India
-
భారత్పై కన్నేసిన పాక్.. అసలు లక్ష్యమేంటి?
భారత్ టార్గెట్గా దాయాది దేశం పాకిస్తాన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ గత 16 నెలల కాలంలో వరుసగా ఆరు భూ పరిశీలన (Earth Observation) ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కాగా, పాక్ చర్యలు దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఉపగ్రహాలు వ్యవసాయం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, భూవినియోగ మ్యాపింగ్ వంటి పౌర అవసరాల కోసం అని పాకిస్తాన్ ప్రకటిస్తున్నప్పటికీ, రక్షణ నిపుణులు ఇవి సైనిక నిఘా సామర్థ్యాన్ని కూడా పెంచగలవని విశ్లేషిస్తున్నారు.వేగంగా పాకిస్తాన్ అంతరిక్ష విస్తరణ.. గతంలో పరిమిత స్థాయిలో ఉన్న పాకిస్తాన్ అంతరిక్ష కార్యక్రమం ఇప్పుడు గణనీయంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా చైనా సాంకేతిక సహకారంతో భూ పరిశీలన, రిమోట్ సెన్సింగ్ రంగాల్లో పాకిస్తాన్ కొత్త ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాల్లో PRSC-EO1, PRSC-EO2, PRSC-EO3 వంటి ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి భూమి ఉపరితల చిత్రాలను సేకరించి విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే, భూ పరిశీలన ఉపగ్రహాలు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ ఉపరితల చిత్రాలు, భౌగోళిక సమాచారం, వాతావరణ మార్పులు, వ్యవసాయ పరిస్థితులు వంటి అంశాలను నమోదు చేస్తాయి. భద్రతా మరియు సరిహద్దు పర్యవేక్షణ కూడా చేయనున్నాయి. ఇక, అధునాతన సెన్సర్లు కలిగిన ఉపగ్రహాలు సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, వాహనాల కదలికలు వంటి అంశాలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటాయి.భారత్ను గమనించే సామర్థ్యం ఎంత?నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఉపగ్రహాలు భారత భూభాగం మీదుగా ప్రయాణించే సమయంలో చిత్రాలను సేకరించగలవు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, సైనిక స్థావరాలు, వాయుసేన కేంద్రాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను గుర్తించే అవకాశం ఉంది. ఇలా ఆయా ప్రాంతాలపై సమాచారం పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఉపగ్రహాలు 24 గంటలూ ఒకే ప్రాంతాన్ని ప్రత్యక్షంగా గమనించవు. అవి కక్ష్యలో తిరుగుతాయి. కాబట్టి ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట వ్యవధుల్లో మాత్రమే చిత్రీకరించగలవు. అంతేకాకుండా.. భారత్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. దేశ విస్తీర్ణం సుమారు 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. ఆరు ఉపగ్రహాలు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించగలిగినా, మొత్తం దేశాన్ని ప్రతి క్షణం పర్యవేక్షించడం అసాధ్యం.సన్-సింక్రోనస్ కక్ష్య ప్రయోజనంపాకిస్తాన్ తాజా ఉపగ్రహాల్లో చాలా వరకు సన్-సింక్రోనస్ ఆర్బిట్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కక్ష్య ప్రత్యేకతలు ఏంటంటే.. ప్రతిరోజూ ఒకే ప్రాంతాన్ని దాదాపు ఒకే సమయానికి చిత్రీకరించగలదు. భూమిపై మార్పులను పోల్చి చూడటం సులభం. సైనిక నిఘా, మ్యాపింగ్, పర్యావరణ అధ్యయనాలకు అనుకూలంగా ఉంటుంది.భారత్, పాక్ మధ్యలో చైనా..పాకిస్తాన్, చైనా మధ్య అంతరిక్ష సహకారం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. పాకిస్తాన్కు చైనా ఉపగ్రహ సాంకేతికత, శిక్షణ, డేటా ప్రాసెసింగ్ మద్దతు ఇస్తోంది. దీంతో పాకిస్తాన్ సొంత అంతరిక్ష సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది. మరోవైపు. అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కంటే ఎంతో ముందుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థలు, వ్యూహాత్మక నిఘా ఉపగ్రహాలు వంటి విస్తృత సామర్థ్యాలను అభివృద్ధి చేసింది. అదనంగా భారత్ తన సరిహద్దుల పర్యవేక్షణ కోసం మరింత పెద్ద ఉపగ్రహ నెట్వర్క్ను కూడా విస్తరిస్తోంది. కాగా, భారత్, పాకిస్తాన్ రెండూ తమ భద్రతా అవసరాల కోసం ఉపగ్రహ నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాయి.భవిష్యత్తు యుద్ధాల్లో ఉపగ్రహాల పాత్రప్రస్తుతం యుద్ధాలు కేవలం సైనికులపై ఆధారపడటం లేదు. టెక్నాలజీపై ఆధారపడి దాడులు జరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా ఉపగ్రహ సమాచారానికి అత్యంత ప్రాధాన్యం లభించింది.ఉపగ్రహాలతో ఇలా..క్షిపణుల మార్గదర్శనండ్రోన్ కార్యకలాపాలుకమ్యూనికేషన్నావిగేషన్లక్ష్యం గుర్తింపుగూఢచారి సమాచారం వంటి పనుల్లో కీలకం. -
వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తగ్గించింది. గతంలో 6.7 శాతంగా ప్రకటించిన అంచనాను 6.4 శాతానికి సవరిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా–ఇరాన్ యుద్ధంతో సెపె్టంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు నిదానించనున్నట్టు తెలిపింది. ప్రజల ఆదాయం, వినియోగ వ్యయాలపై ధరల పెరుగుదల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదు కావడం తెలిసిందే. ‘‘జీడీపీ వృద్ధి రేటు 2026–27లో 6.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. మార్చిలో ప్రకటించిన అంచన కంటే 0.3 శాతం తక్కువ. వృద్ధిలో దేశీ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తుంది. నికర దిగుమతులు తక్కువగా ఉండడం వృద్ధికి అనుకూలించనుంది’’ అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.6 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చన్నది ఆర్బీఐ తాజా అంచనా. ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని జూన్ సమీక్ష అనంతరం ప్రకటించడం తెలిసిందే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇటీవలి కాలంలో పెంచడాన్ని ఫిచ్ తన నివేదికలో ప్రస్తావించింది. 2027–28లో జీడీపీ వృద్ధి 6.7%కి పుంజుకుంటుందని అంచనా వేసింది. ధరలు పెరుగుతాయ్.. భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో పెరగలేదంటూ, రానున్న నెలల్లో ధరలు క్రమంగా పెరుగుతాయని ఫిచ్ తెలిపింది. ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 8.3%కి పెరగ్గా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.5%గా ఉండడాన్ని ప్రస్తావించింది.అంతర్జాతీయ వృద్ధి 2.4 శాతం 2026 సంవత్సరానికి అంతర్జాతీయ వృద్ధి రేటు అంచనాలను సైతం 0.2 శాతం తగ్గించి 2.4 శాతంగా ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. -
బెడ్షీట్ ఉతికేందుకు రూ.5 కంటే తక్కువే
భారతీయ రైల్వేలలో ఏసీ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులకు అందించే లినెన్ కిట్ గురించి అందరికీ తెలుసు. ఇందులో సాధారణంగా బెడ్షీట్, దిండు, టవల్, దుప్పటి ఉంటాయి. అయితే ఈ వస్తువులను శుభ్రం చేయడానికి రైల్వేలు ఎంత ఖర్చు చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా?లాండ్రీ టెండర్ పత్రం ప్రకారం.. ఒక బెడ్షీట్ ఉతకడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 3.16 మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటైన భారత రైల్వే వ్యవస్థలో పరిశుభ్రత నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోల్చితే ఇది చాలా తక్కువగా ఉందని చాలామంది భావిస్తున్నారు.ఉతికేందుకు ఖర్చు ఎంత?భారతీయ రైల్వేల డిపార్ట్మెంటల్ లాండ్రీ టెండర్ డాక్యుమెంట్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రం ప్రకారం.. ఒక బెడ్షీట్ ఉతికేందుకు అధికారిక రేటు ఒక్కదానికి రూ. 3.16. ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారికి ప్రయాణంలో భాగంగా పలు లినెన్ వస్తువులు అందిస్తారు. సాధారణంగా వీటిలో బెడ్షీట్, దిండు, టవల్, దుప్పటి ఉంటాయి. ఈ ఏర్పాటు ముఖ్యంగా సుదూర, రాత్రి వేళల రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల సౌకర్యం అందించాల్సిన దృష్ట్యా అమలులో ఉంది.రైల్వే నెట్వర్క్లో ప్రతిరోజు వినియోగించే భారీ స్థాయి లినెన్ను శుభ్రం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చాలామంది ప్రయాణికులు తరచూ ఆలోచిస్తుంటారు. టెండర్ పత్రం ప్రకారం.. బెడ్షీట్ ఉతికే ఖర్చు తక్కువగానే ఉంది. భారీ స్థాయిలో లాండ్రీ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఖర్చులను భారతీయ రైల్వేలు ఎలా నియంత్రిస్తున్నాయనే అంశంపై ఇది చర్చకు దారి తీసింది.భారతీయ రైల్వేలు ప్రతిరోజు మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది ఏసీ కోచ్లు నడుస్తున్నాయి. ఇంత విస్తృత నెట్వర్క్లో లినెన్ సేవల నిర్వహణకు ప్రత్యేక లాండ్రీ కేంద్రాలు, క్రమం తప్పని శుభ్రపరిచే ప్రక్రియలు అవసరం. ఇటీవల చర్చకు వచ్చిన ఈ టెండర్ సంఖ్య, రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాల నిర్వహణకు అయ్యే నిర్వహణ వ్యయాల్లో ఒక అంశంపై అవగాహన కల్పిస్తోంది. -
ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారా ఏంటి?
ప్రస్తుత కాలంలో ఆన్లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసేవారు విపరీతంగా పెరిగిపోయారు. అయితే, ఇలా కొనుగోళ్లు చేస్తున్న వారిలో ప్రతిరోజు ఎంతో కొంత మోసపోతూనే ఉన్నారు. ఉదాహరణకు.. ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తున్నప్పుడు మొదట రూ.499 అని కనిపిస్తుంది. కానీ, చెల్లింపు చేసే చివరి దశకు వెళ్లేసరికి డెలివరీ ఛార్జీ, ప్లాట్ఫాం ఫీజు, ప్యాకేజింగ్ ఫీజు అంటూ ధర రూ.600 దాటిపోతుంది. మరికొన్ని సార్లు "ఇంకా 2 నిమిషాల్లో ఆఫర్ ముగుస్తుంది", "ఈ వస్తువును 20 మంది చూస్తున్నారు" వంటి సందేశాలు చూపించి వెంటనే కొనుగోలు చేయాలనే ఒత్తిడి, ఆత్రుతను తీసుకొస్తారు. వినియోగదారులను ఇలాంటి పద్ధతులతో ప్రభావితం చేసే డిజిటల్ వ్యూహాలను "డార్క్ ప్యాటర్న్స్" అంటారు. ఈ మోసపూరిత పద్ధతుల వల్ల భారత్లో ఆన్లైన్ కొనుగోలుదారులు ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు తాజా డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా రూపొందించిన డిజిటల్ డిజైన్ పద్ధతులను కంపెనీలు పాటిస్తూ కస్టమర్లను మోసగిస్తున్నాయి."డార్క్ ప్యాటర్న్స్" అని పిలిచే మోసపూరిత ఆన్లైన్ డిజైన్ పద్ధతుల వల్ల వినియోగదారులు ప్రతి ఏడాది రూ. 25,000 కోట్ల నుంచి రూ. 28,000 కోట్ల మధ్య నష్టపోతున్నారని డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్లైన్ మార్కెట్ప్లేసెస్ పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం.. భారత్లోని 304 మిలియన్ల ఆన్లైన్ కొనుగోలుదారుల్లో దాదాపు 88 శాతం మంది హిడెన్ (మనకు ముందు తెలియని) ఛార్జీలు, తప్పనిసరి అదనపు సేవలు, డ్రిప్ ప్రైసింగ్, సబ్స్క్రిప్షన్ వంటి పద్ధతుల కారణంగా నెలకు సగటున రూ.78 నుంచి రూ.87 వరకు అదనపు ఖర్చు భరిస్తున్నారు. డ్రిప్ ప్రైసింగ్ అంటే ప్రారంభంలో ధర తక్కువగా చూపించి, చివరి దశల్లో అదనపు ఛార్జీలు చేర్చే విధానం.మోసపూరిత డిజిటల్ పద్ధతులను అడ్డుకోవడంలో ప్రస్తుతం ఉన్న నియంత్రణ చర్యలు కొద్ది మేరకే ప్రభావం చూపుతున్నాయని నివేదిక పేర్కొంది మోసపూరిత డిజిటల్ పద్ధతులపై భారీ జరిమానాలు అవసరమని చెప్పింది. అలాగే, అమలు చేయడానికి వీలుగా ఉన్న నిబంధనలు అవసరమని సూచించింది.50 నగరాల్లోని 2,590 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వేలో, ఆన్లైన్ చెల్లింపులు చేసే వారిలో దాదాపు 63 శాతం మంది హిడెన్ ఛార్జీలు లేదా డ్రిప్ ప్రైసింగ్ను ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. ఇందులో అదనపు ఖర్చులు కొనుగోలు ప్రక్రియ చివరి దశల్లో మాత్రమే కనిపిస్తాయి. 2024లో నమోదైన 52 శాతంతో పోలిస్తే ఇది బాగా పెరిగింది. 73 శాతం వరకు వినియోగదారులపై ఒత్తిడి తెచ్చే ఫోర్స్డ్-యాక్షన్ పద్ధతులు వాడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇవి వినియోగదారులు సాధారణంగా తీసుకోని నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి పెడతాయి. -
12 నూక్లియర్ ఆయుధాలు మోహరింపు : ఇండియా వ్యూహాత్మక మార్పు!
సాక్షి, న్యూఢిల్లీ: అణ్వాయుధ విధానానికి సంబంధించి ఇండియా ముఖ్యమైన అణు వ్యూహాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలిసారిగా 12 అణ్వాయుధాలను (Nuclear Warheads) మోహరిం చిందంటూ అంతర్జాతీయ పరిశోధన సంస్థ (సిప్రి) రిపోర్ట్ సంచలనంగా మారింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో ఇప్పటికే దేశం వద్ద 190 అణ్వాయుధాలుఉన్నాయని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధ పర్యవేక్షణ సంస్థ SIPRI ఈ నివేదిక తాజాగా విడుదల చేసింది.స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తాజా నివేదిక ప్రకారం భారతదేశం మొట్టమొదటి సారిగా 12 అణ్వాయుధాలను మోహరించింది. భారతదేశం తన దశాబ్దాల కాలపు అణువిధానాన్ని పక్కనబెట్టి, తొలిసారిగా 12 అణు వార్హెడ్లను వ్యూహాత్మకంగా మోహరించింది. గతంలో అణు వార్హెడ్లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేర్వేరు నిల్వ కేంద్రాలలో భద్రపరిచే విధానాన్ని (Separate Storage Policy) భారత్ అనుసరించేది. అయితే ఇప్పుడు వాటిని సిద్ధంగా ఉంచడం ద్వారా దేశ రక్షణలో ఉన్నత స్థాయి సంసిద్ధతకు సంకేతమని తెలిపింది.శాంతిసమయంలో కూడా క్షిపణులను సిద్ధంగా ఉంచడం, సముద్రంలో నిరంతర నిఘా లాంటి చర్యలు భారతదేశ రక్షణ సంసిద్ధతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయని SIPRI నివేదిక వెల్లడిస్తోంది. అయితే దశాబ్దాలుగా అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించే వ్యవస్థలను వేర్వేరు నిల్వ కేంద్రాలలో ఉంచే విధానానికి బదులుగా ఇది విరుద్ధమైన చర్య అని పేర్కొంది.ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్నివేదికలోని ముఖ్యాంశాలు భారత అణు చరిత్రలో ఈ వార్హెడ్లను కేవలం నిల్వ ఉంచడమే కాకుండా, ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు (Operationally Deployed) వర్గీకరించడం ఇదే మొదటిసారి. ఈ 12 వార్హెడ్లను క్షిపణులతో అనుసంధానించడం (Mating) లేదా సముద్రగర్భ నిఘా నిర్వహించే అణు జలాంతర్గాములపై (SSBNs) ఉంచడం ద్వారా క్షేత్రస్థాయి దళాల వద్ద సిద్ధంగా ఉంచారు.2026 జనవరి నాటికి భారతదేశం వద్ద ఉన్న మొత్తం అణు ఆయుధాల సంఖ్య 190కి చేరిందని అంచనా (గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది). ఇవి వైమానిక, భూతల మరియు సముద్ర రక్షణ వ్యవస్థలతో అనుసంధానించబడి ఉన్నాయి. ఇదీ చదవండి: 40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు"నో ఫస్ట్ యూజ్" (No First Use) విధానంఅణ్వాయుద విధానంలో వ్యూహాత్మక మార్పు జరిగినప్పటికీ, ఇండియా తన ప్రాథమిక అణు విధానమైన "నో ఫస్ట్ యూజ్" (మొదటగా అణు దాడి చేయకూడదు) అనే సూత్రానికే కట్టుబడి ఉంది. శత్రు దేశాలు అణు దాడికి పాల్పడితే మాత్రమే, ప్రతీకార చర్యగా మాత్రమే, భారత్ తన అణు ఆయుధాలను ఉపయోగిస్తుంది. అంతేకాదు భారతదేశం పమర్థవంతమైన అణ్వాయుధాలను కలిగి ఉంది. ఈ సామర్థ్యం ఆయుధ పోటీలో పాల్గొనడానికి కాకుండా, కేవలం దురాక్రమణదారులను నిరోధించడానికే రూపొందించబడింది.భారత్ అణుసామర్థ్యం పరిమితమైనప్పటికీ, దీన్ని ఆయుధాల పోటీ కోసం కాకుండా, దేశ రక్షణ కవచంగా మాత్రమే భావిస్తుంది. -
భారత్ కు మరో యువరాజ్ అసలెవరీ మానవ్ సుతార్
-
ఆఫ్గాన్ చిత్తు చిత్తు.. టెస్టుల్లో భారత్ కు అతిపెద్ద విజయం
-
మళ్లీ ఉద్రిక్తతలు.. ఆ దేశం విడిచి వెళ్లండి: భారత్
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సోమవారం హెచ్చరికలు జారీ చేశాయి. భారతీయులు ఇరాన్కు ప్రయాణించవద్దని, ప్రస్తుతం అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్లాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాయం సూచించింది.గత 24 గంటల్లో పలు నగరాల్లో సైనిక చర్యలు, వ్యూహాత్మక కేంద్రాలపై వైమానిక దాడులు, భారీ క్షిపణి దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. “ఆ ప్రాంతంలో తాజా పరిణామాల దృష్ట్యా, ఇరాన్కు ప్రయాణించవద్దన్న మా గత సూచనను మరోసారి తెలుపుతున్నాం. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా వెంటనే బయటకు రావాలి” అని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.ఇక ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 100వ రోజుకు చేరుకున్న వేళ, సోమవారం రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికే సున్నితంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం తీవ్ర ప్రమాదంలో పడింది. ప్రాంతీయ స్థాయిలో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం చెలరేగే భయం నెలకొంది.ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ బలగాలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్కు చెందిన నౌకల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. ఎర్ర సముద్రం ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలక సముద్ర మార్గం. తాజా సైనిక చర్యల్లో ఇరాన్లోని ఒక పెట్రోకెమికల్ సముదాయంపై దాడి జరగగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మాత్రం రెండు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకార చర్యలు చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను కోరిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దానికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేపట్టింది. అనంతరం సోమవారం ఇరు పక్షాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఇజ్రాయెల్లోనూ.. టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో చేసిన పోస్టులో.. భారతీయులు ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.“ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్లోని భారతీయులు అన్ని వేళలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా మార్గదర్శకాలు, సూచనలను కచ్చితంగా అనుసరించాలి” అని తెలిపింది.అధికారిక మార్గాల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న భద్రతా సూచనలను పరిశీలించాలని రాయబార కార్యాలయం సూచించింది.భారతీయులు తమ నివాసాలు, కార్యాలయాల సమీపంలోని ఆశ్రయ కేంద్రాల గురించి తెలుసుకుని, వాటికి దగ్గరగా ఉండాలని తెలిపింది. తమ నివాసం లేదా ఉద్యోగ ప్రాంతం వద్ద ఉన్న ఆశ్రయ ప్రదేశాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించింది.తదుపరి సమాచారం వచ్చే వరకు ఇజ్రాయెల్లో అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది. స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనించాలని భారతీయులకు సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాన్ని 24 గంటల సహాయ కేంద్రం ద్వారా సంప్రదించాలని తెలిపింది. -
ప్లీజ్ రండి... INDIA భేటీకి DMK, ఆప్ డుమ్మా
-
విజయ్ కి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం!
-
190 vs 170.. పాక్పై భారత్ లీడ్
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరోసారి దక్షిణాసియా కేంద్రంగా చర్చ మొదలైంది. అణు శక్తి, ఆయుధ సామర్థ్యం, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య.. భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో.. పాకిస్థాన్పై ఆధిక్యం సాధించిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక వెల్లడించింది. సిప్రి ఇయర్బుక్ 2026 ప్రకారం.. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్హెడ్స్ ఉండగా, పాకిస్థాన్ వద్ద సుమారు 170 మాత్రమే ఉన్నాయని అంచనా వేసింది. ఇరు దేశాలు 2025లో కూడా తమ అణు ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించడంపై దృష్టి పెట్టాయని.. ముఖ్యంగా భారత్ తన దీర్ఘశ్రేణి అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ చైనా వరకు చేరగలిగే డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు నివేదిక పేర్కొంది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా ఫిషైల్ మెటీరియల్ సేకరణ, కొత్త డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు తెలిపింది.ఆపరేషన్ సిందూర్ టైంలో.. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతను సిప్రి “అసాధారణంగా తీవ్రమైన మిలిటరీ క్రైసిస్”గా అభివర్ణించింది. అయితే అణు ఘర్షణ దిశగా వెళ్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్తులో ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ప్రపంచ స్థాయిలో చూస్తే మొత్తం 9 అణు దేశాల వద్ద కలిపి సుమారు 12,241 వార్హెడ్స్ ఉన్నాయని సిప్రి తెలిపింది. వీటిలో అత్యధికంగా అమెరికా, రష్యా వద్దే అధిక భాగం ఉండగా, చైనా వేగంగా తన అణు సామర్థ్యాన్ని విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. చైనా వద్ద ఇప్పటికే సుమారు 620 వార్హెడ్స్ ఉన్నాయని అంచనా. భారత్ విషయానికి వస్తే.. కొత్త తరహా అణు ఆయుధ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి క్షిపణులు అభివృద్ధి చేయడం ద్వారా తన వ్యూహాత్మక స్థాయిని పెంచుకుంటోందని సిప్రి స్పష్టం చేసింది. పాకిస్థాన్ కూడా తన అణు శక్తిని విస్తరించే ప్రయత్నాల్లో ఉందని, వచ్చే దశాబ్దంలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.డేంజర్ జోన్ ఎందుకంటే..సిప్రి నివేదికలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాలపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని, డిసార్మ్మెంట్ ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని స్పష్టం చేసింది. దేశాలు రక్షణ పేరుతో అణు ఆయుధాల వైపు మరింత మొగ్గు చూపుతున్నాయని, ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది.అణు ఆయుధాలపై పారదర్శకత తగ్గడం, దేశాల మధ్య చర్చలు–ఒప్పందాలు బలహీనపడటం, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల.. భవిష్యత్తులో విపరీతాలు జరగొచ్చని సిప్రి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అవతలి దేశం దాడి చేయబోతుందనుకుని ఇవతలి దేశం పొరపడడం, చిన్న సంఘటనను పెద్ద ముప్పుగా భావించడం, అవసరం లేని సమయంలో సైనిక చర్యలకు వెళ్లడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా జరగొచ్చని అంటున్నారు. పెద్ద దేశాల మధ్య చిన్న పొరపాటు కూడా పెద్ద యుద్ధ ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ గతంలో భారత్–పాక్ మధ్య గతంలో చోటు చేసుకున్న సైనిక ఘర్షణలను ప్రస్తావిస్తున్నారు. -
గ్యాస్ రేట్లు మళ్లీ పెరుగుతాయా?.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఈ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంధన ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా.. అటు పెట్రో రేట్లు పెరగడం, అలాగే ఇటు సిలిండర్లపైనా పెంపు అమల్లోకి రావడంతో, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండే అవకాశముందా? అనే ప్రశ్న వినియోగదారుల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రం చేసిన వివరణలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఆ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో.. వంటగ్యాస్ (LPG) ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా.. సిలిండర్పై రూ.29 పెంపు అమల్లోకి రావడంతో, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండే అవకాశముందా? అనే ప్రశ్న వినియోగదారుల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రం చేసిన వివరణలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి.డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పెంపుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియా ముఖంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ ధరల పెంపు తప్పించలేని నిర్ణయంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పెంపుపై విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ, సరఫరా పరిమితులు, రవాణా ఖర్చుల పెరుగుదల, బీమా వ్యయాలు అధికమవడం వంటి కారణాలతో ధరలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కావడం లేదని వివరించారు.అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ సరఫరా తగ్గడం, కొన్ని పరిమిత దేశాల నుంచే దిగుమతులు జరగడం, అలాగే 40–45 రోజుల ట్రాన్స్షిప్మెంట్ కారణంగా రవాణా వ్యయాలు భారీగా పెరగడం ధరల పెంపుకు ప్రధాన కారణాలుగా కేంద్రం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యయం రూ.1,600 దాటినప్పటికీ, ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపకుండా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఉపశమనం కల్పిస్తోందని తెలిపింది.ఇదే సమయంలో భారత్లో వంటగ్యాస్ ధరలు ప్రపంచంలోనే తక్కువగా ఉన్నాయని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ ధరలు గణనీయంగా చౌకగా ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ వినియోగదారులు సిలిండర్కు సుమారు రూ.942 చెల్లిస్తుండగా, ప్రతి సిలిండర్పై దాదాపు రూ.700 వరకు ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10.58 కోట్లకుపైగా కనెక్షన్లు అందించగా, అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లపై ఒక్కో సిలిండర్కు రూ.300 సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఉజ్వల వినియోగదారులకు సిలిండర్ ధర సుమారు రూ.642కే లభిస్తోందని వివరించింది.మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ సంక్షోభం కొనసాగుతున్నా భారత్లో వినియోగదారులపై భారం తగ్గించేందుకు భారీ సబ్సిడీలు, ప్రత్యామ్నాయ దిగుమతులు, దేశీయ ఉత్పత్తి పెంపు వంటి చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం చెబుతోంది. అయితే పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో, రాబోయే నెలల్లో ఎల్పీజీ ధరలు ఎలా మారతాయన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలు, రవాణా వ్యయాలు, దిగుమతి ఒత్తిడులు కొనసాగుతున్న నేపథ్యంలో ధరలపై ఒత్తిడి తప్పదని ఆయన పేర్కొనడం భవిష్యత్తులో మరింత పెంపులు ఉండే అవకాశాలపై సంకేతాలుగా రాజకీయ, ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
టార్గెట్ 2029.. ఢిల్లీలో 23 పార్టీల భేటీ
-
గాడ్జిల్లా వచ్చేస్తోంది! భారత్పై దాని నీడ పడితే..
గాడ్జిల్లా సముద్రం నుంచి బయటకు వస్తే నగరాలు వణికిపోతాయి. ఎందుకంటే అది సృష్టించే విధ్వంసం కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుంది. అది సినిమా కథ. కానీ ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో రూపుదిద్దుకుంటున్న ‘గాడ్జిల్లా’ మాత్రం సైంటిస్టులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచం మొత్తం దానివైపు చూస్తుంటే.. భారత్కు మాత్రం మరో భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఈ దాని నీడ గనుక పడితే జరిగిన నష్టం.. పెను సంక్షోభానికి దారి తీస్తుంది కాబట్టి!. వాతావరణ ప్రపంచంలో ప్రస్తుతం ఒక్కటే చర్చ నడుస్తోంది. అదే "గాడ్జిల్లా ఎల్ నినో". సాధారణంగా రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి కనిపించే ఎల్ నినో ఈసారి.. అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), యూరప్కు చెందిన ప్రముఖ వాతావరణ అంచనా కేంద్రాలు విడుదల చేసిన తాజా నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి.ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతల్లో సంభవించే మార్పు. సాధారణంగా పసిఫిక్లో వీచే ట్రేడ్ విండ్స్ వేడి నీటిని ఆసియా వైపు నెట్టేస్తుంటాయి. కానీ ఎల్ నినో సమయంలో ఆ గాలులు బలహీనపడతాయి. ఫలితంగా వేడి నీరు మధ్య, తూర్పు పసిఫిక్ వైపు వ్యాపిస్తుంది. ఈ ఒక్క మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా గమనించే "నినో-3.4" ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 0.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఎల్ నినో ప్రకటించేందుకు అవసరమైన 0.5 డిగ్రీల పరిమితిని ఇది దాటేసింది. డిసెంబర్ నాటికి ఈ వ్యత్యాసం 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని యూరోపియన్ ఫోర్కాస్ట్ మోడళ్లు సూచిస్తున్నాయి.అదే జరిగితే 1997-98, 2015-16 సూపర్ ఎల్ నినో రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి "గాడ్జిల్లా ఎల్ నినో" అనే పేరు పెట్టారు. గాడ్జిల్లాలా.. ఈ ఎల్ నినో కూడా ప్రపంచ వాతావరణ వ్యవస్థపై భారీ ప్రభావం చూపవచ్చని భావించి ఆ పేరు పెట్టారు. భారత్పైనే ఎక్కువ ఎందుకు?గాడ్జిల్లా ఎల్నినో గురించి భారత్ ఎక్కువగా ఆందోళన చెందడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దేశంలో ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో దాదాపు 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. వ్యవసాయ భూముల్లో సగానికి పైగా ఇప్పటికీ వర్షాధారంగానే సాగవుతున్నాయి. అందుకే వర్షాకాలంలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం కోట్లాది మంది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడుతుంది.సాధారణంగా ఎల్నినో సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వర్షాలను తీసుకొచ్చే గాలి ప్రవాహాలు తూర్పు వైపుకు మళ్లుతాయి. దీంతో భారత ఉపఖండానికి చేరాల్సిన తేమ తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదవడం జరుగుతుంది.ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. 1971-2020 మధ్యకాల సగటుతో పోలిస్తే ఈసారి కేవలం 90 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, లోటు వర్షాలు నమోదయ్యే అవకాశం 60 శాతం వరకు ఉందని హెచ్చరించింది.అయితే సమస్య కేవలం వర్షాలు తగ్గడమే కాదు. వర్షాలు తగ్గితే ముందుగా దెబ్బతినేది వ్యవసాయ రంగం. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల వంటి పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రైతుల ఆదాయం పడిపోవచ్చు. భూగర్భ జలాల నిల్వలు తగ్గవచ్చు. జలాశయాలు పూర్తిస్థాయిలో నిండకపోతే తాగునీటి, సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.దీని ప్రభావం చివరికి సాధారణ ప్రజలపై కూడా పడుతుంది. పంటల ఉత్పత్తి తగ్గితే కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్నినోను కేవలం వాతావరణ ఘటనగా కాకుండా.. వ్యవసాయం, ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే కీలక పరిణామంగా చూస్తున్నారు.గతం ఏం చెబుతోందంటే..1997-98లో ప్రపంచం అత్యంత శక్తివంతమైన ఎల్ నినోను చూసింది. 2015-16లో మరోసారి సూపర్ ఎల్ నినో నమోదైంది. ఆ సమయంలో భారత్లో సాధారణం కంటే కేవలం 86 శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. పలు రాష్ట్రాలు కరువు బారిన పడ్డాయి. వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే అప్పట్లో భారత్కు ఒక రక్షణ కవచం లభించింది. అదే ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD). 1997లో బలమైన పాజిటివ్ IOD ప్రభావంతో ఎల్ నినో దెబ్బ కొంతవరకు తగ్గింది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలోనే ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అంటే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించే సహజ మిత్రుడు ఈసారి భారత్కు అందుబాటులో ఉండకపోవచ్చు.ఎల్ నినోను భారత్ వర్షాకాలానికి విలన్గా భావిస్తే.. ఐవోడీని హీరోగా చెప్పొచ్చు. ఎల్ నినో వల్ల తగ్గే వర్షాలను కొంతవరకు భర్తీ చేసి, దేశాన్ని కరువు ముప్పు నుంచి కాపాడే శక్తి దీనికి ఉంటుంది. అదెలాగంటే.. ఎల్ నినో వల్ల భారత్లో వర్షాలు తగ్గే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో భారత మహాసముద్రంలో ఏర్పడే ఐవోడీ వాతావరణ పరిస్థితి కొన్నిసార్లు రక్షకుడిలా పనిచేస్తుంది. ఇది అనుకూలంగా ఉంటే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించి, భారత్కు అదనపు వర్షాలు కురిసేలా సహాయపడుతుంది.ప్రపంచంపై ప్రభావం..అలాగని గాడ్జిల్లా ఎల్ నినో ప్రభావం భారత్కే పరిమితం కాదు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అడవి మంటలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా, పెరూ, ఈక్వెడార్ వంటి దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ప్రపంచ ఆహార ఉత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంట దిగుబడులు తగ్గితే ఆహార ధరలు పెరగవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సరఫరా సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.కరువు ఖాయమేనా?కచ్చితంగా కాదు. ఎల్ నినో ఒక ప్రమాద సంకేతం మాత్రమే. అది తుది ఫలితం కాదు. వర్షాకాలాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతలు, గాలి ప్రవాహాల తీరు వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినా సరే.. ప్రపంచ వాతావరణ నిపుణులు ఇప్పుడు పసిఫిక్పై ప్రత్యేక నిఘా పెట్టడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇది సాధారణ ఎల్ నినో కాదనే సంకేతాలు కనిపిస్తుండడమే. నోట్: ఇది వివిధ వాతావరణ సంస్థలు, శాస్త్రవేత్తల అంచనాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణాత్మక కథనం మాత్రమే. వాతావరణ పరిస్థితులు మారే కొద్దీ అంచనాలు, ప్రభావాలు కూడా మారే అవకాశం ఉంటుంది. -
పని భారం.. ఏఐతో దూరం!
2025 నవంబర్–2026 జనవరి మధ్య కాలంలో యూఎస్ఏ, యూకే, జర్మనీ ఆస్ట్రేలియాల్లో ఎన్బీఈఆర్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ‘ఫర్మ్ డేటా ఆన్ ఏఐ’ నివేదికను విడుదల చేసింది. ఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన 6 వేల మంది సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, జర్మన్ బుందెస్ బ్యాంక్, ఆస్ట్రేలియాలోని మాక్వారీ యూనివర్సిటీ ³రిశోధక బృందాలు సంయుక్తంగా ఈ డేటాను సేకరించాయి.సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) అనేది ఓ సాధారణ ఉద్యోగి రోజువారీ పనిభారాన్ని 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ తగ్గించగలదు. పునరావృతమయ్యే పనులను స్వయంచాలకం చేయడం, సమాచారాన్ని సంగ్రహించడం, భావ ప్రసారాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా ఆధునిక ఏఐ సాధనాలు ఉద్యోగులకు విలువైన సమయాన్ని ఆదా చేస్తున్నాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్బీఈఆర్) వంటి సంస్థల వాస్తవ–ప్రపంచ ప్రభావ అధ్యయనాలను బట్టి చూస్తే.. పని సంక్లిష్టతను బట్టి 14% జనరేటివ్, 30% ఏఐ సహాయకాలు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచగలవని నిరూపితమవుతోంది. ఏమిటీ అధ్యయనం ?ఏయే రంగాలు ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఏ రంగాలపై దీని ప్రభావం ఎక్కువ పడనుందో వంటి వివరాలు పొందుపరిచింది. ఆ నివేదిక ప్రకారం వివిధ రంగాలపై ఏఐ ప్రభావం, వినియోగ విధానం ఎలా ఉందంటే...సమాచార, కమ్యూనికేషన్ల రంగం: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఏఐని అత్యధికంగా వాడుతున్నాయిఅడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ సర్వీసెస్ : ఆఫీస్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి పనులలో ఏఐ వాడకం చాలా ఎక్కువగా ఉంది⇒ హోల్సేల్, రిటైల్ వ్యాపారం, ఫుడ్ సర్వీసెస్, హోటళ్లు, క్యాటరింగ్ రంగాలు⇒ చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏఐ టూల్స్ను వేగంగా స్వీకరిస్తున్నాయిఅధిక జీతాలు ఇచ్చే కంపెనీలు : ఉద్యోగులకు మంచి వేతనాలు ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థలలో ఏఐ ప్రయోగాలు, దాని ద్వారా వచ్చే ఉత్పాదకత లాభాలు ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చిందిమొత్తంగా చూస్తే, శారీరక శ్రమ లేదా సాధారణ క్లరికల్ పనులు ఎక్కువగా ఉండే రంగాల కంటే, సమాచార విశ్లేషణ, కమ్యూనికేషన్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లోనే ప్రస్తుతం ఏఐ విప్లవం వేగంగా విస్తరిస్తోంది.భారత్లో ఏఏ రంగాల్లో ఏఐ ప్రభావం అధికం ?ఐటీ మరియు టెక్నాలజీ సర్వీసెస్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ ఆటోమేషన్ వల్ల 10% నుంచి 20% వరకు ఉత్పాదకత పెరిగిందిబ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) : లోన్ ప్రాసెసింగ్, రిస్క్ అసెస్మెంట్, కస్టమర్ సపోర్ట్ (ఏఐ చాట్బాట్స్) విభాగాల్లో పనిభారం భారీగా తగ్గిందిరిటైల్, ఈ–కామర్స్ (రిటైల్,కన్జూమర్ గూడ్స్) : కస్టమర్ల అవసరాలను అంచనా వేయడానికి, సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం ఏఐని ఎక్కువగా వాడుతున్నారుఉద్యోగాల మార్కెట్–భవిష్యత్ (2026 – 2031): ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్. నాస్కామ్ నివేదికల ప్రకారం ఇండియాలో ఏఐ సంబంధిత ఉద్యోగాల డిమాండ్ 10 లక్షలు దాటింది⇒ ప్రపంచంలోనే ఏఐ టాలెంట్ను ఆకర్షించడంలో భారత్ (33% హైరింగ్ రేటుతో) ముందుందినీతి ఆయోగ్ అంచనా : భారత్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తే, టెక్, కస్టమర్ సర్వీస్ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య రాబోయే రోజుల్లో కోటి దాటే అవకాశముంది. ⇒ ఒకవేళ కంపెనీలు అప్గ్రేడ్ అవ్వకపోతే ఉద్యోగాల కోత తప్పదని ఈ నివేదిక హెచ్చరించిందిభారత్ మెరుగైన స్థితిలోనే...ఇండియాలో ఏఐ వినియోగం..దాని వల్ల పెరుగుతున్న ఉత్పాదకత, ఉద్యోగాలపై ప్రభావం గురించి నాస్కామ్, ఈవై, నీతి ఆయోగ్ వంటి సంస్థల నివేదికలు కీలక వివరాలను వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐని వేగంగా స్వీకరిస్తున్న దేశాల్లో మనదేశం అగ్రస్థానంలో ఉంది. మనదేశంలో ఏఐ కేవలం ఒక ప్రయోగంలా కాకుండా, ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదకతను పెంచే ఒక కీలక శక్తిగా మారుతోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ఏఐ అడ్వాంటేజ్, ఉత్పాదకత సమయం ఆదాలో టాప్‘ఈవై 2025 వర్క్ రీఇమేజిన్డ్’ సర్వే ప్రకారం పనిలో ఏఐ ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంలో ప్రపంచంలోనే అత్యధికంగా 53 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది (ప్రపంచ సగటు కేవలం 34 పాయింట్లు మాత్రమే)⇒ దాదాపు 75% మంది భారతీయ ఉద్యోగులు 72% మంది యజమానులు జనరేటివ్ ఏఐతో కార్యాలయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువుగా మారిందని అభిప్రాయపడ్డారుళీ భారత్లో కూడా కొత్తగా చేరిన లేదా తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల ఉత్పాదకత ఏఐ టూల్స్ వల్ల ఏకంగా 34% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి -
భారత్లోనే చౌకగా వంటగ్యాస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లోనే వంటగ్యాస్(ఎల్పీజీ) ధరలు ∙తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు పొరుగు దేశాల కంటే మన దగ్గరే గ్యాస్ సిలిండర్ ధర చాలా చౌకగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు ఫిబ్రవరి నుండి జూన్ నాటికి సుమారు 46 శాతం పెరిగాయి. దీంతో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ సరఫరా వ్యయం రూ.1,600 దాటింది. అయినప్పటికీ అంతర్జాతీయ ధరల భారాన్ని సామాన్య వినియోగదారులపై మోపకుండా తామే భరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ కోసం సాధారణ వినియోగదారుడు రూ.942 చెల్లిస్తుండగా, ప్రభుత్వం ప్రతి సిలిండర్పై దాదాపు రూ.700 నష్టాన్ని భరిస్తున్నట్లు పేర్కొంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలు గతేడాది రూ.60,000 కోట్లకు చేరగా, రూ.30,000 కోట్ల పరిహారం చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద దేశంలో 10.58 కోట్లకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి మొదటి నాలుగు సిలిండర్లపై ఒక్కో సిలిండర్కు రూ.300 చొప్పున (ఏడాదికి రూ.1,200) చెల్లిస్తోంది. దీనివల్ల ఉజ్వల వినియోగదారులకు సిలిండర్ కేవలం రూ.642కే లభిస్తోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే దాదాపు 60 శాతం తక్కువ అని కేంద్రం పేర్కొంది. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని 32 టీఎంటీల నుండి 52 టీఎంటీలకు 60 శాతం పైగా) పెంచింది. అల్జీరియా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుండి ఎల్పీజీని దిగుమతి చేసుకుని దేశంలో ఎక్కడా వంటగ్యాస్ కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లు కేంద్రం గుర్తుచేసింది. -
కృత్రిమ మాయలో మనిషి
‘కృత్రిమ మేధ’గా మనం చెప్పుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ‘కపటి’ అనే అర్థంలో నిజంగానే కృత్రిమంగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలుగులో ‘నకిలీ తెలివి’ లాంటి మాటల్ని వెతుక్కునే లోపలే అది నకిలీ విన్యాసాలలో చిత్రవిచిత్రమైన లోతులు చూస్తోంది. ఒక చేత్తో సానుకూలపు పూల బాణాలనూ, ఇంకోచేత్తో ప్రతికూలపు వాడిబాణాలనూ ప్రయోగిస్తూ జనాన్ని ఏకకాలంలో మోహపారవశ్యంలోనూ, భయవిభ్రమాల్లోనూ ముంచెత్తుతోంది. అనుకూల ఫలితాలపై ఆశపడుతూనే, ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకునే మార్గాల వేటలో ప్రపంచం తలమునకలవుతోంది. భారత్, చైనా, రష్యా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి కృత్రిమ మేధో వినియోగంలో, అభివృద్ధిలో, దానితో ముడిపడిన నైతిక సమస్యల నివారణలో, మేధో హక్కులూ, డేటా పరిరక్షణలో కలసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, సాంస్కృతిక రంగంలో కృత్రిమ మేధో దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుపుతోంది; ఒక సమావేశానికి ప్రపంచ పురాతన నగరాలలో ఒకటైన వారణాసి వేదిక కాబోతోంది. కృత్రిమ మేధ ఏం చేస్తోందంటే, ఒక సాంకేతిక మహాద్భుతంగా మాయామేయ మాంత్రిక జగత్తును సృష్టిస్తూ పురాణ, ఇతిహాస, జానపద కథల కాలంలోకి తీసుకెడుతోంది. రామాయణంలో భర్త శాపానికి గురై అహల్య శిలగా మారిపోవడం, రాముని పాదాలు తాకగానే పూర్వరూపం తెచ్చుకోవడం గురించి చదివాం; ‘జగదేకవీరుని కథ’ సినిమాలో జలక్రీడలాడుతున్న దేవకన్యలను చూసిన పాపానికి వారి శాపానికి ఎరై కథానాయకుడు శిలగా మారిపోవడం, ఒక వృద్ధ మహిళ అతనికి శాపవిముక్తి కలిగించడం చూశాం. త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో అతణ్ణి మధ్యలోనే స్తంభింపజేసి ‘త్రిశంకు స్వర్గా’న్ని సృష్టించిన విశ్వామిత్రుని పునఃసృష్టి పాటవాన్ని కథల్లో దర్శించాం. రామాయణంలో ఇంద్రజిత్తు చేసే మబ్బుచాటు మాయావి యుద్ధాన్నీ, మహాభారతంలో సైంధవుని వధ సందర్భంలో కృష్ణుడు చక్రం అడ్డేసి కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడాన్నీ తిలకించాం. తన అర్ధాంగి పార్వతి అభ్యంగన స్నానానికి వెడుతూ నలుగుపిండి నుంచి సృష్టించి కాపలాపెట్టిన బాలుడు తనను అడ్డగించినందుకు శివుడు ఆగ్రహించి అతని శిరస్సును ఖండించడం; నిజం తెలిసి అతనికి ఏనుగు తలను అతికించి, బతికించడం గురించి విన్నాం. తలలు తీసి తలలు పెట్టడంతో సహా కృత్రిమ మేధ ఇలాంటి చిత్రవిచిత్ర సన్నివేశాలను అవలీలగా సృష్టించగలుగుతోంది. అవి కపటత్వపు అంచులు తాకుతూ ప్రసిద్ధ వ్యక్తుల శీలహననానికి పాల్పడుతూ వివాదాస్పదమవుతున్నాయి; నిజమో, అబద్ధమో తెలియని త్రిశంకు స్థితికి జనాన్ని నెడుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీనటులతో సహా ప్రముఖుల రూపాలనూ, గొంతులనూ వాడుకుంటూ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. పూర్తి సాంకేతిక నైపుణ్యాలూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలనే స్పృహ లేనివారికి కూడా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడం వల్ల తలెత్తే ఇలాంటి వైపరీత్యాలతో కూడా పురాణ, ఇతిహాస కథలతో పోలిక కుదరడం మరో వైచిత్రి. ఉదాహరణకు, మహాభారతంలోని అశ్వత్థామతో ముడిపడిన ఒక ఉదంతాన్నే చూస్తే, కురుక్షేత్ర యుద్ధాంతంలో అతను ఉపపాండవులను వధించి పారిపోయినప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి భీముడు బయలుదేరివెడతాడు; అశ్వత్థామ క్రూరుడనీ, చపలచిత్తుడనీ; అతని దగ్గర ‘బ్రహ్మశిరోనామక’మనే దివ్యాస్త్రం ఉందనీ, దాని ప్రయోగమే తప్ప ఉపసంహారం అతనికి తెలియదనీ కృష్ణుడు అర్జునుడితో చెప్పి భీముని కాపాడుకోవడానికి తక్షణమే వెళ్ళాలంటాడు; ఊహించినట్టే అశ్వత్థామ దానిని ప్రయోగించడం, ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసిన అర్జునుడు అదే అస్త్రంతో దానిని శాంతింపచేయబోవడం చూస్తాం. మనిషి– తన మేధ సృష్టించిన కృత్రిమ మేధముందు తనే చిత్తవుతున్నాడు. మాంత్రికతనుంచి వాస్తవికతవైపు వెడుతున్న భ్రమలో ఉన్న మనిషిని కృత్రిమ మేధ తిరిగి మాంత్రికతవైపు మళ్ళిస్తూ పైచేయిని చాటుకుంటోంది. తను సృష్టించిన సాంకేతికత చేతిలో తనే ఓడి దిక్కులు చూసే పరిస్థితిని తెచ్చుకోవడం మనిషిని తొలినుంచి వెంటాడుతున్న శాపం. -
కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్ Z ఇలా ఉందేంటి?
బొద్దింక అంటే ఏంటి? ఒక పురుగా, ఒక కీటకమా, లేక అసంతృప్తితో ఉన్న భారతీయ యువకుడిని అలా పిలుస్తున్నారా? కొత్తగా రూపుదిద్దుకుంటున్న "కాక్రోచ్ జనతా పార్టీ"ని ఇష్టపడుతున్న వారిని అడిగితే ‘‘పైవి అన్నీ’’ అనే సమాధానం వస్తుంది. ఇప్పటివరకు ఇది వ్యంగ్యంగా పుట్టిన ఒక ఆసక్తికర గ్రూప్ మాత్రమే. ఇదొక క్వాసీ రాజకీయ పార్టీ. అంటే పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాకపోయినా, రాజకీయ లక్ష్యాలు ఉన్న పార్టీ లేదా రాజకీయాలపై ప్రభావం చూపే గ్రూపు.కానీ భారత ప్రజాస్వామ్య ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తిగా ఉన్న దేశ యువతకు తామే ప్రతినిధులమని ఇది చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని మిలియన్ల మంది అలా భావిస్తున్నారు. అయితే, ఇది క్షణికావేశం, కొన్ని రోజుల్లో నిరుగారిపోయే ఉత్సాహమేనా?కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆన్లైన్ జోక్గా మొదలైంది. నిరుద్యోగ యువతపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఇది పుట్టుకొచ్చింది. ఆ మీమ్ వేగంగా వ్యాపించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మిలియన్ల మంది దాని సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించడం మొదలుపెట్టారు. చాలా మంది వ్యాఖ్యాతలు వెంటనే దీన్ని బీజేపీ వ్యతిరేక ఉద్యమంగా అభివర్ణించారు. కానీ అది కథలో సగం మాత్రమే.పెద్ద సందేశం ఏమిటంటే, ఎన్నికల్లో యువత భాగస్వామ్యం భారీ స్థాయిలో ఉందని గణాంకాలు చూపుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలకు అదే బలమైన కొలమానం. అనేక దేశాల్లో జెన్ జీ ఓటర్లు రాజకీయాలను చాలా భిన్న దృష్టితో చూస్తున్నారు. భారతదేశంలో వారిలో చాలా మంది బీజేపీ పాలన కాలంలోనే (2014 నుంచి ఇప్పటివరకు) పెరిగారు. ఉద్యోగాలు, జీవన వ్యయం, గృహాలు, రవాణా, స్వచ్ఛమైన గాలి, మెరుగైన ప్రజా సేవలు. ప్రస్తుత రాజకీయ వర్గం ఈ ప్రాథమిక అవసరాలను అందిస్తోందా? అని చాలా మంది భావిస్తున్నారు. ఆ అసంతృప్తి కొత్త గొంతుకలకు, కొత్త మార్పులకు అవకాశం కల్పిస్తోంది.అయితే, సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రజాదరణ ఎన్నికల వేళ ఉండే ప్రజాదరణతో సమానం కాదు. మిలియన్ మంది ఫాలో అయ్యే వారు ఉన్నారంటే, అదే మిలియన్ మంది ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. వాస్తవానికి మిలియన్ మంది అనుసరించే ఒక ఇన్ఫ్లూయెన్సర్ నిజమైన ఎన్నికల్లో కొన్ని వందల ఓట్లు కూడా పొందడంలో ఇబ్బంది పడవచ్చు. ఆన్లైన్లో ఎవరినైనా అనుసరించడానికి ఒక ట్యాప్ చాలు. కానీ ఓటు వేయడానికి నిబద్ధత, వ్యవస్థీకరణ, విశ్వాసం, ఓటర్ల హాజరు అవసరం.కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నటికీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా కనుమరుగైపోవచ్చు. కానీ దాన్ని తక్కువ అంచనా వేయడం కూడా పొరపాటే. ఎందుకంటే ఉద్యమాలు తరచుగా హాస్యం, అసంతృప్తితోనే మొదలవుతాయి.అప్పట్లో భారత్ అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం ప్రజల ఆగ్రహానికి వ్యక్తీకరణగా మొదలైంది. నెట్వర్క్లు, చర్చలు, పౌరుల భాగస్వామ్యంతో అది వేగం అందుకుంది. మిలియన్ల మంది ఒక జోక్ (సీజేపీ వంటి) వెనుక నిలబడినప్పుడు, ఆ జోక్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దాన్ని ఏ రాజకీయ వర్గమైనా వినడం మంచిది. -
న్యూఢిల్లీలో ఇండి కూటమి నేతలు.. భేటీపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: ఇండి కూటమి సమావేశంలో పాల్గొనడానికి కీలక నేతలు ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. జూన్ 8న జరగనున్న ఇండియా బ్లాక్ సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత జరుగుతున్న తొలి ఇండియా బ్లాక్ సమావేశం ఇదే.కొన్ని రోజులు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే, డీఎంకే కూడా మద్దతు తెలుపుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఇండి కూటమి సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మీడియాతో స్పందిస్తూ.. ప్రతిపక్ష కూటమి ఐక్యంగానే ఉందని, కొన్ని పార్టీలు పలు కారణాల వల్ల సమావేశానికి హాజరు కాకపోయినా ఐక్యత దెబ్బతినలేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరగనున్న సమావేశానికి 23 రాజకీయ పార్టీలు హాజరవుతాయని ప్రకటించారు. సమావేశానికి రాకపోయినా, ఆ పార్టీలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశాయని రమేశ్ చెప్పారు."మోదీ ప్రభుత్వం కోట్లాది భారతీయుల ఓటు హక్కును హరించే చర్యలు చేపడుతోంది. రాజ్యాంగంపై ప్రతిరోజూ దాడి చేస్తోంది. దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోంది. కోట్లాది ప్రజల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. నిరంతర ద్రవ్యోల్బణంతో కుటుంబాల బడ్జెట్లను దెబ్బతీస్తోంది. లక్షలాది యువత ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోంది. పెట్టుబడి వాతావరణాన్ని బలహీనపరుస్తోంది. విదేశాంగ విధానం ద్వారా జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. భారత్ మాదిరిగానే ఇండియా జనబంధన్ తన వైవిధ్యంతో ఐక్యంగా నిలుస్తోంది" అని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు.ఇండియా బ్లాక్ సమావేశానికి ప్రాధాన్యం పెరిగింది. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఒకవైపు ఉంటే, కూటమిలోని అంతర్గత విభేదాలు మరోవైపు ఉన్నాయి.తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయంతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సమావేశానికి హాజరుకాబోమని తెలియజేస్తూ రాసిన లేఖలో.. దేశ సంక్షేమాన్ని ప్రభావితం చేసే అంశాలపై ఇతర పార్టీలు లేవనెత్తే విషయాలకు తాము ఎప్పటిలాగే మద్దతుగా ఇస్తామని డీఎంకే పేర్కొంది. -
భారత్లో జననాల రేటుపై ఎలన్ మస్క్ సంచలన పోస్ట్
ఇటీవల కాలంలో భారతదేశంలో పడిపోతున్న జననాల రేటును ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ ఎత్తిచూపారు. సంతానోత్పత్తి రేటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదొక పెద్ద హెచ్చరిక అంటూ ట్వీట్ చేసిన ఆయన.. దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి స్థాయి క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. వివరాలతో డేటాను కూడా షేర్ చేశారు. జనాభా పరిమాణాన్ని స్థిరంగా ఉంచడానికి అవసరమైన స్థాయి కంటే కిందకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతుల్లో భారతదేశ జననాల రేటు చాలా ఏళ్ల క్రితమే భర్తీ స్థాయి కంటే తగ్గిపోయిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా మొత్తం సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ స్థాయి కంటే కిందకు పడిపోయింది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశ ప్రస్తుత టి.ఎఫ్.ఆర్ 1.9 శాతానికి క్షీణించింది. దీర్ఘకాలికంగా దేశంలో జననాల రేటు తగ్గుముఖం పడుతోందనే వాస్తవానికి ఈ నివేదిక అద్దం పడుతోంది.India’s birth rate has fallen below replacement. Among those most educated, India’s birth rate fell below replacement many years ago. https://t.co/RsWf0PK6wx— Elon Musk (@elonmusk) June 6, 2026వలసలతో సంబంధం లేకుండా, ఒక తరం నుండి తదుపరి తరానికి జనాభా స్థిరంగా (తగ్గకుండా లేదా పెరగకుండా) కొనసాగడానికి అవసరమైన సగటు సంతానోత్పత్తి రేటును 'రీప్లేస్మెంట్ స్థాయి' అంటారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీనిని 2.1 గా పరిగణిస్తారు. భారతదేశ టీఎఫ్ఆర్ ఇప్పుడు 1.9 కి పడిపోవడం అంటే దేశం క్రమంగా స్థిరమైన జనాభా నిర్మాణం వైపు దూసుకుపోతోందని అర్థం. జాతీయ సగటు 1.9 గా ఉన్నప్పటికీ.. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య జనాభా పరంగా పెద్ద వ్యత్యాసమే కనిపిస్తోంది. అత్యధిక టీఎఫ్ఆర్ కలిగిన రాష్ట్రంగా బిహార్ (2.9) ఉండగా.. అత్యల్ప టీఎఫ్ఆర్ కలిగిన ప్రాంతంగా ఢిల్లీ (1.2) ఉంది. గత దశాబ్దంలో ఢిల్లీ అత్యంత వేగంగా పతనాన్ని నమోదు చేయగా.. బిహార్లో చాలా నెమ్మదిగా తగ్గుదలను చూపిస్తోంది.దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈ సంతానోత్పత్తి రేటు అత్యంత ఆందోళనకరంగా 1.4 నుండి 1.6 మధ్యకు పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఇది ఏకంగా 1.2 కి తగ్గిపోయింది. అయితే, దీనికి భిన్నంగా ఉత్తర భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ రేటు రీప్లేస్మెంట్ లెవెల్ కంటే అధికంగానే నమోదు అవుతుండగా.. దేశవ్యాప్తంగా సగటు రేటు పడిపోతుండటం వల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గి పోవడం... వృద్ధుల జనాభా భారం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
2030 నాటికి 20% మార్కెట్ వాటా
న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ రంగం 2030 నాటికి ఏటా 60 లక్షల వాహనాల విక్రయాల దిశగా భారీగా వృద్ధిని సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో అందులో దాదాపు 12 లక్షల వాహన విక్రయాలు తమవే ఉండాలని టాటా మోటర్స్ నిర్దేశించుకుంది. తద్వారా 20 శాతం పైగా మార్కెట్ వాటాను దక్కించుకోవాలని టాటా మోటర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గోవాలో జరిగిన టాటా మోటార్స్ డీలర్ల వార్షిక బిజినెస్ ప్లానింగ్ సమావేశం–2026లో టాటా సన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక మైలురాయిని అందుకునేందుకు రూ. 35,000 కోట్ల భారీ మూలధన పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ కట్టుబడి ఉందన్నారు. మార్కెట్ పురోగతిని బట్టి ఈ ప్రణాళికను మరింత విస్తరిస్తామని చెప్పారు. డీలర్లదే కీలక పాత్ర టాటా మోటార్స్ భవిష్యత్ విజయం డీలర్ల చేతుల్లోనే ఉందని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ‘‘కంపెనీ తరఫున కొత్త మోడళ్లు, ఆవిష్కరణలను వేగంగా మార్కెట్లోకి తీసుకువస్తాము. అయితే సేల్స్ అనుభవం, సరీ్వస్ నాణ్యత, కస్టమర్ల నమ్మకాన్ని పొందడంలో డీలర్ నెట్వర్క్ బలంగా పనిచేసినప్పుడే అనుకున్న మైలురాళ్లను చేరుకోగలము’’ అని చంద్రశేఖర్ వివరించారు. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు రాణించే సంస్థలే నిజమైన గొప్ప కంపెనీలుగా నిలుస్తాయన్నారు. ఇందుకోసం డీలర్లందరూ సరికొత్త ఆలోచనా దృక్పథంతో ముందుకు సాగాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.అప్పట్లో వ్యాపారం మూసేయమన్నారు .. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ‘‘2017లో ప్యాసింజర్ వాహనాల (కార్ల) వ్యాపారం మూసివేసి, కేవలం కమర్షియల్ వాహనాలపైనే దృష్టి పెట్టాలని కంపెనీలో చర్చలు జరిగాయి. కానీ, మనమందరం కలిసి సాధించిన కృషి కారణంగా ఈ రోజు భారతీయ కార్ల మార్కెట్లో టాప్–2 స్థానాల్లో ఒకటిగా గర్వంగా నిలబడ్డాం’’ అని చంద్రశేఖరన్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో కంపెనీ సాధించిన నాయకత్వాన్ని, నిలకడగా మెరుగుపడుతున్న ఆర్థిక పనితీరును ఆయన కొనియాడారు. -
ఆర్థిక వృద్ధి పెంపునకు ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆర్థిక సలహా మండలి(ఈఏసీ) సభ్యులతో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పశ్చిమాసియా సంఘర్షణ భారతదేశం, ప్రపంచంపై చూపే ప్రభావం పట్ల తమ అంచనాను ఈఏసీ సభ్యులు ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘ఈరోజు ఆర్థిక సలహా మండలి సమావేశానికి అధ్యక్షత వహించా. దేశ ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాధాన్యతలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించాం. సంస్కరణల ప్రయాణానికి మరింత ఊపునివ్వడంతోపాటు సులభతర జీవనం, సులభతర వాణిజ్యంపై మా అభిప్రాయాలు పంచుకున్నాం’’అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ ఆర్థికాభిృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా వివిధ ఆలోచనలు, చర్యలపై ఈఏసీ భేటీలో చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి. సులభతర జీవనం, సులభతర వాణిజ్యాన్ని మరింత మెరుగుపర్చడమే ధ్యేయంగా పలు సంస్కరణలపైనా చర్చించినట్లు వెల్లడించాయి. ఈఏసీ అనేది కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి ఆర్థిక, సంబంధిత అంశాలపై సలహాలు ఇచ్చే ఒక స్వతంత్ర సంస్థ. ప్రస్తుతం ఈఏసీలో ఛైర్మన్, ముగ్గురు పూర్తికాల సభ్యులు, 11 మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు. ఎస్.మహేంద్ర దేవ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి సూచించిన ఆర్థిక లేదా ఇతర ఏ అంశాన్నైనా విశ్లేషించి, దానిపై ఆయనకు సలహా ఇవ్వడం, ఆర్థిక ప్రాముఖ్యత గల సమస్యలను పరిష్కరించి, వాటిపై ప్రధానమంత్రికి అభిప్రాయాలను సమర్పించడం ఈఏసీ బాధ్యత. -
భారత్పై ఆంక్షలు విధిస్తే బూమరాంగే!
సెయింట్పీటర్స్బర్గ్: నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న భారతదేశంపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే వెంటనే మానుకోవాలని రష్యా అధినేత పుతిన్ హితవు పలికారు. ఆంక్షల బెదిరింపుల ద్వారా భారత సార్వభౌమతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే తక్షణమే పెద్ద ఎదురుదెబ్బ(బూమరాంగ్) తగులుతుందని తేల్చిచెప్పారు. శుక్రవారం సెంటర్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పుతిన్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఎల్లప్పుడూ ఒక సార్వభౌమ దేశంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆంక్షల బెదిరింపులతో భారత్ను లొంగదీసుకోలేరని పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రధాని మోదీతో తాను చాలాకాలంగా సన్నిహితంగా చర్చలు జరుపుతున్నానని తెలిపారు. అమెరికాలోకి ప్రవేశించకుండా మోదీపై గతంలో నిషేధం విధించారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని మోదీ ఎప్పటికీ మర్చిపోలేరన్న సంగతి తనకు తెలుసని అన్నారు. మోదీ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఆయనపై అన్ని ఆంక్షలను తొలగించారని పేర్కొన్నారు. తనకు తెలిసినంతవరకు అమెరికా, భారత్ల మధ్య సంబంధాలు విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. పుతిన్ ఇంకా ఏం చెప్పారంటే.. ఆ స్వేచ్ఛ భారత్కు ఉంది ‘‘భారత్ ఒక సార్వభౌమ దేశం. అత్యంత ఆధునికమైనవి, అనువైనవి, ఉత్తమ ధరకు లభించే ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్కు ఉంది. అందించేవిగా భావించే ఉత్పత్తులను ఎంచుకోవడానికి దానికి స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏమనుకున్నప్పటికీ సొంత ప్రయోజనాల పరిరక్షణ విషయంలో భారత్ రాజీపడడం లేదు. ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. నచ్చిన దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం భారత్ హక్కు. భారత్–రష్యా బంధం ఇతర భాగస్వాముల బంధం లాంటిది కాదు. భారత్తో రష్యా సహకారం కూడా రాజకీయ వాతావరణానికి లోబడి ఉండదు. మమ్మల్ని ఎవరూ శాసించలేరు. మాకు ఎవరూ ఆదేశాలు ఇవ్వలేరు. అలా చేయడానికి ఎవరూ ప్రయత్నించరు కూడా. మేము ఎల్లప్పుడూ సరైనదని భావించిన దానినే చేస్తాం. భారత్ వంటి విలువైన భాగస్వాములకు ఇచ్చిన హామీలకు ఎల్లప్పుడూ మేము కట్టుబడి ఉంటాం. భారత్, రష్యా స్నేహానికి పరస్పర విశ్వాసమే పునాది. భారతీయ మిత్రులతో మా సంబంధాలు ప్రత్యేకమైనవి. మేము కేవలం వాణిజ్యంపైనే దృష్టి పెట్టడం లేదు. కొనుగోలు, అమ్మకాలపైనే కాకుండా, ఉమ్మడి పరిశోధనలు, అభివృద్ధిపైనా దృష్టి పెట్టాం. బ్రహ్మోస్ మధ్యశ్రేణి క్షిపణి రూపకల్పనపై ఇరు దేశాల నిపుణులు కలిసి పని చేస్తున్నారు’’అని పుతిన్ స్పష్టంచేశారు. -
అమెరికాలో అక్రమ వలసదారులు.. భారత్ కీలక ప్రకటన
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఎట్టి పరిస్థితుల్లో వారు దేశంలోకి ఉండనిచ్చేది లేదంటూ ఎన్నో కఠిన నిబంధనలు తీసుకవచ్చి వారిని దేశం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనేఅమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు భారత్ ప్రకటించింది. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు ప్రకటించారు. "2026లో ఇప్పటివరకూ 1,076 మంది బహిష్కరణకు గురయ్యారు. అదే గతేడాది మెుత్తంగా 3,567 మంది బహిష్కరణకు గురయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉంది. అయినప్పటికీ ఇది అధికమే" అని జైశ్వాల్ అన్నారు. దేశ బహిష్కరణకు గురైన వారిలో సరైన పత్రాలు లేకపోవడంతో పాటు వీసా ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఉన్నారని పేర్కొన్నారు.అక్రమ వలసల విషయమై భారత్, అమెరికా దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని అక్రమ వలసలను ఎలా అరికట్టాలి, అదే సమయంలో ఇది చట్టబద్ధమైన వలసలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా చూసుకోవాలి అనే దానిపై ఇరుదేశాలు దృష్టి సారించాయనిపేర్కొన్నారు. కాగా ఈ వారంలోనే భారత్కు చెందిన సుమారు 30 మంది వ్యక్తులు వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తూ అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు గుర్తించారు . వీరిని త్వరలోనే దేశ బహిష్కరణకు గురిచేసే అవకాశం ఉంది. -
భారత్ మా సోదర దేశం.. ఇండియాపై పుతిన్ ప్రశంసల వర్షం
-
ఎస్యూ–57 జెట్ను జట్టుగా తయారుచేద్దాం!
సెయింట్ పీటర్స్బర్గ్: చిరకాల మిత్రదేశం భారత్కు తమ శక్తివంతమైన అత్యాధునిక యుద్ధవిమానాలను సైతం ధారాదత్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. దీంతో భారత వైమానికదళం మరింత పటిష్టవంతమయ్యేందుకు పుతిన్ భారత్కు భారీ ఆఫర్ ఇచ్చారు. రష్యాలో రెండో అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్బర్గ్లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో భేటీలో పుతిన్ సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యా అభివృద్ధిచేసిన ఐదో తరం స్టెల్త్ రకం ‘ఎస్యూ 57’జెట్ను భారత్తో కలిసి దేశీయంగా మరింత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పుతిన్ వెల్లడించారు. ‘‘ఎస్యూ–57 రకం యుద్ధవిమానాన్ని మరింత అధునాతనంగా భారత్తో కలిసి, భారత్లో తీర్చిదిద్దేందుకు రష్యా సిద్ధంగా ఉంది. నిజానికి ఈ విమానాన్ని మేం సొంతంగా అభివృద్ధిచేశాం. కానీ ఇప్పుడు మిత్రదేశం భారత్లో తయారుచేసేందుకు ఆశపడుతున్నాం. ఈ విమానం విషయంలో ఎలాంటి షరతులు విధించదల్చుకోలేదు’’అని అన్నారు. ‘‘సమీకృత గగనతల రక్షణ వ్యవస్థల అభివృద్ధిలోనూ భారత్ను భాగస్వామిగా చేర్చుకోవాలని భావిస్తున్నాం. ఇతర యుద్ధరంగ ఉపకరణాల తయారీని సంయుక్తంగా ఆరంభిద్దాం. దీనిపై ఆలోచిస్తామని భారత్ గతంలోనే మాకు సమాచారం ఇచ్చింది’’అని పుతిన్ వెల్లడించారు. పుతిన్ ఆఫర్పై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ స్పందించారు. ‘‘రక్షణ రంగ సంబంధం అంశంలో మీకు అదనపు సమాచారం కావాలంటే రక్షణమంత్రిత్వ శాఖనే బదులు ఇవ్వగలదు’’అని ఆయన అన్నారు. భారత్ వైఖరేంటి? అంతర్జాతీయంగా మారిన రాజకీయ¿ౌగోళిక పరిస్థితులు, ఉక్రెయిన్, పశి్చమాసియా యుద్ధాలతో భారత్ రక్షణ ఉత్పత్తుల సరఫరాలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ముఖ్యంగా ఐదో తరం యుద్ధవిమానం కోసం వెతికి విసిగిపోయి చివరకు సొంతంగా తయారుచేయాలని నిశ్చయించుకుంది. ఇందులోభాగంగా ప్రతిష్టాత్మకంగా అత్యాధునిక బహుళార్థ యుద్ధవిమాన(ఏఎంసీఏ) ప్రాజెక్టుకు శ్రీకారంచుట్టింది. అయితే 2035లోపు ఈ విమానం అందుబాటులోకి వచ్చే అవకాశాలులేకపోవడంతో పుతిన్ ఆఫర్ను భారత్ అంగీకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భారత్–చైనా విషయంలో జోక్యం చేసుకోబోం ‘‘చైనా, భారత్ మధ్య సున్నితమైన ద్వైపాక్షిక సంబంధాల్లో రష్యా ఎన్నడూ జోక్యంచేసుకోలేదు. ఇకమీదటా కలగజేసుకోబోం. రెండు దేశాలతో రష్యా సంబంధాలు సహజమైనవి. సరిహద్దు అంశం సహా వివాదాస్పద అంశాలన్నింటినీ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నా. భారత్–రష్యా బంధం చైనాను ఇబ్బంది పెట్టదు. అలాగే రష్యా–చైనా బంధం భారత్ను ఇబ్బందిపెట్టదు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు విషయంపై చైనా, రష్యాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇక పాకిస్తాన్ అనేది చైనా కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకుంటోందని నేను భావించట్లేను’’అని అన్నారు. అలా చేస్తే అంతర్జాతీయ అస్థిరతే ‘‘భారత్–రష్యా బంధాన్ని తుంచేయాలని పశి్చమదేశాలు కుట్రలు పన్నుతున్నాయి. మా బంధం బలహీనమైతే అంతర్జాతీయ అస్థిరతకు దారితీస్తుంది. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైంది. భారత్తో రష్యా బంధం మరింత బలోపేతానికి కృషిచేస్తున్నాం. ప్రస్తుతమున్న 60 బిలియన్ డాలర్ల వాణిజ్యబంధాన్ని త్వరలో 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వాణిజ్యం, పెట్టుబడులు సహా ఇంధనం, ఫార్మాసూటికల్స్, హైడ్రోకార్భన్ల వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవాల్సిఉంది. చక్కటి ఆర్థికాభివృద్ధి సాధిస్తూ భారత్ ప్రపంచంలోని మేటి ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా రాణిస్తోంది. ఈ ప్రగతి ఒక్క రోజులో వచ్చిందికాదు. మోదీ నాయకత్వంలో ఎంతో శ్రమతో భారత్ అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. మా రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే దేశాలే చావుదెబ్బ తింటాయి’’అని పరోక్షంగా అమెరికాకు చురకలంటించారు. ‘‘ప్రధాని మోదీపై కొందరు(అమెరికా) ఒత్తిడిచేస్తున్నారు. ఎవరు ఒత్తిడి చేస్తున్నారనేది అనవసరం. మా దేశాల మధ్య సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి. భారత్ మాకు విశ్వసనీయమైన వ్యూహాత్మక భాగస్వామి’’అని పుతిన్ ఉద్ఘాటించారు.దేవుడికే తెలుసు 2036 ఏడాదిదాకా మీరే అధ్యక్షపీఠంపై కొనసాగుతారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ తనదైన రీతిలో బదులిచ్చారు. నాకు 73 ఏళ్లు. 1999 నుంచి అధికారంలో ఉంటున్నాను. వచ్చే అధ్యక్ష ఎన్నికలపై నాకు ఎలాంటి ఆలోచన లేదు. అప్పటిదాకా ఏమాత్రం ఆరోగ్యంగా ఉంటానో ఆ దేవునికే తెలియాలి. ఇవాళ ఇక్కడ కూర్చున్న మనందరం రేపు, ఎల్లుండి, ఆ తర్వాతి రోజులకు కూడా చేయాల్సిన విధులను నిర్వర్తిస్తామో లేదో ఎవరికీ తెలీదు’’అని పుతిన్ వ్యాఖ్యానించారు. పుతిన్ తొలిసారిగా 1999లో ప్రధాని అయ్యారు. తర్వాత అధ్యక్షునిగా, ఆ తర్వాత ప్రధానిగా పనిచేశారు. మళ్లీ అధ్యక్షపీఠాన్ని అధిరోహించారు. -
ఎన్ని రోజుల్లో ముగిస్తారు?
ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ టెస్టు క్రికెట్కు సిద్ధమైంది. గత నవంబర్లో తమ చివరి టెస్టు ఆడిన టీమిండియా ఇప్పుడు సొంతగడ్డపై బలహీన ప్రత్యర్థి అఫ్గానిస్తాన్తో తలపడుతుంది. ఎలాంటి ప్రమాణాల ప్రకారం చూసినా అఫ్గాన్కంటే ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న మన టెస్టు జట్టును నిలువరించడం ప్రత్యర్థికి అసాధ్యం కావచ్చు. ఎనిమిదేళ్ల క్రితం తమ తొలి టెస్టులో భారత్నే ఎదుర్కొన్న అఫ్గాన్ టీమ్ రెండు రోజుల్లోనే చిత్తుగా ఓడింది. ఇప్పుడు ఈ టెస్టు ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి. న్యూ చండీగఢ్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగం కాదు... ఇరు జట్ల మధ్య ఆటలో, అనుభవంలో ఎంతో అంతరం ఉంది... పైగా భారత్ తమ స్వదేశంలో ఆడుతోంది. ఇలాంటి స్థితిలో సహజంగానే భారత్, అఫ్గానిస్తాన్ మధ్య టెస్టు మ్యాచ్పై ఆసక్తి తక్కువగా కనిపిస్తోంది. వారం రోజుల క్రితం వరకు ఆరు ఐపీఎల్ మ్యాచ్లతో ఇంద్రధనుస్సులా కనిపించిన ముల్లాన్పూర్ స్టేడియంలో ఆకర్షణ తగ్గిపోయింది. 38 వేల సామర్థ్యం గల మైదానం తొలి టెస్టుకు వేదిక అవుతున్నా... ఐదు రోజులకు రూ. 250తో టికెట్లు నిర్ణయిస్తే టెస్టు మ్యాచ్ ఆరంభానికి రెండు రోజుల ముందు 1700 టికెట్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో నేటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ ఏకైక టెస్టులో ఢీకొంటున్నాయి. సుదర్శన్కు మరో చాన్స్... యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీ భారత్కు శుభారంభం అందిస్తే భారీ స్కోరుకు పునాది పడుతుంది. మూడో స్థానంలో ఇప్పటి వరకు సాయి సుదర్శన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా (6 టెస్టుల్లో కలిపి 302 పరుగులు)... కోచ్ గంభీర్ అతనిపై నమ్మకం ఉంచాడు. సుదర్శన్కు మరిన్ని అవకాశాలు ఇస్తామని స్పష్టంగా చెప్పడంతో అతని స్థానానికి కూడా ఢోకా లేదు కాబట్టి పడిక్కల్కు చాన్స్ లేదు. కెప్టెన్ గిల్, పంత్, జురేల్, సుందర్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఇప్పటికే వన్డేలు, టి20ల్లో దాదాపుగా జట్టుకు దూరమైన పంత్ ఈ ఫార్మాట్లోనైనా చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఖాయం కాగా... ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్పై భారం ఉంది. సుందర్ రెండో స్పిన్నర్ కాగా, స్వదేశంలో భారత్ సాధారణంగా ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుంది. కొత్త ఆటగాళ్లు మానవ్ సుతార్, హర్ష్దూబేలలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. అశ్విన్, జడేజాలు ఇద్దరూ లేకుండా సొంతగడ్డపై చివరిగా భారత్ 2010లో టెస్టు ఆడింది! వారిద్దరిపైనే భారం... టెస్టుల్లో అడుగు పెట్టి ఎనిమిదేళ్లు దాటినా... అఫ్గానిస్తాన్ ఇప్పటి వరకు 12 టెస్టులే ఆడగలిగింది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి పెద్ద జట్లతో ఒక్కసారి కూడా తలపడలేదు. ఈ ఫార్మాట్లో టీమ్ పరిస్థితిని ఇది సూచిస్తోంది. అఫ్గాన్ తరఫున రెండు డబుల్ సెంచరీలు సాధించిన కెప్టెన్ హష్మతుల్లా, ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసిన రహ్మత్ షా బ్యాటింగ్పైనే జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. అజ్మతుల్లా కీలక ఆల్రౌండర్ కాగా, గుర్బాజ్ ఓపెనింగ్లో దూకుడుగా ఆడగలడని జట్టు ఆశిస్తోంది. రషీద్ ఖాన్ లేకపోవడంతో టీమ్ బౌలింగ్ బలహీనంగా మారింది. ఇలాంటి టీమ్ భారత్తో ఎంత వరకు పోరాడగలదనేది ఆసక్తికరం. 50 రిషభ్ పంత్కు ఇది 50వ టెస్టు. భారత్ తరఫున వికెట్ కీపర్లుగా ధోని (90), సయ్యద్ కిర్మాణీ (88) మాత్రమే ఇంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడారు.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. దాదాపు 40 డిగ్రీలతో ఉత్తరాదిలో తీవ్ర ఎండలు ఉండటం ఆటగాళ్లను బాగా ఇబ్బంది పెడుతోంది. -
భారత్పై మరోసారి ట్రంప్ అక్కసు...
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి భారత్పై అక్కసు వెల్లగక్కారు. చాలా కాలంగా భారత్, అమెరికాపై అధిక సుంకాలు విధించి భారీగా లాభాలు పొందిందందన్నారు. ఇప్పుడు ఆ పని అమెరికా చేస్తుందన్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దీర్ఘకాలంగా ఉన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా, 2026 ఫిబ్రవరిలో భారత్, అమెరికా దేశాల మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ఇటీవలే న్యూఢిల్లీలో అమెరికా బృందం పర్యటించింది. భారత ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు దాదాపు ఫైనల్ అయ్యాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితులు నడుమ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.ట్రంప్ మాట్లాడుతూ" ఇంతకాలం భారత్, అమెరికాపై అధిక పన్నులు విధించి లాభపడింది. ఇప్పుడు అది మావంతు. అమెరికా, భారత్ మధ్య త్వరలోనే ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరవచ్చు. ఎందుకంటే "నాకు మోదీ అంటే చాలా ఇష్టం. మోదీ నాకు చాలా మంచి స్నేహితుడు. మా మధ్య మంచి సంబంధం ఉంది, మేము ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటాము."అని అన్నారు.కాగా బలవంతపు కార్మిక వ్యవస్థను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న కొన్ని దేశాలపై అదనపు దిగుమతి సుంకాలను (టారిఫ్లను) విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత జాబితాలో భారతదేశం కూడా ఉంది. దీనిని అమలు చేస్తే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై అదనంగా 12.5% సుంకం విధించబడవచ్చు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. దీంతో ఎగుమతులు ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. -
‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు ఇష్టం లేదు’
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. కోహ్లిని ఒక్కసారి నేరుగా చూస్తే తమ జన్మ ధన్యమైనట్లు భావించే వీరాభిమానులు కూడా కోకొల్లలు.కోహ్లికి ఉన్న విపరీతమైన ఈ క్రేజ్ అతడికి ఒక రకంగా శాపంగా మారిందంటున్నాడు ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్. నిజానికి భారత్లో జీవించడం కోహ్లికి కష్టంగా మారిందని.. అందుకే అతడు లండన్కు మకాం మార్చి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2025లో లివింగ్స్టోన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ లెజెండ్ కోహ్లి (Virat Kohli)తో తనకు ఏర్పడిన అనుబంధం, సహచర ఆటగాళ్ల పట్ల అతడు వ్యవహరించే తీరుపై లివింగ్స్టోన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కోహ్లి అత్యద్భుతమైన వ్యక్తిస్టిక్ టు క్రికెట్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అత్యద్భుతమైన వ్యక్తి. విరాట్కు ప్రత్యర్థిగా బరిలోకి దిగడం నాకెంతో ఇష్టం. అతడితో కలిసి ఆడటాన్ని కూడా ఆస్వాదిస్తా. అతడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు.ఎవరికి ఏ అవసరం ఉన్నా.. సలహా, సూచన కావాలన్నా అతడు ముందుంటాడు. అయితే, ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత అతడిలోని పోటీతత్వం తారస్థాయికి చేరుకుంటుంది. అతడు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తాడు.కుటుంబానికే ప్రాధాన్యంఅయితే, ముందుగా చెప్పినట్లు మైదానం వెలుపల మాత్రం అతడు అందరితో చాలా చాలా బాగుంటాడు. కుటుంబంతో సమయం గడపడం అంటే అతడికి ఎంతో ఇష్టం. నిజానికి ఇండియాలో జీవించే జీవితం అతడికి అసలు ఇష్టం లేదనే చెప్పవచ్చు.ఇండియాలో లైఫ్ అతడికి నచ్చదుప్రతి ఒక్కరూ తననే గమనిస్తూ ఉండటం అతడికి అస్సలు నచ్చదు. కోహ్లి చాలా మంచివాడు. మనసులో ఒకటి.. బయటకు ఒకటి ఉండదు. అయితే, మైదానంలోకి వెళ్లిన తర్వాత మాత్రం అతడిలా పూర్తిగా మారిపోయే మరొక ప్లేయర్ని మాత్రం నేను ఇంతవరకు చూడలేదు’’ అని లియామ్ లివింగ్స్టోన్ చెప్పుకొచ్చాడు.లండన్లో నివాసంకాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లికి.. కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అనుష్క లండన్లోనే అకాయ్కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్లోనే నివసిస్తోంది. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఐపీఎల్, స్వదేశంలో జరిగే మ్యాచ్లు, ఆశ్రమాలకు వెళ్లేందుకు మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు.తమకున్న క్రేజ్ తన పిల్లలపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో విరుష్క దంపతులు ఇప్పటి వరకు వారి ఫొటోలు కూడా రివీల్ చేయలేదు. లండన్లో సామాన్యుల్లా రోడ్ల మీద నడుస్తూ చిల్ అవడమే తమకు సంతోషంగా ఉంటుందని ఈ జంట పలుమార్లు చెప్పకనే చెప్పింది.ఇక ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న కోహ్లి కల గతేడాది నెరవేరింది. పద్దెమినిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ చాంపియన్గా నిలిచింది. దీంతో కోహ్లి సంతోషం రెట్టింపు అయింది.చదవండి: భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం! -
మోదీ లొంగిపోయే రకం కాదు: పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో రష్యాతో సంబంధాలు తగ్గించాలని భారత ప్రధాని మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తీసుకురావడం సరైన పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిడి తెస్తే మోదీ లొంగిపోయే రకం కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్ను రష్యా విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.రష్యా అధ్యక్షుడు పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ వార్తా సంస్థల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. రష్యాకు భారత్ ఎప్పుడూ మిత్రదేశమే. భారత్ తన విదేశాంగ విధానాన్ని స్వతంత్రంగా నిర్ణయించే దేశం. ఏ దేశం ఒత్తిడి చేసినా భారత్ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని లేదా తగ్గించాలని భారత నాయకత్వంపై ఒత్తిడి చేయడంలో ప్రయోజనం ఉండదు. భారత్ ఒక గొప్ప దేశం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. అలాంటి దేశం తన ప్రయోజనాలను బాగా అర్థం చేసుకుంటుంది. రష్యాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి. రష్యాతో సంబంధాలు తగ్గించాలని భారత ప్రధాని మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తీసుకురావడం ఫలితం ఇవ్వదు’ అని స్పష్టం చేశారు.రష్యా భారత్ను ఇప్పటికీ అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. పాశ్చాత్య ఒత్తిళ్ల మధ్య కూడా భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోందని రష్యా భావిస్తోంది. అమెరికాతో భారత సంబంధాలు పెరిగినా, రష్యా-భారత్ సంబంధాలపై మాస్కోకు పెద్దగా ఆందోళన లేదని పుతిన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఈ భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని చెప్పారు. అయితే, పరోక్షంగా అమెరికాను టార్గెట్ చేసే పుతిన్ ఇలా వ్యాఖ్యలు చేశారనే చర్చ నడుస్తోంది.అమెరికా-భారత్ సంబంధాలపై వ్యాఖ్యపుతిన్ వ్యాఖ్యల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం అమెరికా-భారత్ సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు. భారత్ అమెరికాతో వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నప్పటికీ, అది రష్యా-భారత్ సంబంధాలకు ఎలాంటి ఆటంకం కాదని ఆయన అన్నారు. అంటే, భారత్ ఒకేసారి అమెరికా మరియు రష్యాతో మంచి సంబంధాలు కొనసాగించగలదని, ఇది భారత విదేశాంగ విధానంలోని ప్రత్యేకత అని పుతిన్ అభిప్రాయపడ్డారు.ఎందుకు ఈ వ్యాఖ్యలు?రష్యా, ఉక్రెయిన్ మధ్య 2022లో యుద్దం ప్రారంభమైన తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించగా, భారత్ మాత్రం తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించింది. తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంది. దీనిపై పాశ్చాత్య దేశాలు విమర్శలు చేసినప్పటికీ, భారత్ తన నిర్ణయం జాతీయ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేసింది.భారత్-రష్యా మధ్య ప్రధాన రంగాలు:రక్షణ సహకారంఅణు విద్యుత్అంతరిక్ష పరిశోధనఇంధన భద్రతవాణిజ్యంసాంకేతికత -
టారిఫ్ల టెన్షన్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో భారత్పై విధించిన సుంకాలను సమర్థించుకున్న ఆయన.. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఒకవైపు భారత్పై అదనపు సుంకాల (టారిఫ్లు) కత్తి వేలాడదీస్తూ.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని తన "మంచి స్నేహితుడు"గా అభివర్ణిస్తున్నారు ట్రంప్. భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. గతంలో భారత్ అమెరికాపై భారీ సుంకాలు విధించిందని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు.వైట్హౌస్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. భారత్తో వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీతో తనకు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. "మోదీ నాకు మంచి స్నేహితుడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం బాగా కలిసిపోతాం. అందుకే భారత్తో వాణిజ్య ఒప్పందం కచ్చితంగా కుదురుతుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే అదే సమయంలో భారత్పై విమర్శలు కూడా గుప్పించారు. చాలా ఏళ్ల పాటు భారత్ అమెరికాను ఉపయోగించుకుందని, అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించిందని ఆరోపించారు. ప్రస్తుతం తన విధానాల వల్ల పరిస్థితి తారుమారైందని, ఇప్పుడు అమెరికానే భారత్తో వాణిజ్యం ద్వారా లాభపడుతోందని చెప్పారు.ఇదిలా ఉండగా, భారత్–అమెరికా మధ్య తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (BTA) చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల అమెరికా ప్రతినిధి బృందం భారత్లో పర్యటించి కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి.అయితే చర్చలు జరుగుతున్న వేళే అమెరికా మరోసారి టారిఫ్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బలవంతపు శ్రమ (Forced Labour) ద్వారా తయారైన వస్తువులు దిగుమతి అవుతున్నాయనే ఆరోపణలతో భారత్తో పాటు మరో 53 దేశాలపై అదనంగా 12.5 శాతం సుంకాలు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఖతార్, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.ట్రంప్ మరోసారి హార్లే-డేవిడ్సన్ మోటార్సైకిళ్ల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో భారత్ హార్లే-డేవిడ్సన్పై 200 శాతం వరకు సుంకం విధించిందని, అందువల్ల ఆ సంస్థ భారత్లోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మరోవైపు భారత ద్విచక్ర వాహనాలకు అమెరికాలో అలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు.గతంలో మోదీ-ట్రంప్ మధ్య జరిగిన చర్చల అనంతరం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశకు రూపురేఖలు సిద్ధమయ్యాయి. ఆ ఒప్పందం ప్రకారం భారత్పై విధించిన కొన్ని సుంకాలను తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. అయితే అనంతరం అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన పరస్పర సుంకాలపై కీలక తీర్పు ఇవ్వడంతో చర్చల దిశలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాలు కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాయి.అదనపు టారిఫ్ల హెచ్చరికల మధ్య కూడా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం, త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ధీమా వ్యక్తం చేయడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. భారత్–అమెరికా సంబంధాల్లో స్నేహపూర్వక సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.. టారిఫ్ల వివాదం మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కీలకాంశాలుభారత్తో డీల్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలుభారత్తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని ట్రంప్ ధీమా.మోదీ తనకు మంచి స్నేహితుడని వ్యాఖ్య.గతంలో భారత్ భారీ సుంకాలు విధించిందని విమర్శ.భారత్తో పాటు 53 దేశాలపై 12.5% అదనపు టారిఫ్ల ప్రతిపాదన.టారిఫ్ల వివాదం మధ్యే కొనసాగుతున్న వాణిజ్య చర్చలుత్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం -
దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం
న్యూఢిల్లీ: తమ పరస్పర అనుకూలతల ఆధారంగా దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారత్, వెనెజువెలా దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. అరుదైన ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, అటోమొబైల్స్ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఐదు రోజుల భారత పర్యటన కోసం డెల్సీ రోడ్రిగ్స్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. భారత్తో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా పర్యటన ఆరంభించారు. పశి్చమ ఆసియా సంక్షోభం కారణంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ముడి చమురు సేకరణను వైవిధ్యపరచాలని భారత్ భావిస్తోంది. ఈ తరుణంలో చమురు సంపన్న వెనెజువెలా అధ్యక్షురాలు భారత్లో అడుగుపెట్టడం విశేషం. వెనెజువెలా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం, రాబోయే రోజుల్లో ఇంధన మార్కెట్లో స్థిరమైన కొనుగోలుదారుగా ఉండడం వంటి కారణాలతో భారత్ను ప్రాధాన్యత కలిగిన ఇంధన భాగస్వామిగా పరిగణిస్తున్నామని డెల్సీ రోడ్రిగ్స్ వెల్లడించారు. ఈ ఇంధన సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ప్రధాని మోదీ బదులిచ్చారు. ఇరువురు నేతల మధ్య ప్రధానంగా ఇంధన భాగస్వామ్యం ఏర్పాటుపైనే చర్చ జరిగినట్లు సమాచారం. -
ఇంటింటా ఇంటర్నెట్!
ఇంటర్నెట్... పేరు చెబితేనే ఐటీ ఉద్యోగులు, కంప్యూటర్లు కళ్లముందు కదులుతాయి. కానీ ఇది ఒకప్పటి పరిస్థితి మాత్రమే. ఈకాలంలో కూలికెళ్లే వ్యక్తి కూడా ఎంచక్కా తన స్మార్ట్ఫోన్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం పొందుతున్నాడు. వినోదంతోపాటు, ఉపాధి అవకాశాలనూ మెరుగుపరుచుకుంటున్నాడు. భారత్లో ఇంటర్నెట్ వినియోగం పదేళ్లలోనే దాదాపు మూడు రెట్లు ఎక్కువైందంటేనే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం మొత్తమ్మీద ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న దేశాల్లో భారత్ రెండోస్థానానికి చేరింది. దేశ జనాభా 147 కోట్ల పైచిలుకైతే తాజా లెక్కల ప్రకారం దేశంలో క్రియాశీలంగా ఉన్న మొబైల్ఫోన్ కనెక్షన్లు ఏకంగా వందకోట్ల ఆరు లక్షలు. ఇందులో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య మూడు నుంచి ఆరు లక్షల వరకూ తక్కువ ఉండవచ్చు. అంతే. పదేళ్ల క్రితం అంటే 2015లో ఈ సంఖ్య 35 కోట్లు మించకపోవడం గమనార్హం. అలాగని ఈ టెక్నాలజీ కేవలం నగరాలకే పరిమితం కాలేదు. తాజా గణాంకాల ప్రకారం పల్లె ప్రాంతాల్లో నెట్ వినియోగదారుల సంఖ్య సుమారు 48 కోట్లు ఉంటే పట్టణ/నగర ప్రాంతాల్లో 40 కోట్ల మంది మాత్రమే నెట్ వాడుతున్నారు. గంటన్నర కాలం... దేశంలో రోజుకు కనీసం 90 నిమిషాల సమయం ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో సగటు నెట్ వినియోగం కేవలం నాలుగు శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాంతార్ అనే మార్కెటింగ్ సంస్థలు గత ఏడాది సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. మహారాష్ట్ర, కేరళ, గోవా రాష్ట్రాల్లో ఇంటర్నెట్ డెబ్భై శాతం కంటే ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటే యూపీ, బిహార్, జార్ఖండ్లలో 43– 50 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా... ఏం చేస్తున్నారు...? ఇంటర్నెట్ వినియోగదారుల్లో అత్యధిక శాతం వినోదం కోసమే ఉపయోగిస్తున్నారు. ఓటీటీల కోసం నెట్ వాడుతున్న వారు సుమారు 83 శాతం. అలాగే వాట్సప్ వంటి కమ్యూనికేషన్ అప్లికేషన్లు (75 శాతం), ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియా కోసం (74 శాతం) నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ చదువులు తరువాతి స్థానాల్లో నిలిచాయి. పీఎంజీదిశ వంటి డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాల పుణ్యమా అని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోంది. ఇంటర్నెట్ ఉన్న కారణంగా స్విగ్గీ, జొమాటో, రాపిడో, ఊబర్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా లక్షలాది మంది గిగ్ వర్కర్లకు ఉపాధి లభిస్తోంది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటివి ప్రాథమికంగా వినోదం కోసం ఉద్దేశించినవే అయినప్పటికీ వీటి ద్వారా సామాజిక సంబంధాలు నెరుపుతూండటం గమనార్హం. సాధ్యమైంది ఇలా... పదేళ్లలో నెట్ వినియోగం మూడు రెట్ల పెరగడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. చౌక స్మార్ట్ఫోన్లు, దేశం మారుమూల ప్రాంతాలకూ మొబైల్ఫోన్ సేవలు విస్తరించడం వంటివి నెట్ వినియోగం ఈ స్థాయిలో పెరిగేందుకు కారణాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ స్పష్టం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత చౌక మొబైల్ డేటా ప్లాన్లు అందుబాటులో ఉండటమూ నెట్ విస్తృతికి తోడైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన భారత్నెట్ కార్యక్రమం తన వంతు పాత్ర పోషించింది. ఆధార్, యూపీఐ వంటి సేవల లభ్యతతో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్, ఈ– కామర్స్ ఊపందుకున్నట్లు అర్థమవుతోంది. అంతరాలు తగ్గాలిదేశంలో వందకోట్లకుపైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నప్పటికీ కొన్ని వ్యవస్థీకృత సవాళ్లు మిగిలే ఉన్నాయి. ఇంటర్నెట్ అందుబాటు విషయంలో నగర ప్రాంతాలు ముందున్నాయి. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఓ మోస్తరు వేగంతో పనిచేసే బ్రాడ్బ్యాండ్ అందుబాటులో లేదు. మహిళల నెట్ వినియోగం పురుషులతో పోలిస్తే చాలా తక్కువ. మొబైల్ డేటా చౌకగా దొరుకుతున్నప్పటికీ ఇప్పటికీ స్మార్ట్ఫోన్లు దిగువ తరగతి కుటుంబాలకు ఖరీదైనవే. డిజిటల్ టెక్నాలజీల సామర్థ్యం గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో చేరడం లేదు. తగిన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని చోట్ల సైబర్ ఫ్రాడ్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'వివాదాలు వీడి' వాణిజ్యం వైపు!
వందకు పైగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలతో కూడిన బృందంతో భారత వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ గత వారం కెనడా పర్యటించటం ఇరు దేశాల సంబంధాలలో కీలక మలు పును సూచిస్తోంది. మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా పగ్గాలు చేపట్టే సమయానికి భారత్–కెనడా సంబంధాలు అధఃపాతా ళంలో ఉన్నాయి. ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతంలో రెండు దేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని పెద్ద మొత్తంలో బహిష్కరించాయి. ఖలిస్తాన్ వివాదం, దౌత్య స్పర్థల్ని నాటి ప్రధాని ట్రూడో తన స్థానిక రాజకీయ చదరంగంలో పావుల్లా వాడుకోవటానికి ప్రయత్నించారు. భారత సంతతికి చెందిన 18 లక్షల కెనడియన్ల ఓట్లకు గాలం వేయటానికి ట్రూడో భారత్–కెనడా సంబంధాలను ఫణంగా పెట్టారు. కెనడా పార్లమెంటులో బహిరంగంగా నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ హస్తమున్నదని (అండర్ కవర్ ఆపరేషన్) ఆరోపించారు. సంబంధాలలో సరికొత్త అధ్యాయంమార్క్ కార్నీ ప్రధాని కాగానే భారత్తో సంబంధాలను పునరు ద్ధరించటంపై దృష్టి పెట్టారు. 2023 అక్టోబర్లో దౌత్యవేత్తల బహి ష్కరణ తర్వాత 2025 సెప్టెంబర్లో తిరిగి హైకమిషనర్లను పునర్ని యమించారు. అదే నెలలో ఇరు దేశాల భద్రతా సలహాదార్లు సమా వేశమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో కార్నీ నాలుగు రోజులపాటు భారత్లో పర్యటించటంతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2010 నుండి పదహారేళ్లుగా నత్తనడక నడుస్తున్న భారత్–కెనడా వాణిజ్య చర్చలను పరుగులు పెట్టించి 2026 సంవత్సరాంతానికి ‘కాంప్రహెన్సివ్ ఎకనమిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్’ (సీఈపీఏ)ను ఖాయం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మూడింతలు చేసి 50 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలని నిశ్చయించారు.భారత్–కెనడా వాణిజ్యం కేవలం కొన్ని వస్తువులు, సేవలకే పరిమితమై ఉంది. కెనడా నుండి మనం పప్పుధాన్యాలు, చమురు, గ్యాస్, బొగ్గు, కలప, కాగితం, ఎరువులు, వైమానిక పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. కెనడాకు భారత్ విలువైన రాళ్లు, ఫార్మా స్యూటికల్స్, వస్త్రాలు, రసాయనాలను ఎగుమతి చేస్తోంది. నిజానికి ఈ వాణిజ్యాన్ని విస్తరించటానికి అవకాశాలు ఉన్నాయి. భారత్ 2070 కల్లా నెట్–జీరో కార్బన్ లక్ష్యాన్ని సాధించాలంటే అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా విస్తరింపజేయాలి. 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి కనీసం సాలీనా 5 వేల టన్నుల యురేనియం అవసరమవుతుంది. మన దేశంలో సాలీనా 600 టన్నుల యురేనియంను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. భారత్లో ఉన్న 24 అణు రియాక్టర్లలో 14 యురేనియం కొరత వలన సామర్థ్యం కంటే దిగువన పని చేస్తున్నాయి. చైనాకు ప్రత్నామ్నాయంగా కెనడాకెనడా, ప్రపంచంలో రెండవ అతి పెద్ద యురేనియం ఉత్పత్తి దారు. అత్యంత నాణ్యమైన యురేనియం సిగార్ సరస్సు, మెక్– ఆర్థర్ నదీ పరివాహకాలలో ఉత్పత్తి అవుతున్నది. ప్రపంచ మార్కె ట్లలో లభించే ఆస్ట్రేలియా, కజకిస్తాన్ యురేనియంతో పోల్చితే కెనడా యురేనియం నాణ్యమైనది, చౌకగా లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2020లో కాలం చెల్లిన 2015 ఒప్పందం స్థానంలో భారత్– కెనడాల మధ్య 2.5 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం ఒప్పందంపై కార్నీ భారత పర్యటనలో అంగీకారం కుదిరింది.యుద్ధ విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహక నౌకలు, ఏఐ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ రంగాలకు కీలకమైన 24 రకాల అరుద యిన ఖనిజాల విషయంలో భారత్ దాదాపుగా చైనా దిగుమతులపై ఆధారపడుతున్నది. లాంథనం, సెరియం, నియోడిమియం, సమారియమ్, టెర్బియం, డిస్ప్రోజియం, లిథియం తదితర అరుదైన ఖనిజాలు కేరళ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సముద్రతీర మోనజైట్ ఇసుక లలో లభిస్తాయి. కానీ మోనజైట్ను శుద్ధి చేసి ఆ ఖనిజాలను వేరు చేసే సామర్థ్యం భారత్కు లేదు. ముడి మోనజైట్ను చైనాకు ఎగుమతి చేసి, శుద్ధి చేసి, వేరుపరిచిన ఖనిజాలతో తయారయిన మాగ్నెట్లను, బ్యాటరీలను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అరుదైన ఖనిజాల శుద్ధి, మాగ్నెట్లు / బ్యాటరీల తయారీ వ్యవస్థ కెనడా వద్ద ఉన్నప్పుడు చైనాపై ఆధారపడటం వ్యూహాత్మక తప్పిదం. ఈ నేపథ్యంలోనే అరుదైన ఖనిజాల శుద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, మాగ్నెట్ల తయారీకి కెనడాతో అంగీకారం కుదిరింది. ఈ సంవత్సరాంతానికి కెనడా కంపెనీల భాగస్వామ్యంతో కనీసం అయిదు ప్రాజెక్టులను ఈ రంగంలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారత్ వాటా 40 శాతం. సుమారు 4.27 లక్షలమంది భారతీయులు కెనడాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఏడాది 15 బిలియన్ డాలర్లను కెనడాకు చెల్లిస్తున్నారు. 21 కెనడా యూనివర్సిటీల అధిపతులు కార్నీ వెంట భారత్కు వచ్చారు. భారత్లో కెనడియన్ యూనివర్సిటీల క్యాంపస్ల ఏర్పాటుకు, భారత్–కెనడా యూనివర్సిటీల ఉమ్మడి కోర్సుల నిర్వహణకు, విద్యార్థుల మారకానికి, ఏఐ గ్రీన్ హైడ్రోజన్ క్వాంటమ్ మెకానిక్స్ వంటి రంగాలలో ఉమ్మడి పరిశోధనలకు 200కు పైగా ఒప్పందాలు జరిగాయి.సుంకాల రద్దుకు సమాలోచనలుఆర్కిటిక్, పసిఫిక్ తీరాలు కలిగి ఉన్న కెనడాలో రక్షణ–భద్రత రంగాలలో కూడా భారత్ సంబంధాలు పటిష్టం చేసుకోవటానికి ఒప్పందం జరిగింది. రానున్న దశాబ్దాలలో ఇండో–పసిఫిక్, ఆర్కి టిక్ జలాలు ప్రపంచ రాజకీయాలను శాసిస్తాయి. అందుకే నౌకా నిర్మాణం, సబ్మెరైన్లు, సముద్ర జలాలలో నిఘా వంటి అంశాలలో ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రాజెక్టులను ప్రారంభించటానికి శ్రీకారం చుట్టారు. భారత ఆర్థిక సేవల రంగంలో కెనడియన్ పెన్షన్ ఫండ్ల పెట్టుబడులు కీలకం. 140 బిలియన్ కెనడియన్ డాలర్లను భారత దేశపు ఎనర్జీ, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, ఈక్విటీ, బాండ్ సెక్యూరిటీలలో కెనడా పెట్టుబడిగా పెట్టింది. స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇరువైపులా సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని కూడా భావిస్తున్నారు. కానీ భారత్కు ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ఇబ్బందులున్నాయి. ప్రస్తుతం కెనడా పప్పుధాన్యాలు, నూనెల దిగుమతులపై 15–30 శాతం సుంకాన్ని విధిస్తున్నాం. వ్యవసాయ దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తే మన రైతులు, వ్యవ సాయంపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీఈపీఏ ఒప్పందం ఖాయం చేయాలంటే సుంకాలతోపాటు అనేక ఇతర సంక్లిష్ట అంశాలలో ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. ముఖ్యంగా సేవలు, పెట్టుబడుల రక్షణ, వివాదాల పరిష్కారం, మేధోహక్కుల పరిరక్షణ, కార్మిక, పర్యావరణ ప్రమాణాలు వంటి విషయాలలో మన దేశం రాజీ పడలేదు. కొత్త భాగస్వాముల వేటలో ఉన్న కెనడాతో పటిష్ట సంబంధాలు ఏర్పరచుకోవటంఉభయ తారకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఇండి కూటమిలో కలకలం.. మిత్రపక్షాల మధ్య ఏం జరుగుతోంది?
చెన్నై: ఇండి కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 8న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష కూటమి సమావేశంలో తాము పాల్గొనబోమని డీఎంకే గురువారం తెలిపింది. ముఖ్యంగా "కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశం" కావడంతో హాజరుకావడం లేదని స్పష్టం చేసింది.ఇండి కూటమిలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే అసంతృప్తిగా ఉంది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్ల తమ కార్యకర్తలు తీవ్రంగా బాధపడ్డారని డీఎంకే తెలిపింది."తమిళనాడు శాసనసభ ఎన్నికల తర్వాత డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం వల్ల మా కార్యకర్తలు ఇంకా తీవ్రంగా మనస్తాపానికి గురవుతున్నారు. వారి భావోద్వేగాలను గౌరవిస్తూ.. జూన్ 8న న్యూఢిల్లీలో జరగనున్న ఇండి కూటమి సమావేశంలో డీఎంకే పాల్గొనదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశం కావడంతో హాజరుకాదు" అని పార్టీ తెలిపింది.అయితే ఈ సమావేశానికి హాజరుకాకపోయినా, సమావేశంలో పాల్గొనే ఇతర పార్టీలు ప్రస్తావించే దేశ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఎప్పటిలాగే తమ గళాన్ని వినిపిస్తామని డీఎంకే పేర్కొంది.డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయింది. టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, లోక్సభలో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని డీఎంకే అధికారికంగా కోరింది. దీంతో దీర్ఘకాల మిత్రపక్షమైన కాంగ్రెస్కు దూరంగా నిలిచింది.మరోవైపు, పార్లమెంట్ ముందుకు మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. డీ లిమిటేషన్ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది. అలాగే, డీఎంకే కూడా మద్దతు తెలుపుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఇండి కూటమి పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. -
‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ ఉద్యమాన్ని ఇలా చేసిందనుకో..: సార్థక్ సిద్ధాంత్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ-ఓఎస్ఎమ్ (ఆన్-స్క్రీన్ మార్కింగ్) విజిల్ బ్లోయర్లలో ఒకరైన సార్థక్ సిద్ధాంత్ (17).. " కాక్రోచ్ జనతా పార్టీ" వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు ఓ సందేశం ఇచ్చాడు. ఉద్యమం ఇంటర్నెట్లో యూజర్ల దృష్టిని ఆకర్షించేలా కాకుండా నిజమైన కారణాల ఆధారంగా కొనసాగాలని చెప్పారు. అంటే, కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావడం, లైక్లు, వ్యూస్, ఫాలోవర్లను సంపాదించడమే లక్ష్యంగా ఉద్యమాలు నడపకూడదని ఆయన చెప్పాడు.విజిల్ బ్లోయర్ అంటే సంస్థలోని లోపాలు, అవకతవకలు, అక్రమాలను బయటపెట్టే వ్యక్తి. 12వ తరగతి మార్కుల పట్టికల్లో తేడాలను గుర్తించిన తర్వాత సీబీఎస్ఈ ఓఎస్ఎమ్ మూల్యాంకన వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిన కీలక వ్యక్తులుగా సిద్ధాంత్, వేదాంత్, "ఎథికల్ హ్యాకర్" నిసర్గ నిలిచారు. ఈ ముగ్గురూ దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది పరీక్షల వివాదాలపై వీరు గళం విప్పుతున్నారు. ఇందులో ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ 2026 పరీక్ష కూడా ఉంది. ఆ పరీక్షకు జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ‘‘బొద్దింకలు’’ అంటూ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య స్పందనగా మొదలైన వైరల్ ఆన్లైన్ ఉద్యమం ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ గురించి సార్థక్ సిద్ధాంత్ మాట్లాడాడు. తాను రాజకీయాల్లోకి వెళ్లనని చెప్పాడు. విద్యార్థులు ఏర్పాటు చేసే ఏ పార్టీ అయినా, వాళ్లు చేసే ఏ ప్రచారం అయినా నిజమైన కారణం ఆధారంగా ఉండాలని తెలిపాడు.విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలు వారి ఆగ్రహాన్ని అర్థవంతమైన చర్యగా మార్చేలా ఉండాలని తెలిపాడు. సమస్య పరిష్కారం దిశగా నిజమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు."నేను కొంత దర్యాప్తు చేశాను, నిసర్గ్ కొంత దర్యాప్తు చేశాడు. విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో వాటిని బయటపెట్టాం" అని సార్థక్ సిద్ధాంత్ చెప్పాడు. పరిశోధన ఆధారంగా జరిగే ఉద్యమాలకు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో నడిచే ధోరణులకు మధ్య తేడాను ఆయన ప్రస్తావించారు. తన వ్యాఖ్యల్లో వేదాంత్ శ్రీవాస్తవ గురించి ప్రస్తావంచాడు.ఆన్లైన్ వేదికలకే ఉద్యమాన్ని పరిమితం చేయొద్దని సిద్ధాంత్ హెచ్చరించాడు. ఇంటర్నెట్ యాక్టివిజం బాగానే ఉంది, కానీ వెనుక సీట్లలో కూర్చుని ఏమీ చేయకపోవడం మాత్రం సరైంది కాదని చెప్పారు. కేవలం ఆన్లైన్లో ప్రాచుర్యం పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమానికి తాను మద్దతు ఇవ్వనని తెలిపాడు."అవును, ఇంటర్నెట్ యాక్టివిజం బాగానే ఉంది. నేను చేసినది, నిసర్గ్ చేసినది, వేదాంత్ చేసినది సాధారణంగా ఇంటర్నెట్ యాక్టివిజమే. కానీ అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఉద్యమానికి మద్దతు ఇస్తున్నవారు వెనుక సీట్లలో కూర్చుని ఏమీ చేయకపోతే, ఏ కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొనకపోతే, అది సరికాదు" అని సిద్ధాంత్ చెప్పారు.సార్థక్ సిద్ధాంత్ ఎవరు?సార్థక్ సిద్ధాంత్ తన వెబ్సైట్ సార్థక్సిద్ధాంత్.కామ్/కోఎంప్ట్లో తన పరిశోధన ఫలితాలను ప్రచురించాడు. కేంద్ర ప్రజా కొనుగోలు పోర్టల్(Central Public Procurement portal)లోని టెండర్ పత్రాలను అనేక రోజుల పాటు పరిశీలించిన తర్వాత ఈ వివరాలు వెల్లడించారు. సీబీఎస్ఈ ఉత్తీర్ణత శాతం తగ్గడంతో ఓఎస్ఎమ్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. కొందరు విద్యార్థులు తప్పులు, అసమానతలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.‘హౌ సీబీఎస్ఈ రీరోట్ రూల్స్ టు ఫేవర్ కోఎంప్ట్ ఎడ్యూటెక్’ అనే శీర్షికతో ఉన్న సిద్ధాంత్ బ్లాగ్లో, టెండర్ ప్రక్రియలో వరుసగా జరిగిన మూడు దశల్లో అర్హత ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలను బోర్డు పద్ధతిగా మార్చిందని ఆరోపించారు. దీని వల్ల చివరకు విజేతగా నిలిచిన హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నాడు. "ప్రజా సంస్థ తన సొంత నిబంధనలను తిరిగి రాసి, విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా ఆడుకుందో చెప్పే కథ ఇది" అని సిద్ధాంత్ తన బ్లాగ్ ప్రారంభంలో రాశాడు. ఆ సంస్థ ఎలాంటి తప్పూ చేయలేదంటూ ఖండించింది. సీబీఎస్ఈ కూడా అదే చెప్పింది.విద్య, మహిళలు, పిల్లలు, యువజనులు, క్రీడల పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరు కావాలని సిద్ధాంత్ను గత మంగళవారం కోరారు. ఓఎస్ఎమ్ వ్యవస్థ కోసం సీబీఎస్ఈ మూడు వేర్వేరు టెండర్లు విడుదల చేసిందని సిద్ధాంత్ స్థాయీ సంఘానికి తెలిపారు. 2025 ఫిబ్రవరిలో విడుదలైన తొలి టెండర్, విన్నర్ లేకుండానే రద్దైంది. 2025 మేలో విడుదలైన రెండో టెండర్కు నాలుగు బిడ్లు వచ్చాయి, కానీ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. 2025 ఆగస్టులో విడుదలైన మూడో టెండర్కు ర్యాంక్గురు, టీసీఎస్, కోఎంప్ట్ బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక దశలో ర్యాంక్గురు అర్హత సాధించకపోవడంతో చివరకు కాంట్రాక్ట్ కోఎంప్ట్కు దక్కింది. -
సర్వీసుల రంగం @ 6 నెలల గరిష్టం
న్యూఢిల్లీ: దేశీ సర్వీసుల రంగం గత నెల(మే)లో ఆరు నెలల గరిష్టానికి చేరింది. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త క్లయింట్లను పొందడం, కొత్త బిజినెస్ల వినియోగంలో పురోగతి ఇందుకు సహకరించాయి. వెరసి బుధవారం విడుదలైన నెలవారీ సర్వేలో హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 59.8కు బలపడింది. ఏప్రిల్లో ఇది 58.8గా నమోదుకాగా.. గత నవంబర్ తదుపరి మే నెలలో సర్వీసులు బలంగా పుంజుకున్నాయి.పీఎంఐగా పిలిచే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 50ను దాటితే సర్వీసుల రంగం విస్తరించినట్లు లెక్క. 50కు దిగువన నమోదైతే క్షీణతను చవిచూస్తున్నట్లు తెలియజేస్తుంది. ప్రధానంగా రవాణా, డిజిటల్ సొల్యూషన్లు, ఈకామర్స్, ఎంటర్టైన్మెంట్, ఐటీ విభాగాలలో సర్వీసులకు పెరిగిన డిమాండ్ కొత్త బిజినెస్ల వృద్ధికి దోహదపడింది. దీంతో కంపెనీలలో యాక్టివిటీ పుంజుకోవడంతోపాటు.. ఉపాధి కల్పనకు బూస్ట్ లభించింది. -
High Alert In India : యుద్ధంలోకి భారత్
-
ఐపీఎల్ ముగిసింది.. ఇక అసలు ఆట షురూ
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ముగిసిందని.. అసలు ఆట షురూ అయ్యిందని.. ఇకనైనా భారత కంపెనీలు వినోదాన్ని పక్కనపెట్టి వ్యాపార రంగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గూగుల్ తాజా పెట్టుబడుల ప్రకటనను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వినోదం నుంచి దృష్టి మళ్లించి భవిష్యత్ సాంకేతికతలు, ముఖ్యంగా కృత్రిమ మేధస్సుపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ కంపెనీలకు ఉదయ్ కొటక్ సూచించారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ AI రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆల్ఫాబెట్ సంస్థ ఏఐ విస్తరణ కోసం సుమారు 80 బిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు ప్రకటించగా.. ఈ ఏడాది మొత్తం ఏఐపై 180 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని ఉదయ్ కొటక్ ఓ “వేక్ అప్ కాల్”గా అభివర్ణించారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’లో స్పందించిన ఆయన.. గూగుల్ వంటి సంస్థకు భారీ లాభాలు, భారీ మార్కెట్ విలువ ఉన్నప్పటికీ భవిష్యత్ టెక్నాలజీల కోసం మరింత పెట్టుబడులు పెడుతోందని పేర్కొన్నారు. గూగుల్ వార్షిక లాభాలు సుమారు 160 బిలియన్ డాలర్లు, మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లు అని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో భారత కంపెనీలు తక్షణ లాభాలు, వినోద కేంద్రిత దృష్టి నుంచి బయటకు వచ్చి దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ఆయన పరోక్షంగా సూచించారు.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ఐటీ రంగం కూడా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉడయ్ కొటక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. చాలా మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ భారత వ్యాపార రంగం ఇప్పుడు పెట్టుబడులు, టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే కొందరు మాత్రం అమెరికాలో పెద్ద స్పోర్ట్స్ లీగ్స్ కొనసాగుతున్నప్పటికీ అక్కడి ఆర్థిక వ్యవస్థ ఇన్నోవేషన్లో వెనుకడుగు వేయలేదని గుర్తు చేస్తూ.. భారతదేశం కూడా వినోదం–వ్యాపారం మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ప్రభావం ఎలాగంటే.. ఈ తరహా భారీ పెట్టుబడులు ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), డేటా సెంటర్లు, చిప్ టెక్నాలజీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే భారీ లాభాలు ఉన్నప్పటికీ మరింతగా పెట్టుబడులు పెడుతుండటం వల్ల.. కొత్త AI మోడళ్ల అభివృద్ధి వేగవంతమవుతుంది. ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతుంది. అలాగే గ్లోబల్ టెక్ పోటీ మరింత తీవ్రంగా మారుతుంది. దీని ప్రభావంగా సాఫ్ట్వేర్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి.కానీ అదే సమయంలో సంప్రదాయ ఐటీ సేవలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచ వ్యాపార రంగంలో ఇక “కొత్త ఆవిష్కరణలు చేయాలి లేదా పోటీలో వెనుకబడిపోవాలి” అనే పరిస్థితి మరింత స్పష్టంగా మారే అవకాశం ఉంది. -
సూపర్ ఎల్–నినోకు సిద్ధం కండి
ఇక అనుమానాలు అక్కరలేదు. ఈ ఏడాది ప్రపంచదేశాలకు మాత్రమే కాదు.. భారతదేశానికీ గడ్డుకాలమే. చుట్టపుచూపుగా కరవు కాటకాలను పరిచయం చేసి వెళ్లిపోయే ఎల్–నినో ఈ సారి తన విశ్వరూపాన్ని చూపనుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతాయని, సూర్యుడి ప్రతాపం కూడా ఎక్కువ కానుందని తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ సైతం హెచ్చరించింది. ఎక్కడో దక్షిణ అమెరికా ఖండంలోని పసఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు పెరిగితే వచ్చే వాతావరణ మార్పులను ఎల్–నినో అని, చల్లబడితే లా–నినా అంటారని మనకు తెలుసు. భారత్ లాంటి దేశాల్లో లా–నినా అధిక వృష్టికి కారణమవుతూంటుంది. ఈ రెండూ సాధారణంగా 3 నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చి పోతూంటాయి. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ పరిస్థితిలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తరచూ రావడం ఒక సమస్య అయితే... ఒక్కోసారి ఒక్కోలా ప్రభావం చూపడం రెండో సమస్య. భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్) కారణంగా ఈ రెండు వాతావరణ అంశాల తీవ్రత పెరిగిపోయింది. వర్షపాతంలో విపరీతమైన తేడాలు నమోదవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎల్–నినో ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కరవు కాటకాలు.. కొన్ని చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. లా–నినా సందర్భంలోనూ అధిక వర్షపాతాల స్థానంలో నగరాలను ముంచెత్తే క్లౌడ్బరస్ట్లు తరచూ నమోదు అవుతూండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సూపర్ ఎల్–నినో ఏర్పడుతుందన్న ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబరు లోగా... ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణ స్థాయిలో ఉంటుందని భారత వాతావరణ సంస్థ ఇప్పటికే తెలిపిన విషయాన్ని ఒక్కసారి ఇక్కడ ప్రస్తావించాలి. ఎందుకంటే ఈ అంచనాల్లో సూపర్ ఎల్–నినో ప్రస్తావన లేదు. జూన్ నెలలో ప్రపంచ వాతావరణ సంస్థ వెలువరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకూ సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడేందుకు 80 – 90% అవకాశం ఉంది. ఇప్పటికే అగ్ని గుండాన్ని తలపిస్తున్న వాతావరణానికి ఈ సూపర్ ఎల్–నినో ఆజ్యం పోయనుందని, దీన్ని అత్యవసర వాతావరణ హెచ్చరికగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ స్వయంగా ప్రకటించడం సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది. రెండేళ్ల క్రితం 2023–24 లోనూ సూపర్ ఎల్–నినో ఏర్పడినా ఆ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో ఐదవదిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు – నవంబరుల మధ్య సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం తొమ్మిది నుంచి పన్నెండు నెలల వరకూ ఉంటుందని అంచనా. అంటే వచ్చే ఏడాది కూడా మాడు పగిలే ఎండలు, వడగాడ్పులు తప్పవన్నమాట. ఎండలు పెరిగితే దాని ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందన్నది నిర్వివాద అంశం.మనపై ప్రభావం ఇలా... సూపర్ ఎల్–నినో ప్రభా వం 2026 నైరుతి రుతుపవనాలపై జూలై నెల నుంచి కనిపించడం ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ ఒకటవ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు ముందుకు కదలడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జూలైలో ఉత్తర, మధ్య, పశ్చిమ భారత దేశ ప్రాంతాల్లో వర్షపాతంలో లోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో కరవు పరిస్థితులు రావొచ్చు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఆసక్తికరంగా జూలై – ఆగస్టు నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురిసి వరదలు రావచ్చునని అంచనాలు చెబుతున్నాయి. సెప్టెంబరులో ముఖ్యంగా చెన్నై, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సమస్య ఎదురు కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సూపర్ ఎల్–నినో ప్రభావం కారణంగా 2026– 27 రబీ సీజన్ పంటలపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం పడుతుంది. -
ప్రముఖ తెలుగు యూట్యూబర్ నందు కుటుంబంపై కేసు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వరప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్లో మోసం చేశారంటూ వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్లో ఉన్న ఫేమ్ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.కేసు నమోదు బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన, గుంటూరులో నివసించే మధుకర్ తండ్రిపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఇబ్రహీంపట్నం ఎస్ఐ బీ. రాజు తెలిపారు.నందూస్ వరల్డ్ యూట్యూబ్ ప్రయాణం నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన నందన, తన భర్త మధుకర్, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేసేవారు. ఒకానొక దశలో తినడానికి తిండిలేక పస్తులున్నామని, మగ గొంతు కారణంగా పలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ వీడియోలు చేస్తూ వచ్చారు. ఆ వీడియోలు ప్రేక్షకాదరణ పొందాయి. యూట్యూబ్ ఆదాయంతో పాటు సినీమా అవకాశాలు కూడా దక్కాయి. నందన తన తొలి సినిమా మన శంకర వర ప్రసాద్లో హీరోయిన్ నయనతార స్నేహితురాలు పాత్రలో కనిపించారు. ఒక్క సన్నివేశమే అయినా ఆమెకు గుర్తింపు వచ్చింది. తరువాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు సమాచారం.ఆరోపణల్ని ఖండించిన నందన తనపై వస్తున్న ఆరోపణలను నందన ఖండించారు. ప్రజల్లో, సోషల్ మీడియాలో తమకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేక పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వీడియో విడుదల చేశారు. యూకే నుంచి భారత్కు వచ్చిన కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. తమకు సంబంధించిన ఏ విషయమైనా తామే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పారు. -
తాలిబాన్ సర్కార్కు రష్యా బంపరాఫర్.. పాక్కు కొత్త టెన్షన్!
రష్యా, తాలిబాన్ల సర్కార్ పాలిత ఆఫ్ఘనిస్థాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాల మధ్య తొలి సైనిక-సాంకేతిక సహకార(Military-Technical Cooperation Agreement) ఒప్పందానికి గ్రీన్సిగ్నల్ పడింది. అయితే, ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో పెద్ద మార్పుగా విశ్లేషకులు చూస్తున్నారు. కీలక ఒప్పందం కారణంగా దాయాది దేశం పాకిస్తాన్కు టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో భారత్కు ఇది సానుకూల అంశం కానున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.2026 మే 27న మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సమావేశం సందర్భంగా అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్, రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీయి షోయిగూ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. అయితే సాధారణంగా ఇటువంటి మిలిటరీ-టెక్నికల్ ఒప్పందాల్లో ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, శిక్షణ, నిర్వహణ, లైసెన్సింగ్,ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు ఉంటాయి.ఎందుకు ముఖ్యమైనది?ఆప్ఘనిస్తాన్లో 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. కానీ రష్యా 2025లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా నిలిచింది. అప్పటి నుంచి భద్రత, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, ఇప్పుడు రక్షణ రంగాల్లో కూడా సంబంధాలను వేగంగా పెంచుతోంది.రష్యా ఎందుకు తాలిబాన్కు దగ్గరవుతోంది?1. ISIS-K ముప్పురష్యా ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న Islamic State–Khorasan Provinceను పెద్ద భద్రతా ముప్పుగా చూస్తోంది.2024లో మాస్కోలో జరిగిన Crocus City Hall ఉగ్రదాడి తర్వాత రష్యా ఆఫ్ఘనిస్థాన్లోని ఉగ్రవాద నెట్వర్క్లపై మరింత అప్రమత్తమైంది. తాలిబాన్తో సహకారం ద్వారా ISIS-Kను నియంత్రించవచ్చని మాస్కో భావిస్తోంది.2. మధ్య ఆసియాలో ప్రభావంఆఫ్ఘనిస్థాన్కు ఆనుకుని ఉన్న మధ్య ఆసియా దేశాలు రష్యా భద్రతా వ్యూహంలో కీలకమైనవి. ఆఫ్ఘనిస్థాన్లో స్థిరత్వం లేకపోతే ఆ ప్రభావం నేరుగా మధ్య ఆసియాపై పడుతుంది. 2021లో ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా ఉపసంహరణ తర్వాత ఏర్పడిన వ్యూహాత్మక ఖాళీని రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఈ ఒప్పందాన్ని ఆ దిశలో మరో అడుగుగా చూస్తోంది.పాకిస్తాన్కు టెన్షన్?ఇదే ఈ పరిణామంలో అత్యంత కీలక అంశం. రష్యా నేరుగా తాలిబాన్తో సంబంధాలు బలోపేతం చేస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్థాన్లో పాకిస్థాన్ ప్రభావశీల దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు తాలిబాన్–పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణించాయి. ఇటీవలి కాలంలో ఇరు పక్షాల మధ్య యుద్ధం కూడా జరిగింది. పాక్ ఆరోపణ ప్రకారం టీటీపీ Tehrik-i-Taliban Pakistan (TTP) యోధులు ఆఫ్ఘనిస్థాన్లో ఆశ్రయం పొందుతున్నారు. తాలిబాన్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు రష్యాతో కుదిరిన ఒప్పందం కారణంగా తాలిబాన్లకు ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, తాలిబాన్లు.. పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకే పాక్ ఆందోళనకు గురవుతోంది. భారత్ సంగతేంటి? భారత్ అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా ఆఫ్ఘనిస్థాన్తో పరిమిత దౌత్య సంబంధాలు కొనసాగిస్తోంది. ఇటు రష్యాతోనూ మంచి స్నేహం ఉంది. దీంతో, భారత్పై పాక్ అనుసరించే చర్చకు చెక్ పడే అవకాశం ఉంది. అయితే, ఈ ఒప్పందం తాలిబాన్ అంతర్జాతీయ గుర్తింపు పొందే ప్రయత్నంలో పెద్ద ముందడుగుగా అనేక దేశాలు భావిస్తున్నాయి. రష్యా మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని విస్తరించే వ్యూహంగా విశ్లేషించుకుంటున్నాయి.చైనా పాత్ర.. డ్రాగన్ కంట్రీ చైనా కూడా తాలిబాన్తో సంబంధాలు పెంచుకుంటోంది. అక్కడి ఖనిజ సంపదపై చైనా కన్నేసిందని వార్తలు సైతం బయటకు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్లోని లిథియం, రాగి వంటి ఖనిజాలపై చైనా, రష్యా రెండింటికీ ఆసక్తి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రష్యా–చైనా–తాలిబాన్ సమీకరణం బలపడితే కొత్త వ్యూహాత్మక సవాళ్లు ఎదురుకావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్లో యుద్ధం చేసిన రష్యా, ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వంతో భద్రతా భాగస్వామిగా మారుతోంది. రష్యా–తాలిబాన్ ఒప్పందం ఇప్పటికైతే సాంకేతిక-సైనిక సహకారానికి పరిమితమైనా, దీని అసలు ప్రాధాన్యం ఆఫ్ఘనిస్థాన్ను అంతర్జాతీయ రాజకీయాల్లో తిరిగి స్థాపించడం, రష్యా ప్రభావాన్ని పెంచడం, దక్షిణాసియా శక్తి సమీకరణాలను మార్చడమేనని తెలుస్తోంది. -
భారత్కు మరోసారి అమెరికా సుంకాల షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్మరోసారి భారత్కు షాకిచ్చారు. బలవంతపు కార్మిక విధానానికి (forced labour) నిరోధానికి సరైన చర్యలు తీసుకోలేదనే కారణంతో కనీసం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త పన్నులు (tariffs) విధించాలని అమెరికా సిద్దమవుతున్నారు. భారతదేశం, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్లతో సహా 60 దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 12.5 శాతం వరకు అదనపు టారిఫ్లు (పన్నులు) విధించాలని ప్రతిపాదించింది. ఈ దేశాలు బలవంతపు శ్రమతో (వెట్టిచాకిరీ/forced labour) తయారైన వస్తువులపై నిషేధాన్నివిధించడంలో లేదా వాటిని కఠినంగా అమలు చేయడంలో విఫల మయ్యాయని USTR నిర్ధారించింది. ఫిబ్రవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అనేక సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత, మరింత శాశ్వతమైన సుంకాలను విధించే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఈ జాబితాలో కెనడా, మెక్సికో, తైవాన్ , యూకే, చైనా, జపాన్, ఇండియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ మరియు స్విట్జర్లాండ్ తదితర దేశాలున్నాయి. ఇందులో కెనడా, మెక్సికో, తైవాన్ , యూకే లపై 10 శాతం సుంకాలు, ఇతర దేశాలపై అదనంగా 12.5 శాతం సుంకం విధించనుంది. దీని ప్రకారం భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను (Additional Tariffs) విధించాలని యూఎస్టిఆర్ ప్రతిపాదించింది. ఈ కొత్త సుంకాలు తక్షణమే అమల్లోకి రావు. అవి ప్రజాభిప్రాయ సేకరణ ఉంటనుంది. అలాగే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని సంప్రదింపులు, సమీక్షలు జరగనున్నాయి. కానీ, ఒకవేళ ఇవి అమలులోకి వస్తే, సుప్రీంకోర్టు విధించిన సుంకాల పరిమితులను తప్పించుకోవడానికి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ చర్య వీలు కల్పిస్తుంది.ఇదీ చదవండి: కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం!బలవంతపు కార్మికులతో తయారు చేసిన వస్తువుల దిగుమతిని పరిష్కరించడంలో ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు విఫలమవడం ఆమోదయోగ్యం కాదని USTR జామీసన్ గ్రీర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అమెరికన్ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమాన పోటీ క్షేత్రంలో పోటీ పడవలసి వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి విఫల విధానాల వల్ల కంపెనీలు తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేస్తూ, మార్కెట్ పరిస్థితులను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. (అమెరికా చట్టాల తరహాలో భారతదేశంలో ప్రస్తుతం బలవంతపు శ్రమ వస్తువుల దిగుమతిపై ప్రత్యేక నిషేధ చట్టమేదీ లేదు.)అయితే, ప్రతిపాదిత సుంకాలతో పాటు గొడ్డు మాంసం, కాఫీ, కొన్ని రకాల పండ్లు మరియు గింజల వంటి వాటికి వివిధ మినహాయింపులు ఉన్నాయి. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి లోబడి ఉండే కెనడా మరియు మెక్సికో వస్తువులకు కూడా మినహాయింపు ఉంటుంది. అలాగే కొన్ని వస్త్రాలు, దుస్తులకు కూడా. జూలై 6 లోగా తమ లిఖితపూర్వక అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలను కోరింది. ఇదీ చదవండి: కాళ్లు, చేతులు తీసేస్తే తప్ప : కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల దుమారం -
సరిహద్దు వివాదం.. భారత్, నేపాల్ సంబంధాలకు కొత్త సవాల్!
న్యూఢిల్లీ: నేపాల్తో తలెత్తిన సరిహద్దు వివాదం పరిష్కారంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం పరిష్కారానికి యూకే, చైనాల జోక్యం కోరామంటూ నేపాల్ ప్రధాని బాలేన్ షా చేసిన ప్రకటనపై ఈ మేరకు స్పందించింది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన.. ‘భారత్, నేపాల్లు సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాయి. అంతేకాదు, 98% మేర సరిహద్దుల డీమార్కేషన్ కూడా పూర్తయింది కూడా. లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ ప్రాంతాలపై మాత్రమే చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్లో భాగమేనని భారత్ మొదటి నుంచీ చెబుతోంది’ అని జైశ్వాల్ వివరించారు.అంతకుముందు.. భారత్తో సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధానమంత్రి బాలేన్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంగళవారం ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలకు దిగడంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ప్రతినిధుల సభ– దిగువ సభ ఈ నెల 8వ తేదీ వరకు, నేషనల్ అసెంబ్లీ బుధవారం వరకు వాయిదా పడ్డాయి. భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా పలు ప్రాంతాల్లో భారత భూభాగాలను స్వాధీనం చేసుకుంది’ అంటూ ప్రధాని బాలేన్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.ఈ వ్యవహారంపై చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణుల సలహా తీసుకుని ఒక పరిష్కారం కనుగొంటామని, ఈ విషయంలో చైనా, యూకేల సాయం కూడా తీసుకుంటామని ఆయన ప్రకటించారు. మంగళవారం దిగువసభలో స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోలేదు. ప్రధాని బాలేన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, పార్లమెంట్ రికార్డుల నుంచి వాటిని తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో, స్పీకర్ ఈ నెల 8వ తేదీ వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
రష్యాకు అమెరికా బంపరాఫర్.. భారత్ ఆందోళన?
వాషింగ్టన్: అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ మెరుగు కోసం తాత్కాలికంగా రష్యా చమురుపై ఆంక్షలను ఎత్తేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు సెనేట్ విదేశీ విధానాల కమిటీ ఎదుట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం హాజరై ఈ విషయం వెల్లడించారు. అయితే, అమెరికా ప్రకటన భారత్కు ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ‘‘రష్యా నుంచి చమురును కొంటే ఆంక్షలు తప్పవంటూ గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోతున్నాం. ఇది తాత్కాలికం మాత్రమే. దీనిపై తుది నిర్ణయం అమెరికా ఆర్థికశాఖ తీసుకుంటుంది. రష్యా చమురు ప్రపంచదేశాలు అందుబాటులోకి వస్తే పశ్చిమాసియా చమురు సంక్షోభానికి కొంతైనా పరిష్కారం చూపినవారం అవుతాం’’ అని రూబియో తెలిపారు.అయితే, 2022లో ఉక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై భారీ ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురును తగ్గింపు ధరలకు అమ్మడం ప్రారంభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారత్ భారీ స్థాయిలో రష్యా చమురును దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. యుద్ధానికి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా చాలా తక్కువగా ఉండేది. కానీ గత నాలుగేళ్లలో రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారులలో ఒకటిగా మారింది. భారత రిఫైనరీలు తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.అమెరికా ఆందోళన?అమెరికా అభిప్రాయం ప్రకారం, రష్యా చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రష్యా ప్రభుత్వానికి మరియు యుద్ధ ఖర్చులకు ఉపయోగపడుతోంది. అందువల్ల రష్యా ఆదాయాన్ని తగ్గించేందుకు ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని అమెరికా కోరుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి రుబియో చేసిన వ్యాఖ్యల ప్రకారం, ప్రస్తుతం అమలులో ఉన్న కొన్ని తాత్కాలిక మినహాయింపులు శాశ్వతం కావు. వీటిని త్వరలో ముగించాలని అమెరికా యోచిస్తోంది.ఈ మినహాయింపులు ఎందుకు?2026లో ఇరాన్ యుద్ధం మరియు హోర్ముజ్ జలసంధి సమస్యల కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చమురు ధరలు మరింత పెరగకుండా ఉండేందుకు అమెరికా తాత్కాలికంగా కొన్ని దేశాలకు రష్యా చమురు కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది. ఈ మినహాయింపులను ఇప్పటికే రెండు సార్లు పొడిగించారు. ప్రస్తుత పొడిగింపు జూన్ 17 వరకు అమల్లో ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.భారత్పై ప్రభావం ఏమిటి?రష్యా చమురు దిగుమతులపై ఒత్తిడి పెరగవచ్చు.రవాణా, బీమా, చెల్లింపుల వ్యవస్థలు క్లిష్టం కావచ్చు.భారత్ ఇతర దేశాల నుంచి ఎక్కువ చమురు కొనాల్సి రావచ్చు.దేశీయ ఇంధన ధరలపై పరోక్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది.భారత్ వైఖరిభారత్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, అమెరికా మినహాయింపులు ఉన్నా లేకపోయినా భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉందని, భవిష్యత్తులో కూడా నిర్ణయం వాణిజ్య ప్రయోజనాలు మరియు ఇంధన భద్రత ఆధారంగానే ఉంటుందని చెప్పారు.మొత్తం మీద ఈ పరిణామం భారత్కు ముఖ్యమైనది. ఎందుకంటే రష్యా చమురు ప్రస్తుతం భారత ఇంధన వ్యూహంలో కీలక భాగంగా ఉంది. అయితే అమెరికా మినహాయింపులు ముగిసినా, భారత్ వెంటనే రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తుందని చెప్పలేం. తుది ప్రభావం అమెరికా అమలు చేసే ఆంక్షల తీవ్రతపై భారత్ ప్రత్యామ్నాయ సరఫరాలను ఎంత వేగంగా సమకూర్చుకోగలదనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. -
రూపాయి మరో 17 పైసలు డౌన్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం 17 పైసలు బలహీ నపడి 95.36 వద్ద ముగిసింది. క్రూడాయిల్ ధరలు ఎగసిపడటం, పెద్ద ఎత్తున పెట్టుబడులు సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు మళ్లడంతో అమెరికా డాలర్ బలంగా కొనసాగింది.మరోవైపు దేశీయ మా ర్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగింది. ఈ పరిణామాలు భారత కరెన్సీ కోతకు కారణమయ్యాయి. రూపాయి బలహీనపడటం వరుసగా రెండో రోజు ఇది. మరోవైపు మార్కెట్ వర్గాల దృష్టి జూన్ 3–5 తేదీల్లో జరగనున్న ఆర్బీఐ ఎంపీసీ సమావేశంపై కేంద్రీకృతమైంది. -
నేపాల్ సరిహద్దులో చైనా జోక్యం..? భారత్ రియాక్షన్
న్యూఢిల్లీ: నేపాల్- భారత్ సరిహద్దు వివాదంలో నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ ద్వైపాక్షిక అంశంలో మూడో పక్షం ప్రమేయం అవసరం లేదని తేల్చిచెప్పింది. నిన్న (మంగళవారం) ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యల చేశారు.ఇటీవల నేపాల్ ప్రధాని బాలేంద్రషా కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్- భారత్ సరిహాద్దు వివాదంలో చైనా, బ్రిటన్లు జోక్యం చేసుకోవాలని కోరారు. తాజాగా భారత్ దీనిపై స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ "సరిహద్దు విషయాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించడానికి మేము ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాము. భారత్-నేపాల్ మధ్య ఉన్న ఈ ద్వైపాక్షిక అంశంలో మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదనే విషయం సంబంధిత వర్గాలన్నింటికీ స్పష్టంగా అర్థం కావాలి" అని జైస్వాల్ పేర్కొన్నారు.సరిహద్దు సమస్యకు గల కారణాలుగండక్ నది మార్గం మారడం: 98% సరిహద్దు గుర్తింపు పూర్తయినప్పటికీ, గండక్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల కొన్ని ప్రాంతాలలో ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.గుర్తించబడిన సరిహద్దు ప్రాంతాలలో సరిహద్దు దాటి ఆక్రమణలు జరిగిన కేసులు ఉన్నాయి, ప్రస్తుతం వీటిని ఇరుదేశాలు కలిసి ఉమ్మడిగా మ్యాపింగ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. కైలాష్ మానససరోవర్ యాత్ర వివాదంలిపులేఖ్ పాస్ ద్వారా భారత్ నిర్వహించ తలపెట్టిన కైలాష్ మానససరోవర్ యాత్రపై నేపాల్ గత నెలలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆ ప్రాంతం ఉత్తరాఖండ్లో భాగమని భారతదేశం ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది. మే 3న దీనిపై స్పందించిన భారత్, నేపాల్ ఏకపక్షంగా సరిహద్దులను పెంచి చూపిస్తోందని దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని కొట్టిపారేసింది. -
భారత్ ను కమ్మేసిన 2500 కిలోమీటర్ల రాకాసి మేఘాలు
-
మీ బీరువాలో నిద్రపోతున్న బంగారంతో భారత్ కు బంగారు బాట మోదీ మాస్టర్ ప్లాన్
-
ఈ బేబీ ఎంజాయ్మెంట్ చూసి పెద్దలూ అసూయపడుతున్నారు!
ఒక వ్యక్తి తన చిన్నారి కుమార్తెను ఛాతీకి కట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో తండ్రి అక్షయ్ పాలీవాల్, 2001లో వచ్చిన దిల్ చాహ్తా హై సినిమాలోని వో లడ్కీ హై కహాన్ పాటకు స్టెప్పులు వేశాడు. బేబీ క్యారియర్లో ఉన్న చిన్నారి నవ్వుతూ, ఊగుతూ కనిపించింది.తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లిటిల్_మంచ్కిన్28లో ఈ వీడియోను పంచుకున్నాడు. కొద్ది సమయంలోనే ఇది వేగంగా వైరల్ అయి 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియో తమ ముఖంపై చిరునవ్వు తెప్పించిందని చెబుతూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తారు. ఇటీవల చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపిన మధురమైన క్షణాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న ధోరణిలో పెరుగుతోంది.యూజర్ల స్పందన"అయ్యో... బిడ్డ ఎంత ముద్దుగా ఉంది. అందరిలోకెల్లా క్యూటెస్ట్" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు."వెనుక వినిపిస్తున్న సంగీతం చాలా చాలా క్యూట్గా ఉంది," అని మరో నెటిజన్ అన్నాడు."బిడ్డ చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా ఆస్వాదిస్తోంది. చాలా బాగా చేశారు" అని మరో నెటిజన్ పేర్కొన్నాడు."నాన్న డ్యాన్స్కు బేబీ ఫుల్ సపోర్ట్.. వైరల్కు ఇదే సీక్రెట్!" అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. "స్టెప్పులు నాన్నవి.. షో మొత్తం బేబీదే" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు."బేబీ నవ్వితే చాలు.. 25 మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి" అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Adrija Paliwal (@little_munchkin28) -
జమిలి ఎన్నికలకు 2 దశల వ్యూహం
-
భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే!
భారత్లో ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్ల ప్రసారాలకు సంబంధించి లైన్ క్లియర్ అయింది. జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లకు సంబంధించిన ప్రసార హక్కులను జీ నెట్వర్క్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2026 నుంచి 2034 వరకు ఫిఫా ప్రపంచకప్ సహా మొత్తం 39 ఫిఫా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్లను ఆ చానెల్ ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని జీ ఎంటర్టైన్మెంట్ సోమవారం అధికారికంగా వెల్లడించింది. 2026 ఫిఫా ప్రపంచకప్తో పాటు ఫిఫా మహిళల ప్రపంచకప్ 2027, ఫిఫా ప్రపంచకప్ 2030 సహా మిగతా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్లను భారత్లో జీ నెట్వర్క్ ప్రసారం చేయనుంది. 8 ఏళ్ల కాలానికి ఒప్పందం చేసుకోవడంతో విలువ కూడా భారీ స్థాయిలోనే ఉండనుంది. రెండు రోజుల క్రితం ఫిఫా మ్యాచ్ల ప్రసారానికి సంబంధించి హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకుందని, సదరు బ్రాడ్కాస్టర్లకు 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం అందింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయినట్లు తెలుస్తోంది. అంతకముందు భారత్లో మ్యాచ్ల ప్రసార హక్కుల ఒప్పందం కోసం ఫిఫా వంద మిలియన్ డాలర్లను ఆశించింది. కానీ జీ నెట్వర్క్ మంచి ధరకే ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022 ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లకు భారత్లో ప్రసార హక్కులను అప్పట్లో వయాకామ్ 18 (న్యూస్ 18) 62 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా ఒప్పందం విలువ ఎంత అనేది పక్కనబెడితే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను భారత్లో వీక్షించాలనుకున్న అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను జీ నెట్వర్క్ ఇటీవలే కొత్తగా లాంఛ్ చేసిన నాలుగు స్పోర్ట్స్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. యునైట్8 స్పోర్ట్స్ 1 (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డి (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్), యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డి (ఇంగ్లీష్) లో మ్యాచ్లు ప్రసారం కానున్నాయి. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించే భాగ్యం లేకుండా పోయిందని తెగ బాధపడిపోయిన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.భారతీయ బ్రాడ్కాస్టర్లు ఈ హక్కులను కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపకపోవడానికి 'టైమింగ్స్' ఓ పెద్ద సమస్యగా మారాయి. ఈసారి టోర్నమెంట్లో మొత్తం 104 మ్యాచ్లు జరుగుతుండగా.. అందులో కేవలం 14 మ్యాచ్లు మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి లోపు ప్రారంభమవుతాయి. మిగిలినవన్నీ అర్ధరాత్రి దాటాక లేదా తెల్లవారుజామున ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ కూడా అర్ధరాత్రి 12:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది. పీడబ్ల్యూసీ ఇండియా మీడియా నిపుణుడు రాజేష్ సేథి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్లు ప్రసారమైతే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. పైగా చివరి నిమిషంలో డీల్ కుదిరితే స్పాన్సర్లను వెతుక్కోవడానికి ఛానెళ్లకు తగిన సమయం ఉండదు. జనాభా ఎక్కువగా ఉన్నంత మాత్రాన ప్రకటనకర్తలు డబ్బులు కుమ్మరించరని, వీక్షకుల సంఖ్యను బట్టే రేట్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.చదవండి: ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు! -
విద్యావ్యవస్థ : చైనాలో అలా.. ఇక్కడిలా!
ఒకే వయసు, ఒకే ప్రతిభ, ఒకే కలలు కంటున్న పిల్లల మధ్య భవిష్యత్తు పూర్తిగా వేరుగా ఉండటానికి కారణం ఒక్కటే – చదివే స్కూల్. ఇది సాధారణ విద్యా వ్యత్యాసం కాదు, కొత్త అసమానతల అగాథం. పిల్లల మధ్య పోటీ ఇప్పుడు 10వ తరగతిలో కాదు, ఎల్కేజీలోనే మొదలవు తోంది. ధనికుల పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్లలో గ్లోబల్ ఎక్స్పోజర్తో చదువుతుంటే, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు భారీ ఫీజులు, రుణాలు చెల్లించి ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా విద్య అనేది పెట్టుబడిగా కాకుండా రుణ ఉచ్చుగా మారుతోంది. ఇది ‘ఎవరు బాగా చది వారు’ అనే పోటీ కాదు, ‘ఎవరు మంచి ప్రారంభ స్థానం పొందారు’ అనే అసమాన పోటీగా మారింది. 1990ల తర్వాత జనాభా పెరిగింది, చదువు మీద ఆసక్తి పెరిగింది. కానీ ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు సకాలంలో విస్తరించలేదు. ఇంగ్లీష్ మీడియం ఆలస్యంగా ప్రవేశ పెట్టింది. ఈ ఖాళీని ప్రైవేటు రంగం పూరించింది. ఏసర్ 2024 ప్రకారం 6–14 వయసు పిల్లల్లో ప్రభుత్వ స్కూళ్ల ఎన్రోల్మెంట్ 66.8 శాతానికి పడిపోయింది (2022లో 72.9%, 2018లో 65.6%). తెలంగాణలో యూడీఐఎస్ఈ 2024–25 డేటా ప్రకారం, క్లాస్ 1లో ప్రభుత్వ స్కూళ్ల ఎన్రోల్మెంట్ 26 శాతానికి పడిపోయింది. 2013–14తో పోలిస్తే 40 శాతం తగ్గుదల. ప్రైవేటు స్కూళ్లలో విద్యా వంతులైన తల్లిదండ్రులు, హోమ్ సపోర్ట్, సెలెక్టివ్ అడ్మిషన్స్ ఉంటాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, పేదరికం, ఆరోగ్య–పోషకాహార సమస్యలు ఉన్న పిల్లలు ఎలాంటి సెలెక్షన్ లేకుండా చేరుతారు. ‘నీళ్లు ఉన్న చోట ఎవరైనా పంట పండించ వచ్చు. ఎడారిలో పంట పండించడం కష్టం’ అన్న సూక్తి ఇక్కడ పూర్తిగా వర్తిస్తుంది. సమస్య ప్రభుత్వ స్కూళ్ల వైఫల్యం కాదు, వ్యవస్థ డిజైన్, అమలు, పెట్టుబడి లోపాల్లో ఉంది. ఒకప్పుడు రైతు కొడుకు డాక్టర్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పుట్టిన కుటుంబం భవి ష్యత్తును చదువు నిర్ణయిస్తోంది.విద్యా వర్గ విభజనవరల్డ్ బ్యాంక్ అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అంతర్ తరం సామాజిక గతిశీలత (ఒక సామాజిక వర్గం నుంచి మరొక వర్గానికి ఎదగడం) నాలుగు దశాబ్దాలుగా స్థిరంగా ఉంది. పేద కుటుంబాల నుంచి ఉన్నత స్థాయికి ఎక్కడం అరుదైన విషయం. ఇది క్లాస్ లాక్–ఇన్కు (వర్గ బంధనం) దారి తీస్తోంది. ఇలా కొనసాగితే మన సమాజం అవకాశాలు కలిగినవారు, అవకాశాలు కోల్పోయినవారు అనే రెండు భాగాలుగా విడిపోయే ప్రమాదముంది.చైనాలో విద్యా వ్యవస్థ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులు నాణ్య మైన విద్యను పొందుతున్నందున వారు ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహద పడుతున్నారు. కానీ మన దేశంలో మిడిల్ క్లాస్, పేద వర్గాల విద్యార్థులు సమాన అవకాశాలు లేకపోవడం వల్ల చైనా విద్యార్థులతో పోలిస్తే చాలా తక్కువగా జీడీపీకి దోహదపడుతున్నారు. ఇది దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందుకే మన విద్యావ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కావాలి. అన్ని వర్గాల పిల్లలు ఒకే స్కూల్లో చదివే కామన్ స్కూలింగ్ సిస్టమ్ ఉండాలి. దానికి తగినట్టుగా ఆధునిక మౌలిక వసతులు, ఉపాధ్యాయ శిక్షణ, పెట్టుబడుల పెంపు అవసరం. ‘క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ – నాట్ ఫర్ ది ప్రివిలేజ్డ్’ అన్నది మన మార్గదర్శక సూత్రం కావాలి.చైనాలో విద్యావ్యవస్థ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నందున వారు ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహద పడుతున్నారు. -డా. మేడా జగన్మోహన రావు వ్యాసకర్త విద్యారంగ నిపుణులు -
దేశవ్యాప్తంగా పెరిగిన సిలిండర్ ధరలు
దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలను మరోసారి పెంచారు. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన రేట్లతో.. రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్లపై అదనపు భారం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే..ఇంధన నిల్వలను బలోపేతం చేయడం, పెరుగుతున్న డిమాండ్ను సమర్థంగా నిర్వహించడం, అక్రమ నిల్వలు (హోర్డింగ్).. మళ్లింపులను అరికట్టడం వంటి చర్యల నేపథ్యంలో ఈ ధరల సవరణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక.. కోట్లాది మంది గృహ వినియోగదారుకు ఊరట ఇస్తూ.. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను కూడా రూ.11 పెంచారు. దీంతో.. రూ.821.50కు చేర్చారు. ప్రధాన నగరాల్లో కమర్షియలు సిలిండర్ ధరలు ఒక్కోలా ఉన్నాయి.ఢిల్లీలో ఒక్క సిలిండర్పై రూ.42 పెరిగింది. దీంతో.. ధర రూ.3,113.50కు చేరుకుంది. కోల్కతాలో రూ.53.50 పెంపు అమల్లోకి రావడంతో రూ.3,255.50గా మారింది. పెరిగిన రేట్లతో.. తెలంగాణ హైదరాబాద్లో(రూ.52 పెంపు) రూ.3,315, ఇటు ఏపీ విజయవాడలో రూ.3,251.50, విశాఖపట్నంలో రూ.3,146.50కి కమర్షియల్ సిలిండర్ ధర చేరింది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంతగా ఉన్నాయి. ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 90 వేల మెట్రిక్ టన్నుల గరిష్ఠ స్థాయికి చేరగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కనీసం 30 రోజుల ఎల్పీజీ నిల్వలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశీయ అవసరాల కోసం రోజుకు సుమారు 72 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ డిమాండ్ ఉండగా, రిఫైనరీలు 50–52 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నాయి. సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంతో ఎల్పీజీ బ్యాక్లాగ్ 4.5 రోజులకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలు, భారీ మొత్తంలో కొనుగోళ్లు పెరగడంతో ఇంధన విక్రయాల్లో అసాధారణ వృద్ధి నమోదైందని ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంధన అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగగా, 14 జిల్లాల్లో పెట్రోల్ విక్రయాలు 100 శాతానికి మించి పెరిగాయి. దీంతో అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు.గత నాలుగు రోజుల్లో ఎల్పీజీ పంపిణీకి సంబంధించిన 6,500 దాడులు నిర్వహించగా, ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే పెట్రోల్ బంకుల్లో 900 తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల ధరల మార్పులు ఎలా ఉన్నాయి?వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ ఇంధన ధరలు, దిగుమతి వ్యయం, రవాణా ఖర్చులు, డిమాండ్ ఆధారంగా తరచూ మారుతూ ఉంటాయి. కానీ, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు ప్రధానంగా వినియోగించే వాణిజ్య ఎల్పీజీపై ఈ పెంపు ప్రభావం చూపిస్తూ వస్తోంది. ఎందుకు పెంచారు?పశ్చిమాసియాలో యుద్ధం.. హర్ముజ్లో నిలిచిన చమురు రవాణాదేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎల్పీజీ డిమాండ్వ్యూహాత్మక ఇంధన నిల్వలను బలోపేతం చేసే ప్రభుత్వ చర్యలుఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 30 రోజుల కనీస నిల్వల నిర్వహణ ఆదేశాలుఅక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు కఠిన చర్యలుసరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు అవసరమైన నిర్వహణ వ్యయాలుమొత్తంగా చూస్తే, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు జూన్ నెల ప్రారంభంలోనే ధరల షాక్ తగిలింది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అదనపు భారం లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. -
సీడీఎస్గా బాధ్యతలు చేపట్టిన రాజా సుబ్రమణి
న్యూఢిల్లీ: భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాల ఆధునీకరణ, త్రివిధ దళాల మధ్య సమన్వయం, ఏకీకరణను పెంపొందించే దిశగా సంస్థాగత సంస్కరణల కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా రాజా సుబ్రమణి వ్యాఖ్యానించారు. మన సాయుధ దళాల్లో స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, ఉపయోగాన్ని వేగవంతం చేస్తామని అన్నారు. జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో భారత సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, దృఢ దీక్షను ప్రదర్శించాయని కొనియాడారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సుబ్రమణి 1985 డిసెంబర్ 14న ఆయన భారత సైన్యంలో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందారు. 2023 మార్చి నుంచి 2024 జూన్ దాకా సెంట్రల్ కమాండ్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్– ఇన్–చీఫ్గా వ్యవహరించారు. జమ్మూకశ్మీర్, అస్సాంలో క్లిష్టమైన సైనిక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఎన్నో కీలక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. 2024 జూలై 1 నుంచి 2025 జూలై 31 దాకా వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా సేవలందించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మోడల్, విశిష్ట సేవా మెడల్లతో సత్కరించింది. -
నేపాల్-భారత్ వివాదంలోకి చైనా..?
ఖట్ట్మాండు: నేపాల్ ప్రధాని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో ఉన్న దీర్ఘకాలిక సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో చైనా, బ్రిటన్ దేశాలు జోక్యం చేసుకోవాలని కోరారు. నేపాల్ పార్లమెంట్లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విధంగా మాట్లాడారు. ఇటీవలే నేపాల్ ప్రధానిగా ఎన్నికైనా బాలేంద్ర షా ఆదివారం నేపాల్ పార్లమెంటులో మాట్లాడుతూ "కేవలం భారత్ మాత్రమే నేపాల్ భూభాగాలను ఆక్రమించలేదు. నేపాల్ కూడా భారత్కు చెందిన పలు ప్రాంతాలను ఆక్రమించింది. ఈ అంశంపై ఇరు దేశాలు దీనిపై చర్చించుకోవాలి." అని అన్నారు.ఈ సరిహద్దు వివాదం 'బ్రిటిష్ ఇండియా' కాలం నాటిదని, అందుకే ఈ సమస్య పరిష్కారంలో ఇంగ్లాండ్ (బ్రిటన్) కూడా పాలుపంచుకోవాలని నేపాల్ భావిస్తోందని షా పేర్కొన్నారు.వివాదం ఏంటి? లింపియాధురా, లిపులేఖ్ మరియు కాలాపానీ ప్రాంతాలపై నేపాల్ హక్కులు కోరుతోంది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత, జూన్ మొదటి వారం నుండి లిపులేఖ్ కనుమ ద్వారా భారత్-చైనాలు సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించబోతున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దౌత్యపరమైన నోట్ పంపింది.అయితే దీనిపై చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భారత్ ప్రత్యుత్తరం ఇచ్చినట్లు నేపాల్ ప్రధాని పేర్కొన్నారు.భారత ప్రభుత్వం స్పందననేపాల్ చేస్తున్న భూభాగాల వాదనలకు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఏకపక్షంగా సరిహద్దులను పెంచుకుంటూ పోవడం చెల్లదని, అయితే ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. -
చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ
భారత బ్యాడ్మింటన్ స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. సింగపూర్ ఓపెన్లో ఈ జోడీ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ జోడీ 18-21, 21-17, 21-16తో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియన్-ముహమ్మద్ ఫిక్రీ జంటపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ సాధించిన తొలి భారత డబుల్స్ జోడీగా సాత్విక్-చిరాగ్ రికార్డులెక్కారు. మ్యాచ్ తొలి గేమను 18-21 తేడాతో కోల్పోయినప్పటికీ, రెండో గేమ్లో ఫుంజుకొని సాత్విక్ - చిరాగ్ జోడీ అద్భుతంగా పుంజుకుంది. అనంతరం జరిగిన రెండో, మూడో గేమ్లలో వరుసగా 21-17, 21-16 స్కోర్లతో విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జోడీ రెండేళ్ల తర్వాత తమ తొలి అంతర్జాతీయ టైటిల్ను గెలుచుకుంది. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని అద్భుతమైన ప్రదర్శన చేయగల తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. మ్యాచ్ మొత్తం భారత జోడీ పోరాట పటిమ, సమన్వయం, దూకుడు ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి గేమ్లో వెనుకబడినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తిరిగి పోటీలోకి రావడం వారి విజయానికి ప్రధాన కారణమైంది. విజయం అనంతరం సాత్విక్-చిరాగ్ జోడీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. స్టేడియంలోని అభిమానుల మద్దతు తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొంది.‘గతంలో మేము కొన్ని కీలక మ్యాచ్లో ఓడిపోయాం. కానీ ఈ టోర్నమెంట్ మా కోసం ప్రత్యేకమైనదిగా నిలిచింది. ప్రేక్షకుల మద్దతు అద్భుతంగా ఉంది. ఎవరు ఆడుతున్నారన్నది పక్కనపెట్టి ప్రతి మ్యాచ్ను మీరు ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. మేము ఆడిన అత్యుత్తమ స్టేడియంలలో ఇది ఒకటి. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని వారు తెలిపారు.SATCHI ARE THE CHAMPIONS OF BWF SINGAPORE OPEN 2026 ❤️🏆#SingaporeOpen2026 https://t.co/bYmk2NWHoD pic.twitter.com/DQCoRSQVmS— Badminton Media (@BadmintonMedia1) May 31, 2026చదవండి: స్వియాటెక్కు షాక్.. వరుసగా 16వ విజయం -
సెమీకండక్టర్ దిగ్గజంగా భారత్!
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ రంగంలో భారత్ కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా దిగ్గజంగా ఎదగాలని, 2035 నాటికి 120–150 బిలియన్ డాలర్ల (రూ.14.25 లక్షల కోట్లు సుమారు) విలువైన సెమీకండక్టర్ వ్యాల్యూచైన్ నిర్మించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని నీతి ఆయోగ్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు అవసరమైన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతును ప్రభుత్వమే సమకూర్చడం ద్వారా యాంకర్ పాత్రను పోషించాలంటూ, తద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కల్పించొచ్చని పేర్కొంది. ‘భారత్ దేశ సెమీకండక్టర్ పరిశ్రమ భవిష్యత్’ పేరుతో ఒక నివేదికను నీతి ఆయోగ్ రూపొందించింది. అంతర్జాతీయంగా పోటీనివ్వగలిగిన సెమీకండక్టర్ వ్యవస్థను దేశీయంగా నిర్మించుకునేందుకు 135–180 బిలియన్ డాలర్ల (రూ.17.10 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చే దశాబ్ద కాలంలో అవసరమవుతాయని తెలిపింది. ముఖ్యంగా డిజైన్, ఫ్యాబ్రికేషన్, అత్యాధునిక ప్యాకేజింగ్, మేటీరియల్స్, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ మేరకు పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొంది. దిగుమతులను తగ్గించుకోవాలి.. ప్రస్తుతం భారత్లో సెమీకండక్టర్ల డిమాండ్ వేగంగా పెరుగుతుండగా, ఇందులో 90 నుంచి 95 శాతం వరకు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. దీనివల్ల భారీగా విదేశీ మారకద్రవ్యం తరలిపోవడమే కాకుండా, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడినప్పుడు దేశ రక్షణ, డిజిటల్ రంగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. 2035 నాటికి దేశీయ సెమీకండక్టర్ మార్కెట్ 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా వ్యక్తం చేస్తూ.. ఈ డిమాండ్ను దేశీయంగానే తీర్చుకునే విధంగా పరిశ్రమను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. దేశీయంగా డిమాండ్ స్థాయిలో ఉత్పాదకత లేకపోవడాన్ని గొప్ప అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. టెక్నాలజీలో స్వావలంబనతోనే వికసిత్ భారత్ బ్లాక్బాక్స్ సాంకేతికతల దిగుమతులపై ఆధారపడడం వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పెద్ద అవరోధమని నీతి ఆయోగ్ వైస్చ ఐర్మన్ అశోక లాహిరి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు సాంకేతిక సౌర్వబౌమత్వం పునాది కావాలన్నారు. అది మౌలిక వసతుల నుంచే ఆరంభం కావాలన్నారు. సరికొత్త పరిశోధనలు, సొంత డిజైన్ల సృష్టి, దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే స్థిరమైన విధానాలు, అధునాతన ప్యాకేజింగ్ మరియు కాంపౌండ్ సెమీకండక్టర్ల ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి అవసరమని ఈ నివేదిక సూచించింది. భారతదేశం కేవలం చిప్స్ వినియోగించే దేశంగా కాకుండా, ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో ఒక తప్పనిసరి భాగస్వామిగా మారాలనే తమ సంకల్పాన్ని ఈ నివేదిక చాటిచెబుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివేదిక విడుదల సందర్భంగా పేర్కొన్నారు. సెమీ కండక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను (డిజైన్, నైపుణ్య వనరులు, మెటీరియల్స్, ఎక్విప్మెంట్, ఫ్యాబ్, ప్యాకేజింగ్) నిర్మించడంపై తాము దృష్టి పెట్టినట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. -
52 నిమిషాల్లోనే ఖతం.. ఫైనల్లో సాత్విక్ జోడీ
సింగపూర్ ఓపెన్లో భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఫైనల్స్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ జోడీ 21-19, 21-18తో ప్రపంచ నంబర్వన్ జోడీ, కొరియాకు చెందిన కిమ్ వోన్-సియో సుంగ్ జె జంటను ఓడించింది. సాత్విక్-చిరాగ్ జోడీ 52 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించడం విశేషం. సాత్విక్ జంట ఫైనల్ చేరడంతో కనీసం రజతం ఖరారు చేసుకున్నట్లయింది. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ టాప్ గేర్లో ఆడింది. ఆరంభం నుంచి కొరియా జంటకు ముచ్చెమటలు పట్టించిన భారత ద్వయం రెండు గేమ్స్ల్లోనే జయభేరి మోగించింది. రేపు జరగనున్న ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ.. ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ(ఇండోనేషియా) లేదా లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ ఛాంగ్ జంటలో ఒకరిని ఢీ కొట్టనుంది.SatChi Into The Finals ✅️Massive Victory For Satwik/Chirag . They Defeated Korean WR 1 Pair Kim Won Ho / Seo Seung Jae In Straight Games 21-19 , 21-18 . The Last Time The Korean Pair Lost A Match Was At The 2025 Denmark Open .Final vs Alfian/Fikri 🇮🇩 (OR) Liang/Wang 🇨🇳 https://t.co/VcZBKAHLy0 pic.twitter.com/zp2ryhVL2T— Badminton Media (@BadmintonMedia1) May 30, 2026చదవండి: అరుదైన ఫీట్.. టీమిండియా సరసన పాకిస్తాన్ -
అభిమానులకు గుడ్న్యూస్.. కానీ 332 కోట్ల మెలిక!
భారత్లో ఫుటబాల్కు ఆదరణ తక్కువే అయినప్పటికీ.. బెంగాల్, కేరళ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఫుట్బాల్ ఆటకు యమ క్రేజ్ ఉంటుంది. భారత్లో కూడా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట ఫుట్బాల్ టోర్నీలు నిర్వహిస్తుండడంతో ఆదరణ పెరుగుతున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్కప్కు ఉన్న క్రేజ్ వేరు. ఈ మ్యాచ్లు లైవ్లో వీక్షించాలని ప్రతీ దేశం భావిస్తోంది. అయితే భారత్లో మాత్రం మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను లైవ్లో వీక్షించే అవకాశం లేకుండేది. అయితే తాజాగా భారత ఫుట్బాల్ అభిమానులకు ఒక గుడ్న్యూస్. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు జీ నెట్వర్క్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా దాదాపు పూర్తయింది. మరో 24-48 గంటల్లో ఒక ప్రకటన కూడా విడుదల కానుంది. అయితే ఫిఫా మ్యాచ్ల ప్రసార హక్కుల్ని జీ నెట్వర్క్ పొందాలనుకుంటే సదరు ఫిఫా బ్రాడ్కాస్టర్లకు 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారీ మొత్తం కావడంతో జీ నెట్వర్క్ వెనుకడుగు వేసినప్పటికీ చర్చలు నడుస్తున్నాయి. అయితే జీతో పాటు సోని పిక్చర్స్ నెట్వర్క్ కూడా ప్రసార హక్కులను దక్కించుకునేందుకు పోటీలో ఉంది. అయితే సోనీ నెట్వర్క్ మాత్రం బిడ్ దాఖలు చేయలేదు. దీంతో ఫిఫా వరల్డ్కప్ మ్యాచ్ల ప్రసార హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకోవడం లాంఛనమే అని చెప్పొచ్చు. ఇక జీ నెట్వర్క్ కొత్తగా నాలుగు స్పోర్ట్స్ చానెల్లను లాంచ్ చేసింది. యునైటెడ్ స్పోర్ట్స్ 1, యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్డీ (హిందీ), యునైట్ 8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్), యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్డీ (ఇంగ్లీష్) లాంచ్ చేసింది. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఒప్పందం ఖరారైతే మాత్రం ఈ మ్యాచ్లన్నింటి నాలుగు చానెల్స్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మొత్తంగా మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించే భాగ్యం లేకుండా పోయిందని తెగ బాధపడిపోయిన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.చదవండి: ‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభవ్ సూర్యవంశీ! -
ఎల్నినో ఎఫెక్ట్: ఈసారి ఆ “అద్భుతం” జరగకపోతే..?
రెండేళ్లపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలకు ఈసారి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్ధకాలం తరువాత రుతుపవనాలు బలహీనంగా మారే ప్రమాదం ఉందన్న భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలే ఇందుకు కారణం. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే ప్రమాదమే కాకుండా.. ఆ లోటు తీవ్రంగా ఉండే అవకాశమూ ఉందని ఐఎండీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 2015 నాటి అత్యల్ప వర్షపాత రికార్డులు బద్ధలవుతాయా?, ప్రజలు మరోసారి కరవు కోరల్లో చిక్కుకుంటారా? అన్న అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.భారతదేశానికి జీవనాధారం లాంటి నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో దాదాపు 70 శాతం వర్షాన్ని అందిస్తాయి. 2024, 2025లో ఈ సీజన్లో వర్షాలు బాగా కురిశాయి. జలాశయాలు నిండిపోయాయి. వ్యవసాయం కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. కానీ 2026లో ఈ సానుకూల పరిస్థితి ప్రతికూలంగా మారిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.👉భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయికి కేవలం 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ అంచనా నిజమైతే 2015 తర్వాత దేశంలో నమోదయ్యే అత్యల్ప వర్షపాతం ఇదే అవుతుంది. ఆ ఏడాది భారత్ తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో పంటలు దెబ్బతినడం, నీటి వనరులు తగ్గిపోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవడం వంటి ప్రభావాలు కనిపించాయి.ఇక ఈసారి మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. సాధారణంగా ఇలాంటి బలహీన మాన్సూన్ వచ్చే అవకాశం కేవలం 16 శాతం మాత్రమే ఉండగా, తాజా అంచనాల్లో అది ఏకంగా 60 శాతానికి పెరిగింది. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉందని అర్థమన్నమాట.ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎల్నినో అనేది.. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ నుంచి వచ్చే గాలులు, సముద్ర ప్రవాహాలు భారతదేశ రుతుపవనాలను బలపరుస్తాయి. అయితే ఎల్నినో వల్ల ఈ గాలుల వ్యవస్థ బలహీనపడిపోతుంది. ఫలితంగా భారతదేశానికి చేరే తేమ తగ్గి.. వర్షాలూ తగ్గిపోతాయి. అందుకే ఎల్నినో ప్రభావం వచ్చిన చాలా సంవత్సరాల్లో భారత్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.ఇక్కడ మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈసారి ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే సహజ వాతావరణ వ్యవస్థ అయిన భారత మహాసముద్ర డైపోల్ (IOD) కూడా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఐవోడీ సానుకూలంగా (positive phase) ఉన్నప్పుడు భారతదేశానికి అదనంగా తేమను అందించి వర్షపాతం కొంతవరకు పెరగడానికి సహాయపడుతుంది. కానీ ఈసారి అది న్యూట్రల్గా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే.. ఎల్నినో వల్ల వర్షాలు తగ్గే ప్రభావాన్ని సమతుల్యం చేసే “సహజ రక్షణ వ్యవస్థ” పనిచేయదన్నమాట. ఫలితంగా వర్షపాతం తగ్గే ప్రమాదాన్ని తగ్గించే అదనపు బలం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఎల్నినో ప్రభావం నేరుగా మాన్సూన్పై ఎక్కువగా పడే అవకాశం ఉండి.. వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాన్ని పెంచుతోంది.ప్రాంతాల వారీగా చూస్తే మధ్య భారతం, దక్షిణ భారతం, వాయువ్య భారతంలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గుజరాత్ నుంచి ఒడిశా వరకు విస్తరించిన మాన్సూన్ కోర్ జోన్లో వర్షాభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతుండటంతో పంటలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.👉వర్షాలు తగ్గితే వరి, పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గి ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ ప్రజలపై భారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. ఎల్నినో ఉన్నప్పటికీ ప్రతి సారి కరువు తప్పనిసరిగా వస్తుందనేది కాదు. గతంలో కూడా కొన్ని ఎల్నినో సంవత్సరాల్లో సాధారణ వర్షాలు నమోదైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే.. ఈ సీజన్ సూచనలు మాత్రం ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. 2015 కరువు రికార్డు మళ్లీ తిరగరాయబడుతుందా? లేదంటే ఏదైనా అద్భుతం జరిగి ఈసారి నైరుతి ఆశ్చర్యపరుస్తుందా? అని వాతావరణ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
సగటు జీవితాలే ప్రగతికి కొలమానం
విదేశాలలో నివసిస్తున్న చాలామంది భారతీయులకు, నేడు మన దేశం నిలు వెత్తు పురోగతికి సగర్వ చిహ్నంగా కనిపి స్తుంటుంది. వారు ఇక్కడి తళతళలాడే విమానాశ్రయాలు, ఆధునిక రహదా రులు, వేగంగా దూసుకుపోతున్న ఐటీ కారిడార్లను చూస్తుంటారు కనుక అది సహజమే. కానీ, ఏదైనా ఒక వ్యవస్థను సరిగ్గా ‘లెక్కించి’ చూడనంత వరకు ఆ వ్యవస్థ బయటకు కనిపించే తీరుకు, వాస్తవం ఏమిటన్న దానికి పొంతన ఉండటం అరుదు అని, ఇండి యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఒక శాస్త్రవేత్తగా నాకు అనిపిస్తుంటుంది.ఆధారాలు, గణాంకాలు లేకుండా, కేవలం ఒక నమ్మకంతో దేశాన్ని చూసి మురిసిపోవడమే ఇక్కడ సమస్య. ఈ ప్రవాస భారతీయుల ఉల్లాసభరిత భావోద్వేగం అనేది ఒక చిన్న అంచనా లోపం వల్ల వస్తుంది. అదేమిటంటే... మనం ఈనాటి భారతదేశాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చడం లేదు. మన చిన్ననాటి భారతదేశంతో పోల్చుకుంటున్నాం. మన చిన్నప్పుడు ఉన్నప్పటి భారతదేశం వనరుల కొరతతో, తక్కువ అవకాశాలతో ఉండేది. ఒక దేశాన్ని ఆ దేశపు పాత రోజులతో మాత్రమే పోల్చి చూసినప్పుడు... ప్రపంచ దేశాల రేసులో ప్రస్తుతం అది ఏ స్థానంలో ఉందనే అసలు నిజాన్ని మనం గమనించలేకపోతాం.ఏం చూస్తే అదే కనిపిస్తుంది! భారతదేశ వాస్తవ పరిస్థితి ప్రవాస భారతీయులకు తెలిసే అవకాశం లేదు. వారు ఇక్కడకు వచ్చినప్పుడు తమకు నచ్చిన వాటి వైపు మాత్రమే చూడగల ఒక మనోస్థితికి (సెలెక్షన్ బయాస్) లోనవు తారు. సంపన్నులైన తమ బంధువుల ఇళ్లలో గడపడం, దేశ సగటు ఆదాయం కంటే ఐదు నుండి పది రెట్లు ఎక్కువగా సంపాదించే బెంగళూరు, హైదరాబాద్ లేదా గురుగ్రామ్ వంటి ఆధునిక ఐటీ హబ్లలో తిరగడం వల్లనే వారి అభిప్రాయాలు ఏర్పడతాయి. వారు ఇక్కడ కేవలం మొదటి 1–5 శాతంలో ఉండే అత్యంత సంపన్న వర్గాన్ని మాత్రమే చూసి, అదే మొత్తం భారతదేశం అనుకుంటారు. ఇలా, వాస్తవాలకు దూరంగా ఉండటం అన్నది దేశభక్తి వల్ల మరింత ఎక్కువవుతుంది. విదేశాల్లో ఉండే చాలామంది భారతీ యులు, ప్రపంచ వేదికపై భారత ప్రధాని ఒక బలమైన నాయకు డిగా కనిపించినప్పుడు ఎంతో గర్వపడుతుంటారు. లోతుగా చూసిన ప్పుడు ఇలాంటి దౌత్య ప్రదర్శనలు భారతదేశ స్థితిగతులను ఏ మాత్రం ప్రతిబింబించేవి కావు. లెక్కల్లోనే నిజాలు ఉంటాయి!ప్రస్తుతం భారతదేశ తలసరి జీడీపీ దాదాపు 2,400 డాలర్లకు పెరిగినప్పటికీ, అదే సమయంలో మన తోటి దేశాలైన వియత్నాం 4,300 డాలర్లకు, ఇండోనేషియా 4,700 డాలర్లకు దూసుకెళ్లాయి. భారతదేశ వృద్ధి నిజమే అయినప్పటికీ, మిగతా మన లాంటి దేశాలతో పోల్చినప్పుడు అది అంత అసాధారణమైనదేమీ కాదు.మానవ జీవన ప్రమాణాలైన సగటు ఆయుర్దాయం, శిశు మర ణాల రేటు వంటి ప్రాథమిక విషయాలలో భారతదేశం ఇంకా వెనుక బడే ఉంది. ఉదాహరణకు, భారతదేశంలో ప్రతి 1,000 జననాలకు శిశు మరణాల రేటు దాదాపు 26గా ఉంది. ఇది వియత్నాం (14) కంటే దాదాపు రెట్టింపు, చైనా కంటే (6) చాలా ఎక్కువ. బహుశా అన్నింటికంటే విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారతదేశం ఎప్పుడూ చివరి వరుసలోనే ఉండటం! ఇటీవల 127 దేశాలలో ఇండెక్స్లో మన దేశం 105వ స్థానంలో నిలిచింది. పోషకాహార లోపం అనేది ఒక తీరని ‘అప్పు’ లాంటిది. ఇది భవిష్యత్తులో దశాబ్దాల పాటు పిల్లల మానసిక వికాసం, దీర్ఘకాలిక ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇంకా చెప్పాలంటే, యువత నిరుద్యోగిత అంచనాలుమొండిగా అలాగే ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా మహిళా కార్మిక భాగ స్వామ్యం కేవలం 20 శాతం వంటి స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు మనం దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పలేం. ఇది బంగ్లాదేశ్ (38 శాతం) లేదా వియత్నాం (70 శాతం) కంటే చాలా తక్కువ. ఒక దేశం తన జనాభాలో సగభాగాన్ని (మహిళలను) దేశ వృద్ధి చక్రం నుండి పక్కన పెట్టి, ఎప్పటికీ నిరంతర సంపదను లేదా పురోగతిని సాధించలేదు.ఈ గణాంకాలను చూపించినప్పుడు, ప్రవాస భారతీయులు తరచూ ఒకే రకమైన వాదనతో స్పందిస్తుంటారు: ‘వ్యూహాత్మక పెట్టుబడుల ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయి’ అని. కానీ ‘ఆర్ అండ్ డి’, ‘సిస్టమ్ ఎనాలిసిస్’ల ప్రపంచంలో దీనిని ఊహఅంటారు కానీ, విశ్లేషణ అనరు. దేశ పురోగతిని ప్రస్తుత ఫలితాల ఆధారంగా అంచనా వేయాలి కానీ, భవిష్యత్తు ఆశల ఆధారంగా కాదు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ముఖ్యమైనవే, కానీ వాటికవిగా మెరుగైన ఆరోగ్యం, ఎక్కువ ఆదాయాలు లేదా బలమైన ప్రభుత్వ సంస్థల సమగ్రతగా మారిపోవు. దీనర్థం, వ్యవస్థలుమనం బాగుపడుతున్నాయని నమ్మినంత మాత్రాన బాగుపడవు. వాటిని మనం నిజాయితీగా కొలిచి చూసి, బాగుపరచుకున్నప్పుడు మాత్రమే అవి మెరుగుపడతాయి.విద్య, ఉపాధి, వైద్యం ప్రధానభారతదేశ పురోగతికి అసలైన కొలమానం ఎక్స్ప్రెస్వేల సంఖ్య లేదా ప్రపంచ వేదికపై మన దేశ నాయకులకు ఉన్న గుర్తింపు కాదు. అసలైన కొలమానం ఒక సగటు భారతీయుడి జీవితం. పౌరులు అప్పుల పాలు కాకుండా నాణ్యమైన వైద్య సేవలను పొంద గలుగుతున్నారా? వారి పిల్లలు ఆధునిక ప్రపంచానికి సరిపోయేలా నాణ్యమైన విద్యను అందుకోగలుగుతున్నారా? ఆ పిల్లలకు ఆత్మ గౌరవాన్ని, భద్రతను ఇచ్చే స్థిరమైన ఉపాధి (ఉద్యోగం) దొరుకు తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం గనుక సందేహాస్పదంగా ఉంటే, ఆ దేశ పురోగతి ఇంకా అసంపూర్ణంగా ఉన్నట్లే లెక్క. ఉద్వేగంతో వేడుకలు చేసుకునే దేశభక్తి కాదు, ఆలోచనాత్మక మైన ఆధారాలతో కూడిన దేశభక్తి మనకు అవసరం. దేశాన్ని ఎంత గానో ప్రేమిస్తూ, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించిన నిజాన్ని నిజాయితీగా చెప్పగలిగే దేశభక్తి మనకు కావాలి.భారతదేశం కేవలం తన ‘భావపూర్వక సగర్వత’ వల్ల శక్తిమంతంగా మారదు.అది నిజాయితీతో కూడిన సమీక్ష, కచ్చితమైన లెక్కలు, సామాన్య పౌరుడిని పైకి తీసుకురావాలనే సంకల్పం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రపంచం భారతదేశాన్ని కేవలం భావో ద్వేగ కథనాలను చూసి గౌరవించదు, కళ్లముందు కనిపించే ఫలితా లను చూసి గౌరవిస్తుంది. ప్రవాస భారతీయుల ఉత్సాహం అర్థం చేసుకోదగినదే అయినప్పటికీ, భారతదేశ భవిష్యత్తు కోసం క్షేత్ర స్థాయి వాస్తవికత కూడా ఆ ఉత్సాహానికి తగ్గట్టుగా మారాలి.మేడా పరమేశ్వర రెడ్డి , వ్యాసకర్త ఇండో–అమెరికన్ రిటైర్డ్ సైంటిస్ట్, ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్ -
ప్రపంచం దూరమవుతున్నా.. భారత్ మా వెంటే
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. మరోసారి భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇజ్రాయెల్పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నా.. భారత్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇండియాలో ఇజ్రాయెల్కు అసాధారణమైన ఆదరణ ఉంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.వెస్ట్ బ్యాంక్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు.. భారత్తో ఇజ్రాయెల్కు ప్రత్యేక సంబంధం ఉందన్నారు. “ప్రపంచంలో చాలా చోట్ల మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ భారత్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఇజ్రాయెల్కు విపరీతమైన మద్దతు ఉంది” అని పేర్కొన్నారు. అంతేకాదు.. “నాకు ప్రపంచంలో ఎక్కడా లేనంత భారత్లోనే ఎక్కువ ఫాలోవర్లు ఉండొచ్చు” అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.నెతన్యాహు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా భారత్పై నెతన్యాహు ఇదే తరహాలో స్పందించారు. 2018లో తన భార్యతో కలిసి భారత్ పర్యటనకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. “అది లవ్ ఫెస్ట్లా అనిపించింది” అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ప్రజల్లో ఇజ్రాయెల్పై అపార గౌరవం ఉందని కూడా వ్యాఖ్యానించారు.Netanyahu:I’ll say this: we face delegitimization in much of the world — but not in India. In India, there is an absolutely crazy love for Israel, truly crazy. I think I have more followers from India than from anywhere else. pic.twitter.com/FRIo2cdVb3— Clash Report (@clashreport) May 28, 2026ఇదిలా ఉండగా.. అమెరికాలో మాత్రం ఇజ్రాయెల్పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నట్లు ఇటీవల వెలువడిన సర్వేలు చెబుతున్నాయి. తాజా ప్యూ రీసెర్చ్ సర్వే ప్రకారం అమెరికన్లలో 60 శాతం మంది ఇజ్రాయెల్పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని నెతన్యాహుపై నమ్మకం లేదని చాలామంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. అమెరికాలో ఇజ్రాయెల్ వ్యతిరేక భావనలు పెరగడానికి పాకిస్థాన్కు చెందిన సోషల్ మీడియా బాట్ నెట్వర్క్లు కారణమని ఆరోపించారు. “అమెరికన్లలా నటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ పరిశీలిస్తే వాళ్లు పాకిస్థాన్లోని బేస్మెంట్ల్లో కూర్చున్నవాళ్లని తేలుతోంది” అంటూ వ్యాఖ్యానించారు. -
భారత్ ప్రగతి అద్భుతం
కాన్బెర్రా: భారత్ సాధిస్తున్న ఆర్థిక ప్రగతి ఇండో–పసిఫిక్ ప్రాంతానికి అద్భుతమైన అవకాశమని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. కాన్బెర్రాలోని పార్లమెంట్లో గురువారం ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎదగనుందన్నారు. 2022లో కుదిరిన ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంతో రెండు దేశాల వాణి జ్య సంబంధాలు గణనీయంగా పెరిగా యన్నారు. 1991లో పర్యాటకుడిగా భారత్ వెళ్లిన తాను, ప్రధానిగా రెండు పర్యాయాలు భారత్ సందర్శించినట్లు చెప్పారు. భారత్ను దగ్గర్నుంచి పరిశీలించాలనుకునే వారిక బస్సు, రైలు ప్రయాణం ఉత్తమమని సలహాఇచ్చారు. ‘అదొక అద్భుతమైన అనుభవం. ప్రజల ఆప్యాయత చూసేందుకు చక్కని అవకాశం’అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాలో పర్యటించారు. -
యువతికి నరకం అంటే ఏంటో చూపించిన పూజారి
ఢిల్లీకి చెందిన ఓ పూజారి (27) తన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ను తిరస్కరించిన ఓ యువతికి నరకం చూపించాడు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అసభ్యకర, నగ్న మార్ఫింగ్ ఇమేజ్లు, ఫొటోలు రూపొందించాడు. ఆ పూజారి ఆన్లైన్లో మత వీడియోలు చేసేవాడు. సులభంగా దొరికే ఏఐ టూల్స్ వాడి మహిళ ఫొటోలను మార్చి, అనేక నకిలీ సోషల్ మీడియా ఖాతాల్లో అతడు అప్లోడ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అతడిని ఢిల్లీలో గుర్తించి, బుధవారం అరెస్టు చేశారు. మహిళలను ఆన్లైన్ వేధింపుల నుంచి కాపాడే “మిషన్ సైబర్ రక్షిక: #సెక్యూర్ హర్ స్పేస్” కార్యక్రమం కింద ఈ అరెస్టు జరిగింది.ఎలా మొదలైంది? ఆన్లైన్లో మత ప్రవచనాలు చేసే సుమిత్ నేమ్చంద్ శర్మతో గుజరాత్కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. శర్మ మొదట ఇన్స్టాగ్రామ్లో ఆమెతో చాట్చేసి, మత విషయాలపై సంభాషణలు ప్రారంభించినట్టు సమాచారం. తర్వాత అతడు ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నించగా, మహిళ తిరస్కరించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2025 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ 6 వరకు అతడు ఇంటర్నెట్ ద్వారా మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏఐతో అసభ్యకర కంటెంట్ బాధిత మహిళ శర్మతో ఫ్రెండ్షిప్ను తిరస్కరించడంతో ఆ యువతి, ఆమె తల్లి ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్లోడ్ చేశాడు. ఫొటోల్లో దుస్తులు లేకుండా చేసే ఏఐ టూల్స్ కోసం ఆన్లైన్లో వెతికాడు శర్మ. ఆ టూల్స్ సాయంతో 100కు పైగా అసభ్యకర మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు. వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు.ఆ మహిళ పేరు, ఫొటోలు వాడి శర్మ 3 నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, ఓ యూట్యూబ్ ఛానల్ సృష్టించాడు. ఏఐతో తయారైన కంటెంట్ను వాటిలో అప్లోడ్ చేసి, మహిళ, ఆమె కుటుంబ ప్రతిష్ఠ దెబ్బతినేలా కామెంట్స్ పెట్టాడు. దర్యాప్తులో పోలీసులు, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికల్లో అతడు 8 నుంచి 10 వరకు నకిలీ ఖాతాలు సృష్టించినట్టు గుర్తించారు.“నిందితుడు ఆ యువతితో పాటు ఆమె తల్లి ఏఐ మార్ఫింగ్ నగ్న ఫొటోలు, వీడియోలను నకిలీ ఖాతాల్లో అప్లోడ్ చేశాడు. మహిళను మానసికంగా వేధించి, సమాజంలో ఆమె ప్రతిష్ఠ దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేశాడు” అని అధికారులు తెలిపారు.“యువతి, ఆమె తల్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్లోడ్ చేసి, గూగుల్లో ‘ఏఐ రిమూవ్ క్లోత్స్’ అని వెతికిన తర్వాత అనేక వెబ్సైట్లు వాడి, కృత్రిమ మేధ సాధనాలతో మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు” అని అధికారులు తెలిపారు.ఢిల్లీలో దొరికిపోయాడు..బాధిత యువతి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బృందాన్ని ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ ఎంహెచ్ భేటారియా నేతృత్వంలోని పోలీసు బృందం, డిజిటల్ ట్రాకింగ్, మానవ సమాచార సాయంతో ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్పూర్లో నిందితుడి ఆచూకీని గుర్తించింది. ఆ ప్రాంతంలో పోలీసులు దాడి చేసి శర్మను అరెస్టు చేశారు. -
భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా?
భారతీయ మామిడిపళ్ల ఎగుమతులపై జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి మామిడి పండ్ల శుద్ధి కేంద్రాలలో, మగ్గబెట్టడం (Fumigation) క్రిమిసంహారక (Disinfection) చర్యలలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన తరువాత భారత్ నుండి వచ్చే తాజా మామిడి పండ్ల దిగుమతులను జపాన్ నిలిపివేసింది. మామిడి పండ్ల ఎగుమతులకు అత్యంత కీలకమైన ఏప్రిల్-జూన్ సీజన్లోఈ నిర్ణయం తీసుకోవడంతో మామిడి ఎగుమతులపై భారీ ప్రభావం చూపుతోంది.'ది ఎకనామిక్ టైమ్స్' నివేదిక ప్రకారంజపాన్ క్వారంటైన్ ఇన్స్పెక్టర్లు తనఖీల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అల్ఫోన్సో, కేసర్, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రముఖ భారతీయ మామిడి రకాల ఎగుమతులకు తీవ్ర విఘాతం కలిగింది.ఇదీ చదవండి: ఢిల్లీ వ్యాపారవేత్తకు బెంగళూరులో ఇస్త్రీ ధరల షాక్!యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ మార్చి 31న ఒక ప్రకటన విడుదల చేస్తూ, మార్చి 25, 2026 లేదా ఆ తర్వాత భారతదేశం జారీ చేసిన తనిఖీ ధృవీకరణ పత్రాలు (Inspection certificates) ఉన్న షిప్మెంట్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. భారతీయ కేంద్రాలలో నిర్వహణ ప్రమాణాలు మెరుగుపడ్డాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపుజపాన్ అధికారులు ఎలాంటి లోపాలను గుర్తించారు?మామిడి పండ్ల ఎగుమతి కోసం ఉపయోగించే వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) కేంద్రాలను పరిశీలించడానికి జపాన్ క్వారంటైన్ అధికారులు ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్లోని రెహమాన్పూర్ను సందర్శించారు.వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) అంటే ఏమిటి?ఇది ఎగుమతి చేయడానికి ముందు మామిడి పండ్లలోని పురుగులను, తెగుళ్లను నివారించడానికి ఎటువంటి రసాయనాలు లేకుండా, కేవలం వేడి మరియు తేమతో కూడిన గాలితో శుద్ధి చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి జపాన్ ప్రతి సంవత్సరం మామిడి సీజన్కు ముందు తన ఇన్స్పెక్టర్లను భారతదేశానికి పంపుతుంది.అయితే, ఈ ఏడాది పరిశీలనలో పొగబెట్టడం (Fumigation) మరియు దానికి సంబంధించిన క్రిమిసంహారక చర్యలలో లోపాలు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. దీనితో టోక్యో (జపాన్ ప్రభుత్వం) దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది. జపాన్ మార్కెట్లో మంచి ఆదరణ ఉన్న పలు రకాల మామిడి పండ్లపై ఈ నిషేధ ప్రభావం పడింది. వాటిలో ముఖ్యమైనవి ఇవి.అల్ఫోన్సో (Alphonso)కేసర్ (Kesar)లంగ్రా (Langra)బంగినపల్లి (Banganapalli)2025-26 ఆర్థిక సంవత్సరంలో జపాన్కు ఎగుమతి అయిన భారతీయ మామిడి పండ్లలో గుజరాత్కు చెందిన 'కేసర్' రకానిదే సింహభాగం. జపాన్కు జరిగిన మొత్తం తాజా మరియు ప్రాసెస్డ్ మామిడి ఉత్పత్తుల ఎగుమతుల విలువ $1.54 మిలియన్లు కాగా, అందులో కేసర్ రకం వాటానే సుమారు 0.2 మిలియన్ల డాలర్లుగా ఉంది.ఇది మొదటిసారి కాదు జపాన్ భారత్ నుండి మామిడి దిగుమతులను నిలిపివేయడం ఇది రెండోసారి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఎత్తివేసిన ఆంక్షలను జపాన్ మళ్లీ ఇన్నాళ్లకు విధించింది.1986లో తొలిసారి నిషేధంఫ్రూట్ ఫ్లైస్ (పండ్ల ఈగలు) వల్ల తెగుళ్లు వ్యాపించే ప్రమాదం ఉందనే ఆందోళనతో జపాన్ 1986లో తొలిసారి భారత మామిడి పండ్లపై ఆంక్షలు విధించింది. శాస్త్రీయ అధ్యయనాలు, చర్చలు జరిగినప్పటికీ ఆ నిషేధం 2006 వరకు (20 ఏళ్లు) కొనసాగింది.2006లో నిషేధం ఎత్తివేత: అప్పటి వాణిజ్య మంత్రి కమల్ నాథ్ నిరంతర ప్రయత్నాలు, జపాన్ క్వారంటైన్ బృందాల క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం.. భారతీయ మామిడి పండ్ల వల్ల ఎలాంటి తెగుళ్లు వచ్చే ప్రమాదం లేదని నిర్ధారించుకుని జపాన్ జూన్ 2006లో నిషేధాన్ని ఎత్తివేసింది. జపాన్ కోరినట్లుగా భారతదేశం వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) విధానాన్ని అమలు చేసింది.2006 తర్వాత ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని ఆమోదిత ప్రాంతాలలో పండే అల్ఫోన్సో, బంగినపల్లి, కేసర్, లంగ్రా, చౌసా, మల్లిక రకాల మామిడి పండ్ల దిగుమతికి జపాన్ అనుమతినిచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ లోపాలు బయటపడటంతో దిగుమతులను నిషేధించింది. భారతదేశానికి అత్యధికంగా మామిడి పండ్లను ఎగుమతి చేసే ప్రధాన దేశాలు: అమెరికా, యూఏఈ, యూకే, నెదర్లాండ్స్ మరియు సౌదీ అరేబియా. -
ప్రపంచ రికార్డుతో పసిడి పతకం గెలిచిన షూటర్ ఇషా సింగ్
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇషా సింగ్ కొత్త ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ఇషా సింగ్ 43 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో 42 పాయింట్లతో 2024లో కిమ్ యెజీ (దక్షిణ కొరియా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును కూడా ఇషా సింగ్ బద్దలు కొట్టింది. డొరీన్ (జర్మనీ; 38 పాయింట్లు) రజత పతకం... మిరోస్లావా (బల్గేరియా; 31 పాయింట్లు) కాంస్య పతకం గెల్చుకున్నారు. అంతకుముందు 98 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో ఇషా సింగ్ 587 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత్కే చెందిన మనూ భాకర్ 582 పాయింట్లతో 12వ స్థానంలో, రాహీ సర్నోబత్ 581 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. టాప్–8 వారికి మాత్రమే ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. -
ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచాలి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎగుమతుల పోటీతత్వం పెంచేందుకు పన్నుల తగ్గింపు, అవసరం లేని, అనర్ధదాయక వస్తువుల దిగుమతులపై నిషేధం విధించడంతోపాటు.. తగిన రక్షణ చర్యలు అవసరమని ఒక నివేదిక సూచించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్టు తెలిపింది. దీనివల్ల ఇంధనం, వ్యవసాయం, ఉత్పాదక రంగాలలో వ్యయాలు పెరిగి, ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నట్టు ‘థింక్ చేంజ్ ఫోరమ్’ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి సబ్సిడీలపై ఆధారపడటం పరిష్కారం కాదని సూచించింది. సబ్సిడీలు ఇవ్వడం వల్ల పరిశ్రమలు అంతర్జాతీయ సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని, సమర్థతను కోల్పోతాయంటూ.. వీటికి బదులు ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడానికి పన్నుల నిర్మాణంలో మార్పులు చేయాలని, దేశీయ పరిశ్రమలకు మేలు జరిగేలా దిగుమతి సుంకాలను ఎప్పటికప్పుడు సవరించాలని, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి అనవసరమైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవాలని సూచించింది. అవసరం లేని వస్తు దిగుమతులను తగ్గించడం అన్నది కేవలం పొదుపు చర్య మాత్రమే కాదని, అది దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ముఖ్యమైందన్న ప్రధాని మోదీ ఇటీవలి పిలుపును ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 774.98 బిలియన్ డాలర్లకు పెరగ్గా.. ఎగుమతులు 441.78 బిలియన్ డాలర్లుగా నమోదవడం తెలిసిందే. దీనివల్ల దేశ వాణిజ్య లోటు 333 బిలియన్ డాలర్లు దాటిపోయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ డేటాను ఉదహరించింది. రూపాయిని కాపాడుకోవాలి.. → అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన కరెన్సీ (రూపాయి) విలువను కాపాడుకునేందుకు తక్కువ విలువ జోడించే విడిభాగాలను కట్టడి చేయాలి. వీటి తయారీకి సంబంధించి దేశీయంగా తగిన తయారీ వ్యవస్థ ఉంది. → హానికారక వస్తు దిగుమతులను సైతం నిషేధించాలి. తక్కువ విలువతో కూడిన విచక్షణారహిత దిగుమతులను అనుమతించడం వల్ల విదేశీ మారకం నిల్వలపై ఒత్తిళ్లు పడుతున్నాయి. అదే సమయంలో దేశీయంగా బలమైన విలువ జోడింపు అవకాశాలు, సామర్థ్య విస్తరణ, ఉపాధి కల్పన అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. → పొగాకు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో అతిపెద్ద దేశమైనప్పటికీ.. 116 మిలియన్ డాలర్ల విలువైన సిగరెట్లు, సిగార్లు, టుబాకో, టుబాకో ప్రత్యామ్నాయాలను దిగుమతి చేసుకుంటోంది. → ఖరీదైన కన్ఫెక్షనరీలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, విలాసవంతమైన వాచీలు, కార్ల దిగుమతులను సాధారణ అనుమతుల జాబితా నుంచి తొలగించి, కఠినమైన నిబంధనలతో కూడిన ప్రత్యేక లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలి. → విదేశీ వస్తు దిగుమతులతో దేశీ పరిశ్రమలు నష్టపోతున్నప్పుడు, వాటిని రక్షించడానికి తగిన వాణిజ్య చర్యలను తగిన కాలపరిమితితో తక్షణమే అమలు చేయాలి. -
క్వాడ్లో మళ్లీ చలనం
ఉందో, ముగిసిపోయిందో తెలియని స్థితిలో ఏడాదిగా దారీతెన్నూ లేకుండా ఉండిపోయిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో ఎందుకనో కొంత చలనం వచ్చింది. మంగళవారం సభ్య దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల సమావేశం జరగటం, చివరిలో ఒక ఉమ్మడి ప్రకటన వెలువడటం ఆర్నెల్ల ముందు కూడా ఊహకందనిది. ఎందుకంటే నిరుడు జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రులు, శత్రువులన్న విచక్షణ మరిచి అందరితో గిల్లికజ్జాలకు దిగడం మొదలెట్టారు. నిర్విచక్షణగా సుంకాలు విధిస్తూ అందరినీ సమానంగా ఇబ్బందిపెట్టారు. ఇలాంటి స్థితిలో అమెరికా చొరవతో ఏర్పడ్డ క్వాడ్ ఇక ముగిసిన అధ్యాయమని అందరూ అనుకున్నారు. నిజానికి ఆరంభంనుంచి క్వాడ్ ఏదో కారణంతో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనేవుంది. చైనాకు వ్యతిరేకంగా 2007లో తొలి సమావేశం జరుపుకోగా ఆ మరుసటి ఏడాదికే జపాన్, ఆస్ట్రేలియాలు వైదొలగాయి. ఆ రెండుచోట్లా పాలకులు మారటం ఇందుకొక కారణం. 2008లో అప్పటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ ‘చైనాను కట్టడిచేసే ఎలాంటి కూటమిలోనూ భాగస్వాములం కాదల్చుకోలేదు’ అని కుండబద్దలుకొట్టారు. దాంతో దాదాపు పదేళ్లపాటు అది అచేతనావస్థలో పడింది. 2017 నాటికి దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం ప్రాంతాల్లో చైనా పెత్తనం పెరగటంతో ట్రంప్ చొరవ తీసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అయినా కోవిడ్ కారణంగా తొలి శిఖరాగ్ర సమావేశం జరగటానికి నాలుగేళ్లు పట్టింది. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, సముద్రజలాల్లో ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు, టెలికాం సాంకేతికత తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని విదేశాంగ మంత్రుల సదస్సు నిర్ణయించటం తాజా ప్రపంచ పరిణామాల పర్యవసానమే. హార్మూజ్ జలసంధి ప్రతిష్ఠంభన... ఇంధన సరఫరా నిలిచిపోవటం, ఆ ప్రాంతంవైపు నుంచి వచ్చే అండర్ సీ కేబుల్స్ సైతం ప్రమాదంలో పడటం వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో నౌకలను అడ్డగిస్తున్న ఇరాన్ వైఖరిని, వచ్చే పోయే నౌకలవద్ద సుంకాలు వసూలు చేసే ఆలోచనను క్వాడ్ సమావేశం తప్పుబట్టింది. అనవసర యుద్ధంతో ఇంత వివాదానికి కారణమై, తాను సైతం హార్మూజ్ను దిగ్బంధించిన అమెరికాకు జనాంతికంగానైనా మిగిలిన దేశాలు హితవు పలికాయా అన్నది తెలియదు.చైనాను నిరోధించి, ఇండో–పసిఫిక్ దేశాల భద్రతకు కృషిచేయాలని గతంలో చెప్పుకున్న సంకల్పం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కిపోయింది. ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి, ఎప్పటికప్పుడు క్వాడ్ దేశాలమధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవాలని నిర్ణయించినా దీనర్థం క్వాడ్ను సైనికీకరణ చేయటం కాదని మన విదేశాంగ శాఖ వివరణనిచ్చింది. క్వాడ్ ఇంధన వేదికను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించ బోతున్నామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ప్రకటించారు. కానీ ఈ సంస్థ శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడో చెప్పకపోవటం సందేహాలకు తావిచ్చింది. విదే శాంగ మంత్రుల సమావేశంలోనే శిఖరాగ్ర తేదీలు ప్రకటించటం ఆనవాయితీ. వాస్తవా నికి అది 2024లోనే భారత్లో నిర్వహించాలి. కానీ వాయిదా పడింది. ఈలోగా సుంకాల వివాదం నేపథ్యంలో ట్రంప్ మన దేశం రావటానికి చొరవ చూపటం లేదు. క్వాడ్ మొదలయ్యే నాటికి చైనా దూకుడు మీదుంది. ముఖ్యంగా హిందూ సముద్ర ప్రాంత దేశాలమీదుగా అది ప్రారంభించదల్చుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు భారత్ భద్రతకు ముప్పు తెస్తుందన్న సందేహం ఉంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల్లో ఆ దేశం తరచు సృష్టించే వివాదాలు సరేసరి. ఇలాంటి నేపథ్యంలో క్వాడ్లో భాగస్వామ్యం కావటానికి మన దేశం ముందుకొచ్చింది. ఆనాటి పరిస్థితుల మాటెలావున్నా ఎవరికీ అంతుచిక్కని ట్రంప్ వంటి అధినేతను నమ్మి ముందుకెళ్లటం ఇప్పుడు సాధ్యమేనా? ఆయన చైనాతో సాన్నిహిత్యం కోసం తహతహలాడుతున్నారు. అది ఒక రూపం తీసుకుంటే క్వాడ్ కాడిపడేయరన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే రక్షణేతర రంగాల్లో భాగస్వామ్యం వరకూ ఫర్వాలేకున్నా, ఇతర విషయాల్లో మన దేశం ఆచితూచి అడుగేయక తప్పదు. -
మార్కో రూబియో పర్యటన.. కీలక ఒప్పందాలు
ఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఇటీవలే భారత పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక రంగాలు, ఇంధనం, సాంకేతికత, ఖనిజాల సరఫరాకు సంబంధించి ఇరుదేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ పేర్కొంది.కీలక ఒప్పందాలుప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ (అరుదైన ఖనిజాల) సరఫరాపై చైనా తన పట్టును బిగిస్తున్న వేళ, భారత్-అమెరికాలు "యుఎస్-ఇండియా ఫ్రేమ్వర్క్ ఆన్ క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్స్" ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ద్వారా మైనింగ్, ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీ, ఉమ్మడి పెట్టుబడులు మరియు రీసైక్లింగ్ వంటి రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయనున్నాయి. సింగిల్-సోర్స్ మోనోపోలీల (ఏకఛత్రాధిపత్యం) నుంచి సరఫరా వ్యవస్థను కాపాడుకోవడమే దీని ప్రధాన లక్ష్యం.అరుదైన ఖనిజాల సరఫరాఈ పర్యటనలో అన్నింటి కంటే ముఖ్యమైనది 'క్లిష్టమైన ఖనిజాలు, అరుదైన భూ ఖనిజాల పై యూఎస్-ఇండియా ఫ్రేమ్వర్క్' ఒప్పందం. మైనింగ్, ప్రాసెసింగ్ నుండి అరుదైన అయస్కాంతాల తయారీ వరకు పూర్తి సరఫరా వ్యవస్థలో ఉమ్మడి పెట్టుబడులు, భాగస్వామ్యాలను పెంపొందించేలా దీనిని రూపొందించారు. గ్లోబల్ రేర్ ఎర్త్ మార్కెట్పై చైనా తన పట్టును బిగిస్తున్న తరుణంలో, దానికి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్య భాగస్వామ్యంతో కూడిన నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా వాషింగ్టన్, న్యూఢిల్లీలు ఈ అడుగు వేశాయి.ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నెలకొన్న అ స్థిరత కారణంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇంధనం, ఎరువుల ధరలు తీవ్రంగా మారుతున్నాయి. దీనిని అధిగమించడానికి ఈ పర్యటనలో రెండు ప్రధాన ఇంధన కార్యక్రమాలను ప్రకటించారు. క్వాడ్ ఫ్యూయల్ సెక్యూరిటీ ఫోరమ్ ఇండో-పసిఫిక్ ఎనర్జీ సెక్యూరిటీపై క్వాడ్ ఇనిషియేటివ్ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లీన్ ఎనర్జీ మార్కెట్గా ఉన్న భారతదేశం... ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రాంతీయ ఇంధన భద్రతకు ఒక ప్రధాన స్తంభంగా మారడమే కాకుండా, అమెరికన్ ఇంధన పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా నిలవనుంది. యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రశంసలుఈ పర్యటన ఫలితాలపై యూఎస్ఐబీసీ ప్రశంసలు కురిపించింది. ఆ సంస్థ ప్రెసిడెంట్ అంబాసిడర్ (రిటైర్డ్) అతుల్ కేశప్ మాట్లాడుతూ, "ఈ వారం ఇంధన భద్రత, క్లిష్టమైన ఖనిజాలు, సముద్ర ఓడరేవులపై వచ్చిన ప్రకటనలు క్వాడ్ కూటమి యొక్క ప్రాధాన్యతను నిరూపిస్తున్నాయి. న్యూఢిల్లీలో క్వాడ్ సమావేశాన్ని నిర్వహించడం అంతర్జాతీయ భాగస్వామిగా భారతదేశం యొక్క కీలక పాత్రను మరింత బలపరుస్తుంది" అని పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రమవుతున్న తరుణంలో, ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, దౌత్యపరమైన సత్సంబంధాలను వాణిజ్య పరమైన ఒప్పందాలుగా మార్చడంలో రూబియో దిల్లీ పర్యటన విజయవంతమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
బెదిరింపులకు విరుగుడు వ్యూహం
యూఎస్ఏ ఆధిపత్య వైఖరిని తిప్పి కొడుతున్న కెనడా విధానాలు భారత్ వంటి దేశాలకు మార్గదర్శకం. యూఎస్ఏ సుంకాల యుద్ధం, బెదిరింపులకు అనేక దేశాలు మోకరిల్లాయి. కానీ పొరుగు దేశం, చిరకాల మిత్రదేశమైన కెనడా తన దైన శైలిలో దీటుగా ప్రతిస్పందించింది. కెనడాను ట్రంప్ తన శైలిలో యూఎస్ఏ 51వ రాష్ట్రంగా వెక్కిరించాడు. కెనడా ప్రధాని కార్నీ దీనికి హుందాగా, వ్యూహా త్మకంగా బదులిస్తున్నాడు. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లకు గవర్నర్గా పనిచేసిన కార్నీ తన ఆర్థిక–బ్యాంకింగ్ రంగ అనుభవాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాడు.పరస్పర గమ్యంయూఎస్ఏ–కెనడా పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలు. కెనడా తయారీ రంగంలో 25 శాతం వాటా ఆటోమొబైల్ రంగానిదే. ఇవి 95 శాతం యూఎస్కు ఎగుమతి అవుతాయి. ఒక ఫోర్డ్ కారు తయారవటానికి విడి భాగాలు కనీసం ఎనిమిదిసార్లు యూఎస్– కెనడా సరిహద్దులను దాటుతాయి. యూఎస్ ముడి చమురు దిగు మతిలో కెనడా వాటా 60 శాతం. కెనడాలోని ఆల్బర్టాలో ఉత్పత్త యిన ముడిచమురు ఎన్బ్రిడ్జ్ పైపు లైన్ల ద్వారా మిన్నెసోటా– విస్కాన్సిన్ రాష్ట్రాల గుండా ఇల్లినాయిస్, ఓహియో రిఫైనరీలను చేరుతుంది. కెనడాలో ఉత్పత్తయిన బరువైన ముడి చమురును శుద్ధి చేయటానికి ప్రత్యేకంగా యూఎస్లో రిఫైనరీలను ఏర్పాటు చేశారు. కెనడాలోని క్యుబెక్ రాష్ట్రంలో ఉత్పత్తయిన జల విద్యుచ్ఛక్తి యూఎస్ లోని న్యూయార్క్, న్యూఇంగ్లాండ్ రాష్ట్రాలలోని సుమారు మిలియన్ గృహాలు వాడుకుంటున్నాయి. యూఎస్లో ఉత్పత్తవుతున్న విద్యు చ్ఛక్తిలో అణు విద్యుత్ వాటా 20 శాతం. దీనికి కావాల్సిన యురే నియం అణు ఇంధనాన్ని కెనడా ఎగుమతి చేస్తుంది. యూఎస్లోని డెయిరీఫామ్లు పాల ప్రాసెసింగ్కు కెనడాలోని క్యుబెక్పై ఆధారపడతాయి. ఎరువుల తయారీకి కీలకమైన పొటా షియం ప్రపంచ ఉత్పత్తిలో కెనడా వాటా 30 శాతం. యూఎస్లోని అయోవా, కన్సాస్, నెబ్రాస్కా వ్యవసాయ క్షేత్రాలు ఎరువులకు కెనడాపై ఆధారపడతాయి. కెనడాలో వినియోగించే పండ్లు, కూర గాయలు 80 శాతం యూఎస్ నుండి దిగుమతి అవుతున్నాయి. బోయింగ్ 737 విమానాల రెక్కలు కెనడాలో తయారవుతాయి. కెనడాలో ఉత్పత్తయిన ఉక్కులో 90 శాతం యూఎస్కు ఎగుమతి అవుతున్నది. కెనడా బ్యాంకుల శాఖలు యూఎస్లో విస్తారంగా పని చేస్తున్నాయి. స్థూలంగా కెనడా ఎగుమతులలో యూఎస్ వాటా 75 శాతం. అదే సమయంలో 34 అమెరికా రాష్ట్రాల ఎగుమతులకు కెనడా ప్రధాన గమ్యం.తమ ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను పట్టించు కోకుండా 2025 ఫిబ్రవరిలో ట్రంప్ కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించాడు. చమురు, విద్యుచ్ఛక్తిపై పది శాతం విధించాడు. దీని ప్రభావం కెనడా స్టీల్, అల్యూమినియం, కలప, ఆటో మొబైల్ పరిశ్రమలపై తీవ్రంగా పడింది. దాంతో ‘స్నేహితులే కానీ ఆధారపడటం కాదు’ వ్యూహాన్ని కార్నీ అమలుపరచాడు. ఎగుమతి రంగంలో 75 శాతం కేవలం ఒక దేశంపై ఆధారపడటం ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచిస్తుంది. అందుకే వ్యూహాత్మక వైవిధ్యత విధానాన్ని కెనడా ఎంచుకొన్నది.తమ్ముడు తమ్ముడే...కెనడాలోని వివిధ రాష్ట్రాలు యూఎస్ వాణిజ్యంపై ప్రతిదాడి మొదలుపెట్టాయి. ఒంటారియో రాష్ట్రం యూఎస్లోని మిచిగన్కు ఎగుమతి అవుతున్న విద్యుచ్ఛక్తిపై 25 శాతం సర్చార్జి విధించింది. క్యుబెక్ రాష్ట్రం యూఎస్ సంస్థల వాణిజ్య బిడ్లపై 25 శాతం పన్ను విధించింది. బ్రిటిష్ కొలంబియాలో టెస్లా కార్ల దిగుమతి రిబేట్లను ఉపసంహరించుకున్నది. కెనడాలో అమ్ముడుపోయే అన్ని ప్రముఖ యూఎస్ లిక్కర్ బ్రాండ్లను సూపర్ మార్కెట్లలో నిషేధించారు. న్యూఫౌండ్లాండ్ రాష్ట్రం స్టార్ లింక్ కాంట్రాక్టును రద్దు చేసింది. సమాంతరంగా కెనడా తన వాణిజ్యాన్ని యూఎస్ కేంద్రకం నుండి మరల్చి ఇతర బలమైన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలకు శ్రీకారం చుట్టింది. యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా, జపాన్, కొరియా, యూకే, ఆస్ట్రేలియాలతో వ్యూహాత్మక వాణిజ్య, రక్షణ ఒప్పందాలను చేసుకుంటున్నది.కెనడా – యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), యురే నియం, జలవిద్యుచ్ఛక్తిలను ఐరోపా దేశాలకు కెనడా ఎగుమతి చేస్తుంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తి, శుద్ధిపై చైనాకు గుత్తాధిపత్యం ఉన్నది. ఈ గుత్తాధిపత్యాన్ని సవాలు చేసే శక్తి ఉన్న అతి కొద్ది దేశా లలో కెనడా ఒకటి. కెనడాలో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ముడి ఖనిజ నిల్వలు అపారం. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రాడార్లు, యుద్ధ విమానాల ఉత్పత్తిలో కీలకమైన బ్యాటరీల తయారీ వీటి మీద ఆధారపడి ఉన్నది. కెనడాలో ఈ ఖనిజాల త్రవ్వకం, శుద్ధిలో పెట్టుబడులకు యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. నాటో రక్ష ఛత్రంపై నీలి నీడల నేపథ్యంలో ఐరోపా తనదైన రక్షణ, భద్రతా పథకాన్ని అమలు చేస్తున్నది. సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ (సేఫ్) పథకంలో కెనడాను భాగస్వామిగా చేయటానికి ఒప్పందం జరిగింది. 150 బిలియన్ యూరోల కాంట్రాక్టులను కెనడా డిఫెన్స్ కంపెనీలకు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తమైంది.కెనడా–చైనా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చైనా ఎలక్ట్రిక్ వాహనాలపైన ఉన్న నూరు శాతం సుంకాలను ఎత్తివేశారు. కెనడా నుంచి పశువుల మాంసం, క్రొవ్వు దిగుమతికి చైనా అంగీకరించింది. కెనడాలో బ్యాటరీ ప్లాంట్లను రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేయటానికి జపాన్తో ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా భాగస్వామ్యంతో క్యుబెక్ రాష్ట్రంలో లిథియం ఆక్సైడ్ బ్యాటరీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. హ్యుండాయి, కియా ఎలక్ట్రిక్ కార్లకు ఈ బ్యాటరీలను వాడతారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆస్ట్రేలియాతో యురే నియం, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలపై ఉమ్మడి పథకాలను రచిస్తున్నారు.దిక్కుతోచని ట్రంప్ఇటీవలి బీజింగ్ పర్యటనలో చైనా 200 బోయింగ్ విమానాల ఖరీదుకు సుముఖత చూపడాన్ని ట్రంప్ తన వ్యక్తిగత విజయంగా చూపించాడు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా సంస్థ ఏ220 తరగతికి చెందిన 150 పౌర విమానాల తయారీకి కెనడాతో 21 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇది కెనడా పారిశ్రామిక రంగానికి పెద్ద విజయం. కెనడా వ్యూహాత్మక ప్రతిఘటనకు ట్రంప్కు దిక్కుతోచడం లేదు. అమెరికన్ సంస్థల గణాంకాల ఆధారంగా కార్నీ అమెరికన్ ప్రతిపాదనలను తూర్పారబట్టాడు. ఈ నేపథ్యంలో కార్నీని అబద్ధాల కోరుగా ట్రంప్ నోరుపారేసుకున్నాడు. డెట్రాయిట్ నదిపై డెట్రా యిట్(యూఎస్)–విండ్సర్ (కెనడా)లను కలుపుతూ కెనడా నిర్మించిన గార్డీహావే వంతెన ప్రారంభం కాకుండా చూస్తానని హూంకరించడం ట్రంప్ నిస్సహాయతను సూచిస్తున్నది. కార్నీ అవలంబిస్తున్న ఈ ప్రతిస్పందన జియోపొలిటికల్ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసిందనటంలో సందేహం లేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఏఐ వినియోగానికి భారత్ సారథ్యం
అంతర్జాతీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో తదుపరి దశకి సారథ్యం వహించేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (కోర్ఏఐ) జయ్ పారిఖ్ తెలిపారు. దేశీయంగా డెవలపర్ల లభ్యత భారీ స్థాయిలో ఉండటం, కంపెనీలు ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడం మొదలైనవి సానుకూలాంశాలని వివరించారు. భారత్లో రూపొందిన హైపర్స్విచ్, ఈఆర్పీనెక్ట్స్, టూల్జెట్, బ్రూనో లాంటి ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని ఓ బ్లాగ్పోస్ట్లో పారిఖ్ పేర్కొన్నారు.‘ఏఐ తదుపరి దశ అనేది అత్యుత్తమ మోడల్స్ని ఎవరు రూపొందిస్తున్నారనే అంశంపై కాకుండా వాస్తవ ప్రపంచంలో ప్రభావవంతంగా పని చేసేలా, విశ్వసనీయతతో, వేగవంతంగా ఎవరు వినియోగంలోకి తేగలగుతారనే విషయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ పరివర్తనకి సారథ్యం వహించడానికి భారత్ సర్వసన్నద్ధంగా ఉంది‘ అని తెలిపారు. డెలాయిట్ నిర్వహించిన 2026 సర్వే ప్రకారం విస్తృత స్థాయిలో ఏఐ వినియోగిస్తున్న 15 దేశాల జాబితాలో భారత్కి అగ్రస్థానం దక్కడం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 40 శాతం ఎంటర్ప్రైజ్లు ఏఐని గణనీయంగానో లేదా పూర్తి స్థాయిలోనో వినియోగిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ఇది సగటున 28 శాతంగా ఉంది. పటిష్టంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు.. దేశీయంగా డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం భారత్కి మరో సానుకూలాంశమని పారిఖ్ చెప్పారు. ‘భారత్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పటిష్టంగా ఉంటోంది. గత దశాబ్దకాలంలో గుర్తింపు ధృవీకరణ వ్యవస్థ, చెల్లింపుల వ్యవస్థ, డేటా ప్లాట్ఫాంలను భారత్ విస్తృత స్థాయిలో తీర్చిదిద్దింది. డిజిటల్ చెల్లింపుల విధానమైన యూపీఐ ప్రస్తుతం నెలకు 2,000 కోట్ల పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. ఇది అంతర్జాతీయంగా జరిగే రియల్ టైమ్ చెల్లింపుల్లో దాదాపు సగం. డీపీఐతో ఏఐ అనుసంధానమవుతున్న నేపథ్యంలో ఆర్థిక సేవల నుంచి వైద్యం, విద్య వరకు అన్నింటా కృత్రిమ మేథ కీలక పాత్ర పోషించనుంది. తద్వారా ప్రపంచంలోనే తొలి భారీ ఏఐ పబ్లిక్ ఇన్ఫ్రా వ్యవస్థగా భారత్ ఎదగనుంది‘ అని పారిఖ్ తెలిపారు. -
భారత్, అమెరికా ‘ఖనిజ’ బంధం
న్యూఢిల్లీ: అరుదైన, కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత్, అమెరికాలు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అరుదైన భూ ఖనిజాలు, వ్యూహాత్మక లోహాల సరఫరా, ఎగుమతులపై చైనా విధిస్తున్న నియంత్రణల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. 🇮🇳🇺🇸 India & the U.S. just signed a landmark deal to secure supply chains for critical minerals & rare earths- cutting dependence on China & boosting strategic self-reliance. pic.twitter.com/bl3NJeLY4x— The Alternate Media (@AlternateMediaX) May 26, 2026 కీలక ఖనిజాల తవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో స్థిరత్వం సాధించాలని, ఇరుదేశాలు లాభపడేలా కలసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాయి. ఢిల్లీలో ‘క్వాడ్’ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇది చాలా సమయోచితమైన, కీలకమైన నిర్ణయమని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, సంబంధిత పెట్టుబడులతో సహా అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాలో సహకారాన్ని మరింతగా పెంపొందించడమే ఈ ఫ్రేమ్వర్క్ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: బైజూస్ ఫౌండర్కి ఆర్నెల్ల జైలు, రవీంద్రన్ స్పందన ఇదీ!పటిష్టమైన, వైవిధ్యభరితమైన సప్లైచైన్లను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. మైనింగ్, ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం లభిస్తుందని, ఖనిజాలు, లోహాల సమర్థవంతమైన నిర్వహణను దోహద పడుతుందని వివరించారు. ఎన్నో సవాళ్లు, అదే సమయంలో ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలో భారత్, అమెరికాల మధ్య సహకారం ఎంత సన్నిహితంగా ఉందో చెప్పడానికి ఈ ఒప్పందం ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుర్తుచేశారు. రెండు దేశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలకు తాజా ఒప్పందమే ఒక ఉదాహరణ అని వెల్లడించారు. మన ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థకు(ఇన్నోవేషన్ ఎకానమీ) ఖనిజాలు, సప్లై చైన్లు చాలా ముఖ్యమని తెలిపారు. ఇదీ చదవండి: 11 రోజుల్లోనే ... హమాస్ కీలక నేత హతం -
‘పట్టు’ పడితే తిరుగులేదంతే!
డా నాంగ్ (వియత్నాం): కుస్తీ క్రీడలో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న భారత మల్లయోధులు ఆసియా అండర్–23 చాంపియన్షిప్ ఫ్రీస్టయిల్ విభాగంలో ఓవరాల్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో భారత్ 180 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. చివరిరోజు భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. మోహిత్ కుమార్ (65 కేజీలు), చందర్మోహన్ (79 కేజీలు) స్వర్ణ పతకాలు నెగ్గారు. పునీత్ కుమార్ (92 కేజీలు), దీపక్ (61 కేజీలు), లక్కీ (125 కేజీలు) రజత పతకాలు కైవసం చేసుకున్నారు. దీపక్ (74 కేజీలు), సచిన్ మోర్ (86 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్స్లో మోహిత్ 12–4తో అబ్దిసమతోవ్ (కిర్గిస్తాన్)పై, చందర్మోహన్ 7–6తో అబిల్ యెర్ఖాన్ (కజకిస్తాన్)పై గెలుపొందారు. మిగతా టైటిల్ బౌట్లలో పునీత్ కుమార్ 1–12తో ఉలుక్బెక్ సురోమ్బెకోవ్ (కిర్గిస్తాన్) చేతిలో, దీపక్ 1–3తో నుర్దానత్ ఐతనోవ్ (కజకిస్తాన్) చేతిలో, లక్కీ 0–10తో రిజాబెక్ ఐత్ముఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. కాంస్య పతక బౌట్లలో దీపక్ 10–0తో వతన్ అన్నావోరజోవ్ (తుర్క్మెనిస్తాన్)పై, సచిన్ మోర్ 4–1తో రుజుమ్బొయెవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించారు. -
ఖనిజ సహకారంతో చైనాకు చెక్!
న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతుల విషయంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి నాలుగు దేశాల క్వాడ్ కూటమి ‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమాన్ని’ప్రారంభించింది. అరుదైన ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 20 బిలియన్ డాలర్ల (1.91 లక్షల కోట్లు) వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ ప్రాంతంలో సముద్ర నిఘా, ఓడరేవుల మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని క్వాడ్ విదేశాంగ మంత్రులు తీర్మానించారు.అలాగే ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. మంగళవారం ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అమెరికా, ఆ్రస్టేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, పెన్నీ వాంగ్, తోషిమిత్సు మొతేగి పాల్గొన్నారు. నాలుగు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు.‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమాన్ని’ఖరారు చేశారు. సమావేశం అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దేశాలు తమ సొంత మార్గాలను నిర్ణయించుకోవడానికి, సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి వీలు కల్పించే స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో–పసిఫిక్కు మద్దతును పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి స్పష్టమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని, నిర్దిష్టమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. అక్కడ ఏకపక్ష చర్యలు వద్దు హార్మూజ్ జలసంధి గుండా ప్రపంచ వాణిజ్యం నిరాటంకంగా సాగాలని విదేశాంగ మంత్రులు స్పష్టంచేశారు. అక్కడ వాణిజ్య నౌకలపై ఇరాన్ సుంకాలు విధించడాన్ని తప్పుపట్టారు. అలాగే తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే, బలప్రయోగంతో అస్థిరపరిచే లేదా ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు.చైనా తీరుపై మండిపడ్డారు. సముద్ర వనరుల అభివృద్ధిలో జోక్యం చేసుకోవడం, నౌకాయానం, విమానయాన స్వేచ్ఛకు పదేపదే ఆటంకం కలిగించడం సరైంది కాదన్నారు. ఆ ప్రాంతంలో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మానుకోవాలని చైనాకు తేల్చిచెప్పారు. తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వాన్ని భగ్నం చేసే చర్యలు మానుకోవాలని చైనాను పరోక్షంగా హెచ్చరించారు. చట్టాలను పాటించాల్సిందే: జైశంకర్ క్వాడ్ ఎజెండాలో భాగంగా కీలక, అరుదైన ఖనిజాల ఒప్పందం, ఇండో–పసిఫిక్ ఇంధన భద్రతా కార్యక్రమాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చర్చలు, ద్వైపాక్షిక సంప్రదింపుల్లో ఎక్కువ భాగం ప్రపంచ ప్రస్తుత పరిస్థితిపైనే జరిగాయని చెప్పారు. సహజంగానే, చర్చల ప్రధాన ఉద్దేశం ఇండో–పసిఫిక్కు సంబంధించిన అంశాలేనని అన్నారు.సురక్షితమైన, నిరాటంకమైన సముద్ర వాణిజ్యంపై చర్చించామని, ఎవరైనా సరే అంతర్జాతీయ చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో–పసిఫిక్కు అనేక కోణాలు, పార్శా్వలు ఉన్నాయని, వాటిలో సాధించిన పురోగతిని క్వాడ్ సమావేశం సమీక్షించిందని జైశంకర్ ఉద్ఘాటించారు. నాలుగు దేశాల మధ్య ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించాలని, సప్లై చైన్లను బలోపేతం చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. సముద్ర భద్రతకు చర్యలు: రూబియో ఇండో–పసిఫిక్ సముద్ర నిఘా సహకార కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్వాడ్ సమావేశం నిర్ణయించిందని మార్కో రూబియో తెలిపారు. ఇది ఇండో–పసిఫిక్లో మన నాలుగు దేశాల సముద్ర నిఘా సామర్థ్యాలను వినియోగించుకుంటుందని అన్నారు. క్వాడ్ దేశాల మధ్య ఇండో–పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. పసిఫిక్ దీవుల్లో ఓడరేవు మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి క్వాడ్ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60 శాతం ఇండో–పసిఫిక్ గుండానే సాగుతోందని గుర్తుచేశారు. అందుకే సముద్ర భద్రతకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు: చైనా బీజింగ్: క్వాడ్పై తన అక్కసును చైనా మరోసారి వెళ్లగక్కింది. కొన్నిదేశాలు కలిసి ప్రత్యేక కూటములు ఏర్పాటు చేసుకోవడం, ఇతర దేశాలతో ఘర్షణలకు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంగళవారం పేర్కొంది. క్వాడ్ విషయంలో తమ వైఖరిని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. దేశాల మధ్య సహకారం ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడాలని అన్నారు. అంతేతప్ప మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. కూటముల పేరిట మరో దేశంతో ఘర్షణ పడొద్దని చెప్పారు. -
భారత్ను అధిగమించిన తైవాన్!
గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కంటే తక్కువ జనాభా కలిగిన తైవాన్, భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా నిలిచింది. తైవాన్ మార్కెట్ విలువ సుమారు 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నట్లు బ్లూమ్బెర్గ్ డేటా వెల్లడించింది.తైవాన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్. ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) అనే చిప్ తయారీ సంస్థ భారీ వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది 49% వరకు పెరగడం వల్ల తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది.టీఎస్ఎంసీ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థగా.. ఎన్విడియా, ఆపిల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్, క్వాల్కామ్ ఉపయోగించే అధునాతన చిప్లను తయారు చేసి సరఫరా చేస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు ఏఐ, సెమీకండక్టర్ రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ.. తైవాన్ మార్కెట్లోకి పెద్ద మొత్తంలో నిధులు తరలిస్తున్నారు. ఫలితంగా తైవాన్ మార్కెట్ వేగంగా ఎదిగింది.అయితే.. ప్రస్తుతం భారత్ పరిస్థితి భిన్నంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, రూపాయి విలువ తగ్గడం, కార్పొరేట్ లాభాల మందగింపు వంటి కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు.. భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారు. అంతే కాకుండా గ్లోబల్ ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో భారత్కు ఇంకా పెద్ద స్థాయిలో లిస్టెడ్ కంపెనీలు లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.భారతదేశానికి పెద్ద ఆర్థిక వ్యవస్థ, 140 కోట్లకుపైగా జనాభా, వేల సంఖ్యలో లిస్టెడ్ కంపెనీలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటల్ ఎక్కువగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెట్లవైపు వెళ్తోంది. కానీ ఇప్పుడు తైవాన్.. భారత్ను అధిగమించడం అనేది ఇండియాకు పెద్ద నష్టం కాదు. ఈ సమయంలో కూడా దేశీయ పెట్టుబడిదారుల బలం, SIPలు, రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో భారత మార్కెట్ స్థిరంగా కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. -
మోదీని ఢీ కొట్టడానికి దీదీ మాస్టర్ ప్లాన్.. INDIA కూటమి భేటీ
-
ద్రవ్యోల్బణం దాడి.. సామాన్యుడి జేబుకు అధిక ధరల మంటలు!
భారత్లో 2026 ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. వినియోగదారుల ధరల సూచీ (CPI) ప్రకారం ఇది 3.48 శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 3.4 శాతంగా ఉండగా, ఇప్పుడు స్వల్పంగా పెరిగింది.పైకి చూస్తే ఈ పెరుగుదల పెద్దగా ప్రమాదకరంగా కనిపించకపోయినా, అసలు ఆందోళన కలిగిస్తున్న అంశం టోకు ధరల ద్రవ్యోల్బణం (Wholesale Inflation). మార్చిలో 3.88 శాతంగా ఉన్న హోల్సేల్ ఇన్ఫ్లేషన్, ఏప్రిల్లో 8.3 శాతానికి ఎగసిపడింది. ఇది గత 42 నెలల్లోనే అత్యధిక స్థాయి.ఈ గణాంకాలు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల్లో పెరుగుతున్న వ్యయభారం ఇంకా పూర్తిగా వినియోగదారులపై పడలేదని సూచిస్తున్నాయి. అంటే రాబోయే నెలల్లో సాధారణ ప్రజలపై ధరల భారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం ఇంధన, విద్యుత్ ధరల పెరుగుదల. ఫ్యూయల్, పవర్ విభాగంలో ధరలు 24.71 శాతం పెరిగాయి. ముఖ్యంగా పెట్రోలియం, సహజ వాయువు ధరలు 67 శాతానికి పైగా ఎగిశాయి.ఇంధన వ్యయాల పూర్తి ప్రభావం ఇంకా వినియోగదారులకు చేరలేదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆ భారం ఇక తప్పనిసరిగా ప్రజలపై పడే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిస్థితుల తర్వాత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నెలకు దాదాపు రూ.30 వేల కోట్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయని సమాచారం.దీంతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తప్ప కేంద్రానికి మరో మార్గం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల వ్యాఖ్యానించారు. రిటైల్ ఇంధన ధరల్లో పెరుగుదల అంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి.కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ మార్చిలో 3.87 శాతంగా ఉండగా, ఏప్రిల్లో అది 4.2 శాతానికి చేరింది. వాణిజ్య LPG సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవల ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత 19.2 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.850 నుంచి రూ.1000 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.ఆహార ఖర్చులు పైపైకి.. వలస కార్మికులు ఎక్కువగా ఉపయోగించే 5 కిలోల సిలిండర్ల ధరలు కూడా పలు ప్రాంతాల్లో రూ.200కు పైగా పెరిగాయి. ఇది నేరుగా ప్రజల ఆహార ఖర్చులను పెంచడమే కాకుండా వినియోగ డిమాండ్ను కూడా తగ్గించే ప్రమాదం ఉంది. ఇక మరోవైపు, వివాహాలు, విదేశీ పర్యటనల వంటి ఖరీదైన ఖర్చులను తగ్గించాలని, బంగారం వంటి విలువైన లోహాల కొనుగోళ్లు నియంత్రించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు.దీనికి కొనసాగింపుగా బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాలను పెంచింది. భారతీయులు ‘సేఫ్ ఇన్వెస్ట్మెంట్’గా భావించే బంగారం, వెండిపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా రూపాయిపై ఒత్తిడిని తగ్గించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. గత రెండున్నర నెలల్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ దాదాపు 8.5 శాతం పడిపోయింది.ఇది సాధారణ పరిస్థితి కాదు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూపాయి సగటున ఏడాదికి 2 నుంచి 3 శాతం మాత్రమే బలహీనపడింది. దీంతో ప్రస్తుత పరిస్థితి తీవ్రమైన నిర్మాణాత్మక ద్రవ్యోల్బణ ఒత్తిడిని సూచిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సీపీఐ (Consumer Price Index), డబ్ల్యూపీఐ (Wholesale Price Index) మధ్య భారీ అంతరం ఉండటం వల్ల ఉత్పత్తిదారులు పెరిగిన వ్యయాన్ని ఇంకా పూర్తిగా వినియోగదారులపై మోపలేదని అర్థమవుతోంది.కానీ ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగదని అంచనా. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన 2 నుంచి 6 శాతం పరిమితిలో ఉంచేందుకు RBI వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితి రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ద్రవ్యోల్బణం తాత్కాలిక ధరల పెరుగుదల కాదని, ఇది వ్యవస్థాత్మక ఆర్థిక ఒత్తిడి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు
వాహనదారులకు వరుస షాకులు తప్పడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు.. అదీ భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ సంస్థలు కిలో రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ రేటు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న సీఎన్జీ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీ-NCR రీజియన్లో కిలోకు రూ.83 కు చేరింది. మే 15 నుంచి ఇలా పెంచుకుంటూ రావడం ఇది నాలుగోసారి. అంతకు ముందు.. మే 15న రూ2, మే 18న రూ1, మే 23న మరో రూ.1 పెంచాయి. ఇప్పుడు తాజాగా రూ.2 పెంపుతో కేవలం 11 రోజుల్లోనే దాదాపు రూ.6 వరకు ధరలు పెరిగాయి.సీఎన్జీ ధరలు – నగరాల వారీ లిస్ట్ (కేజీకి)ఢిల్లీ – రూ.83ముంబై – రూ.81పుణే – రూ.92.50నాగ్పూర్ – రూ.88.90అహ్మదాబాద్ – రూ.82.30వడోదరా – రూ.81.35గాంధీనగర్ – రూ.76.98నోయిడా – రూ.85.07ఫరీదాబాద్ – రూ.88.72హైదరాబాద్ – రూ.99విజయవాడ – రూ.93గుంటూరు – రూ.92బెంగళూరు – రూ.90చెన్నై – రూ.91.5కోల్కతా – రూ.93.5గమనిక: నగరాల వారీ ధరలు గ్యాస్ కంపెనీ + రాష్ట్ర ట్యాక్స్లపై ఆధారపడి మారుతాయికాలుష్య నియంత్రణ లక్ష్యాలతో ప్రభుత్వాలు సీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నది తెలిసిందే. భారత్లో ముఖ్యంగా ఢిల్లీ-NCR, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పాటు టైర్ టూ సిటీల్లో, పట్టణాల్లోనూ సీఎన్జీ వాహనాల వినియోగం అధికంగా ఉంది. ఆటోలు, క్యాబ్లు, నగర బస్సులు వంటి రవాణా రంగం పెద్ద మొత్తంలో ఈ ఇంధనంపై ఆధారపడుతున్నాయి. అయితే ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు తక్కువ ఖర్చు ప్రత్యామ్నాయంగా భావించిన సీఎన్జీ కూడా పెరుగుతున్న రేట్ల వాహనదారుల్ని బెంబేలెత్తిస్తోంది. సీఎన్జీ ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితే. పశ్చిమాసియా సంక్షోభం, గ్యాస్ సరఫరా మార్గం హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు, గ్లోబల్ గ్యాస్ ధరల్లో మార్పులు.. ఫలితంగా భారత్ వంటి దేశాల్లో ఎల్ఎన్జీ (Liquefied Natural Gas) కొనుగోలు( దిగుమతి) ఖర్చు పెరుగుతోంది. తద్వారా ఎల్ఎన్జీని ప్రాసెస్ చేసి వాహన ఇంధనంగా మార్చే సీఎన్జీ సరఫరా వ్యయం కూడా పెరుగుతోందన్నమాట. రవాణా, నిల్వ, పంపిణీ వ్యయాలు పెరుగుతున్నాయి కాబట్టే గ్యాస్ పంపిణీ సంస్థలు రేట్లను సవరించాల్సి వస్తోంది. అయితే అంతిమంగా మాత్రం భారం వాహనదారులపైనే పడుతోంది. -
పెట్రో మోత.. లీటర్ పెట్రోల్ రూ. 117
-
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి.. భారత్కు మాత్రం ఓ గుడ్న్యూస్
భారత ఎగుమతుల పర్ఫార్మన్స్ 2026 ఏప్రిల్లో ఆశాజనకంగా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు నెలకొన్న సమయంలో కూడా భారత్ తన ఎగుమతి మార్కెట్లను విస్తరించడంలో ముందడుగు వేసినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.ప్రభుత్వం, పరిశ్రమల వర్గాలు కలిసి కొత్త మార్కెట్లను అన్వేషించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ వాణిజ్య అవరోధాల మధ్య కూడా 2026 ఏప్రిల్లో భారత సరుకు ఎగుమతులు దాదాపు 14 శాతం పెరిగి 43.66 బిలియన్ డాలర్లకు చేరాయి.ఈ పెరుగుదలలో కొంత భాగం అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల వచ్చినప్పటికీ, మరింత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. భారత ఎగుమతిదారులు చేరుకుంటున్న మార్కెట్ల సంఖ్య గణనీయంగా పెరగడం.ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఏడాదిలో కనీసం 20 ఎగుమతి విభాగాలకు చెందిన ఉత్పత్తులు 17 లేదా అంతకంటే ఎక్కువ కొత్త దేశాలకు చేరాయి. ఉదాహరణకు, భారత హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అదనంగా 29 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.ఈ కొత్త మార్కెట్లలో ఎగుమతుల పరిమాణం ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉన్నప్పటికీ, కొత్త మార్గాలను తెరవడం ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆర్గానిక్ ఇనార్గానిక్ కెమికల్స్ వంటి భారత ప్రధాన ఎగుమతి రంగాలు గత ఏడాదితో పోలిస్తే 2026 ఏప్రిల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి.మరో కోణంలోనూ మెరుగైన ప్రదర్శన ఇది ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ సామర్థ్యాన్ని మాత్రమే కాదు, కొత్త సరఫరా గొలుసులు కూడా ఏర్పడుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది. భారత ఎగుమతుల బలాన్ని అంచనా వేయడానికి మరో ప్రమాణం.. పెట్రోలియం ఉత్పత్తులు వాటి ధరల ప్రభావాన్ని పక్కనపెట్టి చూసే గణాంకాలు.ఈ కోణంలో కూడా భారత్ మెరుగైన ప్రదర్శనే చేసింది. 2026 ఏప్రిల్లో చమురుేతర ఎగుమతులు 9 శాతం పెరిగి దాదాపు 40 బిలియన్ డాలర్లకు చేరాయి. ముఖ్యంగా భారత సరుకు ఎగుమతుల వృద్ధి, దిగుమతుల వృద్ధిని మించి ఉండటం గమనార్హం.అయితే పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చిలో వచ్చిన భారీ పడిపోయిన ధోరణి కొనసాగుతూ ఏప్రిల్లో పశ్చిమాసియాకు భారత ఎగుమతులు 28 శాతం తగ్గాయి. ఆ ప్రాంతం నుంచి దిగుమతులు కూడా సుమారు 32 శాతం పడిపోయాయి.ఇది భారత్కు అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వామ్య ప్రాంతం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర ప్రాంతాల్లో వచ్చిన లాభాలు ఈ నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయి. ఇదే సమయంలో ‘సేఫ్ అసెట్’గా భావించే బంగారం దిగుమతులు ఏప్రిల్లో 82 శాతం ఎగసిపడ్డాయి.భారతీయులు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని పిలుపునివ్వడం, ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడం వెనుక ఇదే కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్ పవర్గా భారత్! మరో ముఖ్యమైన అంశం సేవారంగ ప్రాధాన్యం పెరుగుతుండటం. 2014లో భారత మొత్తం ఎగుమతుల్లో సేవారంగం వాటా 39 శాతం మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది దాదాపు 49 శాతానికి చేరుకుంది. అయితే, ఇక్కడే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు (AI) వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఐటీ సేవల రంగంలో భారత పోటీ సామర్థ్యం తగ్గితే అది పెద్ద దెబ్బ కావచ్చని సూచిస్తున్నారు. అయినప్పటికీ, వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఎగుమతి గమ్యస్థానాలను విస్తరించడం వంటి ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి.ఇకపై వ్యయం, నాణ్యత, ఉత్పత్తి పరిమాణం పరంగా భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని మరింత పెంచగలిగితే.. భారత్ నిజమైన గ్లోబల్ ట్రేడ్ పవర్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. - వెబ్ డెస్క్ -
మళ్ళీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
భారత్ తొలి ‘కే- పాప్’ స్టార్.. మన ఒడిశా అమ్మాయే..
ఝార్సుగూడ: ఒడిశాలోని ఒక చిన్న పట్టణమైన ఝార్సుగూడ నుంచి దక్షిణ కొరియా సంగీత ప్రపంచం ‘కే-పాప్’ వరకు ఒక సాధారణ యువతి సాగించి ప్రస్థానం ఇప్పుడు చర్చనీయాంశంగా నిలిచింది. ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరంతర రియాలిటీ షోల తిరస్కరణలను దాటుకుని, ‘బ్లాక్స్వాన్’ అనే అంతర్జాతీయ కే-పాప్ బ్యాండ్లో సభ్యురాలిగా చేరిన శ్రీయా లెంకా.. భారతీయ ప్రతిభను ప్రపంచ వేదికపై చాటారు.కన్నీటి కథలు లేని చోట గెలుపు లేదుశ్రీయా తన కెరీర్ ఆరంభంలో దాదాపు 40 రియాలిటీ షోల ఆడిషన్స్లో పాల్గొని విఫలమయ్యారు. అప్పట్లో ఆమె గమనించిన చేదు నిజం ఏమిటంటే, అక్కడ ప్రతిభ కంటే కంటెస్టెంట్ల ‘స్ట్రగుల్ స్టోరీలకే’ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ‘నా ప్రతిభను నమ్ముకున్నాను తప్ప, సానుభూతి కోసం కష్టాలను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు’ అని ఆమె తన తండ్రి అభిప్రాయంతో ఏకీభవించారు. ఈ తిరస్కరణలే ఆమెను మరింత దృఢంగా మార్చాయి.ప్రయాణ ఖర్చులకే కటకటలాడిన కుటుంబంఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన శ్రీయా, డ్యాన్స్ శిక్షణ కోసం తన తండ్రితో కలిసి ప్రతి వారం రూర్కెలా వెళ్లేవారు. బస్సు లేదా రైలు టికెట్లకు కూడా డబ్బులు లేని రోజుల్లో, తండ్రి అప్పుచేసి తనను తీసుకెళ్లేవారిని శ్రీయా గుర్తుచేసుకుంటారు. డ్యాన్స్ నేర్చుకోవాలనే తపనతో ఆమె పడిన కష్టం, ఆమెను కఠిన పరిస్థితులను తట్టుకునేలా తీర్చిదిద్దింది.కఠిన శిక్షణ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..కోవిడ్ సమయంలో డ్యాన్స్ క్లాసులు మూతపడటంతో శ్రీయా నిరాశలో ఉన్నప్పుడు, తండ్రి ఆమెకు ధైర్యాన్నిచ్చారు. అదే సమయంలో వచ్చిన కే-పాప్ ఆడిషన్స్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పాయి. రోజుకు 8 గంటల వోకల్ ప్రాక్టీస్, 6 గంటల డ్యాన్స్ సాధనతో తన గదిని డ్యాన్స్ ఫ్లోర్గా, ఇంటి పైకప్పును స్టేజీగా మార్చుకున్నారు. 40 వేల మంది పోటీదారులను వెనక్కి నెట్టి, అంతర్జాతీయ వేదికపై స్థానం సంపాదించడం వెనుక ఆమె చూపిన అంకితభావం సామాన్యమైనది కాదు.విజయపథంలో అడుగులుకొరియా వెళ్లిన కొత్తలో భాష, అక్కడి సంస్కృతి, కఠినమైన డైట్ చార్ట్ శ్రీయాకు కొత్త సవాళ్లను విసిరాయి. ఉదయం 4 గంటలకే నిద్రలేచి, అర్థరాత్రి వరకు కఠిన శిక్షణలో పాల్గొనే ఆమె, నేడు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ పర్ఫార్మర్ ఒక్కో షోకి దాదాపు రూ. 6 లక్షల పారితోషికం అందుకుంటున్నారు. శ్రీయా లెంకా కథ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా కలలను నిజం చేసుకోవాలనుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: ‘షిగెల్లా’ మళ్లొచ్చింది.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ -
అమ్మో.. ఒకటో తారీఖు! ఇక ‘ధరల తుపాను’ మొదలా?
దాదాపు నాలుగేళ్ల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడం కేవలం వాహనదారులకు షాక్ మాత్రమే కాదు.. రాబోయే భారీ ఆర్థిక తుపానుకు సంకేతమా? అనే చర్చ మొదలైంది. అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలు దెబ్బతినడంతో.. భారతదేశంలో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. కానీ ఈ పెంపు ప్రభావం కేవలం పెట్రోల్ బంకుల వరకే పరిమితం కాదని.. త్వరలోనే ప్రతి ఇంటి బడ్జెట్ను కుదిపేసే పరిస్థితి రావొచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.తాజాగా సోమవారం పెట్రోల్పై లీటర్కు రూ.2.61, డీజిల్పై రూ.2.71 చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే మే 15, 19, 23 తేదీల్లో కూడా వరుస పెంపులు చోటుచేసుకోవడంతో.. పదిరోజుల వ్యవధిలోనే పెట్రోల్పై మొత్తం రూ.7.34, డీజిల్పై రూ.7.45 వరకు భారమైంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.117 దాటగా.. హైదరాబాద్, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లోనూ ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడు సామాన్యుల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. “అమ్మో.. ఒకటో తారీఖు!”. ఎందుకంటే జీతాలు ఖాతాల్లో పడే సమయానికే గ్యాస్ సిలిండర్ ధరలపై మరో పెంపు ప్రకటన వచ్చే అవకాశముందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో.. గృహ వినియోగ LPG సిలిండర్ రేట్లు కూడా త్వరలో పెరగొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే.. మిగతా నిత్యావసరాల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళనలకు అసలు కారణం మాత్రం ఇంధర ధరల పెంపే. భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. కూరగాయల నుంచి పాలు వరకు.. ఆన్లైన్ డెలివరీ నుంచి విమాన టికెట్ల వరకు.. అన్నీ డీజిల్, పెట్రోల్పైనే ఆధారపడి ఉంటాయి. దీంతో ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారి ఆ ప్రభావం నేరుగా సామాన్యుడి జేబుపైనే పడుతుంది. ముందుగా ప్రజా రవాణా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బస్సులు, ఆటోలు, క్యాబ్లు, ట్యాక్సీల ఛార్జీలు పెరగొచ్చని సంకేతాలు వస్తున్నాయి. సరుకు రవాణా ఖర్చులు పెరిగితే మార్కెట్లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలు మరింత ఎగసిపడే అవకాశం ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. త్వరలోనే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫుడ్ డెలివరీ యాప్లు, ఈ-కామర్స్ కంపెనీలు కూడా డెలివరీ ఛార్జీలను పెంచే దిశగా అడుగులు వేయొచ్చని అంచనా. ప్రస్తుతం భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న కంపెనీలు.. పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చుల కారణంగా ఆ ఆఫర్లను తగ్గించే అవకాశం ఉంది. కనీస ఆర్డర్ విలువ పెరగడం, డెలివరీ ఫీజులు అధికమవడం వంటి మార్పులు కనిపించొచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. రైతులు ట్రాక్టర్లు, మోటార్లు, నీటి పంపులు వంటి వ్యవసాయ పరికరాల కోసం డీజిల్పైనే ఆధారపడాల్సి వస్తోంది. డీజిల్ ధరలు పెరిగితే సాగు ఖర్చులు పెరిగి.. చివరకు ఆ భారం కూడా ఆహార ధరల రూపంలో ప్రజలపైనే పడుతుంది.ఇప్పటివరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తూ వచ్చింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరింత పెరుగుతుండటంతో ఇప్పుడు కేంద్రానికీ పరిమితులే కనిపిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు త్వరలో చల్లారే సూచనలు లేకపోవడం, హర్ముజ్ మార్గంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని ధరల పెంపులు తప్పవన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.ఇంధన ధరల పెంపు అంటే కేవలం బైక్కు పెట్రోల్ కొట్టించుకునే ఖర్చు పెరగడం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఉద్ధృతం కావడానికి అది ఆరంభ సంకేతమని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ‘సర్దుకుపోదాం’ అనుకున్న సామాన్యుడు.. ఇక ముందు ‘ఎంత తగ్గించుకుని బతకాలి?’ అనే పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావొచ్చనే ఆందోళన పెరుగుతోంది. -
భారత్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు ఈసారి పెద్ద షాకే తగిలింది. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు మూడేసి రూపాయాల చొప్పున పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. సీఎన్జీపైనా పలు నగరాల్లో స్వల్ప పెంపు కనిపిస్తోంది. పెరిగిన ధరలు సోమవారం ఉదయం 6గం. నుంచే అమల్లోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంధన భారం అధికంగా కొనసాగుతుండడం గమనార్హం.అమెరికా-ఇరాన్ యుద్ధంతో భారత్కు వచ్చే చమురు రేట్లు పెరిగిపోయింది. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు ఆయిల్ కంపెనీలకు ధరల పెంపునకు కేంద్రం అనుమతి ఇస్తోంది. తాజాగా పెట్రోల్పై లీటర్కు రూ.2.61 పైసలు, డీజిల్పై రూ.2.71పైసలు చొప్పున పెంచారు. మొత్తంగా పదిరోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు ఇంధన ధరలు పెంచేశారు.మే 15.. రెండింటిపైనా రూ.3 చొప్పున పెంపుమే 19.. పెట్రోల్పై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంపుమే 23.. 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంపు మే 25.. రూ.2.61 పైసలు.. డీజిల్పై రూ.2.71 పైసలు పెంపుఅంటే ఇప్పటివరకు.. అదీ పదిరోజుల వ్యవధిలో పెట్రోల్పై లీటర్కు రూ.7.34, డీజిల్పై లీటర్కు రూ.7.45 పెరిగిందన్నమాట. తాజా రేట్లు (పెట్రోల్ రూ.2.61, డీజిల్ రూ.2.71 పెంపు కలిపి):ఢిల్లీ: పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.95.12ముంబై: పెట్రోల్ రూ.110.88, డీజిల్ రూ.97.48హైదరాబాద్: పెట్రోల్ రూ.115.84, డీజిల్ రూ.103.76కోల్కతా: పెట్రోల్ రూ.112.79, డీజిల్ రూ.99.47చెన్నై: పెట్రోల్ రూ.108.14, డీజిల్ రూ.99.84బెంగళూరు: పెట్రోల్ రూ.110.30, డీజిల్ రూ.98.44పాట్నా: పెట్రోల్ రూ.112.88, డీజిల్ రూ.99.23జైపూర్: పెట్రోల్ రూ.112.37, డీజిల్ రూ.97.94తిరువనంతపురం: పెట్రోల్ రూ.114.72, డీజిల్ రూ.103.71చండీగఢ్: పెట్రోల్ రూ.101.64, డీజిల్ రూ.89.90విజయవాడ (ఏపీ): పెట్రోల్ రూ.117.96, డీజిల్ రూ.105.79విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ రూ.116.44, డీజిల్ రూ.103.94తిరుపతి(ఏపీలో): పెట్రోల్ రూ. 117.08పై, డీజిల్ రూ. 104.75 గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చుపశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలు దెబ్బతిన్నాయి. నౌకా రవాణా అంతరాయం వల్ల అధిక ధరలకు క్రూడాయిల్ను కొనుగోలు చేయాల్సి వస్తోందని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు చెబుతూ వచ్చాయి. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నాయని, వాటిని ఎక్కువకాలం భరించడం సాధ్యం కావట్లేదని ఆయిల్ సంస్థలు కేంద్రానికి వివరించాయి. ఇప్పటివరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసి ధరల పెంపును నియంత్రించే ప్రయత్నం చేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరింత పెరుగుతుండటంతో ఇప్పుడు ధరల సవరణలు తప్పవని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారకపోవడం, హర్ముజ్ ప్రాంతంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో కూడా ఇంధన ధరలు దశలవారీగా మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చేసిన పెంపు మాత్రమే సరిపోదని, ఆయిల్ కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చుకోవడానికి ఇంకొన్నిరోజులపాటు ధరల పెంపులు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. -
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛ తగ్గుతోందా?
భారతదేశంలో రాష్ట్రాలు తమ ఆర్థిక స్వయంప్రతిపత్తిని కోల్పోతున్నాయని చెప్పేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయి. ఫెడరల్ వ్యవస్థలో అనువైన ఆర్థిక వాతావరణానికి కేంద్రం – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ సంబంధాలు అవసరం. రాజకీయ పునర్వ్యవస్థీ కరణ, ఆర్థిక సంస్కరణలు, న్యాయవ్యవస్థ జోక్యం కారణంగా స్వాతంత్య్రానంతరం కేంద్రం–రాష్ట్రాల సంబంధాలలో నిరంతరం పరివర్తన జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 268 నుంచి 293 వరకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను వివరిస్తాయి. ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో పెట్టుబడులపై నియంత్రణలు తొలగాయి. రాష్ట్రాలకు విస్తృత కార్య నిర్వహణ అవకాశాలు దఖలుపడ్డాయి. కానీ రాష్ట్రాలు రెవెన్యూ బదిలీకి కేంద్రంపై అధికంగా ఆధారపడటం వలన రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి పరిమితంగా ఉంది. పన్ను విధించే అధికారాల విభజన, గ్రాంట్– ఇన్–ఎయిడ్, రుణసమీకరణ అధికారాలు లాంటివి కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సంబంధాల ముఖ్య లక్షణాలుగా పేర్కొనవచ్చు. మొత్తం మీద ఆదాయంలో సింహభాగం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. జాతీయ సమగ్రతను పెంపొందించడం, అత్యవసర పరిస్థితులను ఎదు ర్కోవడం, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటివాటికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తుంది. అయితే కేంద్రానికి ఉన్న అత్యధిక ఆర్థిక అధికారాల కారణంగా రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి ఇబ్బందులకు లోనవుతోంది. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం రాష్ట్రాలు ఎదురు చూడవలసి వస్తోంది. ఈ దుఃస్థితికి కారణాలేంటి?భారత్లో వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు క్షీణించడానికి... ఉద్యోగస్థుల వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు అధికంగా ఉండటం; రాష్ట్రాలకు పన్ను విధించే అధికారాలు పరిమితంగా ఉండటం, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల అమలు కారణాలుగా చెప్పవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రాలు అధిక రెవెన్యూ లోటు, అధిక రుణ–జీఎస్డీపీ లాంటి సమస్యలను ఎదుర్కొంటు న్నాయి. అధిక ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి రాష్ట్రాలు సమీకరించిన మొత్తం రుణంలో మార్కెట్ రుణాల వాటా 2025–26లో సుమారు 76 శాతంగా ఉండటాన్ని బట్టి రాష్ట్రాల ఆర్థిక స్థితి పటిష్టంగా లేదని తేటతెల్లమవుతున్నది. మార్చి 2026 నాటికి రాష్ట్రాల మొత్తం రుణం, జీఎస్డీపీలో 30 శాతం పైగా నమోదయింది. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ రుణాల కారణంగా రాష్ట్రాల వడ్డీ చెల్లింపుల మొత్తం జీడీపీలో 1.5 నుండి 1.9 శాతం మధ్య ఉంది. ఆర్బీఐ నివేదిక ‘ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025–26’ ప్రకారం అధిక రుణం కల్గిన జాబితాలో తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా, తదుపరి స్థానాలలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిలిచాయి. అధిక వ్యయం,సంక్షేమ కార్యక్రమాల అమలు కారణంగా రాష్ట్రాల మొత్తం రుణంలో దక్షిణాది రాష్ట్రాల వాటా అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. రుణ – జీఎస్డీపీ నిష్పత్తి అధికంగా పంజాబ్లో నమోదు కాగా, తర్వాతి స్థానాలలో పశ్చిమ బెంగాల్, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ నిలిచాయి. ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు తక్కువ రుణ ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నాయి.కొరవడిన ఆర్థిక స్వేచ్ఛవివిధ రాష్ట్రాలలో రెవెన్యూ రాబడి తక్కువగా ఉండటానికి అల్ప పారిశ్రామిక లేదా ఆర్థిక కార్యకలాపాలు, పన్ను వసూళ్ళు బలహీనంగా ఉండటం, కేంద్ర ప్రభుత్వ నిధుల బదిలీలు, గ్రాంట్లపై రాష్ట్రాలు అధికంగా ఆధారపడటం కారణాలుగా నిలిచాయి. వస్తు, సేవల పన్ను వసూళ్ళు పటిష్టంగా ఉండటం, పారిశ్రామిక, సేవా రంగ కార్యకలాపాలు అధికంగా ఉండటం కారణంగా సొంత పన్ను రాబడిలో పెరుగుదల మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, తెలంగాణల్లో అధికంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధుల బదిలీలపై బిహార్ అధికంగా ఆధారపడింది.రాష్ట్రాలు పన్నేతర రాబడి పెంచుకోవడంలోనూ పరిమితులను ఎదుర్కొంటున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఉత్తర ప్రదేశ్, మహరాష్ట్ర, గుజరాత్లలో కేంద్ర ప్రభుత్వ వ్యయం అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. అంటే ఆ యా రాష్ట్రాలకు కేంద్ర నిధులను అధికంగా ఇస్తోందన్నమాట. కేంద్ర ప్రభుత్వ వ్యయ అసమతౌల్యం వలన అనేక రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి తగ్గి, రాష్ట్రాల మధ్య సంక్షేమ కార్యక్రమాల అమలులో అసమానతలు ఏర్పడుతున్నాయి.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థిక సమాఖ్య వ్యవస్థ (ఫిస్కల్ ఫెడరలిజం) పాత్ర ప్రధానమైనది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య పన్ను వసూళ్ళు, ఆదాయ వ్యయం వంటి విషయాల్లో అధికారాల విభజనకు సంబంధించిన చట్రమే (ఫ్రేమ్వర్క్) ఫిస్కల్ ఫెడరలిజం. అభివృద్ధి, పాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు ఆర్థిక వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. జీఎస్టీ పరిహార చెల్లింపులో ఆలస్యం, సెస్లు, సర్ఛార్జీల ద్వారా లభ్యమయ్యే ఆదా యాన్ని కేంద్రం, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేకపోవటం లాంటి అంశాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రాలు సమీకరించే రుణానికి సంబంధించిన పరిమితులు కూడా ఆర్థికా భివృద్ధి సాధనకు అవరోధంగా ఉందని అనేక రాష్ట్రాలు వాదిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజాస్వామ్య జవాబుదారీ తనానికి రాష్టాలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరం.మరేం చెయ్యాలి?పరిస్థితుల్లో మార్పు రావాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. కేంద్రం దేశ పాలన, అభివృద్ధి వంటి అంశాలలో రాష్ట్రాలను సమాన భాగస్వాములుగా పరిగణించాలి. మారుతున్న ఆర్థిక వాతావరణానికి అనుగుణంగా భారత సమాఖ్య వ్యవస్థలో మార్పు అవసరం. ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధ్యమవ్వాలంటే పోటీతత్వ సమాఖ్య వ్యవస్థకు సహకార సమాఖ్య వ్యవస్థ కూడా తోడుగా ఉండాలి. సహకార సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించడం, స్థానిక సంస్థలలో సాధికారత, అంతర్ రాష్ట్ర కౌన్సిల్స్ ఏర్పాటు, ఆర్థిక యాజమాన్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, జీఎస్టీ మండలి పనితీరులో అవసరమైన సంస్కరణలను చేపట్టడం లాంటి చర్యలు కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలను పటిష్టపరచడానికి ఉపకరిస్తాయి. వివిధ రాష్ట్రాలలో స్థానిక అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను డిజైన్ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపర చాలంటే స్థానిక సంస్థలకు అధిక నిధుల కేటాయింపు అవసరం. ఆర్టికల్స్ 256, 257లను పునఃసమీక్ష చేయడం ద్వారా రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం పెత్తనాన్ని తగ్గిస్తూ, జాతీయ భద్ర తకు సంబంధించి మాత్రమే ఆ యా ఆర్టికల్స్ను కేంద్రం ఉప యోగించుకొనే విధంగా చూడాలి. రాష్ట్రాలకు షరతులు లేని నిధుల కేటాయింపు పెంచడం, జీఎస్టీ పరిహారాన్ని సకాలంలో అందించడం, సెస్లు, సర్చార్జీలలో రాష్ట్రాలకు వాటా, ఆర్థిక సంఘం సిఫార్సులను సమర్థవంతంగా అమలు చేయడం లాంటి చర్యలు సమాఖ్య వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇంచార్జి), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు
ఢిల్లీ: భారతీయులపై అమెరికా జాత్యాహంకార వ్యాఖ్యల పట్ల ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ప్రతి దేశంలోనూ కొంతమంది మూర్ఖులు ఉంటారని వారిని పరిగణలోకి తీసుకోకూడదన్నారు. వారు అమెరికాకు ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు.ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మార్కో రూబియో న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఒక జర్నలిస్టు అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార ఘటనల గురించి రూబియోను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ .. "ప్రతి దేశంలోనూ ఆన్లైన్లో లేదా బహిరంగంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కానీ అది ఒక దేశం యొక్క నిజమైన గుర్తింపును నిర్వచించదు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆతిథ్యమిచ్చే దేశాలలో ఒకటిప్రపంచ నలుమూలల నుండి అమెరికాకు వచ్చి, అమెరికన్ సమాజంలో కలిసిపోయి, దేశ ప్రగతికి దోహదపడిన ప్రజల వల్లే దేశం బలోపేతమైంది" అని రూబియో అన్నారు.అమెరికాలో భారతీయులపై కొంతమంది చూపే జాత్యహంకారాన్ని మొత్తం అమెరికన్ సమాజపు గుర్తింపుగా అభివర్ణించడం తప్పు అవుతుందని రూబియో స్పష్టం చేశారు. అదేవిధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి భారతీయ సంతతి ప్రజలు గణనీయమైన తోడ్పాటు అందించారని కొనియాడారు. ప్రత్యేకంగా భారతీయ సమాజాన్ని ప్రశంసించారు. వ్యాపారం, సాంకేతికత, వైద్యం, ప్రజా సేవలతో సహా అనేక కీలక రంగాలలో భారతీయ-అమెరికన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు 20 బిలియన్ డాలర్లకు పైగా సహకారం అందిస్తున్నారని ఈ సంఖ్య మరింత పెరగాలని తాము కోరుకుంటున్నామన్నారు.భారత్, అమెరికా మధ్య సంబంధం కేవలం సహకారానికే పరిమితం కాదని, అది ఒక వ్యూహాత్మక భాగస్వామ్యమని రూబియో స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇరు దేశాలు కలిసి పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. భారత్, అమెరికా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అని మార్కోరూబియో ప్రశంసించారు. -
వెనెజులా ఎంట్రీ.. పెట్రోల్, డీజిల్ కష్టాలకు ఇక చెక్
-
ఇకపై అమెరికా వీసా ఈజీ.. భారతీయులకు శుభవార్త
న్యూఢిల్లీ: భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనుకునే భారతీయులకు త్వరితగతిన వీసా అందించే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ను ప్రకటించారు. ఈ కొత్త విధానం వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తూ.. భారత్-అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక బంధాలను మరింతగా పెంచే ప్రయత్నంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.మార్కో రూబియో నాలుగు రోజుల భారత్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని అమెరికా ఎంబసీ సపోర్ట్ యానెక్స్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత్-అమెరికా సంబంధాలు కేవలం మీడియాకే పరిమితం కాదని..అంతకు మించిన బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం భారత్ కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ఈ కొత్త వీసా షెడ్యూల్ వ్యాపార నిపుణులు, పెట్టుబడిదారులు, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేసే వ్యక్తులకు ముందస్తు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణ కోసం అమెరికాకు వెళ్లే భారతీయులకు వీసా అపాయింట్మెంట్ త్వరగా లభిస్తుంది. వీసా ప్రక్రియలో ఆలస్యం కారణంగా వ్యాపార ప్రయాణాలు, పెట్టుబడి సమావేశాలు,భాగస్వామ్య చర్చలకు అడ్డంకిగా మారుతుంది. అందుకే ఈ కొత్త విధానం అవసరమని ఆయన వివరించారు.ఈ పర్యటనలో రూబియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్ హౌస్ ఆహ్వానం అందించారు. ఇరువురు నేతలు ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, ఇంధన సరఫరాలు, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం వంటి అంశాలపై చర్చించారు.ఈ పర్యటనలో రూబియో చేసిన ప్రకటనలు భారత్-అమెరికా సంబంధాలను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయి. వీసా ప్రక్రియలో మార్పులు కేవలం సాంకేతిక సౌలభ్యం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య వ్యాపార, వ్యూహాత్మక బంధాలను మరింతగా బలపరచే ప్రయత్నం. అమెరికా ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, భారత్తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ పర్యటన స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Delhi: At the US Embassy Support Annex Building dedication ceremony, US Secretary of State Marco Rubio says, "We're introducing a new America First visa schedule that prioritises business professionals that strengthen these ties. But the facility, as I said, is not just… pic.twitter.com/pkY5nlb6r5— ANI (@ANI) May 23, 2026 -
గురీందర్వీర్ కొత్త జాతీయ రికార్డు
రాంచీ: గురీందర్వీర్ సింగ్ భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్గా గుర్తింపు పొందాడు. జాతీయ సీనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ టోరీ్నలో అతను కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. 100 మీటర్ల పరుగును 10.09 సెకన్లలో గురీందర్వీర్ పూర్తి చేసి అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా 100 మీటర్ల రేస్ను 10.10 సెకన్లకంటే తక్కువ టైమింగ్తో పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్గా అతను నిలిచాడు. ఆసియాలో ఫుకుటో కొమురో (జపాన్ – 10.08 సె.) తర్వాత ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. అనిమేశ్ కుజుర్ (10.20 సె.)కు రెండో స్థానం దక్కగా, ప్రణవ్ ప్రమోద్ (10.29 సె.)కు మూడో స్థానం దక్కింది. గత ఏడాది 10.18 సెకన్లలో పరుగు పూర్తి చేసి అనిమేశ్ జాతీయ రికార్డును నెలకొల్పగా... ఇదే ఈవెంట్లో తొలి సెమీఫైనల్లో గురీందర్ 10.17తో దానిని అధిగమించాడు. అయితే రెండో సెమీఫైనల్లో 10.15 సెకన్లలో అనిమేశ్ మళ్లీ తన పేరిటే రికార్డు లిఖించుకోగా... ఫైనల్లో దానిని గురీందర్ తిరగరాసి సత్తా చాటాడు. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల సెలక్షన్స్ కోసం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 10.16 సెకన్లను క్వాలిఫయింగ్ మార్క్గా నిర్ధారింంచారు. తాజా ఫలితం గురీందర్ పోటీలకు అర్హత సాధించాడు. శనివారం మరో రెండు ఈవెంట్లలో కూడా కొత్త జాతీయ రికార్డులు నమోదయ్యాయి. 400 మీటర్ల పరుగులో టీకే విశాల్ 44.98 సెకన్లతో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు తన పేరిటే ఉన్న 45.12 సెకన్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ విభాగంలో రాజేశ్ రమేశ్ (45.31 సె.), జై కుమార్ (45.47 సె.) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. పురుషుల డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్ 8057 పాయింట్లు సాధించి కొత్త రికార్డు నమోదు చేశాడు. పది వేర్వేరు ఈవెంట్లలో కలిపి మొత్తం 8000కు పైగా పాయింట్లు నమోదు చేసిన తొలి భారత అథ్లెట్గా నిలిచాడు. -
రక్షణాత్మక ధోరణి విడనాడాలి
న్యూఢిల్లీ: భారత్ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా, ఆవిష్కరణలకు చిరునామాగా మారేందుకు పరిశ్రమ రక్షణాత్మక ధోరణి వీడి.. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)పై మరిన్ని నిధులను వెచ్చించాలని నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గుబ సూచించారు. ప్రభుత్వం తన వంతుగా సంస్కరణల అజెండాను కొనసాగిస్తూ, విశ్వసనీయమైన పాలనను అందిస్తుందన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధాల వంటి పరిస్థితుల నేపథ్యంలో బలమైన సరఫరా వ్యవస్థలు చర్చనీయాంశంగా మారినట్టు చెప్పారు. భారత్ యాపిల్ మాదిరి విజయగాధను ఎన్నో రెట్లు పునరావృతం చేయగలదంటూ.. వియత్నాం, ఇండోనేషియా, మెక్సికోతో పోటీపడుతూ ప్రపంచానికి తయారీ కేంద్రంగా అవతరించగలదని చెప్పారు. సీఐఐ నిర్వహించిన వార్షిక సదస్సులో పాల్గొన సందర్భంగా రాజీవ్గుబ ఈ అంశాలను ప్రస్తావించారు. మన దగ్గరే ఎంతో తక్కువ.. ‘‘ఆర్అండ్డీపై మన దేశంలో స్థూల వ్యయాలు చాలా తక్కువగా ఉన్న విషయం తెలుసు. చాలా కాలంగా జీడీపీలో 0.7 శాతం వద్దే ఉండిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్అండ్డీపై వెచ్చిస్తున్న సగటు 2.3 శాతంతో పోల్చితే ఎంతో తక్కువ. దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ కంటే కూడా చాలా తక్కువ. మన దేశంలో చేస్తున్న 0.7 శాతం వ్యయాల్లోనూ సగం ప్రభుత్వం భరిస్తున్నదే. కనుక భారత పరిశ్రమలు ఆర్అండ్డీపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. దీన్ని వ్యయాలుగా చూడొద్దు. టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికి బదులు దాన్ని ఇక్కడే ఆవిష్కరించుకోవాలి. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) చేసుకుంటున్నందున భారత కంపెనీలు అంతర్జాతీయ పోటీని సవాలుగా తీసుకోవాలి’’అని రాజీవ్ సూచించారు. -
సంక్షోభ సమయంలో భారత్కు అండగా వెనిజువెలా
ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంక్షోభ సమయంలో భారత్కు మూడో అతిపెద్ద చమురు సరఫరా దేశంగా వెనిజువెలా అవతరించింది.ఇంధన పర్యవేక్షణ సంస్థ క్లెప్లర్ డేటా ప్రకారం.. వెనిజువెలా 2026 మే నెలలో సౌదీ అరేబియా, అమెరికా రెండింటినీ అధిగమిస్తూ మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం, రష్యా, యూఏఈ మాత్రమే వెనిజులా కంటే ఎక్కువ చమురును సరఫరా చేస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం, ఏప్రిల్తో పోలిస్తే ఈ నెలలో భారతదేశానికి వెనిజులా చమురు సరఫరా దాదాపు 50 శాతం పెరిగాయి.మే నెలలో ఇప్పటివరకు వెనిజువెలా నుండి.. భారత్ రోజుకు సగటున 4,17,000 బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. అంతకుముందు ఈ సంఖ్య రోజుకు 283,000 బ్యారెళ్లుగా ఉంది. జనవరిలో ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్న తర్వాత, అమెరికా, వెనిజులా చమురు ఎగుమతులపై కొన్ని ఆంక్షలను సడలించింది. దీంతో కొనుగోళ్లు అధికంగా పెరిగాయి. ఈ పెరుగుదలకు రెండు ప్రధానంగా రెండు కారణాలున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఒకటి హర్ముజ్ జలసంధి దిగ్భందనం కాగా మరోకటి.. వెనిజువెలా నుంచి సరఫరా అయ్యే క్రూడాయిల్ చౌకగా ఉండటం. అంతే కాకుండా రిలయన్స్ వంటి భారతీయ రిఫైనరీలు దానిని శుద్ధి చేయగల సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉన్నందున అవి తమ కొనుగోళ్లు పెరిగినట్లు సమాచారం.వీటితో పాటు అమెరికా అధ్యక్షుడు తమ వద్ద నుండే చమురు కొనుగోలు చేయాలని భారత్పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా భారత్సైతం చమురు కొనుగోళ్లను పెంచింది.టాఫ్ ప్లేసులో రష్యాఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత్ రష్యా చమురు కొనుగోలు చేయడం మరింతగా పెంచింది. రష్యా నుండి సరఫరాలు దాదాపు రెట్టింపు అయ్యి రోజుకు 2.3 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఇరాన్ ,గల్ఫ్ దేశాల నుండి తగ్గిన సరఫరాల స్థానంలో భారతీయ రిఫైనరీలు రష్యా చమురును ఉపయోగించడం ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కీలక ప్రకటన చేశారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వచ్చే వారం భారతదేశంలో పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఈ పర్యటనలో చమురు సరఫరాలపై భారత్ కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.ప్రస్తుత భారత చమురు దిగుమతులురష్యా- 23 లక్షల బ్యారెళ్లు రోజుకు యూఏఈ- 4.40 లక్షల బ్యారెళ్లు వెనిజువెలా- 4.17 లక్షల బ్యారెళ్లుసౌదీ- 3.40 లక్షల బ్యారెళ్లుఅమెరికా- 3.10 లక్షల బ్యారెళ్లు -
‘దేశ అస్థిరతకే ‘కాక్రోచ్’ పార్టీ: బీజేపీ మండిపాటు
తిరువనంతపురం: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేవలం ఒక వ్యంగ్య ప్రచారం కాదని, దీని వెనుక సరిహద్దు ఆవల నుండి జరుగుతున్న ఒక క్రమబద్ధమైన కుట్ర ఉందని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి, దేశాన్ని అస్థిరపరచడమే ఈ ప్రచారంలోని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.డిజిటల్ యుద్ధంలో కొత్త ఎత్తుగడరాజీవ్ చంద్రశేఖర్ ఈ వ్యవహారాన్ని ‘క్లాసిక్ క్రాస్-బోర్డర్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్’గా అభివర్ణించారు. బాట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డిజిటల్ మానిప్యులేషన్ ఉపయోగించి, సహజమైన ప్రజా ఉద్యమంలా సోషల్ మీడియాలో కథనాలను అల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం సాధిస్తున్న ఆర్థిక ప్రగతిని ఓర్వలేని శక్తులే ఇలాంటి అశాంతిని ప్రేరేపిస్తున్నాయని, ఇవన్నీ దేశాభివృద్ధిని దెబ్బతీయలేవని ఆయన స్పష్టం చేశారు.కేరళలో ఊపందుకున్న ప్రచారంగత వారం వెలుగులోకి వచ్చిన ఈ సీజేపీ ఉద్యమం సోషల్ మీడియాలో వేగంగా విస్తరించింది. ‘ ఎక్స్’ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసినా, 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' పేరుతో మరో ఖాతా పుట్టుకొచ్చింది. కేరళకు చెందిన పలువురు యువ ఎమ్మెల్యేలు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం గమనార్హం. విద్యాశాఖ మంత్రిని తొలగించాలన్న డిమాండ్తో వీరు చేస్తున్న ఆన్లైన్ ప్రచారాలు చర్చనీయాంశంగా మారాయి.బెంగళూరు పోలీసుల హెచ్చరికఈ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. మే 24న బెంగళూరు టౌన్ హాల్ వద్ద ‘శాంతియుత మానవ గొలుసు’ నిర్వహిస్తామని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. బాధ్యతారహితమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ వ్యంగ్యం పేరుతో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. -
దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్కు 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే సీఎన్జీ కేజీకి రూ.1 పెరిగింది. పెరిగిన ధరలు శనివారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పది రోజుల వ్యవధిలో ఇది మూడోసారి పెంపు.. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్తో.. అధిక ధరలకు క్రూడాయిల్ను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నామని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు కొన్నివారాలుగా గగ్గోలు పెట్టాయి. ఒక అంచనా ప్రకారం ఆ లెక్క రూ.1,600 కోట్లు ఉందని.. వినియోగదారులపై ఆ భారం వేయకుండా వచ్చామని ఇన్నాళ్లు చెబుతూ వచ్చాయి. మరోవైపు కేంద్రం కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు ఇంధన ధరలు పెంచలేదు. అలాగే ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ తరుణంలో.. చమురు రేట్లు దూసుకుపోతున్న తరుణంలో ఇప్పుడు పెంపు తప్పడం లేదని ఆయిల్ కంపెనీలు, కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. మే 15.. రెండింటిపైనా రూ.3 చొప్పున పెంపుమే 19.. పెట్రోల్పై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంపుమే 23.. 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంపు దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం.. హర్ముజ్ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదని, దీంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి ఇప్పటికీ చేసిన పెంపు సరిపోదని అంటున్నారు. మరో రెండు వారాలపాటు దశలవారీగా గానీ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. ✔️ తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి (పెట్రోల్ 87 పైసలు, డీజిల్ 91 పైసలు పెరిగిన తర్వాత):ఢిల్లీ: పెట్రోల్ ₹99.50, డీజిల్ ₹92.41ముంబై: పెట్రోల్ ₹108.27, డీజిల్ ₹94.77హైదరాబాద్: పెట్రోల్ ₹112.23, డీజిల్ ₹100.44కోల్కతా: పెట్రోల్ ₹110.18, డీజిల్ ₹96.76చెన్నై: పెట్రోల్ ₹105.53, డీజిల్ ₹97.13బెంగళూరు: పెట్రోల్ ₹107.69, డీజిల్ ₹95.73పాట్నా: పెట్రోల్ ₹110.27, డీజిల్ ₹96.52జైపూర్: పెట్రోల్ ₹109.76, డీజిల్ ₹95.23తిరువనంతపురం: పెట్రోల్ ₹112.11, డీజిల్ ₹101.00చండీగఢ్: పెట్రోల్ ₹99.03, డీజిల్ ₹87.19విజయవాడ (ఏపీ): పెట్రోల్ ₹115.35, డీజిల్ ₹103.08విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ ₹113.83, డీజిల్ ₹101.23గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చు -
డబ్ల్యూఎఫ్ఐ తీరును తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ను దేశీయ టోర్నమెంట్లలో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటించిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన స్టార్ రెజ్లర్తో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని సూచించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో వినేశ్ పోటీపడొచ్చా లేదా అనే అంశంపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు అర్హత సాధించి 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్... ఆ తర్వాత రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో తల్లి అయిన వినేశ్... ఇప్పుడు తాజాగా తిరిగి మ్యాట్పై అడుగు పెట్టేందుకు ప్రయత్నించగా... డబ్ల్యూఎఫ్ఐ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వినేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రసూతి విరామం నుంచి తిరిగి బరిలోకి దిగాలనుకుంటున్న రెజ్లర్ను... తల్లి అయినందుకు నిందించకూడదని ధర్మాసనం వెల్లడించింది. దేశంలో మాతృత్వానికి ఎంతో గొప్పదనం ఉందని... వినేశ్ పట్ల రెజ్లింగ్ సమాఖ్య ప్రతీకార ధోరణితో వ్యవహరించకూడదని ధర్మాసనం నొక్కిచెప్పింది. అంతర్జాతీయ సమాఖ్యలు అనుమతిచ్చాక కూడా దేశం నుంచి మద్దతు లేకపోవడాన్ని తప్పుపట్టింది. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి వినేశ్ అనర్హతకు గురైన అంశాన్ని దేశం క్రీడాస్ఫూర్తితో స్వాగతించిన విషయాన్ని మరవకూడదని న్యాయస్థానం సూచించింది. అంతకుముందు 2023లో డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై పలువురు యువ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేయగా... వారికి మద్దతుగా బజరంగ్, సాక్షి మలిక్తో కలిసి వినేశ్ ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేపట్టిన విషయం తెలిసిందే. -
సైప్రస్తో సుదృఢ బంధం
న్యూఢిల్లీ: భారత్, సైప్రస్ దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది. ఇరుదేశాలు తమ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాయి, వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. రక్షణ సహకారం విషయంలో ఐదేళ్ల రోడ్మ్యాప్ను ఆవిష్కరించాయి. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ శుక్రవారం ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ, విద్య, సంస్కృతి తదితర రంగాల్లో సహకారం కోసం ఇరుదేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే ఒప్పందం కూడా ఇందులో ఉంది. వలసలపై ఒక సమగ్ర భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారత్, సైప్రస్ నిర్ణయించుకున్నాయి. కాలపరీక్షకు నిలిచిన స్నేహబంధం వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతలు, విద్య వంటి రంగాల్లో సంబంధాలతోపాటు ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ అమలుపై నరేంద్ర మోదీ, నికోస్ క్రిస్టోడౌలైడ్స్ చర్చించుకున్నారు. ఈ భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సైప్రస్లోని మౌలిక సదుపాయాలు, ఇంధనం, వ్యవసాయ రంగాల్లో భారతీయ కంపెనీలకు వాణిజ్య మూలధనాన్ని అందుబాటులోకి తెచ్చి, కొత్త మార్గాలను తెరుస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న షిప్పింగ్, సముద్ర పరిశ్రమల్లో పెట్టుబడులను పెంచుతుందని వెల్లడించారు. ‘భారత్, సైప్రస్ స్నేహబంధం ఎన్నోసార్లు కాలపరీక్షలకు నిలిచిందని గుర్తుచేశారు. ఈ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలన్న నిర్ణయంతో ఇరుదేశాల బంధానికి కొత్త ఆశయాలను, కొత్త ఊపును ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ డైలాగ్ను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు రెండు దేశాలు ప్రకటించాయి. భారత్–యూరప్ సంబంధాలు మెరుగుపడటాన్ని మోదీ ప్రస్తావించారు. అవి ఒక కొత్త స్వర్ణయుగంలోకి ప్రవేశించాయని అన్నారు. మౌలిక సదుపాయాలు, నౌకా రవాణా వంటి కీలక రంగాల్లో సహకారం కోసం భారత్, సైప్రస్లు ఒక సంయుక్త టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయని నికోస్ క్రిస్టోడౌలైడ్స్ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ), భారత్ మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. -
పాక్లో ‘బొద్దింకల’ తుఫాన్
ఇస్లామాబాద్: భారత్లో వ్యంగ్యంగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్లోకి ప్రవేశించింది. అక్కడి యువత కూడా కొత్త కొత్త పేర్లతో అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.పాకిస్థాన్లో కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్, ముత్తాహిదా కాక్రోచ్ మూవ్మెంట్ వంటి పేర్లతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు వెలుగులోకి వచ్చాయి. ‘సిస్టమ్ మనల్ని కాక్రోచ్లుగా భావించింది. మేమే ప్రజల స్వరం అని అకౌంట్ల బయోలో పేర్కొనడం గమనార్హం.లోగోలు,బ్రాండింగ్పాకిస్థాన్లోని ఈ అకౌంట్ లోగోలు భారతీయ వెర్షన్లను పోలి ఉన్నప్పటికీ అవి పచ్చ,తెలుపు రంగు ఉపయోగిస్తున్నాయి. ఇది స్థానిక రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమను చూపించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ,పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.యువతలో ప్రభావంఈ ఉద్యమం ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా మారింది. నిరుద్యోగం, రాజకీయ వ్యవస్థపై అసంతృప్తి, యువతలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఇది ఒక కొత్త మార్గంగా నిలుస్తోంది. భారత్లో ప్రారంభమైన ఈ వ్యంగ్య ఉద్యమం ఇప్పుడు పాకిస్థాన్ యువత కూడా ఆకర్షితులవుతున్నారు. -
ఇలాంటిదేదో జరుగుద్దని ముందే ఊహించాం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో గతవారం సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’ఖాతాను ప్రభుత్వం గురువారం నిలిపివేసింది. అయితే గంటల వ్యవధిలో ఆ పార్టీ ‘కాక్రోచెస్ డోంట్ డై’ట్యాగ్లైన్తో ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరిట మరోఖాతాను సృష్టించుకుంది. తమ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, నిలిపివేస్తారని కూడా ముందే ఊహించామని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చెప్పారు. ఇది ప్రభుత్వం తనకు తాను చేసుకున్న తప్పిదం అని పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా పోరాడుతామని వెల్లడించారు. ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరుతో ‘ఎక్స్’లో కొత్త ఖాతా ప్రారంభించామని తెలిపారు. తమ ఖాతా, ఉద్యమం వేగంగా జనంలోకి చొచ్చుకెళ్తున్నాయని స్పష్టంచేశారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఖాతా ప్రారంభం కాగా.. మళ్లీ ఫాలోవర్స్ విషయంలో దూసుకుపోతోంది. అందుకే తప్పుడు ప్రచారంతమ ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఖాతాను నిలిపివేసిందని అభిజిత్ దీప్కే విమర్శించారు. అంతేకాదు.. సీజేపీ విషయంలో జరుగుతున్న ప్రచారంపైనా ఆయనో క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ లాంటి ఇస్లాం ప్రభావిత దేశాల నుంచే దానికి ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారని, ఫేక్.. బోట్(కంప్యూటర్ ఆపరేటెడ్) అకౌంట్లు ఉన్నాయని(కొందరు వీడియోలు పెట్టారు.. అవి ఫేక్ అని అభిజిత్ అంటున్నారు).. జనతా కాక్రోచ్ పార్టీ ప్రొపగాండ క్యాంపెయిన్ అని, తాను ఆప్ ఏజెంట్నని(అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో పని చేశారు), దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఇది ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చే విదేశీ కుట్ర వ్యవహారమంటూ జరుగుతున్న ప్రచారాలన్నింటినీ ఆయన ఖండించారు. ఒకవైపు నిరుద్యోగ యువత ఈ ఉద్యమంలో చేతులు కలుపుతుంటే.. పనికిమాలిన వాళ్లే అలాంటి ప్రచారాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చాడు. I know you are desperately trying to hack the account but since you have failed to do so. Let me share the real data.Why would you call 94% of Indian youth as Pakistanis? https://t.co/547NtEP934 pic.twitter.com/9DRTx6l96e— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఇన్స్టాగ్రామ్లో 18 మిలియన్లు క్రాస్ఉపాధి, ఉద్యోగాలు లేని యువత పరాన్నజీవులు, బొద్దింకల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా ఆక్షేపించారు. దీనిపై నిరసన వ్యక్తంచేస్తూ అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. నిజానికి ఇదొక వ్యంగ్య డిజిటల్ పార్టీ. సోషల్ మీడియాలో యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. సామాజిక కార్యకర్తలు, కళాకారులు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. పలు రాజకీయ పార్టీ నేతలు, మేధావులు కూడా అండగా నిలిచారు. పార్టీ ‘ఎక్స్’ఖాతాకు ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో చేరింది. ఇన్స్టా్రగామ్లో అనుసరించేవారి సంఖ్య 18 మిలియన్లు దాటేసింది. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషయంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న కాంగ్రెస్, రెండో స్థానంలో ఉన్న బీజేపీలను సీజేపీ అధిగమించినట్లైంది. కాక్రోచ్ జనతా పార్టీ పదునైన రాజకీయ విమర్శలు, వ్యాఖ్యానం ద్వారా ఆదరణ పొందుతోంది. సమకాలీన అంశాలపై చర్చ.. నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీక్లు, విద్యా వ్యవస్థ తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తోంది. అందుకే దీనికి దేశద్రోహి, ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేసి తిట్టి పోస్తున్నారు. అయితే వాళ్లకు స్వయంగా అభిజిత్ కౌంటర్ ఇస్తుండడం గమనార్హం. ఈ సమయంలో కాక్రోచ్ జనతా పారీ్టకి సంబంధించిన తొలి ‘ఎక్స్’ఖాతా గురువారం నుంచి నిలిచిపోవడం.. కాసేపటికే కొత్త అకౌంట్ ప్రత్యక్షం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ‘ఎక్స్’లో ద కాక్రోచ్ యూత్, కాక్రోచ్ న్యూస్, ఐయామ్ కాక్రోచ్, కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా, కాక్రోచ్ జనతా పారీ్ట(జెన్ జెడ్) పేరిట ఖాతాలు చురుగ్గా పని చేస్తున్నాయి. -
భారత్కు అమెరికా బంపర్ ఆఫర్!
భారత పర్యటనకు ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రూబియో స్పష్టం చేశారు. "భారత్కు మాకు ఒక గొప్ప మిత్రదేశం. ఎన్నో ఏళ్లగా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్లో అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను.ఈ పర్యటన మాకు అత్యంత కీలకం. విదేశాంగ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా మొదటి సమావేశం క్వాడ్ కూటమితోనే జరిగింది. ఇప్పుడు ఆ సమావేశాన్ని భారత్లో నిర్వహించబోతుండటం సంతోషంగా ఉంది. ఈ ఏడాది చివర్లో మరోసారి క్వాడ్ సమావేశం నిర్వహించనున్నాము. అయితే భారత్ ఎంత పరిమాణంలో ఇందనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే.. అంత మొత్తంలో విక్రయించడానికి మేము సిద్దంగా ఉన్నాము. న్యూఢిల్లీ మా 'పోర్ట్ఫోలియోలో ఒక పెద్ద భాగంగా' ఉండాలని కోరుకుంటోందని" మార్కో రూబియో గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.అదేవిధంగా పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్కు ఇంధన భద్రత కల్పించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా రూబియో మే 23న భారత్కు చేరుకోనున్నారు. తొలుత కోల్కతాలో మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీస్ను ఆయన సందర్శిస్తారు. నంతరం ఆగ్రా, జైపూర్లను సందర్శించి.. న్యూఢిల్లీ చేరుకుంటారు. -
పెట్రోల్, డీజిల్ కొరత వచ్చిందా? ఓఎంసీ వర్గాలు ఏమన్నాయంటే?
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) వర్గాలు గురువారం తెలిపాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలో ఎగుమతులు, దిగుమతుల అంతరాయాలపై ఆందోళనలు నెలకొన్న వేళ ఇంధన కొరత ఉందని చాలా మందిలో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓఎంసీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రష్యా నుంచి వస్తున్న ముడి చమురు సరఫరాలో ఎలాంటి తగ్గుదల లేదని తెలిపింది.ఓఎంసీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ ఇప్పటికీ పెట్రోలియం ఉత్పత్తుల్లో ‘మిగులు’ స్థితిలోనే ఉంది. సీజనల్ డిమాండ్, మార్కెట్ ధరల మార్పుల వల్ల కొన్ని రిటైల్ ఔట్లెట్లలో ఇంధన అమ్మకాలు పెరుగుతున్నాయి. “భారత్ నెట్ ఎగుమతిదారు కావడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల్లో మిగులు స్థితిలో ఉంది. పెట్రోల్/డీజిల్/ఎల్పీజీ కొరత లేదు” అని ఓఎంసీ వర్గాలు తెలిపాయి. నెట్ ఎగుమతిదారు అంటే దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా చేసే దేశం లేదా సంస్థ.ముడి చమురు దిగుమతులపై ఓఎంసీ వర్గాలు మాట్లాడుతూ.. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రష్యా నుంచి సరఫరాలు స్థిరంగానే ఉన్నాయని తెలిపాయి. కొన్ని ఇంధన బంకుల్లో అమ్మకాలు పెరగడానికి పంట కోత సీజన్లో డీజిల్ డిమాండ్ పెరగడం సహా పలు కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటరుకు రూ.5 అధిక ధర తీసుకుంటుండడంతో వినియోగదారులు ప్రభుత్వ రంగ ఇంధన విక్రేతల వద్ద కొంటున్నారని కూడా వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలు ఎక్కువగా ఉండటంతో సంస్థాగత, వాణిజ్య కొనుగోలుదారులు కూడా ప్రభుత్వ రంగ ఇంధన బంకుల వైపు మారుతున్నారని వర్గాలు తెలిపాయి.అవసరాల మేరకే వాహనాల్లో నింపుకోవాలి.. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా రిటైల్ ఔట్లెట్లలో పెరుగుతున్న డిమాండ్ మధ్య సరిపడా ఇంధన లభ్యత ఉండేలా తమ సరఫరా కేంద్రాలు, ఫీల్డ్ బృందాలు సమన్వయంతో పని చేస్తున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) తెలిపింది.“దేశవ్యాప్తంగా మా రిటైల్ ఔట్లెట్లలో సరిపడా ఉత్పత్తుల లభ్యత ఉండేలా మా సరఫరా కేంద్రాలు, టీమ్స్ సమన్వయంతో నిరంతరం పని చేస్తున్నాయి. వినియోగదారులు తమ సాధారణ అవసరాల మేరకే వాహనాల్లో ఇంధనం నింపుకోవాలి” అని ఐఓసీఎల్ ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొంది. భయంతో అధికంగా ఇంధనం కొనుగోలు చేయొద్దని కోరింది. మారుతున్న డిమాండ్ ధోరణుల వల్ల రవాణా వ్యవస్థపై ఒత్తిడి ఉన్నప్పటికీ, నిరంతర ఇంధన సరఫరా కొనసాగించే బాధ్యత తమదేనని కంపెనీ తెలిపింది.“పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సజావుగా కొనసాగించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. అయితే వాణిజ్య అమ్మకాలు, ప్రైవేట్ పెట్రోల్ బంకుల నుంచి రిటైల్ ఔట్లెట్ల వైపు డిమాండ్ మారడంతో రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. దాన్ని పరిష్కరించేందుకు మా టీమ్ ప్రయత్నిస్తోంది” అని కంపెనీ తెలిపింది. -
‘ఎబోలా’ కలకలం: అన్ని ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: ఆఫ్రికా ఖండంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ తరుణంలో దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎయిర్పోర్టుల్లో కఠిన నిఘాడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. ఎబోలా ప్రభావిత దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ ల నుండి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్కు ముందే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ వద్ద ఆరోగ్య పరిస్థితిని నివేదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ కారణంగా వందలాది కేసులు, 130 కి పైగా మరణాలు నమోదయ్యాయి. భారత్లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ, అధిక జనాభా కలిగిన నగరాల్లో వైరస్ వ్యాపించకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.21 రోజుల పర్యవేక్షణ.. ఆ లక్షణాలు ఉంటే ప్రమాదమే! ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి లేదా అకస్మాత్తుగా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే స్వయంగా అధికారులకు సమాచారం అందించాలి. విమానాశ్రయంలో దిగిన తర్వాత 21 రోజుల పాటు ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించుకోవాలి. ఈ మూడు వారాల వ్యవధిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యులను సంప్రదించి, తమ అంతర్జాతీయ ప్రయాణ వివరాలను పూర్తిగా వెల్లడించడం చట్టపరంగా తప్పనిసరి.వ్యాక్సిన్లు పనిచేయవు..ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ ప్రారంభ లక్షణాలు సాధారణ ఇన్ఫ్లుఎంజా, టైఫాయిడ్, మలేరియాను పోలి ఉండటం వల్ల దీనిని గుర్తించడం వైద్యులకు సవాలుగా మారింది. అంతేకాకుండా, అందుబాటులో ఉన్న ప్రామాణిక ఎబోలా వ్యాక్సిన్లు ‘జైర్’ స్ట్రెయిన్ను అడ్డుకోవడానికి రూపొందించినవి కావడంతో, ప్రస్తుత కొత్త వేరియంట్పై ఇవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో, నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ని ప్రధాన కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్పోర్టుల్లో అనుమానిత లక్షణాలు ఉన్నవారిని నేరుగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు. -
పాక్ అనాగరిక చర్యలను కడిగేసిన భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) వేదికగా భారత్ పొరుగుదేశమైన పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పౌరుల సామూహిక హత్యలు, సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ చరిత్ర మొత్తం రక్తసిక్తమయమేనని భారత్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వతనేని మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన అనాగరిక దాడులను ప్రపంచం ముందు పెట్టారు. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు.కాబూల్ ఆస్పత్రిపై పాశవిక దాడిసరిహద్దుల్లో పాకిస్తాన్ సృష్టిస్తున్న సాయుధ హింస కారణంగా ఆఫ్ఘనిస్తాన్లో 750 మంది పౌరులు మరణించడం లేదా గాయపడటం జరిగిందని పలు నివేదికలను ఉదహరిస్తూ హరీష్ పర్వతనేని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మార్చిలో పవిత్ర రంజాన్ మాసంలో, ప్రజలంతా ప్రార్థనలు ముగించుకుని వస్తున్న సమయంలో కాబూల్లోని ‘ఓమిద్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్’ పై పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ అత్యంత క్రూరమైన, అనాగరిక దాడిలో 269 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 122 మంది తీవ్రంగా గాయపడ్డారు. సైనిక లక్ష్యం కాని ఒక వైద్యశాలపై దాడి చేయడాన్ని ఏ రకంగానూ సమర్థించుకోలేమని భారత్ తేల్చిచెప్పింది.అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనఆఫ్ఘన్ పౌరులను రక్షించాలన్న అంతర్జాతీయ పిలుపులను, మానవతా నిబంధనలను పాకిస్తాన్ పూర్తిగా కాలరాసిందని భారత్ ఆరోపించింది. చీకటి పడ్డాక అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ.. అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడటం పాక్ కపటత్వానికి నిదర్శనమని పర్వతనేని మండిపడ్డారు. పౌరుల రక్షణకు సంబంధించిన 'నాన్-రిఫౌల్మెంట్' సూత్రాన్ని పాటించాలని ‘సమితి’ సెక్రటరీ జనరల్ చేసిన విజ్ఞప్తిని కూడా పాకిస్తాన్ బేఖాతరు చేసిందని ఆయన విమర్శించారు. పౌర నష్టాలకు కారణమైన 95 సంఘటనలలో 94 ఘటనలకు పాక్ భద్రతా దళాలే బాధ్యులని సమితి సహాయక మిషన్ నిర్ధారించిందని గుర్తుచేశారు.సొంత ప్రజలనే బాంబులతో చంపే దేశంపాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, సరిహద్దు వెంబడి అది సాగిస్తున్న హింస కారణంగా 94,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను అంతర్జాతీయ సమాజం తప్పకుండా జవాబుదారీ చేయాలని డిమాండ్ చేసింది.ఇది కూడా చదవండి: భారతీయ నర్స్ కుటుంబాన్ని గెంటేస్తున్న ఆస్ట్రేలియా -
ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ!
మే 2026.. భారత్లో అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. పార్టీ పెట్టి వారం తిరగకముందే కాక్రోచ్ జనతా పార్టీ పెను సంచలనాలు సృష్టిస్తోంది. ఏకంగా బీజేపీ లాంటి దిగ్గజ పార్టీని మించిపోయి.. కురువృద్ధ పార్టీ కాంగ్రెస్ను సైతం పక్కకు నెట్టేసే దిశగా దూసుకుపోతోంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా.. అతిపెద్ద పార్టీగా ఎదగడానికి సిద్ధమైంది.సీజేపీ.. కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ప్రస్తుతానికి రాజకీయ పార్టీ కాదు. కేవలం వ్యంగ్య ఉద్యమం(సెటైర్) అని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్లకు చెప్పనక్కర్లేదు. కానీ, డిజిటల్ ఫ్లాట్ఫారమ్లలో గత నాలుగైదు రోజులుగా మామూలు సత్తా చాటడడం లేదు. ముఖ్యంగా జెన్ జీ యువత ఆదరణ, మద్దతుతో దూసుకుపోతోంది. సో.మీ. ఫాలోవర్స్ విషయంలో బీజేపీని ఇప్పటికే దాటేసింది సీజేపీ. ఆ విషయాన్ని కూడా అంతే వెటకారంగా ప్రకటించుకుంది. ప్రస్తుతానికి అత్యధిక ఫాలోవర్స్ ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఉంది. సీజేపీ దూకుడు చూస్తుంటే.. రేపో, మాపో ఆ ఫిగర్ను దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే ఆన్లైన్లో ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న పార్టీ(నాన్ పొలిటికల్)గా సీజేపీ నిలవనుంది.World’s largest party they said🤭 pic.twitter.com/dT9TOFKZoZ— Cockroach Janta Party (@CJP_2029) May 20, 2026అలా పుట్టింది..మే 15, 2026న సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి. కొంతమంది యువకులు బొద్దింకల్లాంటివాళ్లు.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగ యువతలో ఆగ్రహాన్ని రగిల్చాయి. పెద్ద సంఖ్యలో యువత దీన్ని అవమానకరంగా భావించి వ్యంగ్యరూపంలో ప్రతిస్పందించారు. అలాంటి వాళ్లలో అభిజీత్ దిప్కే ఒకడు. ఈ ఒక్కడే ఈ పెను సంచలనానికి కేంద్ర బిందువయ్యాడు.మహారాష్ట్రలో పుట్టి, పుణేలో జర్నలిజం చదివిన అభిజిత్.. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నాడు. గతంలో ఆప్ వలంటీర్గా పనిచేసిన అనుభవం ఆయనకు డిజిటల్ క్యాంపెయిన్, మీమ్ కల్చర్లో ప్రత్యేక నైపుణ్యం ఇచ్చింది. ఆ నైపుణ్యంతో కాక్రోచ్ జనతా పార్టీ అంటూ సెటైరిక్ పేజీని ప్రారంభించాడు.సీజేఐ వివరణ.. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో యువతపై తాను చేసిన వ్యాఖ్యలను పొరపాటుగా మీడియా చూపించిందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ఫేక్ డిగ్రీలతో వృత్తుల్లోకి వచ్చినవాళ్లను మాత్రమే ఉద్దేశించి తాను అలా అన్నానని ఆయన చెప్పారు. భారత యువతపై తాను ఎలాంటి విమర్శ చేయలేదని.. పైగా వాళ్లను చూసి గర్వపడుతున్నానని.. వాళ్లే దేశాభివృద్ధికి మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. అయితే.. అప్పటికే సీజేపీ జోరు మొదలైంది.మేము సైతం.. మే 16న గూగుల్ ఫారమ్ ద్వారా అభిజిత్ సీజేపీ సభ్యత్వం ప్రారంభించాడు. వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే నినాదం ఇచ్చాడు. “సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ” అనే వ్యంగ్య సిద్ధాంతాలతో పార్టీ ముందుకు సాగుతోందని ప్రకటించాడు. అప్పటికే సీజేఐ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నా.. పెద్ద సంఖ్యలో యువత మాత్రం వెనక్కి తగ్గలేదు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపేలా ‘‘మేము కూడా కాక్రోచులమే’ అంటూ ఫాలో బటన్ను క్లిక్ చేస్తూ, సభ్యత్వం తీసుకుంటూ తమ అసంతృప్తిని డిజిటల్ వేదికలపై భారీగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.అలా.. మే 17–20 మధ్య జస్ట్ నాలుగురోజుల్లోనే వెబ్ పేజీకి నాలుగు లక్షలకు పైగా సభ్యులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో 9 మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేరారు. తద్వారా ఆప్, బీజేపీ పార్టీలను చాలా దూరం నెట్టేశారు. సీజేపీ జోరు చూస్తుంటే కాంగ్రెస్ను కూడా దాటేందుకు ఎంతో సమయం పట్టేలా కనిపించడం లేదు. అలాగని ఇది పూర్తి సెటైరిక్ మూమెంట్గా ఉండిపోలేదు. అర్థవంతమైన చర్చలు, సమకాలీన అంశాలపై మేధావులతో డిబేట్లు, అభిప్రాయ సేకరణ.. ఇలా ఈ ఉద్యమం ప్రత్యేకంగా నిలిచింది. మా లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కోసం కాదు, ఉద్యోగ సమస్యలు, పరీక్షల మోసాలు, యువత నిరాశ వంటి అంశాలను వ్యంగ్యరూపంలో వెలుగులోకి తేవడమే. ఇది యువతను అవమానపరిచిన వ్యాఖ్యకు ప్రతిస్పందన. మేము కాక్రోచులం అనే గుర్తింపుని స్వీకరిస్తున్నాం. ఎందుకంటే దేశ వ్యవస్థ అంతగా కుళ్లిపోయింది కాబట్టి. ఆ కుళ్లులోనే కాక్రోచులు బయటకు రావాల్సి వస్తోంది. ఇది సెటైరిక్ ఉద్యమం కావొచ్చు. అలాగని ఇదేం జోక్ కాదు. దేశంలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగుల గొంతుకంగా మారింది అని చెబుతున్నాడు. అయితే నేపాల్, బంగ్లాదేశ్లా జెన్జీ ఉద్యమానికి ఇది దారి తీస్తుందా? అనే ప్రశ్నకు ఆయన నుంచి నో అనే సమాధానమే వచ్చింది. FYI pic.twitter.com/XCkclwy50K— Cockroach Janta Party (@CJP_2029) May 19, 2026👉సీజేఐ ఏమన్నారంటే.. కొంత మంది బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగాల్లేని యువత.. సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి, వ్యవస్థపై దాడి చేస్తున్నారు. 👉సీజేఐ వ్యాఖ్యల్ని సమర్థించిన వర్గాలు: బొద్దింకలతో పోల్చడం అంటే.. యువతలోని సహనశక్తి, ఎక్కడైనా బతికే సామర్థ్యం ఉంది.👉విమర్శించిన వర్గాలు: మేం కాక్రోచ్లమే అంటూ వెటకారంగా స్పందించినా.. నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది ఆ పేజీ ఫాలోయింగ్. పైగా ఆ ప్లాట్ఫారమ్లలో జరుగుతున్న డిబేట్లలో కామెంట్ల రూపంలో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు👉రాజకీయ విశ్లేషకులు: ఇది ఒక “సోషల్ మీడియా విప్లవం”. నిరుద్యోగ యువత అసంతృప్తిని వ్యంగ్యరూపంలో వ్యక్తం చేస్తున్నారు.👉ప్రతిపక్ష నేతలు: భారతీయ యువతలోని నిరాశను ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది👉ప్రభుత్వ అనుకూల వర్గాలు: ఇది కేవలం వ్యంగ్య ఉద్యమం మాత్రమే, నిజమైన రాజకీయ శక్తిగా మారడం కష్టంఅభిజిత్ ఎన్ని వివరణలు ఇస్తున్నప్పటికీ.. వ్యంగ్య ఉద్యమం నుంచి డిజిటల్ విప్లవంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ మద్దతుతో ఏదైనా పెను ఉద్యమానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. -
భారత్ వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో 2026 సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి (యూఎన్) స్వల్పంగా తగ్గించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గత అంచనా 6.6 శాతాన్ని 6.4 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా సంక్షోభం మరో షాక్గా ఈ నివేదిక అభివరి్ణంచింది. ఇది ప్రపంచ వృద్ధిని మందగింపజేయడంతోపాటు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను, అనిశ్చితులను పెంచినట్టు వివరించింది. ప్రస్తుత ప్రపంచ ప్రతికూల సవాళ్ల నుంచి భారత్కూ మినహాయింపు లేదని యూఎన్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ విభాగం సీనియర్ ఆర్థికవేత్త ఇంగో పిట్టర్లే వ్యాఖ్యానించారు. ‘‘భారత్ ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లపై ప్రభావం తదతర ఒత్తిళ్లు సైతం నెలకొన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల కఠినతరంతో మానిటరీ పాలసీ మరింత సంక్లిష్టంగా మారింది’’ అని పిట్టర్లే వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఎలా స్పందిస్తాయన్నదే కీలకమన్నారు. ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనా సైతం తగ్గింపు 2026 సంవత్సరానికి గాను ప్రపంచ స్థూల జీడీపీ వృద్ధి రేటు అంచనాను సైతం 2.5 శాతానికి యూఎన్ తగ్గించింది. జనవరిలో వేసిన అంచనా కంటే 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు, కరోనా మహమ్మారికి ముందున్న సాధారణ వృద్ధి రేటు కంటే ఇది చాలా తక్కువని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బలంగానే ఆర్థిక మూలాలు.. భారత్ వృద్ధి 2025లో ఉన్న 7.5 శాతం నుంచి 2026లో 6.4 శాతం తగ్గడమన్నది ప్రధానంగా ఇంధన దిగుమతి వ్యయాలు పెరిగిపోవడం వల్లేనంటూ.. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. దేశీయంగా వినియోగ డిమాండ్, ప్రభుత్వ మూలధన వ్యయాలు, సేవల రంగ ఎగుమతుల్లో చక్కని పనితీరు కారణంగా భారతదేశంలో నిర్మాణాత్మకంగా బలమైన వృద్ధి కనిపిస్తున్నట్టు పేర్కొంది. తిరిగి 2027 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. దిగుమతి చేసుకునే దేశాలకు వ్యయాలు పెరిగినప్పుడు ఎగుమతులు కూడా సమస్యలు ఎదుర్కోవచ్చని యూఎన్ డైరెక్టర్ ఆఫ్ ఎకనమిక్ అనలైసిస్ శంతను ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రవాణా ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరిగినప్పుడు వ్యాపార వ్యయాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లాగే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్కు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉందన్నారు. అయితే, ప్రస్తుతమున్న మిగులు నిల్వలు కరిగిపోయే లోపే ఈ షాక్లను ఎంత సమర్థవంతంగా అధిగమించగలదన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. -
బంధం బలోపేతం
రోమ్: భారత్, ఇటలీ మధ్య బంధం మరింత బలపడింది. ఇరుదేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2029 నాటికల్లా 20 బిలియన్ యూరోలకు చేర్చాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక రోడ్మ్యాప్ను ఖరారు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీ బుధవారం రోమ్లో సమావేశమయ్యారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలని తీర్మానించారు. పశ్చిమాసియా సంక్షోభం, తద్వారా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మోదీ, మెలొనీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరగా చల్లారాలని ఆకాంక్షించారు. శాశ్వతమైన శాంతి సాధనకు చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని, స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలని ఇరువురు నేతలు విజ్ఞప్తి చేశారు. ఎఫ్టీఏను త్వరగా అమలు చేయాలి కొన్ని నెలల క్రితం ఖరారైన భారత్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) ద్వారా లభించే అవకాశాలను సది్వనియోగం చేసుకోవాలని మోదీ, వెలొనీ నిర్ణయానికి వచ్చారు. ఆ ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. జార్జియా మెలొనీతో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చినందుకు చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. ‘భారత్–ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025–29’మన భాగస్వా మ్యానికి ఆచరణాత్మక, భవిష్యత్ దృష్టితో కూడిన ఫ్రేమ్వర్క్ను అందిస్తుందన్నారు. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛ ఉండాలని మెలొనీ స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. భారత్–ఇటలీ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలే చోదక శక్తులు భారత్–ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025–29ని సమీక్షించి, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించేందుకు విదేశాంగ మంత్రుల నేతృత్వంలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి భారత్, ఇటలీ అంగీకరించాయి. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, ఇంధనం, కృత్రిమ మేధ(ఏఐ), అరుదైన సాంకేతికతలు, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల విషయంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని మోదీ, మెలోనీ నిర్ణయించారు. రెండుదేశాల భాగస్వామ్యానికి సాంకేతికత, ఆవిష్కరణలే చోదక శక్తులు అని మోదీ స్పష్టంచేశారు. ఏఐ, క్వాంటం, అంతరిక్షం, పౌర అణుశక్తి వంటి రంగాల్లో పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రెండు దేశాల్లోని స్టార్టప్లు, పరిశోధనా కేంద్రాలు, పరిశ్రమలను అనుసంధానించడానికి ఇండియా–ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్పై పనిచేస్తున్నామని వివరించారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం పరస్పర విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. సముద్ర భద్రతా సహకారం, సమన్వయం, సమాచార మారి్పడి, ఉత్తమ పద్ధతులను పెంపొందించే లక్ష్యంతో సముద్ర భద్రతపై ఒక కార్యాచరణ ప్రారంభించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. కొలోజియం సందర్శనమోదీ మంగళవారం రాత్రి ఇటలీకి చేరుకున్నారు. ప్రధాని మెలొనీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ గౌరవార్థం ప్రత్యేక విందు ఇచ్చారు. తర్వాత రోమ్లోని ప్రాచీన కట్టడం కొలోజియంను ఇరువురు నేతలు కలిసి సందర్శించారు. వేర్వేరు కీలక అంశాలపై తాము అభిప్రాయాలను పంచుకున్నామని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇదిలా ఉండగా>, ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాలారెల్లాతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, కీలక ఖనిజాలు, ఏఐ, అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవడంపై చర్చలు జరిపారు. మోదీ యూరప్ పర్యటన బుధవారం ముగిసింది. ప్రధాని మోదీకి ఎఫ్ఏఓ అగ్రికోలాప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక పతకం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) ఆయనను అగ్రికోలా మెడల్తో సత్కరించింది. ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో చేసిన విశేషమైన కృషికి గాను మోదీకి ఈ ప్రతిష్టాత్మక పతకం దక్కింది. బుధవారం రోమ్లో ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఖూ డాంగ్యూ చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు. ఈ గౌరవం ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను, వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్నవారి కృషిని ప్రతిబింబిస్తోందని మోదీ వెల్లడించారు. ఇది భారతదేశంలోని రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు దక్కిన గొప్ప గౌరవమని అభివర్ణించారు.మెలొనీకి ‘మెలొడీ’ గిఫ్ట్ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలొనీకి మెలొడీ చాక్లెట్ల ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు గాను మోదీకి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ‘‘ప్రధాని మోదీ నా కోసం మంచి బహుమతి తీసుకొచ్చారు. చాలాచాలా మంచి చాక్లెట్లు తెచ్చారు. మెలొడీ అందించారు. ఆయన ఇచ్చిన బహుమతికి ధన్యవాదాలు’’అని పేర్కొన్నారు. తనకు అందిన బహుమతిని చూపిస్తూ మెలొనీ సరదాగా ‘మెలొడీ’అనడంతో మోదీ బిగ్గరగా నవ్వేశారు. మోదీ, మెలొనీలకు మెలొడీతో అనుబంధం ఉంది. ఇద్దరి పేర్ల కలయికతో ఏర్పడిన ‘మెలొ డీ’అనే హ్యాష్ట్యాగ్ను 2023లో దుబాయ్లో జరిగిన కాప్ సదస్సు సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి సృష్టించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాలలో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణల కారణంగా ఈ పదం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 10 అవగాహన ఒప్పందాలు మోదీ–మెలోని చర్చల అనంతరం సైనిక హార్డ్వేర్, ప్లాట్ఫారమ్ల సహ–అభివృద్ధి, సహ–ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తూ భారత్, ఇటలీ దేశాలు ఒక రక్షణ పారిశ్రామిక రోడ్మ్యాప్ను ఆవిష్కరించాయి. అంతేకాకుండా ఉన్నత విద్య, ఇటలీకి భారతీయ నర్సుల రాకపోకల కోసం ఇరు దేశాలు కొత్త ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశాయి. అరుదైన ఖనిజాలు, వ్యవసాయం, సముద్ర రవాణా, సముద్ర ఉత్పత్తులు తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా 10 అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) భారత్, ఇటలీ సంతకాలు చేశాయి. -
క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే?
భారత వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే అత్యంత శక్తిమంతమైన ఆయుధం రష్యా తయారీ S-400 Triumf నాలుగో స్క్వాడ్రన్ ఈ వారం భారత్కు చేరుకోనుంది. శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను ఆకాశంలోనే కూల్చివేయగల ఈ అత్యాధునిక వ్యవస్థ రవాణా ప్రక్రియ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒక చిన్న టీవీ లేదా ఫ్రిజ్ సురక్షితంగా ఇంటికి ఎలా చేరుతుందో అనుకునే మనకు, ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్కు ఎలా తరలిస్తారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.చరిత్రాత్మక ఒప్పందం భారత్–రష్యా మధ్య 2018లో దాదాపు 5.43 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం మొత్తం ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే మూడు యూనిట్లు భారత వైమానిక దళంలో సేవలందిస్తుండగా, ఇప్పుడు నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చే దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా మారనుంది. భారత వాయుసేన ఈ వ్యవస్థను “సుదర్శన్ చక్ర”గా అభివర్ణిస్తోంది.ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్కు తీసుకురావడం సాధారణ విషయం కాదు. ఇది అత్యంత సమన్వయంతో జరిగే భారీ లాజిస్టిక్ ఆపరేషన్. సముద్ర, వాయు, రోడ్డు మార్గాలను కలిపి ప్రత్యేక వ్యూహంతో ఈ తరలింపు చేపడతారు. భారీ క్షిపణి లాంచర్లు, ట్రాన్స్పోర్టర్ వాహనాలు వంటి పరికరాలను భారీ కార్గో నౌకల ద్వారా భారత తీర ప్రాంత పోర్టులకు తరలిస్తారు. మరోవైపు కమాండ్ అండ్ కంట్రోల్ మాడ్యూల్స్, అత్యాధునిక రాడార్లు, ఇంటర్సెప్టర్ క్షిపణులు వంటి సున్నితమైన పరికరాలను రష్యా నుంచి భారీ మిలిటరీ విమానాల ద్వారా నేరుగా భారత వైమానిక దళ స్థావరాలకు చేర్చుతారు.రవాణాకు ముందు భారత వైమానిక దళ అధికారులు రష్యాలోనే ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. అన్ని పరికరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత వాటిని ప్రత్యేక భద్రతా కంటైనర్లలో ప్యాక్ చేస్తారు. ప్రస్తుతం భారత్కు వస్తున్న నాలుగో యూనిట్కు సంబంధించిన ఈ తనిఖీలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.సాధారణంగా చాలామంది S-400 అంటే కేవలం క్షిపణులు అమర్చిన ఒక పెద్ద ట్రక్కు మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి అది పూర్తి స్థాయి మొబైల్ యుద్ధ వ్యవస్థ. ఒక స్క్వాడ్రన్లో 16 ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ఇందులో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, 600 కిలోమీటర్ల దూరంలో శత్రువులను గుర్తించగల రాడార్లు, లక్ష్యాలను ట్రాక్ చేసి క్షిపణులకు మార్గనిర్దేశం చేసే ఎంగేజ్మెంట్ రాడార్లు, ఎనిమిది మొబైల్ లాంచర్ యూనిట్లు, క్షిపణి రీలోడర్లు, జనరేటర్లు, మెయింటెనెన్స్ వాహనాలు ఉంటాయి. ఈ మొత్తం వ్యవస్థ కలిపి శక్తివంతమైన వైమానిక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది.భారత్కు చేరుకున్న తర్వాత అసలు ఆపరేషన్ ప్రారంభమవుతుంది. పోర్టుల వద్ద కస్టమ్స్, భద్రతా క్లియరెన్స్ పూర్తయిన తరువాత ఈ భారీ కంటైనర్లను ప్రత్యేక మిలిటరీ ట్రక్కుల ద్వారా గమ్యస్థానాలకు తరలిస్తారు. ఈ రవాణా సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. గగనతలంలోనూ, రోడ్లపైనూ హై అలర్ట్ ప్రకటిస్తారు. అనంతరం భారత వైమానిక దళ సాంకేతిక నిపుణులు అన్ని భాగాలను ఒక భారీ లెగో సెట్స్లా అమర్చి పరీక్షలు నిర్వహిస్తారు. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించిన తర్వాతే ఆ వ్యవస్థను యుద్ధ సిద్ధంగా ప్రకటిస్తారు.ఐదో యూనిట్ను చైనా సరిహద్దులో ఇప్పుడున్న నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దులో మోహరించనున్నప్పటికీ, ఈ ఏడాది నవంబర్ నాటికి ఐదో యూనిట్ కూడా భారత్కు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దానిని చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరించనున్నట్టు సమాచారం. అంతేకాదు, అదనంగా మరో ఐదు S-400 యూనిట్ల కొనుగోలుకు కూడా భారత రక్షణ కొనుగోలు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా బహుస్థాయి “ఇండియన్ ఐరన్ డోమ్” రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే భారత లక్ష్యంగా కనిపిస్తోంది.ఒకసారి ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు భారత గగనతలంలోకి చొరబడటం దాదాపు అసాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం, గగనం, రోడ్డు మార్గాల ద్వారా అత్యంత రహస్యంగా జరిగే ఈ భారీ రవాణా వెనుక భారత సైన్యం, ప్రభుత్వం చేస్తున్న కృషి ఇప్పుడు దేశ రక్షణలో మరో కీలక అధ్యాయంగా నిలుస్తోంది. -
ఎయిర్టెల్ కొత్త 'ప్రయారిటీ పోస్ట్పెయిడ్' 5జీ ప్లాన్లు
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త 'ప్రయారిటీ పోస్ట్పెయిడ్' (Priority Postpaid) సేవలను అధికారికంగా ప్రకటించింది. అత్యాధునిక '5G స్లైసింగ్' (5G Slicing)సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా అత్యంత వేగవంతమైన, అంతరాయం లేని ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు. భారతదేశంలో ఈ తరహా 5G స్లైసింగ్ సేవలను తీసుకొచ్చిన మొదటి సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది.ఈ సరికొత్త సేవలు ఎయిర్టెల్లోని అన్ని పోస్ట్పెయిడ్ ప్లాన్లపైనా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఉన్న పోస్ట్పెయిడ్ కస్టమర్లకు ఈ ప్రయారిటీ ప్రయోజనాలు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ప్లాన్లలోకి మారాలనుకుంటే ఎయిర్టెల్ యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్టెల్ స్టోర్ను సందర్శించి సులభంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు.ధరల విషయానికి వస్తే.. సింగిల్ యూజర్ కోసం రూ.449 (ప్లస్ జీఎస్టీ) ప్లాన్ అందుబాటులో ఉండగా, ఫ్యామిలీ ప్లాన్లు రూ.699 నుంచి రూ.1749 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్ల ద్వారా అన్లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఫాస్ట్లేన్ టెక్నాలజీ, స్పామ్ ప్రొటెక్షన్ లభిస్తాయి. అంతేకాకుండా ప్లాన్లను బట్టి ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, యాపిల్ టీవీ+, నెట్ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కూడా ఉచితంగా లభిస్తాయి.ఈ సేవలు 5G SA (Standalone) సపోర్ట్ చేసే అన్ని స్మార్ట్ఫోన్లలోనూ పనిచేస్తాయి. వినియోగదారులు తమ ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ హై-స్పీడ్ కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు. కస్టమర్లు తమ ఫోన్ అర్హతను మొబైల్ సెట్టింగ్స్లో లేదా ఎయిర్టెల్ యాప్లోకి లాగిన్ అయి సులభంగా చెక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. -
మూడున్నర ఏళ్లలో అనేక సార్లు భేటీ అయ్యాం: మోదీ, మెలోనీ
రోమ్: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. భారత్-ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుతున్నట్టు సంతోషంగా ప్రకటిస్తున్నానని చెప్పారు.‘‘గత మూడున్నర ఏళ్లలో ప్రధాని మెలోనీని ఎన్నోసార్లు కలిసే అవకాశం నాకు వచ్చింది. ఇది భారత్-ఇటలీ మధ్య ఉన్న నిరంతర సహకార బంధాన్ని ప్రతిబింబిస్తోంది. భారత్-ఇటలీ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029 మా భాగస్వామ్యానికి ఆచరణాత్మక, విజన్ ఉన్న రూపాన్ని ఇస్తోంది. దీనిపై సమయపాలనతో ముందుకు సాగుతున్నాం. మా రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు వెళ్తోంది. భారత్లో ఉన్న 400కు పైగా ఇటాలియన్ కంపెనీలు భారత్ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి” అని ప్రధాని మోదీ తెలిపారు.సంయుక్త మీడియా సమావేశంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మాట్లాడుతూ.. “ఈ రోజు రోమ్లో మా సత్సంబంధాలను స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి మరింత బలపరుస్తున్నాం. ఇది రెండు దేశాల సంబంధాల్లో ఇప్పటివరకు చేరిన అత్యున్నత స్థాయి. ఇప్పుడు ఇటలీ-భారత్ గతంలో ఎప్పుడూ లేనంత దగ్గరయ్యాయని చెప్పొచ్చు. మా సంబంధాలు పూర్తి సామర్థ్యాన్ని చూపగల స్థాయికి చేరుకున్నాయి. గత మూడున్నర ఏళ్లలో ప్రధాని మోదీతో నేను ఏడు సమావేశాలు నిర్వహించాను. ఆ సమయంలో ఒకరినొకరం, మా అభిప్రాయాలను లోతుగా తెలుసుకున్నాం. గౌరవం, పరస్పర నమ్మకంపై నిలిచిన నిజాయితీ స్నేహాన్ని కూడా నిర్మించుకున్నాం. ఇన్నేళ్ల పాలన తర్వాత కూడా ప్రజల్లో ప్రధాని మోదీకి ఉన్న ఆదరణ చూసి ఆయన దూరదృష్టి, ఆచరణాత్మకత, నాయకత్వాన్ని నేను వ్యక్తిగతంగా మెచ్చుకున్నాను. మా స్నేహం వేగంగా కలిసి పనిచేయడంలో ఎంతో సహాయపడింది” అన్నారు. -
సిమ్ కార్డ్ కోసం బయోమెట్రిక్ ఇస్తున్నారా? రూ.101.87 కోట్ల మోసం
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించగా.. తాజాగా సైబర్ నేరాలకు వెన్నెముకగా నిలుస్తున్న ‘ఘోస్ట్ సిమ్’ వ్యవస్థపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’తో ఉక్కుపాదం మోపింది.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలో మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తంగా 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 432 సీల్డ్ సిమ్ లు ఉండగా.. 112 ఓపెన్డ్ సిమ్ లు ఉన్నాయి. వీరిలో 44 మంది ఘోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారు. వీరంతా కలిపి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్లు తేలింది. ఈ నేరాలకు సంబంధించిన మొత్తం మోసం విలువ రూ.101.87 కోట్లు.టెలికాం నెట్వర్క్ వారీగా పరిశీలిస్తే.. అరెస్టయిన పీఓఎస్ ఏజెంట్లలో వొడాఫోన్ ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్టెల్కు చెందిన వారు ఏడుగురు, జియోకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.ఈ కేసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నంబర్ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు, వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో.. 'నెట్వర్క్ సరిగా లేదు', 'సర్వర్ డౌన్ అయ్యింది', 'వేలిముద్ర సరిగా పడలేదు' అంటూ ఏజెంట్లు నమ్మబలికి.. రెండు, మూడు బయోమెట్రిక్ ను తీసుకుంటున్నారు.మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏకంగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి.. నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇంటర్ నెట్ ను ఉచితంగా ఇస్తామంటూ ఆశచూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్ లు అమ్మితే అంత కమిషన్ తో పాటు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో ఈ దందా చేస్తున్నారు.ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండానే.. అత్యంత ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే, వాటిని ఇ-సిమ్ (e-SIM)లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే, మన దేశపు మొబైల్ నంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు.ఈ ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు.. మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. అమాయకులకు సైబర్ వల వేస్తారు. వారి నుంచి లక్షలాది రూపాయలు, ఒక్కోసారి కోట్లాది రూపాయలు కొల్లగొడుతారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసే 'సెక్స్టార్షన్' ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే 'డిజిటల్ అరెస్ట్' ముఠాలు సైతం ఈ నంబర్లనే వాడుతున్నాయి. నంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారు.ఇదంతా ఒక పక్కా వ్యూహంతో జరుగుతుంది. తమ టార్గెట్ మేరకు వేలాది సిమ్ కార్డుల యాక్టివేషన్ ప్రక్రియ పూర్తికాగానే, ఆ సిమ్ కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నారు. ఈ సైబర్ నెట్వర్క్ను ఛేధించడంలో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివ మారుతి, వారి ప్రత్యేక బృందాలు ఎంతో కృషి చేశాయి. కాగా,'ఘోస్ట్ సిమ్' నెట్వర్క్ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది.అలాగే, డీవోటీ, ట్రాయ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి.. నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కోరనుంది. 'మ్యూల్ అకౌంట్స్' సమస్యను అరికట్టడానికి బ్యాంకుల నుంచి ఎలాగైతే పరిష్కారాలను కోరడం జరిగిందో.. ఇప్పుడు టెలికాం సంస్థల నుంచి కూడా 'ఘోస్ట్ సిమ్' సమస్యను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని వారికి చెప్పనుంది.ముఖ్యంగా పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లపై నిఘాను పెంచడం, వారి బాధ్యతను నిర్ణయించే ఫ్రేమ్వర్క్ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త సిమ్ కార్డుల జారీ, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ప్రక్రియలో తప్పనిసరిగా రియల్-టైమ్ వెరిఫికేషన్ చేయాలి. సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్ కార్డులను వెంటనే డీయాక్టివేట్ చేయాలి. నిబంధనలు పాటించని PoS ఏజెంట్లను, డిస్ట్రిబ్యూటర్లను అన్ని టెలికాం నెట్వర్క్ల నుంచి బ్లాక్లిస్ట్ చేయాలి.ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులు జారీ అవుతున్న తీరును గుర్తించేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి. కేవైసీ చేసే సమయంలో 'మ్యూల్ హంటర్ డేటా', I4C అనుమానితుల డేటాబేస్తో అనుసంధానం చేసి తనిఖీలు చేయాలి. టెలికాం సంస్థలు, పోలీసుల మధ్య డేటా షేరింగ్ కోసం ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.ప్రజలు ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. సిమ్ కార్డులు తీసుకునే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటూ, కేవలం అధీకృత డీలర్ల వద్దే వాటిని కొనుగోలు చేయాలి.మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పోర్టల్ https://tafcop.sancharsaathi.gov.in ద్వారా వెంటనే చెక్ చేసుకోండి. ఈ 'సంచార్ సాథీ' పోర్టల్ను క్రమంతప్పకుండా తనిఖీ చేస్తూ, మీకు తెలియకుండా ఎవరైనా మీ నంబర్ను వాడుతుంటే వెంటనే అందులోనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే.. ఆ మొదటి గంట గోల్డెన్ అవర్ అత్యంత కీలకం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కంగారు పడకుండా.. వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. హైదరాబాద్ సిటీ పోలీస్ అందిస్తున్న 'సి-మిత్ర' సేవలను కూడా సద్వినియోగం చేసుకోండి. -
పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయా? ఇలాగైతే...
గడిచిన ఐదు రోజుల వ్యవధిలో చమురు సంస్థలు రెండు సార్లు పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ ధరలను పెంచాయి. నాలుగేళ్ల తర్వాత ఈ పెంపు ఇదే మొదటిసారి కాగా.. చమురు సంస్థలు మాత్రం తమ నష్టాలను పూడ్చుకునేందుకు ధరల పెంపు ఒక్కటే మార్గమని చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక.. ఏ క్షణమైనా పెట్రోధరల బాదుడు ఉంటుందని అంతా ఊహించినా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు మున్ముందు పెట్రో కష్టాలు తప్పవనే సంకేతాలిస్తున్నాయి.కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా.. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడానికి వేర్వేరు కారణాలున్నాయి. విదేశీ మారక వ్యయం పెరగడం, రూపాయి విలువ విపరీతంగా నేలచూపు చూడడం.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు.. ఇలా అన్నివైపుల నుంచి ముప్పు ముంచుకొస్తుండడంతో.. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశ ప్రజలకు పొదుపు మంత్రాన్ని బోధించారు.ప్రధాని వ్యాఖ్యలు దేశం ఎదుర్కోబోయే లోతైన సమస్యలకు దర్పణం పడుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో పెట్రోధరలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పెరగడానికి ప్రధాన కారణం.. మనవద్ద తగిన స్థాయిలో పెట్రోలియం, గ్యాస్ నిల్వలు లేకపోవడమే..! నిజానికి 1991 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంధన భద్రతపై అంతటా ఆందోళనలు మొదలయ్యాయి. దాని ఫలితంగానే భారత్ తన ఇంధన నిల్వలకు 39 మిలియన్ బ్యారెళ్ల సామర్థ్యంతో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఏర్పాటు చేసింది. దీన్నే స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్స్స్ అని అంటారు. 2000 సంవత్సరం తర్వాత దీనికి అధికారిక రూపాన్నిచ్చారు.పెరుగుతున్న పెట్రోలియం అవసరాలుభారత్లో పెట్రోలియం అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును భారత్ వినియోగిస్తోంది. ఈ లెక్కన.. దేశంలో ఉండే పెట్రోలియం రిజర్వ్స్ వారం రోజుల అవసరాలకే సరిపోతాయి. ఇక చమురు సంస్థల వద్ద ఉన్న నిల్వలు, దిగుమతి కవరేజీని కలిపితే.. మొత్తం నిల్వలు 70 రోజుల అవసరాలను మాత్రమే తీర్చగలుగుతాయి.నిజానికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్గా ఉంది. అమెరికా, చైనా తర్వాత భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ రెండు దేశాలతో పోలిస్తే.. భారత్ ఎక్కువగా ఇంధన భద్రత ముప్పును ఎదుర్కొనే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. 1973 చమురు సంక్షోభం తర్వాత అమెరికా భారీ స్థాయిలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అక్కడి SPR సామర్థ్యం 714 మిలియన్ బ్యారెళ్లు. ఇది భారత నిల్వల కంటే దాదాపు 18 రెట్లు ఎక్కువ. చైనాలో ఈ సామర్థ్యం 900 మిలియన్ బ్యారెళ్లకు చేరింది.ఈ రెండు దేశాలతో పోలిస్తే.. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల విషయంలో భారత్ చాలా వరకు వెనకబడి ఉంది. ఇప్పటికిప్పుడు లెక్కలను పరిశీలించినా.. అమెరికా వద్ద ప్రస్తుతం 400 మిలియన్ బ్యారెళ్ల మేర రిజర్వ్స్ ఉన్నాయి. అయితే.. రోజుకు 13 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తితో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. చైనా అలా కాదు. ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. అయితే.. కష్టకాలమొచ్చినా తట్టుకునేలా చైనా నిల్వలున్నాయి.మన దేశంలో పరిస్థితి భిన్నంచైనా ప్రభుత్వం గనక.. చమురు వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిస్తే.. పౌరులు తూచా తప్పకుండా పాటిస్తారు. మన దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. LPG, LNG నిల్వల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దేశంలో సుమారు 1.4 లక్షల టన్నుల LPG నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. కానీ రోజువారీ వినియోగం మాత్రం భారీగా పెరుగుతోంది. LNG విషయంలోనూ భారత్ ప్రధానంగా పెట్రోనెట్ LNG, BPCL రీగ్యాసిఫికేషన్ టెర్మినళ్ల వద్ద ఉన్న నిల్వలపైనే ఆధారపడుతోంది. ఎరువుల తయారీలో కీలకమైన ఈ ఇంధనానికి దేశంలో భూగర్భ నిల్వ వ్యవస్థ లేదు. అమెరికా, చైనా వంటి దేశాలు భూగర్భ LNG నిల్వలపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఐరోపా సమాఖ్య కూడా రష్యా గ్యాస్పై ఆధారపడడాన్ని తగ్గించుకుని, కొత్త వ్యూహాలను అందిపుచ్చుకుంది.చమురుకు సంబంధించిన భారీ నిల్వలు ఉండటం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు సరఫరా అంతరాయాల సమయంలో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో అధిక ధరలు చెల్లించకుండా దీర్ఘకాలిక ఒప్పందాలతో తమ అవసరాలను భద్రపరుచుకోగలుగుతున్నాయి. చైనా అయితే అమెరికా ఆంక్షలను కూడా పక్కన పెట్టి.. రష్యా నుంచి పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే.. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో భారత్లో చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -వెబ్డెస్క్ -
మళ్లీ యుద్ధం: ఇప్పుడు ట్రంప్ ముందున్న 2 మార్గాలివే..
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఇది అమెరికా బలహీనతా? లేక దౌత్య చర్చల దిశగా అడుగా? ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? దాడులు చేస్తామని చెప్పిన ట్రంప్ మరోసారి యూ-టర్న్ ఎందుకు తీసుకున్నారు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కొన్ని గంటల్లోనే భిన్న సంకేతాలు వచ్చాయి. మొదట ఇరాన్పై దాడి చేస్తామని చెప్పారు. తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ విజ్ఞప్తి చేయడంతో జరగాల్సిన దాడిని వాయిదా వేశారు. దీనిపై పలువురు విశ్లేషకులు వివరించిన అంశాలను చూద్దాం.. ట్రంప్ ముందున్న మార్గాలు రెండు మాత్రమే. ఒకటి ఇరాన్కు రాయితీలు (ఆంక్షల ఎత్తివేత వంటి వెసులుబాట్లు) ఇవ్వడం. అంటే యుద్ధంలో ఓడిపోయామని చెప్పకనే చెప్పడం. గతంలో వియత్నాం, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో కూడా ఇటువంటిదే జరిగింది. కానీ, ఓటమిని అంగీకరించడం అమెరికాకు కష్టమే. మరో మార్గం మళ్లీ దాడులు మొదలుపెట్టడం. అమెరికాలోని నియోకాన్ (కఠిన విదేశాంగ విధానాన్ని సమర్థించే రాజకీయ వర్గం) వర్గాలు, ఇజ్రాయెల్ మరింత ఒత్తిడి పెడితే ఇరాన్ వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నాయి. కానీ అది అంత సులువు కాదు.ట్రంప్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి మార్పులు పలుసార్లు చేశారు. ఫిబ్రవరి 28న 48 గంటల్లో ఇరాన్ ప్రజా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. తర్వాత గడువు పెంచారు. అనంతరం మళ్లీ పెంచారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్ వల్ల కాదు.. యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా విజ్ఞప్తి కారణంగా ట్రంప్ నిర్ణయం వాయిదా పడింది.ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం పరిస్థితిని చూడాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం మొదలుపెట్టాయి. అప్పట్లో ట్రంప్ లక్ష్యాల్లో ఇరాన్ పాలనా మార్పు, క్షిపణి సామర్థ్యాల నిర్మూలన కూడా ఉన్నాయి. కానీ దాడుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఏ లక్ష్యాన్నీ సాధించలేకపోయాయి.అంతేకాదు, ఇరాన్ హార్మూజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించింది. దీంతో ఇప్పటికే ఉన్న సమస్యలకు మరో పెద్ద సమస్య చేరింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ ఒప్పందం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో నేరుగా చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడే అక్కడికి వెళ్లారు.మార్చి 6న ట్రంప్ “ఇరాన్ నుంచి షరతుల్లేని లొంగుబాటు తప్ప మరేదీ అంగీకరించను” అన్నారు. అదే ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షుడిని ఇస్లామాబాద్ పంపించారు. ఎందుకంటే “ఉపాధ్యక్షుడితోనే మాట్లాడతాం” అని ఇరాన్ స్పష్టం చేసింది.కాల్పుల విరమణ ప్రకటనలో హార్మూజ్ ప్రాంతాన్ని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ, ఆ ప్రాంతం ఇప్పటికీ మూసే ఉంది. అయినా కాల్పుల విరమణ కొనసాగుతోంది. కారణం ట్రంప్ మళ్లీ ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఏప్రిల్ 8 నుంచి ట్రంప్ దౌత్య చర్చల ద్వారా ఒప్పందం సాధించాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ అమెరికా కోరుతున్న షరతులకు ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు స్థంభించాయి.ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాలియుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కూడా ట్రంప్నకు ఉంటుంది. అయితే, యుద్ధం మొదలైనప్పుడు బ్యారెల్ చమురు ధర 75 నుంచి 77 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు 115 డాలర్ల వరకు చేరింది. భారత్లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రెండుసార్లు పెరిగాయి. ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు అందరూ పొదుపు పాటించాలని చెబుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే విదేశీ లావాదేవీల్లో దేశ ఖర్చులు ఆదాయాల కంటే ఎక్కువ కావడం.ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యులు అని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ మళ్లీ యుద్ధం మొదలుపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని చిక్కులు ట్రంప్ను చుట్టుముట్టాయి. అమెరికా 40 రోజుల దాడులతో ఫలితం సాధించలేకపోయింది. మళ్లీ దాడులు చేస్తే మరింత తీవ్రతరంగా వైమానిక దాడులు చేయాల్సి వస్తుంది.అలా జరిగితే ఇరాన్ కూడా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అమెరికా, గల్ఫ్ దేశాలు ఎదుర్కోగలవా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది. -
పుతిన్ పర్యటనతో చమురు సంక్షోభం తీరుతుందా..?
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది భారత్లో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సుకు హాజరుకావడానికి ఆయన భారత్ వస్తున్నప్పటికీ ఈ పర్యటనలో పలు కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ఎంతో కీలకం కానుంది.ప్రస్తుతం మిడిల్ఈస్ట్లో యుద్ధపరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 నుంచి 110 డాలర్ల పైమాటకు చేరి తీవ్రంగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు హర్ముజ్ను మూసివేయడంతో చమరు రవాణా దెబ్బతిని తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్లో సైతం పెట్రో డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరగవచ్చనే ఆందోళన ప్రజలలో నెలకొంది.ఈ నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చమురు సంక్షోభం తీరేలా ఇరు దేశాల మధ్య ఏదైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి బలం చేకూర్చేలా ఇటీవలే ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ "భారతదేశానికి ఇంధన సరఫరా ఒప్పందాల విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా రష్యా అన్ని బాధ్యతలను నెరవేరుస్తుంది. బాహ్య శక్తుల నుండి వచ్చే ఎలాంటి అనైతిక పోటీల వల్ల భారత్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లనివ్వం." అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మాటలతో భారత్కు ఎంతో ఊరట లభించింది.ఇతర ఇంధన రంగాలు కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా, భారత్కు అవసరమైన ఎల్.ఎన్.జి బొగ్గు సరఫరాలను పెంచడం, తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల విస్తరణపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.రూపాయి-రూబుల్ చెల్లింపులుఅంతే కాకుంగా చమురు కొనుగోళ్లకు సంబంధించి డాలర్ల కొరత లేదా అంతర్జాతీయ ఆంక్షల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, స్వదేశీ కరెన్సీలలో (రూపాయి - రూబుల్) సురక్షితమైన బ్యాంకింగ్ మరియు ఆర్థిక ఛానళ్లను ఏర్పాటు చేయడంపై ఈ పర్యటనలో మోదీ, పుతిన్ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఓ సమస్య ఉంది. రష్యా నుంచి చమరుదిగుమతులతో భారత్ తన స్వంత కరెన్సీలో చెల్లింపులు చేస్తే ఆ డబ్బులు వారి వద్ద అధికంగా నిల్వ ఉంటున్నాయి. ఎందుకంటే రష్యా భారత్కు ఎగుమతులు చేస్తున్నంతగా ఆ దేశానికి భారత ఎగుమతులు లేవు అందుకే వారి వద్ద కరెన్సీ నిల్వలు అధికంగా ఉంటున్నాయి. దీంతో రష్యా ఆ డబ్బను తిరిగి భారత ప్రభుత్వ బాండ్లు, షేర్లు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుంది.భారత్కు రష్యా పూర్తి స్థాయిలో చమురు సరఫరా చేయగలదా?రష్యా రోజుకు సుమారు 10.3 మిలియన్ బ్యారెళ్ల (1 కోటి 3 లక్షల బ్యారెళ్లు) ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో దాదాపు 4.5 నుండి 4.9 మిలియన్ బ్యారెళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్కు సగటున రోజుకు సుమారు 5.3 మిలియన్ బ్యారెళ్ల వరకూ చమురు అవసరం కనుక రష్యా భారత్ అవసరాలను దాదాపు తీర్చగలదు.ప్రధాన సమస్యలులాజిస్టిక్స్, రవాణా సవాళ్లు గల్ఫ్ దేశాలు (సౌదీ, ఇరాక్, యూఏఈ) భారత్కు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడి నుండి చమురు నౌకలు కేవలం 4 నుండి 7 రోజుల్లో భారత్ చేరుకుంటాయి. కానీ రష్యా నుండి చమురు రావాలంటే చాలా దూరం ప్రయాణించాలి. రష్యా పశ్చిమ నౌకాశ్రయాల నుండి వచ్చే నౌకలు భారత్ చేరడానికి 30 నుండి 35 రోజులు పడుతుంది.పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా చమురును రవాణా చేయడానికి అంతర్జాతీయ నౌకలు, భీమా సంస్థలు ముందుకు రావడం లేదు. రష్యా తన స్వంత 'షాడో ఫ్లీట్' (పాత నౌకలు) ద్వారానే సరఫరా చేస్తోంది. భారత్కు కావాల్సినంతగా ఇందులో చమురు రవాణా చేయడం కొద్దిగా కష్టమైన పని.రిఫైనరీల సాంకేతికత భారతదేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే 'సౌర్ క్రూడ్' (సల్ఫర్ ఎక్కువగా ఉండే చమురు) ను శుద్ధి చేసేలా డిజైన్ చేయబడ్డాయి. రష్యా నుంచి వచ్చే 'ఉరల్స్ క్రూడ్' రకం కొద్దిగా భిన్నంగా ఉంటుంది.భారతీయ రిఫైనరీలు రష్యా చమురును 100% వాడలేవు; సాంకేతిక బ్యాలెన్స్ కోసం మిడిల్ ఈస్ట్ చమురును కూడా కలిపి వాడాల్సి ఉంటుంది.భారత్కు ఇష్టం లేదు వ్యూహాత్మకంగా భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఏ ఒక్క దేశం పైనా పూర్తి స్థాయిలో ఆధారపడదు. రేపు రష్యాతో ఏదైనా సమస్య వస్తే భారత్ ఇరుక్కుపోతుంది. అందుకే భారత్ తన రిస్క్ను తగ్గించుకోవడానికి రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికా దేశాల నుండి చమురును విడివిడిగా కొనుగోలు చేస్తుంది. అయితే ఈ పర్యటనతో భారత చమురు సమస్య పూర్తిగా తీరుతుంది అని చెప్పడం అతిశయోక్తే అయినప్పటికీ ప్రస్తుత చమురు సంక్షోభ పరిస్థితులను అరికట్టడానికి ఎంతో కొంత సహకరిస్తుందనేది మాత్రం చెప్పవచ్చు. -
ధరలు పెరుగుతాయ్.. ఎరువులు కూడా దొరకవ్
సాక్షి, రాయ్బరేలీ: దేశంలో ఆర్థిక తుపాను ముంచుకొస్తుందన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి అదే తరహా ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని వ్యాఖ్యానించారాయన. తన సొంత నియోజకవర్గం రాయ్బరేలీలో బుధవారం నిర్వహించిన బహుజన్ స్వాభిమాన్ సభలో పాల్గొన్న ఆయన మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.ద్రవ్యోల్బణం మనిషి(మోదీని ఉద్దేశించి..) తన వసూళ్లను ఇప్పటితోనే ఆపరు. ఆయన జనాల్ని మభ్యపెట్టడానికి ప్రతీసారి టీవీల ముందుకు వచ్చి భావోద్వేగంతో ఏడుస్తారు. త్వరలో మరోసారి అలా జరగొచ్చు. కొన్ని నెలల్లో ద్రవ్యోల్బణం ఎక్కడికి వెళ్తుందో చూడండి. నిత్యావసర ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతాయి. రాబోయే రోజుల్లో రైతులకు ఎరువులు కూడా దొరకవు. విదేశాలకు వెళ్లొద్దని మోదీ చెప్తారు. కానీ ఆయన వేల కోట్ల విలువైన విమానాల్లో విదేశాలకు వెళ్తారు అని రాహుల్ మండిపడ్డారు.ప్రధాని మోదీ తాను పిలుపునిచ్చిన పొదుపు చర్యలను తానే పాటించడం లేదని మంగళవారం బఛ్రావా సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. ప్రస్తుత ప్రభుత్వం మారేంతవరకూ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారాయన.‘‘ప్రపంచం మొత్తం త్వరలో తీవ్ర చమురు, ఎరువుల కొరతను ఎదుర్కోబోతోంది. ఈ సంక్షోభాన్ని మన జీవితాల్లో మనం ఎప్పుడూ చూసి ఉండం. దీనినెవరూ ఆపలేరు. దీని ప్రభావం ఎవరిపై పడుతుంది.. అదానీ, అంబానీలు వారి ప్యాలెస్లలో భద్రత మధ్య బాగానే ఉంటారు. కానీ మన రైతులు, యువత, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమల వారు తీవ్రంగా నష్టపోతారు అంటూ రాహుల్ ప్రసంగించారు. ఇదిలా ఉంటే.. పెట్రోల్ ధరల పెంపుపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో సహా అన్నిచోట్లా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ప్రదర్శలు నిర్వహిస్తోంది. -
కులగణనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: కులగణనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇది ప్రభుత్వ విధానపరమై నిర్ణయయమని చెబుతూ.. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని బుధవారం కొట్టేసింది. అదే సమయంలో ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.వెనుకబాటుతనం గుర్తించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది విధానపరమైన నిర్ణయం (పాలసీ డెసిషన్). కాబట్టి ఇందులో మా జోక్యం ఉండబోదు. వెనుకబడిన కులాల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం. ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంఖ్య తెలుసుకోవడం అవసరం. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిందే అని చీఫ్ జస్టిస్ బెంచ్ స్పష్టం చేసింది.జనగణనలో కులగణన వద్దని కోరుతూ సుధాకర్ గుమ్ములా సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ వాదనలు ఇలా.. ‘‘కులగణన డేటాను రాజకీయ పార్టీలు, ఏజెన్సీలు తమ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉంది. కులాల వారీగా లెక్కలు తీస్తే సమాజంలో విభజన పెరుగుతుంది. కుల ఆధారిత రాజకీయాలు మరింత బలపడతాయి. జనగణన ఉద్దేశం.. ప్రధానంగా జనాభా, ఆర్థిక, సామాజిక వివరాల కోసం మాత్రమే. అలాంటప్పుడు కులగణన చేర్చడం అవసరం లేదు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇస్తుంది. కులాల వారీగా లెక్కలు తీస్తే సమానత్వ భావన దెబ్బతింటుంది’’ అని వాదించారు.ఈ పిటిషన్పై కేంద్రం వాదిస్తూ.. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే కులాల వారీగా డేటా అవసరం. 1931 తర్వాత పూర్తి స్థాయి కులగణన జరగలేదు. కాబట్టి కొత్త డేటా కావాల్సిందే. సమగ్ర అభివృద్ధి కోసం వెనుకబడిన వర్గాల సంఖ్య, స్థితి తెలుసుకోవాలి. అసలు కులగణన చేయాలా వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఇది న్యాయస్థానం జోక్యం చేసుకునే విషయం కాదు.సుప్రీం కోర్టు తీర్పు.. జనగణనలో కులగణన ఉండాలా లేదా అనేది ప్రభుత్వ విధాన నిర్ణయం. మేము జోక్యం చేసుకోలేంకులగణన అంటే.. జనగణనలో కులాల వారీగా జనాభా లెక్కించడం. చివరిసారి పూర్తి స్థాయి కులగణన 1931లో జరిగింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే అధికారికంగా లెక్కించబడుతున్నాయి. అయితే కులగణన ద్వారా వెనుకబడిన వర్గాల సంఖ్య, స్థితి తెలుసుకోవచ్చు. ఇది సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించడానికి కీలకమని ప్రభుత్వం చెబుతోంది. -
మోదీకి ప్రశ్నా.. నార్వే మహిళా జర్నలిస్టు దుస్సాహసం!
ఇంటా బయటా విలేకరులతో మాట్లాడడానికి ఇష్టపడని మన ప్రధాన మంత్రి మోదీ నిన్న నార్వే టూర్లో Dagsavisan అనే పత్రిక మహిళా జర్నలిస్టు (Helle Lyng Svendsen) నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కున్నారు. "Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world?" అని ఆ జర్నలిస్టు అడిగారు.నార్వే ప్రధానితో కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ముగించుకుని కరచాలనం చేసి వెళ్తుండగా అది వినిపించిందో, లేదో గానీ మోదీ గారు ఆ ప్రశ్న పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత, ఎక్స్ వేదికగా ఆమె రచ్చ చేశారు. "It is our job to question the powers we cooperate with," అని ఆమె రాశారు. దీని మీద సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది. కాషాయ సోషల్ మీడియా బృందం ఆమె వెంటపడి కామెంట్స్తో కుమ్ముతోంది. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఈ క్రమంలో దాచడానికి ఏమీ లేనప్పుడు భయపడటం ఎందుకు?. తన విశ్వసనీయతపైనే సందేహాలున్న ఒక ప్రధానమంత్రి, కేవలం కొన్ని ప్రశ్నలకు భయపడి వెళ్లిపోవడాన్ని ప్రపంచం చూసినప్పుడు, భారతదేశ ప్రతిష్ట ఏమవుతుంది? అని ప్రశ్నించారు.కాగా, 2015లో బ్రిటన్లో, 2023లో అమెరికాలో మాత్రమే మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత జర్నలిస్టులకు దూరంగా ఉంటున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియాను ఏ మాత్రం పట్టించుకోకుండా మూడు సార్లు ప్రధానమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది. నార్వేలో ఇద్దరు ప్రధానులు చేసింది press briefing మాత్రమే అనీ, అది press conference కాదు కాబట్టి ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళారని భారత అధికారులు అంటున్నారు. It is indeed a point!When there is nothing to hide, there is nothing to fear.What happens to India’s image when the world sees a compromised PM panic and run from a few questions? https://t.co/tOO8vzESpf— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2026సమాధానం ఇస్తే బాగుండేది..ప్రోటోకాల్లో లేకపోయినా, మన ప్రధాని ఆ జర్నలిస్టు నుంచి ఒక ప్రశ్న తీసుకుని చక్కగా నవ్వుతూ సమాధానం ఇస్తే బాగుండేది. మహా అయితే.. మానవ హక్కుల ఉల్లంఘన, ముస్లిం వ్యతిరేకత, వ్యవస్థల నిర్వీర్యం, రెండు యుద్ధాల (ఇరాన్, ఉక్రెయిన్) వంటి వివాదాస్పద ప్రశ్న ఒకటి అడిగి ఉండేది ఆమె. ఆ ప్రశ్నకు నేరుగా కాకపోయినా, డొంక తిరుగుడుగా సూపర్ సమాధానాలు చెప్పవచ్చు. దానికి కూడా మంచి పాజిటివ్ కవరేజ్ వచ్చేది. నాకు ఆసక్తి కలిగించిన అంశం ఏమిటంటే, ఒక మహిళా జర్నలిస్టు ధైర్యంగా ప్రశ్న అడిగితే ఆమె ఘోర అపరాధం చేసినట్లు ఆ దేశ అధికారులు, భద్రతా సిబ్బంది ఎవ్వరూ స్పందించలేదు. మన దగ్గర అయితే సీన్ వేరుగా ఉంటుంది. అందుకే మహిళా జర్నలిస్టులు గ్రేట్.ఇక, ఫ్రాన్స్ కేంద్రంగా ఉండే అంతర్జాతీయ NGO రిపోర్టర్స్ విత్అవుట్ బోర్డర్స్ ప్రతి ఏడాదీ World Press Freedom Index విడుదల చేస్తుంది. వివిధ కొలబద్దల ఆధారంగా దేశాలకు ర్యాంకింగ్ ఇస్తారు. 180 దేశాలలో మీడియా స్వేచ్ఛలో ఫస్ట్ ప్లేస్లో నార్వే ఉండగా, భారత్ ర్యాంకు 157గా కొనసాగుతోంది. - డాక్టర్ ఎస్.రాము, సీనియర్ జర్నలిస్ట్. ఇదిలా ఉండగా.. ఓస్లోకు చెందిన డగ్సావిసెన్ అనే పత్రికలో హెల్లి లింగ్ పనిచేస్తున్నది. మోదీ నార్వే విజిట్ను కవర్ చేసే బృందంలో ఆమె కూడా ఉన్నారు. గతంలో MSN మరియు ఇతర నార్వేజియన్ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. తమ ప్రభుత్వంతో సహకరించే అధికారులను ప్రశ్నించడం తన కర్తవ్యం అని ఆమె తెలిపారు. అనంతరం, ఈ పరిణామాల కారణంగా తన ఇన్స్స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్లాక్ అయినట్టు ఆమె పేర్కొంది. లింగ్ ప్రశ్నల వర్షం.. ఇక భారత విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్వహించిన మీడియా సమావేశంలోనూ లింగ్ మళ్లీ ప్రశ్నలు కురిపించారు. భారత్లో ఉన్న ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ఆమె ప్రశ్నించారు. అంతర్జాతీయ సమాజం ఇండియాను ఎందుకు నమ్మాలని ఆమె అడిగారు. సంక్లిష్టమైన అంశాల్లో ప్రధాని మోదీ స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. లింగ్ చేసిన ఆరోపణలకు విదేశాంగ శాఖ ప్రతిని సిబి జార్జ్ స్పందించారు. భారతీయ ప్రజాస్వామ్యాన్ని, మీడియాను ఆమె సమర్ధించారు. అయితే ఏమీ తెలియని ఎన్జీవోలు ఇచ్చే నివేదికలను విదేశీ విమర్శకులు పరిశీలిస్తుంటారని జార్జ్ అన్నారు. విదేశాంగ శాఖ, జర్నలిస్టు మధ్య జరిగిన సంభాషణకు చెందిన వీడియోలు వైరల్ అయ్యాయి. -
260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా?
న్యూఢిల్లీ: దాదాపు 260 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బొయింగ్ 787 ఘోర విమాన ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్నది. ఈ దారుణ ఉదంతంపై భారత విమానయాన అధికారులు సరికొత్త కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రీమ్లైనర్ విమానాల్లోని ‘ఫ్యూయల్-కంట్రోల్ స్విచ్లు’ (ఇంధన నియంత్రణ స్విచ్లు) అకస్మాత్తుగా ఆగిపోవడమే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో భారత సివిల్ ఏవియేషన్ (డీసీసీఏ) ఉన్నతాధికారులు అమెరికాలోని సీటెల్ నగరంలోని బొయింగ్ ప్రధాన కార్యాలయానికి స్వయంగా వెళ్లి, ఈ స్విచ్ల పనితీరుపై జరగబోయే ప్రయోగాలను పర్యవేక్షించనున్నారు.లండన్-బెంగళూరు ఫ్లైట్లో బయటపడ్డ లోపంఇటీవల లండన్ నుండి బెంగళూరు వస్తున్న మరో ఎయిర్ ఇండియా బొయింగ్ 787 విమానంలో పైలట్లు ఇంధన స్విచ్లలో ఒక విచిత్రమైన సాంకేతిక సమస్యను గుర్తించారు. ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో స్వల్ప ఒత్తిడి పడినా ఈ స్విచ్లు స్థిరంగా ఉండకుండా ఊడిపోవడాన్ని పైలట్లు గమనించారు. మూడుసార్లు ప్రయత్నించిన తర్వాతే అవి సరిగ్గా పనిచేశాయి. ఈ ఘటన విమాన ప్రమాద దర్యాప్తుకు అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. అహ్మదాబాద్ ప్రమాదంలో కూడా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంధన స్విచ్లు ఒకేసారి ‘కటాఫ్’ పొజిషన్కు మారిపోయి, ఇంజిన్కు ఇంధనం అందకుండా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.సీటెల్ బొయింగ్ ల్యాబ్లో క్లిష్టమైన పరీక్షలుఆటోమేటిక్గా లేదా అనుకోకుండా మారడానికి వీల్లేని ఈ సురక్షితమైన లాకింగ్ స్విచ్లు, ఏదైనా నిర్దిష్ట కోణంలో బాహ్య ఒత్తిడి పడటం వల్ల దానంతట అవే కట్-ఆఫ్ అయ్యే అవకాశం ఉందా? అనే కోణంలో ఇప్పుడు అధికారులు పరిశోధించనున్నారు. లండన్ ఫ్లైట్ నుండి తొలగించిన స్విచ్ మోడ్యూల్ను ప్రస్తుతం అమెరికా బొయింగ్ ల్యాబ్లో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో పరీక్షించనున్నారు. అయితే, ప్రాథమిక తనిఖీల్లో ఈ సిస్టమ్ బాగానే ఉందని బొయింగ్ పేర్కొన్నప్పటికీ, ప్రమాద తీవ్రత దృష్ట్యా డీజీసీఏ అధికారులు స్వయంగా అక్కడ ఉండి ప్రయోగాలను వీక్షించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించారు.పైలట్ల సంఘాల ఆందోళన – అంతర్జాతీయ నిఘామరోవైపు అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) గతంలో ఈ ప్రమాదానికి ఎలాంటి యాంత్రిక లోపం కారణం కాదని, పైలట్లే మాన్యువల్గా ఇంధనాన్ని నిలిపివేసి ఉండవచ్చని అభిప్రాయపడింది. అయితే ఈ వాదనను భారత పైలట్ల సంఘాలు, మరణించిన కెప్టెన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పూర్తి విచారణ ముగియకముందే పైలట్లపై నిందలు వేయడం సరికాదని, స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారత విమానయాన రంగ భద్రత దృష్ట్యా, డీజీసీఏ ఈ దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇది కూడా చదవండి: ‘బందా’లో నిప్పుల కొలిమి: కర్ఫ్యూను తలపిస్తున్న వీధులు! -
మెడికల్ షాపులు బంద్.. ఏపీలో మూతపడ్డ 45K షాపులు
-
నేడు మెడికల్ షాపులు బంద్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఆన్లైన్లో మందులు అమ్మకాలను ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ (AIOCD) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల దుకాణాలు బుధవారం మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టిసారించారు. మందుల సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అత్యవసర, ఇతరత్ర మందులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా యంత్రాంగాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు.. ప్రధాన ఫార్మసీ చైన్లు, ఆస్పత్రుల్లోని మెడికల్ స్టోర్లు, జన ఔషధి కేంద్రాలు, అమృత్ ఔట్లెట్స్ మాత్రం తెరిచి ఉండే అవకాశాలున్నాయి.వివాదం నేపథ్యంకోవిడ్ సమయంలో ప్రజలకు మందులు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డోర్ డెలివరీకి అనుమతి ఇచ్చింది. కానీ మహమ్మారి ముగిసిన తర్వాత కూడా కార్పొరేట్ ఈ–ఫార్మసీలు ఆ వెసులుబాటును కొనసాగిస్తూ ఆన్లైన్ విక్రయాలు చేస్తున్నారు. రిటైల్ షాపు యజమానుల అభిప్రాయం ప్రకారం.. ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్లను వెరిఫై చేయకుండానే మందులు ఇస్తున్నారు(డెలివరీలు సైతం). ఇది ప్రజారోగ్యానికి ముప్పు. అలాగే ఈ చర్యలతో తమ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. నిత్యావసర సరుకుల మాదిరిగా మందులను విక్రయించడం సరైన పద్ధతి కాదని వారు అంటున్నారు.రిటైల్ వ్యాపారుల ఆందోళనలుఈ–ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ రిటైల్ మార్కెట్ను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతోందని కెమిస్టులు చెబుతున్నారు. వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ.. కేవలం డిస్కౌంట్ కోసం ఆన్లైన్లో మందులు కొనడం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని సూచిస్తున్నారు.చట్టపరమైన అంశాలుఔషధ నియంత్రణ చట్టం ప్రకారం షెడ్యూల్ హెచ్లోని యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మందులు, అలాగే షెడ్యూల్ ఎక్స్లోని నిద్ర మాత్రలు, మత్తు మందులు వైద్యుల ప్రిస్క్రిప్షన్తోనే ఇవ్వాలి. కానీ ఆన్లైన్ విక్రయాల ద్వారా ఈ మందులు దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.ప్రభుత్వ హామీఇటీవల AIOCD ప్రతినిధులు కేంద్ర డ్రగ్ నియంత్రణ సంస్థతో సమావేశమై ఈ–ఫార్మసీల నియంత్రణపై చర్చించారు. చట్టపరమైన అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని సంస్థ హామీ ఇచ్చింది.రాష్ట్రాల వైఖరిఅయితే అన్ని రాష్ట్రాలు ఈ బంద్లో పాల్గొనడం లేదు. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసోసియేషన్లు.. కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్ బంద్లో పాల్గొనబోమని లేఖలు సమర్పించాయి.ముగింపుఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ, ప్రజారోగ్య భద్రత, రిటైల్ వ్యాపారుల ఆర్థిక స్థితి.. ఈ మూడు అంశాల మధ్యే వివాదం కేంద్రీకృతమై ఉంది. ఒక రోజు బంద్ ద్వారా కెమిస్టులు తమ ఆందోళనను వ్యక్తం చేయబోతున్నారు. -
సంబంధాలు ఉన్నతస్థాయికి
ఓస్లో: తమ సంబంధాలను ఇకపై గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని భారత్, నార్డిక్ దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని మోదీ మంగళవారం నార్వే రాజధాని ఓస్లోలో మూడో ఇండియా–నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. క్లీన్ ఎనర్జీ, సుస్థిరాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, నవీన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. మోదీతోపాటు ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రన్ ఫ్రొస్టాడాటిర్, ఫిన్లాండ్ ప్రధాని పెటెరీ ఓర్పో, డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్, నార్వే ప్రధాని జోనా గర్ స్టోర్, స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఈ సదస్సుకు హాజరయ్యారు.అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదంపై భారతదేశం, నార్డిక్ దేశాలు స్పష్టమైన, ఐక్య వైఖరిని కలిగి ఉన్నాయని మోదీ తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో రాజీపడి ప్రసక్తే లేదని, ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టంచేశారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు కొనసాగుతున్న తరుణంలో నియమాల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేయడానికి భారత్, నార్డిక్ దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని వెల్లడించారు.ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా వివాదాల ప్రారంభ పరిష్కారానికి, శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు మద్దతునిస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన పట్ల నిబద్ధత తమను సహజ భాగస్వాములను చేస్తోందన్నారు. గ్రీన్ టెక్నాలజీ భాగస్వామ్యంతో మొత్తం ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందిస్తామని మోదీ పేర్కొన్నారు. మూడు దేశాల ప్రధానులతో భేటీ ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలతో క్లీన్ ఎనర్జీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరాభివృద్ధి, డిజిటలీకరణ, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ తదితర రంగాల్లో పరస్పర సంబంధాలను బలపేతం చేసుకోవడంపై మోదీ చర్చించారు. ఆయన మంగళవారం ఆయా దేశాల ప్రధానమంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్, మూడు నార్డిక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్లో పర్యటించాలని మూడుదేశాల ప్రధానులను మోదీ ఆహ్వానించారు. ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఇటలీకి పయనమైన మోదీ ప్రధాని మోదీ నార్వే పర్యటన పూర్తిచేసుకొని మంగళవారం ఇటలీకి పయనమయ్యారు. నార్వే పర్యటన ఫలవంతంగా ముగిసిందని ఆయన ‘ఎక్స్‘లో పోస్టుచేశారు. పలు సమావేశాల్లో పాల్గొన్నానని, కీలక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. -
సెప్టెంబర్లో భారత్కు పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్రంలో అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషకోవ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోనూ ఆయన వేరుగా భేటీ అవుతారని వివరించారు.బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ ఈ శిఖరాగ్రానికి ఆతిథ్యం ఇస్తోంది. భారత్కు పుతిన్ చివరిసారిగా 2025 డిసెంబర్లో వచ్చారు. అప్పట్లో ఆయన భారత్–రష్యా వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. బ్రెజిల్, భారత్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పాటైన బ్రిక్స్లో ప్రస్తుతం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, ఇండోనేసియా కూడా సభ్యదేశాలుగా ఉన్నాయి. -
భారత్లో రూ. 5,700 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫుడ్, బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో 2030 నాటికి భారత్లో రూ. 5,700 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయ నుంది. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయా రీ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ మొత్తా న్ని వెచ్చించనున్నట్లు సంస్థ ఇండియా, సౌత్ ఏషి యా సీఈవో జాగృత్ కొటేచా తెలిపారు. మధ్యప్రదేశ్లోని కాన్సెంట్రేట్స్ ప్లాంటులో, అస్సాం..తమిళనాడులోని స్నాక్స్ ప్లాంట్లపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఇటీవలే స్థలాన్ని కూడా సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆదాయాలు, వినియోగం స్థిరంగా పెరుగుతున్న భారత్ తమకు టాప్ 13 మార్కెట్లలో ఒకటని ఆయ న చెప్పారు.గతేడాది (2025)లో రూ. 9,789 కోట్ల ఆదాయంపై రూ. 905 కోట్ల లాభం ఆర్జించినట్లు జాగృత్ తెలిపారు. వరుసగా రెండో ఏడాది కూడా పటిష్టంగా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందినట్లు వివరించారు. ఫుడ్ సెగ్మెంట్లో 11 శాతం వృద్ధి సాధించినట్లు పెప్సీకో ఇండియా, సౌత్ ఏషియా సీఎఫ్వో సవిత బాలచంద్రన్ తెలిపారు. వాతావరణం కారణంగా శీతల పానీయాల విభాగానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, పోటీ కూడా పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ రెండు విభాగాలు మెరుగ్గా రాణించినట్లు పేర్కొన్నారు. -
రూపాయి మరో కొత్త కనిష్టం..
ముంబై: భగ్గుమంటున్న క్రూడాయిల్ రేట్లు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, డాలరు బలపడుతుండటం లాంటి ప్రతికూల పరిణామాలతో రూపాయి మారకం విలువ వేగంగా కరిగిపోతోంది. మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 50 పైసలు క్షీణించి సరికొత్త ఆల్టైమ్ కనిష్టం 96.70కి పతనమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 96.20తో పోలిస్తే మరింత తక్కువగా 96.38 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ .. ఇంట్రాడేలో 96.27కి పెరిగింది. కానీ అది నిలబెట్టుకోలేక చివరికి 50 పైసలు క్షీణతతో ముగిసింది. దీనితో గత ఎనిమిది సెషన్లలో 2.64 శాతం (రూ. 2.48) మేర పతనమైనట్లయింది. తద్వారా ఆసియాలోనే అత్యధికంగా పతనమైన కరెన్సీగా నిల్చింది. డాలరు బలపడటం, అమెరికా ట్రెజరీ ఈల్డ్లు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంలాంటి అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మిరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అయితే, పసిడి, వెండిపై దిగుమతులపై ఆంక్షలు, ఆర్బీఐ జోక్యంతో కనిష్ట స్థాయిల్లో రూపాయికి కొంత మద్దతు లభించవచ్చని పేర్కొన్నారు. స్పాట్ మార్కెట్లో 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు. -
ఘనమైన గతంతో 'బలమైన భవితలోకి'!
ఇండియా, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు నేడొక కీలక మలుపులో నిలిచాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన అవి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి. అంతర్జాతీయ వ్యవస్థ తీవ్రమైన మార్పులకు లోనవుతున్న తరుణంలో క్రమబద్ధ ఆదాన ప్రదానాలు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. మేడిన్ ఇటలీ... మేడిన్ ఇండియాప్రస్తుత 21వ శతాబ్దంలో ఆ యా దేశాల ఆవిష్కరణ సామర్థ్యం, ఇంధన మార్పిడి నిర్వహణ, వ్యూహాత్మక సార్వభౌమత్వం తదిత రాలే ప్రజా శ్రేయస్సు, జాతీయ భద్రత వంటి అంశాలకు రూపు నిస్తాయి. ఈ విషయంలో మా ఉమ్మడి అవగాహనను రెండు దేశాల మధ్య సహకారం ప్రస్ఫుటం చేస్తోంది. డిజైన్, తయారీ నైపుణ్యం, అంతర్జాతీయ స్థాయి సూపర్ కంప్యూటర్లతో పారిశ్రామిక కూడలిగా ప్రపంచంలో ఇటలీకి ప్రముఖ స్థానం ఉంది. అదేవిధంగా 100కు పైగా యూనికార్న్ సంస్థలు సహా 2,00,000 అంకుర సంస్థలతో భారత్ శరవేగంగా ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది. రెండు దేశాలకుగల ఈ సామర్థ్యాల మధ్య శక్తిమంతమైన సమన్వయ సాధన లక్ష్యాన్ని మేం నిర్దేశించుకున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఇనుమడించేందుకు ఐరోపా సమాఖ్య–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) బాటలు వేస్తుంది. రక్షణ–ఏరోస్పేస్, కాలుష్య రహిత సాంకేతికతలు, యంత్రాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, రసాయన–ఔషధ, జౌళి, వ్యవసాయ–ఆహార, పర్యాటకం సహా మరిన్ని రంగాలపై ‘ఎఫ్టీఏ’ దృష్టి సారిస్తుంది. తద్వారా 2029 నాటికి ఇటలీ–ఇండియా మధ్య నిర్దేశిత 20 బిలియన్ యూరోల వాణిజ్య లక్ష్యాన్ని చేరడంతో సరి పెట్టకుండా దాన్ని అధిగమించాలన్నది మా ఆకాంక్ష. ‘మేడ్ ఇన్ ఇటలీ’ అనేది అంతర్జాతీయంగా అత్యుత్తమ నాణ్యతకు పర్యాయ పదబంధం. ఇప్పుడిది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ నిర్దేశిత ఉన్నత నాణ్యత లక్ష్యంతో సమన్వయం ఏర్పరచు కుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ కోసం ఉత్పాదన దిశగా ఇటలీ వ్యాపార సంస్థలలో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఇటలీలో భారత పరిశ్రమల సంఖ్య కూడా పెరగడం (ప్రస్తుతం రెండువైపులా వీటి సంఖ్య 1000కి పైగానే) మా సరఫరా వ్యవస్థల ఏకీకరణను బలోపేతం చేసే సానుకూల సంకేతం.ఏఐలో మానవీయతకే ప్రాధాన్యంఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అత్యాధునిక తయారీ, కీలక ఖనిజాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో నేటి పురోగమన వేగం రాబోయే దశాబ్దాల్లో అసాధారణ పరిధిగల సాంకేతిక విప్లవంగా రూపుదిద్దుకోగలదు. ఈ క్రమంలో చైతన్యవంతమైన భారత ఆవిష్కరణావరణ వ్యవస్థ, అత్యంత నైపుణ్యంగల వృత్తి నిపుణుల వనరులు, ఇటలీకిగల అత్యధునాతన పారిశ్రామిక సామర్థ్యం మేళవింపుతో పైన పేర్కొన్న రంగాలన్నిటా మన సహ కారం సహజసిద్ధమైనదిగా, వ్యూహాత్మకంగా రూపొందుతుంది. రెండు దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం ఈ పరిణామశీలతకు తోడ్పడుతుంది. సాంకేతికత పరిజ్ఞానాలను మానవాళి కేంద్రకంగా ఉంచేందుకు ‘మానవ్’ పేరిట భారత్ ఒక దార్శనిక విధానం అనుసరిస్తోంది. మానవతావాద సంప్రదాయంలో పాదుకున్న మానవ–కేంద్రక ‘అల్గార్–ఎథిక్స్’ను ప్రోత్సహించడంలో ఇటలీ ముందంజ వేసింది. ఇటలీ జి7 అధ్యక్షతకు, న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026’ సత్ఫలితాలకు మూలం ఈ సంయుక్త దృక్పథమే. అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతికతలలో భారత్ ఇప్ప టికే అద్భుత ప్రగతి సాధించింది. ఇప్పుడిక ఇటలీ ఏరోస్పేస్ ఇంజి నీరింగ్ నైపుణ్యం తోడ్పాటుతో సంయుక్త కార్యక్రమాలు చేపట్టడం సహా భవిష్యత్తరం సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పనకు గణనీయ అవకాశాలు అందివస్తాయి. ప్రపంచ దేశాల శ్రేయస్సుకు భరోసా లభించాలంటే జాతీయ భద్రత–స్థిరత్వం అత్యావశ్యకం. కాబట్టే రక్షణ–భద్రత, వ్యూహాత్మక సాంకేతికతలు వంటి రంగాల్లో సహకార బలోపేతానికి ఇటలీ, ఇండియా సంకల్పించాయి. కీలక సముద్ర మార్గాల భద్రతకు భరో సాతోపాటు ఉగ్రవాదం, అంతర్జాతీయ నేర నెట్వర్క్లు, మాదక ద్రవ్యాల దొంగ రవాణా, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను ఎదుర్కొనగల సామర్థ్యాన్ని పటిష్ఠం చేయడంలో ఈ సహకారం దోహదం చేస్తుంది.ఇండో–మధ్యదరా కోసం వ్యూహాత్మక భాగస్వామ్యంమన భాగస్వామ్యానికి ఇంధన రంగం మరో మూలస్తంభం. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనాల నుంచి హైడ్రోజన్ సాంకే తికతల దాకా... స్మార్ట్ గ్రిడ్ల నుంచి పునరుత్థాన మౌలిక సదు పాయాల వరకూ భారత్, ఇటలీ ఇప్పటికే సహకారం కొనసాగిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నేతృత్వాన ఏర్పడిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), విపత్తు పునరుత్థాన మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), అంతర్జాతీయ జీవఇంధన కూటమి (జీబీఏ) వంటి సంకీర్ణ సంస్థల కృషిలో ఇతర దేశాలతోపాటు మన సహకారం కూడా కీలకం.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రాలైన ఇండో–పసి ఫిక్, మధ్యధరా ప్రాంతాల నడిబొడ్డున ఇండియా, ఇటలీ ఉన్నాయి. కాబట్టి, ఈ ప్రాంతాలను వేర్వేరు పరిధులుగా కాకుండా అంతకంతకూ పరస్పర సంధానితం అవుతున్న ప్రదేశాలుగా పరిగణించాలి. హిందూ మహాసముద్రాన్ని ఐరోపాతో ముడిపెట్టే వాణిజ్య, సాంకేతిక, ఇంధన, డేటా సహా సమాలోచనలకు కీలక మార్గమైన భారత–మధ్యధరా ప్రాంతం ఆవిర్భావానికి మన రెండు దేశాలే ప్రత్యక్ష సాక్షులు. సరిగ్గా ఈ పరస్పర సంధాన క్రమంలోనే మన స్నేహబంధం సహజ రీతిలో ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరిఢవిల్లుతూ – రెండు ఖండాలను కలిపి, కొత్త ప్రపంచ గమనాన్ని రూపుదిద్దుతుంది. ఈ పరిస్థితుల నడుమ ఆధునిక రవాణా, మౌలిక సదుపాయాలు, డిజిటల్ నెట్వర్క్లు, ఇంధన వ్యవస్థలు, పటిష్ఠ సరఫరా వ్యవస్థలతో మన ప్రాంతాలను అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకున్న దార్శనికతకు ‘ఇండియా– మధ్యప్రాచ్య–ఐరోపా ఆర్థిక కారిడార్’ (ఐఎంఈసీ) ఒక ప్రతీక. భారతీయ సంస్కృతి ప్రబోధించే ‘ధర్మం’ అనే ఉదాత్త భావన మా బాధ్యతా స్ఫూర్తిని ఉత్తేజితం చేస్తుంది. ఆ క్రమంలో నేటి పరస్పర సంధాన డిజిటల్ యుగంలోనూ ‘వసుధైవ కుటుంబకం’ (యావత్ ప్రపంచం ఒకే కుటుంబం) సూత్రం మానవాళి మొత్తాన్నీ ముడివేయడంలో శక్తిమంతంగా పనిచేస్తుంది. పునరుజ్జీవన పథంలో పయనించే ఇటలీ మానవతావాద సంప్రదాయం కూడా ఈ విలువలను సహజంగా ప్రతిబింబిస్తుంది. అందుకే, రెండు దేశాల ప్రజలకు కేంద్ర స్థానమిస్తూ ఇండియా–ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేయాలని మా సంయుక్త దార్శనికత లక్ష్యనిర్దేశం చేసుకుంది. -
నీట్-యూజీ రీ ఎగ్జామ్: ఏర్పాట్లపై ధర్మేంద్ర ప్రధాన్ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కఠిన భద్రతా నిబంధనల మధ్య పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు, ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు రావడంతో పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. ఆ పరీక్షకు 22 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రద్దు కావడంతో ఆవేదన చెందుతున్నారు.ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం నిర్వహించి.. పరీక్ష నిర్వహణలో నిష్పక్షపాతం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. గత పరీక్షా ప్రక్రియలో గుర్తించిన లోపాలు తలెత్తకూడదని అధికారులకు ఆదేశించారు. కఠిన పర్యవేక్షణ వ్యవస్థలపై దృష్టి పెట్టిన ధర్మేంద్ర ప్రధాన్ పరీక్షా కేంద్రాల్లో అప్రమత్తతతో రీ-నీట్ను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. అలాగే పరీక్ష ఏర్పాట్లు, భద్రతా పర్యవేక్షణ అమలుపై రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. భద్రతా చర్యలతో పాటు విద్యార్థులకు రవాణా సౌకర్యం, తాగునీరు, ఇతర అవసరమైన ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల్లో ఉండాలని ప్రధాన్ అధికారులకు ఆదేశించారు.అభ్యర్థులకు ముఖ్య సూచనలునీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21 (ఆదివారం) నిర్వహిస్తారు.ప్రస్తుతం ఉన్న చిరునామా మారితే పరీక్షా నగర ప్రాధాన్యత మార్చుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లు నీట్ ఎన్టీఏ పోర్టల్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మే 21 వరకు మార్పులు చేసుకోవచ్చు.విద్యార్థులు మొదటి, రెండో ప్రాధాన్యత పరీక్షా నగరాలను ఎంచుకునే అవకాశం పొందుతారు. ప్రస్తుతం ఉన్న చిరునామా, పరీక్షా నగర ప్రాధాన్యత మార్పులకు తప్ప ఇతర సవరణలకు అనుమతి లేదు. మే 21 తర్వాత వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకోరు.రద్దైన పరీక్షకు చెల్లించిన ఫీజు తిరిగి ఇస్తారు. రీ-ఎగ్జామ్కు అదనపు ఫీజు వసూలు చేయరు.పరీక్ష పెన్-అండ్-పేపర్ (ఆఫ్లైన్) విధానంలోనే 13 భాషల్లో నిర్వహిస్తారు. అవి అస్సామీ, బెంగాలీ, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ.పరీక్షా ప్రక్రియల నిర్వహణకు విద్యార్థులకు అదనంగా 15 నిమిషాలు ఇస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరుగుతుంది.సిటీ ఇంటిమేషన్ స్లిప్లు, అడ్మిట్ కార్డులు, ఇతర పరీక్షా వివరాలు అధికారిక వెబ్సైట్లో తర్వాత ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. తాత్కాలికంగా జూన్ 14 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.2027 నుంచి నీట్-యూజీని కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తామని ఏజెన్సీ ప్రకటించింది.రీ-ఎగ్జామ్ ఫలితాల విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తారు.అప్డేట్లు, పరీక్షా సూచనల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక ఎన్టీఏ సోర్సులనే నమ్మాలని అధికారులు సూచించారు.నీట్ (యూజీ) 2026పై మరింత సమాచారం కావాలంటే అభ్యర్థులు 011-40759000, 011-69227700 హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయొచ్చు. లేక neetug2026@nta.ac.in కు ఈమెయిల్ పంపవచ్చు. -
వీధుల్లో కుక్కలు కనపడ్డానికి వీల్లేదు: సుప్రీం కోర్టు
వీధి కుక్కల అంశం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కల తరలింపు కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పింది. అలాగే తమ గైడ్ లైన్స్ను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలన్న విజ్ఞప్తులను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేస్తూ.. జంతు ప్రేమికులకు ఝలక్ ఇచ్చింది. వీధి కుక్కల దాడుల వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రతి పౌరుడు సొసైటీలో స్వేచ్ఛగా(ప్రత్యేకించి పబ్లిక్ ప్లేసుల్లోనూ) జీవించాలే తప్ప భయంతో కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్ 7న కఠిన ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం.. ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల నుండి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. వాటికి స్టెరిలైజ్, వ్యాక్సినులు వేసినా కూడా తిరిగి పబ్లిక్ప్లేసుల్లో వదలొద్దని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే.. ఈ మార్గదర్శకాలను సవరించాలంటూ జంతు సంక్షేమ సంఘాలు, డాగ్ ఫీడర్స్ పిటిషన్లు వేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2023కు విరుద్ధమని వాదించారు. ఆ నియమాల ప్రకారం, కుక్కలను స్టెరిలైజ్ చేసి, వ్యాక్సిన్ వేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని గుర్తు చేశారు. అయితే ఈ పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియా.. ఆ వాదనతో ఏకీభవించలేదు. తమ ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది.తాజా విచారణలో.. ప్రేక్షక పాత్ర వహిస్తున్న ప్రభుత్వాల తీరును సుప్రీం కోర్టు ఆక్షేపించింది. చిన్న పిల్లలు, వృద్ధులు, విదేశీ పర్యాటకులు కూడా వీధి కుక్కల దాడులకు గురైన ఘటనలను కోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై దాడులు బాధాకరమని వ్యాఖ్యానించింది. తాము ఆదేశాలిచ్చాక కూడా కుక్క కాట్ల ఘటనలు చోటు చేసుకుంటుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్” అనే డార్వినియన్ సూత్రం వాస్తవంగా అమలవుతున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల వల్ల కలిగే ప్రమాదాలను నిర్లక్ష్యం చేయరాదని కోర్టు ఈ సందర్భంగా హెచ్చరించింది. ప్రజల ప్రాణ భద్రతను కాపాడటం ప్రభుత్వాల కర్తవ్యమని.. ఈ విషయంలో ప్రభుత్వాలు పాసివ్ స్పెక్టేటర్లుగా ఉండకూడదని.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాబట్టి తమ గైడ్లైన్స్ను కచ్చితంగా పాటించాల్సిందేనని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాటిని ఆహారం పెట్టాలని జంతు ప్రేమికులకు స్పష్టం చేసింది.‘‘వీధుల్లో కుక్కలు కనిపించకూడదు. పిచ్చి కుక్కలకు యుథనేషియా ఇచ్చి చంపేయండి. ప్రమాదకర కుక్కలను సహించొద్దు. రేబీస్ కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించాలి. ప్రతిజిల్లాలో నియంత్రణకు యంత్రాంగం ఉండాల్సిందే. వీధి కుక్కల బెడదను నివారించాల్సిందే. ఇదొక సీరియస్ పబ్లిక్ న్యూసెన్స్. మా ఆదేశాలను పాటించని అధికారులు కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని సుప్రీం కోర్టు తీర్పు సందర్భంగా వెల్లడించింది. -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: వాహనదారులకు మళ్లీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు 90 పైసల చొప్పున పెంచేశాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమలుకానున్నాయి. ఇటీవలె రెండింటిపైనా రూ.3 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెట్రోల్పై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ లెక్కన నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు పెరిగాయన్నమాట. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్తో.. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ..దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది. అయితే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం.. హర్ముజ్ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ✔️ తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి:ఢిల్లీ: పెట్రోల్ ₹98.63, డీజిల్ ₹91.50ముంబై: పెట్రోల్ ₹107.40, డీజిల్ ₹93.86హైదరాబాద్: పెట్రోల్ ₹111.36, డీజిల్ ₹99.53కోల్కతా: పెట్రోల్ ₹109.31, డీజిల్ ₹95.85చెన్నై: పెట్రోల్ ₹104.66, డీజిల్ ₹96.22బెంగళూరు: పెట్రోల్ ₹106.82, డీజిల్ ₹94.82పాట్నా: పెట్రోల్ ₹109.40, డీజిల్ ₹95.61జైపూర్: పెట్రోల్ ₹108.89, డీజిల్ ₹94.32తిరువనంతపురం: పెట్రోల్ ₹111.24, డీజిల్ ₹100.09చండీగఢ్: పెట్రోల్ ₹98.16, డీజిల్ ₹86.28 -
భారత్లో చాట్జీపీటీ ఇమేజ్ల సునామీ
న్యూఢిల్లీ: భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ప్రవేశపెట్టిన ‘చాట్జీపీటీ ఇమేజెస్ 2.0’ భారత్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన నెల రోజుల్లోనే భారతీయులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏకంగా 100 కోట్లకు (1 బిలియన్) పైగా చిత్రాలను సృష్టించి సరికొత్త రికార్డు సృష్టించారు. ‘‘చాట్జీపీటీ ఇమేజెస్ 2.0 భారత్లో ఇప్పటికే 100 కోట్ల మార్కును దాటేసింది. ఇది నిజంగా అద్భుతం’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న భారత్లో విడుదలైన ఈ వెర్షన్, మే 18 నాటికే ఈ ఘనతను సాధించింది. ఓపెన్ఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘సినిమాటిక్ పోర్ర్టెట్ కొలాజ్’, ‘మినీ మీ వరల్డ్’, ‘అండర్వాటర్ పోర్ర్టెట్’, ‘అనిమే’, ‘చిబి స్టికర్ ప్యాక్’, ‘మంగా కామిక్ స్ట్రిప్’, ‘ఫ్యాషన్ స్టూడియో పోర్ర్టెట్’ వంటి ప్రాంప్ట్ లతో భారతీయులు భారీగా చిత్రాలను రూపొందిస్తున్నారు. భారత్లో ఏఐ ఇమేజ్ జనరేషన్ కేవలం ఉత్పాదకతకే పరిమితం కాకుండా.. క్రియేటర్ కల్చర్, ఫ్యాషన్, ఫ్యాన్డమ్స్, డిజిటల్ ఐడెంటిటీతో మమేకమవుతోందని ఓపెన్ఏఐ పేర్కొంది. -
యూఏఈ అణు ప్లాంట్పై దాడి.. భారత్ ఖండన
అబూదాబీ: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అత్యంత కీలకమైన ‘బరాకా అణు విద్యుత్ కేంద్రం’ లక్ష్యంగా మే 17న జరిగిన డ్రోన్ దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించిన భారతదేశం, ఇది ప్రాంతీయ శాంతికి ముప్పు తెచ్చే ఒక ప్రమాదకరమైన చర్య అని అభివర్ణించింది. అబూదాబీలోని అల్ దఫ్రా ప్రాంతంలో ఉన్న ఈ అణు ప్లాంట్ వెలుపలి సరిహద్దుల్లో డ్రోన్ దాడి కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఉగ్రదాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.అణు ప్లాంట్పై దాడి.. భారత్ తీవ్ర స్పందనయూఏఈలోని ఏకైక అణుశక్తి కేంద్రమైన బరాకాపై జరిగిన ఈ దాడిని భారత్ ఖండించింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పక్షాలూ తక్షణమే సంయమనం పాటించాలని, హింసను వీడి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ అత్యవసర పిలుపునిచ్చింది. ఈ దాడి గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.సురక్షితంగా అణు కేంద్రం.. తప్పిన ముప్పుడ్రోన్ దాడి కారణంగా బరాకా అణు ప్లాంట్ వెలుపలి ప్రాంగణంలో మంటలు వ్యాపించినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అబూదాబీ మీడియా కార్యాలయం తెలిపింది. అత్యవసర సహాయక బృందాలు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదం వల్ల ప్లాంట్లోని అణు వికిరణాల (రేడియేషన్) భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అధికారులు ధృవీకరించారు. ముందస్తు జాగ్రత్తగా అన్ని భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు యూఏఈ వెల్లడించింది.ఇరాన్ వైపే అనుమానాలుఈ వైమానిక దాడికి తామే బాధ్యులమంటూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య నడుస్తున్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో, ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ రీజియన్లో సాగుతున్న ఉద్రిక్తతల క్రమంలో, యూఏఈ ఇంధన, ఆర్థిక వనరులపై జరుగుతున్న డ్రోన్ దాడులకు ఇరానే కారణమని స్థానిక నివేదికలు చెబుతున్నాయి. 2020లో ప్రారంభమైన ఈ బరాకా అణు ప్లాంట్.. యూఏఈ మొత్తం విద్యుత్ అవసరాలలో నాలుగో వంతును తీరుస్తోంది. -
చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
భారతదేశం ఎదుగుదలకు తయారీ రంగం చాలా కీలకమని కేంద్రమంత్రులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ తయారీ రంగ వృద్ధి గురించి బిల్డింగ్ ఎనర్జీ సూపర్-ఇంటెలిజెన్స్ 'శుభమ్ మిశ్రా' ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.భారతదేశలో తయారీ రంగ అభివృద్ధిని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధి పెద్ద కంపెనీల రూపంలో కాకుండా.. చిన్న భాగాల తయారీ సంస్థల్లో, సరఫరా వ్యవస్థల్లో జరుగుతోంది. ఉదాహరణకు.. 2014లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు మాత్రమే. కానీ ఇప్పుడు దీని విలువ 115 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఇది భారత పరిశ్రమల వేగవంతమైన ఎదుగుదలకు నిదర్శనం అని శుభమ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.ఐఫోన్ తయారీలో భారత్యాపిల్ కంపెనీ సరఫరా వ్యవస్థలో.. భారతదేశం కీలక పాత్ర పోషించడం కూడా ఒక పెద్ద మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ఐఫోన్ తయారీలో భారతదేశం పాత్ర చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో గణనీయమైన శాతం భారత్లోనే తయారవుతోంది. ఇది భారతీయ పరిశ్రమల నైపుణ్యం పెరుగుతోందనడానికి ఒక ఉదాహరణ.మిశ్రా చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అసలు అభివృద్ధి చిన్న పరిశ్రమల పనితీరులో ఉంది. హోసూర్ వంటి ప్రాంతాల్లో చిన్న సంస్థలు అతి సూక్ష్మ ప్రమాణాలతో భాగాలను తయారు చేయడం నేర్చుకుంటున్నాయి. ఇలాంటి నైపుణ్యాలే ఒక దేశాన్ని పరిశ్రమల శక్తిగా మార్చుతాయి.చైనాలా భారత్భారతదేశాన్ని మిశ్రా ప్రారంభ దశలో ఉన్న చైనాతో పోల్చారు. చైనా ఒక్కసారిగా ప్రపంచ తయారీ కేంద్రంగా మారలేదు. 2003 నుంచి 2018 మధ్య నెమ్మదిగా, క్రమంగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో కూడా ప్రపంచం ''వాళ్లు కేవలం అసెంబ్లీ పని చేస్తున్నారు'' అని భావించింది. కానీ అదే చిన్న చిన్న పురోగతులు తరువాత చైనాను ప్రపంచ తయారీ శక్తిగా నిలబెట్టాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి దశలో ఉందని ఆయన సూచించారు.Very well said, Shubham. The real strength of manufacturing is never glamorous.It grows quietly in workshops, factory floors and industrial sheds, long before the world notices it in economic rankings or headlines.India’s manufacturing future won’t be built only by giant… https://t.co/2BblFgxVy6— anand mahindra (@anandmahindra) May 15, 2026దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. దేశ ఆర్థికాభివృద్ధి పెరగాలంటే, కేవలం కొన్ని పెద్ద కంపెనీల వల్ల మాత్రమే సాధ్యం కాదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs), ఫ్యాక్టరీలు, వర్క్షాప్లు, సరఫరా సంస్థల కలిస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.నిజమైన అభివృద్ధి..అనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం.. తయారీ రంగం బయటకు కనిపించేంత గొప్పగా ఉండదు. కానీ నిజమైన అభివృద్ధి అనేది ఫ్యాక్టరీలలో, యంత్రాల మధ్య, పరిశ్రమల షెడ్లలో జరుగుతుంది. చిన్న పరిశ్రమలు తమ పనిలో నాణ్యతను పెంచుకుంటూ.. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంటున్నాయి. ఇవే భవిష్యత్తులో భారతదేశాన్ని బలమైన దేశంగా నిలబెడతాయి.దేశం ఎదగాలంటే..దేశం ఎదగాలంటే.. ముఖ్యంగా MSMEsకు ప్రభుత్వ మద్దతు అవసరమని చెప్పారు. మంచి రహదారులు, ఇండస్ట్రియల్ పార్కులు, త్వరితగతిన అనుమతులు, తక్కువ నియంత్రణ సమస్యలు ఉంటే పరిశ్రమలు వేగంగా ఎదుగుతాయి. పెద్ద కంపెనీలకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వడం సరిపోదు. మధ్య తరహా సంస్థలకు సులభమైన వ్యాపార వాతావరణం కల్పించడం కూడా చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. -
భారత్కు చేరుకున్న మరో ఎల్పీజీ నౌక
కాండ్లా : పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన సరఫరాపై ఆందోళన నెలకొన్న వేళ పెద్దమొత్తంలో ఎల్పీజీ సరకుతో మరో నౌక భారత్కు చేరుకుంది. 20వేల మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)తో మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న ట్యాంకర్ హార్మూజ్ జలసంధిని దాటి శనివారం గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకుంది. ఖతర్ నుంచి బయలుదేరిన ఈ నౌక మే 13వ తేదీన హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. 46,427 టన్నుల ఎల్పీజీతో నిండిన మరో నౌక ‘సన్షైన్’ గురువారం హార్మూజ్ను దాటిందని, సోమవారం నాటికి న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. కాగా,హార్మూజ్ జలసంధిలో భారతీయ నౌకలపై దాడులు, నావికా సిబ్బందిని ప్రమాదంలో పడేయడంపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి ప్రత్యేక సమావేశంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. -
గగనతలంలో మోదీకి స్వీడన్ యుద్ధ విమానాల ఎస్కార్ట్
గోతెన్బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనకు ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాన్ని సూచిస్తూ స్వీడన్ గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ప్రవేశించిన సమయంలో ఆ దేశ గ్రిపెన్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.గ్రిపెన్ యుద్ధ విమానం గగనతల రక్షణ, శత్రు లక్ష్యాలపై దాడులు, గూఢచారి సమాచార సేకరణ వంటి పలు విధుల్లో ఉపయోగపడుతుంది. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, క్షిపణి దాడి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.ఈ విమానాలకు వేగంగా టేకాఫ్ తీసుకోవడం, చిన్న రన్వేలపై కూడా పనిచేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై నుంచి కూడా ఆపరేట్ చేసేలా దీనిని రూపొందించారు. గ్రిపెన్లో అధునాతన డేటా లింక్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఇతర యుద్ధ విమానాలు, ఆర్మీ, రాడార్ కేంద్రాలతో వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది.స్వీడన్లో 2 రోజుల పర్యటన స్వీడన్ నేలపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ పర్యటనల్లో కీలక దౌత్య కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చిన ఉత్సాహంతో కనిపించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మే 17-18 తేదీల్లో స్వీడన్లో పర్యటిస్తున్నారు.ఈ రెండు రోజుల కీలక పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీలు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఈ సమావేశాన్ని కీలక దౌత్య ఘట్టంగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని నార్డిక్ (ఉత్తర యూరప్ ప్రాంతంలో ఉన్న దేశాల సమూహం) దేశంలో పర్యటన చేపడుతున్నారు. నార్డిక్ దేశాల్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ దేశాలు ఉంటాయి.“2018లో జరిగిన తొలి ఇండియా-నార్డిక్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని గతంలో స్వీడన్ పర్యటించారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ప్రధాని క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. భారత్-స్వీడన్ సంబంధాలన్నింటినీ సమీక్షించి కీలక రంగాల్లో కొత్త సహకార అవకాశాలను గుర్తించనున్నారు.ఈ ఉన్నతస్థాయి చర్చలు భారత్, స్వీడన్ మధ్య ఆర్థిక, వాణిజ్య సత్సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది. సాంప్రదాయ వాణిజ్య రంగాలకే పరిమితం కాకుండా.. గ్రీన్ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు, స్టార్టప్లు, సరఫరా వ్యవస్థల బలోపేతం, రక్షణ తయారీ, అంతరిక్ష సహకారం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై కూడా చర్చలు జరగనున్నాయి.ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో యూరప్లో ప్రముఖ దేశంగా స్వీడన్కు గుర్తింపు ఉంది. భవిష్యత్ రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.#WATCH | Swedish Gripen fighter jets escort PM Narendra Modi’s plane as he enters SwedenPM Modi is visiting Gothenburg, Sweden, on May 17-18 at the invitation of Swedish Prime Minister Ulf Kristersson. pic.twitter.com/m2Rgoxg3x8— ANI (@ANI) May 17, 2026 -
పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూ.. ట్యాంకర్ రాగానే భీకర పోరు
వాషిం జిల్లా: పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరి, క్యూలైన్లలో ఎదురుచూస్తున్నారు జనాలు. డీజిల్ లేదని వాహనదారులకు సిబ్బంది చెప్పారు. కొద్దిసేపటికి అక్కడకు డీజిల్ ట్యాంకర్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా డీజిల్ కోసం జనాలు తన్నుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లా, అకోలా నాకా ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జిల్లాలో ఇంధన కొరత పెరగడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో డీజిల్ నింపించుకునేందుకు ఓ బంక్ వద్ద ఎదురుచూస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.మొదట వెయిట్ చేసే సమయంలో వాహనదారుల మధ్య మొదలైన వాగ్వాదం తర్వాత డీజిల్ ట్యాంకర్ చేరుకున్న తర్వాత పరిస్థితి ఇంకా అదుపుతప్పింది. భౌతిక దాడుల వరకు వెళ్లింది. రెండు వర్గాల వారు పరస్పరం కొట్టుకున్నారు. డీజిల్ డబ్బాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. పెట్రోల్ బంక్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడడం వీడియోలో చూడొచ్చు. డీజిల్ నింపించుకునేందుకు ఎదురుచూస్తున్న వారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో వాహనాలు, జనాలతో భారీ రద్దీ మధ్య జనాలు తోసుకోవడం, కొట్టుకోవడం కనిపించాయి. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గాయాలు, అరెస్టులపై ఇంకా స్పష్టత రాలేదు. గత కొన్ని రోజులుగా వాషిం జిల్లాలో తీవ్ర డీజిల్ కొరత కొనసాగుతోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.FUEL AND FURYFor the third consecutive day, Washim, Maharashtra witnessed a severe diesel shortage. Amid the rush to procure diesel, two groups clashed with each other, leading to a violent brawl. A video of the incident has surfaced. The footage is said to be from a petrol pump… pic.twitter.com/m0SO9JbP1G— Rahul Shivshankar (@RShivshankar) May 17, 2026 -
ఆ డీల్ ఓకే అయితేనే భారత్తో సంబంధాలు.. బంగ్లాదేశ్
ఢాకా: భారత్- బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ మంత్రి మీర్జా ఫఖ్రుల్ అస్రాం ఆలంగీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరు దేశాల మధ్య సంబంధాలు గంగానది జలాల భాగస్వామ్య పునరుద్ధరణతోనే ఆధారపడి ఉంటాయన్నారు. బంగ్లాదేశ్ ప్రజల అంచనాలు మరియు అవసరాలకు అనుగుణంగా భారత్ కొత్త ఒప్పందంపై చర్చలు జరపాలని భారత్పై ఒత్తిడి తెచ్చారు.1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ప్రస్తుత గంగా నీటి ఒప్పందం ఈ ఏడాది (2026) డిసెంబర్తో ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ అంశంపై స్పందించింది. బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగిర్ మాట్లాడుతూ "భారత్తో మంచి సంబంధాలు కొనసాగడం అనేది గంగా నీటి భాగస్వామ్య ఒప్పందం లేదా ఫరక్కా ఒప్పందంపై సంతకం చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే నీటి పంపిణీ ఒప్పందాలకు నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకుండా ఒప్పందం ఉండాలి". అన్నారు.గంగా నది వివాదంభారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లా సరిహద్దు దాటిన తర్వాత గంగానది నేరుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ గంగానదిని పద్మానది అనే పేరుతో పిలుస్తారు. దిగువ దేశమైన బంగ్లాదేశ్ వ్యవసాయం, జీవవైవిధ్యం మరియు నీటి సరఫరాకు ఈ నది చాలా కీలకం.కాగా కోల్కతా ఓడరేవులో పూడికను కొట్టుకుపోయేలా చేసి, హుగ్లీ నదిలో నావిగేషన్ను మెరుగుపరచడానికి ఫరక్కా బ్యారేజ్ భారత్ నిర్మించింది. అయితే దీనివల్ల ఎండాకాలంలో ఫరక్కా బారేజ్ వల్ల బంగ్లాదేశ్కు వచ్చే నీటి ప్రవాహం తగ్గిపోతోందని, దీనివల్ల ఉప్పునీటి శాతం పెరిగి, వ్యవసాయం, నదీ వ్యవస్థలు మరియు పర్యావరణం దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.వివాదాస్పదంగా 'పద్మా బారేజ్' ప్రాజెక్ట్ఫరక్కా బారేజ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి పద్మా నదిపై ఒక భారీ బారేజ్ నిర్మించే ప్రాజెక్ట్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ బ్యారేజ్ వల్ల భారత్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని వాదిస్తోంది. భారత్స్పందన ఈ నీటి వివాదాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య 54 నదులు ఉన్నాయని వీటన్నిటిపై చర్చించడానికి ఇప్పటికే ఒక పటిష్టమైన ద్రైపాక్షిక యంత్రాంగం అందుబాటులో ఉందని తెలిపారు.అదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధు నది నీటి ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడిందని తెలిపారు. -
‘భోజ్శాల’ తీర్పుతో షాక్..అవి మందిరాలా? మసీదులా?
మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ‘భోజ్శాల’ సంచలన తీర్పు.. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా రగులుతున్న పలు చారిత్రక వివాదాలకు మళ్లీ ప్రాణం పోసింది. ధార్లోని భోజ్శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణం వాస్తవానికి సరస్వతీ దేవి (వాగ్దేవి) ఆలయమేనని కోర్టు తేల్చి చెప్పడంతో.. ఇప్పుడు అందరి దృష్టి 1991 ప్రార్థనా స్థలాల చట్టంపై పడింది. 1947 ఆగస్టు 15 నాటి పరిస్థితులనే కొనసాగించాలనే ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. 2019 నాటి చారిత్రాత్మక అయోధ్య తీర్పు తర్వాత, ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రముఖ మందిరం-మసీదు న్యాయ పోరాటాలివే..శ్రీకృష్ణ జన్మభూమి - షాహీ ఈద్గా మసీదు (మధుర, ఉత్తరప్రదేశ్)హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీకృష్ణుడి జన్మస్థలమైన 13.37 ఎకరాల మధుర ఆలయ సముదాయం, దానిని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇక్కడి ప్రాచీన ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని హిందూ పక్షాల ప్రధాన వాదన. అయితే ఈ కట్టడం 1991 ప్రార్థనా స్థలాల చట్టం రక్షణ పరిధిలోకి వస్తుందని ముస్లిం ప్రతినిధులు వాదిస్తున్నారు. భూమిని స్వాధీనం చేసుకుని, ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ భక్తులు దాఖలు చేసిన 18 వేర్వేరు వ్యాజ్యాలు ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. 2024 ఆగస్టు ఒకటిన, మసీదు కమిటీ అభ్యంతరాలను హైకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది.కాశీ విశ్వనాథ్ ఆలయం - జ్ఞానవాపి మసీదు (వారణాసి, ఉత్తరప్రదేశ్)అయోధ్య, మధుర తరహాలోనే దేశంలో అత్యంత సంచలనం రేపుతున్న మతపరమైన ఆస్తుల కేసు ఇది. ఔరంగజేబు హయాంలో అసలైన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కూల్చివేసి, జ్ఞానవాపి మసీదును నిర్మించారని హిందువుల వాదన కాగా, శతాబ్దాలుగా ఇక్కడ నమాజులు జరుగుతున్నాయని ముస్లింలు 1991 చట్టాన్ని ఉదహరిస్తున్నారు. 2021లో ఐదుగురు మహిళలు ప్రార్థనల హక్కుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ న్యాయపోరాటం వేగవంతమైంది. కోర్టు ఆదేశాలతో జరిగిన సర్వేలో మసీదు ‘వజూఖానా’లో శివలింగాన్ని పోలిన నిర్మాణం బయటపడటంతో సుప్రీంకోర్టు ఆ ప్రాంతానికి కట్టుదిట్టమైన రక్షణ కల్పించింది. అనంతరం 2024లో మసీదులోని ‘వ్యాస్ జీ కా తహ్ఖానా’ బేస్మెంట్లో హిందూ పూజారి రోజూ ప్రార్థనలు చేయడానికి కోర్టు అనుమతించింది.షాహీ జామా మసీదు (సంభాల్, ఉత్తరప్రదేశ్)విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి భగవానుడి ప్రాచీన ‘హరిహర’ ఆలయం ఉన్న స్థలంలో ఈ మసీదును నిర్మించారన్న ఆరోపణలతో 2024లో సంభాల్ జిల్లాలో తీవ్ర పౌర అశాంతి చెలరేగింది. 1526లో బాబర్ కాలంలో ఇది నిర్మితమైందని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, కోర్టు సర్వేకు ఆదేశించింది. రెండో విడత సర్వే సమయంలో భద్రతా బలగాలు, స్థానిక ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తదుపరి విచారణ జరిగే వరకు అక్కడ యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు (ఢిల్లీ)ప్రముఖ కుతుబ్ మినార్ సముదాయంలో ఉన్న ఈ మసీదు నిర్మాణం కోసం.. మహ్మద్ ఘోరీ సైన్యాధికారి కుతుబుద్దీన్ ఐబక్ ఏకంగా 27 హిందూ, జైన దేవాలయాలను పాక్షికంగా ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ దేవాలయాల శిథిలాలతోనే మసీదును కట్టారని, అక్కడ తమ దేవుళ్లను పునరుద్ధరించాలని 2021లో హిందూ, జైన భక్తులు సివిల్ కోర్టులో దావా వేశారు. అయితే ఈ కట్టడాల ప్రాంగణంలో ఎలాంటి మతపరమైన ప్రార్థనలకు చట్టపరంగా అనుమతి లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కౌంటర్ దాఖలు చేసింది. చారిత్రక సంఘటనల ఆధారంగా శాంతికి విఘాతం కలిగించలేమంటూ సివిల్ కోర్టు దావాను కొట్టివేయగా, ప్రస్తుతం దీని అప్పీల్ పెండింగ్లో ఉంది.ఈద్గా మైదాన్ (హుబ్బళ్లి, కర్ణాటక)2022లో హుబ్బళ్లిలోని ఈద్గా మైదాన్లో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించుకునేందుకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై అంజుమన్-ఏ-ఇస్లాం సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కర్ణాటక హైకోర్టు మున్సిపల్ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ భూమి ధార్వాడ్ మున్సిపాలిటీకి చెందిందని, అంజుమన్-ఏ-ఇస్లాం కేవలం ఏడాదికి ఒక్క రూపాయి నామమాత్రపు రుసుముతో 999 సంవత్సరాల లీజును మాత్రమే కలిగి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఇది సాధారణ ప్రార్థనా స్థలం కాదని, కేవలం బక్రీద్, రంజాన్ పండుగల సమయంలో మాత్రమే ఇస్లామిక్ ప్రార్థనలకు అనుమతించారని తేల్చిచెప్పింది.ఇది కూడా చదవండి: ‘నీట్’పై కేరళ సీఎం సంచలన ప్రకటన -
గొప్ప కలలున్నాయి
ద హేగ్: భారత్ అంటే అవకాశాల గని అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పునకు లోనవుతోందని తెలిపారు. భారతదేశ ఆకాంక్షలు ఇకపై సరిహద్దులకే పరిమితం కాబోవని అన్నారు. ప్రధాని మోదీ శనివారం నెదర్లాండ్స్లో పర్యటించారు. రాజధాని ద హేగ్లో ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. భారత్ నేడు గొప్ప కలలు కంటోందని, దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో దేశం అవకాశాలకు మారుపేరుగా మారిందన్నారు. సాంకేతికతతోపాటు మానవతా దృక్పథంతో భారత్ ముందుకు సాగుతోందన్నారు. మన దేశం ఎంత ప్రాచీనమైనదో, అంతే ఆధునికంగా కూడా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. భారత్లోని పూర్వీకుల స్వగ్రామాలతో మళ్లీ అనుబంధం పెంచుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రవాస భారతీయులకు సూచించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’దిశగా సాగుతున్న ప్రయాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల మన దేశ శక్తిసామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, మీ పెట్టుబడులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని వెల్లడించారు. ‘ఇదీ మోదీ గ్యారంటీ’అంటూ నెదర్లాండ్స్లోని భారతీయులకు, భారత మూలాలున్న ప్రజలకు హామీ ఇచ్చారు. అద్భుతాలు సృష్టిస్తున్న స్టార్టప్లు ‘‘ఈ రోజు మన దేశం చాలా పెద్ద ఎత్తున కలలు కంటోంది. కేవలం మార్పును కాదు.. ఉత్తమమైన మార్పును కోరుతోంది. అత్యంత వేగవంతమైన మార్పు కావాలని ఆకాంక్షిస్తోంది. ఆకాశమే హద్దుగా ఉన్నతస్థాయికి ఎదగాలని యువత భావిస్తోంది. ఇండియాలో స్టార్టప్ వ్యవస్థ బలోపేతం కావడానికి ఇదే అసలు కారణం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలో ఉంది. 2014లో కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 125కి చేరుకుంది. తులిప్లు, తామర పువ్వులు భారతదేశ ఆకాంక్షలు కేవలం దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని, హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా నిలవాలని, ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా మారాలని తపన పడుతోంది. దేశం నేడు గొప్ప మార్పును వీక్షిస్తోంది. ఇటీవలే ప్రపంచంలో అతిపెద్ద ఏఐ సదస్సును విజయవంతంగా నిర్వహించాం. అంతకంటే ముందు జీ20 సదస్సు జరిగింది. ఇవి కేవలం ఒక్కసారి జరిగిన సంఘటనలు కావు. అతిపెద్ద కార్యక్రమాలు నిర్వహించడం నేటి భారతదేశపు లక్షణంగా, విశ్వాసంగా మారింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య బంధం విడదీయరానిది. ఇంధన భద్రత నుంచి జల భద్రత వరకు ఇరుదేశాలు సన్నిహితంగా సహకరించుకుంటున్నాయి. నెదర్లాండ్స్ తులిప్లకు, భారత్ తామర పువ్వులకు ప్రసిద్ధి. మూలాలు నీటిలో ఉన్నా, భూమిలో ఉన్నా.. సరైన పోషణతో వృద్ధి చెందగలవని తులిప్, తామర పువ్వులు మనకు సందేశాన్నిస్తున్నాయి. భారత్, నెదర్లాండ్స్ భాగస్వామ్యానికి కూడా ఇదే పునాది. ఓటింగ్లో కొత్త రికార్డులు గర్వకారణం అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం నుంచి 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యింది. ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఓటింగ్లో కొత్త రికార్డులు నమోదవుతుండడం గర్వంగా ఉంది. బెంగాల్ చిరుతిండి ఝాల్మురీ నెదర్లాండ్స్ దాకా చేరిందో లేదో ఇక్కడి భారతీయులే చెప్పాలి. నేను ఇక్కడికి రాగానే నినాదాలతో నన్ను స్వాగతించిన విధానం అమితంగా ఆకట్టుకుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ దంపతులతో మోదీ భేటీ నెదర్లాండ్స్ రాజు విల్లెమ్–అలెగ్జాండర్, రాణి మక్సిమా దంపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాయల్ ప్యాలెస్లో జరిగిన ఈ భేటీలో భారత్–నెదర్లాండ్స్ సంబంధాలపై చర్చించారు. చోళుల రాగి ఫలకాలు భారత్కు అప్పగింత 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశపు రాగి ఫలకాలను నెదర్లాండ్స్ శనివారం భారత్కు అప్పగించింది. భారత ప్రధాని మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రోబ్ జెటెన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నెదర్లాండ్స్లో లీడెన్ ప్లేట్లుగా పిలిచే అనైమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్ 2012 నుంచి ప్రయత్నిస్తోంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, మూడు చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు. వీటిపై తమిళ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. రాజరాజ చోళ–1 తన కుమారుడైన రాజరాజ చోళ–2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. ఈ ఫలకాలను తమిళ చోళ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశం వెలుపల తమిళ వారసత్వపు ముఖ్యమైన కళాఖండాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి రాజరాజ చోళ–1 కాలానికి సంబంధించినవని చెబుతున్నారు. చోళుల రాజముద్ర కలిగిన కంచు తీగతో వీటిని కట్టి ఉంచారు. ఇవి శతాబ్దాల క్రితమే చేతులు మారి భారత్ నుంచి నెదర్లాండ్స్కు చేరాయి. రాగి ఫలకాలు తిరిగి భారత్కు అందడం ప్రతి భారతీయుడికి ఆనందకరమైన క్షణమని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇన్నాళ్లూ ఈ రాగి ప్లేట్లను భద్రపర్చినందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, లీడెన్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
న్యూఢిల్లీ: ఇంకో పది రోజుల్లో భారత్ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్న శుభవేళ ఎల్ నినో రూపంలో పెనుముప్ప ప్రపంచదేశాలను చుట్టేయనుందన్న చేదువార్త ఇప్పుడు చక్కర్లుకొడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈసారి సూపర్ ఎల్ నినోను సృష్టించనున్నాయని తాజాగా వాతావరణ అంచనాలు వెలువడ్డాయి. దీంతో పలు దేశాల్లో అతివృష్టి, మరికొన్ని దేశాల్లో అనావృష్టి తాండవించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. భారత్లోనూ సూపర్ ఎల్నినో దు్రష్పభావాలు అధికంగా ఉండనున్నాయి. ఈసారి జూన్లో సూపర్ ఎల్ నినో ఏర్పడితే నైరుతి రుతుపవనాల ద్వారా భారత్లో లోటున వర్షపాతం నమోదుకానుందని తెలుస్తోంది. ఎల్ నినోతో ఏర్పడే అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్లో అత్యధిక రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో అతివర్షాలు కురిసే ఆస్కారముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమతీరం వైపు పెరూ, ఈక్వెడార్ దేశాల సమీప పసిఫిక్ మహాసముద్రజలాలు అతిగా వేడెక్కితే ఆ దృగ్విషయాన్ని ఎల్నినోగా పిలుస్తాం. ఈ పరిస్థితుల్లో సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో చాలా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. ఈసారి జూన్ లేదా జూలైకల్లా సూపర్ ఎల్నినో ఏర్పడితే భారత్లో వర్షపాతం తగ్గే అవకాశముందని వాతావరణశాస్త్ర నిపుణుడు డాక్టర్ మాధవన్ నాయర్ తెలిపారు. 1997, 2015లో ఎల్నినో ఏర్పడినప్పుడు భారత్ చవిచూసిన దు్రష్పభావాలకంటే ఈఏడాది పరిస్థితులు మరింత దారుణంగా ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈసారి ఎలా ఉండొచ్చు? భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) కేవలం 92 శాతానికి పరిమితంకావొచ్చు. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువగా పరిమితమవుతుంది. 1971 నుంచి 2020 ఏడాది వరకు జూన్–సెప్టెంబర్(వర్షాకాలం)లో నమోదైన 870 మిల్లీమీటర్ల దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్కలు కడతారు. ఈసారి లోటు వర్షపాతం నమోదయ్యే సంభావ్యత 35 శాతముంది. చరిత్రలో ఎప్పుడుచూసినా ఇది 16 శాతం కాగా ఈసారి ఏకంగా రెట్టింపునకు చేరడం ఆందోళనకరం. భారత్లో ఈసారి జూన్లో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని వాతావరణశాఖతోపాటు ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ తెలిపింది. ఉత్తర, పశ్చిమ, మధ్యభారతాల్లో సూపర్ ఎల్ నినో దెబ్బకు వర్షాకాలంలోనూ పొడివాతావరణం కొనసాగి కరువురావొచ్చు. దీంతో సాగుదిగుబడి తగ్గి రైతులకు ఆర్థిక కడగండ్లు మిగిలేప్రమాదముంది. ఆగస్ట్, సెప్టెంబర్లో పంజాబ్, హరియాణా, రాజస్తాన్లో వర్షపాతం తగ్గొచ్చు. లద్దాఖ్, రాజస్తాన్లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్యం, దక్షిణభారత ఈశాన్యభాగాలు, తెలంగాణలో దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండే అవకాశముంది. చెన్నైలో కుంభవృష్టి పడొచ్చు. ఈఏడాది తమిళనాడు రాజధానికి వరదముప్పు పొంచి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనావేశారు. గతంలో 2015–16లో భారత్లో సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దీర్ఘకాలిక సగటు వర్షపాతం కేవలం 86 శాతంగా నమోదైంది. ఈఏడాది దారుణ పరిస్థితులు దాపురించనున్నాయన్న అంచనాలతో ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు కార్యాచరణతో సంసిద్ధంకావాల్సిన తరుణం ఆసన్నమైందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ కామెంట్లపై సీజేఐ సూర్యకాంత్ వివరణ
ఢిల్లీ: ‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. శుక్రవారం (మే 15న) జరిగిన విచారణలో సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చి బెంచ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కేసు విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ‘‘మీడియా నా వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసింది. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియాలోకి వచ్చిన వారిని తప్పుబట్టాను. అలాంటి వారు పరాన్నజీవులని చెప్పాను. యువతను విమర్శించలేదు, భారత యువత గర్వకారణం. భారత యువతే అభివృద్ధికి మూల స్తంభం’’ అని తెలిపారు.ఓ పనికిమాలిన కేసు విచారణ సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని సీజేఐ సూర్యకాంత్ చెప్పారు. “నిన్న కేసు విచారణ సమయంలో నేను చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా కొంత భాగం తప్పుగా చూపించిన తీరు చూసి బాధపడ్డాను. బార్ వంటి వృత్తుల్లోకి నకిలీ, బోగస్ డిగ్రీల సాయంతో వచ్చిన వారినే నేను ప్రత్యేకంగా విమర్శించాను. అలాంటి వారు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవనీయ వృత్తుల్లోకి చొరబడ్డారు. అందుకే వారిని పరాన్నజీవులతో పోల్చాను” అని సూర్యకాంత్ చెప్పారు.కాగా, నిరుద్యోగ యువ న్యాయవాదులను బొద్దింకలుగా పేర్కొన్నారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. సీనియర్ హోదా కల్పించే ప్రక్రియపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కాలేదని ఆరోపిస్తూ న్యాయవాది సంజయ్ దూబే ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్పై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి.విచారణ సమయంలో సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం దూబేను ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది హోదా ప్రతిష్ఠకు గుర్తా లేదంటే న్యాయ వ్యవస్థలో భాగస్వామ్యం సాధనమా? అని జోయ్మాల్యా బాగ్చి ప్రశ్నించారు.ఆ సమయంలో “వృత్తిలో.. ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారు” అని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. వారు సోషల్ మీడియా, ఆర్టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని చెప్పారు. నల్ల కోట్లు వేసుకున్న వేలాది మందిపై వారి డిగ్రీల విషయంలో అనుమానాలు ఉన్నాయని అన్నారు.దీంతో, తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని శనివారం సూర్యకాంత్ స్పష్టం చేశారు. “దేశ యువతను నేను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారం. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మానవ వనరులపై నాకు గర్వంగా ఉంది. భారత యువత నాకు ఎంతో గౌరవం ఇస్తారు. నేనూ వారిని అభివృద్ధి చెందే భారతానికి స్తంభాలుగా చూస్తాను” అని తెలిపారు. -
పెట్రో బాదుడు.. మెరుపు సమ్మెకు దిగిన గిగ్ వర్కర్లు
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్ల పెంపుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పెంపుతో ఇటు గిగ్ వర్కర్ల జీవనోపాధి మరింత కష్టాల్లో పడింది. పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని కార్మికులు ఒంటరిగా భరించలేరని, ప్రభుత్వం-కంపెనీలు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మెరుపు సమ్మెకు గిగ్ వర్కర్ల అసోషియేషన్ పిలుపు ఇచ్చింది. ఇవాళ(శనివారం) యాప్ ఆధారిత సేవలను నిలిపివేయాలని గిగ్ & ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) నిర్ణయించింది. అయితే ఈ సమ్మె తాత్కాలికంగానే ఉండనుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ సేవలు బంద్ ఉంటాయని నిన్న రాత్రి ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. యూనియన్ అధ్యక్షురాలు సీమా సింగ్ మాట్లాడుతూ, “ఇప్పటికే వేసవిని లెక్క చేయకుండా పనిచేస్తున్న డెలివరీ వర్కర్లకు.. పెట్రో పెరుగుదల నేరుగా దెబ్బతీసింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి సంస్థల్లో పనిచేసే కార్మికులు ఈ భారాన్ని భరించలేరు” అని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కిలోమీటరుకు రూ.20 చెల్లించేలా ప్రభుత్వం, కంపెనీలు చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.జాతీయ సమన్వయకర్త నిర్మల్ గోరానా చెబుతోంది ఏంటంటే.. దేశవ్యాప్తంగా సుమారు 1.4 కోట్ల గిగ్ వర్కర్లు మోటార్బైక్లు, స్కూటర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మహిళా కార్మికులు, డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది రోజుకు 10–14 గంటలు ట్రాఫిక్జామ్ల్లో, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఇంధన ధరలతో పాటు వాహన నిర్వహణ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కానీ కంపెనీలు చెల్లింపులను తగినంతగా పెంచడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. గిగ్ వర్కర్లు ఇలా సమ్మె చేయడం ఇదేం కొత్త కాదు. వేతనాల పెంపు, ఉద్యోగ..సామాజిక భద్రతలు డిమాండ్లతో ఈ మధ్యకాలంలో ఒక్క పూట, ఒక్కరోజు సమ్మెలు చేశాయి కూడా. ఈ నేపథ్యంతో ప్రభుత్వాలకు మెమొరాండం సమర్పించి, డెలివరీ ఛార్జీలు, కిలోమీటరు రేట్లను పెంచాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, డున్జో, అర్బన్ కంపెనీ, ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్, అమెజాన్ ఫ్లెక్స్, ఇన్స్టామార్ట్ వంటి యాప్ ఆధారిత సంస్థలకు కూడా యూనియన్ లేఖలు పంపింది. పెరిగిన ఇంధన ఖర్చులను కార్మికులపై మోపకుండా, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు పెరిగిన ఇంధన ధరలు ఇప్పటికే అస్థిరంగా ఉన్న వేతనాలను మరింత తగ్గిస్తాయని, దీనివల్ల గిగ్ వర్కర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని గిగ్ & ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. Rising petrol, diesel & LPG prices are directly affecting gig workers across India.GIPSWU demands fair per-kilometre rates for delivery workers & drivers.Appeal for temporary app shutdown tomorrow from 12 PM to 5 PM.#GIPSWU @PTI_News @the_hindu @htTweets @timesofindia pic.twitter.com/y5aECETQii— GIPSWU - Gig & Platform Service Workers Union (@GIPSWU_) May 15, 2026అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా సరఫరా అంతరాయం ఏర్పడింది. హర్ముజ్ జలసంధి మూసివేయబడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే 11 వారాల పాటు ఆయిల్ కంపెనీలు నష్టాల్ని భరించుకుంటూ వస్తుండగా.. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్కు లీటర్కు రూ.3 చొప్పున రేట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా, 2022 తర్వాత పెట్రోల్ రేట్లు పెరగడం ఇదే కాగా.. అదీ రూ.3 పెంచడం ఆందోళనకు దారి తీసింది. -
భారత్కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
-
శాంతికి భారత్ కీలకం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ మరింత కీలకపాత్ర పోషించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ కోరారు. ఇరాన్కు సంబంధించినంత వరకు ఎలాంటి సైనికపరమైన పరిష్కారం లేదని స్పష్టం చేశారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధి అంశం ఇప్పుడు చాలా సంక్లిష్టంగా మారిందంటూ వ్యాఖ్యానించిన ఆయన.. హార్మూజ్ గుండా అన్ని రకాల నౌకల స్వేచ్ఛాయానానికి అవసరమైన సాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని తాము కోరుకోవడం లేదన్నారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులు మినహా మరో మార్గం లేనే లేదని పేర్కొన్నారు. -
భారత్కు ఇంధన భద్రత
అబూదాబీ: పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం అబూదాబీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్తో సమావేశమయ్యారు. భారత్–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్కు ఇంధన భద్రత కల్పించడంతోపాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కీలక ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. భారత్లో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ ముందుకొచ్చిందని మోదీ వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మొదట యూఏఈలో పర్యటించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అబూదాబీలో ఉన్నారు. యూఏఈ అధ్యక్షుడితో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. యూఏఈపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అరబ్ ఎమిరేట్స్ను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితిని యూఏఈ సంయమనంతో ఎదుర్కొన్న తీరు నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపు పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ గుర్తుచేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకోసం తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని తేల్చిచెప్పారు. వివాదాలు, ఘర్షణలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏడు రంగాల్లో వ్యూహాత్మక సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. యూఏఈ పర్యటనలో భాగంగా ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, అధునాతన సాంకేతికత వంటి రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇది భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. భారత్లో భారీగా పెట్టుబడులకు యూఏఈ సిద్ధం కావడం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. యూఏఈలో సంక్షిప్తమైన, అత్యంత ఫలవంతమైన పర్యటన జరిగిందన్నారు. భారత్–యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తన సోదరుడు అల్–నహ్యాన్తో చర్చించానని పేర్కొన్నారు. ఈ పర్యటన ఫలితాలు ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసి, అభివృద్ధి శ్రేయస్సుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు ఉద్ఘాటించారు. అంతకుముందు అబూదాబీ ఎయిర్పోర్టుకు చేరుకున్న మోదీకి అల్–నహ్యాన్ స్వయంగా స్వాగతం పలికారు. మోదీ పర్యటనకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధి భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను పరిరక్షించే బాధ్యత కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజరŠవ్స్ లిమిటెడ్ వ్యూహాత్మక సహకారమే లక్ష్యంగా అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల భారత్కు ఇంధన భద్రత చేకూరుతుంది. భారతదేశ పెట్రోలియం నిల్వలను పెంపొందించడంతోపాటు ఎల్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలను బలోపేతం చేయడానికి అబూదాబీ సంస్థ సహకరిస్తుంది. ఇండియాకు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరా, ఆర్థిక స్థిరత్వం, ఇంధన భాగస్వామ్యం లక్ష్యంగా ఎల్పీజీ రంగంలో వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, నూతనఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, జాతీయ, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్పైనా సంతకాలు చేశారు. గుజరాత్లో ఓడ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, ఓడరేవులు, తీరప్రాంత మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మరో ఒప్పందం కుదిరింది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇంకో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్లో ఏఐ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఒక సూపర్ కంప్యూటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఆరో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించినది ఏడో ఒప్పందం. మోదీ విమానానికి ఎస్కార్ట్గా యూఏఈ యుద్ధ విమానం ప్రధాని మోదీ పట్ల యూఏఈ ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత యూఏఈకి చెందిన ఎఫ్–16 యుద్ధ విమానం ఎయిర్పోర్టు దాకా ఎస్కార్ట్గా వచ్చింది. ఇది భారతీయులందరికీ దక్కిన గౌరవమని మోదీ యూఏఈ అధ్యక్షుడితో చెప్పారు. ఎయిర్పోర్టులో తనకు స్వయంగా స్వాగతం పలికిన అల్–నహ్యాన్కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. -
భారత బాక్సర్లకు 17 పతకాలు
తాష్కెంట్: ఆసియా అండర్-17 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు 17 పతకాలతో అదరగొట్టారు. శుక్రవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత బాలికలు 12 పతకాలు సాధించగా... భారత బాలురు 5 పతకాలు సొంతం చేసుకున్నారు. బాలికల కేటగిరీలో రాఖీ (46 కేజీలు), నవ్య (57 కేజీలు) స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు.ఖుషీచంద్ (48 కేజీలు), దివ్య (63 కేజీలు), హిమాన్షి (70 కేజీలు), జ్యోతి (75 కేజీలు), వన్షిక (80 కేజీలు), గుర్సీరత్ కౌర్ (ప్లస్ 80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలను దక్కించుకున్నారు. మమత (52 కేజీలు), లక్ష్మీ మంజునాథ్ (54 కేజీలు), ఇషిక (60 కేజీలు), హర్నూర్ కౌర్ (66 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు పొందారు.బాలుర కేటగిరీ 75 కేజీల ఫైనల్లో లక్షయ్ ఫొగాట్ 0:5తో తొష్పులతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. నేళ్ల నరేంద్ర కుమార్ (46 కేజీలు), యశ్ యాదవ్ (50 కేజీలు), నివేశ్ పాల్ (54 కేజీలు), నమన్ కుమార్ (70 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలను సంపాదించారు. -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'ధురంధర్ 2'.. అధికారిక ప్రకటన
'ధురంధర్ 2' సినిమా మన దేశంలో ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందనే విషయంపై సస్పెన్స్ వీడింది. ఎందుకంటే నేటి(మే 15) నుంచి విదేశాల్లో స్ట్రీమింగ్లోకి వచ్చింది. దీంతో పాటే మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని హాట్స్టార్ తేల్చి చెప్పింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తొలి పార్ట్ తర్వాత నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సీక్వెల్ని తాజాగా విదేశాల్లో నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. మన దేశంలో మాత్రం వచ్చే నెల 4వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ చేస్తే రెండింటి వ్యూస్పై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే ఈ లీగ్ పూర్తయిన తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. అలా జూన్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు. 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)Aandhi banke jo aa raha hai usse DHURANDHAR kehte hain.🔥Watch Dhurandhar The Revenge, Raw & Undekha. Grand Digital Premiere on June 4th at 7 PM, starts streaming from June 5th only on JioHotstar.#Dhurandhar2OnJioHotstar #DhurandharTheRevenge #RawAndUndekha@RanveerOfficial… pic.twitter.com/w73rLgM06F— JioHotstar (@JioHotstar) May 15, 2026 -
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా రూ.3పైగా పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది.👉 పెంపు వెనుక కారణాలు.. 2022 ఏప్రిల్ నుంచి(ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంలోనూ) పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది.👉హింట్ ఇస్తూ.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం.. హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అడ్డంకులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థను దెబ్బతీయడం.. పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్న కేంద్రం పెట్రో పెంపు సంకేతాలిచ్చింది. సరిపడా నిల్వలు ఉన్నాయంటూనే.. పెంచక తప్పదనే చెబుతూ వచ్చింది. ఈలోపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇంధన పొదుపు పిలుపునిచ్చి, కార్పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం, అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. దీంతో ఆ పెంపు భారీగా ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే రూ.3 రూపాయల చొప్పున పెంపుతో సరిపెట్టాయి ఆయిల్ కంపెనీలు.👉 సీఎన్జీ కూడా.. మరోవైపు సంకుచిత సహజ వాయువు(సీఎన్జీ) రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లీతో పాటు ముంబైలోనూ కిలోకి రూ.2 పెంచారు. పెరిగిన ధరలతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.87కి చేరింది. అయితే మిగతా నగరాల్లో మాత్రం సీఎన్జీ రేట్లలో మార్పు కనిపించడం లేదు. 👉 ప్రజలలో ఆందోళన.. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరగడం ఖాయం. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు మరింత భారాన్ని మోపనుంది. సోషల్ మీడియాలో "ఇది తాత్కాలిక పెంపేనా? లేక యుద్ధం కొనసాగితే మరోసారి పెరుగుతాయా?" అనే చర్చలు మొదలయ్యాయి.👉 ఆర్థికవేత్తల అభిప్రాయం.. ప్రముఖ ఆర్థికవేత్తలు ధరల పెంపు తప్పనిసరి అని చెబుతున్నారు. "ధరల పెంపు ద్వారా వినియోగం తగ్గుతుంది. ఇది సరఫరా-డిమాండ్ సమతుల్యతను కొంతవరకు కాపాడుతుంది" అని విశ్లేషిస్తున్నారు. మరోవైపు, రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి, ఎగుమతులు లాభదాయకమవుతాయి. దీంతో ప్రస్తుత ఖాతా లోటు తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో కొత్త ధరలుఢిల్లీ: పెట్రోల్ ₹97.77, డీజిల్ ₹90.67ముంబై: పెట్రోల్ ₹106.54, డీజిల్ ₹93.03హైదరాబాద్: పెట్రోల్ ₹110.50, డీజిల్ ₹98.70కోల్కతా: పెట్రోల్ ₹108.45, డీజిల్ ₹95.02చెన్నై: పెట్రోల్ ₹103.80, డీజిల్ ₹95.39బెంగళూరు: పెట్రోల్ ₹105.96, డీజిల్ ₹93.99పాట్నా: పెట్రోల్ ₹108.54, డీజిల్ ₹94.78జైపూర్: పెట్రోల్ ₹108.03, డీజిల్ ₹93.49తిరువనంతపురం: పెట్రోల్ ₹110.38, డీజిల్ ₹99.26చండీగఢ్: పెట్రోల్ ₹97.30, డీజిల్ ₹85.45తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై రూ3.29, డీజిల్పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై రూ.3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశవ్యాప్తంగా వాహనదారులకు షాక్ తగిలినప్పటికీ.. అంతర్జాతీయ పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇంధన ధరలు స్థిరపడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. -
పెట్రో మంట తప్పదా..?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఇక తప్పదా అనే చర్చ మళ్లీ వేడెక్కుతోంది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన కారణంగా ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే కోట్లకు పైగా అండర్ రికవరీ వస్తోందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా పెంచకుండా కొనసాగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు భారీగా పెరగడం, రూపాయి బలహీనపడటం వల్ల కంపెనీలపై భారం మరింత పెరిగింది. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా ఆయిల్ కంపెనీలు భారీ నష్టాలు భరించలేని స్థితికి వచ్చాయని సంకేతాలు ఇచ్చారు. పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే ధరల సవరణ తప్పనిసరికావచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా హెచ్చరించారు. అయితే ద్రవ్యోల్బణ భయం కారణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల తక్షణ పెంపు నిర్ణయంపై ఇంకా ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ యుద్ధ ఉద్రిక్తతల దెబ్బతో ప్రపంచ మార్కెట్లో పెరిగిపోతున్న ఇంధన రేట్లకు తగ్గట్లు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచకపోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నాయి. పెట్రోల్పై లీటరుకు రూ. 14, డీజిల్పై రూ. 42 మేర నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం నెలకు రూ. 55,416 కోట్ల మేర అండర్ రికవరీలు ఉంటున్నాయని అంచనా. ఈ నష్టాలను తగ్గించుకుని, తిరిగి గతేడాది స్థాయికి చేరుకోవాలంటే పెట్రోల్, డీజిల్ రేట్లను 20 శాతం మేర పెంచాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కనీసం రూ. 10 పెంచితే రూ. 17,000 కోట్ల మేర నష్టం భర్తీ అవుతుందని చెబుతున్నాయి. రేట్లు కొంత పెంచినా ఊరటే.. దేశీయంగా గత రెండు నెలలుగా, ప్రతి నెలా 37 లక్షల టన్నుల పెట్రోల్, 85 లక్షల టన్నుల డీజిల్ వినియోగం ఉంటోంది. దీంతో ఓఎంసీలపై భారం భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ కంపెనీలకు నెలకు రూ. 55,416 కోట్ల మేర నష్టాలు వస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో లీటరుకు రూ. 2 చొప్పున పెంచితే నెలవారీ అండర్ రికవరీలు రూ. 52,105 కోట్లకు, రూ. 4 పెంచితే రూ. 48.794 కోట్లకు తగ్గుతాయని భావిస్తున్నారు. రూ. 10 పెంచితే ఓఎంసీలకు రూ. 17,000 కోట్ల భారం తగ్గుతుందని, ఆదాయ నష్టం సుమారు రూ. 38,863 కోట్లకు దిగి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
హార్మూజ్ను దాటిన 2 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: హార్మూజ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్నా ఎల్పీజీ సరకుతో వస్తున్న రెండు సరకురవాణా నౌకలు విజయవంతంగా జలసంధిని దాటాయి. ‘సైమీ’ఎల్పీజీ ట్యాంకర్ మే 13వ తేదీన హార్మూజ్ను దాటగా ఎన్వీ సన్షైన్ అనే మరో ఎల్పీజీ నౌక గురువారం దాటింది. ఈ రెండు నౌకలతో కలిపి గత రెండు నెలల్లో హార్మూజ్ను దాటి భారతీయ నౌకల సంఖ్య 13కు పెరిగింది.యూఏఈలోని రువాయిస్ రిఫైనరీ నుంచి బయల్దేరిన సైమీ నౌకలో దాదాపు 20,000 టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయి. ఇది మే 16వ తేదీకల్లా గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకునే ఆస్కారముంది. ఎన్వీ సన్షైన్ నౌకలో ఏకంగా 46,427 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇది మే 18వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకునే అవకాశముందని కేంద్ర పోర్ట్లు, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ తెలిపారు. ఈ రెండు నౌకలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్కు రప్పిస్తోంది. ఆగని దాడుల పరంపర.. కొన్ని నౌకలు విజయవంతంగా హార్మూజ్ను దాటుతున్నా మరి కొన్నింటిపై దాడులు కొనసాగుతున్నాయి. గతంలో రెండు నౌకలపై దాడి జరగ్గా ఇప్పుడు మరో నౌకపై మెరుపుదాడి చేశారు. దీంతో సోమాలియా నుంచి షార్జాకు వెళ్తున్న భారతీయ జెండాతో ఉన్న సంప్రదాయక సరకు రవాణా నౌక ‘హాజీ అలీ’యాత్ర విషాదంగా ముగిసింది. బుధవారం తెల్లవారుజామున ఒమన్ ప్రాదేశిక సముద్రజలాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై దాడి జరిగింది. ‘‘57 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పున్న ఈ నౌక ప్రధాన భాగం చెక్కతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రజలాల్లో మునిగిపోయింది. ఈలోపు విషయం తెల్సుకుని ఒమన్ తీరగస్తీ దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. నౌకలోని 14 మంది సిబ్బందిని కాపాడాయి. నావికులందరినీ త్వరలోనే భారత్కు తరలిస్తాం. నౌకపై ఎవరు దాడి చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకుంటూ వాణిజ్య నౌకలపై దాడి, నావికులకు ప్రాణహాని కల్గించే ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదనీయంకాదు’’అని అదనపు కార్యదర్శి ముకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
పశ్చిమాసియా శాంతి.. అందని ద్రాక్ష కానివ్వం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో గురువారం మొదలైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సదస్సులో పశ్చిమాసియా సంక్షోభంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇకనైనా హార్మూజ్ జలసంధి తెరచుకునేలా, సముద్రమార్గంలో సరకుల రవాణా సవ్యంగా జరిగి ముడిచమురు, నిత్యావసరాల ధరలు దిగొచ్చేలా ప్రపంచదేశాలు సమష్టి నిర్ణయాలు తీసుకుని పశ్చిమాసియా యుద్ధమేఘాలను చెల్లాచెదురుచేయాలని భారత్ ఆశాభావం వ్యక్తంచేసింది. అగ్రరాజ్యాల అసంబద్ధ ఆంక్షల కత్తిని తొలగించేలా ఉమ్మడి పోరాటం చేయాలని బ్రిక్స్ దేశాలకు భారత్ పిలుపిచ్చింది. రెండ్రోజులపాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో తొలిరోజు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రసంగించారు. ఇరాన్పై దాడికి తెగబడిన అమెరికానుద్దేశించి జైశంకర్ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను తోటి దేశాలు గౌరవించాలని హితవు పలికారు. ‘‘శాంతి అనేది కలగా మిగిలిపోనివ్వం. అంతర్జాతీయ చట్టాల ఉనికి శాంతే కీలకం. ప్రజలను కాపాడాన్నా, మౌలిక వసతుల పరిరక్షించాలన్నా శాంతి వెల్లివిరియాలి. సంఘర్షణలకు సంప్రతింపులు, దౌత్యమే అత్యుత్తమ మార్గం. ‘‘పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో సముద్రమార్గంలో సరకు రవాణా కష్టమైంది. ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. హార్మూజ్ తెరచుకోవాలి. ఎర్రసముద్రం గుండా రవాణా కొనసాగాలి. ఇక గాజాలో మానవతా సాయం ఊపందుకోవాలి. శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సాయం పెంపు, విశ్వసనీయ మధ్యవర్తిత్వం ద్వారా శాంతిని సాధించం అనేవి ఎంతో కీలకం. పాలస్తీనియన్ల భవిష్యత్తు దృష్ట్యా రెండు దేశాల విధానానికి భారత్ ఓటేస్తోంది’’అని జైశంకర్ అన్నారు. గురువారం బ్రిక్స్ సెషన్స్లో ఒక దాంట్లో చర్చవేళ యూఏఈ, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ జోక్యంచేసుకోవడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, యూఏఈ విదేశాంగ మంత్రి ఖలీఫా షాహీన్ అల్ మరార్లు శాంతించారని తెలుస్తోంది. ఈ సెషన్లో బ్రెజిల్ విదేశాంగ మంత్రి మారో వియేరా, ఇండోనేసియా విదేశాంగ మంత్రి సుగియానో, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా తదితరులు పాల్గొన్నారు. తమదేశంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయడంపై యూఏఈ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. విస్తరణవాదానికి మేం బలయ్యాం ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడారు. ‘‘యుద్దకాంక్షతో రగిలిపోతున్న దేశాల అక్రమ రాజ్యవిస్తరణవాదానికి మేం బలైపోతున్నాం. నేటి సమాజంలో ఇలాంటి ధోరణులకు చోటివ్వకూడదు. హేయమైన దాడులు జరుగుతున్నా ఇరాన్ ప్రజలు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శాంతి కోసం పరితపిస్తున్నారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారు. అంతర్జాతీయ చట్టాలను కాలరాస్తూ మాపై యుద్ధానికి కాలు దువ్విన అమెరికా, ఇజ్రాయెల్ను బ్రిక్స్ సభ్యదేశాలు తప్పుబట్టాల్సిందే’’అని అరాఘ్చీ డిమాండ్చేశారు. -
బిగ్ క్యాట్, బిగ్ మిషన్ : భారత్కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ: బిగ్ క్యాట్లుగా ఖ్యాతికెక్కిన సింహం, పులి, చిరుత, మంచు చిరుత, చీతాల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో బిగ్క్యాట్ ఇతివృత్తంతో పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ) సమ్మిట్–2026కు ముందస్తు సన్నాహక కార్యక్రమాలుగా మోదీ సర్కార్ వీటిని నిర్వహించబోతోంది. భారత్లో పులి, ఆసియా సింహం, చిరుత, మంచు చిరుత, చీతా సంరక్షణలో సాధించిన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చర్యలను ఈ కార్యక్రమాల్లో ప్రదర్శించనున్నట్లు మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. పులుల సంరక్షణలో మనమే ఆదర్శంప్రపంచంలోని అడవి పులులలో 70 శాతానికి పైగా భారత్లోనే ఉన్నాయి. ‘ప్రాజెక్ట్ టైగర్’(ఎన్టీఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలతో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చంద్రపూర్ కార్యక్రమంలో టైగర్ రిజర్వుల విస్తరణ, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, వన్యప్రాణి కారిడార్ల రక్షణ, గ్రామాల పునరావాసం వంటి అంశాలను వివరించనున్నారు. ప్రపంచంలో ఆసియాటిక్ సింహాలు కేవలం భారత్లోనే ఉండటంతో గిర్ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ‘ప్రాజెక్ట్ లయన్’ కింద దీర్ఘకాలిక సంరక్షణ, నివాస ప్రాంతాల విస్తరణ, వ్యాధి నిరోధక పర్యవేక్షణ, మాల్ధారి సముదాయాల భాగస్వామ్యం వంటి అంశాలను ప్రదర్శించ నున్నారు. ఇదీ చదవండి: భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్ రాసింది.. కట్ చేస్తే!మనుషుల మధ్యే చిరుతల సహజీవనంభువనేశ్వర్లో జరిగే కార్యక్రమంలో చిరుతలు మానవ నివాస ప్రాంతాల దగ్గర ఎలా జీవిస్తున్నాయో, మానవులు–వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించే చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. గ్యాంగ్టక్లో జరిగే కార్యక్రమంలో మంచు చిరుతల సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం, స్థానిక సముదాయాల భాగస్వామ్యం, పర్వత జీవవ్యవస్థల పరిరక్షణపై చర్చించనున్నారు.ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్మీదే పెళ్లిచీతాల పునరావాసంలో భారత్కు అంతర్జాతీయ గుర్తింపుమధ్యప్రదేశ్లోని భోపాల్ కార్యక్రమంలో ‘ప్రాజెక్ట్ చీతా’పై ప్రత్యేకంగా దృష్టి సారించ నున్నారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను భారత్కు తీసుకువచ్చి పునరావాసం కల్పించడం ప్రపంచంలోనే తొలి అంతర్ఖండ పెద్ద మాంసాహారి జీవి మార్పిడి ప్రాజెక్ట్గా గుర్తింపు పొందింది. భారత్ ప్రారంభించిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిగ్ క్యాట్ జాతుల సంరక్షణకు సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమాలు ప్రపంచ స్థాయి సమ్మిట్కు వేదికగా నిలవనున్నాయి. ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్ ‘ది స్కిన్ డాక్టర్’ కి షాక్ఐదు రాష్ట్రాల్లో బిగ్ క్యాట్లసంరక్షణపై అవగాహనా కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు..ఆసియా సింహం – గిర్(గుజరాత్)చీతా – భోపాల్(మధ్యప్రదేశ్)చిరుత – భువనేశ్వర్(ఒడిశా)మంచు చిరుత – గ్యాంగ్టక్(సిక్కిం)పులి – చంద్రపూర్(మహారాష్ట్ర)


