-
ఇంటింటికీ చికెన్ పంపిణీ.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
-
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. -
యూఎస్లో బర్డ్ ఫ్లూ కలకలం.. గుడ్లు, పాలు తీసుకోవచ్చా..!
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ అధిక సాంద్రతలో గుర్తించడం తీవ్ర ఆందోళన రేపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పచ్చి పాలలో మాత్రమే ఈ వైరస్ ఉందనీ, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నాశనమవుతోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇటీవల ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పచ్చి పాలు, గుడ్లు, చికెన్ తినడం ఎంతవరకు సురిక్షతం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే..! ఈ బర్డ్ ఫ్లూ వైరస్ని ఏవియన్ఇన్ఫ్లెఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒకరకమైన జూనోటిక్ ఇన్ఫ్లు ఎంజా. అడవి పఓలు, పౌల్ట్రీ, ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్ ఉక రకాల ఏ(హెచ్5ఎన్1), ఏ(హెచ్9ఎన్2) వల్ల వస్తుంది. ఈ హెచ్5ఎన్1 వైరస్ సోకిన ప్రతి వందమంది రోగులలో దాదాపు 52 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడూ.. పాలు తాగడం, గుడ్లు, మాసం తినడం ఎంతవరకు సురక్షితం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రకారం..బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచి ఉడకించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. గుడ్లు.. గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. గుడ్డులోపలి పచ్చసొన, తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే గుడ్లను మంచి విశ్వనీయమైన చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్థారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు. పాలు.. ఇక పాల వద్దకు వస్తే పాశ్చరైజ్డ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో, పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యాధికారక క్రిములను చంపడానికి సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చికెన్ ఈ వైరస్ కోళ్లతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్ను సరిగా వండుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. పౌల్ట్రీని 165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్తో సహా ఇతర వైరస్లు నశించడం జరుగుతుంది. అలా చికెన్ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే చివరిగా బర్డ్ ఫ్లూ సోకినట్లయితే ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. జ్వరం: అధిక ఉష్ణోగ్రత తరచుగా మొదటి సంకేతం, సాధారణంగా 38°C (100.4°F) కంటే ఎక్కువగా ఉంటుంది. దగ్గు: ప్రారంభంలో, పొడి దగ్గు కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. గొంతు నొప్పి: గొంతు ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, మింగడం కష్టతరం చేస్తుంది. కండరాల నొప్పులు: శరీర నొప్పులు తలనొప్పి: ఇది తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. శ్వాసకోశ లక్షణాలు: ప్రారంభ దశల్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి తీవ్రమైతే కనిపించే లక్షణాలు.. న్యుమోనియా: ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస లేదా శ్వాసలోపం ద్వారా సూచించబడుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS): శ్వాసకోశ వైఫల్యం అతిసారం: సాధారణ ఇన్ఫ్లుఎంజాలా కాకుండా, H5N1 జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది. వాంతులు: ఇది ఇతర జీర్ణశయాంతర లక్షణాలతో కలిపి సంభవించవచ్చు. ముక్కు,చిగుళ్ళ నుంచి రక్తస్రావం: ఇది సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో జరుగుతుంది. నాడీ సంబంధిత మార్పులు: అరుదుగా, ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) సంభవించవచ్చు. ఒక్కోసారిమూర్ఛలు లేదా మానసిక స్థితిlr ప్రభావితం చెయ్యొచ్చు. (చదవండి: మానసిక ఆరోగ్యంపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు! అందుకే థెరపీ..!) -
కారులో చికెన్ ఫ్రై రెసిపీ..ఎలాగంటే..?
వెళ్తున్న కారులోనే వంటకాలు చేసి ఔరా! అనిపిస్తున్నారు. యూట్యూబ్ రీల్ కోసం అనో చాలామంది ఇలా కారులోనే వంటకాలు చేసిన వీడియోలు చూశాం. కానీ వాటిలో అదంతా ఫేక్ అయ్యి ఉండొచ్చు కుదరదు అనుకునే వాళ్లం కదా!. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఈజీగా కారులో కూడా వంట చేసేయొచ్చేని అంటారు. ఇంతకీ ఎలా కారులో వండేస్తున్నారంటే.. ఆ వీడియోలో ఒక మహిళ సీటులో కూర్చొని చక్కగా చికెన్ని కబాబ్ ముక్కలుగా కట్ చేస్తుంది. ఆ తర్వాత ఓ చిన్న కవర్ తీసుకుని అందులో మసాల దినుసులు, పెరుగు అని కలిపి ఉంచుతుంది. దానిలో చికెన్ కబాబ్ ముక్కలు అన్ని వేసి కాసేపు అలా ఉంచుతుంది. ఆ తర్వాత మరో కవర్ కార్న్ఫోర్ తీసుకుంటుంది. ఇప్పుడు మసాలాలో నాన్చిన చికెన్ముక్కలను ఈ కార్న్ఫోర్ కవర్లో దొర్లించి ఓ ప్లేట్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఓ ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని కాసేపు అలా ఉంచుతుంది. అది వేడిక్కెంది అని నిర్థారించుకున్నాక ఈ కార్న్ఫోర్ అద్దిన చికెన్ ముక్కల్ని వేసి చక్కగా డీప్ ఫ్రై చేస్తుంది. ఆ తర్వాత చక్కగా ఓ ప్లేట్లో మంచిగా సర్వ్ చేసుకుని లాంగించేస్తుంది. అబ్బా ఇంత ఈజీనా కారులో వంటలు చేయడం అనిపిస్తుంది ఆ మహిళ చేసిన విధానం చూస్తే. కానీ ఎలాగైన కిచెన్.. కిచెనే! ఎందుకంటే కారులో వంట చేయాలంటే కావాల్సిన పదార్థాల తోపాటు అన్ని క్లీన్ చేసుకుని ముందుగా రెడీ చేస్తేనే చేయడం ఈజీ. ఇంతలా ముందుగా హైరాన పడి రెడీ చేసుకోవడం కంటే వంటగదిలో హాయిగా టెన్షన్ పడకుండా చేసుకుంటే బెటర్ కదా..! అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Sophie Saldana (@sophiesophss) (చదవండి: చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!) -
Chicken: చికెన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
ఖమ్మం: చికెన్కు డిమాండ్ పెరిగింది. నిన్న, మొన్నటి వరకు కిలో రూ.220 నుంచి రూ.250 వరకు ఉన్న చికెన్ ధర ఆదివారానికి ఒక్కసారిగా పెరిగింది. ప్రాంతం, డిమాండ్ ఆధారంగా కిలో చికెన్ రూ.300 పైగానే విక్రయిస్తున్నారు. ఓ వైపు పండుగలు, మరో వైపు శుభకార్యాల సీజన్ కావటంతో చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగానికి తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. దాణా ధరలు, కోడిపిల్లల ధరలు పెరగటం, వేసవిలో నిర్వహణ ఖర్చులు పెరగటం కూడా చికెన్ ధరలు పెరగటానికి కారణాలుగా కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్పత్తి పడిపోయింది.. ప్రస్తుతం చికెన్కు ఉన్న డిమాండ్కు తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి జరగటం లేదు. మార్కెట్లో వ్యాపారుల నుంచి ఆర్డర్లు పెరగటంతో అందుకు అనుగుణంగా ఉత్పత్తులు లేకపోవటంతో కంపెనీలు రేట్లు పెంచుతున్నాయి. పరిశ్రమల వద్ద లైవ్ బర్డ్ ధర పెరగటంతో దాని ప్రభావం చికెన్ ధరపై పడుతోంది. నెల రోజుల కిందట తెలంగాణ కుంభమేళాగా జరిగిన మేడారం జాతరతో కోళ్లు, చికెన్ ధరలు పెరిగాయి. జాతర తరువాత తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. నెల రోజులకు పైగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు జరుగుతుండటంతో మాంసాహారాల వినియోగం బాగా పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో నిత్యం 80 నుంచి 90 టన్నుల వరకు చికెన్ వినియోగం జరుగుతున్నట్లు అంచనా. ఒక్క ఖమ్మం నగరంలోనే దాదాపు 25 నుంచి 30 టన్నుల వరకు వినియోగం ఉన్నట్లు వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో 60 లక్షలకు పైగా కోళ్లను పెంచేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత అనుభాలు, ఇతర కారణాలతో ప్రస్తుతం 40 నుంచి 45 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. వినియోగానికి తగిన విధంగా ఉత్పత్తి లేకపోవటంతో ధర ౖపైపెకి పోతోందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లతో.. ప్రస్తుతం హిందూ, ముస్లింల పండుగలైన ఉగాది, రంజాన్లు ఓ వైపు, మరో వైపు పెళ్లిళ్ల సీజన్ కావటంతో చికెన్కు బాగా డిమాండ్ పెరిగింది. మంగళవారం ఉగాది పండుగ, గురు, శుక్రవారాల్లో రంజా న్ పండుగ ఉండటంతో చికెన్కు వ్యాపారుల నుంచి ఆర్డర్లు బాగా పెరిగాయి. ఇదే తరుణంలో పెళ్లిళ్లు ఉండటంతో ఆ డిమాండ్ కూడా కొనసాగుతోంది. శుభ ముహూర్తాల కాలం కావటంతో ప్రతి ఇంటా ఉప్పలమ్మ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో చికెన్కు ధరలు పెరుగుతున్నాయి. మొక్కజొన్న వంటి పంటల ఉత్పత్తి తగ్గిపోవటంతో దాణా ధర పెరిగింది. ఇక హేచరీస్లో కోడి పిల్లల ధర పెరిగింది. రూ.25 నుంచి రూ.30 ఉన్న కోడి పిల్ల ధర ప్రస్తుతం రూ.53గా పలుకుతోంది. ఇక నిర్వహణ ఖర్చులు పెరిగాయి. వేసవిలో కోళ్ల పరిశ్రమల నిర్వహణకు అదనంగా ఖర్చవుతుంది. ఏసీల వినియో గం పెరగటంతో నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఇక ప్రస్తుతం 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్లు తట్టుకోలేవు. ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కాలం కావటంతో కోళ్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని భావించి నిర్వాహకులు, రైతులు కోళ్ల పెంపకానికి వెనుకంజ వేస్తున్నా రు. ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోతే కోలుకోలేని దెబ్బ పడుతుంది. కోళ్లు సాధారణంగా 40 రోజుల్లో 2.3 కిలోల బరువు పెరుగుతుంది. కానీ, వేసవిలో 48 రోజులు పడుతుంది. ప్రస్తుతం ఒక కోడి పెంపకానికి రూ.125 నుంచి రూ.135 వరకు ఖర్చవుతోంది. కంపెనీలు ప్రస్తుతం రూ.140 వరకు విక్రయిస్తున్నాయి. దీంతో రిటైల్గా స్కిన్లెస్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిండగా, విత్స్కిన్ రూ.280 గా, లైవ్కోడి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. ఉత్పత్తి లేకనే.. కోళ్ల ఉత్పత్తి లేకనే చికెన్ ధరలు పెరిగాయి. వివిధ కారణాలతో కోళ్ల పెంపకం తగ్గింది. వేసవిలో కోళ్ల పెంపకం భారంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. కోడిపిల్ల ధర బాగా పెరిగింది. వేసవిలో పెంపకం ఇబ్బందిగా ఉంటుంది. నిర్వహణ ఖర్చులు పెరిగాయి. డిమాండ్ తగిన ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెంచడం అనివార్యమైంది. – రావి బాబూరావు, పౌల్ట్రీ పరిశ్రమ యజమాని, ఖమ్మం చికెన్ ధర ప్రియం చికెన్ ధర ప్రియంగా మారింది. గతంతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు ధరకు చేరింది. కిలో చికెన్ ధర రూ.300 కావటంతో వినియోగాన్ని తగ్గించాల్సి వచ్చింది. ప్రతి ఆదివారం చికెన్కు రూ.200 నుంచి రూ.220 వరకు వెచ్చిస్తాం. అలాంటిది రూ.300 పెట్టినా కేజీ రావటం లేదు. మటన్ ధరతోపాటు చికెన్ ధర కూడా అందుబాటులో లేకుండా పోతోంది. – శీలం కార్తీక్, నాయుడుపేట, ఖమ్మం -
చికెన్ స్కిన్ గురించి విన్నారా? వేసవికాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధి..!
చికెన్ఫాక్స్ లాంటి ఆటలమ్మ, పొంగు, తట్టు తరహా చర్మ వ్యాధులను చూశాం. గ్రామాల్లో మాత్రం ఈ వ్యాధిని అమ్మవారు చూపింది అంటారు. ఓ వారం రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇప్పటికీ చాలా చోట్ల దీనికి మందులు వాడరు ప్రజలు. వేపాకు, పసుపుతో తగ్గించుకుంటారు. అయితే దీనికి కూడా టీకాలు వంటివి వచ్చేశాయి ఇప్పుడు. కానీ కొత్తగా ఇదేంటీ..? చికెన్ స్కిన్ .. అంటే.. ఇది కూడా ఒక విధమైన చర్మ వ్యాధే. గానీ తీవ్రత ఎక్కువ. వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు. శోభి తర్వాత భయానకమైన చర్మవ్యాధి ఇదే. ముఖ్యంగా వేసవికాలంలో పలువురిని వేధించే సమస్య ఇది. అయితే కొందరికి నయం అయినా, మరికొందరికి మాత్రం జీవితాంతం వేధిస్తుంది. అసలేంటి వ్యాధి? ఎలా వస్తుంది ? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..! వైద్య పరిభాషలో చికెన్ స్కిన్ను కెరటోసిస్ పిలారిస్ అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి వచ్చిన రోగి చర్మంపై చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. రాను రాను గులాబీ లేదా ఎరుపు రంగు మచ్చలుగా మారతాయి. ఇవి ఎక్కువగా చేతులు, ముఖం, తొడలు, చెంపలు, వీపు పైభాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఆ మచ్చలు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వాటి వల్ల దురద కూడా ఏర్పడుతుంది. నలుగురిలో అదే పనిగా శరీరాన్ని గోకుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.. ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. పైగా నలుగురిలో తిరగలేక నానాఅవస్థలు పడతారు. దీనికి ప్రధాన కారణం చర్మంపై కెరాటిన్ ఏర్పడటం. ఎందుకంటే..? ఈ కెరాటిన్ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. చర్మంపై వెంట్రుకల కుదుళ్ళు పెరగకుండా చేస్తుంది. ఫలితంగా చర్మంపై చిన్న పరిమాణంలో ఎర్రటి గడ్డలు ఏర్పడతాయి. ఈ కెరాటోసిస్ అనేది జన్యు మార్పుల వల్ల వస్తుందని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. తామర, మధుమేహం కెరాటోసిస్ పిలారిస్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది. ఉబ్బసం, అలర్జీ, అధిక బరువు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ చికెన్ స్కిన్ వల్ల ఏర్పడే గడ్డలు కొందరిలో వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొందరిలో అయితే జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. చికెన్ స్కిన్ నుంచి బయటపడాలంటే .. ముందుగా పొడి చర్మాన్ని నివారించాలి. కెరాటో లిటిక్ ఏ వంటి మాయిశ్చరైజింగ్ లోషన్లను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే చికెన్ స్కిన్ బారిన పడ్డవారు చర్మంపై వచ్చిన ఆ గడ్డలను గిచ్చడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అంతేకాదు కొంతమంది రాపిడితో కూడిన ఎక్స్ ఫోలీయేటర్తో గడ్డల మీద స్క్రబ్ చేస్తుంటారు. దీనివల్ల చర్మం మరింత ప్రమాదంలో పడుతుంది. అంతేగాదు బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఈ వ్యాధి బారనే పడ్డట్టు ఇన్స్టాగ్రాం వేదికగా తెలిపింది. ఈ వ్యాధి ఏంటో ఎలా బయటపడాలి అనే దాని గురించి కుణ్ణంగా తెలుసుకునే పనిలో ఉన్నాని కన్నీటిపర్యంతమయ్యింది. అందువల్ల సమస్య ఆదిలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించి సత్వరమే సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దీని గురించి మరింత క్షుణ్ణంగా వ్యక్తిగత వైద్యులను, నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ఆ బ్లడ్ గ్రూప్ అయితే..చికెన్, మటన్ వద్దంటున్న వైద్యులు!
వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్వెజ్గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్ గ్రూప్ని బట్టి చికెన్ లేదా మటన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..! ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్ గ్రూప్ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్వెజ్ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు ఏదీ తింటే బెటర్ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్ గ్రూప్లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్వెజ్ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్వెజ్ తింటే బెటర్ అనేది సవివరంగా చూద్దాం!. 'ఏ' గ్రూప్.. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. 'బీ' గ్రూప్.. బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు. కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకునేలే మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా నిపుణుల సలహాలు, సూచనలతో అనుసరించడం ఉత్తమం. (చదవండి: పాపులర్ వీడియో గేమర్కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!) -
రూ. 450తో వ్యాపారం.. నెలల వ్యవధిలో రోజుకు రెండు వేల ఆదాయం!
దేశంలోని చాలామంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ రకాల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ఆవులు, గేదెల పెంపకాన్ని వదిలి కోళ్ల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇది వారికి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. ప్రస్తుతం దేశీ కోడి మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చిన్న, సన్నకారు పశుపోషకులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్పూర్ బ్లాక్కు చెందిన ముఖేష్ పాశ్వాన్ భార్య సంగీతా దేవి గతంలో గేదెలను పోషిస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. దీనిలో అంతగా లాభాలు లేకపోవడంతో ఆమె దేశవాళీ కోళ్లను వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు. బీహార్ ప్రభుత్వం అందించే జీవిక ఐపీడీఎస్ థర్డ్ ఫేజ్ పథకం కింద రూ.450 వెచ్చించి, 25 దేశీకోళ్లను కొనుగోలు చేసి వాటి పెంపకాన్ని చేపట్టినట్లు సంగీత మీడియాకు తెలిపారు. ఆమె దేశవాళీ కోళ్లతో పాటు కడక్నాథ్, సోనాలి, ఎఫ్ఎఫ్జీ జాతుల కోళ్లను కూడా పెంచసాగారు. కోడి మాంసంతో పాటు గుడ్లు, కోడిపిల్లలను సిద్ధం చేయడం ద్వారా ఆమె వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు మహిళలు సంగీత దగ్గర దేశీ కోళ్ల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు వస్తున్నారు. 25 కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన ఆమె దగ్గర ప్రస్తుతం 100 కోళ్లు ఉన్నాయి. స్థానికంగా కోడి గుడ్డు ధర మార్కెట్లో రూ.20 వరకూ ఉంది. ప్రస్తుతం ఆమె పెంచుతున్న కోళ్ల నుంచి ప్రతిరోజూ రూ. 200 విలువైన గుడ్లు వస్తున్నాయి. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కోడి మాంసం సిద్ధమవుతోంది. వీటిని విక్రయిస్తూ ఆమె రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఆదాయాన్ని అందుకుంటోంది. -
"పేపర్ బ్యాగ్ ఫ్రైడ్ చికెన్" ఎలా చేస్తారో వింటే షాకవ్వుతారు!
ఇటీవల అందరికీ వంటకాల మీద ఆసక్తి ఎక్కువయ్యిందనే చెప్పాలి. అందులోనూ ఈ సోషల్ మీడియా పుణ్యమా! అని వాటికి క్రేజ్ మరింత పెరిగింది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అక్కడ వండే వివిధ రకాల రెసీపీల గురించి అందరూ క్షణాల్లో తెలుసుకుంటున్నారు. వండేస్తున్నారు కూడా. అలాంటి వంటకానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇంతవరకు ఎన్నో రెసీపీలు చేసే విధానాన్ని చూసే వింటారు. ఇక్కడ ఆ వ్యక్తి చేస్తున్న విధానన్ని మాత్రం అస్సలు చూసుండరు. కానీ అతను ఎలా చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. ఎలా చేశాడంటే..? సాధారణంగా చికెన్ ముక్కలు చక్కగా మసాల పొడుల్లో మేరినేషన్ చేసి మరీ డీప్ ఫ్రై చేసుకుని లాగించేస్తాం. అది కామన్, అలా కాకుండా అల్లం వెల్లుల్లి , కొన్ని రకాల మసాల పొడులతో చికెన్ని మేరినేషన్ చేసి పేపర్ బ్యాగ్లో ప్యాక్ చేశారు. అలా ఒక్కో చికెన్ ముక్కను పేపర్ బ్యాగ్లో పిన్ చేసి నేరుగా డీప్ ఫ్రై చేసేస్తున్నారు. ఇలా చేస్తే ఏం కాదా? అని అవాక్కవ్వకండి. ఎందుకంటే అది పేపర్ బ్యాగ్ కాబట్టి చక్కగా చికెన్ ఆ పేపర్ తోపాటు వేగిపోతుంది. పైగా దాన్ని ఓపెన్ చేయగానే చికెన్లో ఉన్న మసాలాలు జ్యూసీగా వస్తాయి. ఇలా చేయడం వల్ల మసాలా చికెన్ నుంచి వేరవ్వకుండా దానికే ఉంటుంది. టేస్ట్కి టేస్టు ఉంటుంది. ఇలా మలేషియాలోని వీధుల్లో తినుబండారాలు అమ్మే వ్యక్తి చేస్తూ కనిపించాడు. ఒక్కసారిగా ఫోకస్ అంతా అతడు తయారు చేసిన విధానంపైనే పడింది. అయితే ఆ పేపర్ బ్యాగ్ని పిన్చేస్తున్నారు కదా! ఏం ప్రమాదం కాదా? అనేది డౌటు. తినే కంగారులో ఆ ఫ్రైడ్ పేపర్ బ్యాగ్ చికెన్ని అలానే తింటేనే ప్రమాదం. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ వ్లాగర్ వెరైటీగ్ ఫ్రై చేస్తున్న ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసా అనే క్యాప్షన్ పెట్టి మరీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఇది ఆరోగ్యానికి చలా ప్రమాదకరం అంటూ మండిపడుతున్నారు. కాగితంలో ఉండే రసాయానాలు అలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ చికెన్లోకి వెళ్లిపోతాయి. తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవ్వుతాయంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Trevor James (@thefoodranger) (చదవండి: దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!) -
చికెన్ నూడుల్స్ ఇలా చేస్తే..పిల్లలేంటి...పెద్దోళ్లు కూడా!
చికెన్ సూప్ మీద మనసుపోతే రెస్టారెంట్కి వెళ్లాల్సిందేనా? ఫైవ్స్టార్ హోటల్ రేంజ్లో చికెన్ టిక్కా ఇంట్లో చేయలేమా? పిల్లలు సరదా పడే నూడుల్స్కి చికెన్ని జోడించలేమా? పిల్లలు ఎంతో ఇష్టంగా ఆరగించే వీటన్నింటినీ ఎలా చేసిపెడితే..పిల్లలేంటి, పెద్దవాళ్లు కూడా చికు బుకు చికు బుకు... చికెనే! అంటూ లాంగించేస్తారు.. మరి ఇంకెందుకు ఆలస్యం..పోషకాల కూరగాయల ముక్కలతోపాటు చికెన్ నూడల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి! చికెన్ నూడుల్స్ కావలసినవి: చికెన్ – 200 గ్రాములు (బోన్లెస్); నూడుల్స్ – 150 గ్రాములు; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మారినేట్ చేయడానికి .... మిరియాల పొడి– అర టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్; సోయా సాస్ – టీ స్పూన్; గరం మసాలా పౌడర్ – టీ స్పూన్; పోపు కోసం .... వెల్లుల్లి – 2 రేకలు (సన్నగా తరిగినవి); ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ ముక్కలు – పావు కప్పు; క్యారట్ ముక్కలు – పావు కప్పు; క్యాబేజ్ తరుగు – పావు కప్పు; ఉల్లికాడల ముక్కలు – ΄ావు కప్పు; చిల్లీసాస్– టేబుల్ స్పూన్; సోయాసాస్ – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత. తయారీ: ∙చికెన్ను సన్నని పొడవు ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసి ఒక పాత్రలో వేసి అందులో మిరియాల ΄÷డి, ఉప్పు, సోయాసాస్, గరం మసాలా పొడి కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి. ∙ఒక పెద్ద పాత్రలో రెండు లీటర్ల నీటిని మరిగించి అందులో నూడుల్స్ వేసి ఉడికించాలి. నూడుల్స్ ఉడుకుతున్నప్పుడే ఆ నీటిలో టీ స్పూన్ నూనె కలపాలి. నూనె కలిపితే నూడుల్స్ తీగలు ఒకదానితో మరొకటి అతుక్కోకుండా విడివడుతుంటాయి. నూడుల్స్ ఉడికిన తరవాత నీటిని వడ΄ోసి నూడుల్స్లో మరో టీ స్పూన్ నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి. క్యాప్సికమ్, క్యారట్, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో వెల్లుల్లి తరుగు, మారినేట్ చేసి సిద్ధంగా ఉంచిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలి. చికెన్ ఉడికేలోపు నూనె తగ్గిపోయినట్లయితే అరకప్పు నీటిని పక్కన వేడి చేసి చికెన్లో కలపాలి. చికెన్ ఉడికిన తరవాత ఆ పాత్రను పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేడి చేసి ఉల్లికాడల ముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తరవాత ఉడికించి పక్కన పెట్టిన కూరగాయల ముక్కలన్నీ వేసి నిమిషం పాటు వేయించి నూడుల్స్, చికెన్ ముక్కలు, చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు వేసి కలిపి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే వేడి వేడి చికెన్ నూడుల్స్రడీ..! -
Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ఎక్స్ప్రెస్పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగాపలు వాహనాలు ఒకదానికి ఒకటి డీకొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 12 వాహనాలు (ట్రక్కు, కారులు, బైక్లు) ధ్వసంమయ్యాయి. ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ద్వారా ధ్వంసమైన వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఒక విచిత్ర దృశ్యం కంటపడింది ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి బ్రాయిలర్ కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇంకేముంది... ప్రమాదం గురించి కానీ, అక్కడ జరిగిన విధ్వంసం గురించి కానీ పట్టింపు లేకుండా పలువురు వాహనదారులు, స్థానికులు ట్రక్కునుంచి కోళ్ల కోసం ఎగబడ్డారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. In UP's Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g — Piyush Rai (@Benarasiyaa) December 27, 2023 కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్రక్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. Chicken thief gang became active after the accident on #YamunaExpressway in #Agra 😇🤣👇#DelhiFog #DelhiNCR #AnanyaPanday #Encounter #RubinaDilaik #AUSvPAK #Ennore_GasLeak pic.twitter.com/AiYlNrjOyJ — Robert Lyngdoh (@RobertLyngdoh2) December 27, 2023 -
