-
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!
సాధారణంగా ఏ గుడికైన కుటుంబ సమేతం వెళ్లి దర్శించుకుంటాం. కానీ ఓ గుడికి మాత్రం అక్కా-తమ్ముడు, అన్నా-చెల్లెళ్ల కలిసి వెల్లకూడదట. అలాంటి వింత ఆలయం భారత్లో ఒకటి ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకని ఈ నిషేధం విధించారంటే.. ఆ ఆలయం ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. అది సాక్షాత్తు భోళా శంకరుడు ఆలయం. ఈ శివాలయాన్నిఏడు, ఎనిమిదో శతాబ్దకాలంలో కాలచూరి పాలకులు ఎరుపు, నలుపు రంగులతో కూడిన ఇసుకరాయితో నిర్మించారట. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు పర్యాటకులను అమితతంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలోనే ఓ చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం వివిధ రకాల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఎందుకు ఈ నిషేధం అంటే.. ఈ ఆలయాన్ని కేవలం రాత్రుళ్లులోనే నిర్మించారట. అయితే ఆ గుడిని నిర్మించే శిల్పి నారాయణ్ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవాడట. రోజూ అతడి భార్యే అతనికి భోజనం తీసుకొచ్చేదట. కానీ, ఓ రోజు నారాయణ్ చెల్లెలు భోజనం తీసుకుని ఆలయంలోకి వచ్చింది. నగ్నంగా ఉన్న అతడిని ప్రమాదవశాత్తు చూస్తుంది. దీన్ని నారాయణ్ చాలా అవమానంగా భావించి ఆ గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సోదర సోదరీమణులు ఈ ఆలయంలోకి రాకూడదని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అంటే అక్క తమ్ముడు, అన్నా- చెల్లికి మ్రాతమే నో ఎంట్రీ. అంటే అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లుకు ఇది వర్తించదు. ఏదీఏమైన కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి, ఆచారాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజెర్ట్గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
పూరీ ఆలయంలోనికి అక్రమంగా బంగ్లాదేశీయులు
ఒడిశాలోని పూరీలో గల జగన్నాథ ఆలయంలోకి అనధికారికంగా తొమ్మిది మంది బంగ్లాదేశీయులు ప్రవేశించారు. వీరిని ఒడిశా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఆలయంలోకి వెళ్లడాన్ని తాము చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తమకు చెప్పారని ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై వీహెచ్పీ కార్యకర్తలు సింగ్ద్వార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు హిందూయేతర బంగ్లాదేశీయులు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని పూరీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. ఆలయ నిబంధనల ప్రకారం హిందువులకు మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోనికి హిందువులు కానివారు ప్రవేశిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయుల పాస్పోర్టులను తనిఖీ చేస్తున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. విచారణ సమయంలో ఒకరు హిందువని తేలింది. మిగిలిన పాస్పోర్టులపై విచారణ కొనసాగుతోంది. ఆలయ పరిసరాల్లోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు ఆలయంలోనికి ప్రవేశించినట్లు విచారణలో తేలింది. -
కేంద్రంపై యూకే రచయిత నిటాషా సంచలన ఆరోపణలు
లండన్: భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్కు భారత ప్రభుత్వం ఎంట్రీ నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు బెంగళూరు ఎయిర్పోర్టులో దిగిన తనను ఇమిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారని ఆమె తెలిపారు. అనంతరం తిరిగి తనను లండన్ పంపేశారని, అడిగితే నీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారన్నారు. ఈ విషయాలన్నింటిని ఆమె తాజాగా ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు’ అనే అంశంపై మాట్లాడేందుకు కర్ణాటక ప్రభత్వం నన్ను ఆహ్వానించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నన్ను ఎయిర్పోర్టులోనే ఆపేసి తిరిగి లండన్ పంపించివేసింది. నా వద్ద అవసరమైన డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. గతంలో ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేసినందుకే నన్ను వెనక్కిపంపుతున్నట్లు అధికారులు అనధికారికంగా నాతో చెప్పారు. లండన్ నుంచి 24 గంటల పాటు ప్రయాణించి బెంగళూరు వస్తే మళ్లీ 24 గంటలు అటు ఇటు తిప్పి నన్ను ఎయిర్పోర్టులోనే ఉంచారు. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పడుకోవడానికి కొద్దిగా స్థలం చూపించారు. అక్కడ కూడా కనీసం దిండు ఇవ్వలేదు. సీసీ కెమరా పర్యవేక్షణలో ఉంచారు. నేను ఎన్నోసార్లు భారత్ వచ్చాను. నాకు దేశంలోకి అనుమతి లేనట్లు కనీసం ముందుగా కూడా చెప్పలేదు. కర్ణాటక ప్రభుత్వమే నాకు టికెట్లు ఇచ్చింది’అని కౌల్ ఎక్స్లో తెలిపారు. ఇదీ చదవండి.. భారత సంతతి కంప్యూటర్ ఇంజినీర్కు ప్రతిష్టాత్మక అవార్డు -
వేరే భాషల్లో స్టార్ హీరోయిన్లు.. తెలుగు తెరపై వాలిపోతున్నారు
ప్రతీ ఏడాదీ తెలుగు తెరపై కొత్త తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది కూడా కొందరు సొగసరులు టాలీవుడ్కి పరిచయమవుతున్నారు. కొందరు ఇప్పటికే వేరే భాషల్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లి, తెలుగు తెరకు కొత్త తారగా పరిచయం అవుతున్నారు. ఇంకొందరు వేరే భాషల్లో ఇప్పుడిప్పుడే పైకొస్తూ తెలుగుకి వస్తున్నారు. ‘సొగసరీ... స్వాగతం’ అంటూ వీరి రాక కోసం తెలుగు తెర వేచి చూస్తోంది. మోస్ట్ వాంటెడ్ హిందీలో పదిహేనేళ్లకు పైగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో భాగమయ్యారు దీపికా పదుకోన్. కానీ తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయలేదు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం దీపికాను తెలుగుకు ఆహ్వానించింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్. ఇక ‘హెలెన్’, ‘కప్పెలా’ వంటి మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అన్నా బెన్ కూడా ‘కల్కి 28 98ఏడీ’తోనే తెలుగుకు ఎంట్రీ ఇస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. స్వాగతం బంగారం దివంగత ప్రముఖ తార శ్రీదేవికి ఇటు దక్షిణాదిన అటు ఉత్తరాదిన బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె వారసురాలిగా ముందు ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఎంట్రీని తెలుగు ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆశిస్తున్నారు. ‘దేవర’ సినిమాతో అది నెరవేరుతోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో జాన్వీ పాత్ర పేరు తంగమ్ (బంగారం). కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోనూ జాన్వీ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈసారి నో డౌట్ హీరోయిన్ మాళవిక ఎంట్రీ టాలీవుడ్లో ఎప్పుడో జరగాల్సింది. విజయ్ దేవరకొండ, మాళవికా మోహనన్ జంటగా ఓ సినిమా ్రపారంభమై, అది క్యాన్సిల్ అయ్యింది. ఈ బ్యూటీ ఇప్పుడు ‘రాజా సాబ్’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. బచ్చన్కు జోడీగా.. హిందీ చిత్రం ‘యారియా 2’లో ఓ చిన్న పాత్ర చేసి పెద్ద పేరు తెచ్చుకున్నారు భాగ్య శ్రీ భోర్సె. ఈ పుణే మోడల్ ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగుకు పరిచయం కానున్నారు. హీరో రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు భాగ్య శ్రీ భోర్సె. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లుగా తెలిసింది. ప్రపంచ సుందరి కూడా... 2017లో మిస్ వరల్డ్గా నిలిచిన బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ కూడా తెలుగు తెరపై కనిపించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మానుషీకి తెలుగులో తొలి చిత్రం. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాకు శక్తీ ప్రతాప్ సింగ్ దర్శకుడు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మార్చి 1న రిలీజ్ కానుంది. ఇది వరుణ్ తేజ్కు హిందీలో తొలి చిత్రం కావడం విశేషం. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ పతాకాలపై సందీప్ ముద్దా ఈ సినిమాను నిర్మించారు. నాట్యం టు నటన నాట్య కళాకారిణి ప్రీతీ ముకుందన్ ‘కన్నప్ప’ సినిమాతో తెలుగు తెరపై నటిగా కనిపించనున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ముఖేష్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ప్రీతీ ముకుందన్ను తీసుకున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్లపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. బుజ్జి కన్నా.. వస్తున్నా... తెలుగు ప్రేక్షకులకు ‘బుట్ట బొమ్మ’ అంటే పూజా హెగ్డే, ‘బేబమ్మ’ అంటే కృతీశెట్టి గుర్తొస్తారు. అలాగే ‘బుజ్జి కన్నా’ అంటే మలయాళ బ్యూటీ ఇవానా గుర్తొస్తారు. తమిళ హిట్ ‘లవ్ టుడే’లో హీరోయిన్ ఇవానా ‘బుజ్జి కన్నా..’ అంటూ ప్రేమికుడిపై కురిపించిన ప్రేమ అందర్నీ ఆకట్టుకుంది. ‘లవ్ టుడే’ చిత్రం తెలుగులో అనువాదమై బంపర్ హిట్గా నిలిచింది. దీంతో తెలుగులో ఇవానాకు చాన్స్లు దక్కాయి. అలా స్ట్రెయిట్ ఫిల్మ్ ‘సెల్ఫిష్’తో ‘బుజ్జికన్నా.. వస్తున్నా!’ అంటూ తెలుగు కుర్రాళ్ల మనసులను మరో మారు గెలిచేందుకు వస్తున్నారు ఇవానా. ఇందులో ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. విశాల్ కాశీ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్తో కలిసి ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. తెలుసు కదా... యశ్ ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో కన్నడలో, విక్రమ్ ‘కోబ్రా’తో తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు మంగుళూరు బ్యూటీ శ్రీనిధీ శెట్టి. ఈ యంగ్ బ్యూటీ ‘తెలుసు కదా’ అంటూ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా, రాశీ ఖన్నా మరో హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. డాటర్ ఆఫ్ జానీ లీవర్ బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు జానీ లీవర్ కుమార్తె జెమీ లీవర్ హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు వస్తున్నారు. ‘హౌస్ఫుల్ 4’, ‘భూత్ పోలీస్’ వంటి హిందీ సినిమాల్లో మెరిసిన జెమీ లీవర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే తెలుగు సినిమా చేస్తున్నారు. రామ్ అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘నా మాతృభాష తెలుగులో సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఓ విధంగా మా గ్రాండ్ మదర్కు నేను ఇస్తున్న ఓ నివాళిగా ఈ సినిమాను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు జెమీ. ఇక బాలీవుడ్ సినిమాల్లో పాపులర్ అయిన జానీ లీవర్ స్వస్థలం కనిగిరి అనే విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంకెంత మంది కొత్త సొగసరులకు తెలుగు పరిశ్రమ స్వాగతం పలుకుతుందో చూడాలి. -
వచ్చే వారం రిలయన్స్ డేటా సెంటర్ ప్రారంభం
చెన్నై: వేగంగా వృద్ధి చెందుతున్న డేటా సెంటర్స్ విభా గంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇస్తోంది. వచ్చే వారం చెన్నైలో సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీ సంస్థలతో కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. చెన్నైలో 20 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఈ జాయింట్ వెంచర్ సంస్థ ముంబైలో మరో 40 మెగావాట్ల సెంటర్ కోసం 2.15 ఎకరాలు కొనుగోలు చేసింది. -
Avram Manchu: ఐదేళ్లకే సినిమాలో ఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు తనయుడు (ఫోటోలు)
-
మంచు వారసుడొస్తున్నాడు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్తో ఎంట్రీ!
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రాబోతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా కన్నప్ప నుంచి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం ద్వారా మంచు వారసుడు సినీ అరంగేట్రం చేయనున్నారు. విష్ణు మంచు వారసుడిగా అవ్రామ్ కన్నప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మోహన్ బాబు మూడో తరం కూడా సినిమాల్లోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో అవ్రామ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించారు. విష్ణు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. అవ్రామ్తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. 'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు.కన్నప్ప మొదటి షెడ్యూల్ ముగియగానే విష్ణు మంచు తనకు సహకరించిన టీంకు థాంక్స్ చెప్పారు. -
బిగ్బాస్లో రతికా రోజ్.. ఓకే చెప్పేసిందా?
గతేడాది బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాలిటీ షో బిగ్బాస్. దాదాపు 100 రోజులకు పైగా సినీ ప్రేక్షకులను అలరించింది. డిసెంబర్ 17న ముగిసిన ఈ సీజన్లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. బుల్లితెర నటుడు అమర్దీప్ రన్నరప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే అంతకుముందు జరిగిన సీజన్లతో పోలిస్తే ఈ సారి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో బిగ్బాస్ నిర్వాహకులు త్వరలోనే మరో సీజన్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే బిగ్బాస్ ఓటీటీ సీజన్ మొదలు కానున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ రియాలిటీ షో ఫిబ్రవరి నెలలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది జరిగిన బిగ్బాస్ సీజన్-7లో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు. ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో సారి కూడా ఎలిమినేట్ అయి బయటకొచ్చిన కంటెస్టెంట్ రతికా రోజ్. అయితే మరోసారి రతికా బిగ్బాస్ షోకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ సీజన్లో రతికా ఎంట్రీ ఇవ్వనుందని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రతికా ఓ సినిమాలో నటిస్తోంది. -
స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్గా ఎవరంటే?
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి స్టార్గా ఎదిగిన వాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారాయన. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తండ్రిబాటలోనే పయనించేందుకు ఆయన వారసుడు వచ్చేస్తున్నాడు. విజయ్ సేతుపతి కుమారుడు సూర్య తెరంగేట్రానికి అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'ఫీనిక్స్' అనే టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సీనియర్ స్టంట్ మాస్టర్ అరసు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఏకే బ్రేవ్మన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంతో అరసు డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. గతంలో ఆయన ఇండియన్ 2, జవాన్ సినిమాలకు స్టంట్ మాస్టర్గా పనిచేశారు. కాగా.. ఆయన కుమారుడు సూర్య 'నానుమ్ రౌడీ ధాన్'లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. ఆ తర్వాత 'సింధుబాద్'చిత్రంలో సహాయక పాత్రలో కనిపించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'విడుతలై పార్ట్ 2'లో సూర్య కనిపించనున్నారు. కాగా... ఈ చిత్రానికి సీఎస్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని డైరెక్టర్ అరసు తెలిపారు. -
జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!
న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్మెంట్కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి. దీంతో భారత్తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్బర్గ్లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి. -
ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మిస్ శెట్టి!
సినిమా ఇండస్ట్రీలో స్వీటీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనుష్కనే. ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అలరించారు. ఈ బెంగళూరు భామ మొదట్లో యోగా టీచర్గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సూపర్ అనే తెలుగు చిత్రంలో నాగార్జునకు జంటగా నటించే అవకాశం వరించింది. అలా తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్ని తన అందాలతో కొల్లగొట్టిన అనుష్క ఆ తర్వాత రెండు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో మరింతగా గ్లామరస్గా నటించి తడితడి అందాలతో తమిళ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించారు. ఇంకేముంది ఈ రెండు భాషల్లోనూ వరుసగా అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అలాంటి గ్లామరస్ నటిని అరుంధతి చిత్రంతో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆ చిత్రం తమిళంలోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భాగమతి చిత్రాలతో తనలోని నట దాహాన్ని తీర్చుకున్న అనుష్క, బాహుబలి చిత్రంతో నటిగా మరో అంతస్తుకు చేరుకుంది. అలా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన నటించిన ఈ భామ సైజ్ జీరో అనే చిత్రంలో నటించడానికి ఏ హీరోయిన్ చేయని సాహసం చేశారు. అందులోని పాత్ర కోసం బరువును విపరీతంగా పెంచుకున్నారు. అయితే ఆ తర్వాత బరువు తగ్గడానికి ఇప్పటి వరకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. దీంతో అవకాశాలు ఆమెకు దూరమయ్యాయనే అనే చెప్పాలి. ఇటీవలే రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం అనుష్కకు మంచి కమ్ బ్యాక్గా నిలిచింది. దీంతో నూతన ఉత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు తాజాగా ఒక మలయాళ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. హోమ్ చిత్రం ఫేమ్ రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జై సూర్యకు జంటగా అనుష్క నటిస్తున్నారు. ఇది చారిత్రక కథ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు తెలిసింది. తన పాత్ర కొత్తగా ఉండకపోతే అనుష్క ఇందులో నటించడానికి సమ్మతించి ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో మేనల్లుడు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు, అమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాను త్వరలోనే సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అతను చివరిగా కంగనా రనౌత్తో కలిసి 2015లో విడుదలైన కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఆదివారం ముంబయిలో జరిగిన ముంబయిలో జరిగిన ఐఎఫ్పీ ఫెస్టివల్ సీజన్ -13 ముఖ్య అతిథిగా హాజరైన ఇమ్రాన్ ఖాన్ తన పునరాగమనంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. "రీ ఎంట్రీపై నా దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. కానీ ప్రస్తుతం స్క్రిప్ట్లను చదువుతున్నా. బాలీవుడ్ చిత్రనిర్మాతలతోనూ మాట్లాడుతున్నా. వచ్చే ఏడాది రీ ఎంట్రీ ఉంటుందని ఆశిస్తున్నా.' అని అన్నారు. సినిమాల గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'సినిమాలను చూడటం, హీరోల నుంచి ప్రేరణ పొందడం వల్ల ప్రేక్షకుల నుంచి తనకు ప్రశంసలు వచ్చాయి. సినిమా చూస్తున్న అనుభూతిని ఆస్వాదించానని.. ఈ ప్రపంచంతో తాను భావోద్వేగాలతో ముడిపడి ఉన్నట్లు చెప్పాడు. నా చిన్నప్పుడు సినిమాలు చూసి ఆనందించాను. నాకు 8 ఏళ్ల వయస్సులో ఇండియానా జోన్స్ చూడటం ఇప్పటికీ గుర్తుంది. అది నా మనసును కదిలించింది. నేను ఇండియానా జోన్స్ హీరో లాగే గోధుమ రంగు లెదర్ జాకెట్ కొన్నాను. ఇదే నేను ఓ హీరోని అనుకరించడానికి ప్రయత్నించిన తొలి జ్ఞాపకం" అని గుర్తు చేసుకున్నారు. తన సినిమా 'జానే తు యా జానే నా' సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 80వ దశకంలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ లాంటి యాక్షన్ చిత్రాలు ఉండేవి.. ఇండియన్ సినిమాలో ఈ పాత్రలు తక్కువగా ఉన్నాయని నేను భావించానని తెలిపారు. కాగా.. ఇటీవలే ఇమ్రాన్ అబ్బాస్ టైర్వాలాతో వెబ్ సిరీస్ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. View this post on Instagram A post shared by Imran Khan (@imrankhan) -
హీరోయిన్గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ?
ముందానై ముడిచ్చు చిత్రంతో కథానాయకిగా పరిచయమై తన చిలిపితనంతో కూడిన నటనతో అందరినీ ఆకర్షించిన మలయాళ నటి ఊర్వశి. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. 1980-90 ప్రాంతంలో ప్రముఖ కథానాయకిగా వెలిగిన ఆమె తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?) నటిగా మంచి ఫామ్లో ఉండగానే మలయాళ నటుడు మనోజ్ కే.జయన్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుంజట్టా అనే కూతురు ఉంది. అయితే కొన్నేళ్లకే మనస్పర్థల కారణంగా ఊర్వశి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అయినా కూతురు ఇద్దరి వద్ద ఉంటూ పెరుగుతూ వచ్చింది. కాగా.. ఆ తరువాత ఊర్వశి రెండో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమె కూతురు కుంజట్టాతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో ఊర్వశి వారసురాలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. కుంజట్టాకు కథనాయకికి కావలసిన అన్ని లక్షణాలు ఉండడంతో తర్వాత హీరోయిన్ అనే ప్రచారం ఊపందుకుంది. ఊర్వశి ఉద్దేశం కూడా అదే కావచ్చు అంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఇన్నాళ్లకు తన కూతురితో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కుంజట్టాను హీరోయిన్గా పరిచయం చేయడానికి కొందరు దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంపై ఊర్వశి ఎలాంటి ప్రకటన చేయలేదు. (ఇది చదవండి: ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్! ) -
బిర్లా ‘ఓపస్’ పెయింట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ రంగంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇచి్చంది. ఈ మేరకు ‘బిర్లా ఓపస్’ బ్రాండ్ను గురువారం ఆవిష్కరించింది. డెకోరేటివ్ పెయింట్ల వ్యాపారంలో గ్రాసిమ్ రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించింది. 2024 జనవరి–మార్చి కాలంలో బిర్లా ఓపస్ ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ హరియణా, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో పెయింట్ల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 133.2 కోట్ల లీటర్లు. అధిక వృద్ధి ఉన్న విపణిలోకి ప్రవేశించడానికి కొత్త విభాగం వీలు కలి్పస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఈ సందర్భంగా అన్నారు. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రెండేళ్లుగా బలమైన పునాదిని నిర్మించినట్టు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో రెండవ స్థానంలో నిలిచి లాభదాయక కంపెనీగా ఎదగడానికి ప్రయతి్నస్తున్నామన్నారు. డెకోరేటివ్ పెయింట్స్ పరిశ్రమ భారత్లో రెండంకెల వృద్ధితో ఏటా రూ.70,000 కోట్లు నమోదు చేస్తోంది. 2022–23లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 23 శాతం వృద్ధితో రూ.1.17 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, గ్రాసిమ్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 0.12 శాతం క్షీణించి రూ.1,931.40 వద్ద స్థిరపడింది. -
తెలుగులో సూపర్ హిట్స్ కొట్టిన హీరోయిన్.. ఆ సినిమాతో రీ ఎంట్రీ!
అప్పట్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన కొందరు హీరోయిన్లు లేటు వయసులో రీఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించిన నటీమణులు అవకాశం వస్తే ఏ పాత్రలోనైనా అలరించేందుకు సిద్ధంగా ఉంటారు. అలా ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ అద్భుతంగా నటిస్తున్నారు. అలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మరో నటి టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ అందాల నటి ఎవరో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'ఇంకా లేటెందుకు.. త్వరగా పెళ్లి చేసుకోండి'.. మిల్కీ బ్యూటీకి నెటిజన్స్ సలహా!) తెలుగువారికి హీరో భాను చందర్ పేరు సుపరిచితమే. ఆయన హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం‘నిరీక్షణ’. ఈ మూవీతోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న భామ అర్చన. 1980లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అర్చన తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించారు. మీనాక్షి పొన్నుంగా అనే కోలీవుడ్ టీవీ సీరియల్లోనూ కనిపించారు. భానుచందర్ సరసన నటించిన ‘నిరీక్షణ’ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె చేసిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం 1986లో రిలీజ్ కాగా.. ఈ సినిమాలో ఆమె నటనకు నంది అవార్డ్ దక్కింది. మధురగీతం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్చన ఆ తర్వాత వీడు, లేడీస్ టైలర్, దాసీ,ఉక్కు సంకెళ్లు, మట్టి మనుషులు, భారత్బంద్, పచ్చతోరణం లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. అయితే భాను చందర్, అర్చన నటించిన ‘వీడు’ చిత్రానికి నేషనల్ అవార్డ్తో పాటు ఫిలింఫేర్ కూడా దక్కింది. దాసి చిత్రానికి సైతం మరోసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ గెలుచుకున్నారు. అయితే కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న అర్చన రీఎంట్రీకి ఇస్తోంది. ప్రస్తుతం ఆమె షష్ఠిపూర్తి అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్ రిలీజ్ చేయగా ఈ విషయం బయటకొచ్చింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అర్చన మళ్లీ నటిస్తుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న చిత్రం 'షష్టిపూర్తి'. ఇందులో రూపేష్ కుమార్ చౌదరి హీరో. కథానాయకుడిగా నటించడంతో పాటు సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనకు జోడీగా కథానాయిక ఆకాంక్షా సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్టేక్'... పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియదర్శి) -
కోలీవుడ్లోనూ ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్!
పాత నీరు పోక, కొత్త నీరు రాక అన్న సామెత సినీ పరిశ్రమకు సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా కొత్త నటీమణులు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి పరితపిస్తుంటారు. అలా చాలా మంది క్రేజీ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. తాజాగా నటి మాల్వీ మల్హోత్రా కోలీవుడ్లో తన లక్ను పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. (ఇది చదవండి: మీ క్యాలెండర్లో ఇది మార్క్ చేసుకోండి: చిరంజీవి ) హిమాచల్ప్రదేశ్కు చెందిన ఈ పంజాబీ బ్యూటీ ముంబాయిలో నటిగా శిక్షణ పొంది ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. మొదట బుల్లితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ.. అలా వెండితెరలోనూ నాయకిగా నటిస్తున్నారు. ఇప్పటికే పంజాబీ, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న ఈ భామ ఇప్పుడు కోలీవుడ్కు ఎంట్రీ షురూ అయ్యిందన్నది తాజా సమాచారం. నటుడు ఆర్కే సరసన నటించే అవకాశం ఈమెను వరించింది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న 'తిరగబడరా సామీ' చిత్రంలో మాల్వీ మల్హోత్రా నటిస్తోంది. ఇందులో మరో కథానాయిక మన్నారా చోప్రా కూడా కనిపించనుంది. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) మలయాళంలో రఫీ దర్శకత్వంలో దిలీప్, కీర్తీసురేశ్, హనీరోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన రింగ్ మాస్టర్ 2014లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ కాబోతోంది. ఇందులో నటుడు ఆర్కే కథానాయకుడిగా నటించనున్నారు. ఈయన ఇంతకు ముందు ఎల్లామ్ అవన్ సెయల్, అళగర్ మలై, వైగో ఎక్స్ప్రెస్ వంటి పలు విజయవతమైన చిత్రాల్లో నటించారు. కాగా చిన్న గ్యాప్ తరువాత ఈయన నటిస్తున్న ఈ చిత్రంలో నటి మాల్వీ మల్హోత్రా నాయకిగా నటించనున్నారు. బిగ్బాస్ అభిరామి ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఆర్.కన్నన్ దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభం కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by MALVI MALHOTRA (@malvimalhotra) -
పీక్స్ కి చేరిన ధోని రవీంధ్ర జడేజా గొడవలు...మధ్యలో ఏంట్రీ ఇచ్చిన జడ్డు వైఫ్
-
ధోనీ రాకతో దద్దరిల్లిన స్టేడియం
-
ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ సడెన్ ఎంట్రీ! నోటీసులు పంపుతామని వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ క్యాంటిన్లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దీంతో మండిపడ్డ ఢిల్లీ యూనివర్సిటీ ఆయనకు నోటీసులు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి రాహుల్ గాంధీకి ఈ విషయమై మంగళవారం లేదా బుధవారం నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న మెన్స్ హాస్టల్ను రాహుల్ శుక్రవారం సందర్శించి, అక్కడ కొంతమంది విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే వారితోపాటు ఆయన భోజనం కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దీన్ని సహించం.. అంటూ రాహుల్కి నోటీసులు పంపుతామని చెప్పారు. ఆయన క్యాంపస్లో అనధికారికంగా పర్యటించారని, ఆయన లోపలికి ప్రవేశించేటప్పుడూ చాలామంది విద్యార్థులు భోజనం చేస్తున్నారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అన్నారు. ఇలాంటి ఘటనను పునరావృతం చేయకుండా ఉండాలని, అలాగే విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దని చెప్పారు. నిజానికి ఈ ఘటన విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, ఇలాంటి విషయాల్లో నాయకులు కచ్చితంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలాఉండగా రాహుల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ విద్యార్థి విభాగం స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఆరోపించింది. ఐతే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేదని, ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయమని అన్నారు. -
వీడియో: ధోనీ రాకతో దద్దరిల్లిన స్టేడియం
-
టీమిండియాలోకి యశస్వి జైస్వాల్ ఎంట్రీ..?
-
గన్ షాట్ : మాణిక్ ఎంట్రీతో టీ-కాంగ్రెస్ లో మంట చల్లారుతుందా..?
-
హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్న వారసులు
-
భారత్లో మారడోనా బ్రాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్ బ్రాండ్ మారడోనా భారత్కు ఎంట్రీ ఇస్తోంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు, దివంగత డీగో మారడోనా పేరుతో ఈ బ్రాండ్ను అర్జెంటీనా కంపెనీ సట్వికా ఎస్ఏ ప్రమోట్ చేస్తోంది. మారడోనా బ్రాండ్ కింద స్పోర్ట్స్ గూడ్స్తోపాటు ఐవేర్, ఎలక్ట్రానిక్స్, ఫుట్వేర్, బెవరేజెస్, పర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్ ఇక్కడి మార్కెట్లో మూడు, నాలుగు నెలల్లో రంగ ప్రవేశం చేయనున్నాయి. భారత ప్రత్యేక భాగస్వామిగా బ్రాడ్ఫోర్డ్ లైసెన్స్ ఇండియాను సట్వికా నియమించింది. మారడోనా బ్రాండ్ ఉత్పత్తుల విక్రయానికి ప్రముఖ ఫ్యాషన్ కంపెనీలు, ఈ–కామర్స్ రిటైలర్స్తో చర్చిస్తున్నట్టు బ్రాడ్ఫోర్డ్ తెలిపింది. ఫ్యాషన్, లైఫ్స్టైల్, కంజ్యూమర్ గూడ్స్, స్పోర్ట్స్ వంటి విభాగాల్లో 60కిపైగా బ్రాండ్స్ను బ్రాడ్ఫోర్డ్ భారత్లో నిర్వహిస్తోంది. ప్రపంచంలో ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుల్లో ఒకరైన మారడోనా.. 1986 వరల్డ్ కప్ అర్జెంటీనా వశం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్లో ఫ్రాన్స్ను ఓడించి 36 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్గా అర్జెంటీనా నిలిచిన సంగతి తెలిసిందే.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- IPL 2024: ప్లే ఆఫ్స్ ఛాన్స్లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే..
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
Advertisement