-
ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే షాకవుతారు!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వీరి కుటుంబం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు ఓ కొత్త జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసి మరో సారి వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ S680.. భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ముఖేష్ అంబానీకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో భాగంగానే వారి సెక్యూరిటీలో కూడా అత్యంత ఖరీదైన సేఫెస్ట్ కార్లను వినియోగిస్తారు. అయితే ముకేశ్ అంబానీ మాత్రం మరింత కట్టుదిట్టమైన భద్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కారు వినియోగిస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కాగా ఇటీవల ఓ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించారు. ఇది వారి గ్యారేజిలో చేరిన 7వ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ ఫ్లాగ్షిప్ సెడాన్. ముఖేష్ అంబానీ 7వ మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్ చిత్రాలను కార్ క్రేజీ ఇండియా ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసారు. ఇందులో కొత్త కారుని చూడవచ్చు. ఈ కారుతో పాటు రేంజ్ రోవర్ వోగ్ సెక్యూరిటీ కారు కూడా ఇక్కడ కనిపిస్తుంది. బెంజ్ కారుకి 999 అనే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండటం కూడా ఇక్కడ గమనించవచ్చు. ముఖేష్ అంబానీ గ్యారేజిలో చేరిన ఈ కారు ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది చాలా సురక్షితమైన కారుగా తీర్చిదిద్దారు. కావున బాంబులు దాడి నుంచి కూడా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బెంజ్ కారు ట్విన్-టర్బోచార్జ్డ్ 6.0-లీటర్ V12 ఇంజన్ ద్వారా 523 Bhp పవర్ అండ్ 850 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..!
ఆసియాలో అత్యంత ధనవంతుడు, ఇండియాలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ఇండస్ట్రీస్ (మార్కెట్ క్యాప్ రూ. 17.69 ట్రిలియన్లు) అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన కార్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. తాజాగా మోస్ట్ సేఫెస్ట్, 'బుల్లెట్ ప్రూఫ్' మెర్సిడెస్ బెంజ్కారును ఆయన సొంతం చేసుకున్నారు. దీని విలువ 10 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ కారుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. బిలియనీర్ అంబానీ కుటుంబ సభ్యులు లగ్జరీ ఎస్యూవీలు, ఖరీదైన కార్లతో పొడవైన కాన్వాయ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా మెర్సిడెస్-బెంజ్-S680 గార్డ్ బుల్లెట్ప్రూఫ్ సెడాన్ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ మోడళ్లలో ఒకటి ఎస్ 680 గార్డ్ సెడాన్. ఇటీవల అంబానీకి బెదిరింపులు ఎక్కువైన తరుణంలో ఈ కొత్త కారు ప్రత్యేకతలు విశేషంగా నిలుస్తున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్ ) CS12 Vlogs షేర్ చేసిన వీడియోలో కాన్వాయ్తో పాటు, కొత్త బుల్లెట్ప్రూఫ్ కారులో చూడవచ్చు. ఇది ఇతర మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాగానే కనిపిస్తుంది. కానీ సాధారణ సెడాన్ కంటే దాదాపు 2 టన్నుల బరువు ఎక్కువ . అలాగే దీని బాడీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ షెల్ను కలిగి ఉంది. కారులో బుల్లెట్, బ్లాస్ట్ ప్రూఫ్, మల్టీ-లేయర్ గ్లాస్ ఉన్నాయి. మెషిన్ గన్లు కాల్పులనుంచి రక్షించే కెపాసిటీ ఉన్న కారిది. (ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!) కేవలం తుపాకీ కాల్పుల తాకిడికి మాత్రమే తట్టుకోగలదని అనుకుంటే పొరపాటే. ఇదిగ్రెనేడ్ల దాడిని కూడా తట్టుకోగలదు. అంతేకాదు ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సూపర్-ఖరీదైన కారు రీన్ఫోర్స్డ్ టైర్లతో వస్తుంది. గంటకు 80 కిమీ వేగంతో దూసుకుపోతుంది. ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్తో 612 పవర్ను, 830 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కాన్వాయ్లో రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి ఇతర ఖరీదైన కార్లు ఉన్నాయి. -
ప్రగతిభవన్కు ఎమ్మెల్యే రాజాసింగ్.. అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే, రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తీసుకొని ఎమ్మెల్యే శుక్రవారం ప్రగతి భవన్ వద్దకు వెళ్లారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ మార్చాలని, లేదంటే ఆ వాహనం మీరు తీసుకోవాలంటూ ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు. ఇది గమనించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ను మీడియా కంట పడకుండా పూర్తిగా మూసేసిన పోలీస్ డీసీఎంలో అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాగా గతంలో రాజాసింగ్పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొరాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు కాగా రాజాసింగ్ బుల్లెట్ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ నుంచి గురువారం బుల్లెట్ప్రూఫ్ వాహనంలో ఇంటికి వెళ్తుండగా ముందుభాగం టైరు ఊడిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ధూల్పేట ప్రాంతంలో వాహనం నుంచి భారీ శబ్దం వచ్చి ముందువైపు టైరు బయటకు రావడంతో డ్రైవర్ చాకచక్యంగా కారును నిలిపాడు. దీంతో రాజాసింగ్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వాహనం నెమ్మదిగా వెళ్లడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూజజ ఈ ఘటన చూసైనా హోంమంత్రి మహమూద్ అలీ, పోలీసు ఉన్నతాధికారులు సిగ్గుపడాలన్నారు. వెంటనే తనకు వాహనం మార్చాలని డిమాండ్ చేశారు. -
బుల్లెట్ ప్రూఫ్ వెహికల్తో ఎమ్మెల్యే రాజాసింగ్కు అవస్థలు
-
ఏపీ: మంత్రి గుడివాడకు బులెట్ ప్రూఫ్ వాహనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది ప్రభుత్వం. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడివాడ ఎక్కువగా పర్యటించాల్సి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. -
మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
సాక్షి, అమరావతి : వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. భద్రతా కారణాలరీత్యా ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం మంత్రి కన్నబాబుకు బీపీ (బుల్లెట్ ప్రూఫ్) వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయి. ఇక నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రికి ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. -
మంటల్లో పోలీసు వాహనం
హైదరాబాద్: నిఘా విభాగానికి చెందిన ఓ వాహనం రోడ్డుపైనే మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ ప్యారడైస్ పంప్హౌస్ వద్ద చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని సిబ్బంది వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేసి, కిందకు దిగిపోయారు. ఈ ఘటనతో సమీపంలోని బస్టాప్లోని ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
టీబీజేపీ అధ్యక్షుడికి బుల్లెట్ప్రూఫ్ వాహనం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరగటం, పాతబస్తీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సందర్భంగా వారి లిస్టులో పలు రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉండటంతో ఈ భద్రతను పెంచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ భద్రతను గతంలో కంటే మరింత కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని లక్ష్మణ్కు కేటాయించారు. -
మంత్రి ఈటెలకు తప్పిన ముప్పు
కరీంనగర్: తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లోని బుల్లెట్ ప్రూఫ్ కారు మెట్ పల్లి వద్ద చెట్టును ఢీకొంది. వాహనశ్రేణి హుజురాబాద్ నుంచి వెంకట్రావ్ పల్లి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. సాధారణంగా ఈ కారులో మంత్రి ప్రయాణిస్తుంటారు. ప్రమాద సమయంలో ఆయన కారులో లేకపోవడంతో ముప్పు తప్పింది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement