-
తాత చేసిన పని.. 30 ఏళ్ల తర్వాత ఎగిరి గంతేసిన మనువడు
మనలో చాలా మంది..నేను ఎప్పటికైనా లక్షాధికారిని కాకపోతానా? కోటీశ్వరుణ్ణి కాకపోతానా? అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. అయితే అలా ధనవంతులు కావాలంటే లక్షలు కావాల్సిన పనిలేదు. వందల్లో పొదుపు చేసినా అది ధనవంతుల్ని చేస్తుందని నిజం చేశారు ఓ పెద్దాయన. కేవలం రూ.500 పెట్టుబడి కాస్తా ఇప్పుడు రూ.3.75 లక్షలుగా మారడంతో మనవుడు తన తాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్గా మారింది. చండీగఢ్కు చెందిన తన్మయ్ మోతీవాలా పీడియాట్రిక్ సర్జన్గా వైద్య సేవలందిస్తున్నారు. అయితే ఓ రోజు తన ఇంటిని సర్ధుతుండగా తాత వినియోగించిన ఓ ట్రంక్ పెట్ట మోతీవాలా కంటపడింది. అందులో ఏమున్నాయా? అని తెరిచి చూశాడు. అంతే అప్పుడే తాత పెట్టిన పెట్టుబడి చూసి ఎగిరి గంతేసినంత పనిచేశారు. అయితే ఆ ట్రంక్ పెట్టెలో 1994లో తన తాత రూ. 500 విలువైన ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేసినట్లు, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను షేర్ చేశారు. తన తాత షేర్లను కొనుగోలు చేశారు. వాటిని అమ్మలేదని తర్వాత గుర్తించాడు. ఆ రూ.500 పెట్టబడితో వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఆరా తీశారు. 1994లో ఒక్కో షేర్ రూ.10 చొప్పున రూ.500కి మొత్తం 50 షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ మొత్తం షేర్ల విలువ రూ.3.75లక్షలకు చేరింది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టిన మొత్తం 750 శాతంతో రిటర్న్స్ వచ్చాయని డాక్టర్ మోతీవాలా వెల్లడించారు. The power of holding equity 😊 My Grand parents had purchased SBI shares worth 500 Rs in 1994. They had forgotten about it. Infact they had no idea why they purchased it and if they even hold it. I found some such certificates while consolidating family's holdings in a… pic.twitter.com/GdO7qAJXXL — Dr. Tanmay Motiwala (@Least_ordinary) March 28, 2024 -
బిజినెస్: నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, అధిక వెయిటేజీ రిలయన్స్(1.25%), ఐటీసీ(1.50%), ఎస్బీఐ(2%) షేర్లు రాణించడంతో సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. అయితే రూపాయి క్షీణత, చిన్న కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీల భారీ లాభాలకు అడ్డుకట్టవేశాయి. తొలిసెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ట్రేడింగ్లో 729 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 90 పాయింట్ల లాభంతో 72,102 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 71,674 కనిష్టాన్ని, 72,403 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 221 పాయింట్ల రేంజ్లో 21,931 వద్ద గరిష్టాన్ని, 21,710 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పెరిగి 21,839 వద్ద నిలిచింది. రెండు నెలల కనిష్టానికి రూపాయి.. డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 83.19 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయి రెండు నెలల కనిష్టం. ట్రస్ట్ ఫిన్టెక్ @ రూ.95–101 సాస్ ప్రొడక్ట్ ఆధారిత ఫిన్టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందించే ట్రస్ట్ ఫిన్టెక్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 95–101 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది.ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 63 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. ఇవి చదవండి: ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
ఫలితాలు ఎలా ఉన్నా ఇవి మాత్రం..
దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఒక్కొక్కటిగా తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. స్టాక్ ఫలితాలకు తగ్గట్టుగా మన పెట్టుబడి వ్యూహాన్ని మారుస్తుంటాం. అయితే కొన్ని రోజులుగా మార్కెట్ను అనుసరిస్తున్నవారు, కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు ఈ సమయంలో ఎలా స్పందించాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. మన పోర్ట్ఫోలియోలోని కంపెనీలు వాటి ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తుందో ట్రాక్ చేయాలి. ఇది సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇన్వెస్టర్ రిలేషన్స్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఫలితాల్లో కంపెనీలు తమ ఆదాయాలు, బ్యాలెన్స్ షీట్, క్యాష్ఫ్లో సహా దాని ఆర్థిక నివేదికలను ప్రకటిస్తాయి. స్టాక్కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ నివేదికల వల్ల కంపెనీ పనితీరును సమీక్షించడానికి వీలువతుంది. కంపెనీలు ఫలితాలు విడుదల చేయడానికి ముందే ఆర్థిక నిపుణలు, విశ్లేషకులు తరచు సంస్థ పనితీరును గమనిస్తూ రిజల్ట్స్ను అంచనా వేస్తారు. ఈ అంచనాలతో వాస్తవ ఫలితాలను సరిపోల్చాలి. ఒకవేళ ఫలితాలు అంచనాలను మించి ఉంటే అది సానుకూలంగా పరిగణించవచ్చు. గతంలో కంపెనీ పనితీరు ఎలా ఉంది.. ఫలితాలు ప్రభావితం చేసే ఏవైనా ఆర్థిక అంశాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. చాలా కంపెనీలు వాటి భవిష్యత్ పనితీరుపై మార్గదర్శకత్వం లేదా ఔట్లుక్ను విడుదల చేస్తాయి. సానుకూలంగా నివేదికలు అందించే కంపెనీల్లో స్టాక్ పెరుగుదల చూడవచ్చు. ఫలితాల వల్ల మార్కెట్ ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఒక్కోసారి స్టాక్ ధర వేగంగా పడిపోవచ్చు..పెరగొచ్చు. స్టాక్ సంబంధించిన అన్ని అంశాలను గమనించాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే స్టాక్ ధరలో హెచ్చుతగ్గులు అంతగా పట్టించుకోవద్దు. స్వల్పకాలిక మార్కెట్ కదలికల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇదీ చదవండి: ఈసారైనా సెక్షన్ 80సీకు మోక్షం లభిస్తుందా..? ఒకే కంపెనీలో కాకుండా పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న ఫలితాలు విడుదల చేయకపోయినా పోర్ట్ఫోలియో పెద్దగా నష్టాల్లోకి వెళ్లకుండా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు, లాభాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫలితాల ఆధారంగా స్టాక్ అమ్మాలో, కొనాలో అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు కంపెనీ భవిష్యత్తు పనితీరును పరిగణలోకి తీసుకోవాలి. -
సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పుంజుకున్న దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:16కు నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 21,747 వద్దకు చేరింది. సెన్సెక్స్ 87 పాయింట్లు పుంజుకుని 72,113 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు రేంజ్బౌండ్లోనే ఉన్నాయి. యూరప్మార్కెట్లు కొంత నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎఫ్ఐఐలు రూ.1696 కోట్లు విలువైన షేర్లు స్టాక్మార్కెట్లో కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.3497 కోట్ల విలువైన షేర్లు మార్కెట్నుంచి విక్రయించారు. ఇటీవల వెలువడిన యూఎస్ జాబ్స్ డేటా ప్రకారం మార్కెట్ ఊహించిన 1,70,000 ఉద్యోగాలకు బదులుగా 2,16,000 ఉద్యోగాలు పెరిగాయి. లేబర్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఫెడ్ కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు మరింత సమయం తీసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, మారుతి సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే..
స్టాక్మార్కెట్లో మదుపుదారులకు ఈ ఏడాది చాలా గుర్తుండిపోతుంది. వరుసగా ఎనిమిదో సంవత్సరమూ సూచీలు లాభాల బాటపట్టాయి. ఈ ఏడాదిలో నిఫ్టీ 50లోని 27 షేర్లు ఆల్టైమ్హైను చేరాయి. 40కి పైగా కంపెనీలు 10-100 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్క్యాప్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసినవారికి, ఇతర పెట్టుబడిదారులకు ఐపీఓలు లిస్ట్ అయిన తొలిరోజే మంచి లాభాలను తీసుకొచ్చాయి. 2023 ప్రారంభంలో మార్కెట్లు కాస్త నష్టాల్లోకి వెళ్లినా తరువాత భారీగా రాణించాయి. అంతర్జాతీయ మాంద్యం భయాలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో గతంలో నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 4, 3 శాతమే రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులతో ఏప్రిల్ నుంచి సూచీలు పుంజుకున్నాయి. ర్యాలీకి కారణాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల పెంపునకు విరామం ఇవ్వడం, ముడి చమురు ధరలు వేగంగా తగ్గడంతో, రెండు నెలల పాటు బాగా రాణించిన సూచీలు ప్రథమార్ధాన్ని 6 శాతం పైగా లాభాలతో ముగించాయి. సెప్టెంబరు త్రైమాసికంలో 7.6% వృద్ధి నమోదైంది. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధించడం, విదేశీ మదుపర్ల పెట్టుబడులు బలంగా కొనసాగడం, 2024లో రేట్ల కోతకు అవకాశం ఉందని అమెరికా ఫెడ్ సంకేతాలివ్వడం ఇందుకు దోహదం చేసింది. ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ.. చరిత్రలోనే తొలిసారిగా డిసెంబరు 6వ తేదీన 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను దాటేసింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.81.90 లక్షల కోట్లు పెరిగి రూ.364 లక్షల కోట్ల ఆల్టైం గరిష్ఠానికి చేరింది. జూన్లో నిఫ్టీ సూచీ 19,000 పాయింట్లు, సెప్టెంబరులో 20,000, ఈనెల 8న 21,000 పాయింట్లకు చేరింది. డిసెంబరు 28న ఆల్టైం గరిష్ఠస్థాయి అయిన 21,801.45ను చేరింది. సెన్సెక్స్ జూన్లో 64,000 పాయింట్లను అధిగమించింది. జులైలో 67,000ను తాకింది. నవంబరు, ఈనెల 28నలో ఏకంగా 8000 పాయింట్లకుపైగా ర్యాలీ అయి 72,484.34 వద్ద జీవనకాల రికార్డు గరిష్ఠాన్ని చేరింది. ఏడాది మొత్తం మీద నిఫ్టీ 18%, సెన్సెక్స్ 19% మేర లాభాలను అందించాయి. 2024లో ఎలా ఉండబోతుందంటే.. వచ్చే ఏడాది స్టాక్మార్కెట్లు భారీగా లాభపడడానికి పెద్దగా అవకాశాలను ఈ ఏడాది మిగల్చలేదని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత స్థాయి నుంచి మహా అయితే 8-10% రాణించొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదించింది. ఎన్నికల ముందు ర్యాలీ కారణంగా వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు సానుకూలంగా ఉండొచ్చు. ఇదీ చదవండి: ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..? ఎన్నికల ఫలితాలు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రకటనలు వచ్చాకే స్టాక్ మార్కెట్ దిశపై ఒక అంచనాకు రాగలమని బ్రోకరేజీలు అంటున్నాయి. అదే సమయంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన భారత స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325 పాయింట్లు క్షీణించి 0.50% తగ్గి 64,933.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 0.42% కుంగి 19,443.50 వద్ద ముగిసింది. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. యూఎస్ క్రెడిట్ రేటింగ్ ఔట్లుక్ను మూడీస్ స్టేబుల్ నుంచి నెగెటివ్కు మార్చింది. ఈ నేపథ్యంలో అక్కడి మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఐరోపా సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఆసియా- పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దేశీయంగా ఆదివారం జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్లో సూచీలు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.261 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.822 కోట్లు విలువ చేసే స్టాక్స్ను కొనుగోలు చేశారు. సెన్సెక్స్ 30లో ఎం అండ్ ఎం, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటాస్టీల్, టాటా మోటార్స్ మినహా అన్ని స్టాక్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దీపావళి బలిప్రతిపద సందర్భంగా మంగళవారం(నవంబర్ 14) రోజున దేశీయ స్టాక్మార్కెట్లకు సెలవు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
నష్టాల్లోకి వెళ్లడానికే రిస్క్ తీసుకుంటున్న మదుపర్లు!
స్టాక్మార్కెట్ మదుపర్లు కొన్నిసార్లు నష్టపోతుంటారు. ఇంకొన్నిసార్లు లాభాల్లో ఉంటారు. కానీ నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్లే స్టాక్లను మాత్రం వెంటనే అమ్ముతుంటారు. నష్టాల్లో ఉన్న స్టాక్లను మాత్రం ఎప్పటికైనా లాభాల్లోకి రాకపోతుందా అని అట్టే పెట్టుకుంటారు. అలా తాత్కాలికంగా నష్టాలు వచ్చే వాటిల్లో బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు ఉంటే ఫరవాలేదు. కానీ సరైన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించకుండా నష్టాలను పోస్ట్ చేస్తున్న కంపెనీలకు చెందిన స్టాక్లను కూడా అలాగే ఉంచుకోవడం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా మార్కెట్ను గమనిస్తున్న ఆర్థికవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల్లో ఆసక్తి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. వారు ప్రతిపాదించిన యుటిలిటీ థియరీ ప్రకారం..మదుపర్లు వివిధ స్వభావాలు కలిగి ఉంటారు. రిస్క్ తీసుకుని కొందరు లాభాల్లోకి వెళితే, మరికొందరు అదే రిస్క్ తీసుకుని నష్టాల్లోకి వెళ్తున్నారు. మొదటి నియమంతో మంచి కంపెనీలు మదుపు చేయడం వల్ల లాభాల్లోకి వెళ్లవచ్చు. ఇదీ చదవండి: బోయింగ్ 777లో సౌకర్యాలు మెరుగుపరిచిన ఎయిర్ ఇండియా కానీ రెండో నియమం ప్రకారం రిస్క్ తీసుకున్నా నష్టాల్లోకి వెళ్లడం ఏమిటనే అనుమానం ఉంటుంది. అయితే కంపెనీపై సరైన అవగాహన, దానికి సంబంధించి ఎలాంటి పరిశోధన చేయకుండా మార్కెట్లో పెట్టుబడి పెట్టి కొందరు నష్టాల్లోకి జారుకుంటారు. కొద్దిగా నష్టాలు ఉన్నపుడు స్టాక్లను అమ్మకుండా రిస్క్ తీసుకుని వాటిని అలాగే తమ పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటారు. ఫలితంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా మరింత నష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంటుంది. మదుపు చేసేముందు కంపెనీ పూర్వాపరాలు ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణ, ఫలానా రంగంలోని పోటీలో ఉన్న సంస్థలు, ముడిసరుకు, మార్కెటింగ్, కంపెనీ అప్పులు తదితర అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల బాటపట్టాయి. సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమై చివరికి భారీ నష్టాలపాలయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 140 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 521 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 366 పాయింట్లు నష్టపోయాయి. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేస్తున్న వేళ మార్కెట్ నిపుణులు కంపెనీల ఆదాయాలు ప్రతికూలంగా ఉంటాయని అంచనాలు వేసిన వేళ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మెుదలైంది. దీనికి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు భారీ నష్టాలకు దారితీశాయి. బ్యాంకింగ్, పవర్ రంగాల్లోని కంపెనీలు ప్రధానంగా మార్కెట్లను నష్టాలోకి లాగాయి. ఫార్మా స్టాక్స్ లాభాల్లో ట్రేడయ్యాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, మారుతీ, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాలతో పయణించాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, విప్రో, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
పెట్టుబడికి సోషల్ రూట్..?
ఇటీవలి స్టాక్ మార్కెట్ రికార్డుల ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023 జూలై నాటికి 12.3 కోట్లు దాటిపోయింది. 2020 మార్చి నాటికి ఉన్న 4 కోట్లతో పోలిస్తే మూడేళ్లలోనే మూడు రెట్లు పెరిగాయి. అంటే మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. (టేబుల్–గడిచిన 12 నెలల్లో డీమ్యాట్ ఖాతాల తీరు). తమ పెట్టుబడులు అనతి కాలంలోనే భారీ రాబడులు ఇవ్వాలనే ఆకాంక్ష కొత్త ఇన్వెస్టర్లలో సహజంగానే కనిపిస్తుంటుంది. ఫలితంగా మలీ్టబ్యాగర్ల కోసం జల్లెడ పడుతుంటారు. గతంలో అయితే స్టాక్స్లో పెట్టుబడి కోసం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను విచారించే వారు. సోషల్ మీడియా వ్యాప్తితో నేటితరం ఇన్వెస్టర్ల ప్రపంచం మరింత విస్తృతం అయింది. ఎన్నో యూట్యూబ్, ఫేస్బుక్, టెలీగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి. ఎంతో మంది నిపుణుల అవతారం ఎత్తుతున్నారు. ఫలానా స్టాక్స్ కొనుగోలు చేయాలనే టిప్స్కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ పెట్టుబడులకు సంబంధించి కనీస ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. నియంత్రణల పరిధిలో లేని సామాజిక మాధ్యమ వేదికలపై చెప్పే సమాచారానికి, ఇచ్చే సలహాలకు జవాబుదారీ ఏది? ఏది నిజం, ఏది తప్పుదారి? తెలుసుకోవడం ఎలా? ఇది అవగాహనపైనే తెలుస్తుంది. ఈ దిశలో సాయపడేదే సోషల్ ఇన్వెస్టింగ్. ఆచరణ ముఖ్యం ఒకరి నుంచి నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం ఈ రెండు వేర్వేరు. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లు ట్రేడింగ్, పెట్టుబడి గురించి తెలుసుకునేందుకు సాయపడతాయి. ‘‘ఇన్వెస్టర్కు ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తాము పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ కంటే నేరుగా స్టాక్స్లో తక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ఆ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో తెలిసింది. దీనికి ఇన్వెస్టర్లు మార్కెట్లో అనుకూల సమయం కోసం వేచి చూసి, ఇన్వెస్ట్ చేయడం కారణం కావచ్చు. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ను అనుకూలం కాని సమయంలో విక్రయించి, కొనుగోళ్లు చేస్తుండొచ్చు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత వార్తలు, ప్రతికూల విశ్లేషణలు చూసి చలించిపోకుండా, ఫండ్స్ మాదిరిగా స్థిరమైన వైఖరి అనుసరించాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లో తోటి ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియో చూసి పెట్టుబడులు పెట్టినట్టయితే.. మార్కెట్ల పతనాల్లో ఎంత స్థిరంగా, దృఢంగా ఉండగలరన్నది కీలకం అవుతుంది. ఆ సమయంలో భయపడి విక్రయించారంటే రాబడులు గణనీయంగా తగ్గిపోతాయి. నష్టాలూ ఎదురు చూడొచ్చు’’అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దీపేశ్ రాఘవ్ వివరించారు. మార్గదర్శిగానే.. ఇన్వెస్టింగ్ వేదికలను మార్గదర్శిగానే చూడాలి. గుడ్డిగా అనుసరించడం సరికాదు. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా తగినంత అవగాహన, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత, విడిగా ప్రతీ ఇన్వెస్టర్ తన వైపు నుంచి లోతైన అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే తనకు అనుకూలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. ఇతరులు కేవలం తమ అనుభవాన్ని పంచుతారే కానీ, జవాబుదారీగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లు స్టాక్స్, ట్రేడింగ్ గురించి నేర్చుకునే వేదికలే. ఇన్వెస్టర్లు ఎవరికి వారే తమ వంతుగా పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఎవరో పోర్ట్ఫోలియో కాపీ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత, నష్టాలు వచ్చాయని పరిహారం డిమాండ్ చేయలేరు. గుడ్డిగా అనుసరించడం సరికాదు.. కొత్త ఇన్వెస్టర్లు ఉచిత లేదా చెల్లింపుల వేదికల ద్వారా స్టాక్స్లో పెట్టుబడులు, ట్రేడింగ్కు మొగ్గు చూపించే ముందు.. ఆయా వేదికలు తమ లక్ష్యాలు, రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోయే వేనా? అన్నది ఒక్కసారి తరిచి చూసుకోవాలి. ‘‘తాము అనుసరించే తోటి ఇన్వెస్టర్ల ప్రొఫైల్ను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. వారి పోర్ట్ఫోలియో తీవ్ర అస్థిరతలతో కూడుకుని ఉండొచ్చు. ‘‘ప్రతి వ్యక్తి లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. మీ స్నేహితులు లేదా ఇతరులు వారి కోణం నుంచి సాధారణ సూచనలు ఇవ్వొచ్చు. అది విడిగా ప్రతి ఇన్వెస్టర్కు అనుకూలమైనదని చెప్పలేం. మీ ప్రస్తుత పోర్ట్ఫోలియో, భవిష్యత్ నగదు అవసరాలు, రిస్క్ సామర్థ్యం ఇలాంటివి ఏవీ ఎదుటి వారికి తెలియవు’’అని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పారుల్ మహేశ్వరి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు పోర్ట్ఫోలియోను ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. తమకు సరిపోలని ఉత్పత్తులు, సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టింగ్లో రిస్క్ తక్కువ. ఈ రెండింటిలో తమకు ఏది అనుకూలమో ఇన్వెస్టర్లే తేల్చుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే..? ఎన్నో తరాల నుంచి ఇది ఉన్నదే సోషల్ ఇన్వెస్టింగ్ (ఇన్వెస్టర్ల సమూహం/సమాజం). గతంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల వరకే ఇది పరిమితం. ఇప్పుడు టెక్నాలజీ ఫలితంగా మరింత పెద్దదిగా అవతరించింది. ట్రేడర్లు, ప్రపంచవ్యాప్త నిపుణులు, ఇన్వెస్టర్లు ఇందులో భాగమవుతున్నారు. సోషల్ ఇన్వెస్టింగ్ యాప్స్, ప్లాట్ఫామ్లు ఇప్పుడు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో గుర్తించేందుకు ఇవి దారి చూపిస్తున్నాయి. సీనియర్ ట్రేడర్లు, తమ మాదిరే ఆకాంక్షలతో కూడిన ఇన్వెస్టర్లతో చాట్, సంప్రదింపులకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. ట్రేడింగ్, పెట్టుబడులకు సంబంధించిన విజ్ఞానం పంచుకునేందుకు వారధిగా పనిచేస్తున్నాయి. అనుభవజు్ఞలైన ట్రేడర్ల పోస్ట్లు, పోర్ట్ఫోలియోను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారానికితోడు, పెట్టుబడుల సలహాలు కూడా వీటిపై అందుకోవచ్చు. యూఎస్, యూరప్లో అయితే ఇన్వెస్టర్లు, నిపుణుల ట్రేడ్ పోర్ట్ఫోలియోను ఇతరులు కాపీ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఈటోరో కూడా ప్రముఖ సోషల్ ఇన్వెస్టింగ్ పోర్టల్. ధ్రువీకరించిన ట్రేడర్ల పోర్ట్ఫోలియోలను ఈ వేదికపై పరిశీలించొచ్చు. కానీ, మన దేశంలో ఇంకా ఈ విధమైన అవకాశం అందుబాటులోకి రాలేదు. మన దగ్గర సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది ఒక చిన్న ఇన్వెస్టర్ల సమూహంగానే ప్రస్తుతం ఉంది. ‘‘సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది విస్తృతమైన పదం. ఒక ఉమ్మడి వేదికగా వ్యక్తుల మధ్య సంప్రదింపులకు వీలు కలి్పంచేది. స్టాక్ ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు), కంపెనీ లాభ, నష్టాల నివేదిక విశ్లేషణ, కీలక రేషియోలు, సాంకేతిక సూచికలు, మార్కెట్ ధోరణులపై సంప్రదింపులకు అవకాశం కలి్పస్తుంది. ఇన్వెస్టర్లు తాము అనుసరించే ట్రేడింగ్ విధానాలు, పోర్ట్ఫోలియోను వీటిపై ఇతరులతో పంచుకుంటారు’’అని స్మాల్కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. నేర్చుకునే మార్గం.. ‘‘కరోనా సమయంలో మార్కెట్లు కనిష్ట స్థాయిలను చవిచూశాయి. దాంతో అవి ఆకర్షణీయంగా మారాయి. సెబీ కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. దీంతో ఆన్లైన్లోనే వేగంగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. దీనికితోడు యువ జనాభా ఎక్కువ మంది ఇంటికి పరిమితం కావడం పెద్ద ఎత్తున డీమ్యాట్ ఖాతాల ప్రారంభానికి దారితీసింది’’అని ప్రభుదాస్ లీలాధర్ రిటైల్ బ్రోకింగ్ సీఈవో సందీప్ రాయ్చురా తెలిపారు. ముంబైకి చెందిన ఉత్కర్‡్ష (32) కూడా కరోనా సమయంలో మార్కెట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరు. సహజంగా వ్యాపారవేత్త అయిన ఆయన ఇప్పుడు స్టాక్స్లో చురుగ్గా ట్రేడింగ్ చేస్తున్నారు. తొలుత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతాను ఉపయోగించుకున్నారు. స్టాక్స్లో ట్రేడింగ్ చేయాలని 2021 మార్చిలో ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ఇందుకు సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో ఆయనకు తోచలేదు. ఆ సమయంలో మలీ్టబ్యాగర్లు అంటూ పెన్నీ స్టాక్స్ గురించి యూట్యూబ్ చానళ్లు, ట్విట్టర్ పోస్ట్లలో టిప్స్ కనిపించేవి. అయినా సరే వాటి ట్రాప్లో ఆయన పడిపోలేదు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా అనధికారిక, రిజిస్ట్రేషన్ లేని అడ్వైజర్లు, సామాజిక మాధ్యమ వేదికల అణచివేతకు సెబీ కఠిన చర్యలు తీసుకోవడం గమనించొచ్చు. ఉత్కర్‡్ష స్వతహాగా కొంత అవగాహన కలిగి ఉండడంతో విశ్వసనీయత లేని ఇలాంటి బూటకపు చానళ్ల బారిన పడకుండా, సోషల్ ఇన్వెస్టింగ్ ఫోరమ్లలో చేరాడు. అన్నీ కాదు కానీ, కొన్ని ఉపయోగకరమైనవి అని కొంత కాలానికి ఆయనకు అర్థమైంది. కొందరు అనుభవం కలిగిన స్టాక్ ట్రేడర్లు స్టాక్స్, ఫండ్స్, పెట్టుబడి సూత్రాల గురించి చెప్పడం తనకు నిజంగా సాయపడినట్టు ఉత్కర్‡్ష వెల్లడించారు. వీటి సాయంతో ట్రేడింగ్పై అవగాహన మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ సామాజిక మాధ్యమ ఫోరమ్ల సాయంతో స్టాక్స్ ట్రెండ్స్ గురించి ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే ఇదే. ‘‘మార్కెట్లోని సీనియర్, అనుభవజ్ఞులైన ట్రేడర్ల నుంచి కొత్త ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నేర్చుకునే వేదికగానే సోషల్ ఇన్వెస్టింగ్ను చూడాలి. మరొకరిని కాపీ కొట్టడం కాకుండా.. స్టాక్ పరిశోధన, వార్తలు, ట్రేడింగ్ విధానాలను రూపొందించుకోవడానికి మార్గంగా నిలుస్తుంది’’అని స్మాల్కేస్ వసంత్ కామత్ వివరించారు. ఒక్క ఉత్కర్‡్ష అనే కాదు లక్షలాది మందికి నేడు ఇలాంటి సామాజిక మాధ్యమ వేదికలు ఇన్వెస్టింగ్కు మెరుగైన దారి చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కాకపోతే నిజమైన–మోసపూరిత వేదికల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమ వేదికలు ఇప్పుడు పోస్ట్లకు వచ్చే వ్యూస్ ఆధారంగా, ప్రకటనల ఆదాయాన్ని యూజర్లతో పంచుకుంటున్నాయి. దీంతో సీనియర్ ట్రేడర్లు తమ అనుభవాన్ని, ట్రేడింగ్, పెట్టుబడి విధానాలను తోటి యూజర్లతో పంచుకోవడం వల్ల వారికి అదొక ఆదాయ వనరుగానూ మారుతోంది. దీంతో కొత్త ఇన్వెస్టర్లు నేర్చుకునే అవకాశాలు, వేదికలు పెరిగాయి. -
నిపుణుల అంచనాల తలకిందులు.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే వారి అంచనాల్ని తలకిందులు చేస్తూ సోమవారం ఉదయం దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఉదయం 9.40 గంటల సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్లు నష్టపోయి 59239 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ఉండగా 76 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాలు తగ్గాయి. దీంతో ఆ కంపెనీకి చెందిన అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్ని ముటగట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, ఐసీఐసీ బ్యాంక్, ఎస్బీఐ, నెస్లే, బీపీసీఎల్,కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏసియన్ పెయింట్స్,హెచ్డీఎఫ్సీ, అల్ట్రా టెక్ సిమెంట్స్, బ్రిటానియా షేర్లు పాజిటీవ్గా ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో,యూపీఎల్,ఇన్ఫోసిస్,ఎథేర్ మోటార్స్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎయిర్టెల్,హెచ్సీఎల్,టెక్ మహీంద్రా, విప్రో,టీసీఎస్, హీరో మోటో కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. -
ముఖేష్ అంబానీ అదిరిపోయే ప్లాన్! రూ.19 లక్షల కోట్లకు రిలయన్స్ కంపెనీ వ్యాల్యూ!
ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ జోరు చూపుతోంది. తాజాగా బుధవారం ట్రేడింగ్లో తొలుత 1.9 శాతం పుంజుకుంది. కొత్త గరిష్టం రూ. 2,827ను తాకింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. 19 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి రూ. 19,12,814 కోట్ల మార్కెట్ క్యాప్ను అందుకున్న తొలి దేశీ దిగ్గజంగా ఆర్ఐఎల్ చరిత్ర సృష్టించింది. చివరికి రూ. 2,778 వద్ద షేరు ముగియడంతో మార్కెట్ విలువ రూ. 18,79,237 కోట్ల వద్ద స్థిరపడింది. జోరు తీరిలా ►ఈ ఏడాది(2022) మార్చిలో ఆర్ఐఎల్ మార్కెట్ విలువ తొలిసారి రూ. 18 లక్షల కోట్లను దాటింది. ►గతేడాది(2021) అక్టోబర్ 13న రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 17 లక్షల కోట్లను అధిగమించింది. ►దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్ యూఏఈలో టాజిజ్ కెమికల్ భాగస్వామ్య సంస్థలో 2 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్లో షేరు మరోసారి బలపడింది. వెరసి ఈ ఏడాది ఇప్పటివరకూ షేరు 17.3 శాతం ర్యాలీ చేసింది. ►ఓవైపు ముడిచమురు ధరలు ఊపందుకోవడంతో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మరింత బలపడనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. మరోపక్క ప్రపంచ భౌగోళిక, రాజకీయ అస్థిర వాతావరణంలోనూ టెలికం బిజినెస్ స్థిరంగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఇక రిటైల్ బిజినెస్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు సహకారంపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. ఇటీవల పునరుత్పాదక ఇంధన బిజినెస్వైపు భారీ ప్రణాళికలు వేయడం కూడా కంపెనీకి బలాన్నిస్తున్నట్లు వివరించారు. చదవండి👉అదానీనా మజాకానా.. ముఖేష్ అంబానీకి భారీ షాక్..! -
స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను! ఈ వారం మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల దృష్ట్యా స్టాక్ సూచీలు ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చు. కోవిడ్ కేసులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిణామాల నుంచి ఇన్వెస్టర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలపై ఇన్వెస్టర్లు కన్నేయొచ్చని తెలిపారు. ‘‘జాతీయ, అంతర్జాతీయంగానూ సెంటిమెంట్ బలహీనంగానే ఉంది. ద్రవ్య పాలసీపై ఫెడ్ రిజర్వ్ కఠిన వైఖరిని కలిగింది. బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆగడం లేదు. క్రూడాయిల్ ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల వరుస విక్రయాలకు పాల్పడుతున్నారు. కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపొచ్చు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి సాంకేతికంగా 17,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 16,800 వద్ద మద్దతు లభించొచ్చు. స్వల్పకాలంలో మార్కెట్ స్థిరీకరించుకునే అవకాశాలు ఎక్కువ’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచనుందనే ఆందోళనలతో గతవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. వారం మొత్తంగా 1,142 పాయింట్లు, నిఫ్టీ 304 పాయింట్లు చొప్పున క్షీణించాయి. మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలు... కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల ప్రభావం ముందుగా నేడు మార్కెట్ ఐసీఐసీఐ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్ క్యూ4 గణాంకాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక వారంలో సుమారు 160కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, విప్రో, మారుతీ సుజుకీ, ఆల్ట్రాటెక్ సిమెంట్స్ మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ద్రవ్యోల్బణం, బాండ్లపై రాబడులు అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఈక్విటీ మార్కెట్లను కలవరపెడుతోంది. ఇప్పటికే అమెరికాతో సహా బ్రిటన్, భారత్లో ద్రవ్యోల్బణ రికార్డు స్థాయికి చేరినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి. ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఆయా దేశాల్లో ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుండటంతో ఈక్విటీ మార్కెట్లు ఉలికిపడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపి లేకుండా దేశీయ ఈక్విటీలను అమ్మేస్తుండటం సెంటిమెంట్పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఏప్రిల్లో రూ.15,867 కోట్ల షేర్లను, ఈ ఏడాది మొత్తంగా ఇప్పటికి వరకు రూ.1,32,529 కోట్ల షేర్లను విక్రయించారు. రెండు ఐపీవోలు.. ఈ వారంలో రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఫుట్వేర్ కంపెనీ క్యాంపస్ యాక్టివ్వేర్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం(ఈ నెల 26న) ప్రారంభం అవుతుంది. ఇష్యూ గురువారం ముగిస్తుంది. మల్టీ స్పెషాలిటీ పిల్లల హాస్పిటల్ చెయిన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఐపీవో ఏప్రిల్ 27న(బుధవారం) ప్రారంభమై 29న(శుక్రవారం) ముగుయనుంది. దీని ద్వారా సంస్థ రూ. 2,000 కోట్లు సమీకరించనుంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఏప్రిల్ 28న) నిఫ్టీ సూచీకి చెందిన ఏప్రిల్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మార్చిలో పీనోట్ పెట్టుబడులు: 87,979 పార్టిసిపేటరీ(పీ) నోట్ల ద్వారా దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు గత నెలలో రూ. 87,979 కోట్లకు క్షీణించాయి. ఫిబ్రవరిలో ఇవి రూ. 89,143 కోట్లుగా నమోదయ్యాయి. భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో రానున్న నెలల్లో లిక్విడిటీ తగ్గనుందని, దీంతో పీనోట్ల ద్వారా పెట్టుబడులపై ఒత్తిడి పెరగనుందని సెబీ రిజిస్టర్డ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసుల సంస్థ గ్రీన్ పోర్ట్ఫోలియో వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలియజేశారు. అయితే ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు భారత్తో వాణిజ్య భాగస్వామ్యాలకు ఆసక్తి చూపిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఇన్వెస్టర్లకు రిజిస్టర్డ్ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) పీనోట్లను జారీ చేస్తుంటారు. తద్వారా దేశీ స్టాక్ మార్కెట్లలో గ్లోబల్ ఇన్వెస్టర్లు రిజిస్టర్కాకుండానే ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పీనోట్ల ద్వారా మార్చి చివరికల్లా రూ. 87,979 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. -
Warren Buffett: మీకిదే నా సలహా..ఇలా చేస్తే జాబ్, మంచి ఫ్యూచర్ ఉంటుంది!
వారెన్ బఫెట్ పైనుంచి దిగిరాలేదు. గోల్డ్ స్పూన్ తో పుట్టలేదు. ఆయన వెనుక గాఢ్ ఫాదర్ ఎవరూ లేరు. కటిక పేదరికాన్ని చూశారు. ఆకలి కేకలు పెట్టారు. అన్నమో రామచంద్రా అని ఏడ్చారు. పేదరికంతో బాధపడ్డారు. అంతే. అంతవరకే పేదరికాన్ని తిడుతూ కూర్చోలేదు. అవకాశాల్ని వెతుక్కున్నారు. అవకాశాలు లేని చోట దాన్ని సృష్టించుకున్నారు. ఒక్కో క్షణాన్ని కరెన్సీ నోటుగా మార్చడం తెలుసుకున్నారు. ఇలా 91ఏళ్ల వయస్సులో 117 బిలియన్ల (రూ. 8.97 లక్షల కోట్లు) కంటే ఎక్కువ విలువైన బెర్క్షైర్ హాత్వేకి ఛైర్మన్, సీఈఓగా ఉన్న బఫెట్ అప్పుడప్పుడు యువతకు ఉపయోగపడేలా సలహాలు ఇస్తుంటారు. తాజాగా తన షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. అందులో యువత జాబ్తో మంచి ఫ్యూచర్ ఎలా పొందవచ్చో తెలిపారు. కంపెనీ షేర్హోల్డర్లకు తన తాజా వార్షిక లేఖలో ..బఫెట్ తన సుదీర్ఘ కెరీర్లో పనిని ఆస్వాదించినట్లు చెప్పారు. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులు పలు అంశాలను గుర్తుంచుకోవాలని చెప్పారు. డబ్బులు కోసం ఎప్పుడూ పని చేయకండి. మీరు చేసే పనిని ఎంజాయ్ చేయండి. అలా చేస్తే మీకు కావాల్సిన డబ్బులు వాటంతట అవే వస్తాయి. ఒకవేళ డబ్బులు ఎక్కువగా వస్తున్న జాబ్లో మీరు జాయిన్ అయితే.. డబ్బులు వస్తున్నాయి. కాబట్టి పనిని ఎంజాయ్ చేయలేరు. ఉన్న జాబ్ను కూడా సక్రమంగా చేయలేరు. అందుకే మంచి భవిష్యత్ కావాలంటే పనని ఎంజాయ్ చేయాలని సూచించారు. బఫెట్ ఏం చేశారు. బఫెట్ తన తాత ముంగెర్కు చెందిన కిరాణా దుకాణంలో పని చేయడం ప్రారంభించారు. అయితే బఫెట్కు ఆ పని నచ్చకపోవడంతో సెక్యూరిటీలను విక్రయించే వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బఫెట్ తాత ముంగెర్ లాయర్ వృత్తిని ప్రారంభించారు. అలా 1965లో ఇద్దరూ కంపెనీ నిర్వహణ, ఆర్థిక విధానాలను నియంత్రించేలా బెర్క్షైర్ హాత్వే కంపెనీ కంట్రోల్ స్టేక్ను కొనుగోలు చేశారు. జనరల్ మోటార్స్, కోకా కోలా కంపెనీ,యాపిల్ వంటి మెగా కంపెనీలలో 700 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్, హోల్డింగ్లతో ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగారు. చదవండి: గేట్స్ ఫౌండేషన్కు బఫెట్ రాజీనామా -
రాకేష్ ఝున్ఝున్వాలా కన్నుపడింది!!వందల కోట్ల పెట్టుబడులు షురూ!
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా రియల్టీ రంగ కంపెనీ డీబీ రియల్టీలో ఇన్వెస్ట్ చేయనున్నారు. భార్య రేఖా ఝున్ఝున్వాలాకు చెందిన రేర్ ఇన్వెస్ట్మెంట్స్ సైతం కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నారు. రుణరహిత కంపెనీగా ఆవిర్భవించేందుకు వీలుగా వారంట్ల జారీ ద్వారా రూ.1,575 కోట్లు సమీకరించనున్నట్లు డీబీ రియల్టీ వెల్లడించింది. ప్రమోటర్ గ్రూప్సహా ఇతర ఇన్వెస్టర్లకు దశలవారీగా ఈక్విటీ షేర్లుగా మార్పిడయ్యే 12.7 కోట్ల వారంట్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. రియల్టీ రంగ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇటీవలే డీబీ రియల్టీలో రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనకు స్వస్తి నేపథ్యంలో రాకేష్ కుటుంబ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. -
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా ? క్యూ 3లో లిస్టింగ్ కంపెనీల రిజల్ట్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్పై సామాన్యులకు ఆసక్తి పెరిగింది. రాబడుల కోసం షేర్ మార్కెట్వైపు చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా కంపెనీల పనితీరు తెలుసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు ఎప్పుడూ సూచిస్తుంటారు. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్నాయి. అందులో కొన్ని లిస్టింగ్ కంపెనీల పనితీరు వివరాలు ఇలా ఉన్నాయి. పిరమల్... వీక్ స్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం పిరమల్ ఎంటర్ప్రైజెస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 32 శాతం క్షీణించి రూ. 426 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 628 కోట్లు ఆర్జించింది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం ప్రధానంగా ఫలితాలను దెబ్బతీసినట్లు కంపెనీ తెలియజేసింది. ఫార్మా విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు అక్టోబర్లో బోర్డు అనుమతించినట్లు కంపెనీ వివరించింది. ఫార్మా జోరు ఫార్మా విభాగం ఆదాయం రూ. 1,441 కోట్ల నుంచి రూ. 1,621 కోట్లకు ఎగసింది. ఫైనాన్షియల్ సర్వీసుల అమ్మకాలు మాత్రం రూ. 1,861 కోట్ల నుంచి రూ. 1,484 కోట్లకు తగ్గాయి. డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలు లావాదేవీకి రూ. 143 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రూ. 153 కోట్లమేర అనుకోని వ్యయాలు నమోదైనట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 2,714 వద్ద ముగిసింది. గోద్రెజ్ కన్జూమర్... ప్లస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 479 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 458 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు మరింత వృద్ధితో 9 శాతం ఎగసి రూ. 3,144 కోట్లకు చేరాయి. అయితే మొత్తం వ్యయాలు సైతం 11 శాతం పెరిగి రూ. 2,579 కోట్లను తాకాయి. దేశీ బిజినెస్ 9 శాతంపైగా వృద్ధితో రూ. 1,838 కోట్లను అధిగమించగా.. ఇండొనేసియా మార్కెట్ నుంచి ఆదాయం యథాతథంగా రూ. 445 కోట్లుగా నమోదైంది. ఆఫ్రికా నుంచి అమ్మకాలు 15 శాతం జంప్చేసి రూ. 748 కోట్లను దాటాయి. ఇతర మార్కెట్ల నుంచి మాత్రం ఆదాయం 4 శాతం నీరసించి రూ. 174 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 2.5% నష్టంతో రూ. 953 వద్ద ముగిసింది. బజాజ్ హిందుస్తాన్... నష్టాలు తగ్గాయ్ ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో షుగర్ తయారీ కంపెనీ బజాజ్ హిందుస్తాన్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం 29 శాతం తగ్గి రూ. 113 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 160 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం క్షీణించి రూ. 1,344 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,570 కోట్ల ఆదాయం సాధిం చింది. ప్రభుత్వ రంగ సంస్థ పీఎన్బీకి చెందిన రమణి రంజన్ మిశ్రాను నామినీ డైరెక్టర్గా బోర్డు ఎంపిక చేసినట్లు బజాజ్ హిందుస్తాన్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ హిందుస్తాన్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 14.7 వద్ద ముగిసింది. ఐబీ హౌసింగ్ లాభం... డౌన్ ముంబై: మార్టిగేజ్ కంపెనీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2) లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 286 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 323 కోట్లు ఆర్జించింది. ఈ కాలంలో ఇతర సంస్థలతో ఒప్పందాల నేపథ్యంలో రూ. 325 కోట్ల రుణాలను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిని డిసెంబర్కల్లా రూ. 500 కోట్లకు, 2022 మార్చికల్లా రూ. 800 కోట్లకు పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. రిటైల్ రుణాల విడుదలకు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ తదితరాలతో చేతులు కలిపినట్లు పేర్కొంది. క్యూ2లో స్థూల ఎన్పీఏలు 2.21 శాతం నుంచి 2.69 శాతానికి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 3.4% పతనమై రూ. 237 వద్ద ముగిసింది. ఆర్సెలర్ మిట్టల్... టర్న్ఎరౌంట్ గ్లోబల్ స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ఈ ఏడాది(2021) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ3)లో 462.1 కోట్ల డాలర్ల(రూ. 34,430 కోట్లు) నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020) ఇదే కాలంలో 26.1 కోట్ల డాలర్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాగా.. క్యూ3లో మొత్తం ఆదాయం 13.3 బిలియన్ డాలర్ల నుంచి 20.2 బిలియన్ డాలర్లకు జంప్చేసింది. స్థూల రుణభారం బిలియన్ డాలర్లు తగ్గి 8.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ కాలంలో షిప్మెంట్స్ 17.5 మిలియన్ టన్నుల నుంచి తగ్గి 14.6 ఎంటీకి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా ఆటోమోటివ్ రంగం నుంచి బలహీనపడిన డిమాండ్, ఉత్పత్తి సమస్యలు, ఎగుమతులకు ఆర్డర్లు ఆలస్యంకావడం వంటి అంశాలు కారణమైనట్లు కంపెనీ తెలియజేసింది. ధరలు బలపడటంతో క్యూ3లో పటిష్ట ఫలితాలు సాధించినట్లు ఆర్సెలర్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు. దీంతో అత్యధిక లాభాలు ఆర్జించడమేకాకుండా 2008 తదుపరి కనిష్ట నికర రుణ భారాన్ని నమోదు చేసినట్లు వెల్లడించారు. మోర్పెన్ ల్యాబ్స్... జూమ్ హెల్త్కేర్ రంగ కంపెనీ మోర్పెన్ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 38 శాతం వృద్ధితో రూ. 37 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 27 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 340 కోట్ల నుంచి రూ. 398 కోట్లకు ఎగసింది. ఏపీఐలకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్, చైనా నుంచి సరఫరాలకు అంతరాయాలు ఏర్పడటం వంటి అంశాల నేపథ్యంలో విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ సుశీల్ సూరి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో మోర్పెన్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.25 శాతం ఎగసి రూ. 52.5 వద్ద ముగిసింది. జీవోసీఎల్కు రూ.23 కోట్ల నష్టం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవోసీఎల్ కార్పొరేషన్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.23 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 24 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవర్ రూ. 132 కోట్ల నుంచి రూ. 146 కోట్లకు చేరింది. ఆర్డర్ బుక్ రూ.946 కోట్లు ఉందని జీవోసీఎల్ కార్పొరేషన్ ప్రకటించింది. చదవండి: ఈ షేర్లు... తారాజువ్వలు! -
Stock Market: కరెక్షన్ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా కరెక్షన్ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్ల గడువు(గురువారం) ముగింపుతో పాటు ఈ వారంలో సుమారు 700కి పైగా కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపవచ్చని వారు అంచనా వేస్తున్నారు. సూచీల గమనాన్ని ప్రపంచ పరిణామాలు నిర్ధేశిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే కరోనా కేసుల నమోదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు తదితర అంశాలూ ట్రేడింగ్ పై ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 40,000 స్థాయిని అధిగమించింది. అనేక బ్యాంకులు ఈ వారంలో రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు అధిక వ్యాల్యూమ్స్తో ట్రేడ్ అవ్వొచ్చు. ఎఫ్అండ్ఓ ముగింపు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో కరెక్షన్(దిద్దుబాటు) కొనసాగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్ పతనం కొనసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 18,050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఎగువస్థాయిలో 18,300–18,350 శ్రేణిలో వద్ద బలమైన నిరోధం ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. వరుస నాలుగు రోజుల పతనంతో గతవారం సెన్సెక్స్ 483 పాయింట్లు నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయాయి. క్యూ2 ఫలితాల జాబితా... సూచీలు ముందుగా గత శుక్రవారం విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, శనివారం వెల్లడైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలపై స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో నిఫ్టీ–50 ఇండెక్స్లోని షేర్లకు చెందిన 20 కంపెనీలతో సహా సుమారు 700కు పైగా కార్పొరేట్లు తమ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ తదితర కంపెనీలున్నాయి. ఈ వారంలో రెండు ఐపీఓలు... బ్యూటీ ఉత్పత్తుల సంస్థ నైకాతో పాటు ఫినో పేమెంట్స్ బ్యాంక్స్ ఈ వారం పబ్లిక్ ఇష్యూల(ఐపీఓ) ద్వారా మార్కెట్లోకి రానున్నాయి. ఫినోటెక్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీఓ ఈ నెల 29న(శుక్రవారం) ప్రారంభమై.., నవంబర్ 2న ముగుస్తుంది. ధర శ్రేణిని కంపెనీ ఈ వారంలో ప్రకటించనుంది. ఎఫ్ఐఐల ట్రెండ్ రివర్స్... గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్కు భిన్నంగా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) దేశీయ ఈక్విటీల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ(అక్టోబర్ 24)ఎఫ్పీఐలు రూ. 3,825 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,331 కోట్ల షేర్లను అమ్మగా., డెట్ మార్కెట్లో రూ.1,494 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ షేర్ల పట్ల బేరిష్ వైఖరి కలిగి ఉన్నారు. బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కంపెనీలు రెండో క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ ఏడాది తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,406 కోట్ల ఐటీ షేర్లను విక్రయించారు. సాధ్యమైనంత తొందర్లో ట్యాపరింగ్ చర్యలను చేపట్టడంతో పాటు కీలక వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్ వ్యాఖ్యలతో విదేశీ ఇన్వెస్టర్లు వర్థమాన దేశాల మార్కెట్లలో లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. 28 నుంచి నైకా ఐపీవో షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125 సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 1న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125గా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా తాజాగా రూ. 630 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 4,19,72,660 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. కార్యకలాపాల విస్తరణకు, కొత్త రిటైల్ స్టోర్లు.. గిడ్డంగుల ఏర్పాటు కోసం ఐపీవో నిధులను కంపెనీ వినియోగించనుంది. అలాగే కొంత రుణాన్ని తీర్చడం ద్వారా వడ్డీ వ్యయాలను తగ్గించుకుని, లాభదాయకతను మెరుగుపర్చుకోనుంది. -
Stock Market: లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్.. గురువారం ఉదయం లాభాలతో మొదలై.. స్వల్ఫ నష్టాలు, ఆపై స్వల్ఫ లాభల దిశగా ట్రేడ్ అవుతోంది. వరుస రికార్డులను నమోదుచేసిన దేశీ సూచీలకు మంగళవారం రోజున బ్రేక్ పడిన విషయం తెలిసిందే. బుధవారం కూడా ఇదే ట్రెండ్ మార్కెట్లో కొనసాగింది. అయితే గురువారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు మరోసారి సరికొత్త గరిష్టాలను టచ్ చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 69 పాయింట్లు లాభపడి 61,329 పాయింట్ల వద్ద ట్రేడయ్యింది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 18,297 వద్దకు చేరుకుంది. కానీ, కాసేపటికే సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ఫ నష్టాలను చవిచూశాయి. ఆ వెంటనే స్వల్ఫంగా లాభపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 61,271.07 , నిఫ్టీ 18,282.00 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఎనర్జీ బెస్ట్ సెక్టార్గా, నిఫ్టీ సెక్టార్ వరస్ట్ సెక్టార్లో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్ మీద మార్కెట్ ఫోకస్ నడుస్తోంది. ఓఎన్జీసీ భారీగా లాభపడగా, ఐవోసీ, టాటా మోటర్స్, బీపీసీఎల్, టాటా కన్జూమర్ ఉత్పత్తులు లాభపడ్డాయి. హెచ్సీఎల్ టెక్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ తరపున సన్ఫార్మా, పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, కొటాక్ బ్యాంక్, రిలయన్స్, మారుతీ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ లాభపడగా.. ఏషియన్ పెయింట్, టైటాన్, బజాజ్ ఆటో, టీసీఎస్, టెక్ఎం, భారతీఎయిర్టెల్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. చదవండి: మార్కెట్లో చెన్నై సూపర్ కింగ్స్ హవా -
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంఖ్య 8 కోట్లు, ఫ్రాన్స్ను వెనక్కి నెట్టిన భారత్
ముంబై: స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ ప్లాట్ఫామ్పై లావాదేవీలు నిర్వహించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల ఖాతాలు ఇటీవల కోటి జమయ్యాయి. దీంతో వీటి సంఖ్య తాజాగా 8 కోట్లకు చేరాయి. 107 రోజుల్లో అంటే జూన్ 6– సెప్టెంబర్ 21 మధ్య కోటి ఖాతాలు జత కలసినట్లు బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్కుమార్ చౌహాన్ తాజాగా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 6కల్లా లావాదేవీలు నిర్వహిస్తున్న వినియోగదారుల సంఖ్య 7 కోట్లను తాకినట్లు బీఎస్ఈ ఇంతక్రితం వెల్లడించింది. ఇందుకు 12 నెలల్లో అంటే 2020 మే 23 నుంచి 2 కోట్ల ఖాతాలు జమకావడం కారణమైనట్లు తెలియజేసింది. ఇటీవల ఈ స్పీడ్ మరింత పెరగడంతో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య తాజాగా 8 కోట్ల మార్క్ను అధిగమించినట్లు ఆశిష్ వివరించారు. ఇందుకు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు పెరగడం దోహదపడినట్లు తెలియజేశారు. గత ఏడాదిన్నర కాలంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా ప్రత్యక్షంగా ఈక్విటీ పెట్టుబడులు జోరందుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా పలు అంశాలు ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. దేశీ స్టాక్ మార్కెట్లలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతున్నట్లు తెలియజేశారు. అయితే మార్కెట్లలోకి ప్రవేశించేముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు సూచిం చారు. పెట్టుబడులకు దిగేముందు కంపెనీలు, విధానాలు, అవకాశాలు తదితర అంశాలను అర్ధం చేసుకోవలసి ఉంటుందని సలహా ఇచ్చారు. తొలినాళ్లలో ఇలా.. 2008 ఫిబ్రవరిలో బీఎస్ఈ కోటి మంది ఇన్వెస్టర్ల మైలురాయిని చేరుకున్నట్లు బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్కుమార్ చౌహాన్ ప్రస్తావించారు. ఆపై 2011 జులైకల్లా ఈ సంఖ్య 2 కోట్లను తాకిందని చెప్పారు. ఈ బాటలో 3 కోట్ల మార్క్కు మరో మూడేళ్లు పట్టగా..అంటే 2014 జనవరికల్లా చేరగా.. 2018 ఆగస్ట్లో 4 కోట్లను అందుకున్నట్లు తెలియజేశారు. 2020 మే నెలలో 5 కోట్లను తాకగా.. 2021 జనవరి 19న 6 కోట్లకు చేరింది. కాగా.. కోవిడ్–19 మహమ్మారి తలెత్తడంతో 2020 మార్చిలో ఉన్నట్టుండి కుప్పకూలిన మార్కెట్లు ఆపై బుల్ ర్యాలీ బాట పట్టిన విషయం విదితమే. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 110 శాతం దూసుకెళ్లి ఏకంగా 59,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. మార్చి కనిష్టం 26,000 పాయింట్ల నుంచి చూస్తే 127 శాతం పురోగమించింది. ఈ ర్యాలీలో భాగంగా 2021 జనవరిలో సెన్సెక్స్ తొలుత 50,000 పాయింట్ల మైలురాయిని చేరుకుంది. ఈ స్పీడ్ కొనసాగడంతో ఒక్క ఆగస్ట్లోనే 4,000 పాయింట్లు కలుపుకుని 57,000 పాయింట్లకు చేరింది. తదుపరి ఆగస్ట్ 31– సెప్టెంబర్ 3 మధ్య కేవలం మూడు రోజుల్లోనే 1,000 పాయింట్లు జంప్చేసింది. ఆపై మరో 8 రోజుల్లో అంటే ఈ నెల 16కల్లా మరో 1,000 పాయింట్లు జమ చేసుకుని 59,000నూ దాటేసింది! ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి 3.54 ట్రిలియన్ డాలర్లు లేదా రూ. 260.78 లక్షల కోట్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే అత్యంత విలువైన మార్కెట్లలో ఫ్రాన్స్ను వెనక్కి నెట్టి ఆరో ర్యాంకులో నిలిచింది!! చదవండి: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్ -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విడిచిపెట్టనప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లు సరికొత్త రికార్డ్ లను కొనసాగిస్తున్నాయి. ఆ రికార్డ్ల పరంపర కొనసాగిస్తూ గురువారం ఉదయం మార్కెట్లు 9.38 గంటల సమాయానికి నిఫ్టీ 54.05 పాయింట్ల లాభంతో 17,125.10 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 144.77 పాయింట్ల లాభంతో 57,482.98 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. కాగా, మారుతి సుజికి,డీఆర్ఎల్,బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్ మార్కెట్లు లాభాల్ని గడిస్తుండగా.. వోల్టాస్,బాటా ఇండియా, గోద్రెజ్,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకుంటున్నాయి. -
బుల్ పరుగులు..3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి
లాభాల జడివానతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. సూచీల వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.3.58 లక్షల కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.247 లక్షల కోట్లకు చేరింది. ముంబై: దలాల్ స్ట్రీట్ సోమవారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొంతకాలంగా పరిమిత శ్రేణిలో కదలాడుతున్న పావెల్ వ్యాఖ్యలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 833 పాయింట్లు పెరిగి 56,958 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 765 పాయింట్ల లాభంతో 56,890 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ సూచీ 247 పాయింట్లు ఎగసి 16,952 వద్ద కొత్త ఆల్టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 226 పాయింట్ల లాభంతో 16,931 వద్ద స్థిరపడింది. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ సూచీ ఐదు కొత్త రికార్డు ముగింపులను నమోదుచేసింది. ధరల నియంత్రణకు చైనా నిల్వల విక్రయానికి సిద్ధమవడంతో మెటల్ షేర్ల ర్యాలీ కొనసాగింది. ఎన్ఎస్ఈలోని సెక్టార్ ఇండెక్స్ల్లోకెల్లా నిఫ్టీ మెటల్ సూచీ అత్యధికంగా రెండున్నర శాతం లాభపడింది. కొంతకాలంగా స్తబ్ధుగా ట్రేడవుతున్న ఆర్థిక, బ్యాంకింగ్ కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. ఆగస్ట్లో వాహన విక్రయాలు ఊపందుకొని ఉండొచ్చనే అంచనాలతో ఆటో షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,208 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.689 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల దూకుడుకు కారణాలివే... అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ శుక్రవారం జాక్సన్ హోల్ సదస్సులో మాట్లాడుతూ.., వడ్డీ రేట్ల పెంపు 2023 ఏడాది నుంచి ఉండొచ్చన్నారు. బాండ్ల కొనుగోళ్ల కోత ఈ సంవత్సరాంతం ప్రారంభం అవుతుందని స్పష్టతనిచ్చారు. ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికాతో పాటు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల బాటపట్టా యి. అలాగే పావెల్ ప్రకటనతో యూఎస్ డాలర్ బలహీనపడడంతో, ట్రెజరీ ఈల్డ్స్ కూడా తగ్గాయి. యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 1.312 శాతం నుంచి 1.305 శాతానికి దిగింది. డాలర్ ఇండెక్స్ కూడా రెండు వారాల కనిష్టానికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 40 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఈ వారంలో వెలువడనున్న దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదుకావచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి కేంద్రం చేపట్టిన సంస్కరణలతో క్యూ1లో రికార్డు స్థాయిలో 17.57 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్లోకి వచ్చాయి. నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత ఈ ఆగస్టులో ఎఫ్ఐఐ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరిన్ని విశేషాలు... భారతీ ఎయిర్టెల్ బీఎస్ఈలో నాలుగున్నర శాతం లాభపడి రూ.620 వద్ద ముగిసింది. కంపెనీ బోర్డు రూ.21వేల కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలపడం షేరు ర్యాలీకి కారణం. పలు కార్ల రేట్లు ఈ సెప్టెంబర్ నుంచి పెంచనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించడంతో బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు మూడు శాతం పెరిగి రూ.6,797 వద్ద ముగిసింది. భారత్లో టెస్లా కంపెనీకి విడిభాగాలను సరఫరా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలతో సోనా కామ్స్టార్, సంధార్ టెక్, భారత్ ఫోర్జ్ షేర్లు తొమ్మిదిశాతం ర్యాలీ చేశాయి. -
స్టాక్ మార్కెట్: ప్రపంచంలోనే భారత్ టాప్!
న్యూఢిల్లీ: ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్ చూడని లాభాన్ని గడచిన ఏడాది కాలంలో భారత స్టాక్ మార్కెట్ చూసింది. ఈ మేరకు వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం, నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్– నిఫ్టీ గడచిన 12 నెలల కాలంలో ఏకంగా 45 శాతం పురోగమించింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ చూసినా 19 శాతం పురోగమించింది. ఆర్థిక రికవరీ, ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుతో రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్లోకి భారీగా రావడం దీనికి కారణం. ఒక నివేదిక వెలువరించిన అంశాల్లో ముఖ్యమైనవి... ►అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లను పరిగణనలోకి తీసుకునే ఎంఎస్సీఓ వరల్డ్ ఇండెక్స్ గత 12 నెలల్లో 15 శాతం పురోగమిస్తే, వర్థమాన దేశాల మార్కెట్లను ప్రతిబింబించే ఎంఎస్సీఐ ఎమర్జింగ్ సూచీ 29 శాతం లాభపడింది. వీటికన్నా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్– నిఫ్టీ వేగం అధికంగా ఉంది. ► భారత్ మార్కెట్ల రిటర్న్స్ పరిస్థితి కూడా గ్లోబల్ మార్కెట్లతో సరిపోల్చితే గణనీయంగా మెరుగుపడింది. ఇందుకు సంబంధించి నిష్పత్తి గతంలో 80 శాతం ఉంటే, తాజాగా 61 శాతానికి మెరుగుపడింది. ► ఇక గడచిన ఏడాది కాలంలో భారత్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక ట్రిలియన్ డాలర్లమేర పెరిగి, 3.17 ట్రిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో ప్రపంచంలో భారత్ ఎనిమిదవ స్థానానికి చేరింది. భారత్ ముందు ఈ విషయంలో అమెరికా (51.39 ట్రిలియన్ డాలర్లు), చైనా (12.16 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (6.77 ట్రిలియన్ డాలర్లు), హాంకాంగ్ (6.38 ట్రిలియన్ డాలర్లు), బ్రిటన్ (3.68 ట్రిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (3.35 ట్రిలియన్ డాలర్లు) ఉండగా, 9, 10 స్థానాల్లో కెనడా (3.15 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (2.88 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి. ► గడచిన ఏడాది కాలంలో ఫారిన్ పోర్టిఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) భారత్లో రూ.2.2 లక్షల కోట్ల (31 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వస్తే, క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప) ద్వారా వచ్చిన రిటైల్ పెట్టుబడుల విలువ లక్ష కోట్లుగా ఉంది. ► ఎకానమీ వృద్ధి వాతావరణం, మెరుగుపడుతున్న కార్పొరేట్ మార్జిన్లు, తక్కువ పన్ను రేట్లు, సరళతరమైన రీతిలో తక్కువ స్థాయిలో వడ్డీరేట్ల వ్యవస్థ వంటి అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థ రీ–రేటింగ్కు దోహదపడే అవకాశం ఉందని ఇటీవల ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ ఇటీవలే ఒక నివేదికలో పేర్కొంది. చదవండి : రూపాయి.. అధరహో -
బంగారంలోనూ భారీగా తగ్గిన లావాదేవీలు
ముంబై: కొద్ది నెలలుగా బుల్ ధోరణిలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్ల కారణంగా కమోడిటీలలో ట్రేడింగ్ క్షీణిస్తూ వస్తోంది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజీ(ఎంసీఎక్స్)లో లావాదేవీల పరిమాణం నీరసిస్తోంది. ఎంసీఎక్స్లో ప్రధానమైన పసిడిలో లావాదేవీలు కొన్నేళ్ల కనిష్టానికి చేరాయి. వెరసి కమోడిటీ ఎక్ఛేంజీలో నిరుత్సాహకర పరిస్థితులు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇతర విభాగాలలోనూ ట్రేడింగ్ తగ్గుతూ వచ్చినట్లు తెలియజేశారు. 2011 గరిష్టంతో పోలిస్తే పరిమాణం తగినంతగా పుంజుకోలేదని వివరించారు. ఇదీ తీరు 2011లో రోజువారీగా ఎంసీఎక్స్లో సగటున రూ. 48,326 కోట్ల టర్నోవర్ నమోదైంది. ప్రస్తుతం రూ. 28,972 కోట్లకు పరిమితమవుతోంది. ఇది 40 శాతం క్షీణతకాగా.. పసిడి ఫ్యూచర్స్లో లావాదేవీలు మరింత అధికంగా 54 శాతం పతనమయ్యాయి. రోజువారీ సగటు టర్నోవర్ రూ. 5,723 కోట్లకు చేరింది. 2011లో రూ. 12,436 కోట్లు చొప్పున రోజువారీ సగటు టర్నోవర్ నమోదైంది. చమురు డీలా ఎంసీఎక్స్లో మరో ప్రధాన విభాగమైన చమురులో ట్రేడింగ్ సైతం ఇటీవల వెనుకంజ వేస్తోంది. చమురు ఫ్యూచర్స్లో రోజువారీ సగటు టర్నోవర్ 2012లో రూ. 9,421 కోట్లను తాకింది. మొత్తం ఎఫ్అండ్వోను పరిగణిస్తే రూ. 9,963 కోట్లుగా నమోదైంది. అయితే 2021లో రూ. 5,280 కోట్లకు ఈ పరిమాణం పడిపోయింది. 2014 నుంచీ ఎంసీఎక్స్లో ట్రేడింగ్కు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు), ఈటీఎఫ్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు)ను అనుమతించినప్పటికీ లావాదేవీలు పుంజుకోకపోవడం గమనార్హం! చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!! స్టాక్ ఎక్ఛేంజీల స్పీడ్ దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ట్రేడర్లను భారీగా ఆకట్టుకోవడంతో ఎంసీఎక్స్ వెనుకబడుతూ వచ్చింది. ప్రస్తుతం బీఎస్ఈలో 7.8 కోట్ల మంది, ఎన్ఎస్ఈలో 4.5 కోట్లమంది ప్రత్యేకతరహా రిజస్టర్డ్ క్లయింట్లు(యూసీలు) నమోదై ఉన్నారు. 2003 నుంచి బులియన్, చమురు ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో పోటీయేలేని ఎంసీఎక్స్ 2021 జులైకల్లా 69.86 లక్షల మంది యూసీలను మాత్రమే కలిగి ఉంది. అయితే ఇదే కాలంలో ఎంసీఎక్స్ షేరు మాత్రం 2013 ఆగస్ట్లో నమోదైన రూ. 290 నుంచి 2020 అక్టోబర్కల్లా రూ. 1,875కు చేరింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 7,482 కోట్లను తాకింది. ప్రధానంగా సుప్రసిద్ధ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా ఎంసీఎక్స్లో 5 శాతం వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో షేరు ర్యాలీ చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కోటక్ వాటా 15శాతం.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం కోటక్ గ్రూప్ 15 శాతం వాటాను కలిగి ఉంది. 2021 మార్చికల్లా రూ. 685 కోట్ల నగదు నిల్వలను కలిగి ఉంది. ఇటీవల సాంకేతిక సేవల కోసం టీసీఎస్ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో ఎంసీఎక్స్ ట్రేడింగ్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తోంది. కొంతకాలంగా పసిడిలో స్పాట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్కు వీలైన టెక్నాలజీని సొంతం చేసుకోవడంలో ఎంసీఎక్స్ సమస్యలు ఎదుర్కొంటోంది. కాగా.. ఎక్సే్ఛంజీలలో 100 శాతం యాజమాన్యవాటాకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించనుందన్న వార్తలతో ఎంసీఎక్స్ షేరుకి మరింత బూస్ట్ లభించే అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
ప్రపంచ ప్రతికూలతలు పడేశాయ్
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్ రెండో రోజూ వెనకడుగు వేసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం సెంటిమెంట్ను దెబ్బతీసింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడయ్యాయి. కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలను ఉపసంహరించుకునే(ట్యాపరింగ్) అంశంపై ఫెడ్ అధికారులు చర్చించినట్లు మినిట్స్లో వెల్లడైంది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతారన్న భయాలు తెరపైకి వచ్చాయి. చదవండి : 5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు వ్యాక్సినేషన్ తక్కువగా నమోదైన ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. సరైన సమాచారం ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ తమ దేశానికే చెందిన దిగ్గజ ఐటీ సంస్థలపై చైనా రెగ్యులేటరీ కఠిన ఆంక్షలను విధించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లు పతనబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్కు అనుగుణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజూ క్షీణించాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమై 55,329 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లను కోల్పోయి 16,500 దిగువను 16,450 వద్ద నిలిచింది. మార్కెట్ పతనంలో భాగంగా మెటల్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాలు ఆగలేదు. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడటంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 15 పైసలు పతనమై 74.39 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,287 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.119 కోట్ల షేర్లను కొన్నారు. మెటల్ షేర్లలో మంటలు... ఈ ఏడాదిలో చైనా స్టీల్ ఉత్పత్తి భారీగా తగ్గిపోవచ్చని ప్రముఖ మైనింగ్ కంపెనీ బీహెచ్పీ గ్రూప్ తన కమోడిటీ అవుట్లుక్లో తెలపడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐరన్ ఓర్ ఫ్యూచర్లు నెలరోజుల కనిష్టానికి కుప్పకూలిపోయాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మెటల్ షేర్లపైనా పడటంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఆరున్నర పతనాన్ని చవిచూసింది. ఎన్ఎండీసీ, వేదాంత, టాటా స్టీల్, సెయిల్, జిందాల్ స్టీల్ షేర్లు పదిశాతం నుంచి ఎనిమిదిశాతం క్షీణించాయి. కార్ట్రేడ్ టెక్ ... లిస్టింగ్లో డీలా ఆటో క్లాసిఫైడ్ సంస్థ కార్ట్రేడ్ టెక్ షేర్లు లిస్టింగ్ తొలిరోజే డీలాపడ్డాయి. ఇష్యూ ధర రూ.1,618తో పోలిస్తే బీఎస్ఈలో ఒకశాతం డిస్కౌంట్తో రూ.1,600 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో 9% క్షీణించి రూ.1475 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 7% నష్టంతో రూ.1501 వద్ద ముగిశాయి. -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న బుల్ జోరుకి బ్రేకులు పడింది. శుక్రవారం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. యరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అంచనాల(2.2%)ను మించుతూ యూరోజోన్ ద్రవ్యోల్బణం 2.20 శాతంగా నమోదుకావడంతో యూరప్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. వాటి ప్రభావం దేశీ మార్కెట్ పై పడింది. దీంతో శుక్రవారం 9.34 గంటల సమయానికి దేశీ మార్కెట్లో సెన్సెక్స్ 165.80 పాయింట్లు క్షీణించి 55,296 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 111.30 పాయింట్లు నష్టపోయి 16,457.55 పాయింట్లతో ట్రేడ్ కొనసాగుతుంది. టాటాస్టీల్, హీరో మోటో కార్ప్, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- విశాఖ జైలులో ఈ–ములాఖత్లు ప్రారంభం
- Lok sabha elections 2024: ఎన్నికల ఎఫెక్ట్... టూ వీలర్లు, ఫ్రిజ్ సేల్స్ రయ్!
- ఎన్నో విశేషాల ‘బోర మెత్తళ్లు’
- రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలు
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement