-
రాహుల్పై బీజేపీ ఫైర్.. కాంగ్రెస్, చైనాలు భాయ్ భాయ్ అంటూ..
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఇక, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, పెగాసెస్ స్పైవేర్ దేశంలోని రాజకీయ నాయకుడి ఫోన్లలో ఉందంటూ కామెంట్స్ చేశారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. విదేశీ గడ్డపై ఇండియాను కించపరిచే ప్రయత్నమంటూ మండిపడ్డారు. ఇదివరకు విదేశీయులు దాడి చేస్తే.. ఇప్పుడు స్వదేశీయులు సైతం భారత్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంబ్రిడ్జ్లో రాహుల్ చేసిన ప్రసంగం ఆదరణీయ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ముసుగులో విదేశీ గడ్డపై మన దేశాన్ని కించపరిచే ధృడమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు అంటూ విమర్శించారు. ఇదే సమయంలో రాహుల్ ప్రస్తావించిన ప్రజాస్వామ్యంపై దాడి అనే వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం అందించిన రక్షణలోనే రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిందన్నారు. జోడో యాత్రలో 4,000 కిలో మీటర్లు ఏ ప్రమాదం లేకుండా ప్రయాణించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు తలపెట్టిన యాత్రలను ఎలా విధ్వంసం చేశారో ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందా? అంటూ మండిపడ్డారు. మరోవైపు.. రాహుల్ ఫోన్ పెగాసెస్ ఉందన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. దీనిపై విచారణకు రాహుల్ తన ఫోన్ ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. First foreign agents target us! Then our own targets us on a foreign land! Rahul Gandhi’s speech at Cambridge was nothing but a brazen attempt to denigrate our country on foreign soil in the guise of targeting Adarniya PM Shri @narendramodi ji. Thread — Himanta Biswa Sarma (@himantabiswa) March 3, 2023 ఇక, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. విదేశాలకు వెళ్లిన ప్రతీసారి రాహుల్ భారత్ను అవమానపరుస్తున్నాడు. చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. దేశ ప్రజలు ఆయన నిజస్వరూపాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రాహుల్ మాటలు చిన్న పిల్లాడు మాట్లాడినట్టుగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము అంటూ కామెంట్స్ చేశారు. #WATCH |This is Rahul Gandhi-whenever he goes abroad,he insults India...He does this whenever he goes abroad&calls China the symbol of goodwill. Country should see his true face...We condemn his childish statment..:BJP's RS Prasad on Rahul Gandhi's address at Cambridge University pic.twitter.com/aMEtS3nJJR — ANI (@ANI) March 3, 2023 -
‘కులం’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ
పాట్నా: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడు, బిహార్ ఎంపీ లలన్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన తరగతికి(బీసీ) చెందిన వ్యక్తి అని అన్నారు. అయితే గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని ఈబీసీలో విలీనం చేశారని ఆరోపించారు. ఆయన డూప్లికేట్ వ్యక్తి అని తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కానీ దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రధాని ఏనాడూ నోరువిప్పలేదని ధ్వజమెత్తారు. అలాగే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని లలన్ సింగ్ ఆరోపించారు. అందుకే కుల ఆధారిత జనగణనను ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. అలా జరిగితే వాళ్ల నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందని బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. జేడీయూ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు లలన్ సింగ్ మాట్లాడారు. బీజేపీ కౌంటర్ అయితే లలన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడింది. లలన్ సింగ్, నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకుని, మోదీ ఫోటోతోనే గెలిచారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆ పార్టీ నేత రవి శంకర్ ప్రసాద్ అన్నారు. రాజకీయ ప్రమాణాలు దిగజారవద్దని హితవు పలికారు. చిన్న చితకా నాయకులు ఏం మాట్లాడినా తాము పట్టించుకోమని కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి -
రతన్ టాటా-నీరా రాడియా సంభాషణల టేపు లీక్! ఎనిమిదేళ్ల తర్వాత..
ఢిల్లీ: నీరా రాడియా ఆడియో టేపుల లీకేజీ వ్యవహారంలో.. ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ రతన్ టాటా వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఎనిమిదేళ్ల తర్వాత నేడు విచారణ చేపట్టనుంది. 2010లో మాజీ కార్పొరేట్ వ్యవహారాల ప్రతినిధి నీరా రాడియా-టాటాల మధ్య జరిగిన సంభాషణలను మీడియా ప్రసారం చేయగా.. అది తన గోప్యత హక్కుకు భంగం కలిగించేదని రతన్ టాటా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నీరా రాడియా తన వైష్ణవి కార్పొరేట్ కమ్యూనికేషన్ సంస్థ ద్వారా ప్రముఖులతో ఫోన్ సంభాషణలు జరిపారు. అయితే.. పన్నులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆమె ఫోన్ సంభాషణలను 2008, 2009 ట్యాప్చేసి.. రికార్డు చేశారు అధికారులు. ఇందులో ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు సైతం ఉన్నారు. అయితే 2010లో రతన్ టాటా-రాడియా మధ్య జరిగిన ఆడియో సంభాషణను మీడియా ప్రసారం చేసింది. దీంతో ఈ టేపుల విడుదల.. తన గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని వాదిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 2011లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2012 ఆగస్ట్ నెలలో రతన్ టాటా 'రాడియా టేపులు' ఎలా బయటపడ్డాయో వివరిస్తూ ప్రభుత్వం సమర్పించిన నివేదిక కాపీని తనకు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. ఇక రతన్ టాటా పిటిషన్పై చివరిసారిగా 2014లో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. -
పెగాసస్ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ ట్యాపింగ్ కుంభకోణంపై కేంద్ర ఐటీ శాఖమాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్ఎస్ఓ ప్రకారం పెగాసెస్ను 45 దేశాలు ఉపయోగిస్తున్నప్పుడు భారతదేశం మాత్రమే ఎందుకు దాడి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులతో సహా భారతదేశంలో 300 మందిఫోన్లను కేంద్రం ట్యాప్ చేసిందన్న ది వైర్ కథనం మోదీ సర్కార్ను ఇరుకునపెట్టింది. దీంతో కేంద్ర మాజీమంత్రి కేంద్రప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పనిలో పడ్డారు. కాగా ఫోన్లను ట్యాప్ చేసిన ప్రముఖుల జాబితాలో కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ , అతని ఇద్దరు సహాయకులు ఉన్నారని ది వైర్ నివేదించింది. వీరితో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా కూడా ఉన్నారని తెలిపింది. దీనిపై పార్లమెట్ సమావేశాల ప్రారంభం మొదటి రోజే తీవ్ర దుమారం రేపింది. -
ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుగా భారత్ నెట్
న్యూఢిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాల్లోని నివాసిత గ్రామాలకు పీపీపీ(ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం)మోడల్ ద్వారా భారత్ నెట్ అందించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని పెంచడం కోసం, సేవలు అందించడానికి కేంద్రం ప్రైవేట్ రంగానికి అనుమతి ఇచ్చింది. "దేశంలో ఇంటర్నెట్ బ్రాడ్బాండ్ కనెక్టివీటీ పెంచేందుకు ఉద్దేశించిన భారత్ నెట్ పథకానికి అదనంగా రూ.19,041 కోట్లు కేటాయిస్తున్నట్టు" కొద్ది రోజుల క్రితమే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అలా ప్రకటించిన రెండు రోజులకే "16 రాష్ట్రంలోని 3,61,000 గ్రామాల్లో ఇంటర్నెట్ బ్రాడ్బాండ్ కనెక్టివీటీ అందించేందుకు పీపీపీ పద్దతిలో ప్రపంచ స్థాయిలో బిడ్డింగ్ నమూనాను అమలు చేయాలి" అని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. భారతదేశంలోని అన్ని గ్రామాల్లో సమాచార విప్లవం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో అన్ని గ్రామాలు 1,000 రోజుల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ తో అనుసంధానించబడతాయని అన్నారు.భారత్ నెట్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టుగా ప్రారంభించారు. 2021, మే 31 నాటికి 1,56,223 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీని కోసం ఇప్పటికే రూ.42,068 కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ పథకానికి తాజాగా రూ.19,041 కోట్లు కేటాయించడంతో దీంతో ఈ పథకం మొత్తం విలువ రూ. 61,109 కోట్లకు చేరుకుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement