-
సిరియాలో ఇరాన్ ఎంబసీపై దాడి.. 11 మంది మృతి
గాజా సంక్షోభ నేపథ్యంలో.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి జరపగా.. 11 మంది మృతి చెందారు. గాజా యుద్ధంలో ఇరాన్ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్, సిరియా దౌత్య విభాగాలు ఇది ఇజ్రాయెల్ దాడేనని ధృవీకరించాయి. ఆరు మిస్సైల్స్ ఎంబసీ భవనంపైకి దూసుకొచ్చాయని.. ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ద్వారా ఇజ్రాయెల్ రక్షణ దళం ఈ దాడికి తెగబడిందని ప్రకటించాయి. మరోవైపు బ్రిటన్ తరఫున సిరియాలో పని చేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఒకటి ఈ క్షిపణి దాడిపై ప్రకటన చేసింది. దాడిలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని.. ఎనిమిది మంది ఇరాన్, ఇద్దరు సిరియా, ఒక లెబనీస్ సైనికులు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలోనే సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ జరిపిన ఐదో దాడి ఇది.సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు ఇరాన్ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్ తరఫున పలు గ్రూపులు ఇక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇజ్రాయెల్ సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే.. గాజా సంక్షోభం తర్వాత ఈ దాడుల ఉధృతిని పెంచింది. మిస్ టార్గెట్?సిరియాలో ఇరాన్ ఎంబసీ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ దాడి ఇరాన్ దౌత్య కార్యాలయం లక్ష్యంగా జరగలేదని.. దానిని ఆనుకుని ఉన్న భవనం టార్గెట్గా జరిగి ఉండొచ్చని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ఇస్తున్నారు. భవనానికి ఖాసీం సోలెయిమానీ భారీ కటౌట్ ఉండడంతో అందులో ఉన్న సభ్యుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిపి ఉంటుందని సదరు కథనాల సారాంశం. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ మిలిటరీ ఆపరేషన్స్కి సోలెయిమానీని ఆద్యుడిగా పేర్కొంటారు. అయితే.. 2020లో సిరియా భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో సోలెయిమానీ చనిపోయాడు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదుసిరియా రాజధానిలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల దాడిని లెబనాన్ రెబల్ గ్రూప్ హిజ్బుల్లా ఖండిచింది. ఐఆర్జీసీ సభ్యుల మరణానికి కారణం అయినందుకు ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాజా యుద్ధంలో హమాస్కు ఇటు హిజ్బుల్లా, అటు ఐఆర్జీసీలు మిత్రపక్షంగా ఉన్నాయి. -
Russia: ఉక్రెయిన్ దాడుల్లో భారత యువకుడి మృతి
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించాడు. రష్యా ఆర్మీ వద్దసెక్యూరిటీ హెల్పర్గా పనిచేస్తున్న గుజరాత్కు చెందిన హేమిల్ అశ్విన్భాయ్(23) ఈ నెల 21న ఉక్రెయిన్ జరిపిన వైమానిక దాడుల్లో మృతి చెందాడు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెస్క్ ప్రాంతంలో హేమిల్ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్ దాడులు జరిగాయని భారత్కు చెందిన మరో సెక్యూరిటీ హెల్పర్ సమీర్ అహ్మద్ తెలిపారు. అయితే హేమిల్ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత విదేశీ వ్యవహరాల శాఖ స్పష్టం చేసింది. సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారత యువకులను ఉక్రెయిన్తో యుద్ధంలో చురుగ్గా పాల్గొనాలని రష్యా బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే హేమిల్ ఉక్రెయిన్ దాడుల్లో మరణించాడు. గతేడాది రష్యా ఆర్మీ 100 మంది భారతీయులను సెక్యూరిటీ హెల్పర్లుగా నియమించింది. అయితే వీరందరూ యుద్ధం నుంచి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అడ్వైజరీ కూడా చేసింది. ఏజెంట్ల మోసం వల్లే భారత యువకులు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేయాల్సి వస్తోందని ఇటీవల ఎంఐఎం చీఫ్, అసదుద్దీనన్ ఒవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే. వీరి విషయంలో భారత విదేశాంగ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. . ఇదీ చదవండి.. అమెరికా నౌకపై హౌతీల మిసైల్ దాడి -
ఇరాన్పై ప్రతీకారదాడి.. పాక్ అమెరికాను సంప్రదించిందా?
పాకిస్తాన్లోని జైష అల్ అదిల్ మిలిటెంట్లు లక్ష్యంగా ఇరాన్ జరిపిన మెరుపు వైమానిక దాడులకు గురువారం పాకిస్తాన్ కూడా ప్రతికార దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే పాక్ ప్రతీకార వైమానిక దాడులకు ముందు అగ్రరాజ్యాన్ని సంప్రదించిందా? అని మీడియో అడిగిన ప్రశ్నను అమెరికా దాటవేసింది. మీడియా ప్రశ్నకు అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సమాదానాన్ని నిరాకరించారు. ఈ వ్యవహారంలో ఏం జరగవచ్చో లేదా జరగకపోవచ్చో అనేదానిపై తాను ప్రస్తుతానికి ఏం మాట్లాడలేనని స్పష్టం చేశారు. అమెరికా ఎల్లప్పుడూ మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి, భద్రతతో కూడిన పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసమే అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య దౌత్యపరమైన శాంతి కోసం యత్నిస్తున్నామని తెలిపారు. ఇక.. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్-గాజా దాడులు కోనసాగుతున్నాయి. అప్పటి నుంచి యెమెన్లో పనిచేసే హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలోని ఇజ్రాయెల్, ఇతర దేశాలకు సంబంధించిన పలు వాణిజ్య నౌకలపై దాడులకు తెగపడినట్లు తెలిపారు. దీంతో అమెరికా, బ్రిటన్ బలగాలు.. హౌతీ రెబల్స్పై ఎదురుదాడి చేశాయని అన్నారు. అనంతరం ఇరాన్, పాకిస్తాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయని తెలిపారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగటంపై తాము ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ ఉద్రిక్తతలపై తాము దృష్టి సారించామని పేర్కొన్నారు. అక్టోబర్ 7నుంచి ఉధృతం అవువతున్న దాడుల పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఇరాన్-పాక్తిస్తాన్ ఉద్రిత్తలపై మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో తీవ్రవాదానికి నిధలు సమకూర్చటం వంటి సుదీర్ఘ చరిత్ర ఇరాన్కు కలిగి ఉన్నట్లు తెలిపారు. చదవండి: మైనారిటీ నేతకు మద్దతు.. రష్యాలో పెద్ద ఎత్తున ఆందోళనలు -
Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!
దెయిర్ అల్బలాహ్ (గాజా): గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. కరెంటు సరఫరా లేక ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో తశనివారం వైద్య పరికరాలన్నీ మూగవోయాయి. దాంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచి్చందని తెలుస్తోంది! దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. వైద్య సేవలతో పాటు కరెంటు, ఆక్సిజన్ సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో పలు ఆస్పత్రుల్లో ఐసీయూల్లోని రోగులు, ఇంక్యుబేటర్లలోని చిన్నారులు నిస్సహాయంగా మృత్యుముఖానికి చేరువవుతున్నారు. ఇలా ఇప్పటికే 200 మందికి పైగా మరణించారని, మరికొన్ని వందల మంది మృత్యువుతో పోరాడుతున్నారని హమాస్ ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది! ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతున్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులాపేందుకు ససేమిరా అంటోంది. కనీసం వాటికి విరామమిచ్చేందుకు కూడా ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరోసారి నిరాకరించారు. షిఫా.. శిథిల చిత్రం అల్ షిఫా ఆస్పత్రిలో తాగునీటితో పాటు ఆహార పదార్థాలు కూడా పూర్తిగా నిండుకున్నాయి. దాంతో వైద్యంతో సహా ఏ సేవలూ అందక రోగులు నిస్సహాయంగా మృత్యువాత పడుతున్నారు. శనివారమే 100 మందికి దుర్మరణం పాలైనట్టు హమాస్ పేర్కొంది. వీటికి తోడు ఐసీయూ విభాగంపై బాంబు దాడి జరిగింది. ఆస్పత్రిని ఇజ్రాయెల్ సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. అక్కడ హమాస్ ఉగ్రవాదులతో భీకరంగా పోరాడుతున్నట్టు ప్రకటించింది. ఆస్పత్రి ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ బాంబు మోతలతో దద్దరిల్లుతున్నాయి. బాంబు దాడుల్లో రెండు అంబులెన్సులు తునాతునకలయ్యాయి. కనీసం రోగులు, క్షతగాత్రులను ఆస్పత్రి నుంచి మరో చోటికి తరలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అడుగు కదిపినా స్నైపర్ల తూటాలు దూసుకొస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. ఈ ఆస్పత్రి కిందే ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రధాన కార్యాలయముందని ఇజ్రాయెల్ మొదటినుంచీ ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే అంతర్జాతీయ ఖండనల నేపథ్యంలో శనివారం సాయంత్రానికల్లా ఇజ్రాయెల్ మాట మార్చింది. అల్ షిఫా ఆస్పత్రిపై దాడులు జరపడం లేదని, అక్కణ్నుంచి వెళ్లిపోవాలనుకున్న వారికోసం కారిడార్ తెరిచే ఉంచామని చెప్పుకొచ్చింది. దాడుల్లో గాయపడుతున్న రెండు రోజులుగా ప్రధానంగా అల్ అహిల్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ అక్కడ కూడా మౌలిక సదుపాయాలేవీ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కారిడార్లతో పాటు ఎక్కడ పడితే అక్కడ రోగులను నిస్సహాయంగా వదిలేసిన దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. పడకేసిన వైద్యం గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘‘గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’’ అని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. -
సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి
వాషింగ్టన్: సిరియాలో ఇరాన్ మద్దతునిస్తున్న దళాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఆయుధ నిల్వ కేంద్రంపై యుఎస్ యుద్ధ విమానాలు దాడి చేశాయని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ చీఫ్ రమీ అబ్దెల్ రెహమాన్ తెలిపారు. ఇరాన్ మద్దతిస్తున్న కొన్ని సాయుధ దళాలు ఇరాక్, సిరియాల్లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ సంక్షోభం పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధంగా మారకుండా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గాజా యుద్ధానికి ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పశ్చిమాసియాలో అమెరికా దళాలపై దాడులు మాత్రం సహించబోమని తెలిపేందుకే ఈ చర్యకు దిగినట్లు చెప్పారు. అమెరికా దళాలపై జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్ ఉందని, వాటిని ఏమాత్రం సహించబోమన్నారు. ఇస్లామిక్ రాజ్యాల వర్గాలను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాక్లో దాదాపు 2,500 మంది, సిరియాలో 900 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇక్కడి సైనికులపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా గత వారంలోనే రెండోసారి దాడికి పాల్పడింది. ఈ పరస్పర దాడులు ఇరాన్-అమెరికా మధ్య పశ్చిమాసియాలో మరో అలజడి చెలరేగేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో గాజా-ఇజ్రాయెల్ యుద్ధం సంక్షోభాన్ని సృష్టిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగుతోంది. ఇప్పటికే గాజాలో 10,500 మంది మరణించారు. ఇదీ చదవండి: Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది -
Israeli-Palestinian Conflict: శరణార్థి శిబిరాలపై భీకర దాడులు
గాజాసిటీ/ఖాన్ యూనిస్/జెరూసలేం: గాజాలోని శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ మిలిటెంట్లపై ప్రారంభించిన యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సెంట్రల్ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు జరిగాయి. అల్–మఘాజీ రెఫ్యూజీ క్యాంపుపై జరిగిన దాడిలో ఏకంగా 47 మంది మరణించారు. 34 మంది గాయపడ్డారు. జబాలియా క్యాంపులో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం బురీజ్ క్యాంప్లోని నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మూడు ఘటనల్లో 60 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారు. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవలే జబాలియా, బురీజ్ క్యాంపులపై జరిగిన దాడుల్లో 200 మందికిపైగా జనం మరణించారు. హమాస్తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అల్–ఖుద్స్ ఆసుపత్రి సమీపంలో పేలుడు గాజాలో ఆదివారం ఉదయం అల్–ఖుద్స్ హాస్పిటల్ సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. ఆసుపత్రికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసిందని పేర్కొంది. భవనం చాలావరకు ధ్వంసమైందని, చాలామంది మృతి చెందారని తెలియజేసింది. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజల ముసుగులో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలోని మకాం వేస్తున్నారని వివరించింది. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాపై అణుబాంబు ప్రయోగిస్తామన్న మంత్రిపై సస్పెన్షన్ వేటు హమాస్ మిలిటెంట్లను అంతం చేయడానికి గాజాపై అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిపై సస్పెన్షన్ వేటు పడింది. జెరూసలేం వ్యవహారాల మంత్రి అమిచాయ్ ఎలియాహూ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో గాజాలో సాధారణ ప్రజలెవరూ లేరని, అందరూ మిలిటెంట్లే ఉన్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు. గాజాపై అణుబాంబు ప్రయోగించే ఐచి్ఛకం కూడా ఉందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. మంత్రి వ్యవహారంపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. మంత్రిని ప్రభుత్వ సమావేశాల నుంచి నిరవధికంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం అంతర్జాతీయ చట్టాల ప్రమాణాల ప్రకారమే నడుచుకుంటున్నాయని నెతన్యాహూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై మంత్రి అమిచాయ్ ఎలియాహూ వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అబ్బాస్తో ఆంటోనీ బ్లింకెన్ భేటీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం వెస్ట్బ్యాంక్లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. అక్టోబర్ 7 తర్వాత వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయెల్ దాడుల్లో 150 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. జర్నలిస్టుకు తీరని దుఃఖం అల్–మఘాజీ క్యాంపుపై జరిగిన దాడి జర్నలిస్టు మొహమ్మద్ అలలౌల్కు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఆయన నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులను కోల్పోయారు. టర్కీష్ వార్తా సంస్థ అనడోలులో ఆయన ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టుగా పని చేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి అల్–మఘాజీ క్యాంపులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో మొహమ్మద్ కుటుంబం ఉంటున్న ఇళ్లు ధ్వంసమయ్యింది. నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఆయన భార్య, తల్లి, తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. -
Israel-Hamas war: గాజాలో నరకయాతన
రఫా/టెల్ అవీవ్: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ప్రధానంగా గాజా సిటీ శివారు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి భూతల యుద్ధం త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, అది సుదీర్ఘకాలం, సంక్లిష్టంగా ఉండబోతోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ చెప్పారు. గాజాలో హమాస్ మిలిటెంట్లు నిర్మించుకున్న సొరంగాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. గల్లాంట్ శుక్రవారం విదేశీ జర్నలిస్టులతో మాట్లాడారు. భారీ స్థాయిలో సైనిక బలగాలతో భూతల యుద్ధం ప్రారంభిస్తామని అన్నారు. వారికి వెన్నుదన్నుగా వైమానిక దళం కూడా ఉంటుందని చెప్పారు. తమ జవాన్లు గురువారం ఉత్తర గాజాపై భూతల దాడి చేసి, క్షేమంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. శుక్రవారం కూడా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందన్నారు. 9 వేలు దాటిన మృతుల సంఖ్య మూడు వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,300 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 3,000 మంది మైనర్లు, 1,500 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య గతంలో జరిగిన నాలుగు యుద్ధాల్లో దాదాపు 4,000 మంది మృతిచెందారు. ఈ నెల 7న మొదలైన యుద్ధంలో మృతుల సంఖ్య ఇప్పటికే 7,300 దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో వెస్ట్బ్యాంక్లో మృతిచెందినవారి సంఖ్య 110కు చేరుకుంది. హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో 1,400 మందికిపైగా మృత్యువాతపడ్డారు. హమాస్ వద్ద 229 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నలుగురు బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటిదకా 200కిపైగా పాఠశాలలు ధ్వంసమయ్యాయని ‘యునెస్కో’ ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం స్కూళ్లలో 40 శాతం స్కూళ్లు ధ్వంసమైనట్లు తెలియజేసింది. ఇంధనాన్ని అనుమతించేది లేదు సరిపడా ఆహారం, నీరు, నిత్యావసరాలు, ఔషధాలు లేక గాజాలో ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులు, క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంక్యుబేటర్లు పనిచేయక శిశువులు కన్నుమూస్తున్నారు. ఈజిప్టు ప్రభుత్వం పరిమితంగా ఆహారం, నిత్యావసరాలను ఈజిప్టు నుంచి గాజాలోకి అనుమతిస్తోంది. మరోవైపు గాజాకు పెట్రోల్, డీజిల్ సరఫరాను అనుమతించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ మరోసారి తేలి్చచెప్పారు. ఇంధనం మిలిటెంట్ల చేతుల్లోకి చేరితే దురి్వనియోగమయ్యే అవకాశం ఉందన్నారు. మిలిటెంట్లు జనరేటర్లతో సొరంగాల్లోకి గాలిని పంపిస్తుంటారని, ఇందుకోసం ఇంధనం వాడాల్సి ఉంటుందన్నారు. ‘‘హమాస్ మిలిటెంట్లకు గాలి కావాలంటే ఇంధనం కావాలి, ఇంధనం కావాలంటే మేము కావాలి’’ అని గల్లాంట్ వ్యాఖ్యానించారు. బందీల్లో 30 మంది పిల్లలు! ఈ నెల 7న ఇజ్రాయెల్పై హఠాత్తుగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికినవారిని దొరికినట్లు ఊచకోత కోశారు. చాలామందిని నిలబెట్టి కాల్చేశారు. వెనక్కి వెళ్లిపోతూ 229 మందిని బందీలుగా బలవంతంగా లాక్కెళ్లారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. బందీలను గాజాలోని గుర్తుతెలియని ప్రాంతంలో దాచినట్లు తెలుస్తోంది. బందీల్లో 30 మంది చిన్నపిల్లలు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ధారణకు వచి్చంది. తమ పిల్లలను విడిపించాలంటూ వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మూడేళ్లు, నాలుగేళ్ల వయసున్న చిన్నారులను కూడా మిలిటెంట్లు అపహరించడం గమనార్హం. వారి క్షేమ సమాచారాలు తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. జెనీవా తీర్మానం ప్రకారం.. సాధారణ పౌరులను బందీలుగా మార్చడం ముమ్మాటికీ యుద్ధ నేరమే అవుతుంది. సిరియాలో అమెరికా దాడులు వాషింగ్టన్: తూర్పు సిరియాలో ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్ సేనల స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఫైటర్ జెట్లు శుక్రవారం ఉదయం నిప్పుల వర్షం కురిపించాయి. రెండు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. గతవారం సిరియాలోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ అనుకూల మిలిటెంట్లు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారని, వాటికి ప్రతిస్పందనగానే తాము వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. ఒకవైపు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సిరియాలో ఇరాన్ అనుకూల శక్తులపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సిరియాలో దాడికి ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణతో ఏమాత్రం సంబంధం లేదని అమెరికా తేలి్చచెప్పింది. తమ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతోనే తూర్పు సిరియాలో ఇరాన్ సాయుధ దళాలపై దాడి చేశామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ పేర్కొన్నారు. అమెరికా దళాలపై దాడులను సహించబోమని పేర్కొన్నారు. అక్టోబర్ 17 నుంచి ఇరాక్, సిరియాలోని తమ సైనిక స్థావరాలపై, జవాన్లపై కనీసం 19 దాడులు జరిగాయని పెంటగాన్ ఆరోపించింది. ఈ దాడులకు బాధ్యులైనవారిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ పశ్చిమాసియాలో భారీ సంఖ్యలో సైనిక బలగాలను మోహరిస్తోంది. -
సిరియాలో ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు!
సిరియాలో ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. దీనిని అమెరికా రక్షణ విభాగం ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ బలగాలపై దాడులకు ప్రతిగానే ఈ దాడులు చేపట్టామని, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాని అనుబంధ విభాగాలు ఈ స్థావరాల్ని ఉపయోగించుకుంటున్నాయని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరాక్, సిరియాలో ఉన్న అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 17 నుంచి ఇరాన్ ప్రోత్సాహక ఉగ్ర సంస్థలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడులు హమాస్, ఇస్లామిక్ జిహాద్, హిజ్బుల్లా పనేనని అమెరికా అనుమానిస్తోంది. ప్రతిదాడుల్లో భాగంగానే తాజా దాడులు జరిపినట్లు ప్రకటించింది అమెరికా. అయితే ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభానికి, ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని ఆస్టిన్ స్పష్టం చేశారు. అమెరికా ట్రూప్లపై దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధ్యక్షుడు జో బైడెన్.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీకి గురువారం నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రకటన వెలువడి రోజు గడవక ముందే సిరియాలోని ఇరాన్ స్థావరాల్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవడం విశేషం. -
ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో తమ ఆధీనంలో ఉన్న బందీలు మరణించినట్లు హమాస్ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో గాజా స్ట్రిప్ ఉత్తర భాగంలో ఈ దాడులు జరగ్గా వేర్వేరు ప్రాంతాల్లోని మొత్తం 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. హమాస్ గత శనివారం ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేసి సుమారు 150 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బందీల్లో సాధారణ పౌరులు, విదేశాలకు చెందిన వారూ ఉన్నారు. బందీలను హమాస్ చెర నుంచి తప్పించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు కృషి చేస్తూనే హమాస్ బలగాలను మట్టుబెట్టేందుకూ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గాజా మొత్తంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజా స్ట్రిప్ జనాభా దాదాపు 24 లక్షలు. ఇజ్రాయెల్ బాంబు, క్షిపణి దాడులు విపరీతమైన ఆస్తినష్టాన్ని మిగులుస్తున్నాయి. భవనాలు నేలమట్టం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ గాజాపై జరిపిన దాడుల్లో 1500 మంది మృతి చెందారు. అందులో 500 మంది చిన్నారులే ఉన్నట్లు హమాస్ మీడియా కార్యాలయం ప్రకటించింది. మరోవైపు గాజా పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులకు.. ప్రతిగా బందీలను హతమారుస్తామంటూ హమాస్ ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో.. నీటి, కరెంట్ సరఫరాను నిలిపివేసింది. తాజాగా గాజాను ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని.. అది కల్లోలానికి దారి తీస్తుందని చెబుతోంది. -
గాజాలో ఇస్లామిక్ జిహాద్ అగ్రనేత హతం
గాజా సిటీ: ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ మధ్య ఘర్షణ నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ఇస్లామిక్ జిహాద్ ఉద్యమానికి అడ్డాగా మారిన గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆదివారం మూడో రోజుకు చేరాయి. శుక్రవారం దాడులు మొదలైన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో తాజాగా ఇస్లామిక్ జిహాద్ ఉద్యమ అగ్రనేత ఖలీద్ మన్సూర్ హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు, ఐదుగురు సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత మూడు రోజుల్లో ఇజ్రాయెల్ ప్రకోపానికి బలైన వారి సంఖ్య 31కు చేరింది. ఖలీద్ మన్సూర్ దక్షిణ గాజాలో రఫా శరణార్థుల శిబిరంలోని ఓ అపార్టుమెంట్పై నివసిస్తున్నాడు. అదే అపార్టుమెంట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి దిగింది. మరోవైపు ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్న ఇస్లామిక్ జిహాద్ సంస్థ కూడా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్ భూభాగంలోకి వందలాది రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ నడుమ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, గాజాలో అధికారం చెలాయిస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్ మాత్రం ప్రస్తుతానికి మౌనం పాటిస్తోంది. -
Russia-Ukraine war: ముట్టడిలో నగరాలు
పోక్రోవ్స్క్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్లో రష్యా పెను విధ్వంసం సృష్టిస్తోంది. తూర్పున డోన్బాస్లో పలు నగరాలపై బాంబు దాడులతో విరుచుకుపడింది. తయరీ పరిశ్రమకు కేంద్రమైన సెవెరోడోనెట్స్క్ నగరం బాంబులు, క్షిపణుల మోతతో దద్దరిల్లింది. సమీపంలోని లిసిచాన్స్క్ తదితర నగరాలపైనా దాడులు తీవ్రతరమయ్యాయి. డోన్బాస్లో కీలక కేంద్రాలైన ఈ రెండు నగరాలను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయి. అయితే ఉక్రెయిన్ దళాలు పలుచోట్ల వాటితో హోరాహోరీ తలపడుతున్నాయి. డోన్బాస్ చాలావరకు రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతుల్లో ఉండగా ఈ రెండు నగరాలూ ఉక్రెయిన్ అధీనంలో ఉన్నాయి. అక్కడి సైనిక లక్ష్యాలపై జరిగిన దాడుల్లో పలువురు పౌరులు కూడా బలయ్యారు. పౌర సేవలన్నీ స్తంభించిపోయాయి. సెవెరోలో ఇప్పటికే కనీసం 1500 మందికి పైగా మరణించినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని బాబ్రోవ్ గ్రామం వద్ద జరిగిన పోరులో రష్యా దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. చాలామంది సైనికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు అవుతున్నట్టు చెబుతున్నారు. లుహాన్స్క్ ప్రాంతంలోని బక్ముట్ నగరంపైనా శనివారం రాత్రి నుంచి దాడులు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి. మరోవైపు ఉత్తరాన రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్తో పాటు , సమీ తదితర ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అక్కడి సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి దాడుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ఉక్రెయిన్ చెబుతోంది. ఈయూ ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యాతో సెర్బియా మూడేళ్ల గ్యాస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశం ఇంధన అవసరాల కోసం దాదాపుగా రష్యా మీదే ఆధారపడింది. -
యెమెన్ జైలుపై సౌదీ వైమానిక దాడి
దుబాయ్: యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహించే ఒక జైలుపై సౌదీ ఆధ్వర్యంలో శుక్రవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో వందమందికి పైగా గాయపడడం, చనిపోవడం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు యెమెన్లోని హోడైడా నగరంలో ఉన్న కమ్యూనికేషన్ సెంటర్పై వైమానిక దాడి జరగడంతో దేశమంతా ఇంటర్నెట్ సౌకర్యం నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో సౌదీ, యూఏఈపై హౌతీ రెబల్స్ డ్రౌన్ దాడులు పెరిగాయి. వీటికి ప్రతీకారంగా అరబ్ దేశాల కూటమి ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. సదా నగరంలోని జైలుపై జరిగిన దాడిలో గాయపడిన వారిని రక్షించే కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు రెడ్క్రాస్ సంస్థ ప్రకటించింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయమై హౌతీ వర్గాలు ఇంకా స్పందించలేదు. సిరియా, ఇరాక్లో ఐసిస్ దాడులు బాగ్దాద్: ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణాలకు తెగబడ్డారు. సిరియాలోని అతిపెద్ద జైలుపై దాదాపు 100మందికిపైగా ఐసిస్ ఉగ్రవాదులు గురువారం రాత్రి దాడి జరిపగా, ఇరాక్లో ఆర్మీ బ్యారక్పై శుక్రవారం విరుచుకుపడ్డారు. ఇరాక్లో జరిగిన దాడిలో 11మంది ఇరాకీ సైనికులు చనిపోగా, సిరియా జైలు దాడిలో ఏడుగురు కుర్దిష్ సైనికులు, 23 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. ఇటీవల కాలంలో రెండు దేశాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేయడం ఆరంభించి పలువురు ఇరాకీ, సిరియన్ల మృతికి కారణమవుతున్నాయి. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ దగ్గరలోని సైనిక శిబిరంపై ఐసిస్లు తుపాకులతో విరుచుకుపడ్డారు. దీంతో శిబిరంలో నిద్రిస్తున్న ఒక లెఫ్టినెంట్ సహా 10మంది సైనికులు చనిపోయారు. మరోవైపు సిరియాలో ఇటీవల ఐసిస్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇందుకు ప్రతీకారంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా గ్వేరియన్ జైలుపై దాడికి దిగారు. ఆ సమయంలో జైల్లో 3వేలమంది ఐసిస్ మిలిటెంట్లున్నారని కుర్దిష్ డెమొక్రాటిక్ బలగాల ప్రతినిధి ఫర్హాద్ షామి చెప్పారు. దాడికి ముందు జైల్లో ఉగ్రవాదులు తిరుగుబాటు చేసి పారిపోయేందుకు యత్నించారని, ఇదే సమయంలో జైలు బయట ఒక కారుబాంబు పేలిందని జైలు వర్గాలు తెలిపాయి. దాడికి దిగిన ఉగ్రవాదుల్లో సిరియన్లు లేరని, వీరంతా విదేశీయులని తెలిపారు. దాడి అనంతరం తప్పించుకున్న 89 మంది ఉగ్రవాదులను తిరిగి పట్టుకున్నారు. 2017లో ఇరాక్, 2019లో సిరియాల్లో ఐసిస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఇలా మెరుపుదాడులకు దిగడం ఆరంభించింది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాక్ మిలటరీ ప్రతిజ్ఞ చేసింది. -
Gaza: నువ్వొక్కడివే బతికావు నాన్నా.. మనం కూడా
గాజా సిటీ: అమ్మ ఒడిలో ఉండాల్సిన ఐదు నెలల చిన్నారి ఒమర్ ఆస్పత్రి బెడ్పై పడుకుని ఉన్నాడు. మంచం అంచునే కూర్చున్న అతడి తండ్రి మహ్మద్ అల్- హదీద్ చెమర్చిన కళ్లతో పదే పదే కొడుకును చూసుకుంటూ ఉన్నాడు. బోసి నవ్వులతో వెలగాల్సిన ఆ పసివాడి ముఖం కుట్లతో నిండి ఉండటం, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న కాలికి కట్లు కట్టి ఉండటం చూస్తుంటే ఆ తండ్రి మనస్సు తరుక్కుపోతోంది. ‘‘కనీసం నువ్వైనా మిగిలావు. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న తోడు నువ్వొక్కడివే నాన్నా’’ అంటూ మౌనంగానే రోదిస్తున్నాడు మహ్మద్. కొడుకు ఎక్కడ ఉలిక్కిపడి నిద్రలేస్తాడోనన్న భయంతో. బాంబు దాడులకు బలైపోయి.. నిర్జీవంగా పడి ఉన్న భార్య చేతుల్లో నుంచి రక్షణ బృందాలు బిడ్డను వేరు చేసి.. ఆస్పత్రికి తీసుకువచ్చిన దృశ్యాలు ఇంకా తన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. తాను కూడా చనిపోతే బాగుండు అనే ఆలోచన వస్తోంది మహ్మద్కు. కానీ నలుగురు కొడుకుల్లో చిన్నవాడు, పసివాడు అయిన ఒమర్ కోసమైనా బతకాల్సిన పరిస్థితి. ఇజ్రాయెల్- హమాస్ మిలటరీ గ్రూపు మధ్య జరుగుతున్న పరస్పర క్షిపణి దాడుల కారణంగా అల్లకల్లోలమవుతున్న గాజాలోని అనేకానేక బాధిత కుటుంబాల్లో మహ్మద్ ఫ్యామిలీ ఒకటి. నలుగురు పిల్లలు.. ముచ్చటైన సంసారం మహ్మద్ అల్- హదీది(37)- మహా అబు హతాబ్(36) దంపతులు. వీరికి సుహబ్(13), అబర్రహమాన్(8), ఒసామా(6), ఒమర్(5 నెలలు) సంతానం. రంజాన్ పండుగ సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు వేయించి, వారిని తీసుకుని బంధువుల ఇంటికి బయల్దేరింది మహా. గాజా సిటీకి కాస్త దూరంలో ఉన్న షతీ శరణార్థి శిబిరంలో తన వాళ్లను కలుసుకుని సంతోషించింది. చాలా కాలం తర్వాత వచ్చాను కదా.. ఈరోజు ఇక్కడే ఉంటాం అని భర్తను ఒప్పించింది. అందుకు సరేనన్నాడు మహ్మద్. భార్యాపిల్లలు ఇక్కడ.. అతడొక్కడే అక్కడ తమ ఇంట్లో. ఎందుకో మహ్మద్కు ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. తెల్లవారుజామునే బాంబుల మోతతో ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. మరో ఆలోచన లేకుండా బయటకు పరుగులు తీశాడు. భార్యా, పిల్లలు ఉన్న చోటుకు వెళ్లి చూడగా.. అంతా శిథిలమై ఉంది. నిశ్చేష్టుడైపోయాడు మహ్మద్. భవన శిథిలాల కింద నుంచి ఒక్కొక్క శవాన్ని బయటకు తీస్తున్నాయి రక్షణ బృందాలు. తొలుత భార్య మహా, ఆ తర్వాత ముగ్గురు కొడుకుల మృతదేహాలు. ప్రపంచమంతా చీకటైపోయినట్లు అనిపించింది అతడికి. అంతలోనే ఒమర్ ఏడుపు సన్నగా వినబడింది. అతడికి ప్రాణం లేచివచ్చినట్లయింది. సహాయక బృందాల చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని ఒక్కసారిగా గుండెకు హత్తుకున్నాడు మహ్మద్. మృదువుగా కొడుకు తలనిమిరి మరింత దగ్గరికి చేర్చుకున్నాడు. వెంటనే తనని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కనీసం తనకంటూ ఈ ప్రపంచంలో ఒక్కడైనా సజీవంగా మిగిలి ఉన్నాడన్న ఆశతో. ఇలాంటి మహ్మద్లు ఎందరెందరో గాజాలో. కానీ హమాస్ దాడులు, అందుకు ప్రతిగా అన్నట్లు ఇజ్రాయెల్ వేసే బాంబుల మోత అక్కడ నిత్యకృత్యమే. ఈ ఆధిపత్య పోరుకు ఎప్పుడు తెరపడుతుందో ఊహించడం కష్టం. హమాస్ మిలటరీనే టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ చెబుతున్నా.. ఆ దాడుల కారణంగా ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ఈ విషయం గురించి మానవ హక్కుల సంఘాలు ఎంతగా మొత్తుకున్నా ఎవరికీ పట్టడం లేదు. ఏదేమైనా.. ఓవైపు వ్యవసాయం, మరోవైపు చేపల వేటపై ఆంక్షలు విధించడం సహా బాంబు దాడుల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోలేక గాజా ప్రజలు ఆకలికి అలమటిస్తూ బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఆ దేవుడికి ముందే తెలుసునేమో.. ‘‘ఆరోజు నా పిల్లలు ఈద్ సంబరంలో కొత్త బట్టలు వేసుకున్నారు. బొమ్మలు తీసుకుని వాళ్ల అంకుల్ వాళ్లింటికి బయల్దేరారు. నా భార్య ఆరోజు అక్కడే ఉంటామని పట్టుబట్టింది. అందుకు నేను అనుమతించకపోయి ఉండే బాగుండేది. ఆరోజు నా జీవితంలో ఇంతటి విషాదాన్ని నింపుతుందని అస్సలు ఊహించలేకపోయాను. ఒమర్ ఒక్కడే ఇప్పుడు నాకంటూ ఉన్న తోడు. మీకు తెలుసా.. నా ముగ్గురు కొడుకులు తల్లిపాలు తాగి పెరిగారు. కానీ చిన్నవాడికి మొదటి నుంచీ ఆ అలవాటు లేదు. పుట్టిన నాటి నుంచే వాడు అమ్మ దగ్గర పాలు తాగలేదు. బహుశా.. ఆ దేవుడికి ముందే తెలుసునేమో. తల్లి వాడికి శాశ్వతంగా దూరమవుతుందని. అందుకే మమ్మల్ని ఇలా సన్నద్ధం చేశాడేమో. నేను వాడిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అయినా మేం కూడా తొందర్లోనే మా వాళ్లను కలుస్తామేమో. ఇక్కడ ఎక్కువ రోజులు బతుకుతామనే నమ్మకం నాకు లేదు’’ అంటూ మహ్మద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మేమేం పాపం చేశాం ఇజ్రాయెల్ దాడుల గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘వాళ్లు కావాలనే చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారని అనిపిస్తోంది. ఒక్కసారి హెచ్చరిక జారీ చేయకుండా.. ఇంటిని ఖాళీ చేయమని చెప్పకుండా ఇలా బాంబులు కురిపించడం న్యాయమా. మేమేం పాపం చేశాం. నా బిడ్డ తల్లిలేని వాడయ్యాడు. నేను నా కుటుంబాన్నే కోల్పోయాను’’ అంటూ అంతర్జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. కాగా గత సోమవారం నుంచి జరుగుతున్న పరస్పర దాడుల్లో గాజా స్ట్రిప్లోని 200 మంది చనిపోగా, అందులో 59 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇక పాలస్తీనియన్ వైపు నుంచి కురుస్తున్న బాంబు ధాటికి ఇజ్రాయెల్లో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. చదవండి: ఆ బాలిక కన్నీటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారెవరు?! -
తాలిబన్ అగ్రనేతకు ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. అఫ్గాన్లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందని తాలిబన్ తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. శాంతికి కట్టుబడి ఉంటే అఫ్గాన్కు సాయం అందించడంలో అమెరికా ముందుంటుందని ట్రంప్ చెప్పారు. ‘తాలిబన్ అగ్రనేతతో ఈ రోజు మాట్లాడాను. హింసకు తావులేదన్న అంశాన్ని ఇరువురూ అంగీకరించాం. ఏమవుతుందో చూద్దాం’ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముల్లాతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. చర్చలపై నీలినీడలు: అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో అమెరికా బుధవారం తాలిబన్పై వైమానిక దాడులకు దిగడంతో మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. బరాదర్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్లో వైమానిక దాడులు జరగడం గమనార్హం. అమెరికా, తాలిబన్ల మధ్య గత శనివారం శాంతి ఒప్పందం కుదరగా, రానున్న 14 నెలల కాలంలో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. హెల్మాండ్లో మంగళవారం తాలిబన్లు 43 సార్లు దాడులకు ప్రయత్నించారని, వాటిని తిప్పికొట్టేందుకే తాము వైమానిక దాడులకు దిగామని అఫ్గానిస్తాన్లో అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ తెలిపారు. తాలిబన్లు ఇలాంటి దాడులను కట్టిపెట్టి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. బుధవారం తాలిబన్ జరిపిన దాడుల్లో సుమారు 20 మంది అఫ్గాన్ సైనికులు మరణించారని మిలటరీ వర్గాలు తెలిపాయి. -
లిబియాలో ఘోరం; 28 మంది సైనికుల మృతి
ట్రిపోలి : లిబియాలో శనివారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. లిబియా రాజధాని ట్రిపోలీలోని సైనిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడుల్లో 28 మంది సైనికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే విషయాన్ని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అమిన్ అల్-హషేమి మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై శనివారం వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడిలో 28 మంది మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. అయితే వైమానిక దాడులకు ముందు సైనికులంతా పెరేడ్ గ్రౌండ్లో సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత వీరంతా తమ గూడారాల్లోకి వెళుతుండగా ఒక్కసారిగా దాడులు జరిగాయని అమిన్ పేర్కొన్నారు. ఈ మిలటరీ స్కూల్ ట్రిపోలి కేంద్రంగా అల్-హద్బా అల్-ఖాద్రాలో ఉంది. కాగా దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికులకు రక్తం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 2011లో నాటో సహాయంతో అప్పటి దీర్ఘకాల నియంత మోమెర్ ఖడాఫీని జిఎన్ఏ దళాలు మట్టుబెట్టడంతో లిబియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి జీఎన్ఎ, దాని ప్రత్యర్థుల మధ్య వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.దీంతో పాటు గత ఎప్రిల్లో లిబియా దక్షిణభాగానికి నేతృత్వం వహిస్తున్న మిలటరీ కమాండర్ ఖలీఫా హప్తర్ జిఎన్ఎకు వ్యతిరేకంగా మారడంతో లిబియా దేశం నిత్యం వైమానిక దాడులతో అట్టుడుకుతుందని సమాచారం.(ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక) -
ఇరాక్లో అమెరికా దాడులు
బాగ్దాద్: ఇరాక్లోని ఇరాన్ అనుకూల వర్గంపై అమెరికా ఆదివారం రాత్రి బాంబుల వర్షం కురిపించింది. సిరియా సరిహద్దుల్లోని అల్ ఖయిమ్ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా బ్రిగేడ్స్కు చెందిన పలు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 25 మంది చనిపోయారు. 51 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల్లో పలువురు కమాండర్లు కూడా ఉన్నారు. ఇరాన్ అనుకూల హషెద్ అల్ షాబి సంస్థ విభాగమే హెజ్బొల్లా బ్రిగేడ్స్. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదాన్ని అమెరికా ప్రోత్సహిస్తోందని, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదని మండిపడింది. ఇందుకు అమెరికా మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్బాస్ మౌసవి హెచ్చరించారు. ఇరాక్లోని 3, సిరియాలోని 2 స్థావరాలపై అమెరికా జరిపిన దాడులు విజయవంతమయ్యాయని అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్ చెప్పారు. -
పాకిస్తాన్కు మరో చావుదెబ్బ
భారత బలగాలు భారీగా కాల్పులతో విరుచుకుపడటంతో ధ్వంసమైన పాక్ ఆర్మీ పోస్టులు, ఉగ్ర శిబిరాల నుంచి వెలువడుతున్న పొగ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ ప్రతీకార కాల్పులు న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ను మరోసారి భారత్ చావుదెబ్బ తీసింది. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడుల అనంతరం.. ఆ స్థాయిలో ఆదివారం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పీఓకేలోని నీలం లోయలో ఉన్న నాలుగు ఉగ్ర స్థావరాల్లో సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. పక్కా ప్రణాళికతో, స్పష్టమైన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని భారత జవాన్లు కాల్పులు జరిపారు. మూడు స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసి, మరో స్థావరాన్ని భారీగా నష్టపరిచిన భారత జవాన్లు.. ఆ స్థావరాల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు వీలుగా భారత పోస్ట్లపై కాల్పులు జరపడం కోసం అదే ప్రాంతంలో ఉన్న పాక్ జవాన్ల స్థావరాలను సైతం నేలకూల్చారు. ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు వీలుగా శనివారం తంగధర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై పాక్ కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు పదమ్ బహదూర్ శ్రేష్ఠ, గమిల్ కుమార్ శ్రేష్ఠ, ఒక పౌరుడు మృతి చెందారు. ప్రతిగా ఆదివారం పీఓకే లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్ తీవ్రస్థాయిలో దాడులు ప్రారంభించింది. భారత్ కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 35 వరకు ఉండొచ్చని, వారు జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలకు చెందినవారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాక్ జవాన్లు కూడా భారీగానే హతమయ్యారని పేర్కొన్నాయి. ఆదివారం సాయంత్రం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు భారత్ కాల్పుల్లో 6 నుంచి 10 మంది పాక్ జవాన్లు, అంతే సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు’ అని అన్నారు. వీరమరణం పొందిన భారత జవాన్లు పదమ్ బహదూర్, గమిల్ కుమార్ పీఓకేలోని ఉగ్రస్థావరాల నెట్వర్క్ చాలావరకు ధ్వంసమైందన్నారు. ‘మూడు ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయి. నాలుగోది దాదాపు ధ్వంసమైంది. పక్కా సమాచారంతోనే దాడులు చేశాం’ అన్నారు. ‘దీపావళి పండుగ సమీపిస్తోంది. భారత్లో దాడులు చేసేందుకు కొందరు ఉగ్రవాదులు పీఓకేలోని నీలం లోయలో ఉన్న కొన్ని ఉగ్రస్థావరాల్లో సిద్ధంగా ఉన్నట్లు మాకు సమాచారమందింది. వారు చొరబాటుకు ప్రయత్నించే వరకు ఎదురుచూడకుండా.. ముందే పక్కా ప్రణాళికతో దాడులు చేశాం’ అని వివరించారు. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన ఆగస్ట్ 5వ తేదీ నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మాకు వస్తూనే ఉందని ఆర్మీ చీఫ్ రావత్ వ్యాఖ్యానించారు. నెల రోజులుగా గురెజ్, మచిల్, కేరన్ సెక్టార్ల ద్వారా పలు చొరబాటు ప్రయత్నాలు జరిగాయన్నారు. ‘భారత్లోకి ఉగ్రవాదులను పంపించే ప్రయత్నాలను పాక్ నిలిపేయకపోతే.. మా స్పందన మరింత తీవ్రంగా ఉంటుంది’ అని రావత్ స్పష్టం చేశారు. ‘కశ్మీర్లో సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం’ అన్నారు. ఒక్కో స్థావరంలో 10 నుంచి 15 మంది జమ్మూకశ్మీర్లోని తంగధర్ సెక్టార్కు ఆవలివైపు పీఓకేలో ఉన్న నీలం లోయలోని ఒక్కో ఉగ్రస్థావరంలో భారత్ దాడులు చేసిన సమయంలో 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు భారత్లోని కశ్మీర్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు, తదనంతర పరిస్థితులను వివరించారు. మరోవైపు, దాడుల్లో ఉగ్రవాదులు, పాక్ జవాన్లు చనిపోయారన్న భారత్ వాదనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. భారత్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలోని 5 శాశ్వత సభ్య దేశాల ప్రతినిధులను ఉగ్రస్థావరాలున్నాయని భారత్ చెబుతున్న నీలం లోయ ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారే నిజానిజాలను నిర్ధారిస్తారని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ సవాలు చేశారు. పాకిస్తాన్లో భారత రాయబారి గౌరవ్ అహ్లూవాలియాను పాక్ ప్రభుత్వం పిలిపించి భారత్ కాల్పులకు నిరసన తెలిపింది. భారత్ కాల్పుల్లో ఐదుగురు పౌరులు చనిపోయారని పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు. పాక్ ఆర్మీ కాల్పుల్లో 9 మంది భారత జవాన్లు చనిపోగా, రెండు భారత బంకర్లు ధ్వంసమయ్యాయన్నారు. పాక్ వాదనను భారత ఆర్మీ తోసిపుచ్చింది. ‘ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు వీలుగా శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. అందుకు ప్రతిగా భారత్ జరిపిన కాల్పుల్లో పీఓకేలోని పలు ఉగ్రస్థావరాలు, ఆ స్థావరాలకు రక్షణ కల్పిస్తున్న పాక్ ఆర్మీ పోస్ట్లు ధ్వంసమయ్యాయి’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ పేరును వాడుకోవడం బీజేపీ నేతలు ఇకనైనా ఆపేయాలి’ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కోరింది. పఠాన్కోట్.. ఉడి. పుల్వామా! 2016 జనవరి 2: పంజాబ్లోని పఠాన్కోట్లో ఉన్న వైమానిక స్థావరంపై 2016 జనవరి 2వ తేదీ వేకువజామున ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది నేలకొరగగా నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. రాత్రి సమయంలో వైమానిక స్థావరంలోకి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ప్రవేశించిన ఉగ్రవాదులు పేలుళ్లు, కాల్పులతో విధ్వంసం సృష్టించారు. ఉగ్ర మూకలను ఏరిపారేసేందుకు సైన్యానికి 17 గంటలకుపైగా సమయం పట్టింది. 2016 సెప్టెంబర్ 28 ఉడి సైనిక స్థావరంపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో రగిలిపోయిన భారత్.. సరిగ్గా పది రోజుల తర్వాత పగ తీర్చుకుంది. 2016 సెప్టెంబర్ 28వ తేదీన అర్థరాత్రి 12 గంటలకు కమాండోలతో కూడిన వైమానిక దళం విమానాలు ఎల్వోసీలోకి ప్రవేశించాయి. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం లోపలికి చొచ్చుకుని వెళ్లి భింబేర్, కేల్, హాట్ స్ప్రింగ్, లిపా సెక్టార్లలోని 7 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా 38 మంది ఉగ్రవాదులతోపాటు ఇద్దరు పాక్ సైనికులను హతం చేశాయి. నాలుగు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ లక్ష్యాలను సాధించి, పూర్తిగా విజయవంతమైందని సైన్యం ప్రకటించింది. 2019 ఫిబ్రవరి 14 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వస్తున్న భద్రతా బలగాల కాన్వాయ్ని ఆత్మాహుతి దళ సభ్యుడు వాహనంతో ఢీకొట్టాడు. భారీ విస్ఫోటం సంభవించి 40 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ ఘటన అనంతరం భారత్ మరోసారి ఎల్వోసీలోకి వైమానికదళాన్ని పంపింది. బాలాకోట్లో నడుస్తున్న ఉగ్ర శిక్షణ శిబిరంపై భీకర దాడులు జరిపి, తీవ్ర నష్టం కలిగించింది. అనంతరం సరిహద్దుల్లో పాక్ ఎఫ్–16 కూల్చివేత, తదనంతర పరిణామాల్లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పట్టుబడటం, పాక్ అతడిని సురక్షితంగా విడిచి పెట్టడం తెలిసిందే. -
బాలాకోట్ మళ్లీ యాక్టివేట్ అయింది: ఆర్మీ చీఫ్
చెన్నై: పాకిస్థాన్ బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలు మళ్లీ ఇటీవల యాక్టివేట్ అయ్యాయని, దాయాది దేశం వీటిని యాక్టివేట్ చేసిందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా గత ఫిబ్రవరిలో బాలాకోట్లోని జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ‘పాకిస్థాన్ ఇటీవలే బాలాకోట్ను యాక్టివేట్ చేసింది. బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలు దెబ్బతిని, ధ్వంసమైన విషయాన్ని ఇది చాటుతోంది. భారత వైమానిక దళాలు జరిపిన దాడిలో బాలాకోట్ ధ్వంసమైన సంగతిని ఇది చాటుతోంది. ఇప్పుడు మళ్లీ ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు’ అని రావత్ పేర్కొన్నారు. చెన్నైలో యంగ్ లీడర్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. సరిహద్దుల్లో దాదాపు 500 మంది ఉగ్రవాదులు ఉన్నారని, వారు భారత్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంపై రావత్ స్పందిస్తూ.. ఉగ్రవాదులు చొరబాటుకు వీలుగా పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, దీనిని ఎలా ఎదుర్కోవాలో భారత్ సైన్యానికి తెలుసునని అన్నారు. -
బాలాకోట్ దాడులను కళ్లకు కట్టేలా దుర్గా మండపం
కోల్కతా : దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మంటపాలను వైవిథ్యభరితంగా తీర్చిదిద్దే భక్తులు ఈసారి బాలాకోట్ వైమానిక దాడులను థీమ్గా ఎంచుకుని మండపం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమయ్యారు. కోల్కతాలోని ఓ దుర్గాపూజా కమిటీ భారత వైమానిక దళం బాలాకోట్లో ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసిన ఘటనను థీమ్గా ఎంచుకుంది. 50 ఏళ్లుగా దుర్గా మండపాలను ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ కోల్కతాలోని యంగ్ బాయ్స్ క్లబ్ సర్బోజనిన్ దుర్గా పూజ కమిటీ క్లే మోడల్స్, డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా వైమానిక దాడులను ప్రజల కళ్లకు కట్టేలా ఈ మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. మండపం ఎంట్రన్స్లో వైమానిక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకోవడం, ఉగ్రవాదులు మరణించిన, పారిపోతున్న దృశ్యాలు, వాటిపై ఐఏఎఫ్ ఎయిర్క్రాఫ్ట్ తిరుగుతుంటేలా 65 మోడల్స్తో డిస్ప్లే ఏర్పాటు చేశామని కమిటీ ప్రతినిధి విక్రాంత్సింగ్ వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ లైఫ్సైజ్ మోడల్ సందర్శకులను పలుకరించలేలా అమర్చుతున్నామని చెప్పుకొచ్చారు. -
పీఓకేలో పాక్ శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలతో పాటు భారత్లో ఉగ్రదాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కుయుక్తులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్లను, పాక్ శిబిరాలను సోమవారం భారత సైన్యం ధ్వంసం చేసింది. పాక్ సైనిక శిబిరాలకు చేరువగా ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ను నిర్వీర్యం చేసింది. లీపావ్యాలీలోని ఉగ్ర శిబిరాలను భారత సేనలు ధ్వంసం చేశాయి.పాకిస్తాన్ సేనలు భారత్లోకి ఉగ్రవాదులను చొప్పించేందుకు ఈ శిబిరాలను వాడుతున్నాయి. పాక్ సేనల సహకారంతో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజహిదిన్, లష్కరీ తోయిబా వంటి పలు ఉగ్రవాద సంస్ధలు ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశాయి. ఈ శిబిరాల్లో ఉగ్రవాదులకు భారత్లో ఉగ్ర దాడులతో పాటు భారత సైన్యం కన్నుగప్పి చొరబాట్లకు ఎలా పాల్పడవచ్చనే అంశాలపై తర్ఫీదు ఇస్తారు. -
భారతీయుడిగా అది నా బాధ్యత
ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ ఎయిర్పోర్స్ బృందం అరెస్టు చేయడం, తర్వాత పాకిస్తాన్ అతన్ని విడిచిపెట్టేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం.. ఫైనల్గా అభినందన్ తిరిగి భారత్కు రావడం.. ఇలా అన్ని విషయాలను దేశ ప్రజలు చాలా ఆసక్తితో గమనించారు. ఇప్పుడు ఈ విషయాలనే వెండితెరపై చూపించబోతున్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ‘‘బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంఘటనల ఆధారంగా సినిమా తీయడానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ విభాగం నాకు అనుమతులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారతీయుడిగా, దేశ భక్తుడిగా, మన ఆర్మీ బలగాల సమర్థతను ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. పుల్వామా ఎటాక్స్, బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్ ఘటనలకు చెందిన వార్తలను నేను ఫాలో అవుతూనే ఉన్నాను. తమ ఆర్మీ, ఇంటెలిజెన్సీ ఇండస్ట్రీస్, పొలిటికల్ లీడర్స్ గురించి హాలీవుడ్ ఫిల్మ్మేకర్స్ గొప్పగా చెప్పుకుంటారు. మనం ఎందుకు అలా చేయకూడదు? అందుకే ఈ ప్రయత్నం’’ అన్నారు వివేక్. ఈ చిత్రానికి ‘బాలాకోట్: ది ట్రూ స్టోరీ’ అనే టైటిల్ను అనుకుంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. హిందీ, తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. జమ్ము కశ్మీర్, ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్ చేశారు. మరి.. ఈ సినిమాలో వివేక్ నటిస్తారా? లేక కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
అభినందన్ వర్ధమాన్కు వీరచక్ర
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు చెందిన శత్రు విమానాన్ని కూల్చేసిన అనంతరం మూడు రోజులపాటు పాక్లో బందీగా ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు వీరచక్ర శౌర్య పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనిక పురస్కారాలను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్కు ఆయన మరణానంతరం రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను కేంద్రం ఇచ్చింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్తో భారత్ ఆకాశంలో తలపడినప్పుడు స్క్వాడ్రన్ లీడర్గా ఉండి విమానాలను నియంత్రించిన మింటీ అగర్వాల్కు యుద్ధ సేవా పతకం దక్కనుంది. వాయుసేనకు 5 యుద్ధ సేవ, 7 వాయుసేన పతకాలు సహా మొత్తం 13 పురస్కారాలు దక్కనున్నాయి. ఫిబ్రవరి 26న పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఐదుగురు యుద్ధ పైలట్లకు పురస్కారాలు లభించాయి. ఆర్మీకి 8 శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేనా పతకాలు దక్కాయి. నౌకాదళానికి ఒక శౌర్య చక్ర పురస్కారం లభించింది. పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ శిక్షణా శిబిరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేయడంతో మరుసటి రోజే పాక్ ప్రతిదాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో పాక్కు చెందిన ఎఫ్–16 విమానాన్ని వర్ధమాన్ కూల్చేశారు. తాను నడుపుతున్న మిగ్–21 విమానం దాడికి గురవ్వడంతో ఆయన కిందకు దూకేసి ప్రాణాలతో బయటపడినప్పటికీ పాకిస్తాన్లో దిగారు. దీంతో ఆయనను పాకిస్తాన్ మూడురోజులపాటు బందీగా ఉంచుకున్న అనంతరం భారత్కు అప్పగించింది. ముంబైలో జాతీయ జెండాతో సినీ నటి నిత్యా మీనన్ -
అభినందన్కు వీర్చక్ర.. లేడీ స్క్వాడ్రన్కు మెడల్
న్యూఢిల్లీ: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వర్ధమాన్కు కేంద్ర ప్రభుత్వం వీర్చక్ర పురస్కారం ప్రదానం చేయనుంది. బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్ తర్వాత భారత గగనతలంలోకి చొరబడిన పాక్ F16 యుద్ధవిమానాన్ని మిగ్-21 ఫైటర్జెట్తో అభినందన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన పాక్ విమానాలను తరిమికొట్టే క్రమంలో అతని మిగ్ 21 ఫైటర్ జెట్ కూలిపోయింది. దీంతో తమ భూభాగంలో ల్యాండ్ అయిన వర్థమాన్ని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే, భారత్ తీసుకొచ్చిన దౌత్య ఒత్తిడితో మార్చి 1వ ఆయనను తేదీన విడుదలచేసింది. శత్రుచెరలో 60 గంటలు గడిపి.. దాయాది సైన్యం ఎంత ఒత్తిడిచేసినా సైనిక రహస్యాల గుట్టువిప్పకుండా... సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చిన వర్థమాన్పై ప్రశంసల జల్లుకురిసింది. అతడి వీరత్వానికి గుర్తింపుగా కేంద్రప్రభుత్వం వీరచక్రతో సత్కరించింది. జవాన్లకిచ్చే పరమవీరచక్ర, మహావీరచక్ర తర్వాత మూడో అత్యున్నత పురస్కారం ఇది. ఇక, భారత ఆర్మీకి చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారం దక్కింది. ఇక భారత సైన్యానికి ఎనిమిది శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేన మెడళ్లు (గాలంట్రీ), నాలుగు మెన్షన్ ఇన్ డిస్పాచెస్ దక్కాయి. ఇక, భారత వాయుసేనకు ఐదు యోధ సేవ మెడళ్లు, ఏడు వాయుసేన మెడళ్లు వచ్చాయి. ఈ మెడళ్లు సాధించిన వారిలో బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన మిరాజ్ ఫైటర్ పైలట్లు కూడా ఉన్నారు. మొత్తం 13మందికి ఈ మెడళ్లు దక్కగా.. అందులో 12మంది ఫైటర్ ఫైలట్లు కాగా, ఒకరు లేడీ స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్. భూతలంలో ఫ్లయిట్ కంట్రోలర్గా ఉన్న ఆమె.. బాలాకోట్ దాడుల అనంతరం గగనతలంలో పాక్ ఫైటర్ జెట్ దాడులను భారత పైలట్లు తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇందుకుగాను ఆమెను యోధ సేవ మెడల్ వరించింది. -
పైలట్ అభినందన్కు అత్యున్నత పురస్కారం?
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను భారత ప్రభుత్వం ఉన్నత మిలిటరీ పురస్కారంతో సత్కరించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో దాయాది పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16 విమానాన్ని తాను నడుపుతున్న మిగ్-21 బిసన్ యుద్ధవిమానం నుంచి అభినందన్ కూల్చేశారు. ఇందుకుగాను ఆయనకు ‘వీరచక్ర’ పురస్కారం దక్కే అవకాశముందని తెలుస్తోంది. పరమవీర చక్ర, మహావీర చక్ర పురస్కారాల తర్వాత అత్యున్నత మిలిటరీ పురస్కారం ‘వీరచక్ర’. బాలాకోట్లోని జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద శిబిరాలపై బాంబులు జారవిడిచిన ఐదుగురు మిరాజ్ 2000 ఫైటర్ పైలట్లను కూడా కేంద్రం సత్కరించనుంది. వారి సాహసానికి గుర్తింపుగా వాయుసేన మెడల్స్ను బహూకరించనుంది. పాక్ యుద్ధవిమానాలతో పోరాడుతూ.. తన మిగ్-21 బిసన్ యుద్ధవిమానం కూలిపోవడంతో అభినందన్ పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. రెండురోజుల పాక్ చెరలో ఉన్న అభినందన్ను.. భారత ప్రభుత్వం తెచ్చిన దౌత్య ఒత్తిడిని తలొగ్గి దాయాది రెండు రోజుల అనంతరం మన దేశానికి అప్పగించింది. గత ఫిబ్రవరి 26న పూల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా బాలాకోట్లో భారత సైన్యం వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. -
బిన్ లాడెన్ కుమారుడు హతం!
వాషింగ్టన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్కాయిదా కీలక నేత హమ్జా వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. హమ్జా మరణించినట్లు ముగ్గురు అమెరికా అధికారులు స్పష్టం చేశారని, అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయాలను వారు వెల్లడించలేదని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. దీని వెనుక అమెరికా హస్తం ఉందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్లో భాగంగా హమ్జా హతమైనట్లు న్యూయార్క్ టైమ్స్ కూడా చెప్పింది. ఎన్బీసీ కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంగీకరించలేదు.. కనీసం ఖండిం చనూ లేదు. అల్కాయిదాలో కీలక నేతగా ఎదుగుతున్న హమ్జాను పట్టించిన వారికి దాదాపు రూ.7 కోట్లు బహుమతిగా ఇస్తామని 2019 ఫిబ్రవరిలో అమెరికా ప్రకటించడానికి ముందే అతడు మరణించినట్లు ఎన్బీసీ, న్యూయార్క్ టైమ్స్ కథనాలను బట్టి తెలుస్తోంది. లాడెన్ 20 మంది సంతానంలో 15వ కుమారుడైన హమ్జా.. లాడెన్ మూడో భార్య కొడుకు. కాగా, హమ్జాకు 30 ఏళ్ల వయసున్నట్లు భావిస్తున్నారు. జిహాద్కు పట్టపు యువరాజుగా పేర్కొంటున్న హమ్జా.. అమెరికాపై దాడులు చేయాల్సిందిగా తరచూ వీడియోలు, ఆడియోల రూపంలో పిలుపునిస్తూ ఉండేవాడు. తన తండ్రి లాడెన్ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేవాడు. హమ్జా ఎక్కడున్నాడనే విషయం అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఇరాన్లో గృహనిర్బంధంలో ఉన్నాడని, అఫ్గానిస్తాన్లో ఉన్నాడని, పాకిస్తాన్, సిరియాలో తలదాచుకునే వాడని భావిస్తూ ఉండేవారు. లాడెన్ను 2011లో మట్టుబెట్టిన అనంతరం అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్ల ఆధారంగా అల్కాయిదాను ముందుండి నడిపేందుకు హమ్జాను జాగ్రత్తగా పెంచుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement