కేంద్రంపై యూకే రచయిత నిటాషా సంచలన ఆరోపణలు | Government Denies Entry Into India Says Nitasha Kaul | Sakshi

కేంద్రంపై యూకే రచయిత నిటాషా సంచలన ఆరోపణలు

Feb 26 2024 12:57 PM | Updated on Feb 26 2024 1:14 PM

Government Denies Entry Into India Says Nitasha Kaul - Sakshi

లండన్‌: భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్‌, రచయిత నిటాషా కౌల్‌కు భారత ప్రభుత్వం ఎంట్రీ నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన తనను ఇమిగ్రేషన్‌ సిబ్బంది అడ్డుకున్నారని ఆమె తెలిపారు. అనంతరం తిరిగి తనను లండన్‌ పంపేశారని, అడిగితే నీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారన్నారు. ఈ విషయాలన్నింటిని ఆమె తాజాగా ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు.

‘‘ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు’ అనే అంశంపై మాట్లాడేందుకు కర్ణాటక ప్రభత్వం నన్ను ఆహ్వానించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నన్ను ఎయిర్‌పోర్టులోనే ఆపేసి తిరిగి లండన్‌ పంపించివేసింది. నా వద్ద అవసరమైన డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేసినందుకే నన్ను వెనక్కిపంపుతున్నట్లు అధికారులు అనధికారికంగా నాతో చెప్పారు.

లండన్‌ నుంచి 24 గంటల పాటు ప్రయాణించి బెంగళూరు వస్తే మళ్లీ 24 గంటలు అటు ఇటు తిప్పి నన్ను ఎయిర్‌పోర్టులోనే ఉంచారు. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పడుకోవడానికి కొద్దిగా స్థలం చూపించారు. అక్కడ కూడా కనీసం దిండు ఇవ్వలేదు. సీసీ కెమరా పర్యవేక్షణలో ఉంచారు. నేను ఎన్నోసార్లు భారత్‌ వచ్చాను. నాకు దేశంలోకి అనుమతి లేనట్లు కనీసం ముందుగా కూడా చెప్పలేదు. కర్ణాటక ప్రభుత్వమే నాకు టికెట్లు ఇచ్చింది’అని కౌల్‌ ఎక్స్‌లో తెలిపారు.    

ఇదీ చదవండి.. భారత సంతతి కంప్యూటర్‌ ఇంజినీర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement