుండా 70 కిలోమీటర్లు పరుగులు తీసిన గూడ్సు!
జమ్ముకశ్మీర్లోని కథువా రైల్వే స్టేషన్లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్కోట్ వైపు ఏకంగా 70 కిలోమీర్ల దూరం వరకూ పరుగులు తీసింది. నేటి(ఆదివారం) ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్లోని హోషియార్పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయమై ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు తెలియజేశారు. ఎట్టకేలకు కథువాకు 70 కిలోమీటర్ల దూరంలోని హోషియార్పూర్లోని దాసుహా వద్ద ఆ గూడ్సను నిలిపివేయగలిగారు. రైల్వే ట్రాక్పై చెక్క దిమ్మెలను ఉంచి, రైలును ఆపడంలో రైల్వే ఉద్యోగులు విజయం సాధించారు. #WATCH | Hoshiarpur, Punjab: The freight train, which was at a halt at Kathua Station, was stopped near Ucchi Bassi in Mukerian Punjab. The train had suddenly started running without the driver, due to a slope https://t.co/ll2PSrjY1I pic.twitter.com/9SlPyPBjqr — ANI (@ANI) February 25, 2024 ఈ సందర్భంగా ఆ గూడ్సు డ్రైవర్ మాట్లాడుతూ తాను ఆ రైలుకు హ్యాండ్బ్రేక్ వేయడం మర్చిపోయానని, ఫలితంగా ఆ రైలు పట్టాల వాలు కారణంగా ఆటోమేటిక్గా ముందుకు కదిలిందని తెలిపాడు. రైలు కదులుతున్న సమయంలో తాను అక్కడ లేనిని చెప్పాడు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫిరోజ్పూర్ రైల్వే అధికారుల బృందం జమ్మూ చేరుకుంది. -
చర్లపల్లి టెర్మినల్ నుంచి త్వరలో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నాలుగో రైల్వే టెర్మినల్గా చర్లపల్లి స్టేషన్ సేవలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే రూ.221 కోట్లతో చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్ను విస్తరించారు. సరుకు రవాణాకు పార్శిల్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల రాకపోకలను నియంత్రించవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే చర్లపల్లి స్టేషన్ విస్తరణ పూర్తి కావడంతో మార్చి నుంచి కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని మోదీతో ప్రారంభం! ప్రధాని మోదీతోనే త్వరలో చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించనున్నారు. అదే రోజు రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ► షాలిమార్ నుంచి సికింద్రాబాద్కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ (18045/18046) త్వరలో సికింద్రాబాద్కు బదులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్కు నడిచే చార్మి నార్ ఎక్స్ప్రెస్ (12603/12604) చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► గోరఖ్పూర్ నుంచి సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. మరో 6 రైళ్లకు హాల్టింగ్... ► హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్ప్రెస్ రైళ్లను మార్చి నుంచి చర్లపల్లి స్టేషన్లో నిలుపనున్నారు.ఈ మేరకు రైల్వేబోర్డు అనుమతులను ఇచ్చింది. -
కడప రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
-
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. చిల్లర కష్టాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికుల బాధను అర్థం చేసుకుని రైల్వేస్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద చిల్లర ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల ప్రకారం.. ప్రయాణికులు సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ పేమెంట్స్కు సౌకర్యం కల్పించనుంది. దీంతో, ప్రయాణికుల చిల్లర కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టినట్టు అయ్యింది. ఇక, దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంపై ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రైల్విలాస్: అప్పట్లో రైల్వేస్టేషన్.. ఇప్పుడు హోటల్
ప్రపంచంలోని పురాతనమైన రైల్వేస్టేషన్లలో ఇదొకటి. ఒకప్పుడు రైళ్ల రాకపోకలతో కళకళలాడేది. ఇక్కడ రైల్వే సేవలు నిలిచిపోవడంతో కొన్నాళ్లకు ఈ రైల్వేస్టేషన్నే హోటల్గా మార్చేశారు. ఇది ఇంగ్లండ్లోని పెట్వర్త్లో ఉంది. మిడ్ ససెక్స్ రైల్వే కంపెనీ 1859లో ఇక్కడ రైల్వేస్టేషన్ను నిర్మించింది. అప్పట్లో ఇక్కడ రైల్వే సిబ్బంది, ప్రయాణికుల వసతి కోసం స్టేషన్కు ఆనుకునే ‘రైల్వే ఇన్’ అనే హోటల్ కూడా వెలిసింది. దాదాపు శతాబ్దానికి పైగా సేవలందించిన పెట్వర్త్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను 1966లో నిలిపి వేశారు. తర్వాత దశాబ్దాల తరబడి ఇది అతీ గతీ లేకుండా పడి ఉంది. తర్వాత రైల్వేస్టేషన్కు మరమ్మతులు జరిపి, 1995లో తొలిసారిగా స్టేషన్ భవనంలో రెండు గదులను హోటల్ గదుల్లా మార్చి, అతిథులకు బస కల్పించడం ప్రారంభించారు. తర్వాత ఇక్కడ నిలిచిపోయిన పాత రైళ్ల బోగీలను కూడా హోటల్ గదులుగా మార్చి, స్టేషన్ భవనంలో కూడా మరిన్ని గదులను ఏర్పాటు చేసి 1998 నుంచి దీన్ని ‘ద ఓల్డ్ రైల్వేస్టేషన్’ పేరుతో పూర్తిస్థాయి హోటల్గా మార్చారు. -
రైలుపల్లె.. రెడ్డిపల్లి
వైఎస్సార్: చైన్నె–ముంబై రైలు మార్గంలో తొలుత ఏర్పడిన స్టేషన్ రెడ్డిపల్లి. రైలు రావడానికి కారణమైన పల్లె గనుక ఇప్పటికీ రైలు పల్లెగా ప్రసిద్ధి కెక్కింది. అయితే రైల్వేశాఖ ఈ రైల్వేస్టేషన్ ఆనవాళ్లు లేకుండా చేసిందనే విమర్శలను మూటకట్టుకుంది. దక్షిణ భారతదేశంలో తొలి రైల్వేస్టేషన్గా రెడ్డిపల్లిను చెప్పుకుంటారు. తర్వాత ఇక్కడి నుంచి నందలూరు వరకు రైలు మార్గం వేశారు. చెయ్యేరు నీరు శ్రేష్టమని భావించి రైలు ఇంజిన్ల నిర్వహణ కోసం లోకోషెడ్ నిర్మించేందుకు బ్రిటీషు రైల్వేపాలకులు ముందుకొచ్చారు. ► రెడ్డిపల్లి రైల్వేస్టేషన్లో విక్టోరియా రాణి.... రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు రైల్వేట్రాక్ వేశారు. విక్టోరియా రాణి ఇక్కడికి వచ్చి దీనిని ప్రారంభించారు. రైల్వేమార్గం పురోగతిపై నాటి రైల్వేపాలకులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికీ రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో రైల్వేకు ఎకరాల్లో స్థలం ఉంది. నిన్న మొన్నటివరకు బ్రిటీష్ రైల్వేపాలకుల చిహ్నాలు ఉండేవి. రాయపురం నుంచి..... మద్రాసు, సందరన్ మరాఠా రైల్వేస్ పరిధిలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి తమిళనాడులోని రాయపురం వరకు 153 కిలోమీటర్లు రైల్వేట్రాక్ నిర్మించారు. ఇదంతా 1857 ప్రాంతంలో జరిగింది. దేశంలో తొలి రైలుమార్గం ముంబై–థానా మధ్య నిర్మితమైన క్రమంలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు ట్రాక్ నిర్మితమైందని సమాచారం. రైల్వేస్టేషన్ను పూర్తి బర్మా టేకుతో నిర్మించారు. మద్రాసు నుంచి నేరుగా రెడ్డిపల్లి వరకు..... మద్రాసు నుంచి నేరుగా రెడ్డిపల్లి వరకు గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. బొగ్గుతో నడిచే రైలింజన్లతో రైళ్ల రాకపోకలను కొనసాగించారు. ఈ స్టేషన్లో మద్రాసు–రాయచూరు–రేణిగుంట–గుంతకళ్లు ప్యాసింజర్ రైళ్లు ఆగేవి. అరక్కోణం , కడప ప్యాసింజర్ రైళ్లు కూడా నిలిచేవి. 2003–2004 మధ్యలో రైల్వేస్టేషన్ మూసివేత ఇండియా రైల్వేలో మీటర్గేజ్లను బ్రాడ్గేజ్లుగా మార్చడం.. సింగల్ లైన్ ఉన్న రైల్వేస్టేషన్ను డబుల్ లైన్ చేశారు. ఈ క్రమంలో 2003–2004లో స్టేషన్ను మూసివేశారు. స్టేషన్ మాస్టర్లను, పాయింట్మెన్లను అందరినీ బదిలీ చేశారు. తర్వాత కాంట్రాక్టు పద్దతిలో రైల్వే టికెట్లు ఇచ్చేందుకు బుకింగ్ రూమ్ నిర్మించారు. లెవెల్ క్రాసింగ్ గేటు బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు కొనసాగుతోంది. ► స్టేషన్ మూసివేతకు ప్రధానంగా రెడ్డిపల్లికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో పుల్లంపేట రైల్వేస్టేషన్, ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఓబులవారిపల్లె స్టేషన్లు ఉన్నాయి. రైళ్లవేగం పెరిగిన క్రమంలో నాలుగు, ఐదు నిమిషాల్లో రైలు రెడ్డిపల్లి స్టేషన్ దాటి పోతుంది. ఆ స్టేషన్ ఉండటం వల్ల రైల్వేకు ఎలాంటి లాభదాయకం కాదని అప్పటి డీఆర్ఎం నివేదిక సమర్పించారు. దీంతో రైల్వేబోర్డు స్టేషన్ను మూసివేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. స్టేషన్ను మూసి వేయవద్దని కార్మికసంఘాలు చేసిన విజ్ఞప్తిని అధికారులు పెడచెవిన పెట్టారు. ► బ్రిటీషు రైల్వేపాలకుల హయాంలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ను కేంద్రంగా చేసుకొని ముంబై–చైన్నె రైలు మార్గం నిర్మించారు. ఈ స్టేషన్లో రెండు లైన్లు, ఒక ప్లాట్ఫామ్ ఉండేది. గూడ్స్ సైడింగ్ను కూడా బ్రిటీషర్లు ఏర్పాటు చేసుకున్నారు. 1980లో ఈ సైడింగ్ను మూసివేశారు. ఇక్కడి నుంచి గూడ్స్ వ్యాగన్లో కర్రబొగ్గు, ఎర్రగడ్డలు, తమలపాకు, నిమ్మకాయలు మద్రాస్ హార్బర్కు తీసుకెళ్లి అక్కడ నుంచి గోధుమలు, బార్లీ దిగుమతి అయ్యేవి. భావితరాలకు తెలియాలి బ్రిటీషు కాలం నుంచి చరిత్ర కల్గిన రైల్వేస్టేషన్లు గురించి, ఆనాటి పరిజ్ఞానం, రైళ్ల గురించి భావితరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడు రైల్వే లాభాలు చూసుకుంటోంది. చరిత్ర కల్గిన స్టేషన్లు కాలగర్భంలో కలిసిపో యాయి. ఇందులో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ ఒకటి. – తల్లెం భరత్ కుమార్ రెడ్డి, గుంతకల్ రైల్వే బోర్డు మెంబర్ సరుకుల రవాణాకు అనుకూలం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్ రెడ్డిపల్లి.దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇక్కడి నుంచి ఇంగ్లాడుకు సరుకుల రవాణ జరిగింది. బ్రిటీషు రైల్వేపాలకులు రెడ్డిపల్లికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు స్టేషన్ లేకుండా పోవడం విచారకరం. – ముస్తాక్, మండల కనీ్వనర్ పునరుద్ధరించాలి చరిత్ర కల్గిన రైల్వేస్టేషన్ రెడ్డిపల్లి జిల్లాలో ఉండడం గర్వకారణం. మా పూర్వీకుల నుంచి స్టేషన్ రాకపోకలకు అనుకూలంగా ఉండేది. నేడు దీనిని ఆనవాళ్లు లేకుండా చేయడం బాధాకరం. ఈ స్టేషన్ను పునరుద్ధరిస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. – జనార్దన్, రెడ్డిపల్లి, పుల్లంపేట మండలం -
Vizag: విశాఖ రైల్వేస్టేషన్లో వ్యక్తి హల్చల్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వేస్టేషన్లో రూఫ్ టాప్పైకి ఎక్కి కరెంట్ తీగలను పట్టుకుంటాను అంటూ అక్కడున్న వారిని బెదిరించాడు. దీంతో, ప్రయాణికులు హడిలిపోయారు. రైల్వేస్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. విశాఖ స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ప్రయాణికులతోపాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులను టెన్షన్ పెట్టాడు. రూఫ్టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరింపులకు దిగాడు. అతడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తొలుత విద్యుత్ సరఫరా నిలిపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. నాలుగో నంబర్ ప్లాట్ఫామ్పై ఉన్న పూరీ-తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుపైకి దూకాడు. దీంతో అతడి వెంట పరుగులు పెట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ప్రయాణికుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. అనంతరం, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఉజ్వల లబ్ధిదారు ఇంట్లో టీ తాగిన మోదీ
అయోధ్య: ‘ఉజ్వల పథకం’ 10 కోట్లవ లబ్దిదారు మీరా మంఝీతో మోదీ అన్న మాటలివి! అయోధ్య రైల్వేస్టేషన్ ప్రారంభించాక విమానాశ్రయానికి వెళ్తూ మార్గ మధ్యంలో లతా మంగేష్కర్ చౌక్ కూడలి సమీపంలో ఆయన హఠాత్తుగా ఆగారు. సమీప వీధిలోని మీరా ఇంటికెళ్లి వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. స్వయానా ప్రధాని తన ఇంటికి రావడంతో ఉబ్బి తబ్బిబ్బైన మీరా బహుశా ఆ కంగారులో ఆయనకు కలిపిచి్చన టీలో కాస్తంత చక్కెర ఎక్కువేశారు. ఆ చాయ్ తాగుతూ తీపి ఎక్కువైందని మోదీ సరదాగా స్పందించారు. ఉజ్వల పథకం 10 కోట్లవ లబ్ధిదారు కావడంతో ఆమె కుటుంబాన్ని కలిసేందుకు మోదీ ప్రత్యేకంగా వారింటికి వెళ్లారు. ‘‘ఉజ్వలతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వచి్చంది. కేంద్ర గృహ నిర్మాణ పథకంతో ఉచితంగా ఇల్లూ వచి్చంది’’ అంటూ మీరా ఆనందం వెలిబుచ్చారు. ఆమె కుటుంబ యోగక్షేమాలను మోదీ అడిగి తెల్సుకున్నారు. మీరా కుమారుడికి ఆటోగ్రాఫ్ ఇచ్చి వందేమాతరం అని రాసిచ్చారు. అక్కడి చిన్నారులతో సెల్ఫీ దిగారు. ‘‘పాత ప్రభుత్వాలు ఐదు దశాబ్దాల్లో కేవలం 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లిస్తే మేం పదేళ్లలో ఏకంగా 18 కోట్ల కనెక్షన్లు అందించాం. వాటిలో పది కోట్లు ఉచిత కనెక్షన్లే’’ అని మోదీ అన్నారు. -
అయోధ్యలో రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
-
అయోధ్య వాసుల కష్టానికి దక్కిన ఫలితమిది
PM Narendra Modi In Ayodhya Updates ప్రపంచం యావత్తూ జనవరి 22 కోసం ఎదురుచూస్తోంది : ప్రధాని మోదీ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం నేను కూడా మీలాగే ఎదురుచూస్తున్నాం ఒకప్పుడు అయోధ్యలో రాముడు టెంట్లో కొలువుదీరాడు ఇప్పుడు రాముడికి గొప్ప మందిరం వచ్చింది ఇది అయోధ్య వాసుల కష్టానికి దక్కిన ఫలితం అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలబెడతాం వారసత్వం మనకు సరైన మార్గం చూపిస్తుంది అభివృద్ధి చెందాలంటే వారసత్వాన్ని కాపాడుకోవాలి కొన్ని రోజుల్లో అయోధ్యలో వారసత్వం వెల్లివిరుస్తుంది ఇకపై అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య ఐదురెట్లు పెరుగుతుంది అయోధ్య ఎయిర్ పోర్ట్ చూసి ప్రతి ఒక్కరూ పులకించిపోతారు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ ప్రాంగణంలో జరిగిన జన్ సభలో భావోద్వేగంగా ప్రధాని మోదీ #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "Today the whole world is eagerly waiting for the 22nd January..." The consecration ceremony of the Ram temple will be held on January 22 in Ayodhya pic.twitter.com/MXTdAczYqn — ANI (@ANI) December 30, 2023 #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "I have a request to all. Everyone has a wish to come to Ayodhya to be a part of the event on 22 January. But you know it is not possible for everyone to come. Therefore, I request all Ram devotees that once the formal… pic.twitter.com/pbL81WrsbZ — ANI (@ANI) December 30, 2023 అయోధ్య బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి సంబంధించి రూ.15,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని #WATCH | Prime Minister Narendra Modi participates in a public programme in Ayodhya, Uttar Pradesh. The PM will inaugurate, dedicate to the nation and lay the foundation stone of multiple development projects worth more than Rs 15,700 crore in the state. pic.twitter.com/BxnVrZGNv3 — ANI (@ANI) December 30, 2023 అయోధ్యకు ఎగిరిన తొలి విమానం టేకాఫ్ అనౌన్స్ చేసిన ఇండిగో పైలట్ కెప్టెన్ అశుతోష్ శేఖర్ కాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్న తొలి విమానం #WATCH | IndiGo pilot captain Ashutosh Shekhar welcomes passengers as the first flight takes off from Delhi for the newly constructed Maharishi Valmiki International Airport, Ayodhya Dham, in Ayodhya, UP. pic.twitter.com/rWkLSUcPVF — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ఎయిర్పోర్ట్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ #WATCH | PM Narendra Modi inaugurated Maharishi Valmiki International Airport Ayodhya Dham, in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/6phB4mRMY5 — ANI (@ANI) December 30, 2023 అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో ప్రారంభం జై శ్రీరామ్తో మారుమోగిపోతున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్టులో జై రామ్.. శ్రీరామ్ నినాదాలు అయోధ్య ఎయిర్పోర్ట్ను మరికాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రయాణికులతో అయోధ్య చేరుకోనున్న తొలి విమానం రామాయణం రచించిన మహర్షి వాల్మీకి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టిన కేంద్రం #WATCH | Delhi: People raise slogans of 'Jai Ram, Shri Ram'as they board the first flight for the newly built Maharishi Valmiki International Airport Ayodhya Dham, in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate Maharishi Valmiki International Airport Ayodhya Dham shortly. pic.twitter.com/4xrYPZeKK2 — ANI (@ANI) December 30, 2023 ఆ ఇద్దరికి సెల్ఫీలు.. ఆటోగ్రాఫ్లు యూపీ అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీని కలిసిన ఇద్దరు చిన్నారులు చిన్నారులకు సెల్ఫీ ఫోజులు ఇచ్చిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్లిచ్చి కాసేపు వాళ్లతో ముచ్చటించిన ప్రధాని Uttar Pradesh | Prime Minister Narendra Modi met two children in Ayodhya and took selfies with them and also gave them autographs. pic.twitter.com/N7PHVTRwr7 — ANI (@ANI) December 30, 2023 #WATCH | Ayodhya, Uttar Pradesh: Two children who met Prime Minister Narendra Modi and took selfies with him, express their happiness. PM Modi also gave them autographs. https://t.co/RCMlsNOxpp pic.twitter.com/mGryxiRhLP — ANI (@ANI) December 30, 2023 కాసేపట్లో అయోధ్య ఎయిర్పోర్ట్ ప్రారంభం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయోధ్య ధామ్గా నామకరణం కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6వ తేదీ నుంచి విమానాల రాకపోకలు షురూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వాల్మీకి ఎయిర్పోర్ట్కి విమానాలు అయోధ్య లతా మంగేష్కర్ చౌక్లో సందడి చేసిన ప్రధాని మోదీ #WATCH | PM Narendra Modi at the Lata Mangeshkar Chowk in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/ZSkQVt41a3 — ANI (@ANI) December 30, 2023 ఆమె ఇంట్లో ఛాయ్ తాగిన ప్రధాని మోదీ అయోధ్య పర్యటనలో మోదీ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు ఉజ్వల యోజన లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లారు ఆమె ఇంట్లో టీ తాగి.. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు పీఎం ఉజ్వల యోజన కింద 10 కోట్ల మంది లబ్ధిదారులున్న సంగతి తెలిసిందే కాసేపట్లో అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ అమృత్ భారత్ను ప్రారంభించిన ప్రధాని రెండు అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ అంతకు ముందు.. రైలులోని విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతీ అయోధ్య పర్యటనలో రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi flags off two new Amrit Bharat trains and six new Vande Bharat Trains. pic.twitter.com/Q1aDQc8wG7 — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ధామ్ జంక్షన్ ప్రారంభం అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ అయోధ్య ధామ్ జంక్షన్గా అయోధ్య రైల్వే స్టేషన్కు నామకరణం రూ.240 కోట్లతో పునరుద్ధరణ పనులు అయోధ్య మందిర చిత్రాలతో.. హైటెక్ హంగులతో స్టేషన్ మూడు అంతస్థులతో అయోధ్య జంక్షన్ పునర్నిర్మాణం #WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya, Uttar Pradesh Developed at a cost of more than Rs 240 crore, the three-storey modern railway station building is equipped with all modern features like lifts, escalators,… pic.twitter.com/oJMFLsjBnp — ANI (@ANI) December 30, 2023 #WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya. Uttar Pradesh Governor Anandiben Patel, CM Yogi Adityanath, Railways Minister Ashwini Vaishnaw are also present. pic.twitter.com/ls97j4eKkE — ANI (@ANI) December 30, 2023 भगवान रामलला की नगरी में #PMModi, उनके रोड शो में उमड़ा जनसैलाब, जय श्री राम की गुंज के बीच 'अयोध्या धाम जंक्शन' का किया उद्घाटन। #Ayodhya @BJP4India @narendramodi #RamMandir pic.twitter.com/gv8Ewzed39 — Aviral Singh (@aviralsingh15) December 30, 2023 దారిపొడవునా.. ప్రధానికి సాదర స్వాగతం ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో కొనసాగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం మెగా రోడ్ షో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారుల ప్రదర్శన ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ను కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ #WATCH | People shower flower petals on Prime Minister Narendra Modi as he holds a roadshow in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat… pic.twitter.com/b53mxsHFml — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం #WATCH | PM Narendra Modi greets people as he arrives in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/zqpaqjzzW4 — ANI (@ANI) December 30, 2023 అయోధ్యలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో అయోధ్య పర్యటనలో మెగా రోడ్షోలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ దారికి ఇరువైపులా బారులు తీరిన జనం అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రధాని మోదీ మోదీకి ఘనంగా స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా.. సాంస్కృతిక కళల ప్రదర్శన #WATCH | Prime Minister Narendra Modi arrives in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/c60Tzh4Xkb — ANI (@ANI) December 30, 2023 రాముడు అందరివాడు: ఫరూక్ అబ్దుల్లా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది అందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు రాముడు కేవలం హిందువులకే దైవం కాదు.. ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ దేవుడే.. అది పుస్తకాల్లోనూ రాసి ఉంది ప్రజలంతా మత, భాష బేధాలు లేకుండా సోదరభావంతో, ప్రేమతో, ఐక్యంగా ఉండాలని శ్రీరాముడు విశ్వ సందేశం ఇచ్చారు కాబట్టి ఆలయం ప్రారంభం అయ్యే సమయంలో అంతా సోదరభావంతో మెలగాలి #WATCH | Poonch, J&K: Former CM of Jammu and Kashmir and National Conference leader Farooq Abdullah says, "Ayodhya Ram Temple is about to be inaugurated. I would like to congratulate everyone who made the effort for the temple. It's ready now. I would like to tell everyone that… pic.twitter.com/V7Pb5Q8uN1 — ANI (@ANI) December 30, 2023 ►అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం ఎయిర్పోర్టు నుంచి 15 కిలోమీటర్లు సాగే రోడ్ షోలో పాల్గొననున్న మోదీ Prime Minister Narendra Modi arrives in Ayodhya; received by Uttar Pradesh Governor Anandiben Patel and CM Yogi Adityanath PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat… pic.twitter.com/yWqDDowRcm — ANI (@ANI) December 30, 2023 ►కాసేపట్లో అయోధ్యకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కాసేపట్లో ప్రధాని అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఘనస్వాగతంతో ముందుకు సాగుతారు. ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ను, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసే ‘జన్ సభ’లో మాట్లాడతారు. ఈ సభకు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశముంది. సభానంతరం ప్రధాని తిరుగు పయనమవుతారు ►అయోధ్యలో నాలుగు గంటలపాటు ఉండనున్న ప్రధాని #WATCH | Ayodhya: BJP MP Lallu Singh says, "Entire Ayodhya has been decorated. The people of Ayodhya are waiting eagerly for the most popular world leader, PM Modi...Devotees of Lord Ram in Ayodhya will welcome PM Modi with warmth." pic.twitter.com/h8Njr7Qinr — ANI (@ANI) December 30, 2023 ►అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11,100 కోట్ల ప్రాజెక్టులను, యూపీలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి రూ.4,600 కోట్ల పనులను ప్రారంభిస్తారు. అలాగే రామ మందిరానికి చేరుకునేలా కొత్తగా పునరుద్ధరించిన నాలుగు రహదారుల ప్రారంభం కూడా ప్రధాని షెడ్యూలులో ఉన్నట్లు పీఎంవో తెలిపింది. ►ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో నేడు అత్యాధునిక ఎయిర్పోర్ట్, ఆధునిక హంగులు సంతరించుకున్న రైల్వే స్టేషన్ ప్రారంభం ►రామమందిర శంకుస్థాపనకు ముందే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభం కావడం గమనార్హం ► ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన ►మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రత పటిష్టం ►డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో అణువణువూ తనిఖీలు.. డ్రోన్లతో నిఘా ►పూలతో అందంగా ముస్తాబైన అయోధ్య ►అయోధ్యలో రూ.1,450 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం Ayodhya Airport completed in record time of 20 months: Airport Authority Chairman Read @ANI Story | https://t.co/RSOVcfxEAc#AyodhyaAirport #Ayodhya #UttarPradesh #AAI pic.twitter.com/1v3OZwnS0Z — ANI Digital (@ani_digital) December 30, 2023 ►6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం ►ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు ►‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామం’గా పేరు ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు సుందర నిర్మాణాలు శిఖరం, విల్లు బాణం వంటి గుర్తులు నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్ విస్తరణ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్(రైట్స్) ఆధ్వర్యంలో అభివృద్ధి ►మరోవైపు.. అయోధ్యలో ఊపందుకున్న భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ►అయోధ్య నగరానికి 15 కి.మీ.ల దూరాన ఉన్న ఎయిర్పోర్టు నుంచి రైల్వేస్టేషనుకు వెళ్లే మార్గం పొడవునా ప్రధాని రోడ్షో ఉంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ మార్గంలో ఏర్పాటుచేసే 40 వేదికలపై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెగ్యులర్గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. -
రైల్వే స్టేషన్లో చీకట్లు... లగేజీలు చోరీ, పడిపోయిన ప్రయాణికులు!
అది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వేస్టేషన్.. తాము ఎక్కబోయే రైలు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా స్టేషన్లో కరెంట్ పోయింది. ప్రయాణికులకు మొదట ఏమీ అర్థం కాలేదు. చాలా సేపు ఇదే పరిస్థితి నెలకొనడంతో స్టేషన్లో గందరగోళం ఏర్పడింది. జబల్పూర్ ప్రధాన స్టేషన్లోని విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలడంతో ప్లాట్ఫారమ్ నంబర్ వన్ నుంచి ప్లాట్ఫామ్ ఆరు వరకు స్టేషన్ ఆవరణ అంతా అంధకారమయం అయ్యింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టికెట్ కౌంటర్ కూడా మూతపడింది. ఇది చూసిన ప్రయాణికులు నానా హంగామా చేశారు. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా దీనికి బాధ్యులెవరనేది అధికారులు తేల్చలేదు. స్టేషన్ మొత్తంమీద గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో చాలా మంది ప్రయాణికుల సామాను చోరీకి గురయ్యింది. చీకటిమాటున దొంగలు రెచ్చిపోయారు. చీకటిలో ఎదుట ఏమున్నదో తెలియక పలువురు ప్రయాణికులు నడిచేటప్పుడు పడిపోయారు. ఈ ఘటన అనంతరం సంబంధిత శాఖ ఇంజినీర్లు మరమ్మతులు చేపట్టారు. గంట తరువాత తిరిగి విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. స్టేషన్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్యానెల్లో లోపం కారణంగా, ప్లాట్ఫారమ్తో సహా మొత్తం స్టేషన్ ప్రాంగణం, వివిధ రైల్వే విభాగాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ను ఉపయోగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ప్యానల్కు మరమ్మతులు చేసిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే.. -
సింహాచలం స్టేషన్కు ‘అమృత’ భాగ్యం!
సాక్షి,విశాఖపట్నం : సింహాచలం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో రూ.20 కోట్లతో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టింది. అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందన్నారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు. ‘త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం 8వేల 406కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దేశంలో 5జీ మొబైల్ సర్వీసుల విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. దీపావళి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. నాలుగువేల నూతన సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతున్నాయి’అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇదీచదవండి..విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ -
మిచౌంగ్: చెన్నై అతలాకుతలం, జనం ఇక్కట్లు, వైరల్ వీడియోలు
తమిళనాడులో మిచౌంగ్ తుపాను ప్రజలను వణికిస్తోంది. భారీ వర్షాలతో ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయ మయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతాయం ఏర్పడింది. ఒకచోట మొసలి రోడ్డుపైకి దృశ్యంతోపాటు, తుపాను బీభత్సానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. రన్వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. దీంతోపాటు ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరించారు. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో చెన్నై ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది. దీంతో నగర వాసుల ఇబ్బందులు అన్ని ఇన్నీకావు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు పాక్షికంగా లేదా పూర్తిగా రైళ్ల సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు ప్రకటించారు. బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. అర్ధరాత్రి సమయంలో తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా. 🌀 #Michaungcyclone Police in action. Rescuing a family from a low lying area in Perumal Koil street, Kotturpuram. Removing the fallen trees. #ChennaiRain #Update@SandeepRRathore@R_Sudhakar_Ips@ChennaiTraffic pic.twitter.com/3hqSMEFr5P — GREATER CHENNAI POLICE -GCP (@chennaipolice_) December 4, 2023 Chennai @Suriya_offl fans on duty! Provided food items and other materials at the affected areas.#ChennaiRains #CycloneMichuang pic.twitter.com/WIseZuk3WH — Suriya Fans Club (@SuriyaFansClub) December 4, 2023 -
ఈ రైల్వే స్టేషన్ పేరు సచిన్!
స్టేడియంల సంగతి ఏమిటోగానీ రైల్వేస్టేషన్లకు క్రికెటర్ల పేర్లు ఊహించలేము. అయితే గుజరాత్లోని సూరత్ సమీపంలోని ఒక రైల్వేస్టేషన్ పేరు సచిన్. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ రైల్వేస్టేషన్ ముందు దిగిన ఫోటో వైరల్గా మారింది. ‘ఈ రైల్వేస్టేషన్కు మన ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన నా ఫేవరెట్ క్రికెటర్, నా అభిమాన వ్యక్తి పేరు పెట్టారు. గత శతాబ్దానికి చెందిన పెద్దల ముందు చూపు అబ్బురపరుస్తుంది’ అని ఇన్స్టాగ్రామ్లో రాశాడు సునీల్ గవాస్కర్. ఇది చూసి ‘సచిన్లో సన్నీని చూడడం ఆనందంగా ఉంది’ అంటూ స్పందించాడు సచిన్ తెందూల్కర్. నిజానికి ఈ రైల్వేస్టేషన్కి ‘సచిన్’ అనే పేరు సచిన్ తెందూల్కర్ తాతముత్తాల కాలంలోనే ఉంది. సచిన్ తెందూల్కర్ పేరుకు, ఈ రైల్వేస్టేషన్ పేరుకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరదా కోసం ‘పూర్వీకుల ముందుచూపు అబ్బురపరిచింది’ అని రాశాడు గవాస్కర్. -
‘నలంద’ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం క్రైం: నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న నలంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న పాటిల్ సుధ (18) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి మృతిచెందింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బొమ్మనహాళ్ మండలం కల్లుహోళ గ్రామానికి చెందిన శంకర్గౌడ్, రత్నమ్మ దంపతుల కుమారై సుధ నగరంలోని నలంద కళాశాలలో ఇంటర్ (సీఈసీ గ్రూపు) రెండో సంవత్సరం చదువుతోంది. సమీపంలోని మేడా నర్సింగ్ హోం వద్ద ఉన్న అదే కళాశాల హాస్టల్లో ఉంటోంది. గౌరమ్మ పండుగ కోసం ఇటీవల ఊరెళ్లిన సుధ శుక్రవారం తిరిగొచ్చింది. మధ్యాహ్నం 2.40 గంటలకు హాస్టల్కు చేరుకుంది. తండ్రికి ఫోన్ చేసి తాను చేరుకున్న విషయం చెప్పింది. అనంతరం కళాశాలకు వెళ్లి సాయంత్రం 5.52 గంటలకు మిత్రులతో కలసి హాస్టల్కు తిరిగొచ్చింది. నాల్గవ అంతస్తులోని రూమ్ నంబర్–7లో తనతో పాటు మరో ఐదుగురు విద్యార్థినులు ఉంటున్నారు. వారితో కొంతసేపు మాట్లాడిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది. గది తలుపులకు బయట గడియ పెట్టింది. కారిడార్ వాష్ బేషిన్ వైపు వెళ్లింది. అక్కడ లాక్ చేసి ఉన్న గ్రిల్డోర్ పైకి ఎక్కి కారిడార్ వైపు కిందకు దిగింది. నాల్గవ అంతస్తు నుంచి సరిగ్గా 6.44 గంటలకు కిందకు దూకింది. బయట నుంచి పెద్ద శబ్దం రావడంతో గది లోపలున్న విద్యార్థినులు గట్టిగా తలుపులు తట్టారు. ఆ శబ్దానికి వార్డెన్ వచ్చి తలుపులు తీసి ఎందుకిలా చేస్తున్నారంటూ ఆరా తీశారు. సుధ కిందకు పడిపోయిన శబ్దం వచ్చిందని చెప్పారు. దీంతో కిందకు చూడగా హాస్టల్ పక్క కాంపౌండులోని సిమెంటు ప్లాట్ఫాంపై పడి ఉంది. ఆమెను వెంటనే పక్కనే ఉన్న ప్రైవేటు నర్సింగ్ హోమ్కు..అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించిన గంట వ్యవధిలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గోప్యంగా ఉంచిన కాలేజీ యాజమాన్యం ఘటన శుక్రవారం సాయంత్రం 6.44 గంటలకు జరగ్గా..కాలేజీ యాజమాన్యం మాత్రం రాత్రి తొమ్మిది గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు స్వగ్రామం నుంచి అర్ధరాత్రి అనంతపురానికి చేరుకున్నారు. ఆ తర్వాతే విషయం బయటకు తెలిసింది. విద్యార్థి సంఘాల నేతలు శనివారం కాలేజీ హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి.. కళాశాల యాజమాన్యం వైఖరితోనే తమ బిడ్డ చనిపోయిందని, మృతిపై అనుమానాలు ఉన్నాయని సుధ తల్లిదండ్రులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంటిపై ఎక్కడా రక్తగాయాలు లేకపోయినా గొంతు కింది భాగంలో మాత్రం గాట్లు ఉన్నట్లు తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కిందకు పడితే శరీరం ఛిద్రమవుతుందని, కానీ కనీసం కాలు, చెయ్యి కూడా చెక్కు చెదరలేదని, తమ బిడ్డను హత్య చేసి కిందకు నెట్టి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. విద్యార్థిని మృతి ఘటనను ఎస్పీ అన్బురాజన్ సీరియస్గా పరిగణించారు. మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. దిశ డీఎస్పీ ఆంథోనప్పను దర్యాప్తు అధికారిగా నియమించారు. లెయ్ తల్లి ఊరికి వెళదాం! సుధ మృతిని తల్లి రత్నమ్మ జీర్ణించుకోలేక పోయింది. ‘అమ్మా సుధా.. లెయ్ తల్లి ఊరికి వెళదాం’ అంటూ కుమార్తె మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. చివరికి పోలీసులే ధైర్యం చెప్పారు. ‘బాగా చదువుతుంది సార్..బుద్ధిమంతురాలు. ఎవరితోనూ గొడవలకు వెళ్లదు. ఏ దేవుడికి కన్నుకుట్టి నా బిడ్డను ఇలా తీసుకుపోయాడో’ అంటూ కన్నీరు మున్నీరైంది. ‘మంచిగా చదివి నాన్నను, నిన్ను బాగా చూసుకుంటానంటివే. ఇలా మోసం చేసి వెళ్లిపోయావా తల్లీ’ అంటూ గుండెలు బాదుకుంది. లోతుగా దర్యాప్తు చేస్తాం విద్యార్థిని సుధ మృతికి దారి తీసిన కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తామని దిశ డీఎస్పీ ఆంథోనప్ప తెలిపారు. ఆయన శనివారం నగర డీఎస్పీ ప్రసాద్రెడ్డి, వన్టౌన్ సీఐ రెడ్డప్పతో కలసి విలేకరులతో మాట్లాడారు. సుధ కిందకు దూకినప్పుడు కుడికాలు ముందుగా నేలను తాకి తొడ ఎముకభాగం విరిగిందని, దానిపై ఉన్న బర్రెముకలు కూడా విరిగిపోయి కొసలు ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయాయని తెలిపారు. దీనివల్ల ఊపిరితిత్తుల్లోకి, ఇతర శరీరభాగాల్లోకి రక్తం వెళ్లి గడ్డ కట్టడం వల్ల హేమరేజ్ షాక్ జరిగి మృతి చెందిందని వివరించారు. -
ఈ పెట్టెల్లో ఏముందో?
కర్ణాటక: శివమొగ్గ నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లో ఆదివారం రెండు పెట్టెలు కలకలం సృష్టించాయి. రేకు పెట్టెలను విడివిడిగా జనపనార సంచిలో కట్టి ఉంచారు. ఆ పెట్టెల దగ్గర ఎవరూ లేకపోవడంతో రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వేస్టేషన్లోని పార్కింగ్ ప్రదేశం కాంపౌండ్ వద్ద రెండు పెట్టెలు కనిపించాయి. గంటలు గడిచినా ఎవరూ తీసుకోకపోవడంతో స్థానికులకు, రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చింది. అలాగే జయనరగ పోలీసులకు కూడా కాల్ చేశారు. పోలీసులు జాగిలాలు, బాంబు తనిఖీ సిబ్బందితో వచ్చి పెట్టెలను తెరవకుండానే పరిశీలించారు. తరువాత వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఒక చిన్న కారులో వచ్చి ఆ పెట్టెలను అక్కడ పెట్టి వెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డయింది. -
ఏ రైల్వే స్టేషన్ ఎప్పుడు పుట్టిందో?
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట్,వరంగల్, ఖమ్మం.... ఇలాంటి ప్రముఖ రైల్వే స్టేషన్లు ఎప్పుడు స్థాపించారు.. ఎలా ఆవిర్భవించాయి ?.. వాటి పుట్టుకలో కీలక భూమిక ఎవరిది..?.. నాటి ఏ పరిస్థితి వల్ల అక్కడ స్టేషన్ ఏర్పాటైంది? –ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఇలాంటి వివరాల సేకరణలో తలమునకలై ఉన్నారు. ప్రత్యేకంగా కొంతమందిని ఇందుకోసం పురమాయించారు. సదరు సిబ్బంది ఆ వివరాల సేకరణకు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. ఏ స్టేషన్ ఎప్పుడు ఏర్పడిందో వివరాలు తెలిస్తే.. వాటి పుట్టిన రోజు (ఆవిర్భావ దినోత్సవం) వేడుకలు నిర్వహిస్తారట. మోదీ చేసినప్రస్తావనే ఆదేశంగా భావిస్తూ.. ఇటీవల దేశవ్యాప్తంగా తొమ్మిది వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ పట్టాలెక్కించింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన, ప్రజలను రైల్వేకు మరింత చేరువ చేసే క్రమంలో రైల్వే స్టేషన్లకు పుట్టినరోజు వేడుకలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తమిళనాడులోకి కోయంబత్తూరు, ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్ల భవనాలకు ఇటీవల స్థానిక రైల్వే అధికారులు ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. వీటిని ఉదహరించిన మోదీ, మిగతా వాటికి కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కానీ, విధానపరంగా అలాంటి నిర్ణయం ఇప్పటి వరకు లేదని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి ప్రధాని స్వయంగా పేర్కొనేసరికి, వెంటనే కొన్ని స్టేషన్ భవనాలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని, ఆయా స్టేషన్లతో అనుబంధం ఉన్న ప్రముఖులు, సాధారణ ప్రయాణికులను పెద్ద సంఖ్యలో పిలిపించి అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో, సమీపంలో ఏయే స్టేషన్ల ఆవిర్భావ రోజులున్నాయో గుర్తించే పనిలో పడ్డారు. వివరాలు సేకరిస్తున్నాం ‘‘రెండు స్టేషన్ల పుట్టినరోజు వేడుకలను ప్రధాని స్వయంగా ప్రస్తావించారు. కానీ, ఇప్పటి వరకు మాకు అలాంటి నిర్ణయంపై సమాచారం లేదు. ప్రధాని స్వయంగా చెప్పారంటే, ఆదేశాలతో సంబంధం లేకుండా మేం నిర్వహించాల్సిందే. అందుకే వివరాలు సేకరిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. -
కూత.. సంబరాల మోత.. దశాబ్దాల కల సాకారమైన వేళ..
సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఎన్నో ఏళ్లుగా రైలు సౌకర్యం కోసం ఎదురుచూసిన క్షణాలు నిజమయ్యాయి. సిద్దిపేట–సికింద్రాబాద్ మధ్య రైలు ప్రయాణికులతో పరుగులు పెట్టింది. మంగళవారం నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా, సిద్దిపేట రైల్వేస్టేషన్ వద్ద రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్, పరిసరాలను అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైలు వద్ద సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. కొంత మంది సరదాగా రైలులోకి ఎక్కారు. బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి హరీశ్రావు దుద్దెడ స్టేషన్ వరకు రైలులో ప్రయాణించారు. తొలి ప్రయాణంలో 327 మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావు, ఫారుఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- IPL 2024: ప్లే ఆఫ్స్ ఛాన్స్లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే..
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
Advertisement