దిగొచ్చిన చికెన్ ధరలు.. కిలో 155 రూపాయలు
నల్లగొండ టౌన్: చికెన్ రేటు రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో చికెన్ స్కిన్తో రూ.155 ధర పలుకుతోంది. నెల రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర (స్కిన్తో) రూ.270 నుంచి రూ.285పైగా పలికింది. అప్పుడు సామాన్యులు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. ప్రస్తుతం కార్తీకమాసం కావడం, అయ్యప్పమాలలు, ఆంజనేయస్వామి మాలలు ధరిస్తున్న నేపథ్యంలో చికెన్ వాడకం సగానికి సగం పడిపోయింది. దీంతో చికెన్ ధర కూడా తగ్గిందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. కార్తీకమాసం ముగిసే వరకు ధరలు ఇలానే ఉండే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే కోళ్ల ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ చికెన్ వాడకం తగ్గడంతో కోళ్ల పెంపకందారులు నష్టాలపాలయ్యే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న కారణంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ పార్టీల నేతలు విందులు చేసే అవకాశం ఉన్నందున రెండు, మూడు రోజుల్లో వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందన్న చికెన్ సెంటర్ నిర్వాహకులు భావిస్తున్నారు. చికెన్ ధర ఇలా.. (కిలో రూ.లలో..) నెలక్రితం ప్రస్తుతం విత్ స్కిన్ 285 155 స్కిన్ లెస్ 310 180 కార్తీక మాసం కావడంతో ధర తగ్గింది ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో మహిళలు చాలా వరకు చికెన్ ముట్టరు. దీంతో చికెన్ కొనేవారు సగానికి సగం తగ్గడంతో చికెన్ రేటు కూడా పడిపోయింది. నెల క్రితం కిలో రూ.285 వరకు ఉన్న చికెన్ నేడు రూ.155 మాత్రమే అమ్ముతున్నాము. ఎన్నికలు ఉన్నందున ఒకటి రెండు రోజుల్లో గిరాకీ పెరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. –నాగయ్య, చికెన్సెంటర్ యజమాని, నల్లగొండ -
ఇండియన్ ఫుడ్కు భారీ డిమాండ్.. భారత్ను వేడుకుంటున్న దేశాలు
భారతీయ ఆహార ఉత్పత్తులకు బయటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగా దిగుమతులకు వీలు కల్పించాలని ఆయా దేశాలు భారత్ను వేడుకుంటున్నాయి. భారత్ నుంచి చికెన్, డైరీ, బాస్మతి రైస్, ఆక్వా, గోధుమ ఉత్పత్తులకు మధ్యప్రాచ్య దేశాలలో భారీ డిమాండ్ ఉందని యుఏఈ ఆహార పరిశ్రమ తెలిపింది. వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది. అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సమన్వయంతో ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని యూఏఈ ఆహార పరిశ్రమ భారత్ను కోరింది. బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తుల అధిక నాణ్యత ప్యాకేజింగ్ సహాయపడుతుందని పేర్కొంటోంది. ఇటీవల యూఏఈలో పర్యటించిన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ LLC సేల్స్ UAE హెడ్ నిస్సార్ తలంగర అన్నారు. బాస్మతి బియ్యానికి డిమాండ్ భారతీయ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై కనీస ఎగుమతి ధర (MEP) తగ్గింపు భారత్ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుందని ఒమన్కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న MEPని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారత్లో అత్యంత మెరుగైన హలాల్ మాంసం ధ్రువీకరణ వ్యవస్థ ఉంది. అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి మాట్లాడుతూ భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. చోయిత్రమ్స్ హెడ్ (రిటైల్ ప్రొక్యూర్మెంట్) కీర్తి మేఘనాని కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. యాప్కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ మాట్లాడుతూ ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని సూచించారు. GCC గ్రూప్కు చెందిన మరో దిగుమతిదారు మాట్లాడుతూ భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని చెప్పారు. భారత్-యూఏఈ వాణిజ్య ఒప్పందం గతేడాది మేలో అమల్లోకి వచ్చింది. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 72.9 బిలియన్ డాలర్ల నుంచి 2022-23లో 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
క్యారట్ చికెన్ మఫిన్స్.. చిన్న పిల్లలు ఇష్టం తింటారు
క్యారట్ చికెన్ కప్స్ తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – కప్పు; వెల్లుల్లి తురుము – పావు కప్పు; బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు; చీజ్ తురుము – ముప్పావు కప్పు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; గుడ్డు – ఒకటి; చికెన్ ఖీమా – అరకప్పు; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా తయారీ విధానమిలా: పెద్ద గిన్నెలో క్యారట్, వెల్లుల్లి, చీజ్ తురుములు, కొత్తిమీర చికెన్ ఖీమా, రుచికిసరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి ∙చివరిగా గుడ్డుసొనను కూడా వేసి కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మఫిన్ ట్రేలో వేసి ఇరవై నిమిషాల పాటు బేక్ చేయాలి ∙గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా మారితే చికెన్ క్యారట్ కప్స్ రెడీ. -
వండటానికి ముందే చికెన్ని కడగొద్దు! శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా చికెన్ని వండటానికి ముందే శుభ్రంగా కడుతాం. ఇది సర్వసాధారణం. అలా అస్సలు చేయొద్దంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ అలవాటును తక్షణమే మానుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్టితుల్లోను కడగొద్దని తేల్చి చెప్పారు. పైగా కడగకుండానే వండేయాలంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఏంటిది కడగకుండా నేరుగా వండేయడమా? ఇది నిజమా..! అని నోరెళ్లబెట్టకండి. ఔను! మీరు వింటుంది నిజమే! చికెన్ని కడగకుండా వండేయడమే మంచిదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. వారి జరిపిన తాజా అధ్యయనంలో దీని గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ పరిశోధనల్లో చాలామంది చికెన్ని వండటానికి ముందే కడుతున్నట్లు తేలిందట. దాదాపు 25% మంది చికెన్ని ముందే కడిగేస్తున్నారని గుర్తించామని అన్నారు. అధ్యయంనంలో ఇలా చేస్తే కలిగే నష్టాలు గురించి.. విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ఆహారం వల్ల కలిగే అనారోగ్యానికి సంబంధించి.. క్యాంపిలో బాక్టర్, సాల్మోనెల్లా అనే రెండు ప్రధాన బ్యాక్టీరియాలు కారణమని తెలిపారు. ఔ అవి సాధారణంగా పౌల్ట్రీ మాంసంలో కనిపిస్తాయని అన్నారు. అందువల్ల మాంసాన్ని పచ్చిగా ఉన్నప్పుడే కడగడం వల్ల ప్రతిచోట ఆ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని, దీని కారణంగా వ్యాధుల ప్రబలే ప్రమాదం ఎక్కువవుతుందని పరిశోధనల్లో తెలిపారు. ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన కేసులు ఆస్ట్రేలియాలో గత రెండు దశాబ్దాల్లో రెట్టింపు అయ్యినట్లు వెల్లడించారు. ఏడాదికి ఈ బ్యాక్టీరియాకు సంబంధించి సుమారు 2 లక్షల కేసుల్లో.. దాదాపు 50 వేల కేసుల దాక కోడి మాంసంకి సంబంధించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తున్నాయని చెప్పారు. కడిగిన చికెన్ కారణంగా ఉపరితల నీటి బిందువుల నుంచి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని తెలిపారు. అలాగే కుళాయిల నీటితో ఫాస్ట్ ఫోర్స్తో చికెన్ని కడగడంతో ఆ బ్యాక్టీరియా ఆ చెందిన నీటి బిందువల నుంచి మరింతగా వ్యాపిస్తాయని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అధ్యయనంలో నీటి ప్రవాహ రేటు తోపాటు బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే శాతం కూడా పెరగడం గుర్తించినట్లు వెల్లడించారు. అందువల్ల చికెన్ని పూర్తిగా ఉడికించి కడగడం లేదా వేడినీళ్లతో కడిగి వండటం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. (చదవండి: మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..షాక్లో కూతురు) -
నాటుకోళ్ల పెంపకం.. నెలకు రూ.80వేలకు పైగా లాభాలు
పెరట్లో నాటు కోళ్ల పెంపకం ద్వారా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు, ముఖ్యంగా మహిళా రైతులకు, ఏడాది పొడవునా స్థిరంగా ఆదాయంతో పాటు కుటుంబ స్థాయిలో పౌష్టికాహార లభ్యతను సైతం పెంపొందించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి వాసన్ తదితర స్వచ్ఛంద సంస్థలు గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా నిర్థారణైంది. పెరటి కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 70% కుటుంబాలు అన్నో ఇన్నో పెరటి కోళ్లు పెంచుకుంటూనే ఉంటాయి. అయితే, కోళ్లు పరిసర ప్రాంతాల్లో తిరిగి రావటంతో పాటు రాత్రుళ్లు చెట్ల మీదో, పందిళ్ల మీదో నిద్రించటం వల్ల కుక్కలు, పిల్లుల బారిన పడి మరణిస్తూ ఉంటాయి. ఈ సమస్యలను అధిగమించడానికి వాసన్ సంస్థ దేశవాళీ పెరటి కోళ్లను అరెకరం విస్తీర్ణంలో చుట్టూ ప్రత్యేకంగా కంచె వేసి అందులో స్థానికంగా లభించే జాతుల నాటు కోళ్లు పెంచటంపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల తోడ్పాటుతో అమలు చేస్తోంది. కోళ్లు రాత్రి పూట భద్రంగా విశ్రమించడానికి షెడ్డు నిర్మించటం.. చిరుధాన్యాలు, అజొల్లా, చెద పురుగులను మేపటం.. వ్యాక్సిన్లు వేయటం ద్వారా నాటు కోడి పిల్లల మరణాలను తగ్గించి, ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం కల్పించటం.. ప్రతి 25 కుటుంబాలకు ఒకటి చొప్పున స్థానిక మహిళా రైతు ద్వారానే బ్రీడింగ్ ఫామ్ను ఏర్పాటు చేయించటం.. వంటి చర్యల ద్వారా చక్కటి ఫలితాలు వస్తున్నాయని వాసన్ చెబుతోంది. అరెకరం పెరటి కోళ్ల నుంచి రూ. 70–80 వేలు, ఆ అరెకరంలో పండ్లు, కూరగాయలు, దుంప పంటల ద్వారా మరో రూ. 20 వేల వరకు రైతు కుటుంబానికి ఆదాయం వస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు వాసన్ తెలిపింది. ఏపీ గిరిజన ప్రాంతాల్లో మహిళా రైతుల అనుభవాలు దేశవ్యాప్తంగా అమలు చేయదగినవిగా ఉన్నాయని వాసన్ చెబుతోంది. ఈ అనుభవాలపై చర్చించేందుకు ఈ నెల 27వ తేదీన విశాఖలో వాసన్, ఏపీ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చర్చాగోష్టి జరగనుంది. ఈ సందర్భంగా అరెకరంలో నాటు కోళ్లను పెంచుతూ ఏడాదికి దాదాపు రూ. లక్ష ఆదాయం గడిస్తున్న చిన్నమ్మి, చంద్రయ్య గిరిజన దంపతుల అనుభవాలను ఇక్కడ పరిశీలిద్దాం. చిన్నమ్మి నాటు కోళ్ల బ్రీడింగ్ ఫామ్ కుండంగి చిన్నమ్మి(58), చంద్రయ్య గిరిజన దంపతులది మన్యం పార్వతీపురం జిల్లా సీతంపేట మండలం చినరామ గ్రామం. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుడు రవికుమార్ డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులతో కలసి గ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. వారికి 70 సెంట్ల మాగాణి, ఎకరంన్నర మెట్ట పొలంతో పాటు 2 ఎకరాల కొండ పోడు భూములు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వాసన్ సంస్థ తోడ్పాటుతో అరెకరం పెరట్లో నాటు కోళ్ల పెంపకం చేపట్టారు. భర్త, కుమారుడు ఇతర పొలాల్లో పనులు చూసుకుంటూ ఉంటే చిన్నమ్మి పెరటి కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. మరో 25 కుటుంబాలకు కూడా కోడి పిల్లలను అందించే బ్రీడింగ్ ఫామ్ను చిన్నమ్మి నిర్వహిస్తుండటం విశేషం. అరెకరం స్థలంలో చుట్టూ 4 అడుగుల ఎత్తు గ్రీన్ మెష్తో పాటు కొండ చీపురు గడ్డి, వెదరు బొంగులతో గట్టి కంచెను ఏర్పాటు చేసుకున్నారు. 50 కోళ్లతో ప్రారంభించారు. ఇప్పుడు 80 కోళ్లు ఉన్నాయి. కొన్ని పందెం కోళ్లు కూడా పెంచుతున్నారు. 18“24 అడుగుల స్థలంలో 200 కోళ్లు రాత్రిళ్లు నిద్రించడానికి సరిపోయే రేకుల షెడ్ను 3 సెంట్లలో నిర్మించారు. వాసన్ అందించిన రేకులు తదితర సామగ్రిని ఉపయోగించారు. కోళ్లు ఆరుబయట తిరిగి మేస్తూ ఉంటాయి. అదనంగా తమ పొలాల్లో పండించిన చోళ్లు తదితర చిరుధాన్యాలు కోళ్లకు వేస్తున్నారు. చిన్న కుంటలో పెంచిన అజొల్లాను కోళ్లకు, మట్టి కుండల్లో పెంచిన చెద పురుగులను కోడి పిల్లలకు మేతగా వేస్తుండటంతో అవి బలంగా పెరుగుతున్నాయి. వారం కోడి పిల్లలకు విధిగా లసోట వాక్సిన్తో పాటు రెండు నెలలకోసారి ఇతర వాక్సిన్లు వేస్తున్నారు. ఈ అరెకరంలో కోళ్ల పెంపకంతో పాటు అదనపు ఆదాయం కోసం 43 రకాల పండ్లు, కూరగాయలు, దుంప పంటలను 5 దొంతర్లలో పండిస్తుండటం విశేషం. పసుపు, అల్లం, సీతాఫలాలు, బొప్పాయి, చింతపండుతో పాటు ఆగాకర తదితర తీగ జాతి కూరగాయలను సైతం పండిస్తున్నారు. కోడి మాంసం, గుడ్లు, కూరగాయలు, పండ్లను తాము తినటంతో పాటు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి రూ. 70–80 వేల వరకు నాటుకోళ్లు, గుడ్ల ద్వారా, మరో రూ. 20 వేలు పంటల ద్వారా ఈ అరెకరం నుంచి ఆదాయం పొందుతున్నామని రవి(94915 42102) తెలిపారు. చిన్నమ్మి శ్రద్ధగా పనిచేస్తూ ఆదర్శ నాటుకోళ్ల బ్రీడింగ్ ఫామ్ రైతుగా గుర్తింపు పొందటం విశేషం. -
కోకోనట్ చికెన్ ఫ్రై.. భలే రుచిగా ఉంటుంది
కోకోనట్ చికెన్ తయారీకి కావల్సినవి: చికెన్ – అర కిలో మొక్కజొన్న పిండి – పావు కప్పు కొబ్బరి కోరు – అర కప్పు నూనె – సరిపడా, ఉప్పు – తగినంత మిరియాల పొడి – కొద్దిగా కారం – 1 టీ స్పూన్ గుడ్లు – 3 తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్లో గుడ్లు కొట్టి, 2 టీ స్పూన్ల కొబ్బరి పాలు పోసుకుని, బాగా గిలగ్గొట్టి పెట్టుకోవాలి. ఇంకో బౌల్లోకి కొబ్బరి కోరు తీసుకోవాలి. ముందుగా ఒక్కో చికెన్ ముక్కను మొక్కజొన్న పిండిలో వేసి బాగా పట్టించాలి. తర్వాత దాన్ని గుడ్డు మిశ్రమంలో ముంచి వెంటనే కొబ్బరి కోరు పట్టించాలి. అనంతరం వాటిని నూనెలో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే.. ఈ కోకోనట్ చికెన్ ముక్కలు భలే రుచిగా ఉంటాయి. -
వీకెండ్ స్పెషల్: పాలకూర చికెన్ ఎగ్ బైట్స్, సింపుల్గా ఇలా
పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ తయారీకి కావల్సినవి: పాలకూర – రెండు కప్పులు; గుడ్లు – పది; పాలు – ముప్పావు కప్పు; చీజ్ తరుగు – అరకప్పు; ఉడికించిన చికెన్ ముక్కలు – పది; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►పాలకూర, చికెన్ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.పెద్దగిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీనిలో పాలు, చికెన్, పాలకూర ముక్కలు వేసి కలపాలి. ► చివరిగా రుచికి సరిపడా, ఉప్పు, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంత వరకు బాగా కలపాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్లతో మఫిన్ ట్రేలో వేసి అరటగంట పాటు బేక్ చేస్తే పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ రెడీ. -
CWC Meeting: అతిథుల కోసం 78 రకాల వంటకాలు.. నోరూరాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్లో జోష్ నింపడం, బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది. అతిథుల కోసం 78 రకాల వంటకాలు ఇక సీడబ్ల్యూసీ భేటీలకు వచ్చే నేత లకు తెలంగాణ ప్రత్యేక వంటకాలతోపాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని వడ్డించనున్నారు. మొత్తంగా 78 రకాల వంటకాలను వడ్డించేలా పీసీసీ ఏర్పా ట్లు చేసింది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నిరకాల వంటలు, రుచులు ఉండేలా మెనూ సిద్ధం చేసింది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, వివిధ రాష్ట్రాల ఇతర సీనియర్లు వస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక వంటకాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వంట మనుషులను రప్పించింది. ►అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, రాగి, జొన్న సంగటి, పాయ సూప్, ఖీమా రోటీ, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, ప్రూట్ సలాడ్ వంటివి వడ్డించనున్నారు. ►మధ్యాహ్నం భోజనంలో హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు. ►శాకాహారుల కోసం పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు ఉండనున్నాయి. ►స్నాక్స్ ఐటమ్స్గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, వివిధ రకాల సమోసాలు, కుడుములు, మురుకులు, ఉడికించిన మొక్కజొన్న, సకినాలు, గారెలు రుచి చూపించనున్నారు. -
చికెన్ ఖీమా బుర్జి.. చపాతీలోకి చాలా బావుంటుంది
చికెన్ ఖీమా బుర్జి తయారికి కావల్సినవి: చికెన్ ఖీమా – పావుకేజీ; గుడ్లు – మూడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – రెండు; మిరియాలపొడి – టేబుల్ స్పూను; గరం మసాలా – టీస్పూను; పసుపు – అరటీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; ఆవాలు – టీస్పూను; మినప గుళ్లు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – గార్నిష్కు సరిపడా. తయారీ విధానమిలా: చికెన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, మినపగుళ్లువేసి వేయించాలి ∙ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయను ముక్కలు తరగి వేయాలి ∙ ఉల్లిపాయ ముక్కలు వేగాక ఖీమా, కొద్దిగా ఉప్పువేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ∙ సగం ఉడికిన ఖీమాలో పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. ఖీమా పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఖీమా ఉడికిన తరువాత గుడ్లసొనను వేసి రెండు నిమిషాలు పెద్ద మంట మీద తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. గుడ్ల సొన చక్కగా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అన్నం, చపాతీ,రోటీలకు ఇది మంచి సైడ్ డిష్. -
చికెన్, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి..
జైలులోని ఖైదీలకు మంచి ఆహారం ఇవ్వరనే ఆరోపణలను వింటుంటాం. ఖైదీలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటారని కూడా చాలామంది చెబుతుంటారు. అయితే ఇటీవల మిచిగన్లోని ఒక జైలులో ఖైదీలకు అందించే ఆహారం విషయంలో ఆందోళన చెలరేగింది. ఇక్కడి సెయింట్ లూయీస్ ఫెసిలీటీలోని ఖైదీలు మంచి ఆహారం కోసం హడలెత్తించే పనిచేశారు. ఖైదీలంతా కలసి 70 ఏళ్ల గార్డును బంధించారు. తరువాత జరిగిన పరిణామాల అనంతరం ఆ గార్డుకు ఎటువంటి హాని తలపెట్టకుండా, మర్నాటి ఉదయం విడిచిపెట్టారు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు జైలును తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ జైలులో మొత్తం 700 మంది ఖైదీలు ఉన్నారు. వీరు తమకు ఆహారంలో చికెన్, పిజ్జాలు కావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీరోజూ వేడి ఆహారం వడ్డించాలని కోరారు. వీటిని తక్షణం నెరవేర్చాలని కోరుతూ 70 ఏళ్ల గార్డును బంధించారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2021లో ఇక్కడి ఖైదీలు అల్లర్లకు పాల్పడి, జైలులోని కిటికీలను ధ్వంసం చేశారు. ఈ నేపపద్యంలో జైలు ఉన్నతాధికారి డేల్ గ్లాస్ రాజీనామా చేశారు. ఇది కూడా చదవండి: అడ్రస్ అడిగిన డెలివరీ బాయ్పై దాడి.. గంటపాటు మహిళ హైడ్రామా! -
అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి..
లక్నో: ఉత్తరప్రదేశ్లో అమానవీయ ఘటన జరిగింది. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడి చేశారు కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన్ అహిర్వార్ అనే వ్యక్తి బైక్పై చికెన్ను విక్రయిస్తుంటాడు. ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అతన్ని అడ్డగించారు నిందితులు. తమకు చికెన్ అవ్వాలని అడిగారు. డబ్బులు ఇవ్వాలని అభ్యర్థించిన బాధితున్ని.. యువకులు చెప్పులతో చితకబాదారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్ కేసులో -
గొంతులో ఇరుక్కున్న లెగ్ పీస్.. వైద్యుని వింత సలహాకు కంగుతిన్న మహిళ..!
ఒక మహిళకు ఎదురైన వింత అనుభవం ఇప్పుడు వైరల్గా మారింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ తాను చికెన్ తింటున్న సమయంలో తన గొంతులో ఒక చిన్నపాటి ఎముక ఇరుక్కుపోయిందని తెలిపింది. దీంతో తనకు గొంతునొప్పి తలెత్తడంతో వైద్యుని దగ్గరకు వెళ్లానని, ఆయన సర్జరీ చేసేందుకు బదులు ఇచ్చిన ఒక సలహా అద్భుతంగా పనిచేసిందన్నారు. దీంతో తనకు నొప్పి నుంచి ఉపశమనం లభించిందని తెలిపారు. ఈ ఉదంతం న్యూజిలాండ్లో చోటుచేసుకుంది. ఇచ్ మీడియా కంపెనీ స్టఫ్ తెలిపిన వివరాల ప్రకారం బెథ్ బ్రెష్ అనే మహిళ గత వారంలో వెల్లింగ్టన్లోని ఒక రెస్టారెంట్కు వెళ్లింది. అక్కడ ఆమె చికెట్ డిష్ ఆర్టర్ చేసింది. అప్పుడు వెయిటర్ ఆమెను ఎముకలతో కూడిన చికెన్ కావాలా లేదా బోన్లెస్ చికెన్ కావాలా అని అడిగాడు. దీనికి ఆమె బోన్తో కూడిన చికెన్ కావాలని తెలిపింది. ఆ చికెన్ తింటున్న సమయంలో ఆమె గొంతులో చిన్నపాటి ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఆమెకు కొంచెం నొప్పిగా అనిపించినప్పటికీ, రెస్టారెంట్తో ఎటువంటి ఫిర్యాదు చేయకుండానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే రెండుమూడు రోజుల పాటు ఆ నొప్పి కొనసాగడంతో తన ఇంటికి సమీపంలోని వైద్యుని దగ్గరకు వెళ్లి, తన సమస్య వివరించింది. వైద్యుని పరీక్షలో ఆమె గొంతులో చిన్నపాటి బోన్ ముక్క ఉందని స్పష్టమయ్యింది. దీంతో ఆమె తనకు సర్జరీ చేస్తారని అనుకుంది. అయితే ఆ వైద్యుడు సర్జరీకి బదులుగా ఒక విచిత్ర ఉపాయం తెలిపారు. వైద్యుని సలహా గురించి బెథ్ బ్రెష్ మాట్లాడుతూ ఆ వైద్యుడు తనను కొద్ది రోజులు కూల్డ్రింక్ తాగాలని, అప్పుడు తన గొంతులోని బోన్ పీస్ దానంతట అదే కరిగిపోతుందని తెలిపారన్నారు. ఆమెకు ఆ సలహా పనిచేయదేమోనని అనిపించినా దానిని అనుసరించింది. ఫలితంగా ఆమె గొంతు రెండు రోజులలో మునుపటి మాదిరిగా సవ్యంగా మారిపోయింది. ఈ ఘటన గురించి డచ్ మెడికల్ ఎక్స్పర్ట్ డాక్టర్ బ్రాయన్ బెట్టీ మాట్లాడుతూ గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోతే ఇది పరిష్కారం కాదన్నారు. ఎసిడిక్ డ్రింక్ కారణంగా ఎముక ముక్క కరిగిపోయే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విధంగా బాధితులకు కూల్ డ్రింక్ తాగాలంటూ సలహా ఇవ్వడం సరికాదన్నారు. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. -
సోనాలి జాతి కోళ్ల పెంపకం.... పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ
-
కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు ఆన్సర్ దొరికింది!
కోడి ముందా..గుడ్డు ముందా అనే ప్రశ్నఅనేది ఎందరినో ఆకర్షించిన ఓ చిక్కు ప్రశ్న. యుగాలుగా పండితుల దగ్గర నుంచి శాస్త్రవేత్తలకు పట్టి పీడించిన ఆ చిక్కు ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఫజిల్లా మిగిలిన ఆ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఉభయచరాలు, బల్లులపై చేసిన ఎన్నో అధ్యయనాల అనంతరం ఆ ప్రశ్నకు సమాధానం 'కోడె' ముందని తేల్చి చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అందుకు సంబంధించి.. ఆధారాలతో సహా వెల్లడించేందుకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ క్రమంలో ఆయా పరిశోధనల్లో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆధునిక సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వంటివి ఇంతకమునుపు గుడ్లు పెట్టడానికి బదులు పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చి చెప్పారు. ఇది 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై జరిపిన పరిశోధనల ఆధారంగా వెల్లడించినట్లు పేర్కొన్నారు. వాటిల్లో గుడ్లు పెట్టేవి(అండాశయం), జన్మనిచ్చేవి(వివిపరస్) అని రెండు రకాలుగా వర్గీకరించి మరీ అధ్యయనం చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాస్తవానికి ఇవి మొదట్లో పునరుత్పత్తి కోసం నీటి సమీపంలో నివశించేవని చెప్పారు. అలాగే పరిస్థితులు అనువుగా మారే వరకు తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని తెలిపారు. పరిణామక్రమంలో భూమిపై జీవించడానికి అలవాటు పడటంతో క్రమంగా గుడ్లు పెట్టడం ప్రారంభించాయని అన్నారు. ప్రస్తుతం జీవించి ఉన్న కొన్ని జాతులు పాములు, కప్పలు, బల్లులు అప్పుడప్పుడూ పిల్లలకు నేరుగా జన్మనిస్తాయని, కొన్ని సందర్భాల్లో గుడ్లు పెడతాయని బ్రిస్టల్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రొఫెసర్ మైఖేల్ బెంటన్ చెప్పారు. అవి అండాశయం(గుడ్లు పెట్టడం), వివిపరస్(జన్మనివ్వడం) అనే రెండు పునరుత్పత్తి వ్యూహాలను ప్రదర్శిస్తాయని శిలాజ జాతులపై జరిపిన అధ్యయనంలో వెల్లడైందని నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement