India
-
ఇరాన్ యుద్ధంలో ఇండియా వైఖరి
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్–యూఎస్ శిబిరంలో భారత్ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.బహుళ అలీన విధానంప్రస్తుత ఇరాన్ యుద్ధంలో భారత్ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్ ఫ్యాక్టర్ 3. ఇరాన్, యూఎస్ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్లో భారత్ స్థానం 5. భారత్ బలాలు – బలహీనతలు.21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత యూఎస్ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్ఏ, యూరోపి యన్ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?ఇరాన్ యుద్ధంలో భారత్ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్ సిందూర్’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్కు ఇజ్రాయెల్ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్ భారత్కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. అందుకే రష్యా, ఇజ్రాయెల్కు సంబంధించినంత వరకు భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రా యెల్ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్ తలదూర్చి తన జియో పొలిటికల్ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.కిం కర్తవ్యం?జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే భారత్ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.ఇరాన్ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్లో చైనా–తైవాన్ విషయంలో యూఎస్ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు -
భయపడాల్సిన పనిలేదు: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలలోనూ తాము అండగా నిలుస్తామని ప్రతిపక్ష పార్టీలన్నీ తమకు హామీ ఇచ్చాయని తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన సమావేశం జరిగిందని కిరణ్ రిజిజు అన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించిదని తెలిపారు. ‘దేశీయంగా 60% ఎల్పీజీని ఉత్పత్తిని పెంచాం. ఇంధన సరఫరా పెంచేందుకు అన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నాం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్ని అఖిలపక్ష పార్టీలకు వివరించాము. సవాళ్లు ఎదురవుతున్న ఈ సమయంలో, అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించాము. దేశంలో ఇంధన భద్రతకు ఢోకా లేదు ఇంధన భద్రత విషయంలో భయపడాల్సిన పనిలేదు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతిస్తామని అన్ని పార్టీలు వెల్లడించాయి. హార్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా వస్తున్నాయి’ అని అన్నారు.కాగా, ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశం పార్లమెంటులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తరఫున సమావేశానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. -
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటన
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్, వంటగ్యాస సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ధరలలో కూడా ఎటువంటి పెరుగుదల లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయనీ, వదంతులను నమ్మవద్దు అని బుధవారం (మార్చి 25, 2026) పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ధరలు పెంచంఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉందనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అన్నారు. గత రెండు రోజులుగా, అనేక ప్రాంతాల్లోని రిటైల్ అవుట్లెట్లు మరియు పెట్రోల్ పంపుల బయట క్యూలు కనిపించాయి. భయాందోళనలతో కొనుగోళ్లు కూడా జరిగాయి. కానీ మన వద్ద తగినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయి. ఏ పెట్రోల్ పంపు వద్ద కూడా కొరత లేదు. పెట్రోల్ పంపులకు సరఫరా టెర్మినళ్లలో కూడా తగినంత పరిమాణంలో ఇంధన నిల్వలున్నాయి. అందువల్ల, వదంతులను నమ్మవద్దు , భయాందోళనలతో కొనుగోళ్లు మానుకోండి అని ఆమె చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని కూడా ఆమె స్పష్టం చేశారు. LPG విషయానికి వస్తే, ఏ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఎలాంటి కొరత లేదని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల వాణిజ్య ఎల్పిజిని కేటాయించారని, గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. సుమారు 30,005 కిలోల సిలిండర్లు పంపిణీ చేశామని ఆమె చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన కిరోసిన్ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనపు కేటాయింపులు చేసిందన్నారు. సుమారు 16 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే నల్లబజారు, అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వివిధ రాష్ట్రాల్లో సుమారు 2700 దాడులు నిర్వహించి, సుమారు 2000 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు సుజాత శర్మ వెల్లడించారు.ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు #WATCH | Delhi: Sujata Sharma, Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, says, "In the last 25 days, 2.5 lakh new connections (PNG) have been given. Additionally, approximately 2.20 lakh consumers have shifted from LPG to PNG. Additionally,… pic.twitter.com/o3pDx5KbMs— ANI (@ANI) March 25, 2026 -
కోట్లాది మందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు
మధ్యప్రాచ్య (Middle East) యుద్దంతో నెలకొన్న చమురు సరఫరా సంక్షోభం పెట్రోల్, డీజిల్పై ఆందోళనల నేపథ్యంలో భారతీయులకు భారీ ఊరటనిచ్చే అంశమిది. భారత రిఫైనరీలు వచ్చే నెల డెలివరీ కోసం సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా చమురు కొనుగోలులో అమెరికా ఇచ్చిన వెసులు బాటు భారత్ సమర్ధవంతంగా వినియోగించుకున్నట్టు అవుతోంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో సౌదీ అరేబియా, ఇరాక్ నుండి రావాల్సిన చమురు నిలిచి పోవడంతో, భారత్ తన ఇంధన అవసరాల కోసం మళ్ళీ రష్యా వైపు మొగ్గు చూపింది. మనీ కంట్రోల్ కథనం ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారతీయ రిఫైనరీలు మే నెల డెలివరీ కోసం దాదాపు 6 కోట్ల (60 Million) బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ కంటే బ్యారెల్కు 5 డాలర్ల నుండి 15 డాలర్ల ప్రీమియం ధరలకు బుక్ అయ్యాయి. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ ప్రకారం, ఈ పరిమాణం ఈ నెల కొనుగోళ్లకు సమానంగా ఉన్నప్పటికీ, ఫిబ్రవరి నెల కొనుగోళ్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ.(ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు)గత డిసెంబర్ నుండి రష్యా చమురుకు దూరంగా ఉన్న మంగళూరు రిఫైనరీ (MRPL), హిందుస్థాన్ మిట్టల్ ఎనర్జీ వంటి సంస్థలు ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రధానంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో ఏర్పడిన చమురు కొరతను అధిగమించేందుకు, మార్చి 12 లోపు సముద్రంలో లోడ్ అయిన రష్యన్ చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.2022 ప్రారంభంలో ఉక్రెయిన్పై దాడి జరిగిన తర్వాత, భారత్కు తక్కువ ధరకు లభించే రష్యన్ ముడి చమురుకు ఇది ఒక ప్రధాన కొనుగోలుదారుగా మారింది. అయితే, అమెరికా ఒత్తిడితో గత ఏడాది చివరి నుంచి భారత్ కొనుగోళ్లను తీవ్రంగా తగ్గించుకుంది. దానికి బదులుగా సౌదీ అరేబియా, ఇరాక్ల నుంచి బ్యారెళ్ల వైపు మళ్లింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత, అందులో అధిక భాగం పర్షియన్ గల్ఫ్లోనే చిక్కుకుపోయింది. అమెరికా మినహాంపుతోపాటు, కేవలం రష్యా పైనే ఆధార పడకుండా, భారత్ తన చమురు వనరులను పెంచుకుంటోంది. అక్టోబర్ 2020 తర్వాత అత్యధికంగా వెనిజులా నుండి కూడా ఏప్రిల్ నెలలో 80 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోనుంది.ఇదీ చదవండి: కోటక్ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలంరష్యాకు భారీ లాభాలుభారత్ , ఇతర దేశాలనుంచి వస్తున్న భారీ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల రష్యా భారీ లాభాలను ఆర్జిస్తోంది. మార్చి 2022 తర్వాత రష్యా చమురు ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న సమయం ఇదేనని నివేదికలు చెబుతున్నాయి. -
వీలునామా రిజిస్టర్ చేయించడం అత్యుత్తమం
నేను గతంలో ఒక వీలునామా రాసి, ఆ విషయాన్ని నా కుటుంబ సభ్యులకు – స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామా తిరగరాయాలనుకుంటున్నాను. వీలవుతుందా?– వి.ఆర్.ఎన్. శాస్త్రి, హైదరాబాద్మీరు సంపాదించిన లేదా మీకు సంక్రమించిన ఆస్తులను మీ తదనంతరం ఎవరికి పంచాలో నిర్ణయిస్తూ వీలునామా రాయడమనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మార్చుకోవచ్చు. అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలో చేసిన వీలునామా తాలూకు అంశాన్ని, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ వీలునామాలో మీరు ‘ఇదే చివరిది కాదు, నాకు మార్చుకోవాలనిపిస్తే మరోసారి కూడా వీలునామా మార్చుకునే అవకాశం ఉంది’ అని, అలా మార్చకపోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుందని కూడా రాయించవచ్చు.మీరు వీలునామా రాయించి, ఆ విషయాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా పోందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచూ చూస్తుంటాము. అలాంటి వీలునామాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవు. వీలునామా లో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి సంరక్షకులను (గార్డియన్)ను నియమించటం, శానిటీ ఓత్(చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చు తప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం. అలా లీగల్ గా మెరుగైన వీలునామా మీ దగ్గరలోని లాయర్ గారితో రాయించుకుని, వీలునామాలో మీరు పోందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. వీలునామా రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే అన్ని విధాల మీ తదనంతరం కూడా అందరికీ మేలు చేస్తుంది. తక్షణ అమలుకూ నోచుకుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
అత్యంత కాలుష్య దేశంగా పాక్.. నగరాల్లో మాత్రం?
2025 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరాల జాబితాను ఐక్యూ ఎయిర్ విడుదల చేసింది. ఇందులో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అదే విధంగా అత్యంత కాలుష్య నగరంగా భారత్లోని లోనీ నగరం ఉన్నట్లు నివేదిక తెలిపింది.ప్రపంచంలోని వాయి నాణ్యతపై స్విట్జర్లాండ్కు లోని ఐక్యూఎయిర్ సంస్థ నివేదిక విడుదల చేసింది. అందులో అత్యంత కాలుష్యం దేశంగా పాకిస్థాన్ నిలువగా, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో కజకిస్థాన్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. మెుత్తంగా 143 దేశాల్లో వాయు నాణ్యత పరీక్షలు నిర్వహించగా వాటిలో 130 దేశాలు WHO వాయు నాణ్యత ప్రమాణాలు చేరుకోలేక పోయాయి.ఈ నేపథ్యంలోనే భారత్లోని లోనీ నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన నగరంగా నిలిచింది. ఘజియాబాద్కు సమీపంలో, ఢిల్లీ సరిహద్దులో ఉండే ఈ పట్టణంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇక్కడ పీఎం2.5 కణాల సాంద్రత 112.5 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే 22 రెట్లు ఎక్కువ. అదే విధంగా రెండవ స్థానంలో చైనా హోటన్ ,3. బర్నీహత్ (మేఘాలయ) - 4. న్యూఢిల్లీ (భారత్) నిలిచాయి. మెుత్తంగా ప్రపంచంలోని టాఫ్ 10 కాలుష్య నగరాల్లో ఐదు భారతీయ నగరాలే ఉండడం ఆందోళన కలిగించే విషయం -
హర్మూజ్ ప్రయాణంపై భారత్ కీలక వ్యాఖ్యలు: భారత్
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అది అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని తెలిపారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే ఈ అంశాలపై భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు.హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. భద్రత, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే షిప్పింగ్ కంపెనీలు, వాటి కాంట్రాక్టు సంస్థలు ఈ జలసంధి గుండా ప్రయాణం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుంది. దీని గుండా నౌకాయానానికి స్వేచ్ఛ ఉంది. ఆ జలసంధి ఇరుకుగా ఉన్నందున, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మాత్రమే గుర్తించారు, వాటిని నౌకా రవాణా సంస్థలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా జలసంధి గుండా ప్రయాణించాలనే నిర్ణయం షిప్పింగ్ కంపెనీకి, ఓడను అద్దెకు తీసుకున్న కంపెనీకి మధ్య ఉంటుంది. ఎప్పుడు ప్రయాణించాలి, ఎప్పుడు ప్రయాణించకూడదు అనేది వారి నిర్ణయం అని తెలిపారు. అయితే ప్రస్తుతం యుద్ధం నడుస్తున్నందున వారు నిర్ణయం తీసుకునే ముందు భద్రత మొదలైన వాటికి సంబంధించి పరిస్థితిని అంచనా వేస్తారు. అంతేగాని హార్మూజ్ గుండా ప్రయాణానికి ఎటువంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు అని ఆయన తెలిపారు. కాగా నిన్న (సోమవారం) మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇవి ఈ నెల 26 లేదా 27 తేదీలలో భారత్ను చేరుకుంటాయి. వీటివల్ల దేశానికి దాదాపు ఒక రోజు వంటగ్యాస్ సరఫరా చేయవచ్చు. -
మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం: రష్యా
భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం రష్యా ఎదురు చూస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. ఢిల్లీతో ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలు నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.2025 చివరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా కుదిరిన కీలక ఒప్పందాలు, వ్యూహాత్మక లక్ష్యాలను మోదీ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. 2025లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లకు చేరుకుందని దీనిని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.భారత్, రష్యాది కాల పరీక్షను ఎదుర్కొని నిలబడ్డ నిలిచిన స్నేహ బంధమని, సమానత్వం, విశ్వాసం, గౌరవం, ప్రయోజనాలను ఇరుదేశాలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా భారత్, రష్యాల మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం భారత్-రష్యా మధ్య జరుగుతున్న వాణిజ్యంలో 96 శాతం జాతీయ కరెన్సీలలోనే (రూపాయి-రూబుల్) జరుగుతుండటం విశేషమని ఆయన గుర్తుచేశారు.వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం పట్ల రష్యాకు ఎంతో గౌరవం ఉందని లావ్రోవ్ కొనియాడారు. 21వ శతాబ్దంలో భారత్ ఒక గొప్ప శక్తిగా, ప్రపంచ రాజకీయ మరియు ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు -
భారత్ చేరిన మరో ఎల్పీజీ నౌక
మంగళూరు(కర్ణాటక): పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో భారత్లో ఎల్పీజీ కష్టాలు పెరగడంతో ఆ సమస్యను తీర్చేందుకు అమెరికా ముందుకొచి్చంది. అమెరికా నుంచి 16,714 మెట్రిక్ టన్నుల ఎలీ్పజీతో బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘పైక్సిస్ పయనీర్’ ఆదివారం భారత్కు చేరుకుంది. ఫిబ్రవరి 14వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని పోర్ట్ ఆఫ్ నెదర్లాండ్ నుంచి బయల్దేరి పయనీర్ నౌక ఆదివారం న్యూ మంగళూరులోని నౌకాశ్రయానికి చేరుకుంది. మంగళూరు రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ప్లాంట్ సమీపంలో భారత్ అతిపెద్ద భూగర్భ ఎల్పీజీ నిల్వ కేంద్రాన్ని నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక్కడ 80 వేల మెట్రిక్ టన్నుల ద్రవరూప పెట్రోలియంగ్యాస్(ఎల్పీజీ)ను భద్రపరచవచ్చు. వ్యూహాత్మక అవసరాలకు ఈ నిల్వలు అక్కరకొస్తాయి. రష్యా చమురు నౌక ఆగమనం మంగళూరు: చైనాకు వెళ్లాల్సిన రష్యా నౌక ఆక్వా టైటాన్ దిశమార్చుకుని మంగళూరుకు చేరుకుంది. చైనాకు బదులుగా భారత్ దిశగా బయల్దేరిన ఏడు నౌకల్లో ఇండియాకు చేరుకున్న తొలి నౌక ఇదే కావడం విశేషం. పశి్చమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సముద్రమార్గంలో చమురు రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నంకావడంతో తాత్కాలికంగా రష్యా నుంచి భారత్ చమురుకొనేందుకు అమెరికా అనుమతి మంజూరుచేసింది. దీంతో చైనాకు వెళ్లే ముడిచమురు నౌకలను సైతం భారత్ ఆగమేఘాల మీద కొనేసింది. దీంతో చైనాలోని రిజావూ పోర్ట్కు వెళ్లాల్సిన ఆ నౌకలు మార్చి నెల భారత్ వైపు దిశమార్చుకున్నాయి. జనవరి చివర్లో బాల్టిక్ సముద్రంలో సరుకు నింపుకున్న ఆక్వా టైటాన్ చివరకు భారత్కు చేరుకుంది. మార్చి 25వ తేదీన మరో రష్యా చమురునౌక సూయిజ్మ్యాక్స్ జౌజౌ సైతం త్వరలో భారత్కు చేరుకోనుంది -
ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆదివారం మరో అరుదైన మైలురాయికి చేరుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా రికార్డుకెక్కారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా నిరాటంకంగా 8,931 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఈ విషయంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు. చామ్లింగ్ సీఎంగా 8,930 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఆదివారంతో మోదీ 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. కేంద్ర మంత్రుల అభినందనలు ప్రభుత్వాధినేతగా 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న కేంద్ర మంత్రులు తదితరులు అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాని గత 24 ఏళ్లకుపైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తున్నారు. ఇది ఆయన అంకితభావానికి నిదర్శనం. ‘మోదీ యుగం’ దేశ రూపురేఖలనే మార్చివేసింది. ఈ 8,931 రోజుల ప్రస్థానం దేశం పట్ల ఆయన నిబద్ధత, ప్రతి పౌరుడి పట్ల ఆయన చూపే అసమాన సేవానిరతికి ప్రతీక’’ అని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మంత్రులు రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు కూడా మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంపట్ల, ప్రజల పట్ల ఉన్న అచంచలమైన అంకితభావం కలిగిన గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. ‘‘మోదీ జీవితమంతా నిరంతర సేవా ప్రయాణం. ప్రధానిగా ఆయన సేవా దృక్పథం దేశాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉంది. మోదీ నాయకత్వంలో పేదలు, యువత, రైతులు, అన్నదాతల సాధికారతకు పెద్దపీట వేస్తూ దేశం ‘వికసిత్ భారత్’ దిశగా సాగుతోంది’’ అన్నారు.ఎన్నెన్ని రికార్డులో! → మోదీ తొలిసారి 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రధానిగా ఎన్నికయ్యే దాకా సీఎంగా కొనసాగారు. గుజరాత్కు ఎక్కువ కాలం సీఎంగా చేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 21 దాకా 13 ఏళ్లకు పైగా సీఎంగా సేవలందించారు. 2001, 2002, 2007, 2012ల్లో నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసి, ప్రధానమంత్రిగా ఎన్ని కైన అరుదైన నాయకుడు కూడా మోదీయే. → స్వతంత్ర భారతదేశంలో జని్మంచిన తొలి ప్రధానిగా మోదీ మరో రికార్డు నెలకొల్పారు. మోదీకి ముందు ప్రధానులుగా చేసిన వారంతా స్వాతంత్య్రానికి ముందు పుట్టిన వారే. → ప్రధానిగా రెండు పర్యాయాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏకైక కాంగ్రెసేతర నేత మోదీ. ప్రస్తుతం వరుసగా మూడో టర్మ్లో పదవిలో కొనసాగుతున్నారు. → వరుసగా 3 సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా మోదీ మరో ఘనత సాధించారు. ఆయన సారథ్యంలో 2014, 2019, 2024ల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. → వరుసగా ఎక్కువకాలం పదవిలో రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును మోదీ గతేడాది బద్ధలు కొట్టారు. ఇందిర 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 దాకా 4,077 రోజులపాటు వరుసగా పదవిలో ఉన్నారు. మోదీ 2025 జూలై 25న ఆ రికార్డును దాటేశారు. → అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రికార్డు నెహ్రూదే. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27న మరణించేదాకా 16 ఏళ్ల 286 రోజులపాటు పదవిలో ఉన్నారు. మోదీ నాలుగోసారి ప్రధానిగా ఎన్నికైతే ఆ రికార్డును తిరగరాసే అవకాశముంది. → నెహ్రూ మూడు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించారు. ఈ రికార్డును మోదీ ఇప్పటికే సమం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపిస్తే ఆ రికార్డునూ అధిగమిస్తారు. → ఆరు వరుస ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నాయకుడు కూడా మోదీయే. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ పక్షనేతగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2014, 2019, 2024లో లోక్సభ ఎన్నికల్లో నెగ్గి బీజేపీపక్ష నేతగా, ప్రధానిగా ఎన్నికయ్యారు. -
అనాహత్, అభయ్లకు టైటిల్స్
ముంబై: ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లే టైటిల్స్ సాధించారు. టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన అనాహత్ సింగ్ మహిళల టైటిల్ చేజిక్కించుకుంది. పురుషుల ఈవెంట్లో అభయ్ సింగ్ నిలకడైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన అమ్మాయిల ఫైనల్లో యువ సంచలనం అనాహత్ 3–1 (11–5, 11–6, 9–11, 11–6)తో ఈజిప్టు క్రీడాకారిణి హనా మొతాజ్ను ఓడించింది. భారత ప్లేయర్ తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకోగా... మూడో సెట్ను ఈజిప్టు అమ్మాయి దక్కించుకుంది. వెంటనే పుంజుకున్న అనాహత్ నాలుగో సెట్ నెగ్గి మ్యాచ్ను ముగించింది. గత నెలలో ఈ భారత ప్లేయర్ కెరీర్ బెస్ట్ ప్రపంచ 19వ ర్యాంకుకు ఎగబాకింది. ఇపుడు తాజా టైటిల్ విజయంతో టాప్–20 ర్యాంకింగ్స్లో నిలకడగా కొనసాగనుంది. 2022 ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన అనాహత్... గతేడాది ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్లో కాంస్యంతో భారత్ 15 ఏళ్ల పతక నిరీక్షిణకు తెరదించింది. చెన్నైలో జరిగిన స్క్వాష్ ప్రపంచకప్లోనూ ఆమె బంగారు పతకంతో సత్తాచాటింది. భారత ఆటగాళ్ల మధ్యే జరిగిన పురుషుల ఫైనల్లో అభయ్ సింగ్ తన సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస సెట్లలో గెలుపొందాడు. అతను 11–9, 11–8, 11–4 వీర్ చొత్రానిపై విజయం సాధించాడు. -
2047 నాటికి సంపన్న దేశంగా భారత్: అమెరికన్ మ్యాగజైన్ సంచలన రిపోర్ట్!
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2047 నాటికి.. సంపన్న దేశంగా మారుతుందని అమెరికా మ్యాగజైన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' నివేదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వాషింగ్టన్ ఎగ్జామినర్ ప్రకారం.. గత రెండు దశాబ్దాలుగా దేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2003 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. సగటు వార్షిక వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 20 ఏళ్లపాటు ఇదే ఊపు కొనసాగితే తలసరి జీడీపీ 15,000 డాలర్లు దాటేస్తుంది. ఇంతటి స్థిరమైన వృద్ధి సాధించడం వల్ల భారత్.. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసిన మధ్య ఆదాయ ట్రాప్ను (మిడిల్ ఇన్కమ్ ట్రాప్) దాటేయగలదు.భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన విధానాలు, జనాభా, పెరుగుతున్న టెక్నాలజీ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది. ఇండియాలో 28 సంవత్సరాలు మధ్య వయసున్న వారు.. యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాల కంటే ఎక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశంలో యువకులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ జనాభా ధోరణి బలమైన దేశీయ మార్కెట్కు మద్దతునిస్తుందని, తద్వారా వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదించింది.ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి.. విధాన రూపకర్తలు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు వేగవంతమవుతున్నాయి. మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసులను బలోపేతం చేసి, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది.నిరంతర పెట్టుబడులు, కార్మిక శక్తిని విస్తరించడం, సాంకేతికతను స్వీకరించడం ద్వారా దేశాలు అధిక - ఆదాయ హోదాకు మారగలవని చారిత్రక ధోరణులు చూపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు భారతదేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది.వికసిత భారత్ - మోదీ కలభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల. ఈ లక్ష్యం ద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో శక్తివంతంగా మార్చడం ప్రధాన ఉద్దేశ్యం.వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చేయడం. గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాలి. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం.మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడం వంటివి కూడా ఇందులో ప్రధాన లక్ష్యాలు.ఇదీ చదవండి: బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా.. -
అమెరికా మాపై దాడి చేస్తే మేము భారత్ పై దాడి చేస్తాం: పాక్ మాజీ హై కమీషనర్
-
‘మన గ్యాస్ని ఎవర్రా ఆపేది?’.. భారత్కు అమెరికా గ్యాస్!
మంగళూరు: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల కారణంగా మన దేశంలో ఏర్పడుతున్న ఎల్పీజీ (ఎల్పీజీ) కొరతకు పరష్కారం దొరికింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి భారీ గ్యాస్ నిల్వలతో కూడిన ‘పిక్సిస్ పయనీర్’ (Pyxis Pioneer) నౌక ఎట్టకేలకు భారత్ చేరుకుంది. ఆదివారం ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు ఈ నౌక సురక్షితంగా వచ్చి చేరింది.టెక్సాస్ టు మంగళూరు ..సింగపూర్ ఫ్లాగ్తో ప్రయాణించిన ఈ భారీ ట్యాంకర్ ఫిబ్రవరి 14న టెక్సాస్లోని నెదర్లాండ్ పోర్టు నుంచి బయల్దేరింది. న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ వివరాల ప్రకారం.. 47,236 టన్నుల గ్రాస్ టన్ను సామర్థ్యం ఉన్న ఈ నౌక, ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 13వ నంబర్ బెర్త్కు చేరుకుంది. ఇది ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం సుమారు 16,714 టన్నుల ఎల్పీజీని ఇక్కడ అన్లోడ్ చేయనుంది. సోమవారం ఉదయం ఈ నౌక తిరిగి ప్రయాణం కానుంది.భారత్కు ఊరటగత మూడు వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల భారత్కు ఇంధన సరఫరాలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. సరఫరా తగ్గడంతో గృహ అవసరాలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు, హోటళ్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ కోత విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో అమెరికా నుంచి గ్యాస్ నిల్వలు రావడం దేశానికి పెద్ద ఊరట లభించింది.ఇరాన్ హామీతో..ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారతీయ నౌకలకు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. దీంతో పాటు ఇటీవల ‘జగ్ లాడ్కీ’ ముడి చమురును, ‘నందాదేవి’, ‘శివాలిక్’ నౌకలు గ్యాస్ నిల్వలను విజయవంతంగా భారత తీరానికి చేరవేసాయి. కాగా భారత్ తన ఇంధన అవసరాల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దేశానికి కావాల్సిన ముడి చమురులో 88 శాతం, సహజ వాయువులో 50 శాతం, ఎల్పీజీలో దాదాపు 60 శాతం దిగుమతుల ద్వారానే అందుతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇంధన సరఫరా వ్యవస్థ కొంత అస్తవ్యస్తమయ్యింది. అయితే తాజా షిప్మెంట్లతో పరిస్థితులు దారికి వస్తున్నాయి.ఇది కూడా చదవండి: ట్రంప్ షాకింగ్ పోస్ట్.. ‘అతని చావుతో సంతోషం’ -
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ‘‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ ’గా పేరొందిన భారత్ ఔషధ పరిశ్రమ... దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానిస్తూ, ఆరోగ్య రంగంలోనే కాక ఆర్థిక అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తక్కువ ధరలతో నాణ్యమైన మందులు, భారీ ఎగుమతులు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలతో ప్రపంచ ఫార్మా రంగంలో భారత్కి ప్రత్యేక స్థానమని హర్షం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో ఫార్మా రంగం అభివృద్ధి చెందుతున్న విధానంపై ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’(పీఐబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య రంగానికి, ఆర్థికాభివృద్ధికి అనుసంధానకర్త ‘ఫార్మాస్యూటికల్’ రంగం కీలక స్థానాన్ని ఆక్రమించినట్లు తెలిపింది. అవసరమైన మందులు, టీకాలను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలు, సప్లై చైన్ బలోపేతం, సామాజికాభివృద్ధికి ఈ రంగం తోడ్పడుతున్నట్లు వివరించింది. ప్రపంచ ఫార్మా మార్కెట్లో భారత్ది ప్రత్యేక స్థానం: భారత ఔషధ పరిశ్రమ ప్రపంచంలో వాల్యూమ్(పరిమాణం) పరంగా మూడవ స్థానం, విలువ పరంగా 11వ స్థానంలో ఉందని పీఐబీ తెలిపింది. దేశంలో 3 వేలకు పైగా కంపెనీలు, 10,500 తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 60 బిలియన్ డాలర్ల విలువ కలిగిన దేశీయ మార్కెట్ 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరనుంది. భారత్ ప్రపంచంలో జనరిక్ మందుల అతిపెద్ద సరఫరాదారుగా నిలవనుంది. ప్రపంచ సరఫరాలో దాదాపు 20శాతం వాటా భారత్దే కావడం గమనార్హం. సుమారు 60వేల జనరిక్ బ్రాండ్లు 60 చికిత్స విభాగాల్లో ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ నమ్మకం, నాణ్యతకు గుర్తింపు: అమెరికా వెలుపల అత్యధికంగా యూఎస్ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ యూనిట్లు భారత్లోనే ఉన్నాయని తెలిపింది. సుమారు 500 ఏపీఐ(యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్)తయారీ సంస్థలు ఉండటం ద్వారా ప్రపంచ ఏపీఐ మార్కెట్లో భారత్కు ఎనిమిది శాతం వాటా ఉంది. ఇక ఎగుమతుల్లోనూ భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. భారత్ డిప్తీరియా, టెటనస్, పెర్టుసిస్ (డీపీటీ), బీసీజీ మీజిల్స్ టీకాల సరఫరాలో ప్రథమ స్థానంలో ఉంది. యూనిసెఫ్కు 60% టీకాలను భారత్ సరఫరా చేస్తుండటం గరి్వందచదగ్గ విషయంగా పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ మీజిల్స్ టీకా అవసరాల్లో 90% భారత్ నుంచే సరఫరా అవుతోంది. ఇక 2024–25లో ఔషధ ఎగుమతులు 30.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుతం భారత్ 191 దేశాలకు ఔషధాలు ఎగుమతి చేస్తున్నట్లు వివరించింది.ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలుఫార్మా రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక పథకాలను అమలు చేస్తున్నట్లు పీఐబీ తెలిపింది. ఇందులో భాగంగా ప్రధానంగా.. ‘పీఎల్ఐ పథకం’. ఈ పథకం ప్రభావం రూ.3.16 లక్షల కోట్ల అమ్మకాలు, రూ.2.03 లక్షల కోట్ల ఎగుమతులు, సుమారు 97వేల ఉద్యోగాలు, బల్క్ డ్రగ్ – మెడికల్ డివైస్ పార్కులు అని వివరించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్కులు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో మెడికల్ డివైస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ‘ప్రధాన్ మంత్రి భారతీయ జనఔషధి పరియోజన’ కింద దేశవ్యాప్తంగా 18,600కి పైగా కేంద్రాలు పనిచేస్తున్నాయి. తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందిస్తూ ప్రజల ఖర్చులను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇక ‘ఇన్నోవేషన్, పరిశోధన’కు కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపింది. ఈపథకం కింద పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. 111 పరిశోధన ప్రాజెక్టులు, పేటెంట్లు నమోదు కావడం ఈ రంగం పురోగతిని సూచిస్తుందన్నారు. 2026–27 బడ్జెట్లో ‘‘బయోఫార్మా శక్తి’’ పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించారు. బయోలాజిక్స్, బయోసిమిలర్స్ ఉత్పత్తిలో భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ వంటి సంస్థలు ఔషధాల నాణ్యత, ధరలు, భద్రతపై కట్టుదిట్టమైన నియంత్రణ నిర్వహిస్తున్నట్లు పీఐబీ వివరించింది.కొత్త మార్కెట్లలో విస్తరణ: నైజీరియా, మెక్సికో, బ్రెజిల్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతులు పెంచుతూ భారత్ తన మార్కెట్ను విస్తరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తుందని పీఐబీ పేర్కొంది. ఇక విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఫార్మా రంగం విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రధాన రంగాల్లో ఒకటిగా నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సెపె్టంబర్ వరకు రూ.13,193 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇక వాణిజ్య ఒప్పందాలతో భారత్ గ్లోబల్గా విస్తరిస్తోంది. యూరోపియన్ యూనియన్, యూనైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్తో కుదిరిన వాణిజ్య ఒప్పందాలు భారత ఔషధ రంగానికి కొత్త అవకాశాలు తెరిచాయి. టారిఫ్ తగ్గింపులతో ఎగుమతులు పెరగనున్నాయి. ముఖ్యంగా యూకే మార్కెట్లో భారత జనరిక్ మందులకు మరింత పోటీ సామర్థ్యం లభించనున్నట్లు పీఐబీ పేర్కొంది. -
అమెరికా మాపై దాడిచేస్తే మేం భారత్పై బాంబులేస్తాం
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఛాందసవాదం, వితండవాదానికి పాకిస్తాన్ చిరునామా అని ఆ దేశ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మారోమారు నిరూపించారు. భారత్ మీద తమ అంతులేని విద్వేషాన్ని తన వాచాలత్వం ద్వారా బాసిత్ మరోమారు రుజువుచేసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం దక్షిణాసియాకు విస్తరించి అమెరికాగనక పాకిస్తాన్పై దాడి చేస్తే ప్రతిగా అమెరికాపై దాడిచేయాల్సిందిపోయి భారత్పై బాంబులేస్తామని బాసిత్ అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో పాకిస్తాన్ దౌత్యవర్గాల్లోనూ జిహాదీవాదం ఒంటబట్టించుకున్న వితండవాదులకు కొదవలేదని భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సీఎన్ఎన్–న్యూస్18తో జరిగిన ఒక చర్చావేదికలో బాసిత్ మాట్లాడారు. ‘‘యుద్ధంలో ఇరాన్పై ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్న పాకిస్తానే ఇజ్రాయెల్కు తదుపరి లక్ష్యంకావొచ్చు. ఇజ్రాయెల్ చెప్పుడుమాటలు వినే అమెరికాకు అప్పుడు పాకిస్తాన్ అణుకార్యక్రమాలు రుచించకపోవచ్చు. అప్పుడు పాకిస్తాన్పై అమెరికా దాడులు చేయొచ్చు. ఇలా జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ దాడి చేస్తే ప్రతిదాడి చేసే సత్తా పాకిస్తాన్కు ఉంది. అయితే ప్రతిదాడి కోసం అమెరికా ప్రధాన భూభాగం లేదా గల్ఫ్ లేదా ఇజ్రాయెల్పై మేం దాడిచేయడం కష్టమవుతుంది. అవన్నీ మాకు సుదూరంగా ఉన్నాయి. సమీప లక్ష్యం మీదే మేం దాడిచేయగలం. అలాంటి సమీప లక్ష్యం ఒక్క భారత్ మాత్రమే. ఏమాత్రం ఆలస్యంచేయకుండా ముంబై, న్యూఢిల్లీలపై దాడులుచేస్తాం. తర్వాత ఏం జరుగుతుందనే దానితో మాకు సంబంధంలేదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం’’అని అన్నారు. ‘‘మాపై దాడులు జరుగుతున్నప్పుడు మాకు కనిపించే ఏకైక మార్గం ఇండియానే. భారత్లోని మెట్రోపాలిటన్ నగరాలపై దాడులు చేస్తాం’’అని అన్నారు. దీంతో భవిష్యత్లో అమెరికాతో సంబంధాలు చెడిపోతే దాని విపరిణామాలను భారతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్లు బాసిత్ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శత్రుదేశం(అమెరికా)పై ఎదురుదాడి చేసే దమ్ములేక పొరుగుదేశంపై బాంబులేసే నిస్సహాయ పాకిస్తాన్ వైఖరి బాసిత్ మాటలతో బహిర్గతమైందని అంతర్జాతీయ రాజకీయవిశ్లేషకులు తప్పుబడుతున్నారు. ‘‘బాసిత్ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టేయడానికి వీల్లేదు. సైన్యం కనుసన్నల్లో నడిచే పాక్ ప్రభుత్వాల కుటిలనీతిలో నిర్లజ్జ నియమాలు ఎలా ఉంటాయో బాసిత్ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. యుద్ధం దక్షిణాసియాకు విస్తరిస్తే పాకిస్తాన్ పట్ల మనం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని బాసిత్ మాటలు హెచ్చరిస్తున్నాయి’’అని భారత నిఘా వర్గాలు సూచించాయి. -
అమెరికా తర్వాత మనమే..
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందంటే ముప్పు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ నిలిచింది. భారత్లో ఆంగ్లం మాట్లాడే డిజిటల్ వినియోగదారులు అధికంగా ఉండటం, ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు వేగంగా విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటా పేర్కొంది. ప్రస్తుతం ఈ ముఠాలు ఒక ప్రొఫెషనల్ వ్యాపార సంస్థల తరహాలో అత్యంత వ్యవస్థీకృతమై పనిచేస్తున్నాయని తెలిపింది.వీరు తమ లక్ష్యిత వ్యక్తులను గుర్తించడానికి, భారీ స్థాయిలో మోసాలకు పాల్పడటానికి సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారని 2026 ప్రథమార్థానికి సంబంధించిన అడ్వర్సరియల్ థ్రెట్ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కోట్లాది ఖాతాలకు చెక్.. కంపెనీ విధానాలను ఉల్లంఘించిన, అలాగే మోసాలు, మోసపూరిత పద్ధతులు అవలంబించిన వ్యక్తులు, ప్రమాదకరమైన సంస్థలకు చెందిన 15.9 కోట్ల పైచిలుకు అడ్వరై్టజింగ్ ఖాతాలను, 1.09 కోట్ల కంటే ఎక్కువ ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ ఖాతాలను, 6,00,000 ఫేస్బుక్ పేజీలను 2025లో తొలగించినట్టు మెటా ప్రకటించింది. గత ఏడాది మోసపూరిత అడ్వరై్టజింగ్ ఖాతాల్లో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే 92% తొలగించినట్టు తెలిపింది. కొత్త తరహా మోసాలు.. ప్రజల బలహీనమైన పరిస్థితులను, మానసిక ఆందోళనను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని మెటా తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తక్కువ ధరలో అద్దె ఇళ్ల కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ అద్దె ఇళ్ల ప్రకటనలను పోస్ట్ చేసే నెట్వర్క్లను పరిశోధకులు కనుగొన్నారు. మరో కలవరపరిచే ధోరణి ఏమంటే నకిలీ అంత్యక్రియల లైవ్స్ట్రీమ్ మోసాలు. ఇందులో అంత్యక్రియల సేవా నిర్వాహకులుగా నటిస్తూ ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారు. లేని స్మారక సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పి అందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని మెటా తెలిపింది.సులభంగా నేరాలు.. భారత్లో సైబర్ నేరాలకు సంబంధించిన ఆర్థిక నష్టాలు భారీగా పెరిగాయి. 2024లోనే అంచనా వేసిన నష్టాలు రూ.22 వేల కోట్లు దాటాయి. ఇది సైబర్ దాడుల తీవ్రతను నొక్కిచెబుతోంది. ప్రస్తుతం అనేక ఫిషింగ్ మోసాలు ఏఐ ద్వారా రూపొందించిన సందేశాలతో జరుగుతున్నాయి. దీనివల్ల వాటిని గుర్తించడం మరింత కష్టతరంగా మారుతోంది. జెనరేటివ్ ఏఐ వల్ల మోసగాళ్లకు నేరం చేయడం సులభతరమైంది.ఏఐ ఆధారిత యాప్స్తో.. వాస్తవికమైనవిగా భ్రమించేలా సందేశాలను, నకిలీ ప్రొఫైల్స్ను, అత్యంత క్లిష్టమైన ఫిషింగ్ వెబ్సైట్స్ను సృష్టించడానికి నేరగాళ్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. డీప్ఫేక్ సాంకేతికత అసలైన కంటెంట్కు, మార్చిన కంటెంట్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుగొనడం మరింత క్లిష్టతరం చేసింది. అశ్లీల చిత్రాలను రూపొందించే ఏఐ ఆధారిత యాప్స్ వెల్లువెత్తడం కూడా ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ సాధనాలతో వ్యక్తుల సమ్మతి లేకుండా నకిలీ నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా వ్యక్తుల గోప్యతకు, వ్యక్తిగత భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగి స్తున్నారు. వీటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరించి వేధింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి యాప్స్ను అరికట్టడానికి, వీటిని ప్రచారం చేసే లక్షలాది ప్రకటనలను తొలగించామని, ఆ సేవలను ప్రోత్స హించే అనేక ఖాతాలు, నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకున్నామని మెటా నివేదించింది.ఆగ్నేయాసియా నుంచి.. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న అనేక నెట్వర్క్లు ఆగ్నేయాసియాలోని మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత స్కామ్ కేంద్రాల నుంచి పనిచేస్తున్నాయి. మోసగాళ్ల ముఠాలు ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. వీరు నిరంతరం తమ ప్రాంతాలను మారుస్తూనే మోసపూరిత విధానాలను మరింత మెరుగుపరుస్తున్నారని మెటా వెల్లడించింది. -
టైటిల్ పోరుకు అనాహత్ సింగ్
ముంబై: జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్కే టైటిల్ లభించనుంది. ఎందుకంటే భారత్కే చెందిన ఇద్దరు ప్లేయర్లు అభయ్ సింగ్, వీర్ చోత్రాని ఫైనల్లోకి దూసుకొచ్చారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్, టాప్ సీడ్ అనాహత్ సింగ్ కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంకర్ అనాహత్ 11–6, 9–11, 11–8, 11–2తో భారత్కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్ హనా మొతాజ్ (ఈజిప్్ట)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో వీర్ చోత్రాని 11–7, 11–5, 5–11, 11–6తో సంజయ్ జీవా (మలేసియా)పై, అభయ్ సింగ్ 11–9, 9–11, 11–3, 11–8తో అమీòÙన్రాజ్ చందారన్ (మలేసియా)పై విజయం సాధించారు. -
యుద్ధం ఆగాలంటే.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నారంటే?
టెహ్రాన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ శనివారం ఫోనులో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పేజెష్కియన్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం రావాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలను నిలిపివేయాలని చెప్పారు. అలాగే ప్రాంత స్థిరత్వం కోసం బ్రిక్స్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు.ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు పేజెష్కియన్ పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన ప్రస్తావించారు.ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులను నిలిపివేయడం, ప్రాంతీయ, గ్లోబల్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం బ్రిక్స్ స్వతంత్ర పాత్ర పోషించాలని పేజెష్కియన్ కోరారు. భారతదేశం ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తావనకు తెచ్చారు.పశ్చిమాసియా దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటును కూడా పేజెష్కియన్ ప్రతిపాదించారు. విదేశీ జోక్యం లేకుండా శాంతి, స్థిరత్వం సాధించాలని సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రకటనలో బ్రిక్స్ గురించి ప్రస్తావించలేదు. అయితే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం ఇరాన్తో జరిగిన సంభాషణల్లో బ్రిక్స్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు.ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో తాను ఇటీవల ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. “ఇరాన్ విదేశాంగ మంత్రితో మరోసారి మాట్లాడాను. ద్వైపాక్షిక అంశాలు, బ్రిక్స్ సంబంధిత విషయాలపై చర్చించాం” అని తెలిపారు.హామీలు అవసరం: పేజెష్కియన్ ఘర్షణ తగ్గాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగాలని, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీలు అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఆయన అమానుషం, అనైతికం అని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదని, అన్యాయంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభించాయని మోదీకి పేజెష్కియన్ తెలిపారు. అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడుల్లో ఉన్నత స్థాయి నాయకులు, సైనికాధికారులు, పౌరులు మరణించారని, పాఠశాల పిల్లలు కూడా బలయ్యారని తెలిపారు. ప్రజా మౌలిక వసతులపై కూడా దాడులు జరిగినట్టు చెప్పారు. మినాబ్ ప్రాంతంలో ఒక పాఠశాలపై దాడి జరిగి 168 మంది పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడి సమీప దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచి జరిగినట్టు ఆరోపించారు. -
గుడ్న్యూస్.. రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొన్న వేళ రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాష్ట్రాలకు అదనంగా మరో 20 శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు తెలిపారు.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల 10 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను పెంచింది కేంద్రం. తాజాగా మరోసారి 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్/పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో నడిపే రాయితీ క్యాంటీన్లు/అవుట్లెట్లు, కమ్యూనిటీ కిచెన్లకు సరఫరా చూడాలని లేఖలో పేర్కొంది.మరోవైపు.. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నౌకల కదలికలు, పోర్టు కార్యకలాపాలు, భారతీయ సముద్ర కార్మికుల భద్రత, సముద్ర వాణిజ్య కొనసాగింపును నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ సముద్ర కార్మికులు అందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది. మొత్తం 22 భారత నౌకలు, 611 భారతీయ సముద్ర కార్మికులు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నారని, డీజీ షిప్పింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. -
Fact Check: ఇరాన్పై దాడికి భారత్లో యుఎస్ మిలటరీ బేస్?
ఇరాన్పై దాడులకు అమెరికా భారత భూభాగాన్ని వాడుకుంటుందన్న వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదని అవి పూర్తిగా అవాస్తవాలని తెలిపింది. ప్రస్తుతం మధ్యప్రాచ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్, అమెరికాలు పరస్పర దాడులతో తీవ్రకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు జరుపుతుంది. ఇదిలా ఉండగా టెహ్రాన్పై దాడులకు భారత భూభాగాన్ని యుఎస్ఏ వాడుకోనుందని LEMOA ఒప్పందాన్ని అనుసరించి కొంకణ్ తీరంలో అమెరికా తన స్థావరాలను ఏర్పాటు చేయనుందని కథనాలు ప్రచురితమయ్యాయి.దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదు. అవన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి ప్రకటనలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ అధికారిక ఖాతాలో పేర్కొందిLEMOA నేపథ్యంలాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (LEMOA) అనేది 2016లో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య కుదిరిన ఒక ద్వైపాక్షిక లాజిస్టిక్స్ ఒప్పందం. ఇది ఇరు దేశాల సాయుధ దళాలు ఒకరి సైనిక సౌకర్యాలను మరొకరు ఇంధనం నింపుకోవడానికి, మరమ్మతులకు, సరఫరాలకు విశ్రాంతికి తదితర సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తుంది. అయితే ఈ ఒప్పందం ఒకరి భూభాగంపై మరొకరు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు దానికి ప్రత్యేక ఆమోదం అవసరం. కానీ ఈ ఒప్పందం కింద అమెరికా మిలటరీ స్థావరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగగా భారత్ దానిని ఖండించింది. -
నయా ట్రెండ్.. లివింగ్ రిలేషన్ వైపు యువత..
-
యుద్ధ విరమణ మార్గాలేమిటి?
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం నాలుగవ వారంలోకి ప్రవేశించింది. అయినా ముగింపు సూచనలు కన బడటం లేదు సరికదా మరింత తీవ్రతర మవుతున్నది. యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల పైన, చమురు మార్కెట్ల పైన స్పష్టంగా కనపడుతున్నది. భారత దేశం కూడా ఈ జియో పొలిటికల్ చరంగంలో చిక్కుకున్నది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్ఫైన్స్, సింగపూర్, పాకిస్తాన్ వంటి దేశాలలోని సగటు పౌరులకు యుద్ధ సెగ తగులు తున్నది. సుమారుగా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది.యుద్ధాలను ప్రారంభించటం దేశాధినేతల చేతిలో ఉంటుంది కానీ ముగింపు మాత్రం వాళ్ల చేతుల్లో ఉండదని ప్రస్తుత సంక్షోభం సూచిస్తున్నది. ప్రారంభం నుండి కూడా యుద్ధ ‘అంతిమ లక్ష్యం’ ఏమిటనే దానిపై యూఎస్–ఇజ్రాయెల్ విధానంలో గందరగోళం కన్పడుతున్నది. ఇరాక్, అఫ్గాన్ యుద్ధాల్లో అగ్రశ్రేణి నాయకత్వాన్ని అంతమొందించి యూఎస్ఏ సులువుగా అక్కడి ప్రభుత్వాలను పడ గొట్టింది. ఇరాక్ అనుభవాల నేపథ్యంలో ఇరాన్ తన నాయకత్వాన్ని పూర్తిగా వికేంద్రీకరించినట్లు స్పష్టమవుతున్నది.ఇరాన్ వ్యూహంఅమెరికా–ఇజ్రాయెల్లు ఇరాన్ను తమ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నాయి. ఈ ముప్పు తప్పాలంటే మూడు లక్ష్యాలను నిర్దే శించుకున్నాయి: 1. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం. 2. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం. 3. ఇరాన్లో అధికారం మతతత్వ శక్తుల నుండి బాధ్యతా యుతమైన వర్గాలకు బదలాయింపు. ఈ మూడు లక్ష్యాలు కేవలం గగనతల యుద్ధం ద్వారా సాధించాలనుకోవటం అత్యాశ. వెని జులాలో మాదిరిగా అధ్యక్షుడిని తప్పించటంతో ప్రభుత్వం మారు తుందని ట్రంప్ భావించినట్లయితే అది హాస్యాస్పదం. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ఒక బలమైన రాజకీయ శక్తి. రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ బలమైన సాయుధ సంపత్తిని ఏర్పరచుకున్నది. రష్యా–చైనాలతో వ్యూహాత్మక సంబంధాలనుపెంపొందించుకున్నది. 2025 జూన్లో జరిగిన పన్నెండు రోజుల యుద్ధం తర్వాత ఒక సుదీర్ఘ పోరాటానికి సమగ్ర ప్రణాళికతో సున్నద్ధంగా ఉన్నట్లుగా కన్పిస్తున్నది. అందుకే ప్రస్తుత యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్ నేరుగా గల్ఫ్ దేశాలను ఈ యుద్ధం లోనికి లాగింది. ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. మధ్యప్రాచ్యంలో సంక్షోభానికి, పాలస్తీనా సంక్షోభానికి ముఖ్య కారణం యూఏఈ, సౌదీ, ఖతర్ వంటి దేశాలు యూఎస్ఏ కొమ్ముకాయటమేనని ఇరాన్ మొదటినుండీ వాదిస్తున్నది. యూఎస్ఏ మధ్యవర్తిత్వంతో అరబ్ దేశాలు 2020లో ఇజ్రా యెల్తో సంబంధాలు మెరుగు పరచుకోవటానికి ఒప్పందాలు (అబ్రహాం ఒప్పందాలు) చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా యూఏఈ, బహ్రెయిన్లు ఇజ్రాయెల్తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతర్ గత దశాబ్ద కాలంగా తమ ఆర్థిక వ్యవస్థలను కేవలం చమురు ఎగుమతులపై ఆధారపడకుండా పారిశ్రామికాభివృద్ధి, ఐటీ, పర్యాటక రంగం, బ్యాంకింగ్–ఫైనాన్స్ రంగాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తు న్నాయి. యూఎస్ఏ – ఐరోపా ఆర్థిక వ్యవస్థలతో తమ ఆర్థిక వ్యవ స్థలను అనుసంధానిస్తున్నాయి. ఇందులో భాగంగానే పాలస్తీనా (గాజా), ఇజ్రాయెల్ విషయాలలో కొంత మెతక లేదా పాశ్చాత్య సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ హమాస్ (గాజా), హెజ్బొల్లా (లెబనాన్), హౌతీ (యెమెన్) వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థలను పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో బాటుగా, లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో సౌదీ యువరాజు యూఎస్ఏ ఒత్తిడిని తట్టుకుని అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికీ నిరాకరించాడు.పోరాడితే పోయేదేమీ లేదు!ఇరాన్ – ఖతర్లలో విస్తరించిన దక్షిణ పార్స్ సహజ వాయువు నిల్వల క్షేత్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్దది. ఈ క్షేత్రం మీద దాడి ద్వారా ఇజ్రాయెల్ యుద్ధాన్ని క్లిష్ట దశలోనికి నెట్టివేసినట్లే. ఇప్పటి వరకూ యుద్ధంలో ఇరాన్ కొత్తగా ఆర్థికంగా నష్టపోయిందేమీ లేదు. ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా లక్ష్యాలను దెబ్బతీస్తున్నది. అమెరికా – ఇజ్రా యెల్ ఈ చౌక డ్రోన్లను, క్షిపణులను పేల్చి వేయటానికి అత్యంత ఖరీ దైన పేట్రియాట్, థాడ్ క్షిపణులను వాడాల్సి వస్తున్నది. ఈ రకంగా యూఎస్–ఇజ్రాయెల్లకు ఇది ఖరీదైన యుద్ధంగా పరిణమించింది.అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగటం ఇరాన్కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలోనే యూఎస్ మొదటగా ఇరాన్ చమురు ఎగుమతి కూడలి అయిన ఖర్గ్ దీవిపైనా, ఇజ్రాయెల్... ఇరాన్ ప్రధాన సహజ వాయువు క్షేత్రమైన దక్షిణ పార్స్ నిల్వలపైనా దాడి చేశాయి. ఆర్థికంగా ఇరాన్ను దిగ్బంధించటానికి ఈ ఎత్తుగడ. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయువుపట్టులపై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఖతార్ ప్రధాన ఎల్ఎన్జీ కేంద్రం ‘రస్ లఫాన్’పై దాడికి దిగింది. దీనివల్ల ఐరోపా దేశాలకు గ్యాస్ ఎగుమతికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అమెరికా– ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. అమెరికాలో కూడా ఇంధన ధరలు పెరిగిక్రమంగా ప్రజాభిప్రాయం యుద్ధానికి వ్యతిరేకంగా మారుతున్నది. రష్యాకు ఉపయుక్తంనిశితంగా పరిశీలిస్తే, యూఎస్–ఇజ్రాయెల్లకు ఈ యుద్ధాన్ని ముగించటానికి మార్గాలు చాలా తక్కువ. అవి కూడా క్లిష్టమైనవి. ఇరాన్ తనంత తానుగా బేషరతుగా లొంగిపోయి యుద్ధాన్ని విర మించే అవకాశాలు మృగ్యం. అమెరికా ప్రత్యేక దళాలను రంగంలోకి దించి, ఇరాన్ పాక్షికంగా శుద్ధి చేసిన యురేనియంను మెరుపు దాడిలో చేజిక్కించుకొని, ఆ సాకుతో యుద్ధ విరమణ చేయటం ఒక ప్రత్యామ్నాయం. కుర్ద్ తిరుగుబాటు దారులను ప్రోత్సహించి వారి ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయటం మరొక మార్గం. టర్కీ లేదా ఇరాక్ భూతల మార్గాల ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సైనిక బలగాలు ఇరాన్లో ప్రవేశించి ప్రభుత్వాన్ని కూలదోయటం అతిసంక్లిష్టమయిన ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయాలన్నింటిలో పెద్ద సంఖ్యలో యూఎస్/ఇజ్రాయెల్ సైనికులు చనిపోయే అవకాశా లున్నాయి. ఇవి వాటికి రాజకీయంగా ఆత్మహత్యా సదృశం. ఈ యుద్ధం ఒక రకంగా రష్యాకు ఉపయుక్తంగా మారినట్లుగా కన్పిస్తున్నది. రష్యా చమురు గ్యాస్కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. తప్పనిసరి పరిస్థితులలో రష్యా నుండి చమురు కొనుగోళ్ల ఆంక్షలను అమెరికా సడలించాల్సి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధంనుండి యూఎస్ఏ–ఐరోపా దృష్టి మరలటం కూడా రష్యాకు కలి సొస్తుంది. మధ్య ప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో రష్యా ప్రాపకం మరింతగా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే, అమెరికా ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో ఈ యుద్ధాన్ని ఒక భాగంగా పరిగణించవచ్చు. మధ్య ఆసియాలో ఇరాన్–ఇరాక్ సహజప్రాంతీయ శక్తులు. వీటిని బలహీనపరచటానికి యూఎస్ఏ మొదటి నుండి సౌదీ అరేబియా, యూఏఈలను బలోపేతం చేస్తున్నది. ఇదివరకు గల్ఫ్ యుద్ధంలో భాగంగా ఇరాక్ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ సందర్భంగా కూడా ఇరాక్లో అణ్వాయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్) ఉన్నాయని నింద మోపింది. ఏ రకమైన అణ్వా యుధాలు లేవని చివరకు ఒప్పుకొన్నది. ప్రభుత్వాల మార్పిడి, ముందస్తు దాడులు వంటి సిద్ధాంతాలను యూఎస్ఏ తన జియో పొలిటికల్ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్నది. ఇరాన్పై యుద్ధాన్ని కూడా ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు-గురజాల శ్రీనివాసరావు -
ఇంధన వనరులపై దాడులా?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కీలక ఇంధన వనరులపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘ప్రపంచమంతటినీ ఎంతగానో కలతకు గురి చేసే అంశమిది. ఇప్పటికే ఒడిదొడుకుల్లో ఉన్న అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను ఈ దాడులు మరింతగా దెబ్బ తీస్తాయి’’అంటూ ఆందోళన వెలిబుచ్చింది. ఇరాన్లోని సౌత్ పార్స్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడి, ప్రతీకారంగా ఖతర్లోని ఎల్ఎన్జీ క్షేత్రం రస్ లఫాన్తో పాటు సౌదీ అరేబియాలో అతి పెద్ద చమురు క్షేత్రమైన ఆరాంకోపైనా ఇరాన్ దాడులు కలకలం రేపడం తెలిసిందే. ఇవి భారత్ను తీవ్రంగా కలచివేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. పౌర సదుపాయాలు, ఇంధన వనరులపై దాడులు కూడదని భారత్ ముందునుంచీ చెబుతూనే వస్తోందని గుర్తు చేశారు. వాటికి తక్షణం తెర దించాలని గురువారం మీడియా సమావేశంలో ఆయన సూచించారు. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో 40 శాతానికి పైగా ఖతర్ నుంచి వస్తుండటం తెలిసిందే. దాడులు గర్హనీయం: మోదీ పశ్చిమాసియా తాజా పరిణామా లపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చా రు. ఈ విషయమై పలువురు దేశాధినేతలతో ఆయన వేర్వేరుగా సంభాషించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులను గురించి వారితో లోతుగా చర్చించారు. ఇంధన వ్యవస్థలపై దాడులు తీవ్రంగా గర్హనీయమన్నారు. ఉద్రిక్తతలకు తక్షణం తెర దించి శాంతి, సుస్థిరత పాదుగొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హార్మూజ్ జలసంధి గుండా సురక్షిత నౌకాయాన్ని తక్షణం పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వీటన్నింటికీ దౌత్యం, మధ్యవర్తిత్వమే మార్గాలని స్పష్టం చేశారు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు భారత్ అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. అధినేతలతో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టుల్లో ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా విషయమై ఆందోళనలతో వారంతా ఏకీభవించినట్టు తెలిపారు. ‘‘అబ్దుల్లా–2, తారిఖ్తో చర్చల సందర్భంగా జోర్డాన్, ఒమన్ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపా. ఇంధన వనరులపై దాడులను ఖండించా’’అని తెలిపారు. గత ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒమన్, జోర్డాన్ అధినేతలతో మోదీ సంభాషించడం ఇది రెండోసారి.పాక్ నైజమే అంత: భారత్న్యూఢిల్లీ: అణ్వాయుధాల వ్యాప్తికి, అధునాతన క్షిపణి వ్యవస్థల విస్తరణకు పాకిస్తాన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందంటూ ఒక నివేదికలో అమెరికా నిఘా వర్గాలు వెలిబుచ్చిన ఆందోళనతో భారత్ ఏకీభవించింది. ‘‘ఇలాంటి వేషాలు పాక్కు కొత్త కాదు. ఆ దేశం నైజమే అంత’’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ గురువారం ఎద్దేవా చేశారు. ‘‘ప్రపంచానికి పాక్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అమెరికా నివేదిక ఆ వాస్తవాన్ని మరోసారి అందరి ముందూ ఉంచంది’’ అని అభిప్రాయపడ్డారు. -
రస్ లఫాన్.. ఇండియాకు కీలకం
ఖతర్ పాలకుల దార్శనికతకు ప్రత్యక్ష రూపమే రస్ లఫాన్ సహజవాయు క్షేత్రం. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యంత అధునాతన సాంకేతికతతో సృష్టించిన అతిపెద్ద సహజవాయు ప్రాసెసింగ్ కర్మాగారంగా ‘రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీ’ ప్రఖ్యాతిగాంచింది. ఖతార్, ఇరాన్ మధ్యలోని పర్షియన్ గల్ఫ్ సముద్రగర్భంలో సహజవాయు నిక్షేపాలను కనుగొనేందుకు 1996లో రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీని నిర్మించారు. వీళ్ల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 1970 దశకంలో అపార సహజవాయు నిక్షేపాలను ఇక్కడి సముద్రగర్భంలో కనుగొన్నారు. ఇరాన్తో కలిసి గ్యాస్క్షేత్రాన్ని అభివృద్ధిచేసి ఖతర్ తన వాటాగా నార్త్ ఫీల్డ్ను తీసుకుంది. దీనినే నార్త్ డోమ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ 20 శాతం ద్రవరూప సహజవాయు అవసరాలను రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. తమ అ«దీనంలోని 900 ట్రిలియన్ల ఘనపు చదరపు అడుగుల (టీసీఎస్ఎఫ్) మేర సహజవాయువును రస్ లఫాన్ కాంప్లెక్స్ ద్వారా ఖతార్ ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇక్కడే భారీ నౌకలను నిలిపేందుకు వీలుగా ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నౌకాశ్రయాన్ని నిర్మించారు. దీంతో సీఎన్జీ కంటైనర్ షిప్లు నేరుగా ప్రాసెసింగ్ ప్లాంట్ల దాకా వచ్చి సరుకు నింపుకుని పయనమవుతాయి. ఇక్కడి నుంచి డజన్లకొద్దీ దేశాలకు ఎల్ఎన్జీ ఎగుమతి అవుతోంది. ఖతర్కు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ ప్రత్యక్షంగా భారత ద్రవరూప సహజవాయువు అవసరాలను తీరుస్తోంది. దోహా నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోని ఈ పారిశ్రామిక నగరమే భారత 45 శాతం లిక్విడ్ నేచురల్ గ్యాస్ అవసరాలను తీరుస్తోంది. ఖతర్ ఆర్థికవ్యవస్థ పునాదులను పెకళించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు పరోక్షంగా భారత్కు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఎరువులు, సీఎన్జీ, పీఎన్జీ అంతా ఇక్కడే.. భారత్లో దాదాపు 45 శాతం ఎరువుల తయారీ, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) అవసరాలు తీరాలంటే రస్ లఫాన్ క్షేత్రం నుంచి ద్రవరూప సహజవాయువు రావాల్సిందే. భారత్లో 34 శాతం ఎరువుల తయారీతోపాటు వాహనాల్లో సీఎన్జీకి, గృహావసరాలు తీర్చే పీఎన్జీకి రస్ లఫాన్ నుంచి దిగుమతి చేసుకునే ద్రవరూప సహజవాయవునే ఉపయోగిస్తున్నారు. పరిశ్రమల్లో పెట్రోరసాయనాల తయారీకి సైతం ఇదే ఎల్ఎన్జీ అవసరం. కొంతమేర భారత విద్యుత్ అవసరాలనూ ఇదే గ్యాస్ తీరుస్తోంది. అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి పోలిస్తే భారత్ రస్ లఫాన్ క్షేత్రం నుంచి ఎల్ఎన్జీ దిగుమతి చేసుకోవడమే అత్యంత చవకైన వ్యవహారం. అందుకే భారత్ దీనిపైనే అధికంగా ఆధారపడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2028లో భారత్లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న భారత్కు 2028లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహించే అవకాశం దక్కింది. నేటినుంచి పోలాండ్ వేదికగా ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026 ప్రారంభం కానుండగా... అంతకంటే ఒక్క రోజు ముందు గురువారం 2028 ఆతిథ్య హక్కులు భారత్కు దక్కినట్లు వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వెల్లడించింది. భువనేశ్వర్లో ఈ పోటీలు జరుగుతాయి. అయితే శుక్రవారం నుంచి జరిగే పోటీల్లో మన దేశం నుంచి ఒక్క అథ్లెట్ కూడా పాల్గొనడం లేదు! ఈ ఏడాది ఆరంభంలో ఈ ఆతిథ్య హక్కుల కోసం న్యూజిలాండ్తో పాటు భారత్ బిడ్ వేయగా... మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం సంతృప్తి చెందిన కౌన్సిల్ భువనేశ్వర్ను వేదికగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో జపాన్ (1999), ఖతర్ (2010), చైనా (2025) మాత్రమే ఈ చాంపియన్షిప్నకు ఆతిథ్యమివ్వగా... ఇప్పుడు భారత్ నాలుగో దేశంగా నిలవనుంది. -
హ్యాపినెస్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?
వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026 మార్చి 19న విడుదలైంది. ఈ నివేదికలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదో ఏడాది ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ రూపొందించిన ఈ నివేదికలో జీవన సంతృప్తి, సామాజిక మద్దతు, అవినీతి తక్కువ స్థాయిలు వంటి అంశాలు ప్రధానంగా పరిగణించబడ్డాయి.ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో ఐస్లాండ్ రెండో స్థానంలో, డెన్మార్క్ మూడో స్థానంలో నిలిచాయి. లాటిన్ అమెరికా దేశమైన కోస్టా రికా నాలుగో స్థానాన్ని సాధించడం విశేషం. ఇది ఆ దేశానికి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ర్యాంక్. స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వరుసగా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. భారత్ ఎక్కడ..?ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన 147 దేశాల జాబితాలో భారత్ 116 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రెండు స్థానాలు మెరుగుపడింది. 2025లో ఈ జాబితాలో భారత్ 118 స్థానంలో ఉండింది.చిట్టచివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్అతి తక్కువ సంతోషకరమైన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ దేశం 147వ స్థానానికి పరిమితం కాగా.. దానికి ముందు స్థానాల్లో నియెర్రా లియోన్, మాలావీ, జింబాబ్వే, బోట్స్వానా వంటి దేశాలు ఉన్నాయి.అమెరికాలో సంతోషం క్రమంగా తగ్గిపోతుంది..!వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026లో అమెరికా 23వ స్థానంలో నిలిచింది. గత కొద్ది రోజులుగా ఈ జాబితాలో అమెరికా ర్యాంక్ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. 2022లో 15వ స్థానంలో ఉండిన ఆ దేశం.. నాలుగేళ్లు తిరిగేసరికి 8 స్థానాలు దిగజారి 23వ స్థానానికి పడిపోయింది.ఈ జాబితాలో అమెరికా సహా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు ఒక్కటి కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. నార్డిక్ దేశాలు మళ్లీ అగ్రస్థానాలను ఆక్రమించాయి. ఈ దేశాల్లో సామాజిక మద్దతు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, తక్కువ అవినీతి వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని పెంచుతున్నాయని నిర్ధారించబడింది. కోస్టా రికా లాంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంస్కృతిక విలువలతో సంతోష సూచీలో గణనీయమైన పురోగతి సాధించాయి. అమెరికా, భారత్ వంటి పెద్ద దేశాలు సంతోష సూచీలో వెనుకబడటానికి ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక విభజన, రాజకీయ అస్థిరత వంటి అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ నివేదికలో సోషల్ మీడియా, టెక్నాలజీ ప్రభావం వెల్బీయింగ్పై ఎలా ఉందో ప్రత్యేకంగా విశ్లేషించారు. -
ఏఐలో భారత్కి ప్రత్యేక స్థానం: కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో భారత్కి విశిష్ట స్థానం ఉందని టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్ బాబక్ హోద్జాత్ తెలిపారు. డిజిటల్ సిస్టమ్లు, ప్రక్రియల గురించి అపార అవగాహన ఉన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం ఇందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.ఏఐ సిస్టమ్లను రూపొందించడంలో, వివిధ పరిశ్రమలవ్యాప్తంగా వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఈ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఏఐ సాధనాలతో కోడింగ్ సులభతరమవుతున్నప్పటికీ, ఔట్పుట్ నాణ్యతను మదింపు చేయడానికి డెవలపర్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన చెప్పారు.వివిధ రంగాలవ్యాప్తంగా మరింత మంది ప్రొఫెషనల్స్కి ఏఐ సాధికారత కల్పిస్తోందని వివరించారు. కంపెనీలు కృత్రిమ మేథ టెక్నాలజీలను వినియోగించుకోవడంలో సహకరించే దిశగా కాగ్నిజెంట్ ఇప్పుడు ఏఐ బిల్డర్ కంపెనీగా రూపాంతరం చెందిందని బాబక్ చెప్పారు.ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కంపెనీలో అంతర్గతంగా కోడ్ జనరేషన్లో ఏఐ వాటా సుమారు 30 శాతంగా ఉండగా, ఇది గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. -
ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. ఖతార్లోని అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ రాస్ లాఫ్ఫాన్పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ తమపై చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ దాడి చేసింది. అలాగే, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తుండడంతో భారత్ వంటి దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరులు ఉన్న దేశాలు ఇరాన్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఫ్యాక్టరీపై దాడి జరిగిన వెంటనే అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా ఎల్ఎన్జీ ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఖతార్పై ఇరాన్ దాడి మొదటి సారికాదు. మార్చి మొదటి వారంలో ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపింది. ఖతార్ గ్యాస్ క్షేత్రాలు, రాస్ లాఫ్ఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు.. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిగా జరిగినవని సమాచారం.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ నాయకత్వంపై వరుస దాడులు చేశాయి. తాజా దాడిలో గూఢచారి విభాగం అధిపతి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యాడు. ఇరాన్లో వేల సంఖ్యలో మరణాలు జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలను తగ్గిస్తోంది.భారత్పై ప్రభావం ఈ పరిస్థితులు భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో సుమారు 50 శాతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం ఖతార్ నుంచే వస్తుంది.“భారత్ తన సహజ వాయువు అవసరాల్లో 50% విదేశీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంది. అందులో సుమారు 40% ఎల్ఎన్జీ ఖతార్ నుంచి వస్తుంది. అంటే మొత్తం దిగుమతుల్లో దాదాపు 20 శాతం కతార్ నుంచే. భారత్ గ్యాస్ వినియోగాన్ని తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ రంగంలో వినియోగం తగ్గించాలి” అని ఇంధన ఆర్థిక నిపుణుడు కిరిట్ పారిఖ్ తెలిపారు.ప్రస్తుతం భారత్ రోజువారీ సహజ వాయువు వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 97.5 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు దేశీయంగా ఉత్పత్తి అవుతుంది.గత వారం నాటికి 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇది దిగుమతుల్లో భాగం. ఫోర్స్ మజ్యూర్ పరిస్థితుల వల్ల ఈ అంతరాయం జరిగింది. దీంతో ప్రభుత్వ గ్యాస్ సంస్థలు ఇతర సోర్సుల నుంచి ఎల్ఎన్జీ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. -
ముంబై నిద్రపోదు.. ఢిల్లీ త్వరగా లేవదు.. మన భాగ్యనగరం?
ఉరుకుల పరుగుల నగర జీవితంలో భారతీయులు ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఒక కీలక విషయాన్ని విస్మరిస్తున్నారు.. అదే ‘కంటినిండా నిద్ర’. తాజాగా వెలువడిన ఒక జాతీయ సర్వే నివేదిక ప్రకారం.. భారతీయ నగరాల్లో నిద్ర నాణ్యత ఆందోళనకరంగా పడిపోతోంది. ముఖ్యంగా ముంబై నగరం దేశంలోనే అత్యధికంగా నిద్రలేమితో సతమతమవుతుండగా, ఢిల్లీ వాసులు ఆలస్యంగా నిద్రలేవడంలో రికార్డు సృష్టించారు. మరి మన హెదరాబాద్ పరిస్థితి ఏమిటి?ఆరోగ్యానికి నిద్రే ప్రాణాధారంశారీరక ఆరోగ్యానికే కాకుండా, మెదడు పనితీరుకు, మానసిక స్థిరత్వానికి తగినంత నిద్ర అత్యవసరం. నిద్ర తక్కువైతే ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలంలో గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, ఆందోళన (Anxiety) వంటి సమస్యలకు దారితీస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా భారతీయులు నిద్రకు దూరమవుతున్నారు.నగరాల వారీగా నిద్ర తీరు తెన్నులుWakefit.co నిర్వహించిన తాజా సర్వే (జనవరి 2025 - మార్చి 2026 మధ్య) భారతీయ మెట్రో నగరాల్లో నిద్ర అలవాట్లపై ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.ముంబై (అత్యంత నిద్రలేమి నగరం): ముంబై వాసుల్లో 76.5 శాతం మంది అర్ధరాత్రి దాటాక నిద్రపోతున్నారు. దాదాపు 60 శాతం మంది పనివేళల్లో కూడా నిద్రతో తూగుతున్నట్లు సర్వే పేర్కొంది.హైదరాబాద్ (సమతుల్య నగరం): మన భాగ్యనగరం ఇతర మెట్రోలతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉంది. ఇక్కడ 42 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతుండగా, 31 శాతం మంది మాత్రమే నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్ని సర్వే 'బ్యాలెన్స్డ్ స్లీపర్ సిటీ'గా అభివర్ణించింది. ఢిల్లీ (ఆలస్యంగా మేల్కొనే నగరం): దేశ రాజధానిలో 45 శాతం మంది ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం.చెన్నై (క్రమశిక్షణ కలిగిన నగరం): నిద్ర వేళల విషయంలో చెన్నై వాసులు కొంత క్రమశిక్షణ పాటిస్తున్నారు. కేవలం 23.8 శాతం మంది మాత్రమే ఆలస్యంగా నిద్రలేస్తున్నారు.కోల్కతా (లేట్ నైట్ సిటీ): ఇక్కడ 75.5 శాతం మందికి రాత్రిపూట చాలా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంది.బెంగళూరు (నిద్ర వైరుధ్యం): ఐటీ హబ్లో 36.3 శాతం మంది అర్ధరాత్రి దాటాక పడుకుంటున్నారు. అయితే నిద్రలేచిన తర్వాత కూడా 54 శాతం మంది తాము విశ్రాంతి పొందినట్లు భావించడం లేదని వెల్లడయ్యింది.విలన్లుగా మారిన స్మార్ట్ఫోన్లుభారతీయులు నిద్రకు దూరం కావడానికి ప్రధాన కారణం డిజిటల్ వ్యసనమేనని సర్వే స్పష్టం చేసింది. దాదాపు 87.6 శాతం మంది పడుకునే ముందు మొబైల్ ఫోన్లు చూస్తున్నట్లు అంగీకరించారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, ఓటీటీలో బింజ్ వాచింగ్ వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్పాదకతపై పడుతోంది. సుమారు 57.8 శాతం మంది ఆఫీసు పనివేళల్లో నిద్ర వస్తోందని వాపోతున్నారు.ఆందోళనకర గణాంకాలుమరో జాతీయ స్థాయి సర్వే (89,000 మంది స్పందనలు) ప్రకారం 46 శాతం మంది భారతీయులు రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారు. రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోయే వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం.నిపుణుల సూచనలుమంచి నిద్ర కోసం రాత్రిపూట స్క్రీన్ టైమ్ తగ్గించాలని, సరైన సమయానికి భోజనం చేసి, బెడ్రూమ్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రను సమతుల ఆరోగ్యానికి ప్రాథమిక అవసరంగా గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు -
పురుషుల జట్టుకు సులువు మహిళల జట్టుకు క్లిష్టం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లకు భిన్నమైన ‘డ్రా’లు ఎదురయ్యాయి. 2022లో తొలిసారి థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత పురుషుల జట్టు ఈసారి స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం ఖాయం. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, కెనడా, ఆ్రస్టేలియా జట్లతో భారత్కు చోటు కల్పించారు. చైనాను మినహాయిస్తే కెనడా, ఆ్రస్టేలియా జట్లపై భారత్ విజయాన్ని ఊహించవచ్చు. రెండు విజయాలు సాధిస్తే భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది. మరోవైపు ఉబెర్ కప్లో భారత మహిళల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఆతిథ్య దేశం డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంటుంది. ఉక్రెయిన్పై టీమిండియా సులువుగా గెలవచ్చు. కానీ చైనా, డెన్మార్క్ జట్లపై భారత్ విజయావకాశాలు స్వల్పమే. ఈ నేపథ్యంలో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరాలంటే చైనా లేదా డెన్మార్క్ జట్లలో ఒకదానిపై ఖచ్చితంగా నెగ్గాలి. భారత మహిళల జట్టు 2014, 2016లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. రెండు విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొనే థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్లోని హోర్సెన్స్ నగరంలో జరుగుతుంది. 2024 థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీలో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో చైనా చేతిలో... భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో ఓడిపోయాయి. -
భారీ ఊరట : చైనాకు వెళ్లాల్సిన 7 రష్యా ట్యాంకర్లు భారత్వైపు
చైనాకు వెళ్లాల్సిన 7 చమురు ట్యాంకర్లు దక్షిణ చైనా సముద్రంలో యూ-టర్న్ తీసుకుని భారత్వైపు మళ్లడం అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కీలకంగా మారింది. రష్యా చమురు నౌకలు చైనా వైపు కాకుండా భారత్ వైపు మళ్లడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు. మాస్కో నుండి దిగుమతులను న్యూఢిల్లీ రెట్టింపు చేయడం ప్రారంభించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.దక్షిణ చైనా సముద్రం గుండా ప్రయాణిస్తూ, మొదట చైనాకు వెళ్లాల్సిన ఏడు రష్యన్ చమురు ట్యాంకర్లు అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకున్నాయి షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, 'ఆక్వా టైటాన్' అనే ఈ నౌక, జనవరి చివరలో బాల్టిక్ సముద్ర ఓడరేవు నుండి లోడ్ చేసుకున్న యురల్స్ కార్గో మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనుంది. సూయజ్మాక్స్ జౌజౌ ఎన్. భారతదేశంలోని సిక్కాకు మార్చి 25న చేరుకుంటుందని అంచనా.రష్యా నుండి కొనుగోళ్లను తాత్కాలికంగా పెంచుకోవడానికి భారతదేశానికి అమెరికా అనుమతి ఇచ్చిన కొద్ది రోజులకే, ఈ అఫ్రామాక్స్ నౌక మార్చి మధ్యలో చైనాలోని రిజావో ఓడరేవుకు చేరాల్సి ఉంది. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!ఎందుకిలా?రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా భారతదేశానికి 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల భారత్ ఎటువంటి ఆంక్షల భయం లేకుండా రష్యా చమురును దిగుమతి చేసుకునే అవకాశం కలిగింది. అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై యుద్ధం ప్రారంభించడంతో, ఇరాన్ ప్రతిచర్యగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేసింది. దీనివల్ల మధ్యప్రాచ్యం నుండి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ వ్యాప్తం చమురు సంక్షోభం ఏర్పడింది. ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగి, ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు 120 డాలర్లకు చేరుకుంది.ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఇంధన భద్రత కోసం భారత్ రష్యాపై మరింతగా ఆధారపడుతోంది.ఈ ఏడు ట్యాంకర్ల రాకతో దేశీయంగా పెరుగుతున్న చమురు ధరల నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని చైనాకు వెళ్లాల్సిన వనరులు ఇప్పుడు భారత అవసరాలకు ఉపయోగపడనున్నాయని అంచనా ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
మాట నిలబెట్టుకున్న ఇరాన్.. హార్ముజ్ నుంచి భారత్ చేరిన భారీ ఆయిల్ షిప్
-
ఇరాన్ కు భారత్ మానవతా సాయం
-
ఖతార్ విమానాల్లో స్వదేశానికి 1,600 మంది
దోహా: ఖతార్ గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ మంగళవారం ఐదు ఖతార్ ఎయిర్ వేస్ విమానాల ద్వారా సుమారు 1,600 మంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. రెండు విమానాలు ఢిల్లీ, ముంబై, కొచ్చి, తిరువనంతపురంలకు ఒక్కోటి చొప్పున విమానాలు వెళ్లాయని అక్కడి భారత దౌత్య కార్యాలయం తెలిపింది.ఖతార్ ఎయిర్వేస్ పరిమిత సంఖ్యలో, నాన్ షెడ్యూల్డ్ విమాన సర్వీసులను మాత్రమే నడుపు తోందని వివరించింది. బుధవారం భారత్లోని తొమ్మిది గమ్యస్థానాలకు మరిన్ని విమానాలు నడుస్తాయని, సీట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. సల్వా భూ సరిహద్దు దాటి సౌదీ అరేబియా మీదుగా భారత్ చేరుకోవాలనుకునే భారతీయ పౌరులకు తాత్కాలిక సౌదీ ట్రాన్సిట్ వీసాల జారీ కొనసాగుతోందని కూడా తెలిపింది. -
ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్
లుసానే (స్విట్జర్లాండ్): హాకీ వరల్డ్ కప్లో పాల్గొనే జట్ల గ్రూప్ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వెల్లడించింది. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉన్న డచ్ హాకీ క్రీడాకారిణి నవోమీ వాన్ ఆజ్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో, మహిళల విభాగంలో ఒకేసారి ప్రపంచకప్లను నిర్వహిస్తుండటం విశేషం. బెల్జియం, నెదర్లాండ్స్లలో ఆగస్టు 14 నుంచి 30 వరకు పోటీలు జరుగుతాయి. రెండు మెగా టోరీ్నలకు సంబంధించిన వేర్వేరు మస్కట్లను కూడా ఎఫ్ఐహెచ్ విడుదల చేసింది. వరల్డ్ కప్లో మొత్తం 16 జట్ల చొప్పున పాల్గొంటున్నాయి. ఒక్కో పూల్ నుంచి టాప్–2 జట్లు ముందంజ వేస్తాయి. ఎనిమిది టీమ్లతో రెండో దశ నిర్వహిస్తారు. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. పురుషుల విభాగంలో పూల్ ‘డి’లో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ పూల్లో భారత్తో పాటు పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. మహిళల విభాగంలో భారత్ పూల్ ‘డి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, చైనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్ మ్యాచ్ల పూర్తిస్థాయి షెడ్యూల్ను నేడు ప్రకటిస్తారు. 2022లో జరిగిన వరల్డ్ కప్లో జర్మనీ, నెదర్లాండ్స్ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. పూల్ల వివరాలు పురుషుల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్; పూల్ ‘బి’: బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, మలేసియా; పూల్ ‘సి’: ఆ్రస్టేలియా, స్పెయిన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా; పూల్ ‘డి’: భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్. మహిళల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా, చిలీ, జపాన్; పూల్ ‘బి’: అర్జెంటీనా, జర్మనీ, అమెరికా, స్కాట్లాండ్; పూల్ ‘సి’: బెల్జియం, స్పెయిన్, న్యూజిలాండ్, ఐర్లాండ్; పూల్ ‘డి’: భారత్, ఇంగ్లండ్, చైనా, దక్షిణాఫ్రికా. -
ఉత్తరాలే కాదు.. ఇక లాభాలూ డెలివరీ!
చిన్న పొదుపులు ఇపుడు పెద్ద పెట్టుబడుల దిశగా అడుగులు వేయనున్నాయి.పెట్టుబడుల్లో కొత్త అధ్యాయానికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై మీ ఇంటి పక్కన ఉండే పోస్టాఫీసు కేవలం ఉత్తరాలు, సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే పరిమితం కాదు. స్టాక్ మార్కెట్ లాభాలను సామాన్యులకు అందించేలా మ్యూచువల్ ఫండ్స్ అమ్మకానికి సిద్ధమవుతోంది. భారత తపాలా శాఖ, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) చేతులు కలపడంతో దేశవ్యాప్తంగా పెట్టుబడుల విప్లవం రాబోతోంది.పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్తో మ్యూచువల్ ఫండ్లు గ్రామీణ ప్రాంతాలతో పాటు, మారు మూల పల్లెలకూ చేరే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన పెంచి, సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిని చేయాలనే సంకల్పంతో పోస్టాఫీసుల ద్వారా ఈ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు యాంఫి సీఈఓ వెంకట్ చలసాని చెప్పారు. పోస్ట్ ఆఫీసుల నెట్వర్క్తో మ్యూచువల్ ఫండ్లు మెట్రోల నుంచి మండలాలు, పల్లెలోకి అడుగుపెడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో మహారాష్ట్రే దేశంలో అగ్రస్థానంలో ఉంది దేశ మొత్తం ఫండ్ ఆస్తుల్లో 40శాతానికి పైగా వాటా ముంబై, పుణె నగరాలదే. దీంతో మహారాష్ట్రలోని ముంబై, పూణె, నాగపూర్, ఔరంగాబాద్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా తపాలాశాఖ మ్యూచువల్ ఫండ్స్ విక్రయానికి తెరతీసింది. అది విజయవంతం కావడంతో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండో దశలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా పదివేల మంది పోస్టల్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎంపిక చేసిన సిబ్బందికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ శిక్షణ ఇస్తుంది. సర్టీఫై అయిన ఉద్యోగులు పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీములను విక్రయిస్తారు. యాంఫి డి్రస్టిబ్యూటర్గా వ్యవహరిస్తుంది. చిన్న పట్టణాలపై ఫోకస్ దేశంలోని మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో 80 శాతం టాప్ 10 నగరాల నుంచే వస్తున్నాయి. 65 శాతం మందికి అవగాహన ఉన్నా, కేవలం 7 శాతం మాత్రమే అంటే 6 కోట్ల మందే పెట్టుబడి పెడుతున్నారు. గ్రామీణప్రాంతాల, పల్లెలదాకా విస్తరిస్తే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని యాంఫి అంచనా వేస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ బడ్జెట్ బూస్ట్ఒక్కో కొత్త ఇన్వెస్టర్కు రూ2,000 ప్రోత్సాహకం 2026 బడ్జెట్లో ప్రతి కొత్త మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కు రూ2,000 ప్రోత్సాహకాన్ని ఆరి్ధక మంత్రి ప్రకటించారు. పోస్టల్ సిబ్బందికి ఈ ప్రోత్సాహకంలో భాగస్వామ్యం కల్పించే విధానాన్ని తపాలాశాఖ రూపొందిస్తోంది. ఇది వారి రెగ్యులర్ కమిషన్కు అదనంగా ఉంటుంది. 2025 ఆగస్టు నుంచి అమల్లోకి వచి్చన ఈ ఒప్పందం 2028 ఆగస్టు వరకు మూడేళ్ల పాటు ఉంటుందని యాంఫి వెల్లడించింది. -
ఆత్మనిర్భరతకు సామ్రాజ్యవాద సవాల్
నాలుగు కీలకమైన అంశాల్లో విదేశాలపై ఆధారపడటం ద్వారా స్వతంత్ర భారతదేశం తన అభివృద్ధి ప్రక్రియకు శ్రీకారం చుట్టుకుంది. అవి ఆహారం, విదేశీ మారకద్రవ్యం, రక్షణ సామగ్రి, ఇంధనం. దేశం 1957–58లో ఎదుర్కొన్న విదేశీ మారక ద్రవ్య సంక్షోభం బయట నుంచి ఎదురు కాగల ద్రవ్యపరమైన అవరోధాలను వెల్లడించింది. చైనాతో 1962లో రేగిన యుద్ధం రక్షణ సామగ్రి కొరతను బహిర్గతం చేసింది. 1965–67లో ఏర్పడిన దుర్భిక్ష పరిస్థితులు ఆహార దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడి ఉన్నామో తెలిపాయి. గల్ఫ్ యుద్ధం (1990) చమురు ధరలు ఒక్కసారిగా పెరగడానికి దారితీసి, విదేశీ మారక ద్రవ్య చెల్లింపులలో సంక్షోభానికి పురికొల్పింది. అప్పటి ప్రభుత్వాలు ఆ యా సంక్షోభాల నుంచి ఆర్థిక, విదేశాంగ విధాన పాఠాలను నేర్చుకున్నాయి. విదేశాంగ విధానంపై ఒత్తిడిచైనాతో యుద్ధ (1962) కాలంలో రక్షణ పరికరాల లోటుతో అప్పటి ప్రధాని నెహ్రూ గత్యంతరం లేక అమెరికా సాయాన్ని కోరవలసి వచ్చింది. అమెరికా–వియత్నాం యుద్ధంలో భారత్ వైఖరిని మార్పు చేసేందుకు ఆహార ఎగుమతులను పావుగా వాడుకునేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ప్రయత్నించారు. చమురు ధరలు 1990లో అమాంతం పెరిగాయి. తదనంతరం, 1991లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిన సంక్షోభంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ దగ్గర భారత్ చేయి సాచాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ను దౌత్యపరంగా గుర్తించడం దాని పర్యవసాన ఫలితమే. ఈమధ్య కాలంలో, ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత, జి–7 (కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా) దేశాలు బ్యాంక్ ఖాతాలను స్థంభింపజేయడం వంటి చర్యలతో ఆర్థిక లావాదేవీలను ఒక ఆయుధంగా మలచుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంధన సరఫరాలను ఒక ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టారు. ఇవి విదేశాంగ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించేందుకు అడ్డుపడుతున్నాయి. స్వావలంబనను సాధించడం వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమో తెలియజెబుతున్నాయి. నమ్మక ద్రోహంఅన్ని రకాల వాణిజ్యాలను ముఖ్యంగా ఇంధనం, రక్షణ సామగ్రిని, అధునాతన, కీలక టెక్నాలజీలను ఆయుధంగా వాడుకునే ప్రస్తుత విధానాన్ని అమెరికా ఇకముందు కూడా కొనసాగిస్తుందని మన జాతీయ భద్రతా నిర్వాహకులు గుర్తెరగవలసి ఉంది. గత ఫిబ్రవరిలో అమెరికా–భారత్ చేసిన సంయుక్త ప్రకటన కొంత ఆశలను రేకెత్తించింది కానీ, కడచిన పన్నెండు నెలల పరిణామాలు, అటువంటి భ్రమలేవీ పెట్టుకోకపోవడం మంచిదని సూచిస్తున్నాయి. సైనిక భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను పెంపొందించపజేసుకోవాలని, 21వ శతాబ్దానికి అవసరమైన వాణిజ్యం, టెక్నాలజీలను వేగవంతం చేసుకోవాలని నిర్ణయించుకున్న భారత్–అమెరికా దానికి సంక్షిప్తంగా ఇంగ్లీషులో ‘కాంపాక్ట్’ అనే సంకేత నామాన్ని కూడా పెట్టుకున్నాయి. ‘ట్రస్ట్’గా మరో సంక్షిప్త నామంతో పిలుచుకుంటున్న ఒప్పందం పైన కూడా మోదీ, ట్రంప్ సంతకాలు చేశారు. వ్యూహాత్మక టెక్నాలజీని వినియోగించుకుంటూ అమెరికా–భారత్ తమ సంబంధాలను రూపాంతరం చెందించుకుంటున్నాయని ఆ మాటకు అర్థం. ‘ఇంధనం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేటట్లు చూసేందుకు, ఇంధన మార్కెట్లలో ధరల స్థిరీకరణకు’ వాగ్దానం చేసిన ప్రకటన పైన కూడా ట్రంప్ సంతకం చేశారు. ఆ వాగ్దానానికి విరుద్ధంగా నడచుకోవడం ద్వారా ట్రంప్, గత 25 ఏళ్ళుగా భారత్–అమెరికా మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు సాగుతున్న కృషికి తిలోదకాలిచ్చారు. గత పదిహేను రోజుల పరిణామాలు చూశాక, ఇంధన భద్రత విషయంలో ట్రంప్ నేతృత్వంలోని అమెరికాను ఇక ఎంతమాత్రం నమ్మడానికి లేదని భారత్ గ్రహిస్తోంది. పశ్చిమాసియా ఘర్షణలు భారత్ ఇంధన భద్రతకే కాక, ఈ ప్రాంతంలో భారత్ సమీకరించుకోగల ఆర్థిక ప్రయోజనాలకు కూడా చేటు తెస్తాయి. గల్ఫ్లో భారత్ సముపార్జించుకున్న భౌగోళిక–ఆర్థిక ప్రాబల్యానికి అమెరికా–ఇజ్రాయెల్ చర్య ఎసరు పెట్టింది. ఆ రెండు దేశాలు ఒక రకంగా నమ్మక ద్రోహానికి పాల్పడ్డాయి. అవి చేసిన తప్పిదాన్ని ప్రధాని ధైర్యంగా పార్లమెంట్లో ప్రకటించగలగాలి. ట్రంప్ ఆర్థిక–భౌగోళిక రాజకీయ విధానాలు ఏ దిశగా సాగుతున్నాయో తెలుస్తోంది. కనుక, ట్రంప్ పదవీ కాలంలో, అమెరికాతో ఇక ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మనం సుముఖత చూపకపోవడం మంచిది. మోదీ ప్రభుత్వ ‘ఆత్మనిర్భరత’ విధానం, అమెరికా అనుసరిస్తున్న ‘నయా–సామ్రాజ్యవాద’ విధాన సవాల్కు ఎదురొడ్డి తీరాలి. స్వావలంబన మనకు మనం సాధించుకునేది. అది ఎవరో మంజూరు చేస్తే వచ్చేది కాదు. మూడు దేశాలతో జాగ్రత్త!ఈ బాహ్యపరమైన ఒత్తిడులు కొత్తగా వచ్చిపడుతున్నవి కావు. వాటిని సజావుగా ఎదుర్కొంటూనే భారత్ ముందుకు సాగుతూ వచ్చింది. ప్రస్తుతం, ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరింత అస్థిరంగా, క్లిష్టమైనవిగా పరిణమిస్తున్నాయి. దాంతో మనవైపు కొత్త దుర్బలత్వాలు బయటపడుతున్నాయి. భారతీయ సంతతకి చెందిన వారిని భారత్ చాలా కాలంగా ‘సున్నితమైన శక్తి’గా పరిగణిస్తూ వచ్చింది. విదేశీ మారక ద్రవ్య వనరుగా చూస్తూ వచ్చింది. ట్రంప్ అనుసరిస్తున్న వలస వ్యతిరేక, ‘అమెరికా ఫస్ట్’ విధానాలు, గల్ఫ్లో యుద్ధం, భారతీయ సంతతికి చెందినవారి బలహీన పునాదులను బయటపడేటట్లు చేస్తున్నాయి. పైపెచ్చు, అమెరికా, దాని మిత్ర దేశాలు తమ దేశాల్లో నివసిస్తున్న భారతీయులను చూపి, మన విధానాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విధంగా, వాటి ఘర్షణల్లోకి మనల్ని లాగుతున్నాయి. బయట నుంచి మనల్ని భయపెట్టే పోకడలను కడసారిగా 1960లు, 1970లలో, ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో చూశాం. మనం అలీన విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, బాహ్య పాత్రధారులకు భారత్ ఒక రంగస్థలంలా మారింది. మరోసారి అదే రకమైన కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలానికీ, ఇప్పటికీ మధ్య ఒక వైచిత్రి ఉంది. ఒకవైపు భారత్ ఇపుడు మరింత అభివృద్ధి చెందిన, మరింత పలుకుబడి చూపగలిగిన దేశంగా అవతరించిందికానీ, మరోవైపు మరింత దుర్భలమైనదిగా, బాహ్య ప్రభావానికి లోనయ్యేదిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. అనేక రకాల విధానాల విషయంలో ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకున్నట్లుగా మోదీ కనిపిస్తున్నారు. పాలనాపరమైన ముద్రను చాటడంలో ఆయన అచ్చం ఇందిరను తలపిస్తారు. కానీ, బాహ్యపరమైన ఒత్తిడులకు లొంగకుండా ఎదురు నిలవడంలో ఆమెకున్న నిబ్బరాన్ని ఆయన ఇంకా సమీకరించుకున్నట్లు లేదు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పడం బాగానే ఉంది కానీ, అగ్ర దేశాల తప్పులను ఎత్తి చూపడంలోనూ అదే రకమైన తెగువను ప్రదర్శించాలి. మూడు (అమెరికా, రష్యా, చైనా) దేశాలతో సంబంధాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వేటిపై ఆధారపడుతున్నామో అవి మనల్ని లొంగదీసుకునే ఆయుధాలుగా ఉపయోగించుకోకుండా చూసుకోవాలి.సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మీడియా సలహాదారు -
వాణిజ్య లోటు ఊరట
న్యూఢిల్లీ: దేశం నుంచి గత నెలలో వివిధ వస్తువుల (మెర్కండైజ్) ఎగుమతులు వార్షికంగా 0.8 శాతం క్షీణించి 36.61 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతేకాకుండా ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 27.1 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అయితే పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కావడంతో ఈ ప్రభావం మార్చి నెల వాణిజ్య గణాంకాలపై కనిపించనుంది.మార్చి గణాంకాలు మే నెల మధ్యలో విడుదలవుతాయి. కాగా.. రవాణాపై రాజకీయ, భౌగోళిక సవాళ్లు ప్రభావం చూపడంతో మార్చిలో ఎగుమతులు క్షీణించనున్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ఫిబ్రవరిలో దిగుమతులు 24 శాతంపైగా ఎగసి 63.71 బిలియన్ డాలర్లను తాకాయి. ఇందుకు పసిడి, వెండి దిగుమతులు కారణమయ్యాయి.గోల్డ్ షిప్మెంట్స్ 219 శాతం జంప్చేసి 7.44 బిలియన్ డాలర్లకు చేరగా.. సిల్వర్ దిగుమతులు 285 శాతంపైగా ఎగసి 1.66 బిలియన్ డాలర్లయ్యాయి. మరోపక్క ముడిచమురు దిగుమతులు 9 శాతం అధికమై 12.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే జనవరిలో నమోదైన 34.68 బిలియన్ డాలర్లతో పోలిస్తే గత నెలలో వాణిజ్య లోటు తగ్గింది. వార్షికంగా అంటే 2025 ఫిబ్రవరిలో నమోదైన 14.05 బిలియన్ డాలర్లతో చూస్తే భారీగా పెరిగింది. 11 నెలల్లో..: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– ఫిబ్రవరి కాలంలో దేశ ఎగుమతులు దాదాపు 2 శాతం పుంజుకుని 402.93 బిలియన్ డాలర్లను తాకాయి. ఇదే కాలంలో దిగుమతులు 8.5 శాతం పెరిగి 713.53 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఈ ఏడాది(2025–26) తొలి 11 నెలల్లో వాణిజ్య లోటు 310.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో ఈ లోటు 261.8 బిలియన్ డాలర్లు మాత్రమే.అమెరికాకు ఎగుమతులు డౌన్అధిక టారిఫ్ల భారం కారణంగా అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు ఫిబ్రవరిలో 6.88 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12.88 శాతం తగ్గాయి. భారత్పై అమెరికా 50% పైగా సుంకాలు విధించడం, తర్వాత అక్కడి సుప్రీంకోర్టు వాటిని కొట్టివేయడంతో తిరిగి 150 రోజుల వ్యవధికి 10% విధించడం తెలిసిందే. సుంకాల తగ్గుదల ప్రభావం మార్చి ఎగుమతుల గణాంకాల్లో తెలియనుంది. 11 నెలల వ్యవధిలో..: ఇక ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల వ్యవధిలో అమెరికాకు ఎగుమతులు 3.84% పెరిగి 79.29 బి.డాలర్లకు, దిగుమతులు 15.65% పెరిగి 48.4 బి.డాలర్లకు చేరాయి. మరోవైపు, చైనాకు ఎగుమతులు 37.66% పెరిగి 17.54 బి. డాలర్లకు, దిగుమతులు 119.55 బి. డాలర్లకు ఎగిశాయి. -
USAలో ఆలయాల దాడులపై ఆలోచించండి: రణధీర్ జైశ్వాల్
ఢిల్లీ: భారత్లో మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికాలోని USCIRF కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. అమెరికా ఇతర దేశాల సంస్థలపై నివేదికలు ఇవ్వడం బదులు ఆ దేశంలో హిందువుల ఆలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.అమెరికాకు చెందిన (USCIRF) కమిషన్ భారత్లో మతస్వేచ్ఛకు సంబంధించిన విషయాలపై అధ్యయనం చేసింది. భారత్లో క్రమపద్ధతిలో, మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కనుక భారత్ను ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదించింది. దానితో పాటు మతస్వేచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడుతన్నందుకు భారత్కు చెందిన RAW రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ,RSS సంస్థలకు చెందిన వ్యక్తులు మరియు సంస్థల ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొంది.తాజాగా దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. " అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ ఇచ్చిన తాజా నివేదికను మేము పరిశీలించాము. భారతదేశంపై చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాము. అవి ప్రేరేపితమైనవి మరియు పాక్షికమైనవి. గత కొన్ని సంవత్సరాలుగా USCIRF భారతదేశాన్ని వక్రీకృతమైన సమాచారం చూపిస్తూ వస్తోంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే నివేదికలు కమిషన్ యొక్క విశ్వసనీయతను తగ్గిస్తాయి. భారత దేశంపై విమర్శలు మాని అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అక్కడ నివసిస్తున్న భారతీయ వలసదారులపై పెరుగుతున్న అసహనం, బెదిరింపులపై USCIRF ఆలోచించాలి,” అని తెలిపారు.USCIRF అనేది ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న మతస్వేచ్ఛ పరిస్థితులపై ఏటా నివేదిక అందిస్తుంది. అందులో భాగంగా కొన్ని దేశాలను CPC ప్రత్యేక ఆందోళనకర దేశాలుగా గుర్తించాలని సూచిస్తుంది.. -
భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి శివాలిక్ నౌక భారత్ చేరుకుంది. ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది.షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్కు చేరింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్ హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. ఇవాళ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఎల్పీజీ గ్యాస్ నౌక భారత్కు సురక్షితంగా రావడం శుభపరిణామ. దేశీయ వంట గ్యాస్ కొరతను తగ్గించడంలో సహాయపడుతోంది. రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నాయి. #Fujairah #IranIsraelWar #GlobalEnergy #PMModi #IndianShips #NandaDevi #Shivalik #Delhi $BJP 54 हजार टन LPG लेकर जहाज ‘शिवालिक’ आज मुद्रा पोर्ट पहुंचेगा,नई दिल्ली. मोदी सरकार की कुशल रणनीति और ईरान–इजराइल तनाव के बीच भारत के लिए राहत की खबर है, करीब 54 हजार टन एलपीजी गैस लेकर… pic.twitter.com/YbqSa3dnBM— सिरोही की आवाज (@Sirohikiaawaz) March 16, 2026 -
రన్నరప్గా ముగింపు
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నిలో వరుసగా నాలుగు మ్యాచ్లలో చెలరేగి ఆడిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 0–2 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తరఫున 13వ నిమిషంలో గ్రేస్ బాల్స్డన్, 43వ నిమిషంలో ఎలిజబెత్ నీల్ గోల్స్ సాధించారు. అయితే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత మహిళల బృందం ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచ కప్కు అర్హత సాధించింది. మ్యాచ్ ఆరంభంనుంచి భారత్ దూకుడు ప్రదర్శించింది. రెండో నిమిషంలోనే జట్టుకు పెనాల్టీ కార్నర్ అవకాశం లభించింది. అయితే దీనిని నిలువరించడంలో ఇంగ్లండ్ గోల్ కీపర్ సఫలమైంది. తొలి క్వార్టర్ ముగియడానికి కొద్ది సేపు ముందు లి క్వార్టర్లో భారత్ జోరు ప్రదర్శించినా...రెండో క్వార్టర్ నుంచి ఇంగ్లండ్కు ఆటపై పట్టు చిక్కి ఆ జట్టు వరుసగా దాడులు చేసింది. చివరకు పెనాల్టీ సాధించిన టీమ్కు బాల్స్డన్ గోల్ అందించింది. ఈ టోర్నికి ఆమెకిది ఐదో గోల్ కావడం విశేషం. రెండో క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ గోల్ సాధించే అవకాశం దక్కలేదు. 23వ నిమిషంలో దక్కినా పెనాల్టీని భారత్ వాడుకోలేకపోయింది.అయితే మూడో క్వార్టర్ చివర్లో భారత డిఫెన్స్ను ఛేదించి దూసుకుపోయిన ఎలిజబెత్ గోల్ కీపర్ బిచ్చుదేవిని ఏమార్చడంలో సఫలమై ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. ఈ ఆధిక్యాన్ని సరైన డిఫెన్స్తో కాపాడుకోవడంలో ఇంగ్లండ్ సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి ఒక నిమిషం ముందు కూడా భారత్కు పీసీ దక్కినా అదీ వృథా అయింది. దాంతో గోల్ లేకుండా ఓటమి తప్పలేదు. భారత్ మొత్తంగా నాలుగు పెనాల్టీ కార్నర్లను కూడా ఉపయోగించుకోలేకపోయింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్కాట్లాండ్ 1–0తో ఇటలీని ఓడించింది. భారత్కు చెందిన నవనీత్ కౌర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కింది. -
హార్మూజ్ను దాటేసిన... రెండు భారత నౌకలు
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలతో వస్తున్న మరో రెండు భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. భారీస్థాయిలో ఎల్పీజీ నిల్వలతో భారత్ వైపు బయల్దేరాయి. ‘‘శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు శనివారం ఉదయం హార్మూజ్ను దాటుకుని వచ్చాయి. గుజరాత్లోని ముంద్రా, కాండ్లా రేవులకేసి బయల్దేరాయి’’అని నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు వెల్లడించారు. శివాలిక్ సోమవారం ముంద్రాకు, ఆ మర్నాడు నందాదేవి కాండ్లాకు చేరే అవకాశముందన్నారు. హార్మూజ్కు పశి్చమాన మరో 22, తూర్పున 4 భారత నౌకలు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నట్టు ఆయన వివరించారు.వాటిని కూడా సురక్షితంగా దాటించేలా ఇరాన్ వర్గాలతో కేంద్రం ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పశి్చమాన నిలిచిన 22 నౌకల్లో ఆరింట్లో ఎల్పీజీ, ఒకదాంట్లో ఎల్ఎన్జీ, నాలుగింట్లో చమురు నిల్వలున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలీ్పజీకి తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో రెండు నౌకల్లో భారీగా నిల్వల రాక ఉపశమనం కల్పించనుంది. టాంజానియాకు గ్యాసోలిన్ నిల్వలు తీసుకెళ్తున్న జగ్ప్రకాశ్ అనే భారత చమురు నౌక శుక్రవారమే హార్మూజ్ను దాటడం తెలిసిందే. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వాటిలో 90 శాతం దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ నుంచి చమురు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయాయి. మళ్లీ రష్యా నుంచే కొనాలని అడుక్కుంటోంది ఇరాన్ ఎద్దేవాదుబాయ్: రష్యా నుంచి ముడిచమురు కొనొద్దని భారత్ను నెలల తరబడి బెదిరించిన అమెరికా ఇప్పుడు గతిలేక భారత్ను బతిమిలాడుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘యుద్ధం మొదలుకాకమునుపేమో రష్యా నుంచి చమురు అస్సలు కొనకూడదని భారత్ను అమెరికా బాగా బెదిరించింది. తీరా యుద్ధం మొదలయ్యాక మార్చి ఐదో తేదీన అమెరికా మాటమార్చింది. యుద్ధం దెబ్బకు హార్మూజ్ మూతబడటంతో రష్యాకాకుండా ఇతర దేశాల నుంచి చమురు కొనాలంటే సాధ్యపడట్లేదు. అందుకే మరో 30 రోజుల సడలింపు ఇస్తున్నాం.. రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా భారత్కు అడగకపోయినా గడువు పెంచుతూపోతోంది’’అని అబ్బాస్ వెటకారంగా మాట్లాడారు. -
రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఈ నెలలో 50 శాతం పెరిగాయి. రోజువారీ 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఇది 1.04 మిలియన్ బ్యారెళ్లుగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో చమురు సరఫరాలు నిలిచిపోవడం తెలిసిందే. దీంతో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకుంది. మన దేశం ప్రతి రోజూ సగటున 5.8 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంటుంది. ఇందులో 2.5–2.7 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ జలసంధి నుంచే భారత్కు వస్తుంటుంది.అంతేకాదు మన దేశ ఎల్పీజీ అవసరాల్లో 55 శాతం, ఎల్ఎన్జీలో 30 శాతం కూడా ఈ మార్గం నుంచే వస్తుంటుంది. రష్యా నుంచి రోజువారీ 1–1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును సమకూర్చుకుంటున్న నేపథ్యంలో హర్మూజ్ను మూసివేయడం కారణంగా మనకు ఏర్పడే లోటు 1.6 మిలియన్ బ్యారెళ్లు (రోజువారీ/బీపీడీ)గా ఉంటుందని కెప్లర్ అనలిస్ట్ సుమిత్ రిటోలియా తెలిపారు. ఇక రోజువారీ ఎల్పీజీ వినియోగం ఒక మిలియన్ బీపీడీగా ఉంటే.. ఇందులో 40–45 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన మొత్తాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఇందులో 80–90 శాతం హర్మూజ్ జలసంధి నుంచే రావాలి. ఈ మార్గం మూసుకుపోవడంతో దేశీయంగా ఎల్పీజీకి కటకట నెలకొంది. దేశీ సంస్థలు ఉత్పత్తిని 10–20 శాతం పెంచినా సరే, 47–50 శాతం లోటును ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
జాతీయ జెండాతో హార్మోజ్ దాటిన మరో భారత్ గ్యాస్ షిప్..
-
ఫైనల్లో భారత్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ విజయపరంపర కొనసాగిస్తోంది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నిలో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్–బెల్జియంలలో జరిగే ప్రపంచకప్ టోర్నికి అధికారికంగా అర్హత సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 1–0 గోల్ తేడాతో ఇటలీ జట్టును ఓడించింది. ఆట 40 నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను మనీషా చౌహాన్ గోల్గా మలిచి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది.ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని టీమిండియా విజయాన్ని అందుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ నాకౌట్ మ్యాచ్లోనూ రాణించింది. ఇటలీపై అవకాశం దొరికినపుడల్లా దాడులు నిర్వర్తించింది. మ్యాచ్ మొత్తంలో భారత్కు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. ఇందులో ఒక దానిని మాత్రమే భారత్ సద్వినియోగం చేసుకుంది. ఇటలీ తమకు లభించిన ఒక్క పెనాల్టీ కార్నర్ను వృథా చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2–0 గోల్స్ తేడాతో స్కాట్లాండ్పై గెలిచింది. ఇంగ్లండ్ తరఫున లాటీ బింఘామ్ (25వ నిమిషంలో), డార్సీ బుర్నీ (29వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ కూడా ప్రపంచకప్ బెర్త్ను దక్కించుకుంది. నేడు జరిగే ఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. మూడో స్థానం కోసం స్కాట్లాండ్తో ఇటలీ పోటీపడుతుంది.9 భారత జట్టు తొమ్మిదోసారి ప్రపంచకప్ టోర్నిలో ఆడనుంది. 52 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నిలో భారత జట్టు 1974లో అత్యుత్తమంగా నాలుగో స్థానాన్ని సాధించింది. 1978లో 7వ స్థానంలో, 2018లో 8వ స్థానంలో నిలిచింది. 2010, 2022లో 9వ స్థానం పొందిన టీమిండియా 1983, 2006లలో 11వ స్థానం, 1998లో 12వ స్థానం సంపాదించింది. -
పాతాళానికి రూపాయి
ముంబై: చమురు ధరల సెగతో దేశీ కరెన్సీ విలువ కరుగుతూనే ఉంది. తాజాగా డాలరుతో మారకంలో రూపాయి 5 పైసలు క్షీణించి 92.30 వద్ద ముగిసింది. వెరసి వరుసగా మూడో రోజు సరికొత్త కనిష్టానికి చేరింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 1.5 శాతం పుంజుకుని 102 డాలర్ల ఎగువకు చేరడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం బలపడి 100ను అధిగమించడం రూపాయిని దెబ్బతీశాయి.దీంతో ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 92.33 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి ఇంట్రాడేలో 92.47 వద్ద మరోసారి చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. దేశీ స్టాక్స్లో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు కొనసాగుతుండటం సైతం రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఈ ఏడాది జీడీపీ జోరు
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఫిచ్ రేటింగ్స్ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 7.5 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.7%, 2027–28లో 6.5% మేర వృద్ధి నమోదవుతుందని తాజా అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4%, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.4% చొప్పున వృద్ధి ఉంటుందని లోగడ పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 2026లో బ్యారెల్కు సగటున 70 బ్యారెళ్ల స్థాయిలో ఉంటుందని అంచనా వ్యక్తం చేసింది.దేశీ డిమాండ్ ఈ ఏడాది వృద్ధిని నడిపించే కీలక అంశమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల వ్యయాలు 8.6%, పెట్టుబడులు 6.9% చొప్పున పెరుగుతాయని తెలిపింది. 2025 డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లో జీడీపీ వృద్ధి 7.8%కి పరిమితం కావడం తెలిసిందే. గతేడాది సెపె్టంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4%గా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఆర్థిక కార్యకలాపాలు భారత్లో నిదానించినట్టు సంకేతాలు కనిపిస్తున్నా యంటూ, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, రుణ వితరణలో రెండంకెల వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. పెట్టుబడుల వృద్ధి పుంజుకుంటుంది.. స్వల్పకాలంలో పెట్టుబడుల వృద్ధి మందగించొచ్చని, సులభతర ఆర్థిక పరిస్థితులు, కనిష్ట స్థాయిలో వడ్డీ రేట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధ భాగంలో పుంజుకోవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ ఏడాది, వచ్చే ఏడాదికి వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయిల్లోనే స్థిరపడొచ్చని పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2.6 శాతం ప్రపంచ జీడీపీ 2026లో 2.6%గా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇరాన్ యుద్ధంతో ఇంధన ధరలు భారీగా పెరగకపోవచ్చని భావిస్తూ ఈ అంచనాకు వచి్చంది. ఒకవేళ చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లకు చేరి, అక్కడే కొనసాగితే అది ప్రపంచ సరఫరా వ్యవస్థకు పెద్ద షాక్గా మారుతుందని తెలిపింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో క్రూడ్ ఈ నెలాఖరు వరకు 90–100 డాలర్ల స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. -
వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్లో గ్యాస్ సంక్షోభం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్యానిక్ బుకింగ్స్ వద్దని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ కోరారు. అవసరం లేకున్నా ఆందోళనతో గ్యాస్ బుక్ చేయొద్దన్నారు. బ్లాక్ మార్కెట్పై చర్యలు తీసుకుంటున్నామన్న పెట్రోలియం శాఖ.. గ్యాస్ అందుబాటులో ఉందని.. ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. దేశంలో పెట్రోల్ కొరత కూడా లేదని.. 30 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్పీజీ బదులు ప్రజలు పీఎన్జీ తీసుకోవాలని.. ఎప్పటిలాగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న ప్రజలు.. భారీగా పెట్రోల్ బంక్లు, గ్యాస్ గోడౌన్ల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, వాణిజ్య సిలిండర్ల కొరతతో అనేక హోటల్స్లలో నుంచి మెనూ మార్చేశారు. కొన్ని డిష్లకు తాత్కాలికంగా మంగళం పాడేశారు. ఇక పలు టీ దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. పలు హోటళ్లు కట్టెలు, పొట్టుతో కూడిన పొయ్యిలపై దృష్టి పెట్టాయి. దీంతో కట్టెలు, పొట్టుకు సైతం డిమాండ్ పెరిగింది. -
నో టెన్షన్.. భూగర్బ రహస్య గుహల్లో చమురు నిల్వలు
పశ్చిమాసియా యుద్ధం భారతదేశ చమురు పరాధీనతను కళ్లకు కట్టింది. విదేశాల నుంచి ముడిచమురు, ద్రవరూప పెట్రోలియం గ్యాస్, ద్రవరూప సహజవాయువు దిగుమతులు హఠాత్తుగా ఆగిపోతే భారత్ కష్టాలకడలిలో పడిపోవడం ఖాయమని వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితిని చాన్నాళ్ల క్రితమే ఊహించిన భారత్ ముందుజాగ్రత్తగా భారీ స్థాయిలో పెట్రో ఉత్పత్తులను నిల్వచేసుకునే రహస్య భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించుకుంది. వీటిల్లో మిలియన్ల మెట్రిక్ టన్నుల కొద్దీ ముడిచమురు ఉత్పత్తులను దాచిపెడుతోంది.భారత్ తన 90 శాతం ముడిచమురు, 60 శాతం ఎల్పీజీ, 50 శాతం సీఎన్జీ (CNG) అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ సరకును నిల్వచేసుకోవడంపై దృష్టిసారించింది. ఈ కారణంగానే హార్మూజ్ జలసంధి వంటి కీలక చమురు సరఫరా మార్గాలు మూతబడినా వెంటనే కంగారుపడకుండా తన చమురు నిల్వలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ వంటి దేశాలు ఏకంగా లాక్డౌన్ ప్రకటించి చేతులెత్తేసి చేష్టలుడిగి చూస్తున్నాయి.మూడు చోట్ల మహా గుహలు! చమురు ఉత్పత్తుల దిగుమతులు ఆగిపోయాయనే దిగులుతో భారత్ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, తమిళనాడులోని పాడూర్లో కేంద్రప్రభుత్వం మూడు భూగర్భ రహస్య నిల్వకేంద్రాలను నిర్వహిస్తోంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పదేళ్ల క్రితమే 4 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును నిల్వచేసే భారీ భూగర్భ కేంద్రాన్ని నిర్మించారు.ఇందులోని ముడిచమురు (Crude Oil) పది రోజులపాటు యావత్ భారతదేశ అవసరాలను తీర్చగలదు. బాంబు, డ్రోన్ దాడులను తట్టుకునేలా అత్యంత లోతులో వీటిని నిర్మించారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, చమురు ఒలికిపోవడం వంటి లీకేజీ సమస్యలూ ఇక్కడ దాదాపు ఉండవు. గతంలోలాగా ఒకటి రెండు దేశాలపై ఆధారపడకుండా ఏకంగా 40 దేశాల నుంచి ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఏదో ఒకటి రెండు దేశాలు యుద్ధసంక్షోభంలో చిక్కుకున్నాసరే మిగతా దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు భారత్ చేసుకుంది.అంతర్జాతీయ చమురు సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా రష్యా చమురును కొనేందుకు భారత్కు అమెరికా అనుమతి ఇవ్వడంతో వేగంగా భారత్ పావులు కదిపింది. దక్షిణాసియాలో ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన 30 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలుచేసింది. దీనికితోడు గత పది రోజుల్లోనే ఒక్క అంగోలా నుంచే 34 లక్షల బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనేసింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి మరో 19 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలుచేసింది. ఇలా వచ్చిన సరకును వీలైనంత వరకు భూగర్భం కేంద్రాల్లో దాచేస్తోంది. ఎల్పీజీ స్టోరేజీ సైతం ఊపందుకుంది.అరకిలోమీటర్ లోతులో..కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) ఏర్పాటుచేసిన స్టోరేజీ సామర్థ్యం ఏకంగా 80,000 టన్నులు. ఇది అరకిలోమీటర్ లోతులో ఉంది. ఇదిగాక విశాఖపట్నంలో మరో ఎల్పీజీ నిల్వకేంద్రం ఉంది. దీని సామర్థ్యం 60,000 టన్నులు. ఇవిగాక మరికొన్ని రహస్య భూగర్భ రాతి గుహలను నిర్మించి మరింత ఎక్కువ చమురును నిల్వచేయాలని కొన్ని నెలల క్రితం పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను తమిళనాడులోని పాడూర్లోనూ దాచేస్తోంది. ఒడిశాలోని ఛందీఖోల్లో మరో దానిని నిర్మించనున్నారు.చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే!భూగర్భ గుహలు అనేవి వ్యూహాత్మకంగా సురక్షితమైనవి. భూమి మీది నిల్వకేంద్రాల నుంచి ఎండాకాలంలో కొంతమేర పెట్రో ఉత్పత్తులు వేడికి ఆవిరవుతాయి. భూగర్భంలో ఆ నష్టభయం ఉండదు. యుద్ధకాలంలో తొలిసారిగా స్వీడన్లో ఈ ప్రణాళికను అమలుచేశారు. తర్వాత ఫిన్లాండ్, జపాన్, దక్షిణకొరియా తదితర దేశాలు ఇదే బాటలో పయనించాయి. 1990లో గల్ఫ్ యుద్ధం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో భారత్ ఈ అండర్గ్రౌండ్ స్టోరేజీలకు అంకురార్పణ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గ్యాస్ మంటలు
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు మోదీ ఫోన్
ఢిల్లీ:ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తీవ్రతరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధం ఇరు వైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.ఈమేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను’అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగడం భారత్ ప్రాధాన్యతలు. అంతేకాదు, శాంతి, స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమని అన్నట్లు ’ప్రధాని మోదీ తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారి తీసిన నేపథ్యంలో గత 10 రోజుల్లో ప్రధాని మోదీ అనేక పశ్చిమాసియా దేశాల నాయకులతో మాట్లాడారు. గత నెల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తరుణంలో ఇరాన్ ప్రధాని మసూద్ తొలిసారి మాట్లాడారు. తాజాగా మరోసారి మసూద్తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region. Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure. The safety and security of…— Narendra Modi (@narendramodi) March 12, 2026అంతకుముందు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత మార్చి 1న రాస్ తనురా నుంచి ముడి చమురుతో బయలుదేరిన షెన్లాంగ్ సూయెజ్మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులతో హర్మూజ్ సంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీంతో జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
బాహుబలి పాటతో స్ఫూర్తి పొందాం
ముుంబై: భారత్కు టి20 వరల్డ్ కప్ను అందించిన మూడో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఘనత సాధించాడు. ఫైనల్ ముగిసిన రోజునుంచి అతను ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో పలు అంశాలపై అతను మీడియాతో మాట్లాడాడు. విశేషాలు సూర్యకుమార్ మాటల్లోనే... కెప్టెన్సీ, వరల్డ్ కప్ గెలిపించడంపై... రోహిత్ తప్పుకున్న తర్వాత నన్ను కెప్టెన్ను చేస్తారని ఊహించలేదు. ఏడాదిన్నర క్రితం శ్రీలంక వెళ్లడానికి వారం రోజుల ముందు నిన్ను కెప్టెన్గా నియమిస్తున్నామని జై షా చెప్పారు. అప్పుడే కోచ్ గంభీర్తో మాట్లాడి వరల్డ్ కప్ గెలవాలనే ఏకైక లక్ష్యంతో రోడ్మ్యాప్ను సిద్ధం చేశాం. ఆటగాడిగా, కెప్టెన్గా కూడా ప్రపంచ కప్ గెలిస్తే అది చాలా గొప్ప విషయం అవుతుందని అనుకున్నా. ఇప్పుడు అదే జరగడం చాలా సంతోషంగా ఉంది. 2024 ప్రపంచకప్తో పోలిక...అప్పటికంటే మా బ్రాండ్ క్రికెట్కు మార్చాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టుగా గెలవడం ముఖ్యం అని అందరికీ చెప్పాం. సెమీస్ చేరే వరకు కూడా అత్యధిక పరుగుల, వికెట్ల జాబితాలో మన ఆటగాళ్లెవరూ లేరు. ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించడంతో వరుసగా విజయాలు వచ్చాయి. చాలా మంది మన జట్టు ద్వైపాక్షిక సిరీస్లలో దూకుడుగా ఆడుతుంది. ఐసీసీ ఈవెంట్లలో జాగ్రత్త పడుతుంది అని విమర్శించేవారు. కానీ దీనిని కూడా మార్చాలని, ఇక్కడా అదే ధాటిని కొనసాగించాలని భావించాం.మర్చిపోలేని క్షణాలు... వరల్డ్ కప్ ట్రోఫీని కెప్టెన్గా అందుకోవడం కంటే గొప్ప క్షణం ఏముంటుంది. ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నట్లుగా నా చెంపపై రెండు సార్లు దెబ్బ వేసి మరీ ముందుకు సాగాను. మైదానంలో చూస్తే అక్షర్ పట్టిన క్యాచ్ అద్భుతం. నేను 2024 ఫైనల్లో అందుకున్న క్యాచ్ లాంటిదే ఇది కూడా. దక్షిణాఫ్రికా మ్యాచ్ తర్వాత ‘సాహోరే...బాహుబలి’ పాటతో ప్రత్యేకంగా పది నిమిషాల రీల్ చేసి మా వీడియో అనలిస్ట్ మాలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. -
మన నిజమైన భాగస్వాములెవరు?
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశం పోకడలతో చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత దేశపు ‘గొప్ప వ్యూహం’ ఏమిటి? దేశ, విదేశీ వ్యవహారాలలో మన విధానాలు ఏమిటి? అని ప్రశ్నించుకోవడం సము చితం. మనకు మనం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు అవి ఎలా ఉపకరిస్తాయో ఆలోచించాలి.అసలు వృద్ధి మార్గం‘‘అధికార సమతూకం సూచించే దానికన్నా ఒక పరిస్థితి నుంచి ఎంత ఎక్కువ లాభపడగలమో చూడాలి. అది అధికారాన్ని సృష్టించుకునే కళ’’ అని లారెన్స్ ఫ్రీడ్మ్యాన్ తన ‘స్ట్రాటెజీ: ఎ హిస్టరీ’ అనే పుస్తకంలో వ్యాఖ్యానిస్తారు. అధికారానికి అనేక కొలమానాలుంటా యని బెర్ట్రండ్ రసెల్, ఇంకా చాలామంది చెప్పారు. కనుక, వ్యూహాలు కూడా వాటిని అమలుపరచుకునేందుకు నిర్దేశించుకున్న కాల వ్యవధులను బట్టి అనేక రూపాల్లో, పరిమాణాల్లో ఉంటాయి. మరి గొప్ప వ్యూహం అంటే ఏమిటి? దీనికీ అనేక నిర్వచనాలు న్నాయి. ఎంచుకున్న రంగాన్ని బట్టి అవి మారిపోతూ ఉంటాయి. సైనిక వ్యవహారాల్లో ఒకలా, వ్యాపారంలో ఒకలా! అధికారాన్ని హస్త గతం చేసుకునేందుకే కాదు, దాన్ని నిలబెట్టుకునే, వినియోగించు కునే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. అయితే, భారతదేశపు గొప్ప వ్యూహం ఏమిటి? అలీనోద్యమం మాదిరిగానే, ‘బహుళ–అనుగుణ్యత’ మన విధానమని ఇపుడు చాలా మంది సూచిస్తున్నారు. కానీ, అది ఆ రెండు భావనలను తప్పుగా అర్థం చేసుకోవడమవుతుంది. అలీనోద్యమమైనా, బహుళ –అనుగుణ్యత అయినా ఒక లక్ష్యాన్ని సాధించుకునే మార్గం. అవి వాటికవే ప్రయోజనాలు కావు. జాతీయ అజెండాయే వ్యూహందివంగత కె.సుబ్రహ్మణ్యం ఈ విషయంలో నాకు గురువు. అభివృద్ధి చెందిన దేశంగా పునరావిర్భవించడం; ఆయుధాలను కాక, విజ్ఞానాన్ని అధికార చలామణీకి సాధనంగా గుర్తించడం భారత దేశపు గొప్ప వ్యూహమని ఆయన చెప్పేవారు. ‘స్వీయ జనాభాతో పాటు మొత్తం మానవాళి సంక్షేమానికి, ప్రపంచ శాంతికి భారత్ పాటుపడాలనీ; పారిశ్రామికీకరణ చెందిన ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తనను తాను అభివృద్ధి చేసుకున్నప్పుడే ప్రపంచంలో దానికి సరైన స్థానం దక్కుతుందనే భావన రాజ్యాంగ పరిషత్ 1947లో చేసిన ప్రమాణంలో ఉందనీ’ సుబ్రహ్మణ్యం 2012లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. భారత్ చెప్పుకునే ఏ గొప్ప వ్యూహానికైనా ఇదే సరైన నిర్వచనం కావాలని ఆయన సూచించారు. భారత ఉపఖండం ఒకప్పుడు సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థతో వర్ధిల్లింది. 18వ శతాబ్దంలో కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా నాల్గవ వంతుగా ఉంది. చైనాది మరో నాల్గవ వంతు వాటా. ఈ భావనే భారత జాతీయోద్యమ నాయకత్వానికి స్ఫూర్తినిచ్చింది. పదిహేడవ శతాబ్దంలో ప్రపంచ ఆదాయంలో చైనా–భారత్ల వాటా దాదాపు 25 శాతంగా లెక్కకు వచ్చేదని బ్రిటిష్ చరిత్రకారుడు ఆంగస్ మాడిసన్ ఎంతో శ్రమకోర్చి రూపొందించిన గణాంక అధ్యయనంలో వెల్లడించారు. ఈ రెండు దేశాల వాటా 1950 కల్లా 5% కన్నా తక్కువకు పడిపోయింది. రెండు దేశాలు వలస పాలకు లను గద్దె దింపి, ప్రపంచ ఆదాయంలో తమ వాటా తిరిగి దక్కించు కోవాలని కోరుకున్నాయి. ప్రపంచ దేశాల సరసన తనకుండవలసిన గౌరవ స్థానాన్ని పునరుద్ధరించుకునేందుకూ, ప్రపంచ ఆదాయ, వాణిజ్యాలలో రావలసిన వాటాను దక్కించుకునేందుకూ వీలు కల్పించే అంతర్జాతీయ క్రమ వ్యవస్థ రూపుదిద్దుకునేటట్లు చూడటం స్వతంత్ర భారతదేశ జాతీయ అజెండా అయింది. ఒక రకంగా, అదే దాని గొప్ప వ్యూహమని చెప్పుకోవచ్చు. అమెరికాను నమ్మగలమా?ప్రపంచ పర్యావరణం సానుకూలంగా ఉన్నప్పుడే ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేయగలుగుతుంది. ప్రపంచ వ్యవ హారాలలో ప్రస్తుత స్థితిని చూడండి: అమెరికా, ఇజ్రాయెల్ తీసుకునే చర్యలు భారత్ ఆర్థికాభివృద్ధికి దోహదపడే ప్రపంచ, ప్రాంతీయ పర్యావరణాన్ని సృష్టించేవిగా ఉన్నాయా? లేకపోతే, మనం మౌన ముద్ర వహించడానికి బదులుగా వాటి చర్యలకు అభ్యంతరం చెప్ప వద్దా? అల్లకల్లోల పశ్చిమాసియా ‘వికసిత్ భారత్’ దిశగా భారత్ పయనాన్ని మందగింపజేయడం లేదా? అలా అయితే, మోదీ ప్రభుత్వ ప్రస్తుత వైఖరి మన గొప్ప వ్యూహానికి అనువైనదిగానే ఉందా?భారత్ గొప్ప వ్యూహ సాధనకు అమెరికా ఒక భాగస్వామిగా తోడ్పడగలదనే ఉద్దేశంతోనే మనం దానితో వ్యూహాత్మక భాగ స్వామ్యం కుదుర్చుకున్నాం. ఆ లక్ష్య సాధనకు చేసే కృషిలో అమెరి కాను ఇక ఎంతమాత్రం ‘వ్యూహాత్మక’, ‘విశ్వసనీయ’ భాగస్వామిగా పరిగణించడానికి లేదని ఇటీవలి పరిణామాలు, ట్రంప్ ప్రభుత్వ ప్రకటనలు సూచిస్తున్నాయి. మన రాజ్యాంగ సూత్రాలు, విలువలే మనల్ని ఒక ఉదారవాద, బహుళ సాంస్కృతిక, సెక్యులర్ ప్రజాస్వామిక దేశంగా నిల బెడుతూ, ప్రపంచంలో మనకొక స్థాయిని కల్పిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రధాన దేశాలు అనుసరిస్తున్న సైనిక, ఆర్థిక విధానాలు భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు; ఉదారవాద, బహుళత్వ, సెక్యులర్ ప్రజాస్వామిక దేశంగా వర్ధిల్లేందుకు దోహదపడే ప్రపంచ పర్యావరణాన్ని సృష్టించేవిగా లేవు.ఈ నేపథ్యంలో మనల్ని మనం ఎలా పరిపాలించుకుంటాం, ఎలా అభివృద్ధికి బాటలు పరచుకుంటామన్నది మరింత ముఖ్యమైనఅంశంగా పరిణమిస్తుంది. మనం దేశీయంగా అనుసరిస్తున్న విధానాలు ఆత్మనిర్భరత, ‘వికసిత్ భారత్’ లక్ష్యాల సాధనకు వీలు కల్పించేవిగా ఉన్నాయా? క్రమేపీ మత భావనలను పెంచుకుంటున్న పాలక వ్యవస్థ అనుస రిస్తున్న విధానాలు ఆర్థికాభివృద్ధిని మందగింపజేసేవిగా ఉన్నాయి. మన రాజ్యాంగం దేన్ని గొప్ప వ్యూహంగా వీక్షించిందో ఆ ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నవిగా లేవు. సరిగ్గా ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం దేశ, విదేశాలలోని పరిణా మాలను మరింత దీర్ఘకాలిక దృష్టితో పరిశీలించవలసి ఉంది. దేశీయ, ప్రపంచ పరిణామాలను వేటికవిగా తాత్కాలిక దృష్టితో చూడటంతోనే సమస్య వచ్చి పడుతోంది. అంతర్జాతీయ వ్యవస్థలో మౌలికమైన మార్పులు చోటుచేసుకుంటున్నప్పుడు, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు నిజంగా చేయూత నివ్వగల భాగస్వాములెవరో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కర్తవ్యం మన చేతుల్లోనే ఉంది. కానీ, బాహ్య వాతావరణం కూడా లెక్కకు వస్తుంది. సంజయ బారువ్యాసకర్త జర్నలిస్ట్ – ప్రధానికి మాజీ మీడియా సలహాదారు -
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇంధన కొరతతో హోటళ్ల మూసివేతలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. కొంత మొత్తంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తామని తెలిపింది. లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది.అంతేకాదు, ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు అదనంగా 40,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు కూడా చేశామని తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రోజూ దాదాపు 50 లక్షల సిలిండర్ల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఎక్కడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.కానీ భయాందోళనల కారణంగా బుకింగ్లు అనేక రెట్లు పెరిగాయని సుజాత శర్మ చెప్పారు. భయంతో బుకింగ్ చేయవద్దని పౌరులను కోరారు. ప్రాధాన్యం ఆధారంగా కమర్షియల్ సిలిండర్లు పంపిణీ జరిగేందుకు లబ్ధిదారుల జాబితా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన పంపినట్టు తెలిపారు.ప్రతి త్రైమాసికంలో రాష్ట్రాలకు దాదాపు లక్ష కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపును ప్రభుత్వం చేస్తుందని ఆమె తెలిపారు. ఇవాళ ఉత్తర్వు విడుదల చేసి మరో 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.ఇప్పుడు ఎల్పీజీ ఉత్పత్తి 28 శాతానికి పెరిగిందని శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ రిటైల్ అవుట్లెట్ నెట్వర్క్ ఉందని చెప్పారు. దాదాపు లక్ష రిటైల్ అవుట్లెట్లు దేశంలో పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం ప్రజా రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధీనంలో ఉన్నాయని చెప్పారు. ఏ రిటైల్ అవుట్లెట్ వద్ద కూడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.భయంతో సిలిండర్ బుకింగ్లుఎల్పీజీ కొరతపై భయాందోళనలు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. వినియోగదారులు భయంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి సిలిండర్లు బుక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయ ప్రయత్నాలు అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు, గ్యాస్ కొరత కారణంగా దేశంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూసేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. దేశంలో ఇంధన కొరత లేదని ఇవాళ లోక్సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. -
యుద్ధం వేళ.. ఇరాన్తో చర్చించిన భారత్
న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు పెరుగుతున్న వేళ ఇరాన్తో నౌకాయాన భద్రతపై భారత్ చర్చించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాయాన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీపై చర్చించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న పరిస్థితి, సముద్ర రవాణాకు ప్రమాదాలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగాయి. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించటం, చమురు సరఫరా స్థిరంగా కొనసాగటం వంటి అంశాలపై కేంద్రీకృతమైందని ఈ చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిది రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు.ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పలుసార్లు సంప్రదింపులు జరిపారని జైస్వాల్ తెలిపారు. “గత కొన్ని రోజుల్లో భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య పలుసార్లు సంభాషణ జరిగింది. చివరిసారిగా జరిపిన చర్చలో నౌకాయాన భద్రత, భారత ఎనర్జీ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చించాం. ఇంకా మేము ఏమి చెప్పినా తొందరపాటే అవుతుంది” అని తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం వేళ హోర్ముజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇటీవలి జరిగిన దాడుల్లో పలు నౌకలు దెబ్బతినడంతో ప్రపంచ నౌకాయాన వ్యవస్థ, ఎనర్జీ సరఫరాపై అంతరాయాలు కలుగుతున్నాయి.మరోవైపు, ఇవాళ సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌక ముంబై చేరుకుంది. లైబీరియాకు చెందిన నౌకలో క్రూడాయిల్ దిగుమతి అయింది. యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటిన మొదటి నౌక ఇదే. 1.35 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి అయింది. -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. విదేశీ తయారీ రంగంలో అనుసరిస్తున్న ‘అనుచిత వాణిజ్య విధానాలపై’ విచారణ చేపట్టాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ జాబితాలో భారత్ సహా ప్రపంచంలోని 16 ప్రధాన ఆర్థిక వ్యవస్థలను చేర్చడం గమనార్హం. అమెరికా పారిశ్రామిక రంగాన్ని కాపాడుకునేందుకు, విదేశాల నుంచి వస్తున్న మిగులు ఉత్పత్తిని అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ట్రంప్ విధించిన సుంకాలను నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఈ కొత్త విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జామీసన్ గ్రీర్ బుధవారం ఈ విచారణలపై అధికారిక ప్రకటన చేశారు. 1974 వాణిజ్య చట్టంలోని ‘సెక్షన్ 301’ కింద ఈ విచారణలు ప్రారంభించనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో భారత్ వంటి దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై భారీగా పన్నులు మోపే అవకాశం ఉంది.అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలను ఈ విచారణలో ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. వీటితో పాటు స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, సింగపూర్, థాయ్లాండ్, మలేషియా, కంబోడియా, వియత్నాం, బంగ్లాదేశ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ‘చాలా దేశాలు తమ దేశీయ అవసరాలకు మించి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ మిగులు ఉత్పత్తిని అమెరికాపైకి నెట్టడం వల్ల మా దేశీయ తయారీ రంగం దెబ్బతింటోంది. అమెరికా పారిశ్రామిక పునాదిని ఇకపై బలి చేయబోము’ అని జామీసన్ గ్రీర్ పేర్కొన్నారు.ఇటీవలే భారత్-అమెరికా మధ్య ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందన్న హామీతో, అమెరికా తన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. గతంలో ట్రంప్ చేపట్టిన ‘లిబరేషన్ డే’ విన్యాసాల తర్వాత భారత్పై 25 శాతం సుంకాలు ఉండగా, రష్యా చమురు కొనుగోలు నెపంతో మరో 25 శాతం పెనాల్టీ విధించారు. తాజా విచారణతో ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం పడుతున్నదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు? -
యుద్ధ ఉద్రిక్తతల వేళ క్షిపణి పరీక్ష!
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు యుద్ధ వాతావరణంతో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్షణక్షణం ఉత్కంఠతో అన్ని దేశాలు పరిస్థితులను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న తరుణంలో భారత్ నోటమ్ జారీ చేసింది. విశాఖపట్నం తీరంలో సముద్రంలో ప్రయోగించనున్న క్షిపణి పరీక్ష కోసం ప్రమాద ప్రాంతాన్ని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ (నోటమ్) ప్రకారం, ఈ మిసైల్ టెస్టింగ్ ఈ నెల 13 నుంచి 16 వరకూ జరగనుందని స్పష్టం చేసింది.నోటమ్ అంటే..ఇందుకోసం విశాఖపట్నం తీరానికి 500 కిలోమీటర్ల తర్వాత ఉన్న ప్రాంతాన్ని డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతను ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు, జలాంతర్గాములను అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్ జోన్ని ప్రకటించారు. దీని ఆధారంగా పైలెట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నోటమ్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ని అందజేయనున్నారు. విమాన ప్రయాణానికి ఆటంకం కలిగించే మార్పులు లేదా ప్రమాదాల గురించి పైలెట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానయాన సిబ్బందికి ముందుగానే ఇచ్చే హెచ్చరిక ప్రకటననే ‘నోటమ్’ అని పిలుస్తారు. ఈ డేంజర్ జోన్ ప్రకటన ఉన్నంత వరకూ ఆ పరిధిలో పౌర, యుద్ధ విమానాలు ఎగరనీయకుండా దారి మళ్లిస్తారు. 13 నుంచి 16వ తేదీ మధ్యలో ఎప్పుడైనా ఈ క్షిపణి పరీక్ష ఉండే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు సమాచారం. ఇటీవల కాలంలో విశాఖలో అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యం ఉన్న కే – 4 బాలిస్టిక్ మిసైల్ టెస్టింగ్ని ఐఎన్ఎస్ అరిఘాత్ సబ్మెరైన్ నుంచి భారత్ విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది. ఈసారి ఏ క్షిపణిని పరీక్షిస్తారనేది రక్షణ వర్గాలు గోప్యంగా ఉంచాయి. యుద్ధ వాతావరణ సమయంలో భారత్ చేస్తున్న క్షిపణి ప్రయోగంపై అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
సామాన్యుడికి షాక్.. పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితి?
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై తీవ్రంగా పడింది. నిన్న బెంగళూరు, విశాఖ, ముంబై నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడగా.. ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు సిలిండర్ బండలతో రోడ్డెక్కారు. కొన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా కష్టాలు మొదలయ్యాయి. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్తో పాటు.. బిహార్లో పోలీసుల బందోబస్తు నడుమ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కీలక నగరాల్లో ఒకట్రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్లో ఎల్పీజీ బ్లాక్ మార్కెటింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై దృష్టి సారించాయి.రోజురోజుకీ పరిస్థితి తీవ్రంఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మధ్యప్రదేశ్లో ఆ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే వారం రోజుల్లో ఒక్క భోపాల్లోనే వెయ్యికి పైగా పెళ్లిళ్లు షెడ్యూల్ అయినట్లుగా తెలుస్తోంది. గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం ఉండడంతో.. పెళ్లింట భోజనాలు ఉంటాయా? అనే ఆందోళనలు వధువు, వరుడి తరఫు వారిలో నెలకొంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు, హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు పెళ్లిళ్ల సీజన్ దాటిపోతోందని, అడ్వాన్సులు తీసుకున్న తమకు నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవిధంగా ఇది అత్యయిక స్థితిని తలపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.యూపీలో పోలీసుల బందోబస్తు నడుమ..యూపీలో గడిచిన నాలుగైదు రోజులుగా ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు పెరిగాయి. బుకింగ్ల మధ్య 25 రోజుల గ్యాప్ అనే నిబంధన కొనసాగుతున్నప్పటికీ.. అసాధారణంగా బుకింగ్లు పెరుగుతున్నాయని ఎల్పీజీ డీలర్లు చెబుతున్నారు. గోరఖ్పూర్, సిద్ధార్థనగర్ ప్రాంతాల్లో పౌరులు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు క్యూకట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరినట్లు ఇప్పుడు యూపీలో ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఏజెన్సీల వద్ద క్యూకట్టారు. అయితే.. వారందరికీ సిలిండర్లు సర్దుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, టోకెన్లు ఇచ్చి, రాబోయే రోజుల్లో పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు దుర్గా..బిహార్లో బుకింగ్ల నిలిపివేత?రెండ్రోజులుగా బిహార్లో కమర్షియల్ సిలిండర్ల బుకింగ్లను చమురు సంస్థలు నిలిపివేశాయి. దీంతో.. బెంగళూరు మాదిరిగానే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు బంద్కు సిద్ధమవుతున్నారు. డొమెస్టిక్ బుకింగ్లు కొనసాగుతున్నప్పటికీ.. బ్లాక్మార్కెటింగ్ భయాలు ఉండడంతో ప్రజలే ఏజెన్సీల వద్దకు ఖాళీ సిలిండర్లతో చేరుకుంటున్నారు. దీంతో.. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా గోపాల్ గంజ్, ఖగారియా, ఔరంగాబాద్, పట్నా నగరాల్లో తెల్లవారుజాము నుంచే ప్రజలు సిలిండర్ బండ కోసం క్యూలైన్లలో నిలబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే.. డీలర్లు తమపై దాడులు జరిగే ప్రమాదాలున్నాయనే భావనతో ఏజెన్సీలను తెరవడం లేదు.రాజస్థాన్లో బ్లాక్ మార్కెటింగ్?కమర్షియల్ సిలిండర్ ధర 19 వందల రూపాయలదాకా ఉండగా.. ఇప్పుడు రాజస్థాన్లో బ్లాక్ మార్కెటర్లు దాన్ని 2,500 నుంచి మూడువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, అక్రమార్కుల దందాను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించారు. లూథియానా, ఫరీద్కోట్, హోషియార్పూర్, పటియాలా ప్రాంతాల్లో చమురు సంస్థల వెబ్సైట్లు డౌన్ కావడంతో.. కొత్త బుకింగ్లు జరగడం లేదని తెలుస్తోంది దుర్గా..కేంద్ర ప్రభుత్వం చర్యలు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిన్ననే ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో చమురు కంపెనీల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే నిబంధనను నిక్కచ్చిగా అమలు చేస్తోంది. గ్యాస్ డెలివరీ బాయ్స్ దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీని అమలు చేస్తోంది. మరోవైపు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. - సాక్షి వెబ్డెస్క్ -
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
-
వంట గ్యాసే ఫస్ట్.. ప్రజలు ఆందోళన చెందొద్దు
-
విద్యకు విశ్వ ‘భారతం’
సాక్షి, స్పెషల్ డెస్క్: మన దేశంలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దక్షిణాసియా నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు భారత్కు వస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కూడా డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వంటి విధాన సంస్కరణలే ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. అయితే మౌలిక సదుపాయాలు, గుర్తింపు, ఉపాధి అవకాశాలతో ముడిపడిన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. 2025లో వివిధ దేశాలకు చెందిన 58,000 మంది విద్యార్థులు భారత్లో చదువుతున్నట్టు అంచనా. మన దేశంలోని విద్యా సంస్థల్లో చేరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య 2030 వరకు ఏటా సుమారు 8% పెరుగుతుందని అంతర్జాతీయంగా ఉన్నత విద్య సమాచారం, ర్యాంకింగ్స్ను అందించే లండన్కు చెందిన క్యూఎస్ తన ‘క్యూఎస్ గ్లోబల్ స్టూడెంట్ ఫ్లోస్: ఇండియా 2026’నివేదికలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా గమ్యస్థానాలలో ఒకటిగా భారత్ నిలుస్తుందని వెల్లడించింది. భారత్కు కొత్త అవకాశాలు.. పదేళ్లలో భారత్కు వచ్చే అంతర్జాతీయ వి ద్యార్థుల సంఖ్య పెరగడానికి దేశీయంగా ప్ర భుత్వ విధాన సంస్కరణలు, దక్షిణాసియా –ఆఫ్రికా నుంచి పెరుగుతున్న డిమాండ్, సంప్రదాయ విదేశీ విద్యా గమ్యస్థానాలలో విపరీతంగా పెరుగుతున్న ఖర్చులు ప్రధాన కారణం. భారత్ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2047 నాటికి 5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తెలి సిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా నాణ్యమై న విద్య కోసం అధికం అవుతున్న డిమాండ్ భారత్కు కొత్త అవకాశాలను కలి్పస్తోంది. వీసా నిబంధనలతో.. ఆంగ్లం మాట్లాడే విద్యా గమ్యస్థానాలైన అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలు ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అక్కడ ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ప్రపంచ విద్యా రంగంలో మార్పులు వస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యా ర్థులు తక్కువ ఖర్చుతో కూడిన, సులభంగా ప్రవేశం లభించే విద్యా కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్లో విద్యా వ్యయం తక్కువగా ఉండడం, విస్తరిస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ విదేశీ విద్యార్థులకు ప్రధాన ఆకర్షణలుగా మారుతున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి.. ⇒ పెరుగుతున్న ఆదరణ: దక్షిణాసియా తర్వాత ఆఫ్రికా దేశాల నుంచి ప్రధానంగా సబ్–సహారన్ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ⇒ వృద్ధి రేటు: విద్యార్థుల రాక ఏటా 6% వృద్ధి చెందుతుందని అంచనా. ఈ దేశాల్లో యువత ఎక్కువ. ఉన్నత విద్యకు పరిమితమైన అవకాశాలు. ⇒ జింబాబ్వే: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. 2024లో భారత్కు విద్యార్థులను పంపిన దేశాల్లో 7వ స్థానం. 2030 నాటికి 6వ స్థానానికి చేరుకుంటుందని అంచనా. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా.. ⇒ స్థిరమైన సహకారం: ఈప్రాంతం నుంచి విద్యార్థుల రాక స్థిరంగా కొనసాగుతోంది. ⇒ యూఏఈ: 2030 నాటికి భారత్లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 5% వరకు ఉండే అవకాశం.ఆకర్షణీయమైన అంశాలు..⇒ భౌగోళిక సామీప్యత: పొరుగు దేశాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రయా ణ సౌలభ్యం మెరుగ్గా ఉండటం. ⇒ సాంస్కృతిక సారూప్యత: ఆహారం, జీవనశైలి, భాషాపరంగా ఉన్న దగ్గరి సంబంధాలు విద్యార్థులకు సౌకర్యవంతంగా అనిపించడం. ⇒ తక్కువ ఖర్చు: ఇతర దేశాలతో పోలిస్తే విద్యా, జీవన వ్యయాలు చాలా తక్కువగా ఉండటం. ⇒ ప్రధాన సమస్య: భారతీయ విద్యా సంస్థల విషయంలో కంపెనీల దృష్టిలో గుర్తింపు, విద్యాపరమైన గుర్తింపు మధ్య పెద్ద వ్యత్యాసం. ⇒ మెరుగుపడిన ఎంప్లాయర్ ర్యాంకింగ్: గత దశాబ్దంలో భారతీయ గ్రాడ్యుయేట్లపై కంపెనీలకు ఉన్న నమ్మకం, గుర్తింపు గణనీయంగా పెరిగింది. ⇒ స్థిరంగా ఉన్న అకడమిక్ సూచీలు: విద్యా నాణ్యత, పరిశోధనలు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల పరంగా ఉండే గుర్తింపులో మాత్రం పెద్దగా మార్పు లేదు.భారత్లో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో దక్షిణాసియా దేశాలు దాదాపు సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే విద్యార్థులు మొత్తం ప్రవేశాలలో 30% కంటే ఎక్కువ. రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతం నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా నేపాల్ కొనసాగుతుందని అంచనా. -
టార్పిడోల తయారీ కోసం వీఈఎం, టీకేఎంఎస్ ఒప్పందం
హైదరాబాద్: భారత్లో సంయుక్తంగా టార్పిడోలను ఉత్పత్తి చేయడానికి వీఈఎం టెక్నాలజీస్, టీకేఎంఎస్ సహకార ఒప్పందం (టీమింగ్ అగ్రిమెంట్)పై సంతకాలు చేశాయి. టార్పిడో అంటే జలాంతర్గాములు, యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే సముద్ర యుద్ధ ఆయుధం. టార్పిడోకు సంబంధించిన సాంకేతికత బదిలీ, “మేక్ ఇన్ ఇండియా”కు ఊతం ఇచ్చేలా హెవీవెయిట్ టార్పిడోను సంయుక్తంగా అభివృద్ధి చేయడం కోసం ఈ సహకార ఒప్పందం చేసుకున్నారు. భారత మార్కెట్కు ఆధునిక హెవీవెయిట్ టార్పిడోలు సరఫరా కావడానికి ఈ ఒప్పందం బాగా ఉపయోగపడుతుంది. సాంకేతిక స్వావలంబనకు ఊతం ఇవ్వడం, స్థానిక రక్షణ పరిశ్రమను మరింత విస్తరించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో టీకేఎంఎస్ సంస్థ సహకార ఒప్పందం (టీమింగ్ ఒప్పందం)పై సంతకం చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ ప్రముఖ రక్షణ సంస్థ ఆయుధ వ్యవస్థలు, గగనతల వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. అట్లాస్ ఎలక్ట్రానిక్ విభాగం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు మైఖేల్ ఓజెగోవ్స్కీ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తమ టార్పిడో సాంకేతికత బదిలీ ద్వారా భారత నౌకాదళం మరింత శక్తిమంతం అవుతుందని తెలిపారు. వీఈఎం టెక్నాలజీస్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు.మొదటి దశలో ఈ సహకార ఒప్పందం ద్వారా.. హెవీవెయిట్ టార్పిడో తయారవుతుంది. భవిష్యత్లో అభివృద్ధి చేసే టార్పిడో ప్రోగ్రామ్స్లో టీకేఎంఎస్, వీఈఎం మధ్య మరింత సహకారం కూడా సాధ్యమని భావిస్తున్నారు.వీఈఎం, టీకేఎంఎస్ మధ్య సంయుక్త సంస్థను కూడా స్థాపిస్తారు. ఈ సంస్థ ద్వారా భారత మార్కెట్కు దీర్ఘకాలంగా ఉన్నత ప్రమాణాల హెవీవెయిట్ టార్పిడోల సరఫరా జరుగుతుంది. అదే సమయంలో ఎగుమతి అవకాశాలు కూడా తెరుచుకుంటాయి. టీకేఎంఎస్ విభాగమైన అట్లాస్ ఎలక్ట్రానిక్ వీఈఎంకు అవసరమైన సాంకేతికత బదిలీ చేస్తుంది. సాఫ్ట్వేర్ అనుమతి పత్రాలు కూడా అందిస్తుంది. దీనివల్ల భారత తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి సాధ్యం అవుతుంది.టీకేఎంఎస్ ప్రపంచంలోని ప్రముఖ నౌకాదళ సంస్థల్లో ఒకటి. కీల్, విస్మార్, ఇటజాయి వంటి ప్రాంతాల్లో మూడు నౌకాశ్రయ కర్మాగారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇతర కేంద్రాలు కూడా ఉన్నాయి. మొత్తం 9,100 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. జలాంతర్గామి నౌకలు, సముద్ర ఉపరితల యుద్ధ నౌకలు, సముద్ర ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, భద్రతా సాంకేతికత రంగాల్లో వ్యవస్థ సరఫరాదారుగా సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కీల్ కేంద్రంలో సుమారు 3,300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. -
యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్కొరతతో హెటళ్లు బంద్
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో భారత్తో పాటు ఇతర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు బంద్ను సైతం ప్రకటించాయి. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ పరిస్థితి ఏలా ఉంది అనే వివరాలు తెలుసుకోవాలనుందా అయితే మరెందుకు ఆలస్యం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.ఇరాన్ యుద్దం ఎఫెక్ట్ భారత్పై ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రెట్రోల్, డీజీల్ ధరలపై ఈ ప్రభావం ఇప్పటికే పెద్దగా లేకపోయినా ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో బెంగళూరులో వ్యాపారులు ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ను పాటిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా 25 శాతానికి పైగా హోటళ్లు మూతపడ్డాయి. రేపటి నుంచి ఈ సంఖ్య 50 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదని ముంబై హోటల్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలోని విశాఖలో కూడా హోటళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్ నగరంలో సాధారణంగానే రద్దీ ఉండగా ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుంది. దీంతో గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లు, బేకరీలపై పడుతుందనే ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.గ్యాస్ కొరతపై కేంద్రం స్పందన యుద్ధం ప్రారంభమైన ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై ఎలాంటి ప్రభావం ఉండదని, మన వద్ద 21 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటన చేసింది. అయితే.. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది. ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించింది. అత్యవసర సేవల చట్టం.. ఎస్మా పరిధిలోకి గ్యాస్ సరఫరాను తీసుకువచ్చింది. బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ మేరకు జిల్లాల వారీగా కలెక్టర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. తమ పరిధిలోని ఎల్పీజీ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సిలిండర్ల పంపిణీని రేషనలైజేషన్ చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రభావం ఇతర రంగాలపై ఎలా ఉంటుంది?హోటళ్లు, రెస్టారెంట్లకు, పర్యాటక రంగానికి ముడిపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. పర్యాటక ప్రదేశాల్లో హోటళ్లు మూతపడితే.. ఆ ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. పట్టణ, నగర ప్రాంత పర్యాటక ప్రదేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆటో ఎల్పీజీమహానగరాల్లో ఇప్పుడు ఆటో ఎల్పీజీ స్థానాన్ని అధికస్థాయిలో సీఎన్జీ ఆక్రమించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో ఆటోరిక్షాలు ఇప్పటికీ ఆటో ఎల్పీజీపైనే ఆధారపడ్డాయి. గత నెలలో ఆటో ఎల్పీజీ ధర లీటరుకు 55 రూపాయల వరకు ఉంది. మూడ్రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరను పెంచడంతో ఇప్పుడు ఆటో ఎల్పీజీ ధర 63 రూపాయలకు చేరుకుంది. ఎల్పీజీ బంకుల్లో కూడా షార్టేజీ భయంతో ఆటోరిక్షాలు, కార్లు క్యూకడుతున్న పరిస్థితులు ఎల్పీజీ బంకుల వద్ద కనిపిస్తోంది. మరెంత కాలం సంక్షోభం?పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ ఇంధన సరఫరా చైన్కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద నౌకలు స్తంభించిపోయాయి. అటుగా వచ్చే నౌకలను ఇరాన్ టార్గెట్గా చేసుకుంటోంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రేషనలైజేషన్ ద్వారా పంపిణీపై దృష్టి సారించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ ఎల్పీజీ విషయాన్ని పక్కనపెడితే.. డొమెస్టిక్తోపాటు.. ఆస్పత్రులు, స్కూళ్లు, హాస్టళ్ల విషయంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు అవసరమయ్యే ఎల్పీజీ సరఫరాకు సంబంధించి ఆయిల్ కంపెనీలకు సంబంధించిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ఇదివరకే ఎక్స్లో ట్వీట్ చేసింది.భారత్లో ఎల్పీజీ డిమాండ్ఒకప్పటితో పోలిస్తే.. భారత్లో ఎల్పీజీ డిమాండ్ చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఉజ్వల వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సిలిండర్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దీపం పేరుతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలా పథకాలు కొనసాగాయి. మొత్తానికి కమర్షియల్, డొమెస్టిక్ కలిపి దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. ఇందులో 87 శాతం డొమెస్టిక్ వినియోగమే కావడం గమనార్హం. మిగతా 13 శాతంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆటో ఎల్పీజీ వినియోగం ఉంటుంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి ద్వారా కొరతను అధిగమించలేమా?భారతదేశ ఎల్పీజీ అవసరాలు తీరాలంటే 62 శాతం మేర దిగుమతులు తప్పనిసరి. మిగతా 38 శాతం మాత్రమే ప్రస్తుతం మన వద్ద ఉత్పత్తి అవుతుంది. హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తగ్గితే.. వెను వెంటనే మన దేశానికి దిగుమతి కావాల్సిన ఎల్పీజీ అందుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. మన దిగుమతుల్లో 90 శాతం వరకు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నాయి. అయితే.. భారత్లో ఇంధన నిల్వలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. -
భారత్కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం స్కాట్లాండ్తో జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. తమకంటే బలహీన జట్టయిన స్కాట్లాండ్పై భారత్ పలు అవకాశాలు చేజార్చుకొని విజయాన్ని కోల్పోయింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (18వ నిమిషంలో), సునెలితా టొప్పో (29వ నిమిషంలో)... స్కాట్లాండ్ తరఫున మెక్ఇవాన్ హీతర్ (6వ నిమిషంలో), ఫియోనా బర్నెట్ (33వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.భారత్కు మొత్తం 9 పెనాల్టీ అవకాశాలు రాగా, రెండింటిలో మాత్రమే జట్టు సఫలమైంది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్ల్లో ఉరుగ్వే 3–2తో వేల్స్పై, ఇంగ్లండ్ 3–0తో కొరియాపై, ఇటలీ 3–0తో ఆస్ట్రియాపై గెలిచాయి. పూల్ ‘బి’లో ప్రస్తుతం భారత్, స్కాట్లాండ్ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఉరుగ్వే 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వేల్స్ ఖాతా తెరువలేదు. నేడు విశ్రాంతి దినం. బుధవారం జరిగే పూల్ ‘ఎ’ మ్యాచ్ల్లో ఇంగ్లండ్తో ఆస్ట్రియా (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), ఇటలీతో కొరియా (మధ్యాహ్నం 3 గంటల నుంచి), ఉరుగ్వేతో స్కాట్లాండ్ (సాయంత్రం గం. 5:15 నుంచి), వేల్స్తో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక రెండు పూల్స్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. వేల్స్తో మ్యాచ్ను భారత్ ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్కు చేరుకుంటుంది. -
ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు పెరగవు
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా ప్రస్తుతానికైతే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే అదనపు భారాన్ని భరించనున్నట్లు వివరించాయి. మరోవైపు, వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో కనీస వెయిటింగ్ పీరియడ్ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా, అక్రమంగా నిల్వ చేయడాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపాయి. -
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్-ఇరాన్ ఇష్యూ మొత్తం ముగియవచ్చని భారత్లోని యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా అన్నారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మిర్జా మాట్లాడారు. యూఏఈకి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. మోదీ అంటే గల్ఫ్ నాయకులకు మాత్రమే కాదని,. ఆయా దేశాల ప్రజలు, వ్యాపార వర్గాల్లో కూడా ఆయనకు చాలా గౌరవం ఉందని మిర్జా చెప్పారు. “ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలకు మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య ముగుస్తుంది. ఒక ఫోన్ కాల్ చాలు” అని మిర్జా చెప్పారు. ప్రస్తుతం యుద్ధం చేస్తున్న ఇరాన్- ఇజ్రాయెల్ నాయకులతో మోదీకి ఉన్న సత్సంబంధాలపై ఇది ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.‘ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో చేరాలన్న ఆసక్తి యూఏఈకి లేదు. మా భూభాగాన్ని దాడుల కోసం వాడుకోవడానికి ఇరు పక్షాలకు అనుమతి ఇవ్వము. నిజంగా చెప్పాలంటే ఇందులో మేమెందుకు చేరుతున్నామో నాకు స్పష్టంగా తెలియదు. ఈ ఘర్షణలో యూఏఈ జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ లేదు” అని మిర్జా వ్యాఖ్యానించారు. రెండు పక్షాలతో తాము చర్చలు జరపగలమని అన్నారు.యూఏఈ సున్నితమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో ఉంది. అది ఇరాన్ పక్కన ఉన్న దేశం. అలాగే అబ్రహామ్ ఒప్పందాల కింద ఇజ్రాయెల్తో యూఏఈ పార్ట్నర్షిప్ కొనసాగిస్తోంది. అబ్రహామ్ ఒప్పందాలు అంటే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణం చేసుకోవడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు.“వాళ్లు మా భూభాగంగాపై పరస్పరం యుద్ధం చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించలేం” అని మిర్జా చెప్పారు. ఇప్పటివరకైతే నష్టం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై మరోసారి దాడులు చేసింది. బీరూట్లో హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి చెప్పిన వివరాల ప్రకారం యుద్ధంగా వల్ల ఇప్పటివరకు ఇరాన్లో 1,332 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. -
గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర
-
తల్లీబిడ్డల ‘ఎల్లిపాయ కారం’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరానికి చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ కొత్త రకం వంటలను రుచి చూపిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోనీ టీవీ మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్–9 వంటల రియాలిటీ షోలో రన్నరప్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించారు. గతంలోనే ఎల్లిపాయ కారంతో వైరెటీలు చేస్తూ కొత్త రుచులను పరిచయం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎల్లిపాయ కారం పేరుతో ఓ రెస్ట్రారెంట్ నిర్వహిస్తున్నారు. చందన తన భర్త రవీందర్ సహకారంతో మంచిర్యాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక కూతురు సాయిశ్రీ బీటెక్ చేయగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ తనకు ఇష్టమైన వంటల రంగాన్నే ఎంచుకున్నారు. నాలుగో తరగతి నుంచే వంట చేసేందుకు ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు అదే దిశగా ప్రోత్సాహించారు. గతంలో జెమిని టీవీలో తెలుగు మాస్టర్లో పాల్గొన్నప్పటికీ ఫైనల్ వరకు చేరలేదు. తాజాగా తల్లీకూతురు మాస్టర్ ఇండియా చెఫ్ జోడిగా కొనసాగిన 45ఎపిసోడ్స్లో వంటల్లో వైవిధ్యతను ప్రదర్శించారు.పుష్పరాజ్ చికెన్, స్పెషల్ లడ్డురియాలిటీ షోలో కఠిన పరీక్షలైన అగ్ని పరీక్ష, నీరు లేకుండా వంట, కట్టల పొయ్యిపై వండడం, వెజ్, నాన్వెజ్ వంటకాలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల వంటకాల్లో మసాలాలు, పదార్థాలతో కొత్త రుచులు వచ్చేలా చేసి సత్తా చాటారు. ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్తోపాటు న్యాయనిర్ణేతలు వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్, కునాల్ కపూర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.ఆ సమయంలో పుష్పరాజ్ పేరుతో వండిన చికెన్తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ‘మా రెస్టారెంట్లో లడ్డుకు ప్రత్యేక ఆదరణ ఉంది. మహిళలు వంట తెలియకుండానే నేర్చుకునే ఓ గొప్ప నైపుణ్యం. మా పాప అభిరుచి కోసం నేను తోడుగా నిలిచా’ అని తల్లి చందన చెబుతుంటే, అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని సాయిశ్రీ అంటున్నారు. -
చరిత్ర సృష్టించిన భారత్
-
సక్సెస్ఫుల్ కోచ్
భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో క్లీన్స్వీప్నకు గురి కావడం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో చిత్తుగా ఓడటం హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. కోచ్గా సమర్థుడు కాకపోయినా... బీసీసీఐ పెద్ద అండదండలంతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను ‘డ్రా’గా ముగించినా అతనికి తగిన క్రెడిట్ దక్కలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్కు సంబంధించి మాత్రం గంభీర్ను విజయవంతమైన కోచ్గా అంగీకరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోరీ్నల్లో జట్టు విజేతగా నిలవడంతో కోచ్గా అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్ కప్ టోరీ్నకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కెపె్టన్గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్ కప్లను గెలిపించిన కెపె్టన్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టి20 వరల్డ్కప్ గెలిచిన గంభీర్ ఇప్పుడు కోచ్గా తన ఖాతాలో మరో ప్రపంచకప్ జమ చేసుకున్నాడు. -
సామ్సన్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఫైనల్లో పవర్ హిట్టింగ్
-
రఫ్పాడించిన భారత్.. టీ20 ఛాంపియన్స్ 2026
-
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
-
'త్రి'వర్ణ విజయం
సామ్సన్ కొట్టిన సిక్స్లను కరిగే క్షణాలు కూడా కాసేపాగి వీక్షించినట్లు.. అభిషేక్ బాదిన బౌండరీల్ని పదిలంగా దాచుకోవాలని మైదానం తలచినట్లు.. ఇషాన్ ధనాధన్ అర్ధశతకానికి బంతి పెద్ద ఫ్యాన్ అయినట్లు... అహ్మదాబాద్లో పరుచుకున్న ‘పరుగుల’ వెన్నెల యావత్ భారతాన్ని మురిపించింది. ఎందుకంటే ఈ ప్రపంచకప్ విజయం...దీని తాలూకు వచ్చే ఆనందం... ఓ పూటకే సరిపోదు.ఒక్క చోటికే పరిమితం కాదు. మొత్తం దేశాన్నే తమ క్రికెట్ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది.ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ను ముద్దాడింది.2019 వన్డే ప్రపంచకప్లో మనల్ని ఫైనల్ చేరకుండా సెమీస్లోనే వెళ్లగొట్టిన న్యూజిలాండ్ జట్టుకు... 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మనగడ్డపై మనల్ని ముంచిన అహ్మదాబాద్ వేదికకు.. టీమిండియా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. 2026 టి20 ప్రపంచకప్లో భారత్ విజేతగానిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గాకరీబియన్లో పట్టుకొచ్చిన టి20 ప్రపంచకప్ను సొంతగడ్డపైనా నిలబెట్టుకుంది. సెమీస్లోఇంగ్లండ్పై, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్పై భారత బ్యాటింగ్ దళం గర్జించింది.వందేమాతరం... వందేమాతరం... లక్ష మంది అభిమానులతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తిపోయింది... ఇందులో రెండున్నరేళ్ల క్రితం ఇదే మైదానంలో గుండెకోతను అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు అది గతం.. నాటి గాయానికి మందు రాసేలా సొంతగడ్డపై, ఫ్యాన్స్ సమక్షంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్ను సగర్వంగా అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడో టైటిల్ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా ఘనత సాధించింది. రెండేళ్ల క్రితం విశ్వ విజేతగా నిలిచిన నాటి నుంచి ఏ రోజూ స్థాయి తగ్గకుండా అదే దూకుడు, జోరుతో ఆడిన టీమిండియా అదే తీవ్రతను కొనసాగిస్తూ టైటిల్ నిలబెట్టుకోవడం విశేషం.ఫైనల్లో న్యూజిలాండ్తో సమరం అంటే ముందుగా మనదే కొంత పైచేయిగా కనిపించింది... దానికి తగినట్లుగా ఆరంభం నుంచే టాప్–3 బ్యాటర్లు విరుచుకుపడ్డారు. సామ్సన్ తన ధాటిని కొనసాగించగా అభిషేక్ అసలు పోరులో తన సత్తాను ప్రదర్శించాడు. తోడుగా ఇషాన్ కిషన్ కూడా చెలరేగడంతో బౌండరీల విధ్వంసం సాగింది. ప్రతీ బంతీ బౌండరీ దాటుతుండగా భారత్ ఆట చూస్తే 300 స్కోరు ఖాయమనిపించింది. అక్కడి వరకు చేరకపోయినా 255 పరుగులతో మ్యాచ్ను శాసించే స్థితిలో టీమిండియా నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు వేదికపై ఛేదన ఎంత కష్టమో కివీస్కు తెలిసే సరికి మ్యాచ్ ముగిసిపోయింది... బుమ్రా, అక్షర్ బౌలింగ్తో ఆ జట్టు కునారిల్లింది. సంపూర్ణ ఆధిపత్యంతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది.అభిషేక్ బౌలింగ్లో డఫీ కొట్టిన షాట్ను బౌండరీ వద్ద హైదరాబాదీ తిలక్ వర్మ అందుకోవడంతో అన్ని వైపుల నుంచి వేడుకలు మొదలయ్యాయి. గత టోర్నీ గెలుపు అనుభవాన్ని కొందరు మళ్లీ రుచి చూస్తే... తొలిసారి వరల్డ్ కప్ నెగ్గిన కుర్రాళ్ల ఆనందానికి అవధుల్లేవు... వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్గా సూర్యకుమార్ చరిత్రకెక్కగా... గత వరల్డ్ కప్ విజేతలు కపిల్, ధోని, రోహిత్ శర్మ గ్యాలరీ నుంచి అభినందిస్తుండగా టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో మువ్వన్నెల జెండాతో సంబరాలు చేసుకున్నారు. అహ్మదాబాద్: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచింది. గతంలో 2007, 2024లో టైటిల్ సాధించిన టీమిండియా ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్స్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్లు), సాంట్నర్ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) న్యూజిలాండ్ను దెబ్బ తీశారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 27 కోట్ల 48 లక్షల ప్రైజ్మనీ దక్కింది. ధనాధన్ దూకుడు... తొలి ఓవర్లో 7 పరుగులు, రెండో ఓవర్లో 5 పరుగులు... ఇంత వరకు భారత్ కాస్త జాగ్రత్త పడింది. డఫీ వేసిన మూడో ఓవర్తో మొదలైన బ్యాటింగ్ విధ్వంసం చివరి ఓవర్ వరకు సాగింది. టాప్–3 బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి కివీస్ పనిపట్టారు. ఫెర్గూసన్ ఓవర్లో అభిషేక్, సామ్సన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి. హెన్రీ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్ బాదగా, డఫీ ఓవర్లో అభిషేక్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 92 పరుగులకు చేరింది. 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అభిషేక్ వెనుదిరిగినా, కిషన్ వచ్చి అదే జోరును కొనసాగించాడు. 33 బంతుల్లో సామ్సన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఫెర్గూసన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 2 సిక్స్లు బాదగా, కిషన్ మరో సిక్స్ కొట్టాడు. రచిన్ వేసిన 14వ ఓవర్లోనైతే సామ్సన్ వరుసగా 6, 6, 6తో చెలరేగిపోగా, కిషన్ కూడా 23 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకున్నాడు. అయితే ఎట్టకేలకు తర్వాతి 16–19 వరకు నాలుగు ఓవర్ల పాటు భారత్ను కట్టడి చేయడంలో కివీస్ సఫలమైంది. నీషమ్ వేసిన ఒకే ఓవర్లో సామ్సన్, కిషన్, సూర్యకుమార్ (0) అవుట్ కాగా... పాండ్యా (18)ను హెన్రీ అవుట్ చేశాడు. ఈ నాలుగు ఓవర్లలో కలిపి 28 పరుగులే వచ్చాయి. అయితే నీషమ్ వేసిన చివరి ఓవర్లో దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగిపోయాడు. దాంతో స్కోరు 250 దాటింది. సీఫెర్ట్ మినహా... తమ జట్టుకు శుభారంభం అందించడంలో కివీస్ ఓపెనర్లు విఫలమయ్యారు. పాండ్యా ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు బాది సీఫెర్ట్ జోరు ప్రదర్శించినా... మరోవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 బంతుల వ్యవధిలో అలెన్ (9), రచిన్(1) అవుట్ కాగా, ఫిలిప్స్ను (5) అక్షర్ బౌల్డ్ చేశాడు. పవర్ప్లేలో జట్టు 52 పరుగులు చేయగలిగింది. వరుణ్ ఓవర్లో 2 సిక్స్లతో 23 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే నాలుగు బంతుల వ్యవధిలో చాప్మన్ (3), సీఫెర్ట్లు వెనుదిరగడంతో సగం టీమ్ పెవిలియన్ చేరింది. మిచెల్ (17), సాంట్నర్ కొద్దిసేపు పోరాడగలిగారు.అయితే బుమ్రా అద్భుత బంతితో సాంట్నర్ను అవుట్ చేయడంతో కివీస్ ఓటమి లాంఛనమే అయింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) (సబ్) మెక్కోన్కీ (బి) నీషమ్ 89; అభిషేక్ (సి) సీఫెర్ట్ (బి) రచిన్ 52; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) నీషమ్ 54; పాండ్యా (సి) సాంట్నర్ (బి) హెన్రీ 18; సూర్యకుమార్ (సి) రచిన్ (బి) నీషమ్ 0; తిలక్ (నాటౌట్) 8; దూబే (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–98, 2–203, 3–204, 4–204, 5–226. బౌలింగ్: హెన్రీ 4–0–49–1, ఫిలిప్స్ 1–0–5–0, డఫీ 3–0–42–0, ఫెర్గూసన్ 2–0–48–0, సాంట్నర్ 4–0–33–0, రచిన్ రవీంద్ర 2–0–32–1, నీషమ్ 4–0–46–3. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 52; అలెన్ (సి) తిలక్ (బి) అక్షర్ 9; రచిన్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 1; ఫిలిప్స్ (బి) అక్షర్ 5; చాప్మన్ (బి) పాండ్యా 3; మిచెల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 17; సాంట్నర్ (బి)బుమ్రా 43; నీషమ్ (బి) బుమ్రా 8; హెన్రీ (బి) బుమ్రా 0; ఫెర్గూసన్ (నాటౌట్) 6; డఫీ (సి) తిలక్ (బి) అభిషేక్ 3; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–31, 2–32, 3–47, 4–70, 5–72, 6–124, 7–141, 8–141, 9–152, 10–159. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–32–0, పాండ్యా 4–0–36–1, అక్షర్ 3–0–27–3, బుమ్రా 4–0–15–4, వరుణ్ 3–0–39–1, అభిషేక్ 1–0–5–1. -
అందుకే భారత్కు మినహాయింపు ఇచ్చా: ట్రంప్
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్కు తాత్కాలిక అనుమతి ఇచ్చామని అన్నారు. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా మార్గాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “కొంత ఒత్తిడిని తగ్గించడానికి నేను ప్రయత్నిస్తాను. మా దేశంలో భారీగా చమురు ఉంది. బయటి దేశాల్లో కూడా చాలా చమురు ఉంది. చమురు సరఫరా సమస్య చాలా త్వరగా సర్దుకుంటుంది” అని ట్రంప్ తెలిపారు.కాగా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు అంశంపై అమెరికా-భారత్ మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. యుక్రెయిన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేయిస్తున్న యుద్ధానికి భారత్ చమురు కొనుగోలు ద్వారా మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా దీని ద్వారా దెబ్బతింటున్నాయని విమర్శించింది.ఇదీ చదవండి: నీటిలో అంతిమ సంస్కారాలు.. స్కాట్లాండ్ అనుమతి మరోవైపు, అమెరికాలోని ప్రజలు, వ్యాపారాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరాలు, మోసాలు, దోపిడీదారులపై విస్తృతంగా చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సంతకం చేశారు.ఆ ఆదేశం ప్రకారం అమెరికా విదేశాంగ కార్యదర్శి విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరిపి, వారి భూభాగాల్లో పనిచేస్తున్న అంతర్జాతీయ నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కోరాల్సి ఉంటుంది. -
భారత్ ను టెన్షన్ పెడుతున్న కీలక అంశాలు..
-
ఇండియా VS న్యూజిలాండ్ మ్యాచ్ పై వరంగల్ లో పబ్లిక్ టాక్
-
T20 World Cup Final: వార్ వన్ సైడ్..! ఆ టీమ్ దే పైచేయి
-
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ఉద్రిక్తతల ప్రభావం మహా నగరంలోని వాణిజ్య వంట గది వరకూ చేరాయి. గృహాపయోగ వంటగది అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఆదేశాలు తాజాగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ , 1955 కింద చమురు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని ప్రధాన గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లలో వాణిజ్య సిలిండర్ల లోడింగ్ను తాత్కాలికంగా నిలిచిపోయి గ్యాస్ కొరతను సృష్టిస్తోంది. హోటళ్లు – రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం నగరంలోని ఫుడ్ ఇండస్ట్రీపై గ్యాస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ సుమారు 70 నుంచి 80 వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వాణిజ్య గ్యాస్ వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయి. డిమాండ్కు సరిపడా సిలిండర్లు సరఫరా కాకపోతుండటంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. వంటగ్యాస్ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధరలు పెరగగా, మరింత పెరుగుతాయనే ఆశతో కొందరు వ్యాపారులు నిల్వలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ శాతం హోటళ్లు, బిర్యానీ పాయింట్లు వాణిజ్య గ్యాస్పైనే ఆధారపడి ఉన్నాయి. చిన్నపాటి తోపుడు బండ్లు, ఫంక్షన్ల ఆర్డర్లు తీసుకునే క్యాటరర్లు సిలిండర్ల కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని హోటల్ యజమానులు వాపోతున్నారు. రోజువారీ గ్యాస్ వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సగటున 7 నుండి 7.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు (19 కేజీలు) అవసరమవుతుండగా, ఇందులో దాదాపు 50 – 60 శాతం వాటా కాగా.. ఒక్క గ్రేటర్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 12,000– 15,000 కమర్షియల్ సిలిండర్లు అవసరమవుతాయని అంచనా ఒక మధ్యస్థ రెస్టారెంట్కు రోజుకు 2 నుండి 5 సిలిండర్లు అవసరమైతే, పెద్ద హోటళ్లకు 10 కి పైగా అవసరమవుతాయి. చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు రోజుకు సగటున ఒక చిన్న, సగం పెద్ద సిలిండర్ను వినియోగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం గహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, కమర్షియల్ సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధించడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద సాధారణంగా 2–3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటాయి. సరఫరాలో జాప్యం జరిగితే హోటల్ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సిలిండర్ల కోసం ‘పానిక్ బుకింగ్’ మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే ముడి చమురు సరఫరా నిలిచిపోతుందని, తద్వారా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ భయంతో సామాన్య ప్రజలు తమకు అవసరం లేకున్నా ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. -
ట్రిపుల్ టైటిల్ వేటలో...
భారత జట్టు 2024 టి20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటి వరకు 49 మ్యాచ్లు ఆడితే 40 గెలిచింది. 2023 ఆగస్టు నుంచి మన టీమ్ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. జట్టులో పలు మార్పులు చేసుకున్నా, ఆఖరి క్షణాల్లో ఆటగాళ్లను చేర్చినా ఫలితాల్లో మాత్రం తేడా రాలేదు. ఎలాంటి నిర్ణయం, వ్యూహమైనా అద్భుతంగా పని చేశాయి. ఇలాంటి విజయాల తర్వాత, ఇంత బలమైన జట్టుకు ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉంది. కానీ అనిశ్చితికి మారుపేరైన టి20 క్రికెట్లో కొన్ని అనూహ్య క్షణాలు కూడా రాత మారుస్తాయి. అలాంటివి అధిగమించి టీమిండియా మూడోసారి, వరుసగా రెండోసారి వరల్డ్ కప్ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించగలదా?అవతలి వైపు ఉన్న జట్టు మనతో పోలిస్తే చిన్నదే కావచ్చు... బలాబలాల్లో, అనుభవంతో భారత్కు పోటీ కాకపోవచ్చు. కానీ పోరాడితే పోయేదేమీ లేదనే తత్వమే న్యూజిలాండ్ను ఒక్కసారిగా బలంగా మార్చేస్తుంది. రెండున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన రోజు భారత అభిమానులకు ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకం... కానీ నేటి ఫైనల్లో కివీస్ ఓడితే తర్వాతి వారంలో ఆ దేశంలో అంతా మరచిపోతారు. వారి రోజూవారీ సంవాదనల్లో అది ఒక విషయమే కాదు. ఆ టీమ్లో స్టార్ పేసర్ లేకపోయినా, మిస్టరీ స్పిన్నర్ లేకపోయినా గెలిచేందుకు కావాల్సినంత కసి ఉంది. ఇప్పుడు అలాంటిదే వారికి మొదటి టి20 వరల్డ్ కప్ అందించాలి. ప్రపంచకప్లలో పడిన ‘రన్నరప్’ ముద్రను ఆ జట్టు మార్చగలదా?వ్యూహ ప్రతివ్యూహాలు, భావోద్వేగాలు, ప్రతిభ మాత్రమే సరిపోదు, కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి...చివరకు రోజు ముగిసేసరికి ఒక్క జట్టుకు మాత్రం సంపూర్ణ ఆనందం దక్కితే మరో జట్టుకు తీవ్ర నిరాశ ఖాయం. ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో ఓటమి మినహా టోర్నీ ఆసాంతం టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబర్చగా... పడుతూ, లేస్తూ ప్రయాణం సాగించిన కివీస్ సెమీస్లో దక్షిణాఫ్రికాపైనే భారీ విజయంతో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ నేపథ్యంలో పదో టి20 వరల్డ్ కప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్: టి20 ప్రపంచ కప్లో రెండుసార్లు (2007, 2024) విజేతగా నిలిచి ఇప్పుడు మూడో టైటిల్పై గురి పెట్టిన జట్టు ఒకవైపు...తొమ్మిది ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయిన జట్టు మరోవైపు... ఒక టీమ్ టోర్నీ గెలిస్తే తొలిసారి ‘ట్రిపుల్’ సాధించిన జట్టు కావడంతో పాటు సొంతగడ్డపై నెగ్గిన తొలి టీమ్గా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. మరో టీమ్ గెలిస్తే సుదీర్ఘ కాలంగా అందకుండా ఊరిస్తున్న వరల్డ్ కప్ కల నెరవేరుతుంది. ఇలాంటి అంచనాల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు డిఫెండింగ్ చాంపియన్ భారత్, న్యూజిలాండ్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. స్వదేశంలో టీమిండియా విజయంపై అభిమానులు భారీ ఆశలతో ఉండగా... కివీస్ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబర్చాలని పట్టుదలగా ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇదే మైదానంలో టి20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి ట్రోఫీని అందుకోవాలని సూర్యకుమార్ బృందం భావిస్తోంది. వరుణ్ స్థానంలో కుల్దీప్! ప్రపంచకప్లో భారత్ ప్రదర్శన చూస్తే ఇప్పడు ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. కానీ ‘సూపర్ ఎయిట్స్’ దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేలవ ఆట జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎంత ఘనంగా బౌలింగ్ చేసినా టి20ల్లో తాజా ఫామ్ కీలకం. దాదాపు 12 పరుగుల ఎకానమీతో అతను 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. వరుణ్ మిస్టరీని ప్రత్యర్థులు ఛేదించినట్లుగా కనిపిస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే భావిస్తే అతని స్థానంలో ఎడంచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కవచ్చు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్పై కూడా కాస్త సందేహం ఉన్నా... ఒంటిచేత్తో ఆట స్వరూపాన్ని మార్చే అతడిని పక్కన పెట్టే ఆలోచన చేయకపోవచ్చు. సంజు సామ్సన్ గత రెండు మ్యాచ్లలో చెలరేగిన విధంగా మరో నాకౌట్ మ్యాచ్లోనూ ఆడితే జట్టుకు తిరుగుండదు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. చివర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వేగంగా అందించే అదనపు పరుగులతో ప్రత్యర్థికి టీమిండియా సవాల్ విసరడం ఖాయం.ముందుగా బ్యాటింగ్ చేస్తే మరోసారి 200కు పైగా స్కోరు చేస్తే జట్టు నిశ్చింతగా ఉండవచ్చు. డఫీకి చోటు! న్యూజిలాండ్ విజయావకాశాలన్నీ ఇప్పుడు ఓపెనింగ్ జోడీ ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్లపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాపై మెరుపు వేగంతో చెలరేగిన వీరిద్దరు మరోసారి శుభారంభం అందించగలరు. ఇన్నింగ్స్ మొదట్లోనే బుమ్రా, అర్ష్ దీప్ వీరిని కట్టడి చేయడం కీలకం. రచిన్ రవీంద్ర ఆల్రౌండర్గా రాణిస్తుండగా, ఫిలిప్స్ బ్యాటింగ్ కూడా కీలకం. వరల్డ్ కప్కు ముందు భారత్పై చెలరేగిన మిచెల్ ఈ టోర్నీలో పూర్తిగా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. అసలు సమరంలోనైనా అతను తన స్థాయికి తగినట్లుగా ఆడాలని టీమ్ కోరుకుంటోంది. చాప్మన్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. కెపె్టన్ సాంట్నర్పై అటు ఆల్రౌండర్గా, ఇటు కెపె్టన్గా కూడా అదనపు భారం ఉంది. గతంలో ఏ కివీస్ సారథికి సాధ్యం కాని ఘనతను అందుకోవాలంటే అతను కూడా స్వయంగా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. పిచ్ కాస్త అనుకూలిస్తే పేసర్లు హెన్రీ, ఫెర్గూసన్ ప్రమాదకారులు కాగలరు. టీమిండియా లెఫ్ట్ హ్యాండర్లను నిలువరించేందుకు ఆఫ్స్పిన్నర్ మెక్కోన్కీ జట్టు సమర్థంగా వాడుకునే ప్రయత్నం చేయడం ఖాయం. ఆల్రౌండర్ నీషమ్ స్థానంలో పేసర్ డఫీకి చోటు దక్కే అవకాశం ఉంది. 7 అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 10 టి20 మ్యాచ్లు ఆడింది. 7 మ్యాచ్ల్లో గెలిచి, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ వేదికపై న్యూజిలాండ్తో ఆడిన ఒక టి20 మ్యాచ్లో భారత జట్టే గెలిచింది. పిచ్, వాతావరణం ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి మిశ్రమం కలిపిన పిచ్ను ఫైనల్ కోసం సిద్ధం చేశారు. దీనిపై మంచి పేస్, బౌన్స్ ఉండి బ్యాటింగ్కు చక్కగా అనుకూలిస్తుంది. భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఉంది. స్పిన్కు తగిన టర్న్ లభించకపోవచ్చు. ఈ మైదానంలోనే దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా... ఆ మ్యాచ్ను భారత్ మరో పిచ్పై ఆడింది. గత ఎనిమిది మ్యాచ్లలో తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే ఐదుసార్లు గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఛేదనకే మొగ్గు చూపవచ్చు. అయితే భారత్పై సెమీస్లో ఇంగ్లండ్ ఒత్తిడిలో చిత్తయిన తీరు చూస్తే ముందుగా బ్యాటింగ్ చేయడమే మేలు. వర్షం సమస్య లేదు. ఒకవేళ వాన వచ్చినా రిజర్వ్ డే ఉంది. 2-2 భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన గత నాలుగు ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్లలో ఇరు జట్లూ చెరో రెండు గెలిచి 2–2తో సమంగా ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలవగా... 2019 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ గెలుపొందింది.16 భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 టి20 మ్యాచ్లు జరిగాయి. 16 మ్యాచ్ల్లో భారత్, 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మూడు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), సామ్సన్, అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్వర్మ, పాండ్యా, దూబే, అక్షర్, బుమ్రా, అర్ష్ దీప్, వరుణ్/కుల్దీప్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), అలెన్, సీఫెర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, మెక్కోన్కీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్/డఫీ. -
ఇంటర్నెట్ను ఊపేసిన ఈ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు మరోసారి..
అరుణ్ కుమార్ అనే బాలుడు చేతిలో చాయ్ కప్ పట్టుకుని నవ్విన వీడియో సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఈ బాలుడి వీడియోను మీరు కూడా ఇప్పటికే మీమ్స్లో లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు. 15 సెకన్ల అతడి చిన్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇప్పుడు అతడిని అందరూ గుర్తు పడుతున్నారు. ఆ వీడియోను అతని యజమాని ట్రక్ డ్రైవర్ నెహ్రూ ప్రయాణం మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తీసి, పోస్ట్ చేశాడు. అరుణ్ నవ్వు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నెట్లో అత్యధికంగా షేర్లు వచ్చిన మీమ్లలో ఒకటిగా మారింది. లక్షల మంది ఆ క్లిప్ చూశారు. కానీ, ఆ వీడియోలో కనిపించిన బాలుడి కథ చాలా మందికి తెలియదు.‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ తెలిపిన సమాచారం ప్రకారం.. అరుణ్ చిన్నప్పటి నుంచే తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నాడు. పేదరికం కారణంగా చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది. అరుణ్ 10 సంవత్సరాల వయసులోనే 4వ తరగతి చదువుతున్న సమయంలో పాఠశాల చదువును మానేశాడు. అతడి కుటుంబం పేదరికంతో పోరాడుతోంది. చదువు కొనసాగించడం సాధ్యం కాలేదు. పని చేయడం తప్ప మరో మార్గం అతనికి లేదు.ఆ సమయంలో డ్రైవర్ నెహ్రూ అతనిని ట్రక్ క్లీనర్గా పనికి పెట్టుకున్నాడు. రోజువారీ పనుల్లో నెహ్రూకి అతడు సాయం చేశాడు. వింత ఏమిటంటే అతని వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతుండగా ప్రజలు అతని గురించి రాసిన కామెంట్లు చదవడం కూడా అరుణ్కు సాధ్యం కాలేదు. లక్షల మంది అతని నవ్వును ప్రశంసిస్తున్నా ఆ ప్రశంసలను చదవలేడు.. అర్థం చేసుకోలేడు.క్లీనర్ జీవితాన్ని మార్చుతున్న డ్రైవర్అరుణ్ గురించి నెహ్రూ బాగా ఆలోచించాడు. అతని భవిష్యత్తు మార్చాలని నిర్ణయించాడు. నెహ్రూ కూడా ఒకప్పుడు తన కుటుంబాన్ని పోషించేందుకు కాలేజీ చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది. ప్రజలు ఆన్లైన్లో అరుణ్ను ప్రశంసించడం చూసి ఆ బాలుడి భవిష్యత్తు గురించిహ్రూ బాగా ఆలోచించాడు. అరుణ్కు పుస్తకాలు కొనిచ్చాడు. పరీక్ష ఫీజులు చెల్లించాడు. 10వ తరగతి బోర్డు పరీక్షను ప్రైవేట్గా రాయించాడు.ట్రక్లో ప్రయాణిస్తున్న సమయంలో చాయ్ విరామం సమయాల్లో అరుణ్కు నెహ్రూ అక్షరాలు, గణితం నేర్పించాడు. తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు అరుణ్. ఈ సంవత్సరం అతని కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. పదో తరగతి బోర్డు పరీక్షలో అతను ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతడి కథ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందంటూ అమెరికా ట్రెజరీ శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కామెంట్లు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. ఇప్పటికే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేయటానికి భారత్కు అనుమతి ఇచ్చినట్టు అమెరికా తెలిపిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా మనకు అనుమతి అనుమతి ఇవ్వడం ఏంటని భారత్లో విపక్షాలు మండిపడుతున్నాయి. ఇటువంటి సమయంలో స్కౌట్ కీలక వ్యాఖ్యలు చేశారు.“ప్రపంచానికి చమురు సరఫరా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న రష్యా చమురు కొనుగోలును ప్రారంభించటానికి మా మిత్ర దేశం భారత్కు నిన్న అమెరికా ట్రెజరీ శాఖ అనుమతి ఇచ్చింది” అని స్కాట్ బెసెంట్ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.“భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ముందుగా ఆంక్షలు ఉన్న రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని మేము కోరాం.. భారత్ ఆపింది. దాని స్థానంలో అమెరికా నుంచి చమురు కొనాలని భారత్ నిర్ణయించింది. కానీ, ప్రపంచ చమురు సరఫరాలో ఏర్పడ్డ తాత్కాలిక లోటును తగ్గించటానికి ఇప్పుడు రష్యా చమురును కొనడానికి మేము భారత్కు అనుమతి ఇచ్చాం. రష్యా చమురుపై ఉన్న మరికొన్ని ఆంక్షలను కూడా తొలగించవచ్చు” అని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండడంతో మార్కెట్కు ఉపశమనం ఇవ్వటానికి చర్యలు ప్రకటించే ప్రక్రియ కొనసాగుతుంది” అని తెలిపారు.ట్రంప్ పరిపాలనలోని మరికొంతమంది అధికారులు కూడా రష్యా చమురును కొనుగోలు చేయడానికి భారత్కు అనుమతి ఇచ్చామని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొన్ని నెలల క్రితం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో రష్యా నుంచి చమురు కొనుగోలుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చామని అమెరికా అంటోంది.అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధం చేస్తున్న సమయంలో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చేయడం, మార్కెట్లో ఒత్తిడి తగ్గించడమే లక్ష్యమని అమెరికా అధికారులు చెప్పారు. హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న పరిస్థితుల వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. -
T20 WC 2026: ఐసీసీ రంగంలోకి దిగినా.. తప్పని చిక్కులు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో వెస్టిండీస్ ఫర్వాలేదనిపించగా.. సౌతాఫ్రికా సెమీస్ వరకు ప్రయాణం కొనసాగించింది. లీగ్ దశలో అదరగొట్టిన విండీస్ జట్టు.. సూపర్-8లో కీలక మ్యాచ్లో టీమిండియా చేతిలో ఓడి నిష్క్రమించింది.మరోవైపు.. సౌతాఫ్రికా లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు.. సూపర్-8లోనూ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్లో అడుగుపెట్టింది. అయితే, కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి మరోసారి ‘చోకర్స్’ అన్న బిరుదును సార్థకం చేసుకుంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఇంకా ఇంటికి చేరుకోలేదు.భారత్లోనే చిక్కుకుపోయారుఇందుకు మధ్య ప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం కారణం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండగా.. అందుకు ఇరాన్ కూడా గట్టిగానే బదులిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేశారు. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా జట్ల ఆటగాళ్లు భారత్లోనే చిక్కుకుపోయారు. అయితే, జింబాబ్వే జట్టును ప్రత్యేక విమానంలో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తరలించినట్లు సమాచారం.ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా..ఇక వెస్టిండీస్ జట్టు కోసం కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా.. ఎయిర్ ట్రాఫిక్ అధికారుల నుంచి ఇంత వరకు ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లలో మరోసారి ఆందోళన నెలకొంది. కాగా ఇప్పటికే వెస్టిండీస్ హెడ్కోచ్ డారెన్ సామీ (Daren Sammy).. తమను స్వదేశానికి చేర్చమంటూ దీనంగా అర్థించిన విషయం తెలిసిందే.ఇక బౌలర్ అకీల్ హొసేన్ సైతం క్రిస్టియాన్ రొనాల్డోనే ఈ పరిస్థితులలో తమను ఆదుకోగలడంటూ ట్వీట్ చేశాడు. అయితే, ఐపీఎల్లో భాగమైన షెర్ఫానే రూథర్ఫర్డ్, రోవ్మన్ పావెల్, షిమ్రన్ హెట్మైర్ తదితరులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.సౌతాఫ్రికానూ వీడని చిక్కులుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా మరికొన్నాళ్లు భారత్లోనే ఉండాల్సి రావొచ్చు. అయితే, న్యూజిలాండ్తో టీ20 సిరీస్ నేపథ్యంలో దాదాపు నలుగురు ఆటగాళ్లు నేరుగా కివీస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సెమీస్ మ్యాచ్లలో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. ఇంగ్లండ్ను టీమిండియా ఓడించి ఫైనల్కు అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
AI నైపుణ్యాల్లో మహిళల దూకుడు.. అధ్యయనంలో వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్న ప్రస్తుత తరుణంలో... భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐని స్వీకరించడంలో పురుషులతో సమానంగానే కాకుండా, వారి కంటే ముందున్నారని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన 'లింక్డ్ఇన్' తాజా పరిశోధనలో వెల్లడైంది.లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలోని మహిళా నిపుణుల్లో 90 శాతం మంది... కార్యాలయాల్లో ఏఐ సాధనాలను ఉపయోగించడం పట్ల తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. ఇది పురుషుల (86%) కంటే ఎక్కువ. అంతేకాకుండా, ఏఐ సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో కూడా మహిళలు మరింత చురుకుగా ఉన్నారు. తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి 35 శాతం మంది మహిళలు చురుకుగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటుండగా, పురుషుల్లో ఈ సంఖ్య 29 శాతంగా మాత్రమే ఉంది.ఈ సానుకూల ధోరణి కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు. వ్యాపారవేత్తల విభాగంలో కూడా... తమ కంపెనీల వృద్ధిపై పురుషుల (66%) కంటే మహిళా వ్యవస్థాపకులు (78%) అత్యంత సానుకూలంగా ఉన్నారు. తమ వ్యాపారాలను మరింత విస్తరించడానికి వీరు 'ఏఐ ఆధారిత ఆటోమేషన్', స్మార్ట్ వర్క్ఫ్లోలు మరియు డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. తమ సంస్థల్లో 'డిజిటల్ పరివర్తన'కు నాంది పలుకుతున్నారు.దీనిపై లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ.. “భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐ సాధనాలను ఉపయోగించడంలో బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. లేబర్ మార్కెట్ వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త నిరాశజనకంగానే ఉన్నాయి. లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం ఇప్పటికీ 28.1% శాతంతో చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి కేవలం సాంకేతికత ఒక్కటే సరిపోదు. అయితే ఇక్కడో ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే విధుల్లో ఉన్న అనేక మంది మహిళలు ఏఐ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మరింత ఉత్పాదకతను సాధించే సాధనంగా వారు ఏఐని చూస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు అవసరమైన ఏఐ నైపుణ్యాలను వారు వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. పనిలో (ప్రాజెక్టులలో) తమ ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి, నాయకత్వ పాత్రల్లో ఎదగడానికి మహిళలకు ఏఐ ఒక బలమైన సాధనంగా ఉపయోగపడుతుంది," అని అన్నారు.వృత్తిపరమైన ఎదుగుదలకు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో మహిళా నిపుణుల కోసం లింక్డ్ఇన్ చెబుతున్న ఐదు సూచనలు ఇక్కడ ఉన్నాయి:👉మనిషి చేసే పనులకు ఏఐని జతచేయండి: విశ్లేషించడం, నిర్వహించడం మరియు పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐని ఉపయోగించండి. ఆ మిగిలిన సమయాన్ని... మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే నైపుణ్యాలైన బృంద స్ఫూర్తిని పెంపొందించడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు సానుభూతిని ప్రదర్శించడం కోసం కేటాయించండి.👉మీ సొంత అభ్యాసానికి ఏఐని ఉత్ప్రేరకంగా మార్చుకోండి: అనుబంధ రంగాలను అన్వేషించడానికి, కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాల లోపాలను గుర్తించడానికి ఏఐని ఉపయోగించండి. మీ ఉద్యోగ పాత్ర, లక్ష్యాలు మరియు ఇప్పటికే ఉన్న నైపుణ్యాల ఆధారంగా నేర్చుకోవాల్సిన కొత్త కోర్సులను... లింక్డ్ఇన్ లెర్నింగ్ యొక్క 'ఏఐ-పవర్డ్ కోచింగ్’ మీకు సూచిస్తుంది. అసలు ఎక్కడ ప్రారంభించాలో తెలియని గందరగోళాన్ని ఇది తొలగిస్తుంది.👉 మీ మానవ నైపుణ్యాలను విస్తృతం చేసుకోండి: మీ సామర్థ్యాలను పదునుపెట్టే సహచరుడిగా ఏఐని భావించండి. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి, సృజనాత్మక పరిష్కారాల కోసం లేదా రాబోయే ఫలితాలను ముందుగానే అంచనా వేయడానికి దీనిని ఉపయోగించండి. ఏఐతో మీ భాగస్వామ్యం మీ ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. మంచి ఆలోచనలను... అందరూ ఆమోదించదగిన, డేటా-ఆధారిత ప్రతిపాదనలుగా మార్చడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.👉 ప్రాంప్ట్ ఇవ్వడంలో ప్రావీణ్యం పొందండి: ఏఐ సాధనాల వాడకంపై అవగాహన ఉండటం నేడు తప్పనిసరి. అయితే ఆ సాధనాలకు సరైన ఆదేశాలు ఇవ్వడం తెలిస్తేనే అసలైన ప్రయోజనం కలుగుతుంది. సమర్థవంతమైన ప్రాంప్ట్లను (కమాండ్స్ను) రూపొందించడం నేర్చుకోండి. ఈ నైపుణ్యం మిమ్మల్ని హైబ్రిడ్ ప్రొఫెషనల్గా మారుస్తుంది. ఏ సంస్థకైనా మీరు అత్యంత ఆవశ్యకమైన ఉద్యోగిగా మారుతారు.👉 కేవలం రోజువారీ పనులకే కాదు, మీ కెరీర్ కోసం ఏఐని ఉపయోగించండి: ఏఐని కేవలం ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయడానికి మాత్రమే పరిమితం చేయకండి. మీ వృత్తిపరమైన భవిష్యత్తును నిర్వహించుకోవడానికి దాన్ని అనుమతించండి. లింక్డ్ఇన్ యొక్క 'ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్' వంటి సాధనాలతో, మీరు సహజ భాషను ఉపయోగించి మీ లక్ష్యాలు మరియు నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాల కోసం వెతకవచ్చు. ఆ ఉద్యోగానికి మీరు ఎంతవరకు సరిపోతారో లింక్డ్ఇన్ యొక్క 'జాబ్ మ్యాచ్' మీకు స్పష్టంగా చూపిస్తుంది.👉ఏఐ కేవలం మీరు పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మాత్రమే కాకుండా... మీ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి అవసరమైన సమయాన్ని కూడా ఇస్తుంది. వేగంగా మారుతున్న పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళా నిపుణులకు, ఏఐని స్వీకరించడం అనేది ఒక కెరీర్ అడ్వాంటేజ్ మాత్రమే కాదు.. వారు కోరుకునే కెరీర్ వైపు పయనించడానికి ఇది ఒక స్పృహతో కూడిన పిలుపు. -
వెనక్కి తగ్గిన ట్రంప్.. భారత్ కు గుడ్ న్యూస్
-
యుద్ధం వేళ.. మరో ఇరాన్ నౌకకు భారత్ ఆశ్రయం
న్యూఢిల్లీ: ఇరాన్ నావికా దళానికి చెందిన ఒక యుద్ధ నౌకకు భారత్ అత్యవసర ఆశ్రయం కల్పించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఆర్ఐఎస్ లవాన్ నౌకలో(IRIS Lavan) సాంకేతిక సమస్య ఏర్పడటంతో మార్చి 4న దాన్ని కోచి నౌకాశ్రయంలోకి అనుమతించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ నౌకలో 183 మంది సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవల విశాఖ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్కు ఇరాన్కు చెందిన నౌక ఐరిస్ లవన్ వచ్చింది. అయితే తిరుగు ప్రయాణంలో నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొచ్చిలో దీన్ని నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ ఫిబ్రవరి 28న భారత ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అందుకు మార్చి 1నే అనుమతి లభించిందని అధికారులు తెలిపారు. దీంతో ఐరిస్ లావన్ మార్చి 4న కొచ్చి ఓడరేవుకు చేరింది.మరోవైపు, ఇటీవల విశాఖపట్నంలో భారత నౌకాదళంతో సంయుక్త విన్యాసాల్లో పాల్గొని తిరుగుముఖం పట్టిన ఇరాన్ యుద్ధ నౌక ఓఆర్ఐఎస్ దేనాను బుధవారం శ్రీలంక సముద్ర జలాల సమీపంలో అమెరికా దాడి చేసి ముంచేయడం తెలిసిందే. దాంతో అందులోని 87 మంది నావికులు దుర్మరణం పాలయ్యారు. అందుకు ప్రతీకారంగా మర్నాడే పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై ఇరాన్ దాడికి దిగింది. -
రేపు అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్
-
హోటల్ మారితే అదృష్టం మారేనా!
అహ్మదాబాద్: నమ్మకం లేదా సెంటిమెంట్ అనుకోండి లేదా మూఢ విశ్వాసం అనుకోండి కానీ భారత క్రికెట్ జట్టుకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అనూహ్య, ఆసక్తికర విషయాలు బయటకు వస్తుంటాయి. జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తుంటాడని సమాచారం. ఏ నగరంలో మ్యాచ్కు వెళ్లినా అక్కడి ప్రఖ్యాత దేవాలయానికి ఆటగాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించడం ఆయనకు రివాజుగా మారిపోయింది. సెమీఫైనల్కు ముందు రోజు ప్రాక్టీస్ కోసం వాంఖెడే స్టేడియానికి జట్టు వచ్చినా... ఆ రోజు చంద్ర గ్రహణం కారణంగా ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్ దాటి బయటకు రాలేదు. గ్రహణం ముగిసిన తర్వాతే గంటసేపు ఆలస్యంగా టీమిండియా సాధన మొదలైంది. ఇప్పుడు కూడా ఫైనల్ కోసం మరో సెంటిమెంట్ అంశం వినిపిస్తోంది. అహ్మదాబాద్లో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడినప్పుడు భారత జట్టు ఐటీసీ నర్మద హోటల్లో బస చేసింది. నాటి మ్యాచ్లో పరాజయం జట్టును తీవ్రంగా బాధించింది. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం అక్కడ మాత్రం ఉండరాదని జట్టు అనుకుంది. అందుకే ఈసారి తాజ్ స్కైలైన్లో భారత బృందం దిగింది. దీంతో తమ అదృష్టం మారవచ్చని టీమ్ భావిస్తున్నట్లుంది. మరోవైపు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా ‘హోం’ కాకుండా విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్ను వాడుకోవాలని కూడా టీమ్ నిర్ణయించింది. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్లో పాల్గొనే అధికారుల బృందాన్ని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్ వ్యవహరిస్తారు. థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా దక్షిణాఫ్రికాకు చెందిన అలావుద్దీన్ పలేకర్, ఆడ్రియాన్ హోల్డ్స్టాక్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వరల్డ్ కప్ తుది పోరు జరుగుతుంది. సామ్సన్ నామినేట్... టి20 వరల్డ్ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కోసం షార్ట్ లిస్ట్ చేసిన ఎనిమిది ఆటగాళ్ల జాబితాలో భారత్కు చెందిన సంజు సామ్సన్ పేరు కూడా ఉంది. సామ్సన్తో పాటు విల్ జాక్స్ (ఇంగ్లండ్), సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్), రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్), షాడ్లీ వాన్ షాల్విక్ (అమెరికా), మార్క్రమ్, ఎన్గిడి (దక్షిణాఫ్రికా) ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. బుమ్రా కూడా విఫలం కావచ్చు! భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒంటిచేత్తో అతను మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. ఈ విషయం న్యూజిలాండ్కు కూడా బాగా తెలుసు. అయితే ఫైనల్లో తమపై మాత్రం బుమ్రా విఫలం కావాలని కోరుకుంటున్నట్లు కివీస్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అన్నాడు. ‘బుమ్రా అద్భుతమైన బౌలర్ అనడంలో సందేహం లేదు. అతని బౌలింగ్లో ఎంతో వైవిధ్యం ఉంది. యార్కర్లను గొప్పగా సంధించగలడు. అయితే అతను కూడా మానవమాత్రుడే. ఏదో ఒకరోజు విఫలం కావచ్చు కూడా. అది ఆదివారమే కావాలని ఆశిస్తున్నాం’ అని ఫిలిప్స్ చెప్పాడు. భారత్తో పోలిస్తే జనాభాలో ఎంతో చిన్నదైన తమ దేశం క్రికెట్లో ఇప్పటి వరకు సాధిస్తూ వచ్చిన ఘనత చిన్నదేమీ కాదని అతను అభిప్రాయపడ్డాడు. సుమారు 50 లక్షల జనాభా ఉన్న కివీస్ వరల్డ్ కప్లాంటి వేదికపై భారత్తో ఫైనల్లో తలపడే అవకాశం రావడం కూడా గొప్ప విషయమని అతను అన్నాడు. -
‘రికార్డులు’ బద్దలు కొట్టిన భారత్–ఇంగ్లండ్ సెమీఫైనల్
ముంబై: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగి రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారీ పరుగులు, బౌండరీలతో రికార్డుల మోత మోగింది. అయితే దీంతో పాటు డిజిటల్ వీక్షకుల సంఖ్య విషయంలో కూడా ఈ మ్యాచ్ కొత్త రికార్డులు నెలకొల్పింది. జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల (సుమారు 6 కోట్ల 25 లక్షలు) మంది చూడటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడా ఈవెంట్లోనైనా ప్రత్యక్ష ప్రసార సమయంలో ఇది అత్యధికం. తాజా గణాంకాలు క్రికెట్ స్థాయిని చూపిస్తున్నాయని, ఇది తమకు గర్వకారణమని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు. తాజా రికార్డు ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్తో చెరిగిపోతుందా అనేది ఆసక్తికరం. -
అభివృద్ధిలో ఆమె స్థానం ఎక్కడ?
దేశ జనాభాలో 48%గా ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, భద్రత తదితర అంశాలను తరచుగా సమీక్షించుకుంటూ, లోపాలను సవరించుకుంటూ ముందుకు సాగినప్పుడే దేశం వడివడిగా అభివృద్ధి పథంలోకి సాగుతుంది. మనం ఎంతో గొప్పగా, ఘనంగా చాటుకుంటున్న భారతదేశ ఆర్థికాభివద్ధి కథ (గ్రోత్ స్టోరీ)లో మహిళల భాగస్వామ్యం లేకుంటే అది ఓ అసంపూర్ణ కథాచిత్రంగానే మిగిలిపోతుంది. దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కావాలన్న కల సాకారం కావాలంటే మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు గణనీయంగా మెరుగుపడక తప్పదు. మెరుగుదల ఉన్నప్పటికీ...నిజం చెప్పాలంటే గత ఆరేళ్లలో దేశంలో మహిళల వికాసం, ప్రగతి అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో మెరుగుపడ్డాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ప్రపంచ బ్యాంకు నివేదిక వంటి ప్రామాణిక సంస్థలు వెలువరించిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత రంగాలలో పెద్ద అడుగులేముందుకు పడ్డాయి. ముఖ్యంగా... 2023–24 నాటికి దేశంలో మహిళల విద్య 73 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు... రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళాసంక్షేమ కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో బాలికల ప్రవేశాలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో గణనీయంగా పెరిగాయి. స్టెవ్ు గ్రాడ్యుయేట్లలో మహిళల వాటా 43%కు పెరిగింది. ఇది ప్రపంచ దేశాలలోనే అత్యధికం. 2023–24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళా కార్మికశక్తి భాగస్వామ్యం 2017–18లో 23.3% ఉండగా 2024–25 నాటికి 37%కు పెరిగింది. ఇక చిన్న, సన్నకారు పారిశ్రామిక సంస్థలను నిర్వహించే మహిళా పారిశ్రామికవేత్తలసంఖ్య కోటిన్నరకు పెరిగి తద్వారా పుష్కలంగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలలో... ‘స్టాండ్ అప్ఇండియా’, ‘ముద్ర యోజన’, స్వయం సహాయక సంఘాలువంటివి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశ స్థూల ఉత్పత్తిలో ఆర్థికంగా మహిళలు అందిస్తున్న వాటా 18 శాతంగా ఉంది. మహిళల సాధికారత దిశగా సాగిస్తున్న ప్రయాణం అంతకుముందు కంటే సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలతో, మరీ ముఖ్యంగా దక్షిణాసియా దేశాల కంటే కూడా బాగా వెనుకబడి ఉన్నాం. ఇందుకు అనేక కార ణాలు కనిపిస్తాయి. మహిళల విద్య, వారి భద్రత, ఆరోగ్యం, ఉపాధి రంగాలలో మన దేశం ర్యాంకు సంతృప్తికరంగా లేదు. చైనా,జపాన్లే కాదు థాయిలాండ్, శ్రీలంకల కంటే మనం వెనుకబడి ఉన్నాం అన్నది ఓ చేదు వాస్తవం.కొనసాగుతున్న హింసమహిళలకు భారతీయ సంస్కృతిలో గొప్ప స్థానం ఉందని చెబుతారు. కానీ ఆచరణలో అది అంతగా కనిపించదు. అయితే మహిళలపై ఒకప్పటిలా తీవ్రస్థాయిలో సాగిన దురాచారాలు,అకృత్యాలు ఇప్పుడు లేకపోవచ్చు గాని నేటికీ మహిళలపై భిన్న రూపాలలో హింస చోటు చేసుకుంటూనే ఉంది. మహిళల భద్రత అంశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాలలో భారత్ ఒకటిగా ఉంది. ‘నేషనల్ క్రైవ్ు రికార్డ్స్ బ్యూరో’ ప్రకారం 2022–23లో దేశంలో మహిళలపై 4.45 లక్షల నేరాలు జరిగాయి. రికార్డులకు ఎక్కని ఘోరాలు ఇంకా మరెన్నో ఉంటాయి.‘సమాన పనికి సమాన వేతనం’ అన్న చట్టం అమలులోకి రాకముందు మహిళలకు అతి తక్కువ వేతనాలు ఇవ్వడం భారత దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. భవన నిర్మాణ రంగం, ఇతర రోజువారీ కూలీ పనులలో మగ కూలీకి ఇచ్చే భత్యం కంటే ఆడకూలీకిచ్చే మొత్తం ఇప్పటికీ తక్కువగా ఉంటోంది. నిజానికి మగవారు చేసే పని కంటే ఆడ వారు చేసే పని పొందికగా, నాణ్యతతో, అధిక ఉత్పాదకతతో ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. అన్ని రంగా లలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడం ద్వారా సింగపూర్ ఆర్థికాభివృద్ధిలో ఎంతో ముందంజ వేసింది. కాగా, మన దేశంలో ఎటువంటి జీత భత్యాలు లభించని ఇంటి పనుల్లో పనిచేసే ఆడవారి సంఖ్య మగవారి కంటే మూడు నుంచి పది రెట్లు ఎక్కువ అని తేలింది.రాజకీయ విజయందేశ మహిళలకు స్థానిక సంస్థలలో గత కొన్నేళ్లల్లో రాజకీయ భాగస్వామ్యం పెరగటం వారు సాధించిన అతి గొప్ప విజయంగా పరిగణించాలి. మెజారిటీ రాష్ట్రాలు మహిళలకు స్థానిక సంస్థలలో 50 శాతం మేర రిజర్వేషన్లు అందిస్తున్నాయి. దీనివల్ల మొత్తం స్థానిక సంస్థలలో 14 లక్షల మహిళా ప్రజా ప్రతినిధులు భాగస్వాముల య్యారు. మరికొన్నేళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్లలో సైతం మహిళ లకు 33% సీట్లు లభించనున్నాయి. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా మహిళల భాగ స్వామ్యం అన్ని రంగాలలో ఉండాలంటే అందుకు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో పాటు కార్యాచరణ అవసరం. ప్రధానంగా మహిళలకు నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాలు అందించాలి. స్కాలర్ షిప్లు, మెంటార్షిప్లతో వారికి ప్రోత్సాహం కల్పించాలి. స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలలో వారిని పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలి. గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి పొదుపు సంఘాలను మరింతగా ప్రోత్సహించాలి. మహిళా ఆంట్రప్రెన్యూర్సును తయారు చేయడానికి అవసరమైన బ్యాంకు రుణాలు, మార్కెట్ లింకేజీలు, ఇంక్యుబేషన్లు వంటివి అందించ గలగాలి. పాఠశాలలు, కాలేజీలు, పనిచేసే ప్రాంతాలలో మహిళలకు పూర్తి భద్రత కల్పించాలి. ప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ చెప్పినట్లు – ప్రతి మహిళ తెలివితేటలను, సామర్థ్యాలను ఆర్థిక వనరుగా తీర్చిదిద్ది దేశ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేయాలి. అప్పుడే భారతదేశం ఎదురుచూస్తున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ముందుగానే సాకారం అవుతుంది.-వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు-డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
భారత్ చమురు కొనుగోలుకు అనుమతి అవసరం లేదు
భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడానికి ఎప్పుడూ ఇతర దేశాల అనుమతిపై ఆధారపడలేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, భారతదేశం తన జాతీయ ప్రయోజనాల ప్రకారం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.భారతదేశం ప్రపంచంలో పెద్ద చమురు వినియోగ దేశాలలో ఒకటి. దేశంలో ఉత్పత్తి అయ్యే చమురు పరిమితంగా ఉండటంతో, ఎక్కువ భాగం విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందుకే భారత్ వివిధ దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు గత కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి.కొన్ని సందర్భాల్లో యూనిటెడ్ స్టేట్స్ ప్రభుత్వం.. రష్యాపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ భారతదేశం తన అవసరాలను దృష్టిలో పెట్టుకొని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కొనసాగించింది. ఇటీవల అమెరికా భారతీయ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోలు చేయడానికి 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ మినహాయింపు భారతదేశ విధానాన్ని నిర్ణయించేది కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అది కేవలం వాణిజ్యంలో ఉన్న కొంత ఇబ్బందిని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. -
నేపాల్ ఎన్నికల ఫలితాలు భారత్కు ఎందుకింత కీలకం?
న్యూఢిల్లీ: ‘జెన్-జీ’ ఉద్యమంతో గత సంవత్సరం నేపాల్లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ తరువాత సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జెన్-జీ ఉద్యమం తర్వాత.. నేపాల్లో గురువారం జరిగిన ఎన్నికలు ఆ దేశ భవిష్యత్తుకు ఎంతో కీలకం. అలాగే, ఈ ఎన్నికలు భారత్కు కూడా కీలకంగా మారాయి. ఎన్నికల ఫలితాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. భౌగోళికంగా, చరిత్ర, సంస్కృతి, ఆర్థిక పరంగా నేపాల్తో భారత్కు సత్సంబంధాలు చాలా ముఖ్యం.జాగ్రత్తగా వ్యవహరించిన భారత్భారత్-నేపాల్ సంబంధాల్లో కొన్ని సంవత్సరాలుగా అనేక సంక్లిష్ట పరిస్థితులను చూస్తున్నాం. ముఖ్యంగా 2025లో రాజకీయ పరంగా అశాంతి నెలకొంది. కొన్ని నెలల ముందు నేపాల్లో తీవ్ర అస్థిరత చోటుచేసుకుంది. అవినీతి, నిరుద్యోగం, సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నియంత్రణలకు వ్యతిరేకంగా 2025 సెప్టెంబర్లో నేపాల్ వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది.నేపాల్ ఆర్థికంగా కుదేలవుతుండడం, రాజకీయ వర్గాల్లో బంధుప్రీతి ఉందనే అంశం యువతలో ఆగ్రహాన్ని పెంచాయి. ఆ అసంతృప్తిని జెన్ జీ నిరసనలు ప్రతిబింబించాయి. ఈ ఎన్నికల ముందు నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా నేపాల్ పట్ల భారత్ జాగ్రత్తగా దౌత్య విధానాన్ని అనుసరించింది. స్థిర ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాన కార్యక్రమాలను నిలిపివేసింది.భారత్-నేపాల్ ఉద్రిక్తతలకు కారణాలు భారత్-నేపాల్ సంబంధాల్లో పెద్ద సమస్యల్లో ఒకటి కలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలపై సరిహద్దు వివాదం. ఇవి భారత్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగంగా పరిపాలనలో ఉన్నాయి. 2020లో నేపాల్ విడుదల చేసిన రాజకీయ పటంలో ఈ ప్రాంతాలను తన భూభాగంగా చూపింది.తాజాగా 2025 నవంబర్లో లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాలను తన పటంలో చూపించిన కొత్త ఎన్పీఆర్ 100 నోటును విడుదల చేయాలని నేపాల్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా విమర్శించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో ఈ తీరును ఏకపక్ష చర్యగా పేర్కొంది. భూమి గురించిన వాస్తవాలను ఇది మార్చదని తెలిపింది.‘బిగ్ బ్రదర్ ధోరణి’ ఆరోపణ నేపాల్లో అంతర్గతంగా రాజకీయాల్లో పోటీ నెలకొంటే జాతీయవాద వాదనలు తరచూ వినిపిస్తాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీలలో ఈ ధోరణి బలంగా ఉంటుంది. కొంతమంది నేతలు నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు కొంతమంది ఓటర్లలో మద్దతు ఉంది. మరోవైపు, నేపాల్ రాజకీయ వర్గాల్లో చాలా మంది భారత్ “బిగ్ బ్రదర్” ధోరణి చూపుతుందని భావిస్తున్నారు.లిపులేఖ్: చైనాతో వాణిజ్యం వేళభారత్-చైనా వాణిజ్యం ‘లిపులేఖ్’ మార్గం ద్వారా పునఃప్రారంభమైనప్పుడు ( 2025 ఆగస్టులో) నేపాల్ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నేపాల్ ఈ ప్రాంతాన్ని తన భూభాగమని ప్రకటించి, భారత్-చైనా ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాలను తన సార్వభౌమ భూభాగమని నేపాల్ ప్రకటించింది. లిపులేఖ్ మార్గం ద్వారా భారత్-చైనా మధ్య వాణిజ్యం పునఃప్రారంభం కావడంపై నేపాల్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. నేపాల్ రాజ్యాంగంలో ఉన్న అధికారిక పటంలో లింపియాధురా, లిపులేఖ్, కలాపాని ప్రాంతాలు నేపాల్ అంతర్భాగంగా చూపించడం సరికాదని చెప్పింది.కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక? నేపాల్లో జెన్-జీ ఉద్యమానికి ముందు భారత్-నేపాల్ మధ్య సత్సబంధాలు దెబ్బతిన్నాయి. నేపాల్ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ తమ ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షాను నిలిపింది. ఆయన జెన్-జీ ఉద్యమంలో పనిచేసిన నేత. ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ద్వారా తెలుస్తోంది. నేపాల్ కొత్త ప్రభుత్వం భారత్లో మళ్లీ సత్సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. Nepal’s new ₹100 note now shows Village Kalapani, Lipulekh Pass & Limpiyadhura Pass as “Nepali territory”.Reality check:• The India–Nepal–Tibet tri-junction lies at Tinkar La (Pass), East of Lipulekh.• The historic Kali Mata temple at Village Kalapani marks the true… pic.twitter.com/SY7eFSrej7— Brigadier Bhupesh Singh, Veteran (@Bhupesh) November 29, 2025 -
కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
న్యూఢిల్లీ: అసోంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానంతో కమ్యూనికేషన్ కట్ అయినట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత వాయుసేన పూర్తి వివరాలు తెలిపింది. ఆ యుద్ధ విమానం కుప్పకూలిపోయిందని, భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లు మృతి చెందారని చెప్పింది. మృతి చెందిన పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేశ్ దురాగ్కర్గా అధికారులు గుర్తించారు. “భారత వాయుసేనకు చెందిన సిబ్బంది అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం” అని వాయుసేన ఎక్స్ లో తెలిపింది.సుఖోయ్ సు-30 ఎంకేఐ శిక్షణ మిషన్లో ఉండగా జోర్హాట్ వాయుసేన స్థావరం నుంచి ఎగిరిన కొద్ది సేపటికే కనిపించకుండా పోయింది. అది కుప్పకూలిన ప్రాంతం అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉంది.నిన్న రాత్రి 7.42 గంటలకు దానితో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సుఖోయ్ సు-30 ఎంకేఐ రెండు సీట్లు ఉండే, మల్టీరోల్, దీర్ఘ శ్రేణి యుద్ధ విమానం. రష్యా విమాన తయారీ సంస్థ సుఖోయ్ దీన్ని అభివృద్ధి చేసింది.ప్రస్తుతం భారత వాయుసేన అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్తో దీనిని తయారు చేస్తోంది. భారత వాయుసేన వద్ద 260కి పైగా సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్నాయి. IAF acknowledges the loss of Sqn Ldr Anuj and Flt Lt Purvesh Duragkar, who sustained fatal injuries in the Su-30 crash. All personnel of the IAF express sincere condolences, and stand firmly with the bereaved family in this time of grief.@DefenceMinIndia@SpokespersonMoD… pic.twitter.com/zUtfUJ2ewr— Indian Air Force (@IAF_MCC) March 6, 2026 -
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
మాస్కో: ఇజ్రాయెల్, అమెరికాలతో పోరాడుతున్నప్పటికీ ఇరాన్ తమను సైనిక సాయం అడగలేదని రష్యా ప్రకటించింది. మిత్రదేశానికి సాయపడబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్ష కార్యాలయం అధికారిక ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం స్పందించారు. ‘‘ఇరాన్ నుంచి ఇంతవరకు ఎలాంటి అభ్యర్థనా రాలేదు. ఇరాన్తో మా మిత్రత్వం ఎప్పటి లాగానే కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. 2025 జనవరిలో ఇరాన్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. కానీ ఆ ఒప్పందంలో ఆపత్కాలంలో ఇలాంటి సైనిక సాయం అంశం లేదు’’ అని పెస్కోవ్ స్పష్టంచేశారు.చైనా ఆఫర్..గతవారం నుంచి అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలకు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. పోరాటాన్ని ముగించడానికి తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. అలాగే, జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఇస్తుందని, దౌత్యం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేలా ఇతర గల్ఫ్ దేశాలకు కూడా మద్దతు ఇస్తుందని వాంగ్ యీ అన్నారు. ‘‘యుద్ధం వల్ల ప్రజలు మాత్రమే నష్టపోతారు.. శాంతి కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూనే ఉంటుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శాంతి ప్రక్రియ కోసం ప్రత్యేక రాయబారిని పంపే ప్రణాళికలను ధ్రువీకరించింది.భారత్ కీలక ప్రకటన..మరోవైపు, ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించాలని ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్లకు భారత్ పిలుపునిచ్చింది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్ చట్టాలను గౌరవిస్తుంది.. సైనిక ఘర్షణలతోనే ఏ సమస్య పరిష్కారం కాదు.. అది ఉక్రెయిన్ అయినా.. పశ్చిమాసియా అయినా’’ అని అన్నారు. -
అమెరికాకు బుద్ధి చెప్తాం
న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధ నౌక ‘దేనా’ను హిందూమహా సముద్ర జలాల్లో అమెరికా ముంచేయడంపై భారత్లో ఆ దేశ రాయబారి మహ్మద్ ఫతాలీ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా పాల్పడిన చర్య దారుణ హత్యతో సమానమని, ఇరాన్ తగు రీతిలో బదులు తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. శాంతియుత విన్యాసాల్లో పాల్గొని తిరిగి వస్తున్న నిరాయుధంగా వస్తున్న నౌకను ధ్వంసం చేయడాన్ని బట్టి చూస్తే అమెరికా, జియోనిస్టులకు అంతర్జాతీయ చట్టాలను నాశనం చేయాలనే దుర్భుద్ధి ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. మా ప్రజలు, ఆత్మవిశ్వాసాన్నే నమ్ముకున్న మా దేశం ఈ చర్యకు తీవ్రమైన రీతిలో సమాధానమిస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్, భారత్ల మధ్య బలమైన సంబంధాలు, ఉమ్మడి ప్రయోజనాలు, బలమైన సాంస్కృతిక వారసత్వం ఉన్నాయన్నారు.హెచ్చరిక లేకుండానే దాడియుద్ధ నౌక దేనాపై అమెరికా సబ్మెరీన్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా టార్పెడో దాడి చేసిందని ముంబైలో ఇరాన్ కాన్సులేట్ జనరల్ సయీద్ రెజా అన్నారు. నౌకా విన్యాసాల నుంచి తిరిగి వెళ్లే యుద్ధ నౌకల్లో సాధారణంగా ఎటువంటి మందుగుండు సామగ్రి ఉందన్నారు. ఒకవేళ ఉన్నా దానిని విన్యాసాల సమయంలో ఉపయోగించే అవకాశం తక్కువని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిగేట్ దేనాను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. ఈ ఘటనలో 100 మంది వరకు నౌకా సిబ్బంది, సైనికులు వీరమరణం పొందడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులను రోడ్డు మార్గంలో స్వదేశానికి తరలించేందుకు నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.అన్వేషణలో శ్రీలంకకు తోడుగా..అమెరికా టార్పెడో దాడిలో హిందూ మహా సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధ నౌక వద్ద అన్వేషణ, సహాయ కార్యక్రమాల్లో శ్రీలంకకు భారత్ తోడైంది. లాంగ్ రేంజ్ పెట్రోల్ విమానం సాయంతో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు నేవీ తెలిపింది. ఆ ప్రాంతంలోనే మోహరించి ఉన్న ఐఎన్ఎస్ తరంగిణి కూడా అన్వేషణలో పాల్గొంటోందని పేర్కొంది. ఐఎన్ఎస్ ఇక్షక్ కూడా కొచ్చినుంచి బయలుదేరిందని వివరించింది. -
ధరల మోత.. వంటనూనెలు మొదలు ఔషధాల దాకా
ఇరాన్పై అమెరికా దాడిచేస్తే బదులుగా ఇరాన్.. సౌదీ, బహ్రెయిన్, ఖతార్ సహా పలు గల్ఫ్ దేశాలపై బాంబులేస్తోంది. సుదూరంగా ఉన్న భారత్పై బాంబులు పడకపోయినా ధరల బాంబులు పడొచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు సగటు భారతీయుని గుండెల్లో భయాందోళనలను పెంచేస్తున్నాయి. సముద్రమార్గంలో చమురు కూడలిగా పేరొందిన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ముడిచమురు మొదలు పలురకాల వస్తూత్పత్తుల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారముంది. తొలుత చమురు మంటలు యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడిచమురు, చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ద్రవరూప సహజవాయువు(ఎల్ఎన్జీ) సరఫరా ఇరాన్ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీ నుంచి భారత్కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. హార్మూజ్ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకుని భారత్లో ఆయిల్ ధరలు పెరగడం ఖాయం. వంటనూనె మరింత ధర.. భారత్ వంటనూనెల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్ ఎక్కువగా ఇండోనేసియా, మలేసియా నుంచి వస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ నూనె, రష్యా, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. వీటిలో కొంత సరుకు హార్మూజ్ జలసంధి గుండా వస్తోంది. రవాణా గొలుసు తెగిపోవడంతో ధరలు కట్టలు తెంచుకోవచ్చని ‘సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడం ఆరంభమైంది. కేంద్రప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం మార్చి రెండో తేదీ ధరలతో పోలిస్తే మార్చి మూడో తేదీన సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ నూనెల రిటైల్ ధరలు ఒకటి నుంచి మూడు రూపాయలు పెరిగాయి. పప్పులూ మరింత ప్రియం.. పప్పుల ధరలు పెరిగే వీలుందని ‘ఆల్ ఇండియా దాల్ మిల్ అసొసియేషన్’అధ్యక్షుడు సురేశ్ అగర్వాల్ చెప్పారు. మయన్మార్, కెనడా, ఆఫ్రికాల నుంచి భారత్ ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కందులు, మినుములు సహా పలు రకాల పప్పులను దిగుమతిచేసుకుంటోంది. ‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ అత్తిపండు, బాదం, పిస్తా, ఖర్జూరా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, అప్రికాట్లను దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం కారణంగా ఇప్పుడు ఇరాన్, అఫ్గాన్ల నుంచి పాక్కు, అక్కడి నుంచి వాఘా సరిహద్దు గుండా భారత్కు సరుకు రావట్లేదు. సముద్రమార్గంలో వస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు సముద్రమార్గం మూసేయడంతో డ్రై ఫ్రూట్స్ సరుకు రావడం దాదాపు ఆగిపోయినట్లే. ధరలు పెరిగే వీలుంది’’అని ‘ముంబై డ్రై ఫ్రూట్, డేట్ మర్చంట్స్ అసోసియేషన్’అధ్యక్షుడు విజయ్ భూటా చెప్పారు. ఎరువులు, సాగు ఉత్పత్తుల రాక సైతం తగ్గిపోయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాల రాకపోకలు తగ్గడంతో కార్గో రవాణా పరిమాణం కుచించుకుపోయింది. ఇతర దేశాల మీదుగా విమానాలు తిరిగి రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు టికెట్ అధిక చార్జీల మోత మోగుతోంది. ప్లాస్టిక్ సైతం.. ముడిచమురు నుంచే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ను తయారుచేస్తారు. ముడిచమురు సరఫరా తగ్గడంతో గత రెండు రోజుల్లోనే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ధర 12 శాతం ఎగసింది. దీంతో ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం పైపైకి పోవడం ఖాయంగా కని్పస్తోంది. ఔషధాలదీ అదే బాట... ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్(ఏపీఐ) కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. కానీ అత్యంత ఖరీదైన కీ స్టారి్టంగ్ మెటీరియల్స్(కేఎస్ఎం) కోసం ఎక్కువగా ఐరోపా దేశాలపై ఆధారపడుతోంది. యూరప్ నుంచి కేఎస్ఎం సరుకు హార్మూజ్ ద్వారానే రావాల్సి ఉంది. ఇవి తగ్గిపోవడంతో భారత్లో సంక్లిష్ట జనరిక్ మందులతోపాటు సైడ్ ఎఫెక్ట్లను తగ్గించే ‘విలువ జోడింపు ఔషధా(వీఏఎం)’ల తయారీ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. వీటికితోడు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి మారకం విలువ పతనమవుతుండటంతో పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియంకానున్నాయి. ఇవన్నీ కలసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
IND Vs ENG: పరుగుల వరదతో ఫైనల్లోకి
భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్లు.. వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్ బృందం గట్టెక్కింది. గత మ్యాచ్ తరహాలోనే సంజు సామ్సన్ మరో అద్భుత ఇన్నింగ్స్తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్ తరఫున జాకబ్ బెతెల్ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్ భారత్ను ఫైనల్కు చేర్చింది. టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది. ముంబై: టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా... శివమ్ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. భారత్, కివీస్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. పోటీ పడి సిక్సర్లు బాది... ఓపెనర్ అభిషేక్ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్ భాగస్వామ్యంతో భారత్ దూసుకుపోయింది. ఆర్చర్ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. మరోవైపు ఇషాన్ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్ ఓవర్లో భారీ సిక్స్తో 26 బంతుల్లో సామ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్ కరన్ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్ను రషీద్ అవుట్ చేశాడు. అయితే స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్లో ముందుగా దూబేను పంపిన భారత్ ఫలితం రాబట్టింది. రషీద్ ఓవర్లో 2 భారీ సిక్స్లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో మరో రెండు సిక్స్లు బాదిన సామ్సన్ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్ ఓవర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 76 పరుగులు సాధించడం విశేషం. టాపార్డర్ విఫలం... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (5) వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (7), టామ్ బాంటన్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్లో సిక్స్ కొట్టిన అతను వరుణ్ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. మరోవైపు విల్ జాక్స్ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా బెతెల్కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్ అవుటైన తర్వాత స్యామ్ కరన్ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్... శివమ్ దూబే వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్ (19 నాటౌట్) మూడు సిక్స్లు బాదినా లాభం లేకపోయింది. 17 ఓవర్ల వరకు ఇంగ్లండ్దే పైచేయి... దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. 17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ కొట్టిన 3 సిక్స్లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది. సామ్సన్ క్యాచ్ వదిలేసి... గత మ్యాచ్ తరహాలో ఈసారి కూడా సామ్సన్ దూకుడైన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్ బౌలింగ్లో మిడాన్ వద్ద కెప్టెన్ బ్రూక్ అతి సునాయాస క్యాచ్ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్ ఫలితం అనుభవించింది. క్యాచ్ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్లో ఇంగ్లండ్ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్ను బ్రూక్ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్ లభించిన తర్వాత సామ్సన్ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే... భారత్ ఇన్నింగ్స్లో ఆటగాళ్లంతా ఏ బౌలర్ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్ వేసిన ఒక్క 14వ ఓవర్ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్ తొలి బంతికే సామ్సన్ వికెట్ తీశాడు. అక్షర్ అదరహో... మైదానంలో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్ అందుకొని సాల్ట్ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్ ఆ తర్వాత అసాధారణ క్యాచ్తో బ్రూక్ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్ షాట్ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్ నుంచి అక్షర్ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్ క్యాచ్ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్తో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది.5 టి20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్ సంజు సామ్సన్. గతంలో యువరాజ్ సింగ్ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్ పఠాన్ (2007లో పాకిస్తాన్పై ఫైనల్లో), విరాట్ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్ పటేల్ (2024లో ఇంగ్లండ్పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.4 ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్–న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.4 టి20 ప్రపంచకప్లో భారత్ నాలుగోసారి ఫైనల్కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.105 టి20 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా బెతెల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్ అలెన్ (100 నాటౌట్) స్కోరును బెతెల్ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 89; అభిషేక్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 9; ఇషాన్ కిషన్ (సి) జాక్స్ (బి) రషీద్ 39; దూబే (రనౌట్) 43; సూర్యకుమార్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 11; పాండ్యా (రనౌట్) 27; తిలక్ (బి) ఆర్చర్ 21; అక్షర్ (నాటౌట్) 2; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్: ఆర్చర్ 4–0–61–1, జాక్స్ 4–0–40–2, ఒవర్టన్ 3–0–36–0, స్యామ్ కరన్ 4–0–53–0, ఆదిల్ రషీద్ 4–0–41–2, లియామ్ డాసన్ 1–0–19–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) పాండ్యా 5; బట్లర్ (బి) వరుణ్ 25; హ్యారీ బ్రూక్ (సి) అక్షర్ పటేల్ (బి) బుమ్రా 7; బెతెల్ (రనౌట్) 105; బాంటన్ (బి) అక్షర్ 17; జాక్స్ (సి) శివమ్ దూబే (బి) అర్ష్ దీప్ 35; స్యామ్ కరన్ (సి) తిలక్ వర్మ (బి) హార్దిక్ పాండ్యా 18; ఒవర్టన్ (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–51–1, హార్దిక్ పాండ్యా 4–0–38–2, జస్ప్రీత్ బుమ్రా 4–0–33–1, వరుణ్ 4–0–64–1, అక్షర్ పటేల్ 3–0–35–1, శివమ్ దూబే 1–0–22–0. -
T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట
జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే మార్గం సుగమమైంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిభారత్- శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీలో గ్రూప్-బి నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్లతో కలిసి జింబాబ్వే పోటీ పడింది. అనూహ్య రీతిలో మాజీ చాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి గ్రూప్ టాపర్గా సూపర్-8 చేరింది. అయితే, కీలక దశలో వెస్టిండీస్, టీమిండియా, సౌతాఫ్రికా చేతిలో ఓడి నిష్క్రమించింది.యుద్ధం కారణంగాఈ నేపథ్యంలో మార్చి 2న భారత్ నుంచి జింబాబ్వే జట్టు స్వదేశానికి పయనం కావాల్సింది. కానీ ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్ వేదికగా ప్రయాణించాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఫలితంగా జింబాబ్వే జట్టు బుధవారం వరకు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఈ క్రమంలో బ్యాచ్ల వారీగా భారత్ను వీడేందుకు జింబాబ్వే సిద్ధమైనట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. బుధవారం తొలి బ్యాచ్ స్వదేశానికి పయనం కాగా.. శుక్రవారం ఆఖరి బ్యాచ్ ఇండియా నుంచి బయల్దేరుతుందని తెలిపింది.అందుకే విడతల వారీగాఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పేర్కొంది. తగినన్ని విమానాలు అందుబాటులో లేనందున విడతల వారీగా ఆటగాళ్లు జింబాబ్వేకు చేరుకుంటాడని బోర్డు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జింబాబ్వే జట్టు దుబాయ్ మీదుగా ఎమిరేట్స్ ఫ్లైట్లో వెళ్లాల్సింది. అయితే, యుద్ధ ప్రభావం కారణంగా అదిస్ అబాబా, ఇథియోపియా మీదుగా హరారేకు వారు చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు.. వెస్టిండీస్ క్రికెట్ జట్టు సైతం భారత్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: మొయిన్ అలీపై నిషేధం..! -
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్
ఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతిపట్ల ఇండియా సంతాపం తెలిపింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. సంతాప సందేశం రాశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే.శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్తో ముగిసింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. దాంతో ఆయన తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ హిట్లిస్ట్లో ఉన్న ఖమేనీపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది.ఖమేనీతో జరిగిన భేటీకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కమాండర్ ఇన్ చీఫ్ మొహమ్మద్ పాక్పౌర్, రక్షణ శాఖ మంత్రి అజీజ్ నజీర్జాదే, మిలటరీ కౌన్సిల్ అధినేత అడ్మిరల్ అలీ షామ్ఖనీ, ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ సయ్యద్ మాజిద్ మౌసావీ, డిప్యూటీ ఇంటెలిజెన్స్ మంత్రి మొహమ్మద్ షిరాజీతోపాటు మరికొందరు ముఖ్యులు హాజరయ్యారు. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో వీరంతా హతమయ్యారు. ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. -
ఇరాన్పై దాడులు.. భారత్ నావల్ బేస్లను అమెరికా వినియోగిస్తోందా?
ఢిల్లీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ నావల్ బేస్లను ధ్వంసం చేసిన తర్వాత అమెరికా భారత్ నావల్ బేస్లను వినియోగిస్తోందంటూ అమెరికా మీడియా విస్తృత ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది.భారత్ స్పష్టంగా తెలిపింది: అమెరికా మీడియా ప్రసారం చేస్తున్న కథనాలు అసత్యమని, భారత నావల్ బేస్లను అమెరికా వినియోగిస్తోందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కథనాలను నిరాధారమైనవిగా, కల్పితమైనవిగా పేర్కొంది.ఇటీవల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరిగిన నేపథ్యంలో, అమెరికా ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్ ఒక అమెరికా మీడియా సంస్థ నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా అన్ని బేస్లు ధ్వంసం అయ్యాయి. మా నౌకాశ్రయ (Harbour) సదుపాయాలు కూడా నాశనం అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం భారత్, భారత పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సరైన పరిష్కారం కాదు, కానీ పరిస్థితుల వల్ల తప్పనిసరిగా చేయాల్సి వస్తోంది’ అని అన్నారు. అయితే, అమెరికా మీడియా సంస్థ OAN ప్రసారం చేసిన ఈ కథనాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.అమెరికా నేవీ భారత్ పోర్టులను వినియోగిస్తున్నట్లు అమెరికా మీడియా చేస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం. ఇలాంటి నిరాధారమైన, కల్పిత వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.Claim: On a US-based channel, One America News Network (@OANN), former U.S. Army Colonel Douglas Macgregor made a statement suggesting that the United States is using Indian naval bases to attack Iran, amidst the ongoing Iran-US conflict.#PIBFactCheck: ❌This claim is #FAKE… pic.twitter.com/nzcXCi7yT9— PIB Fact Check (@PIBFactCheck) March 4, 2026 Fake News Alert!Claims being made on OAN, a US based channel that Indian ports are being used by the US Navy are fake and false. We caution you against such baseless and fabricated comments. pic.twitter.com/xiFWnkoXBk— MEA FactCheck (@MEAFactCheck) March 4, 2026 -
ముంబైలో హై వోల్టేజ్ మ్యాచ్..
-
భారత్కు పుతిన్ భారీ సాయం
ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ చమురు నిల్వలు భారత్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రష్యా మరోసారి భారత్కు అండగా నిలిచింది. ఇరాన్తో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఏకంగా 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్మోజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో దాదాపు 40% హార్మోజ్ ద్వారా జరుగుతోంది. భారత్ వద్ద ప్రస్తుతం కేవలం 25 రోజులకు సరిపడ ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధమైనట్టు తెలిసింది. భారతీయ సముద్ర జలాలకు సమీపంలోనే ఉన్న నౌకలలోని దాదాపు 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్ చేరుకోగలదని పరిశ్రమ వర్గాలు రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపాయి.అయితే.. రష్యన్ చమురు నౌకల అసలు గమ్యస్థానం వివరాలను మాత్రం వెల్లడించడానికి సదరు పరిశ్రమ వర్గాలు నిరాకరించాయి. దీంతో, రిఫైనరీ సంస్థలకు ఊరట కలిగిస్తూ కొన్ని వారాల్లోనే ఈ చమురు నౌకలు భారత్ చేరుకుంటాయని మాత్రం వారు వెల్లడించారు. అదేవిధంగా గ్యాసాయిల్, గ్యాసోలిన్, ఎల్పీజీ కూడా పరిమిత పరిమాణంలోనే రిఫైనరీల వద్ద ఉన్నాయి. రానున్న 10-15 రోజులు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.ప్రస్తుతం యుద్ధం కారణంగా జలసంధి మార్గం దాదాపు మూతపడడంతో ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత్ అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొంది. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు దరిమిలా ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడడంతో హార్మోజ్ జలసంధి సమీపంలో వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్కు చమురు సరఫరాకు రష్యా అంగీకరించినట్టు సమాచారం. -
నేడు ప్రధానితో ఫిన్లాండ్ అధ్యక్షుడి భేటీ
న్యూఢిల్లీ: భారత్లో నాలుగు రోజుల పర్యటనకు గాను ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఢిల్లీకి చేరుకున్న ఆయనకు విమానా శ్రయంలో విదేశాంగ శాఖ సహాయమంత్రి కృతి వర్థన్సింగ్ స్వాగతం పలికారు. స్టబ్ గురువారం ప్రధాని మోదీతో సమావేశ మవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. గురువారం సాయంత్రం ప్రారంభమయ్యే రైజినా డైలాగ్ సదస్సులో స్టబ్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసమిస్తారు. స్టబ్ వెంట మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపార వేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వచ్చింది. అలెగ్జాండర్ స్టబ్ రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్లతోనూ భేటీ అవుతారు. శుక్రవారం ముంబైలో వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. శనివారం తిరిగి స్వదేశానికి పయనమవుతారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఓర్పో పాల్గొనడం తెల్సిందే. కొన్ని వారాల వ్యవధిలోనే ఆ దేశాధ్యక్షుడు కూడా భారత్ రావడం గమనార్హం. -
భారత్ ఫైనల్ గురి
3-2 టి20 వరల్డ్ కప్లో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. వీటిలో భారత్ 3 గెలిచి, 2 ఓడింది. గత టి20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచిన సందర్భంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించే ముందంజ వేసింది. అంతకుముందు 2022 సెమీఫైనల్లో భారత్పై విజయం సాధించిన ఇంగ్లండ్ ఆపై టైటిల్నూ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి టైటిల్ పోరుకు ముందు ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీస్ సమరంలోనే ముఖాముఖికి సిద్ధమయ్యాయి. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే రెండు జట్లూ కూడా ‘లోపాలు లేని అత్యుత్తమ ఆటతీరు’ను కనబర్చలేకపోయాయి. ఇంగ్లండ్ ప్రస్థానం తడబడుతూనే సాగగా... భారత్ కూడా తమపై ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. అయితే ఇక్కడి వరకు ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు మిగిలిన రెండు మ్యాచ్లు ఎలా గెలవడం అనేదే ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్ సొంతగడ్డపై సత్తా చాటుతుందా లేక ఇంగ్లండ్ అనూహ్య ఫలితాన్ని సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: టి20 వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో అసలైన నాకౌట్ సమరానికి సిద్ధమైంది. నేడు వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ప్రత్యర్థులతో పోలిస్తే ఇంగ్లండ్ మరీ బలంగా ఏమీ లేదు. అయితే నాకౌట్ మ్యాచ్ ఒత్తిడిని అధిగమించి టీమిండియా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్ఫూర్తిదాయక సారథ్యంలో ఇంగ్లండ్ ఒక్కో అడుగు వేస్తూ సెమీస్కు చేరింది. టి20 వరల్డ్ కప్ను రెండేసిసార్లు గెలుచుకున్న ఈ రెండు జట్లు మూడో టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసేందుకు నేటి పోరులో ఎలా చెలరేగుతాయో చూడాలి. మార్పుల్లేకుండా... పిచ్, వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. కొత్తగా వ్యూహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బెస్ట్–11తో తుది జట్టు ఎంపిక కూడా ఖాయమైనట్లే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్పైనే అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటతో తన రాకను ఘనంగా ప్రదర్శించాడు. నాటి మ్యాచ్లో 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్స్లతో అతను ఏకంగా 135 పరుగులు సాధించాడు. ఇప్పుడు అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిషేక్ భావిస్తున్నాడు. విండీస్పై గత మ్యాచ్లో తడబడినా ఈసారి చెలరేగితే తిరుగుండదు. మరో ఓపెనర్ సంజు సామ్సన్ ఒక్క ఇన్నింగ్స్తో తన విలువేంటో చూపించాడు. అదే జోరు కొనసాగించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఆపై ఇషాన్, సూర్య, తిలక్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు చివర్లో వేగంగా అందించే పరుగులు దీనికి అదనం. ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్లాంటి ఆటగాడు ఉండటం టీమిండియా బలం. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్ ఎప్పటిలాగే ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగితే మన జట్టు పని మరింత సులువవుతుంది. అక్షర్తో పాటు వైవిధ్యమైన బౌలింగ్ ఉన్న వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం ఇంగ్లండ్కు కత్తి మీద సామే. ఇంగ్లండ్పై ఘనమైన రికార్డు ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలనే భావిస్తున్నా... ఎవరినీ పక్కన పెట్టలేని పరిస్థితి. బుధవారం సిద్ధి వినాయక ఆలయంలో అభిషేక్, అక్షర్, ఇషాన్ కీలకం విల్ జాక్స్... ఈ వరల్డ్ కప్లో ఇంగ్లండ్ చాలా సాధారణ ఆటతీరు కనబర్చింది. అతి కష్టమ్మీద నేపాల్పై 4 పరుగులతో నెగ్గి ఆపై విండీస్ చేతిలో ఓడింది. ‘సూపర్ ఎయిట్స్’లో కూడా స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో పాకిస్తాన్, న్యూజిలాండ్లపై చచ్చీ చెడి గెలిచింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా విధ్వంసకర ఆటకు చిరునామాగా నిలిచిన టీమ్ ఇప్పుడు అతి కష్టమ్మీద గెలుపు గీత దాటుతోంది. టోర్నీ మొత్తంలో బెస్ట్ ఓపెనింగ్ జోడీ అంటూ బరిలోకి దిగిన బట్లర్, ఫిల్ సాల్ట్ 7 మ్యాచ్లలో కలిపి 84 పరుగులే జోడించగలిగారు. ఏ మ్యాచ్లోనూ గరిష్టంగా నాలుగు ఓవర్లకు మించి వీరి భాగస్వామ్యం సాగలేదు. అయినా సరే మరో ప్రత్యామ్నాయం లేక మరోసారి జట్టు వీరినే నమ్ముకుంటోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బట్లర్ 7 మ్యాచ్లలో కలిపి చేసింది 62 పరుగులే! అయినా సరే, అతని స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ ఒక్క మ్యాచ్లోనైనా రావాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. బెతెల్, బాంటన్లను నమ్మే స్థితి లేకపోవడంతో కెప్టెన్ బ్రూక్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటం అవసరం. ఆల్రౌండర్గా స్యామ్ కరన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా....ఈ టోర్నీలో నాలుగు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు నెగ్గిన విల్ జాక్స్ కీలకం కానున్నాడు. ఆర్చర్తో పాటు రెండో పేసర్గా ఒవర్టన్పై భారం ఉంది. పిచ్ కొంత అనుకూలిస్తే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఆదిల్ రషీద్, డాసన్ కూడా ప్రభావం చూపగలరని జట్టు నమ్ముతోంది. పిచ్, వాతావరణం వాంఖెడే పిచ్ మొదటి నుంచీ బ్యాటింగ్కు బాగా అనుకూలం. మంచి బౌన్స్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్ను భారత్ ఇక్కడ ఆడగా... ఇంగ్లండ్ రెండు మ్యాచ్లు ఆడింది. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం సమస్య కలిగించినా...రిజర్వ్ డే ఉంది. 17-12 భారత్, ఇంగ్లండ్ మధ్య 29 టి20 మ్యాచ్లు జరిగాయి. భారత్ 17 మ్యాచ్ల్లో, ఇంగ్లండ్ 12 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్. ఇంగ్లండ్: బ్రూక్ (కెప్టెన్ ), సాల్ట్, బట్లర్, బెతెల్, బాంటన్, కరన్, ఒవర్టన్, జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్. -
నిద్రలేమి.. మహిళల్లోనే ఎక్కువ!
సాక్షి, స్పెషల్ డెస్క్: మహిళల్లో నిద్రలేమి అనేది ఒక క్లిష్టమైన ప్రజారోగ్య సమస్యగా అవతరించింది. పురుషుల కంటే మహిళలే నిద్ర విషయంలో అధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతల్లో అసమానత ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణాలు. ఫలితంగా నేటి కాలంలో చాలామంది భారతీయ మహిళలకు నాణ్యమైన నిద్ర అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా మెడికల్ డివైసెస్ తయారీలో ఉన్న రెస్మెడ్ ఇటీవల గ్లోబల్ స్లీప్ సర్వే–2026 నిర్వహించింది. భారత్తోపాటు అమెరికా, చైనా, యూకే, జ ర్మనీ, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్, కొరియా, బ్రెజిల్, పోలండ్, సింగపూర్, మెక్సికో దేశాలకు చెందిన 30 వేల మంది పాలుపంచుకున్నారు. ఇందులో భారత్ నుంచి 5 వేల మంది ఉన్నారు. ఈ సర్వే ప్రకారం.. నిద్రలేమి సమస్యతో 38% మంది భారతీయ మహిళలు ఇబ్బందిపడుతున్నారు. పురుషుల విషయంలో ఈ సంఖ్య 29% మాత్రమే. వంట, ఇంటి పనులు; పిల్లలు, పెద్దల సంరక్షణ.. భారతీయ మహిళల భు జాలపై సహజంగా ఉండే భారం. ఇంటి నిర్వహణకు సంబంధించిన మానసిక ఒత్తిడి దీనికి అదనం. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే అటు వృత్తి బాధ్యతలనూ మోయాల్సి వస్తోంది. భిన్నమైన ప్రభావం..: సామాజిక, మానసిక ఒత్తిళ్లు స్త్రీ పురుషులపై రాత్రి నిద్ర విషయంలో ఎలా భిన్నంగా ప్రభావం చూపుతాయో ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. నిద్రాభంగం కావడానికి మానసిక ఒత్తిడి, ఆందోళనను ప్రధాన కారకాలుగా 42% మంది మహిళలు పేర్కొన్నారు. ఈ విషయంలో పురుషుల సంఖ్య 36% ఉంది. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలు నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాయని 39% మంది మహిళలు, 33% మంది పురుషులు చెబుతున్నారు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి స్థిర, నాణ్యమైన నిద్ర అవసరమని ప్రపంచవ్యాప్తంగా 90% మంది గుర్తించారు. ఆహారం, వ్యాయామంతోపాటు నిద్రను అత్యంత ముఖ్యమైన అలవాటుగా 44% మంది భారతీయులు పరిగణిస్తున్నారు. అయినప్పటికీ 53% ప్రజలు వారానికి నాలుగు రాత్రులు లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే నాణ్యమైన నిద్రను పొందుతున్నట్లు తెలిపారు. ఇది అవగాహనకు, వాస్తవానికి మధ్య పెరుగుతున్న భారీ అంతరాన్ని నొక్కి చెబుతోంది. వేరబుల్ టెక్నాలజీతో.. నిద్ర ప్రాముఖ్యతపై ప్రజల్లో అధిక అవగాహన ఉన్నప్పటికీ సమస్యలున్నవారు వైద్యపరంగా సాయం తీసుకోవడం లేదు. 78% మంది భారతీయులు నిద్ర సమస్యల పరిష్కారం కోసం వైద్యుడిని సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. సాధారణ చెకప్లలో 69% మందికి మాత్రమే దీనికి సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని ఆసుపత్రులు మరింత చురుకుగా నిద్ర సమస్యలను గుర్తించాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. 75% మంది భారతీయులకు తమ నిద్ర విధానాలను మరింత నిశితంగా గమనించడానికి స్మార్ట్వాచెస్, ఫిట్నెస్ బ్యాండ్స్ వంటి వేరబుల్ టెక్నాలజీ దోహదపడుతోంది. ఈ పరికరాలు నెగిటివ్ ఫలితాలు చూపితే.. 66% మంది వినియోగదారులు తమ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వైద్య సలహాను పొందుతామని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై.. నాణ్యమైన నిద్ర తక్కువగా ఉండటం వల్ల కేవలం అలసట మాత్రమే కాకుండా అంతకుమించిన తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. సరైన నిద్రలేని రాత్రి తర్వాత తాము మరింత చిరాకుగా, ఒత్తిడితో లేదా నిరాశతో ఉన్నట్లు అత్యధికులు తెలిపారు. ప్రత్యేకించి 30% మంది నిద్రలేమికి, కుంగుబాటు లక్షణాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు గుర్తించారు. -
మళ్లీ బలపడిన బంధం
దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఒకసారి దెబ్బతింటే అతుక్కోవటం అంత సులభం కాదు. అందుకు సుదీర్ఘ కాలం పడుతుంది. గత రెండేళ్లుగా అందుకోసం తెర వెనుక సాగిన ప్రయత్నాలన్నీ ఫలించి కెనడా ప్రధాని మార్క్ కార్నీ మన దేశంలో నాలుగు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రూ. 4.65 లక్షల కోట్లకు చేరుకునేలా ఇరుదేశాలూ కృషి చేయాలన్న నిర్ణయం జరిగింది. అలాగే అణు విద్యుదుత్పాదన కోసం ఇప్పుడు సరఫరా చేస్తున్న యురేనియంను మరింత పెంచటానికి కెనడా అంగీకరించింది. దీని విలువ రూ. 17,403 కోట్లు. ఇవిగాక పునరుత్పాదక ఇంధన వనరులతో సహా పలు అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు... రెండూ అకారణంగా ఇరాన్పై విరుచుకుపడుతున్న పర్యవసానంగా పశ్చిమాసియాతో పాటు ప్రపంచమంతా అలుము కున్న అస్థిర వాతావరణం నేపథ్యంలో భారత్, కెనడా తమ సంబంధాలను మెరుగు పరుచుకోవటం మంచి సందేశం పంపుతుంది.ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జార్ను గుర్తు తెలియని వ్యక్తులు 2023లో హతమార్చాక భారత్, కెనడాల సంబంధాలు దెబ్బతినటం నిజమే కావొచ్చు గానీ... అంతకు చాన్నాళ్లముందే అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో అనుసరించిన విధానాలు ఇరుదేశాల మధ్యా పొరపొచ్చాలు పెంచాయి. కెనడాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న సిక్కుల ఓటుబ్యాంకు కోసం ఆయన వేర్పాటువాదులను ప్రోత్సహించారు. భారత్లో నేరాలు చేసి వచ్చిన వేర్పాటువాదులను అప్పగించేందుకు ఆయన ప్రభుత్వం నిరాకరించేది. అందుకే 2018లో ట్రుడో మన దేశం పర్యటనలో ఘనమైన స్వాగత సత్కారాలు లభించలేదు. ట్రుడోను భారత్ అవమానించిందంటూ కెనడా మీడియా వ్యాఖ్యానించింది కూడా! నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నదంటూ కెనడా ఆరోపించటం, అక్కడి మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావటం అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణించటానికి దోహదపడ్డాయి. వేర్పాటువాదులను ఆదరిస్తే జరిగేదేమిటో ట్రుడోకు నిరుడు ఏప్రిల్లో జరిగిన ఎన్నికలకు ముందే తెలిసొచ్చింది. ట్రుడో నాయకత్వం కొనసాగితే లిబరల్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు తేల్చటంతో ఆయన రాజీనామా చేయకతప్పలేదు. అనంతరం వచ్చిన మార్క్ కార్నీ స్వల్పకాలంలోనే సమర్థుడిగా పేరుతెచ్చుకుని పార్టీ విజయావ కాశాలు పెంచగలిగారు. మెరుగ్గా కనబడిన విపక్ష కన్జర్వేటివ్ పార్టీ వెనకబడటం మొదలైంది. ఈలోగా అమెరికాలో ట్రంప్ ఏలుబడి మొదలైనాక ఆయన కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకుంటామనటంతో పాటు ఏకపక్షంగా సుంకాలు విధించటం ట్రంప్కు సన్నిహితంగా మెలిగిన ఆ మితవాద పార్టీ ప్రాభవాన్ని దెబ్బతీసింది.నిరుడు కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లాక దౌత్యసంబంధాలు చిగురించటం మొదలైంది. అంతక్రితం నిజ్జార్ వ్యవహారంలో ఆరోపణలు, దౌత్యవేత్తల పరస్పర బహిష్కరణ వంటివి జరగ్గా, నిరుడంతా ఇరుదేశాలూ హైకమిషనర్లను నియమించుకోవటం, రెండు దేశాల మధ్యా వివిధ మంత్రిత్వశాఖల స్థాయిలో సమన్వయం సాధించటం వంటివి చోటుచేసుకున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ పల్టీలు కొడుతుండగా, ట్రంప్ అధ్యక్షుడయ్యాక విధిస్తున్న సుంకాలు మరింత కుంగదీస్తున్నాయి. కెనడా కూడా చాలావిధాల దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవటం ఆ దేశానికి తప్పనిసరైంది. ఇటు మన దేశం కూడా రాగల కాలంలో విద్యుదుత్పాదనను విశేషంగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం మన అణువిద్యుదుత్పాదన 6,780 మెగావాట్లు మాత్రమే. వచ్చే దశాబ్ది ప్రారంభానికి ఇది 22,500 మెగావాట్లకు చేరాలి. 2047 నాటికి 100 గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తయితే తప్ప మన అవసరాలు తీరబోవన్న అంచనాలున్నాయి. పదేళ్లపాటు యురేనియం ఎగుమతి చేసేందుకు కెనడాతో కుదిరిన ఒప్పందం ఇందుకు దోహద పడుతుంది. అయితే ఇరు దేశాల మధ్యా ఇంకా అపోహలు లేకపోలేదు. కలిసి కదలటం మొదలుపెడితే, స్నేహసంబంధాలు మెరుగవుతుంటే అలాంటివి పటాపంచలవుతాయి. ఆ దిశగా కార్నీ పర్యటన ఒక ముందడుగు. -
గ్యాస్కు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, అమెరికా–ఇరాన్ యుద్ధం, భారత్కి తలనొప్పి వ్యవహారంగా మారింది. కీలకమైన రస్ లఫాన్ ప్లాంటుపై ఇరాన్ డ్రోన్ల దాడుల దెబ్బతో ఖతర్ ఉత్పత్తిని నిలిపివేయడంతో భారత్కి ఎల్ఎన్జీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనితో దేశీయంగా పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీలకు ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలో 40 శాతం వరకు కోత పడింది. ఫలితంగా ఆయా పరిశ్రమలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇతర ప్రత్యామ్నాయాలకు మళ్లే అవకాశం ఉన్నప్పటికీ, అది ఖరీదైన వ్యవహారంగా మారింది. ఖతర్తో కుదుర్చుకున్న కాంట్రాక్టు రేటుతో పోలిస్తే స్పాట్ మార్కెట్లో రెట్టింపు రేటుకి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు సరఫరాలో కోత పడగా మరోవైపు స్పాట్ మార్కెట్లో కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రాధాన్యత రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్యాస్ సరఫరా దిగ్గజం గెయిల్ సీఎండీకి సీజీడీ సంస్థల సమాఖ్య ఏసీఈ లేఖ రాసింది. గృహాలు, సీఎన్జీ కస్టమర్లు, చిన్న పరిశ్రమలకు నిరాటంకంగా గ్యాస్ సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే గ్యాస్ లభ్యతపై స్పష్టతనివ్వాలని కోరింది. ప్రత్యామ్నాయాలపై దృష్టి.. కీలక రవాణా మార్గమైన హర్మూజ్ జల సంధిలో నౌకలు ప్రయాణించే పరిస్థితి లేకపోవడం వల్ల సరఫరా దాదాపు నిలిచిపోయినట్లు ఖతర్ ఎనర్జీ, పెట్రోనెట్ వెల్లడించాయి. యుద్ధ సమయం కావడం వల్ల కాంట్రాక్టు నిబంధనల ఉల్లంఘనలపరమైన వివాదాలేమీ తలెత్తకుండా లాంఛనంగా ఫోర్స్ మెజూర్ నోటీసులను పరస్పరం ఇచ్చుకున్నాయి. అటు గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియంలకు కూడా ఈ నోటీసులు జారీ చేసినట్లు పెట్రోనెట్ తెలిపింది. దీనితో గెయిల్, ఐవోసీ ప్రత్యామ్నాయంగా స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, టర్మ్ కాంట్రాక్టు రేట్లకు రెట్టింపు స్థాయిలో స్పాట్ మార్కెట్లో యూనిట్ (ఎంబీటీయూ) ఎల్ఎన్జీ ధర 10 డాలర్ల నుంచి 25 డాలర్లకు ఎగిసినట్లు పేర్కొన్నాయి. గ్యాస్ సరఫరాపరమైన సవాళ్ల వల్ల ఎరువులు, విద్యుత్ తదితర పరిశ్రమలు ఖరీదైన ప్రత్యామ్నాయాలకు మళ్లితే వ్యయాల భారంతో ధరలు పెరిగిపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎరువుల విషయం తీసుకుంటే ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింతగా పెరుగుతుందని పేర్కొన్నాయి. సగం అవసరాలకు దిగుమతులే ఆధారం.. దేశీయంగా గ్యాస్ను ఎరువులు, విద్యుదుత్పత్తి మొదలైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు. భారత్లో కూడా సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ డిమాండ్లో సగానికి మాత్రమే సరిపోతోంది. దీనితో ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్కి ఏటా వచ్చే 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీలో ఖతర్ వాటా 40 శాతం పైగా ఉంటోంది. దేశీయంగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థ అత్యధికంగా దిగుమతి చేసుకుని ఇక్కడ మిగతా కస్టమర్లకు సరఫరా చేస్తోంది. ఏటా 8.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని కొనుగోలు చేసేందుకు ఖతర్తో పెట్రోనెట్కి ఒప్పందం ఉంది. స్పాట్ మార్కెట్లో కూడా పెట్రోనెట్ కొనుగోలు చేస్తోంది. ఖతర్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే క్రూడాయిల్ మొదలైన వాటికి కూడా హర్మూజ్ జల సంధి కీలక రవాణా మార్గంగా ఉంటోంది. ఇది ఇరాన్ నియంత్రణలో ఉంది. సగటున రోజుకు 91–135 నౌకలు దీని గుండా రాకపోకలు సాగిస్తాయని, కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 26కి పడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గల్ఫ్ కు 58 ప్రత్యేక విమానాలు.. స్వదేశానికి భారతీయులు
-
భారత్ గ్లోబల్ పవర్గా ఎదగకుండా చేయడానికే..: ఖమేనీ ప్రతినిధి
న్యూఢిల్లీ: భారత్తో పాటు చైనాను గ్లోబల్ పవర్స్గా ఎదగకుండా చేయడానికే తమ దేశంతో అమెరికా ఘర్షణలకు దిగుతోందని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి (ఖమేనీ ప్రతినిధి) అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అబ్దుల్ మజీద్ ఇవాళ ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం నుంచి భారత్కు ప్రత్యేక ప్రతినిధిగా అబ్దుల్ మజీద్ ఉన్నారు.అమెరికా అగ్రరాజ్య హోదాను నిలుపుకోవడానికి ప్రపంచ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని అబ్దుల్ మజీద్ ఆరోపించారు. “సమీప భవిష్యత్తులో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా భారత్, చైనా, రష్యా, అమెరికా ఉంటాయి. అయితే, భారత్ లేదా చైనా తనతో పాటు సమాన శక్తులుగా ఎదగడాన్ని అమెరికా జీర్ణించుకోదు. అందుకే దీన్ని అడ్డుకోవడానికి ఈ యుద్ధాలను ప్రేరేపించి అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది” అని అబ్దుల్ మజీద్ చెప్పారు.అమెరికా ప్రారంభించిన యుద్ధమిది..ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ అని, ఇరాన్ కాదని అబ్దుల్ మజీద్ తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ దేశం తనను తాను రక్షించుకుంటోందని ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజానీ కూడా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. “మాపై దాడి చేసి మా పౌరులపై బాంబులు వేస్తున్నారు. మేము కేవలం మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాం” అని చెప్పారు. యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానే కాబట్టి దానిని ముగించాల్సింది కూడా ఆ దేశమేనని అబ్దుల్ మజీద్ తెలిపారు. వారు ఆపితే తాము కూడా ఆపుతామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత్కు మరో ఐదు ఎస్-400లు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..ఇరాన్ రెండు యుద్ధాలు ఎదుర్కొంటోందని అబ్దుల్ మజీద్ తెలిపారు. ఒకటి అమెరికా, ఇజ్రాయెల్తో సైనిక ఘర్షణ, మరొకటి నకిలీ వార్తల యుద్ధం అని అన్నారు. “అమెరికా, ఇజ్రాయెల్పై సైనిక యుద్ధాన్ని మేము ఎదుర్కోగలం. అయితే దీనికంటే పెద్ద మరో యుద్ధం జరుగుతోంది. అదే నకిలీ కథనాల యుద్ధం. ఈ యుద్ధంలో వారు నకిలీ వార్తలు సృష్టిస్తారు. ఇరాన్ ప్రజలు పాలన మార్పు కోరుకుంటున్నారని చెబుతారు” అని ఆయన అన్నారు. మొత్తానికి ఇతర దేశాల ఎదుగుదలను అడ్డుకోవడమే అమెరికా లక్ష్యమని, తద్వారా వాషింగ్టన్కు తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్పారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం.. పాకిస్తాన్కు కొత్త భయం!
ఇస్లామాబాద్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తున్న వేళ దాయాది దేశం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ మిత్ర దేశం ఇరాన్పై అమెరికా దాడులు చేయడాన్ని పరోక్షంగా వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్ పట్ల తమకున్న భయాన్ని వెళ్లగక్కారు. ఇదే సమయంలో భారత్ను టార్గెట్ చేసి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చివరగా.. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందంటూ బాంబు పేల్చారు.ఇరాన్పై దాడుల జరుగుతున్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆసిఫ్ మాట్లాడుతూ.. ‘అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా-ఇజ్రాయెల్ టెహ్రాన్పై యుద్ధం చేయడానికే సిద్దమయ్యాయి. వ్యూహత్మకంగా దాడులు చేసి సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హత మార్చారు. ఇదంతా ఇజ్రాయెల్ ప్లాన్లో భాగంగానే జరిగింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామిక్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అన్ని సంఘర్షణలలో జియోనిజం (యూదు భావజాలం) ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర పోషించింది. ప్రతీ యుద్ధం, ప్రతీ ఘర్షణలో ఇజ్రాయెల్ భాగంగానే ఉంటోంది. దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను జియోనిస్టులే నిర్ధేశిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.నెతన్యాహు, మోదీ స్నేహంపై.. ఇదే సమయంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధంపై సరికొత్త కుట్రకు తెరలేపారు. ఇజ్రాయెల్ను టార్గెట్ చేసి.. ఇరాన్పై యుద్ధం వల్ల పాకిస్థాన్ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్, ఆప్ఘనిస్తాన్ ఏకమై.. పాక్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. తమ సరిహద్దుల వద్ద ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. అన్ని వైపుల నుంచి శత్రువులు తమను చుట్టుముట్టడం వల్ల పాక్ సామంత దేశంగా మారే ప్రమాదం ఉందన్నారు. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతోందని.. ఈ కుట్రలో భారత్ భాగస్వామిగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరాన్తో పాక్ సరిహద్దు ఇలా.. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్–ఇరాన్ మధ్య సరిహద్దు మొత్తం పొడవు 909 కిలోమీటర్లు (565 మైళ్లు) ఉంటుంది. ఈ సరిహద్దు ఇరాన్లోని సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్తో కలుస్తుంది. ఇది ఉత్తరాన ఆఫ్ఘానిస్తాన్ త్రైజంక్షన్ వద్ద ప్రారంభమై, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వరకు కొనసాగుతుంది. సరిహద్దు భూభాగం ఎక్కువగా ఎడారి, పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. అందువల్ల రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి కష్టతరంగా మారింది. దక్షిణ చివర గల్ఫ్ ఆఫ్ ఒమాన్.. ఇది సముద్ర వాణిజ్యానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఇరాన్–పాకిస్తాన్ మధ్య గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులు, ఇంధన వాణిజ్యం ముఖ్యమైనవిగా ఉన్నాయి. అధికారిక వాణిజ్యంతో పాటు అనధికారిక స్మగ్లింగ్ కూడా విస్తృతంగా జరుగుతుంది. ఇరాన్–పాకిస్తాన్ సంబంధాలు సరిహద్దు భద్రత, వాణిజ్యం, మరియు ప్రాంతీయ రాజకీయాలపై ఆధారపడి ఉంటాయి. మొత్తంగా, ఈ సరిహద్దు ప్రాంతం రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధంను బలపరుస్తూ, వాణిజ్య మార్గంగా పనిచేస్తూ, అదే సమయంలో భద్రతా సవాళ్లును కూడా సృష్టిస్తోంది. -
పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. ఎస్-400లపై భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: రష్యా నుంచి మరో ఐదు ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత వాయుసేన చేసిన ప్రతిపాదనకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్ (డీపీబీ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో బాలిస్టిక్ క్షిపణులు, కామికాజీ డ్రోన్లదే ఆధిపత్యం. ఈ ఘర్షణ పరిస్థితుల మధ్య ఎస్-400 కొనుగోళ్లకు డీపీబీ నుంచి నిర్ణయం రావడం గమనార్హం.కొనుగోలు ప్రతిపాదనలను డీపీబీ పరిశీలించి, తదుపరి దశకు పంపించే బాధ్యత వహిస్తుంది. భారత వాయుసేన ప్రతిపాదనకు రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని డీపీబీ తాజాగా ఆమోదముద్ర వేయడంతో ఇప్పుడు ఇది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) వద్దకు వెళ్తుంది. ఎస్-400ల కొనుగోళ్ల అవసరం ఉందని డీఏసీ అధికారికంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. డీఏసీ ఆమోదం తెలిపిన తర్వాతే ధర నిర్ణయ కమిటీ ఏర్పాటు అవుతుంది. కొనుగోలు ధర నిర్ణయించిన తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) తుది ఆమోదం తెలుపుతుంది.ప్రస్తుతం భారతదేశం వద్ద మూడు ఎస్-400 వ్యవస్థలు ఉన్నాయి. మరో రెండు ఈ ఏడాది భారత సాయుధ దళాల్లో చేరనున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 వ్యవస్థ అద్భుతంగా పని చేసింది. భారత్ శత్రు వైమానిక స్థావరాలు, గగన రక్షణ రాడార్లు, కమాండ్ నియంత్రణ వ్యవస్థలపై దాడి చేసినప్పుడు పాకిస్థాన్ యుద్ధ విమానాలు, ఎలక్ట్రానిక్ స్పై విమానాలు మన గగనతలంలోకి రాకుండా ఎస్-400 నిరోధించింది. 2025 మే 10న తెల్లవారుజామున బ్రహ్మోస్ రావల్పిండిలోని చక్లాలా వైమానిక స్థావరంలో పాకిస్థాన్ వాయుసేన ఉత్తర కమాండ్ నియంత్రణ నెట్వర్క్ను ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ భయపడిపోయి చర్చలకు ముందుకు వచ్చింది.ఇది చదవండి: ఇరాన్తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా?రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పుడు 13 రష్యా పాంట్సిర్ ఎస్-1 స్వయంచాలిత (సెల్ఫ్-ప్రొపెల్లెడ్) క్షిపణి వ్యవస్థ కొనుగోలు ప్రతిపాదన కోసం ఎదురుచూస్తోంది. ఈ ప్రతిపాదన భారత వాయుసేన, ఆర్మీ నుంచి రావాల్సి ఉంది. ఇవి భూమి నుంచి గగనతలంలోని లక్ష్యాలను టార్గెట్ చేసే మధ్య శ్రేణి క్షిపణులు, స్వల్పశ్రేణి రాకెట్లు, కామికాజీ డ్రోన్లను ఎదుర్కొంటాయి. Defence Boost: India plans to procure 5 new S-400 ‘Sudarshan’ air defence squadrons from Russia.Indian Army orders 300 indigenous Dhanush Howitzers for 15 artillery regiments pic.twitter.com/hIcDCbBiQn— The News Drill™ (@thenewsdrill) March 4, 2026 -
ఇండియాకు అగ్ని పరీక్ష..!
-
వార్.. ఆపేద్దాం టూర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా– ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం అన్నింటి కన్నా పర్యాటక రంగాన్ని దెబ్బతీయనుంది. సమ్మర్ టూర్లపై ప్రభావం పడుతుందని ట్రావెల్ ఆపరేటర్లు అంటున్నారు. వేసవిలో మన దేశంలో పాఠశాలలకు సుదీర్ఘ సెలవులు ఇస్తారు కాబట్టి కుటుంబ సమేత విహారాల లీజర్ ట్రావెల్కు ఇది సరైన సమయంగా పర్యా టక ప్రేమికులు భావిస్తారు. కొత్త జంటల హనీమూన్స్కు కూడా ఇది సీజన్ లాంటిదే. ఇప్పటికే చాలా మంది తమ ట్రావెల్ ప్లాన్స్ను అమలులోకి పెట్టారు. విదేశాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు నెలల ముందుగానే ప్రయాణ టికెట్లతో పాటు ఇతరత్రా బుకింగ్స్ కూడా చేసుకున్నారు. రద్దులు, వాయిదాలు మొదలు.. విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు సేవలు నిలిపివేశాయి లేదా దారి మళ్లించాయి, ఇది గల్ఫ్ వెళ్లేవారికి మాత్రమే కాక దుబాయ్ వంటి ప్రధాన కేంద్రాల ద్వారా అమెరికా వెళ్లేవారిని ప్రభావితం చేసింది. ప్రస్తుతం ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారని మేక్ మై ట్రిప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా..‘సాధారణ పరిస్థితుల్లో.. పాఠశాల సెలవులు కుటుంబ ప్రయాణాల వల్ల వార్షిక లీజర్ అవుట్»ౌండ్ ట్రాఫిక్ లో 30–35 శాతం పెరుగుదల ఉంటుంది’‘ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటివో) అధ్యక్షుడు రవి గోసైన్ అంటున్నారు. 2025లో 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు ప్రయాణించగా వేసవి లీజర్ ట్రావెల్ అంతర్జాతీయ పర్యటనలలో 43.5 శాతం వాటాతో అతిపెద్ద చోదకంగా నిలిచింది.విహారాలకు విఘాతమే... ‘భారత్ నుంచి యూరప్, అమెరికాకు విమానాలను అనుసంధానించడానికి దుబాయ్ నాడీ కేంద్రం. ఆ ప్రయాణాలను ప్లాన్ చేసే ఎవరైనా సరే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రభావితమవుతారు’ అని ట్రావెల్ ప్లాట్ఫామ్ పిక్యూర్ట్రైల్ సహ వ్యవస్థాపకుడు హరి గణపతి అంటున్నారు. భారతీయులకు మధ్యప్రాచ్యం కీలకమైన ప్రయాణ కారిడార్. పర్యాటక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2025లో భారతీయులు సందర్శించిన టాప్ 20 దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్, సింగపూర్ ఉన్నాయి. అదే సమయంలో, కొంతమంది ప్రయాణికులు అంతగా అనిశ్చితి లేని గమ్యస్థానాల వైపు తమ ప్రణాళికలను మారుస్తున్నారు. పశి్చమాసియాలో అనిశ్చితి మధ్య భారతీయ ప్రయాణికులు సింగపూర్, జపాన్, వియత్నాం, ఫిలిప్పీ¯న్స్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ వంటి ప్రత్యామ్నాయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. -
చమురు సమస్యకు చాన్స్ లేదు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో స్వల్పకాలికంగా ఇంధనాల సరఫరాలో ఆటంకాలేర్పడినా భారత్కి ఇబ్బందేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మన దగ్గర 6–8 వారాల డిమాండ్కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు ఉన్నాయని వివరించాయి. ప్రభుత్వం రోజువారీగా, ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తోందని చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. వారం పది రోజుల్లో ఈ సంక్షోభం ముగిసిపోయే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నట్లు వివరించారు. దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్, ఇంధనాల నిల్వలు ఉన్నాయని, ఒకవేళ సంక్షోభం మరింత కాలం కొనసాగినా దాదాపు అంతే కాలానికి సరిపడేంతగా ఆయిల్ సరఫరా అమెరికా, రష్యా మొదలైన దేశాల నుంచి వస్తోందని పేర్కొన్నారు. దేశీయంగా వైజాగ్, మంగళూరు, పాదూర్ నిల్వ కేంద్రాల్లో 100 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం రిజర్వ్లు ఉన్నాయి. ధరలు పెరిగితే దిగుమతుల బిల్లులు భారం .. తక్షణమైతే ఇంధనాలకు కొరత ఏర్పడకపోవచ్చు కానీ క్రూడాయిల్ ధరలు, రవాణా.. బీమా వ్యయాలు పెరగడమనేది భారత దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇరాన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి సుమారు 10 శాతం పెరిగి బ్యారెల్కి 80 డాలర్ల స్థాయిని దాటింది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ క్రూడాయిల్ దిగుమతుల కోసం 137 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 206.3 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతుల కోసం 100.4 బిలియన్ డాలర్లు వెచ్చించింది. మరోవైపు, పశ్చిమాసియాలో అనిశ్చితుల వల్ల స్వల్పకాలికంగా తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేలా దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) సహా కీలక పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వలను నిరంతరం సమీక్షించేందుకు ఆయిల్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది వారంలో ఏడు రోజులూ, ఇరవై నాలుగు గంటలు పని చేస్తుందని చెప్పారు. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో, రిఫైనింగ్లో నాలుగో స్థానంలో, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతుల్లో అయిదో స్థానంలో ఉంది. -
స్వదేశంలోనే విదేశీ విద్య
సాక్షి, అమరావతి: భారతీయ విద్యార్థులకు స్వదేశంలోనే విదేశీ విద్య అందుబాటులోకి వస్తోంది. ప్రపంచ యూనివర్సిటీలు భారత్ బాట పడుతున్నాయి. విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు అనువైన ఎంపికగా భారత్ మారుతోంది. 2040 నాటికి 5.60 లక్షల మందికి పైగా విద్యార్థులకు మన దేశంలో ఏర్పాటయ్యే విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లు సేవలందిస్తాయని డెలాయిట్ ఇండియా, నైట్ఫ్రాంక్సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. అలాగే ఏకంగా 113 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని తెలిపింది. 40 భారతీయ నగరాలకు సామర్థ్యం.. విదేశీ వర్సిటీలకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం 40 భారతీయ నగరాలకు ఉందని నివేదిక స్పష్టం చేసింది. వీటిలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై టాప్లో ఉన్నాయి. ఇక్కడ పరిశోధనకు అనువైన వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల రాకకు అనుకూలంగా ఉండటం, మౌలికవసతులు, పరిశ్రమ–విద్య అనుసంధానం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అడ్డంకులను అధిగమిస్తూ.. అధ్యయనం ప్రకారం.. ఉన్నత విద్య చదివే వయసున్న యువత కలిగిన దేశంగా భారత్ టాప్లో ఉంది. ప్రస్తుతం దేశంలో 15.50 కోట్ల మంది ఉన్నత కళాశాలల స్థాయి యువత ఉండగా.. 2030 నాటికి వారి సంఖ్య 16.50 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో 2035 నాటికి విద్యార్థుల స్థూల నమోదును ప్రస్తుత స్థాయి నుంచి 50 శాతానికిపెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు దేశీయ ఉన్నత విద్య సామర్థ్యం సరిపోవట్లేదని భావించిన విద్యార్థులు అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాలు వెళ్తుండేవారు. మారిన పరిస్థితుల్లో ఆయా దేశాలు వీసా నియమాలను కఠినతరం చేస్తుండడంతో భారత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా పెరుగుతున్న ఖర్చులు కూడా వారికి అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్లోనే తమ క్యాంపస్ల ఏర్పాటుకు ప్రపంచ వర్సిటీలు ముందుకొస్తున్నాయి. విదేశీ వర్సిటీల ఏర్పాటుకు వెసులుబాటు..నూతన విద్యా విధానం తర్వాత దేశంలో ఉన్నత విద్యాసంస్థలను స్థాపించాలనుకునే విదేశీ వర్సిటీలకు వెసులుబాటు లభించింది. విదేశీ వర్సిటీల ఆఫ్షోర్ క్యాంపస్లు, జాయింట్ వెంచర్లు, ట్రాన్స్నేషనల్ ఎడ్యుకేషన్ మోడల్స్ ద్వారా భారత్లో స్వతంత్రంగా పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ మార్గాలను కల్పించింది. వీటిలో పన్ను ప్రోత్సాహకాలు, సింగిల్ విండో క్లియరెన్స్ తదితరాలున్నాయి.ఫలితంగా 18 విదేశీ యూనివర్సిటీలు భారత్లో తమ క్యాంపస్ల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం పొందాయి. ఇందులో ఆ్రస్టేలియాకు చెందిన డీకిన్, వోలోన్గాంగ్ వర్సిటీలు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ(గిఫ్ట్సిటీ)లో, యూకేకు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ గురుగ్రామ్లో తమ క్యాంపస్లు ప్రారంభించాయి. -
సోషల్ మీడియాలో మోదీ దూకుడు.. సాటెవ్వరు..
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు యూట్యూబ్లో మోదీ మరో ఘనత సాధించారు. 30 మిలియన్ల (3 కోట్ల) సబ్స్క్రైబర్లు ఉన్న ప్రపంచ నేతగా మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచంలో ఏ నేతకూ ఇంతమంది సబ్స్క్రైబర్లు లేరు. ఈ జాబితాలో మోదీ తర్వాతి స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో (6.58 మిలియన్ల సబ్స్క్రైబర్లు ) ఉన్నారు. అయితే, బొల్సొనారోకు ఉన్న ఫాలోవర్లు మోదీకి ఉన్న ఫాలోవర్లలో నాలుగింట ఒకవంతు మాత్రమే.అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్లు ఏడు రెట్లు. ఇక భారత్లోని నేతల విషయానికి వస్తే కూడా ఫాలోవర్ల విషయంలో మోదీదే ఆధిపత్యం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య మూడురెట్లు ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్లు నాలుగేసి రెట్ల చొప్పున అధికం.మోదీకి యూట్యూబ్లో 30 మిలియన్ల (3 కోట్ల) సబ్స్క్రైబర్లతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లోనూ భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో మోదీకి 100 మిలియన్ల (10 కోట్ల) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్రపంచ నేతగా ఆయన నిలిచారు.మోదీ ఇన్స్టాగ్రామ్లో 2014లో జాయిన్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్నకు ఉన్న ఫాలోవర్ల కంటే మోదీకి రెట్టింపు మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రంప్నకు ఇన్స్టాలో 43.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇండొనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు 15 మిలియన్లు, బ్రెజిల్ అధ్యక్షుడు లులాకు 14.4 మిలియన్లు, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్కు 11.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. భారత్లో మోదీ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. యోగికి ఇన్స్టాలో 16.1 మిలియన్ల మంది, రాహుల్ గాంధీకి 12.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
‘భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుంది’.. పాక్ అధ్యక్షుడు
ఇస్లామాబాద్: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడులు చేస్తుంటే తనని బంకర్లో దాక్కోమని సలహా ఇచ్చారని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ ఆరోపించారు. పాకిస్థాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేయడం ‘హైడ్రో టెరరిజా’నికి పాల్పడింది. రాజకీయానికి నీటి ప్రవాహాలను ఆయుధంగా ఉపయోగించడం సమజసం కాదు. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మేము శాంతి, సంభాషణ ద్వారానే సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలే భారత్తో చర్చలు జరిపేందుకు పాక్ సిద్ధంగా ఉంది’అని స్పష్టం చేశారు.జర్దారీ వ్యాఖ్యలు,ఇటీవల భారత్–పాకిస్థాన్ సంబంధాలు మరింత జఠిలమయ్యాయి. ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేయడం, సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు రెండు దేశాల మధ్య పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు శాంతి మార్గంలో ముందుకు సాగుతాయా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అని కాలమే నిర్ణయించాల్సి ఉంది. Pakistani President Asif Ali Zardari says they are ready for negotiations with India.Zardari says:My message to them (India) is to move away from the war theater to meaningful negotiation tables, because that is the only path for regional security. pic.twitter.com/Kfh0aDSCy7— OsintTV 📺 (@OsintTV) March 2, 2026 -
నేడు ఆకాశంలో అద్భుతం.. అంతటా ‘బ్లడ్ మూన్’ సందడి!
విశ్వాంతరాళంలో నేడు (మార్చి 3) ఒక అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాదిలో అత్యంత కీలకమైన ఘటనగా భావిస్తున్న ‘సంపూర్ణ చంద్రగ్రహణం’ నేడు ఖగోళ శాస్త్రవేత్తలను, ఔత్సాహికులను అమితంగా అలరించనుంది. నేడు ఆకాశంలో ‘బ్లడ్ మూన్’ కనిపించనున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని సాధారణ కళ్లతో చూడటమే కాకుండా, డీఎస్ఎల్ఆర్ కెమెరాల ద్వారా బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు ఇప్పటికే సిద్ధమయ్యారు. ‘బ్లడ్ మూన్’ అంటే ఏమిటి?భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేయడం వల్ల చంద్రుడు ఎరుపు లేదా రాగి రంగులోకి మారుతాడు. శాస్త్రీయ పరిభాషలో దీనినే ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. సూర్యకాంతి భూ వాతావరణం గుండా ప్రయాణించే క్రమంలో తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలిరంగు కాంతి చెల్లాచెదురై, ఎక్కువ తరంగదైర్ఘ్యం గల ఎరుపు రంగు కాంతి మాత్రమే చంద్రుడి ఉపరితలాన్ని చేరుతుంది. ఫలితంగా చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. ఇది కేవలం ఒక దృశ్య మార్పు మాత్రమేనని, దీనితో ఎటువంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.భారత్లో గ్రహణ సమయాలుభారత కాలమానం ప్రకారం, ఈ గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 03:20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 06:47 గంటలకు ముగుస్తుంది. అయితే భారతదేశంలో గ్రహణ ప్రారంభ దశలు కనిపించవు. మన దేశంలో చంద్రోదయం తర్వాతే గ్రహణ వీక్షణకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 06:26 గంటలకు చంద్రుడు ఉదయించనుండగా, 06:33 నుండి 06:40 గంటల మధ్య గ్రహణం గరిష్ట స్థాయిలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం 05:18 నుండి రాత్రి 07:53 వరకు గ్రహణ ప్రభావం ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో సాయంత్రం 06:20 తర్వాత చంద్రోదయ వేళల్లో గ్రహణాన్ని వీక్షించవచ్చు.అంతర్జాతీయ వీక్షణ భారత్తో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, రష్యా, ఆసియా దేశాలు, అమెరికా ఖండాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. సూర్యగ్రహణంలా కాకుండా, చంద్రగ్రహణాన్ని ఎటువంటి కంటి రక్షణ పరికరాలు లేకుండా నేరుగా చూడవచ్చు. కాలుష్యం తక్కువగా ఉండి, తూర్పు దిశ స్పష్టంగా కనిపించే ప్రదేశాలను ఎంచుకుంటే వీక్షణ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. బైనాక్యులర్లు లేదా చిన్న టెలిస్కోపులు ఉపయోగిస్తే చంద్రుడి రంగు మార్పులను మరింత నిశితంగా గమనించవచ్చు. నేరుగా చూడలేని వారి కోసం అనేక సైన్స్ సంస్థలు యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ఫిట్నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘జెఫింగ్’ -
ఎకానమీకి క్రూడ్ షాక్
పశ్చిమాసియా మిసైళ్ల మోతతో దద్దరిల్లుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ అట్టుడుకుతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ముడి చమురు భగ్గుమంటోంది. ప్రపంచ క్రూడ్, గ్యాస్ సరఫరాకు కీలక మార్గమైన హర్ముజ్ జలసంధిలో ట్యాంకర్లపై ఇరాన్ విరుచుకుపడుతుండటంతో క్రూడ్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. సోమవారం క్రూడ్ రేట్లు 13 శాతం దూసుకెళ్లాయి. చమురు ధరలు మరింత పెరిగితే.. అసలే అంతంతమాత్రంగా ఉన్న అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా దిగుమతులపై ఆధారపడుతున్న భారత్ లాంటి దేశాలకు క్రూడ్ సెగ శరాఘాతంగా మారే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు.. గల్ఫ్ దేశాలకు మన ఎగుమతులు కూడా దిగజారితే ఎకానమీకి దెబ్బమీద దెబ్బ పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.అమెరికా – ఇజ్రాయెల్, ఇరా¯Œ మధ్య చెలరేగిన యుద్ధంతో గల్ఫ్ ప్రాంతం అగి్నగుండంగా మారుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హర్ముజ్ జలసంధిని యుద్ధ ప్రభావంతో ఎక్కువ కాలంపాటు మూసివేస్తే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 15 శాతం, గ్యాస్ (ఎల్ఎన్జీ) సరఫరాల్లో 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ట్యాంకర్ ట్రాఫిక్ను వెంటనే పునరుద్ధరించకపోతే క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్ల పైకి దూసుకెళ్తుందని కన్సల్టెన్సీ సంస్థ వుడ్ మెకెంజీ పేర్కొంది. సోమవారం నైమెక్స్ క్రూడ్ రేటు బ్యారెల్ 75 డాలర్లను తాకగా.. బ్రెంట్ క్రూడ్ 83 డాలర్ల గరిష్టానికి చేరింది. హర్ముజ్ జలసంధి మూసివేతతో షిప్పింగ్ రేట్లు, బీమా ధరలు మరింత పెరిగిపోవచ్చని కూడా మెకెంజీ హెచ్చరించింది.రెమిటెన్సులపై ప్రభావం.. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం వల్ల వీరి ఉపాధికి ముప్పు రావొచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే ఉద్యోగాల కోతలకు దారితీస్తుంది. ఇది రెమిటెన్సుల (విదేశాల నుంచి భారతీయులు స్వదేశానికి పంపే సొమ్ము) మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. 2023–24 ఆర్బీఐ గణాంకాల ప్రకారం భారత్కు 118.7 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు రాగా.. అందులో సుమారు 38 శాతం (40–45 బిలియన్ డాలర్లు) గల్ఫ్ దేశాల నుంచే (ఇందులో సగం వాటా యూఏఈదే) వచ్చాయి. ఇరాన్ దాడులతో యూఏఈ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇతర గల్ఫ్ దేశాల ఎకానమీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో భారత్కు వచ్చే రెమిటెన్సులపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా.సరఫరాలకు గండి.. ఒకపక్క, హర్ముజ్లో అడ్డంకులు.. మరోపక్క సౌదీ తదితర దేశాల్లో రిఫైనరీలపై ఇరాన్ దాడులకు తెగబడుతుండటంతో క్రూడ్ సరఫరాలకు గండి పడే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఒపెక్ ప్లస్ దేశాలు సరఫరాలను పెంచడానికి యతి్నస్తున్నాయి. అయినప్పటికీ కీలకమైన ఈ జలసంధి ద్వారా ఎగుమతులను పునరుద్ధరించేందుకు కొన్ని వారాల సమయం పట్టొచ్చని వుడ్ మెకెంజీకి చెందిన సీనియర్ వైస్ప్రెసిడెంట్ అలాన్ గెల్డర్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం సమయంలో క్రూడ్ బ్యారెల్ ధర గరిష్టంగా 130 డాలర్లకు భగ్గుమంది (2008లో బ్యారెల్ 148 డాలర్లు ఆల్టైమ్ గరిష్టం).ఇప్పుడు మళ్లీ గల్ఫ్ వార్ దెబ్బకు తోడు హర్ముజ్ ద్వారా రవాణాకు గండిపడటంతో క్రూడ్ 100 డాలర్ల పైకి ఎగబకావచ్చనేది ఆయన అంచనా. ఎర్ర సముద్రం, మధ్యదరా సముద్రం వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొన్ని సరఫరాలను పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటికీ.. హర్ముజ్ ఎగుమతుల నష్టాన్ని పూర్తిగా పూడ్చడం సాధ్యం కాదని కూడా గెల్డర్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) సరఫరాల్లో 20 శాతం రవాణా కూడా హర్ముజ్ ద్వారానే జరుగుతోంది. ప్రధానంగా ఖతార్ నుంచి ఆసియా, యూరప్ మార్కెట్లకు ఎల్ఎన్జీ భారీగా రవాణా అవుతుంది. తాజా సరఫరా అంతరాయాలతో గ్యాస్ రేట్లు కూడా మండిపోతాయని నిపుణులు చెబుతున్నారు.ఎగుమతులపై ఎఫెక్ట్గల్ఫ్ వార్తో ఎగుమతుల రంగంపై పెను ప్రభావం పడే అవకాశముంది. పశ్చిమాసియా మార్కెట్లలో డిమాండ్ పడిపోతుంది. భారత్కు పశ్చిమాసియా ప్రధాన ఎగుమతి మార్కెట్. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలు దేశీ ఎగుమతులకు కీలకం. భారత్ మొత్తం ఎగుమతుల్లో 17 శాతం (62 బిలియన్ డాలర్లు) వాటా పశ్చిమాసియాదే. ఇందులో ముఖ్యంగా బాస్మతి బియ్యం, చక్కెర, చేపలు, రొయ్యల వంటి సముద్ర ఉత్పత్తులు, రత్నాభరణాలు, టెక్స్టైల్, ఫార్మా ఉత్పత్తులతోపాటు ఐటీ సేవల ఎగుమతుల పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. డిమాండ్ తగ్గడం ఒకెత్తయితే హర్ముజ్ జలసంధి గుండా రవాణా స్తంభించడం కంపెనీలను మరింత దెబ్బతీసే అంశం. ఎగుమతులకు అంతరాయంతో 30కి పైగా లిస్టెడ్ కంపెనీలపై ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు లెక్కలేస్తున్నాయి.మార్కెట్లు బేర్... కూడ్ దెబ్బకు తోడు, రూపాయి పతనం.. దిగుమతుల భారం... ఎగుమతులకు గండితో మన జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడతాయి. ఇప్పటికే తిరోగమనం బాట పట్టిన విదేశీ ఇన్వెస్టర్లు మరింత అమ్మకాలకు తెగబడే అవకాశం ఉంది. నిఫ్టీ ఆల్టైమ్ గరిష్టం (26,373 పాయింట్లు) నుంచి తాజాగా (24,603 పాయింట్లు) 7 శాతం మేర పడింది. ఎకానమీపై గల్ఫ్ వార్ దెబ్బకు మన మార్కెట్లలో ఆటుపోట్లు తప్పవని, మరింత దిగజారే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.భారత్కు డబుల్ షాక్... భారత్ ముడిచమురు అవసరాల్లో 85 శాతం (రోజుకు దాదాపు 4.2 మిలియన్ బ్యారెల్స్) దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో ప్రస్తుతం దాదాపు సగం హర్ముజ్ జలసంధి ద్వారానే మనకు చేరుతోంది. ఇప్పుడు గల్ఫ్లో యుద్ధం దెబ్బకు క్రూడ్ రేట్లు ఎగబాకుతుండటంతో దిగుమతుల బిల్లు తడిసిమోపెడయ్యే పరిస్థితి. వార్ ఎక్కువ రోజులు సాగి.. క్రూడ్ రేట్లు 100 డాలర్ల పైకి చేరితే.. పెట్రోలు, డీజిల్ ధరలు కూడా భగ్గుమంటాయి. దీంతో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చి ప్రజల జేబుకు చిల్లుపడుతుంది. మరోపక్క, డాలరుతో రూపాయి మారకం విలువ 91.5కు పడిపోవడం కూడా ఎకానమీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. రూపాయి పతనంతో చమురు దిగుమతులు మరింత భారంగా మారతాయి.దీనివల్ల రూపాయి విలువ మరింత పడిపోయేందుకు దారితీయొవచ్చని ఇంధన రీసెర్చ్ సంస్థ రిస్టాడ్ ఎనర్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. బ్యారెల్ క్రూడ్ ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) మేర దిగజారుతుందని మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది. ఇక అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి భారత్ చమురు సరఫరా దాదాపు నిలిపివేసింది. భారత్కు రావాల్సిన రోజుకు 1.8 మిలియన్ బ్యారెల్స్ చౌక రష్యా క్రూడ్ ఇప్పుడు చైనాకు తరలిపోతోంది. 10–15 డాలర్ల డిస్కౌంట్ ధరకు లభించే రష్యా క్రూడ్ను కాదనుకోవడం.. ధరలు భగ్గుమనడం భారత్ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఎయిర్లైన్స్ లబోదిబో... భారత్ నుంచి పశ్చిమ దేశాలకు రాకపోకల్లో దుబాయ్ కీలకమైన ట్రాన్సిట్ హబ్గా నిలుస్తోంది. యుద్ధంతో గల్ఫ్ మొత్తం వార్ జోన్గా మారడం, గగనతలాలను మూసేయడంతో భారతీయ విమానయాన సంస్థలు లబోదిబోమంటున్నాయి. ఎయిర్పోర్టుల మూసివేతతో యూరప్, యూకేలకు వెళ్లే పలు విమానాలు రద్దుకావడం, మరికొన్ని వేరే రూట్లకు మళ్లించడం వల్ల ప్రయాణికులకు తిప్పలతోపాటు ఇండిగో, ఎయిరిండియాల వంటి ముఖ్యమైన ఎయిర్లైన్స్ ఖర్చులు భారీగా ఎగబాకనున్నాయి. చమురు రేట్ల పెరుగుదల ప్రభావం (ఏటీఎఫ్) కూడా కంపెనీలకు కునుకులేకుండా చేస్తోంది. భారతీయ, అంతర్జాతీయ ఎయిర్లైన్స్కు వారానికి రూ.875 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చని మారి్టన్ కన్సలి్టంగ్కు చెందిన మార్క్ డి.మారి్టన్ పేర్కొన్నారు. యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించకపోవడం.. గల్ఫ్ దేశాల విషయంలో సెంటిమెంట్ దెబ్బతినడంతో ట్రావెల్ కంపెనీలు కూడా భారీగా నష్టపోతాయనేది పర్యాటక రంగ నిపుణుల మాట. -
భారత్కు 2.6 బిలియన్ డాలర్ల యురేనియం
న్యూఢిల్లీ: యురేనియం, అరుదైన ఖనిజాల సరఫరా విషయంలో భారత్, కెనడా మధ్య కీలకమైన అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదిరాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా నూతన ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశారు.రక్షణ, క్రిటికల్ టెక్నాలజీ, చిన్న, మధ్య తరహా అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, మార్క్ కార్నీ తీర్మానించారు. కెనడా ప్రధానితో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, కెనడా సంబంధాలు ఇప్పుడు నూతన శక్తి, పరస్పర విశ్వాసం, సానుకూలతను సంతరించుకున్నాయని ఉద్ఘాటించారు. యురేనియం ఒప్పందంలో భాగంగా భారత అణు ఇంధన రంగానికి కెనడా సహకారం అందించబోతోంది. 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా చేయనుంది. సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలి ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసాత్మక భావజాలం కేవలం భారత్, కెనడాలకే కాకుండా భూగోళంపై మొత్తం మానవాళికి ముప్పుగా మారాయని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రెండు దేశాలదీ ఒక్కటే మాట అని వివరించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంతోపాటు రాడికలైజేషన్పై పోరాటంలో భారత్, కెనడా మధ్య సహకారం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి అత్యంత కీలకమని అన్నారు. కెనడాపై దాడులు, పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, అక్కడి ప్రజల భద్రతకు సవాళ్లు ఎదురవుతుండడంపై మోదీ, మార్క్ కార్నీ చర్చించారు. అభిప్రాయాలు పంచుకున్నారు.వివాదాలు, ఘర్షణలను సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. అలాంటి ప్రయత్నాలకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి భద్రత కోసం ఆయా దేశాలతో కలిసి పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు బలహీన పడుతున్న నేపథ్యంలో భారత్తో వాణిజ్యానికి కెనడా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా తమ ఇరుదేశాల వాణిజ్య సంబంధాలను మరింత విస్తృతపర్చుకోవాలని ప్రధాని మోదీ, మార్క్ కార్నీ నిర్ణయించుకున్నారు. భారత్లో కెనడా వర్సిటీ క్యాంపస్లు ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని మరో నాలుగేళ్లలో 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ధ్యేయమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. భారత్, కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని, దీనివల్ల రెండు దేశాల్లో నూతన పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కెనడా పెన్షన్ నిధి నుంచి భారత్లో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారని, మనదేశ ప్రగతి చరిత్ర పట్ల కెనడాకు ఉన్న బలమైన విశ్వాసానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేశారు. భారత్, కెనడాల మధ్య ప్రస్తుతం వార్షిక వాణిజ్యం 13 బిలియన్ డాలర్లుగా ఉంది. కెనడా నుంచి అరుదైన ఖనిజాలు దిగుమతి చేసుకోవడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.తద్వారా సప్లై చైన్స్ బలోపేతం అవుతాయన్నారు. ఇంధన రంగంలో ‘తదుపరి తరం భాగస్వామ్యం’ నిరి్మంచుకుంటున్నామని చెప్పారు. హైడ్రోకార్బన్లు సహా పునరుత్పాధక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ స్టోరేజీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. దీర్ఘకాలంలో యురేనియం కోసం కెనడాలో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని మోదీ హర్షం వ్యక్తం చేశారు.రక్షణ రంగంలో భారత్, కెనడాల మధ్య సహకారం నానాటికీ పెరుగుతుండడం రెండు దేశాల లోతైన మైత్రికి, పరస్పర విశ్వాసానికి ప్రతీక అని వివరించారు. కెనడా యూనివర్సిటీల క్యాంపస్లు మన దేశంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలియజేశారు. విద్యా రంగంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటాయని స్పష్టం చేశారు. కీలక రంగాల్లో భారత్తో సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్నదే తమలక్ష్యమని మార్క్ కార్నీ తేలి్చచెప్పారు. ఇరుదేశాలు లబ్ధి పొందేలా కలిసి పని చేస్తామన్నారు. యురేనియం ఒప్పందాన్ని భారత్, కెనడాల స్నేహానికి ప్రతీకగా అభివరి్ణంచారు. సంస్కరణలు, సులభతర వాణిజ్యానికి పెద్దపీట: మోదీ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దేశీయంగా వినియోగం పెరుగుతుండడం, భారీగా పెట్టుబడులు వస్తుండడం, డిజిటల్ ఎకానమీ వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. సోమవారం ఇండియా–కెనడా సీఈఓ ఫోరమ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. సంస్కరణలతోపాటు సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నామని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పరుగులు తీయడం తథ్యమని స్పష్టం చేశారు. కెనడాతో కలిసి త్వరలోనే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఏపీఏ) కుదుర్చుకుంటామని వెల్లడించారు. ఈ సదస్సులో భారత్, కెనడా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. -
ఇంజిన్ లేని నౌక ఇండియాకు తిరిగొస్తోంది
సింథియా (విశాఖ): భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ నౌక తన తొలి విదేశీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుని తిరిగి వస్తున్న సందర్భంగా సోమవారం రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ముంబై హార్బర్లో అధికారికంగా స్వాగతం పలకనున్నారు. ఒమన్ సుల్తానేట్కు వెళ్లి అరేబియా సముద్రం మీదుగా సాగిన ఈ చారిత్రాత్మక ప్రయాణం భారతదేశపు పురాతన సముద్ర వారసత్వాన్ని చాటిచెప్పడమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్–ఒమన్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాలను పునరుద్ఘాటిస్తోంది.ఐఎన్ఎస్వీ కౌండిన్య ఒక ప్రత్యేకమైన నౌక. ఇది పురాతన భారతీయ నౌకానిర్మాణ పద్ధతులను అనుసరించి ఎలాంటి ఇంజిన్ లేకుండా.. చెక్క పలకలను కొబ్బరితాడుతో చేతితో కుట్టి, సహజ రెసిన్లతో సీల్ చేసి నిరి్మంచారు. శతాబ్దాల నాటి భారతీయ సముద్ర నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ఈ నౌక మన సంస్కృతిని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. భారతీయ జ్ఞాన వ్యవస్థలను కాపాడుకోవడంలో దేశానికి ఉన్న నిబద్ధతకు ఈ నౌక నిర్మాణమే నిదర్శనం. 5వ శతాబ్దపు అజంతా గుహల్లోని చిత్రపటాల ఆధారంగా భారత నావికాదళ పర్యవేక్షణలో సంప్రదాయ కళాకారుల నైపుణ్యం, ఆధునిక ఇంజినీరింగ్ ప్రమాణాలతో దీనిని రూపొందించారు.గత ఏడాది డిసెంబర్ 29న పోర్బందర్ నుంచి బయలుదేరిన ఈ నౌక ప్రాచీన నావికులు ప్రయాణించిన మార్గాల్లోనే వెళ్లి ఈ ఏడాది జనవరి 14న ఒమన్లోని పోర్ట్ సుల్తాన్ ఖబూస్కు చేరుకుంది. అక్కడ ఒమన్ ప్రముఖులు, ప్రవాస భారతీయుల సమక్షంలో ఈ నౌకకు ఘనస్వాగతం లభించింది. ఈ యాత్ర ద్వారా భారత్–ఒమన్ సంబంధాలు బలోపేతం అవడమే కాకుండా, ఒకప్పుడు అరేబియా సముద్రం మీదుగా జరిగిన సుగంధ ద్రవ్యాలు, వ్రస్తాల వాణిజ్య వైభవాన్ని, ఉమ్మడి సముద్రయాన సంప్రదాయాలను ఈ నౌక మరోసారి గుర్తు చేసింది. -
సామ్సన్ ఆట... సెమీస్ బాట...
సెమీస్ చేరాలంటే వెస్టిండీస్పై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ విజయలక్ష్యం 196 పరుగులు... పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా... ఆరంభం చూస్తే కాస్త సందేహం. హిట్టర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తొందరగా వెనుదిరగ్గా, సూర్యకుమార్ కూడా ప్రభావం చూపించలేదు. కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడు. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని సంజు సామ్సన్ అసలు సమయంలో సత్తా చాటాడు. ప్రత్యర్థి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ఎక్కడా తడబాటు లేకుండా ఈడెన్ గార్డెన్స్లో జట్టును గెలుపుతీరం చేర్చాడు. అంతకు ముందు విండీస్ మరింత పెద్ద స్కోరు చేయకుండా నిలువరించడంలో మన బౌలర్లు సఫలమయ్యారు. తాజా ఫలితంతో 2024 తరహాలోనే ఈసారి కూడా రెండో సెమీఫైనల్లోనే ఇంగ్లండ్ను ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధమైంది. మరో రెండు నాకౌట్ పంచ్లతో భారత్ చరిత్ర సృష్టించడమే మిగిలింది. కోల్కతా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ టి20 ప్రపంచకప్లో ఆరోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వెస్టిండీస్తో చివరి ‘సూపర్–8’ మ్యాచ్లో కాస్త పోటీ ఎదురైనట్లు కనిపించినా, చివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేసింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విండీస్ను ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు), రావ్మన్ పావెల్ (19 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), షై హోప్ (33 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (50 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటి చేత్తో ఛేదనను సులువుగా మార్చేశాడు. గురువారం వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. సమష్టి ప్రదర్శన... తొలిసారి అంతర్జాతీయ టి20ల్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ఛేజ్ మెరుగ్గానే ఆడినా... మరో ఎండ్లో కెపె్టన్ హోప్ నెమ్మదైన ఇన్నింగ్స్ వెస్టిండీస్కు నష్టాన్ని కలిగించింది. వరుణ్ ఏమరుపాటుగా ఉండడంతో వ్యక్తిగత స్కోరు ‘1‘ వద్ద రనౌట్ కాకుండా తప్పించుకున్న ఛేజ్... 14 పరుగుల వద్ద అభిషేక్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. పవర్ప్లేలో విండీస్ 45 పరుగులు చేయగలిగింది. వరుణ్ తన తొలి ఓవర్లోనే హోప్ను బౌల్డ్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లంతా క్రీజ్లో ఉన్నంతసేపు దూకుడు కనబర్చడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. వరుణ్ ఓవర్లో సిక్స్ ఫోర్ కొట్టిన హెట్మైర్తో పాటు ఛేజ్ను బుమ్రా ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ‘1’ వద్ద తిలక్ క్యాచ్ వదిలేయడంతో రూథర్ఫర్డ్ (14) కొన్ని పరుగులు జోడించగలిగాడు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 125/4 వద్ద నిలిచింది. ఆఖరి 5 ఓవర్లలో విండీస్ 70 పరుగులు రాబట్టింది. 16వ ఓవర్ వేసిన అర్ష్ దీప్24 పరుగులు ఇచి్చనా... తన తర్వాతి ఓవర్లో అతను 6 పరుగులే ఇచ్చాడు. బుమ్రా 2 ఓవర్లలో విండీస్ 26 పరుగులు స్కోరు చేయగలిగింది. పావెల్, హోల్డర్ ఐదో వికెట్కు 35 బంతుల్లో అభేద్యంగా 76 పరుగులు జోడించారు. రాణించిన తిలక్... ఛేదనలో భారత్కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. తడబడుతూనే ఆడిన అభిషేక్ శర్మ (10)తో పాటు ఇషాన్ కిషన్ (10) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే సామ్సన్ పదునైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను నడిపించడంతో భారత్కు ఇబ్బంది ఎదురు కాలేదు. ముందుగా సూర్యకుమార్ (18) కొద్దిసేపు సామ్సన్కు సహకరించగా, ఆ తర్వాత తిలక్ వర్మ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా అండగా నిలిచాడు. జోసెఫ్ ఓవర్లలో వరుసగా మూడు ఫోర్లతో ఆకట్టుకున్న తిలక్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (17) మరికొన్ని పరుగులు జోడించాడు. చివర్లో శివమ్ దూబే (8 నాటౌట్)తో కలిసి సామ్సన్ మ్యాచ్ ముగించాడు.97 టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా సామ్సన్ నిలిచాడు. గతంలో కోహ్లి రెండుసార్లు 82 నాటౌట్ (ఆ్రస్టేలియా, పాక్లపై)గా నిలిచాడు.స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (బి) వరుణ్ 32; ఛేజ్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 40; హెట్మైర్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 27; రూథర్ఫర్డ్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 14; పావెల్ (నాటౌట్) 34; హోల్డర్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–68, 2–102, 3–103, 4–119. బౌలింగ్: అర్ష్ దీప్4–0–43–0, పాండ్యా 4–0–40–1, అక్షర్ 4–0–35–0, బుమ్రా 4–0–36–2, వరుణ్ 4–0–40–1. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) హెట్మైర్ (బి) హొసీన్ 10; సామ్సన్ (నాటౌట్) 97; ఇషాన్ కిషన్ (సి) హెట్మైర్ (బి) హోల్డర్ 10; సూర్యకుమార్ (సి) రూథర్ఫర్డ్ (బి) జోసెఫ్ 18; తిలక్ (సి) హెట్మైర్ (బి) హోల్డర్ 27; పాండ్యా (సి) హోల్డర్ (బి) జోసెఫ్ 17; దూబే (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–29, 2–41, 3–99, 4–141, 5–179. బౌలింగ్: హొసీన్ 2–0–22–1, ఫోర్డ్ 3–0–22–0, హోల్డర్ 4–0–38–2, మోతీ 2–0–18–0, షెఫర్డ్ 2.2–0–34–0, జోసెఫ్ 4–0–42–2, ఛేజ్ 2–0–18–0. -
సలీమా టెటె సారథ్యంలో...
సాక్షి, హైదరాబాద్: స్వదేశంలో జరిగే మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు మిడ్ఫీల్డర్ సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. సీనియర్ స్టార్ గోల్కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా కుటుంబ కారణాలరీత్యా ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఆతిథ్య భారత్తోపాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు ఈ టోర్నీలో పోటీపడతాయి. పూల్ ‘ఎ’లో ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా... పూల్ ‘బి’లో భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్ను 8న ఉరుగ్వేతో, తర్వాత 9న స్కాట్లాండ్తో, 11న వేల్స్తో తలపడుతుంది. ఈ టోర్నీ ద్వారా మూడు జట్లు ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. భారత మహిళల హాకీ జట్టు: బన్సారి, బిచ్చూ దేవి (గోల్కీపర్లు), సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, మనీషా, ఉదిత, ఇషిక చౌధరీ (డిఫెండర్లు), నేహా, సలీమా టెటె, సునెలితా టొప్పో, సాక్షి రాణా, వైష్ణవి, రుతుజా, దీపిక (మిడ్ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్, ఇషిక, లాల్రెమ్సియామి, బ్యూటీ డుంగ్డుంగ్, బల్జీత్ కౌర్, అన్ను (ఫార్వర్డ్స్). -
ఇండియాలో ఖమేనీ మూలాలు!
ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, సంతాప సూచనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. భారత్లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఖమేనీ కుటుంబ మూలాలు ఉన్న పలు గ్రామాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఖమేనీ పూర్వీకుల మూలాలు ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా, కింతూర్ గ్రామానికి చెందినవారని రికార్డులు చెబుతున్నాయి. ఆయన తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ 1800 ప్రాంతంలో యూపీలో జన్మించారు. 1830లో ఇరాక్లోని నజాఫ్కు మతపరమైన ప్రయాణంలో వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇరాన్ అధికారిక రికార్డుల్లో ‘హిందీ’ అనే పదాన్ని తన పేరులో ఖమేనీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. భారత్తో ఖమేనీ అనుబంధం 1986లో ఖమేనీ భారత్ పర్యటనలో అలిపురాను సందర్శించారు. ఈ క్రమంలో ఖమేనీ గౌరవార్థం ఆయన పేరిట ఓ ఆస్పత్రిని నిర్మించారు. అలిపురాలోని అనేక కుటుంబాలు ఇప్పటికీ ఇరాన్తో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తున్నాయి. కొంతమంది గ్రామస్థులు విద్య, ఉపాధి కోసం ఇరాన్లో స్థిరపడ్డారు. అలిపురాలో విషాద వాతావరణం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా అలిపురా గ్రామంలో ఖమేనీ మరణంతో సంతాప దినాలు ప్రకటించారు. గ్రామంలోని షియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మూడు రోజులపాటు దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. అలిపురా జనాభా దాదాపు 30,000 కాగా, వీరిలో ఎక్కువ మంది షియా ముస్లింలే. ఖమేనీ మరణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, భారత్తో ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధం ఇప్పుడు మరింతగా వెలుగులోకి వచ్చింది. -
‘ఇరాన్పై దాడుల్ని భారత్ ఖండించాలి’
సాక్షి,హైదరాబాద్: మధ్య ప్రాచ్య దేశాలపై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని భారత్ ఖండించాలని ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఓవైసీ అన్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఓవైసీ స్పందించారు. ‘ఇరాన్పై దాడులను మేం ఖండిస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య చట్టవిరుద్ధం, అనైతికం. ఆయన షియా సమాజానికి గొప్ప నాయకుడు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్పై దాడుల్ని తక్షణమే ముగియాలని,ఈ విషయంలో భారత ప్రభుత్వం తన పాత్ర పోషించాలని కోరారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. దాడుల్ని కేంద్రం ఖండించాలి. అంతర్జాతీయ స్థాయిలో దేశం శాంతి ప్రయత్నాలకు ముందడుగు వేయాలి. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి (10 మిలియన్) మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. యుద్ధం కొనసాగితే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ యుద్ధం కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో కల్లోలం తప్పదు. భారతీయులు అక్కడ చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
నేడు కోల్ కతా వేదికగా హై ఓల్టేజ్ ఫైట్
-
ఖమేనీ మృతితో జమ్ముకశ్మీర్లో ఉద్రిక్తత
శ్రీనగర్: ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతితో జమ్ముకశ్మీర్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడటంతో ఆదివారం కశ్మీర్ లోయతో పాటు జమ్మూలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. షియా సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి, తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.అయతొల్లా అలీ ఖమేనీ మృతి దరిమిలా శ్రీనగర్ సహా కశ్మీర్లోని మెజారిటీ ప్రాంతాలు, జమ్ము శివారులోని భటిండి, రాంబన్ జిల్లాలోని చందర్కోట్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శాంతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ముఖ్యమంత్రి.. ఇరాన్లో ఉన్న జమ్ముకశ్మీర్ విద్యార్థులు, ఇతరుల భద్రత విషయంలో తమ ప్రభుత్వం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని భరోసా అన్నారు.శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై బలప్రయోగం చేయవద్దని, పోలీసులు, పరిపాలనా యంత్రాంగం నిగ్రహంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ‘ఎక్స్’ వేదికగా కోరారు. మరోవైపు ఈ ఆకస్మిక నిరసనల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉంచాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిశితంగా గమనించాలని జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కూడా చదవండి: పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు -
పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ మరోమారు తన కవ్వింపు చర్యలను ప్రదర్శించింది. ఆదివారం పూంచ్ జిల్లాలోని దిగ్వార్ సెక్టార్లో పాకిస్తాన్కు చెందిన ఒక అనుమానాస్పద డ్రోన్ భారత గగనతలంలోకి చొరబడటంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. సరిహద్దుల్లోని ఫార్వర్డ్ పోస్ట్ల వద్ద పహారా కాస్తున్న సైనికులు ఆకాశంలో డ్రోన్ అసాధారణ కదలికలను గుర్తించారు. అది పాక్ భూభాగం నుంచి వస్తున్న డ్రోన్గా నిర్ధారించుకున్న వెంటనే సైన్యం దాన్ని కూల్చివేసేందుకు పన్నెండు రౌండ్లకు పైగా కాల్పులు జరిపింది. భారత బలగాల కాల్పుల ధాటికి తాళలేక ఆ డ్రోన్ వెంటనే తిరిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) వైపు వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గత మూడు రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి 27న కూడా పూంచ్ సెక్టార్లోనే సరిహద్దు రేఖ వెంబడి ఒక డ్రోన్ కనిపించగా, అప్పుడు కూడా భారత సైన్యం కాల్పులు జరిపి దాన్ని తరిమికొట్టింది.వరుసగా డ్రోన్లు చొరబడుతుండటంతో సరిహద్దు భద్రతా దళాలు అత్యున్నత స్థాయి అప్రమత్తతను ప్రకటించాయి. ఈ డ్రోన్ చొరబాటు వెనుక భారత భూభాగంలోకి ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా మాదకద్రవ్యాలను చేరవేసే కుట్ర ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. కాగా తాజా ఘటనలో డ్రోన్ ద్వారా ఏవైనా అనుమానాస్పద వస్తువులను జారవిడిచారా అనే కోణంలో అణువణువూ గాలిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, సరిహద్దుల వెంబడి భారత్ తన నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. STORY | Pak drone enters Indian side along LoC in J-K's Poonch, Army opens fireArmy troops opened fire to bring down a Pakistani drone after it entered into the Indian side from across the Line of Control (LoC) in Poonch district of Jammu and Kashmir early Sunday, officials… pic.twitter.com/WwJfqzR2Tw— Press Trust of India (@PTI_News) March 1, 2026 -
Israel Vs Iran War: పశ్చిమాసియాకు విమానాలు రద్దు
న్యూఢిల్లీ: ఇరాన్లో యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఆ దేశానికి విమానసరీ్వసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు భారతీయ పౌర విమానయాన సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్లకు విమానసర్వీసులను తాత్కాలికంగా రద్దుచేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) భారతీయ విమానయాన సంస్థలకు సూచించింది.ఈ ఆదేశాల మేరకు తమ సరీ్వసులను నిలిపేస్తున్నట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ తదితర సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రభుత్వ సూచనల మేరకు సరీ్వస్లు ఆగిపోవడంతో శనివారం సాయంత్రం 5.45 గంటలవరకు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 57 దేశీయ, అంతర్జాతీయ సర్వీస్లు రద్దయ్యాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.యుద్దం కారణంగా రద్దయిన విమానాల్లో టికెట్లను వేరే తేదీలకు ఉచితంగా షెడ్యూల్ చేసుకోవడానికి లేదా రద్దుచేసుకోవడానికి ప్రయాణికులకు విమానయాన సంస్థలు అవకాశం కల్పించాయి. పశ్చిమాసియాకు అన్ని దేశాల నుంచీ విమాన సరీ్వసులు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.బ్రిటన్ సహా పలు దేశాల నుంచి పశి్చమాసియాకు విమానసరీ్వసులు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడింది. బ్రిటన్ నుంచి దుబాయ్కు విమానాలు రద్దయ్యాయి. టర్కీ ఎయిర్లైన్స్ సైతం లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, జోర్డాన్లకు సోమవారం దాకా సరీ్వసులు ఆపేసింది. అమెరికాకు చెందిన డెల్టాఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, నెదర్లాండ్స్కు చెందిన కేఎల్ఎం సైతం ఇజ్రాయెల్కు విమానాలను నిలిపేశాయి. -
సెమీఫైనల్ లక్ష్యంగా...
టి20 ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ టైటిల్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో కఠిన పరీక్షకు సిద్ధమైంది. సెమీస్లో చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో మాజీ చాంపియన్, హిట్టర్లకు మారుపేరైన వెస్టిండీస్తో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లు ‘సూపర్ ఎయిట్స్’ దశలో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయి జింబాబ్వేపై ఘన విజయాలు సాధించి సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. 2024 టి20 వరల్డ్ కప్నుంచి ఇరు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. అయితే అనుభవంలో మేటిగా ఉన్న టీమిండియా ఎలా పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరంకోల్కతా: టి20 వరల్డ్ కప్లో రెండు సార్లు విజేతలుగా నిలిచిన జట్లు ఈ సారి టోర్నీ కీలక దశలో ముఖాముఖీకి సన్నద్ధమయ్యాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ‘క్వార్టర్ ఫైనల్’లాంటి పోరులో నేడు (ఆదివారం) వెస్టిండీస్ను భారత్ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు సెమీస్ చేరుకుంటుంది. ఓడిన టీమ్ టోర్నీనుంచి నిష్క్రమిస్తుంది. అయితే రన్రేట్లో ప్రత్యర్థికంటే భారత్ కాస్త వెనుకబడి ఉంది. ఒక వేళ ఊహించని విధంగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం జరిగితే విండీస్ ముందంజ వేస్తుంది. అయితే ఈ అంచనాలను పక్కనపెడితే... వరల్డ్ కప్లో రెండు టీమ్లూ సిక్సర్లతో చెలరేగాయి. మరోసారి మైదానంలో భారీ మోత ఖాయంగా కనిపిస్తోంది. మార్పుల్లేకుండా... జింబాబ్వేపై చెలరేగిన భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. మేనేజ్మెంట్ కూడా అదే వ్యూహాన్ని కొనసాగించాలని భావిస్తోంది. తండ్రి మరణం తర్వాత రింకూ సింగ్ మళ్లీ జట్టుతో చేరినా...అతనికి అవకాశం దక్కకపోవచ్చు. మరో సారి అభిషేక్, సామ్సన్ ఓపెనర్లుగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. గత భారీ స్కోర్ల మ్యాచ్లో ఫర్వాలేదనిపించిన సామ్సన్ మరింత పెద్ద స్కోరు చేయాల్సి ఉంది.జింబాబ్వేపై కాస్త తగ్గి ఆడిన అభిషేక్ మళ్లీ తనదైన శైలిలో చెలరేగితే జట్టుకు శుభారంభం ఖాయం. తర్వాతి బ్యాటింగ్ భారాన్ని ఇషాన్, సూర్య మోస్తారు. పాండ్యా, దూబేల దూకుడు అదనపు బలం కాగా, అక్షర్ కూడా తన బ్యాటింగ్తో జట్టుకు కీలకం కాగలడు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం జట్టు ప్రధాన బలం. బౌలింగ్లో కూడా మన టీమ్ పదునుగా ఉంది. స్పిన్ను పెద్దగా ఆడలేని విండీస్పై వరుణ్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించగలడు. బుమ్రా, అర్ష్ దీప్ లు విండీస్ హిట్టర్లను ఆరంభంలో నిలువరిస్తే తిరుగుండదు. బౌలింగ్లో రాణించేనా! వెస్టిండీస్ టీమ్ మొదటినుంచి తమ బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. ఒకరితో పోటీ పడి మరొకరు సిక్సర్లు బాదగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన మ్యాచ్లో కూడా ఎక్కువ పరుగులు సిక్సర్ల ద్వారానే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లీగ్లు ఆడే హిట్టర్లు బౌలర్లు ఎవరైనా ప్రత్యర్థి ఎవరైనా లెక్క చేయకుండా బౌండరీ దాటించడమే పనిగా ఆడుతున్నారు. హెట్మైర్, పావెల్, రూథర్ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్... ఇలా అంతా భారీ షాట్లు ఆడేవారే. అంతా సమష్టిగా చెలరేగితే భారత్పై ఒత్తిడి పెరగడం ఖాయం. అయితే భారత్తో పోలిస్తే విండీస్ బౌలింగ్ చెప్పుకోదగినట్లుగా లేదు. ఒక్క షామర్ జోసెఫ్ ఫర్వాలేదనిపించే బౌలర్ కాగా...ఫోర్డ్, మోతీ, హోల్డర్, ఛేజ్ మన బ్యాటర్లను నిలువరించలేరు. అందుకే జట్టు భారీ స్కోరు సాధించడంపైనే గురి పెట్టింది. 2016 టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వెస్టిండీస్ మరే ఐసీసీ ఈవెంట్లో కూడా సెమీఫైనల్ చేరలేకపోయింది.పిచ్, వాతావరణం ఈడెన్ గార్డెన్స్ పిచ్ బాగా పొడిగా ఉంది. బ్యాటింగ్కు ఎంతో అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. రద్దు గురించి భారత అభిమానులు భయపడుతున్నా... మ్యాచ్ రోజున ఎలాంటి వర్ష సూచన లేదు. 1983 నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి భారత్తో 11 మ్యాచ్లలో తలపడిన వెస్టిండీస్ ఒక్కటీ గెలవలేదు. 2 టెస్టులు డ్రా కాగా మిగతా 9 సార్లు (4 టి20లు) ఓడింది.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్ , బుమ్రా, వరుణ్. వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్), కింగ్, హెట్మైర్, పావెల్, ఛేజ్, రూథర్ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్, ఫోర్డ్, మోతీ, జోసెఫ్. టి20 ప్రపంచకప్లో నేడుజింబాంబ్వే X దక్షిణాఫ్రికావేదిక: ఢిల్లీ, మ. 3 గంటల నుంచి భారత్ X వెస్టిండీస్వేదిక: కోల్కతా, రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
జగద్గిరిగుట్ట నాగార్జున హైస్కూల్లో సైన్స్ ఫెస్ట్ (ఫోటోలు)
-
ఇరాన్పై మొదలైన భీకర దాడులు: భారతీయులకు కీలక ఆదేశాలు
Israel Attack Iran ఇరాన్ అంతటా ఇజ్రాయెల్ భీకర దాడులను ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్పై అనేక నగరాల్లో “ముందస్తు” వైమానిక దాడులను ప్రారంభించింది.రాజధాని టెహ్రాన్, చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు ఈ అమెరికా దాడులను ప్రారంభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై తాజా చర్చలతో తాను "సంతోషంగా లేను" అని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. ఇరాన్ బెదిరింపులను నిలువరించేందుకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దాడులు జరిగిన వెంటనే, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హోమ్ ఫ్రంట్ కమాండ్ పౌరులను రక్షిత ప్రాంతాలకు సమీపంలో ఉండాలని, బైటికి రావద్దని ఆదేశాలు జారీ చేశాయి.ఇస్ఫహాన్, కోమ్, కరాజ్, కెర్మాన్షాలలో పేలుళ్లు సంభవించాయని, టెహ్రాన్లోని రెండు ప్రదేశాలలో పేలుళ్లు సంభవించాయని దీంతో నగర కేంద్రంలో దట్టమైన పొగ కమ్ముకుందని పలు మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. #WATCH | Tehran, Iran | Israel has launched a preventative missile attack against Iran, the Israeli defence minister said; visuals of the aftermath of the strike in Iran as a plume of smoke billows into the skyThe U.S. participated in the (Iran) attack and was also carrying out… pic.twitter.com/tzfR1WnDhO— ANI (@ANI) February 28, 2026అప్రమత్తంగా ఉండండిఈ దాడుల నేపథ్యంలో ఇండియా అక్కడి భారతీయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్లోని భారతీయ పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇజ్రాయెల్ అధికారులు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు ,సూచనలను భారతీయ పౌరులు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. -
కార్నీ పర్యటన ప్రారంభం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం భారత్ చేరుకున్నారు. ఉన్నతాధికారుల బృందంతో కలిసి శుక్రవారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో దిగారు. అనంతరం పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. ఆదివారం కార్నీ ఢిల్లీ చేరుకుంటారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో కూడా భేటీ అవుతారు. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యానంతరం ఇరుదేశాల సంబంధాలు బాగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. వాటిని తిరిగి బలోపేతం చేసుకోవడంతో పాటు పలు రంగాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా కార్నీ భారత్లో పర్యటిస్తున్నారు. భారత్, కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా వాణిజ్యం, ఇంధనం, టెక్నాలజీ సహా పలు రంగాలపై ప్రధానులు లోతుగా చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ పేర్కొంది. -
ఈడెన్లో ఈ సండే పరుగుల పండగే
కోల్కతా: భారత్, వెస్టిండీస్ల మధ్య రేపు జరిగే మ్యాచ్ ఈ టి20 ప్రపంచకప్కే ‘పైసా వసూల్’ మ్యాచ్ కానుంది. ముమ్మాటికి క్వార్టర్ ఫైనల్గా జరిగే ‘సూపర్–8’ మ్యాచ్లో గెలిచిన జట్టే సెమీఫైనల్ చేరుతుంది. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం వినియోగించే పిచ్ గురించి క్యూరేటర్ సుజన్ ముఖర్జీ ఆసక్తికర విషయం వెల్లడించగా... బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం పిచ్పై సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిసింది. ఈ వరల్డ్కప్లో స్కాట్లాండ్, ఇటలీ జట్ల మధ్య గ్రూప్–సి లీగ్ మ్యాచ్కు వేదికైన పిచ్పైనే ఆదివారం కీలక సూపర్–8 పోరు జరుగుతుందని క్యూరేటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈడెన్ పిచ్పై జరిగిన ఆ రెండో మ్యాచ్లో స్కాట్లాండ్ 207/4 స్కోరు చేసింది. తర్వాత ఇటలీని 134 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్, కరీబియన్లాంటి మేటి జట్ల మధ్య జరిగే మ్యాచ్లోనూ పరుగుల విందు గ్యారంటీ కావడంతో ఈడెన్ గార్డెన్స్ కిక్కిరిసి పోతుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాటర్ల మెరుపులకే కాదు నాణ్యమైన స్పిన్కూ ఈడెన్ అచ్చొచ్చే వేదికని ఎన్నోమార్లు రుజువైంది కూడా! ఇటలీపై స్కాట్లాండ్ స్పిన్నర్లు మైకేల్ లిస్క్ (4/17), మార్క్ వ్యాట్ (2/24) 6 వికెట్లతో అదే నిరూపించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ స్వయంగా ఈడెన్ గార్డెన్స్లోకి వెళ్లి పిచ్ను తదేకంగా పరిశీలించారు. క్యూరేటర్తో వికెట్ పరిస్థితిపై చర్చించారు. అలాగే బోర్డు చీఫ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్ను కూడా కలిసి సమీక్షించారని ‘క్యాబ్’ వర్గాలు తెలిపాయి. వికెట్తో పాటు స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. -
మెర్సిడెస్ బెంజ్ రీకాల్: ఈ మోడల్స్పై ఎఫెక్ట్
మెర్సిడెస్ బెంజ్ ఇండియా.. భారతదేశంలో స్వచ్ఛంద రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 149 వాహనాలపై చూపుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన రీకాల్ నోటీసును ఫిబ్రవరి 15న జారీ చేసింది.బెంజ్ రీకాల్ ప్రభావం.. సీఎల్ఈ క్యాబ్రియోలెట్, సీఎల్ఈ 53 ఏఎంజీ కూపే & సీ 63 ఎస్ఈ పెర్ఫార్మెన్స్ వాహనాలపై పడింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)లో సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున సంస్థ రీకాల్ జారీ చేసింది. కొన్ని సందర్భాల్లో.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫంక్షన్ పనిచేయకపోవచ్చని కూడా మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది.రీకాల్ ప్రభావానికి గురైన వాహనాలు 2 సెప్టెంబర్ 2024 & 18 మార్చి 2025 మధ్య తయారు చేసినవని తెలుస్తోంది. రీకాల్ నోటీసు పొందిన కస్టమర్లు అధీకృత మెర్సిడెస్-బెంజ్ సర్వీస్ సెంటర్లు నేరుగా సంప్రదించి.. అవసరమైన తనిఖీ చేసుకోవచ్చు. డబ్బు చెల్లించకుండానే సమస్యను పరిష్కరించుకోవచ్చు. -
ఆప్ఘన్, పాక్ యుద్ధం.. భారత్పై ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్, తాలిబన్ల ఆఫ్ఘనిస్థాన్ సైన్యం మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆప్ఘన్పై బహిరంగ యుద్ధం ప్రారంభించినట్లు పాకిస్తాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఖవాజా.. భారత్పై మరోసారి అక్కసును వెళ్లగక్కారు.అయితే, ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ‘మా సహనం నశించింది. ఇప్పుడు మాకు.. మీకు మధ్య బహిరంగ యుద్ధమే’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్తో ప్రస్తుతం తాలిబన్లకు సంబంధాలు లేవన్నారు. మరోవైపు, ఖవాజా.. భారత్పై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్తాన్పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయని ఫ్రాన్స్ 24 ఇంటర్వ్యూలో అన్నారు. భారతే.. తమపై ఆప్ఘన్లు దాడులు చేసేలా ప్రేరేపించిందన్నారు. కానీ, భారత్ దానిని అంగీకరించరు. భారత్.. కాబూల్తో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆప్ఘన్.. భారత్కు వలస రాజ్యంగా ఉందన్నారు. అయితే, దీనిపై ఎలాంటి ఆధారాలు చూపలేకపోయినా, భారత్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలను అనుమానాస్పదంగా పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి నుంచే ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’గా పేర్కొంది. కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్లలో వైమానిక దాడులు జరిగాయని ఆప్ఘన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు. పాక్పై చేపట్టిన దాడుల్లో 55 మంది ఆ దేశ సైనికులు చనిపోయారని ఆఫ్ఘనిస్థాన్ ప్రకటించింది. అయితే, ఇస్లామాబాద్ దీన్ని తోసిపుచ్చింది. ఘర్షణల్లో ఇద్దరు పాక్ సైనికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొంది. ఇస్లామాబాద్ సైనికుల నిర్బంధంపై తాలిబన్లు చేసిన ప్రకటనను పాక్ ప్రభుత్వ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ ఖండించారు. ఆప్ఘన్ సైనికులే 133 మంది మరణించారని.. 200 మందికి పైగా గాయపడ్డారన్నారు. తొమ్మిది మంది సైనికులను నిర్బంధించినట్లు తెలిపారు. ఇటీవల తమపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్పై అఫ్గాన్ విరుచుకుపడింది.డ్యూరాండ్ రేఖ వివాదం..ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య 2,611 కిలోమీటర్ల సరిహద్దు అయిన డ్యూరాండ్ రేఖను ఆఫ్ఘనిస్థాన్ అధికారికంగా ఎప్పుడూ గుర్తించలేదు. పాకిస్తాన్ దీనిని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా ఉంది. ఈ క్రమంలో 2025 అక్టోబర్లో జరిగిన సరిహద్దు ఘర్షణల్లో డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు, మిలిటెంట్లు మరణించారు. -
ఇండియాతో బంధం ఎంతో ప్రత్యేకం.. నెతన్యాహూ
ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయోల్ పర్యటన ముగిసింది. ఆ దేశంలో ఘనంగా అతిథ్యం స్వీకరించడంతో పాటు రెండు దేశాలు కీలకమైన పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. భారత్తో తనకు వ్యక్తిగతంగా ఎంతో కనెక్టివీటి ఉందని తెలిపారు. తన వైఫ్ సారా నెతన్యాహుని మెుదటి సారి కలిసింది ఇండియన్ రెస్టారెంట్లోనే అని తెలిపారు.భారత్ -ఇజ్రాయెల్ మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ద్వైపాక్షిక సంబంధాల పరంగా కాకుండా వ్యక్తిగతంగానూ భారత్ అంటే ఇజ్రాయెల్కు ఎంతో అభిమానం. ప్రపంచంలో చాలా దేశాలు యూదులపై దాడులు చేస్తున్న సమయంలో ఇండియా వారికి అండగా నిలిచింది. అందుకు భారత్తో ఇజ్రాయిలీలకు ఆత్మీయ అనుబంధం. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు వ్యక్తిగతంగానూ భారత్ తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు.ఆయన మాట్లాడుతూ" నాకు వ్యక్తిగతంగా భారత్ ఎంతో ప్రత్యేకం. నా మెదటి,లేదా రెండవ సారి నా వైప్ సారాను ఇండియన్ రెస్టారెంట్లోనూ కలిసాను. ఆఫుడ్ మాత్రమే కాదు. ఆ డేట్ ఎంతో అద్భుతంగా సాగింది." అన్నారు. ఆ రెస్టారెంట్ను రీనా పుష్కర్నా అనే భారతీయురాలు నడిపిస్తుంది. ఆమె కర్రీ క్వీన్గా ఎంతో ఫేమస్ అన్నారు. భారతీయ వంటకాలను ఇజ్రాయెల్కు పరిచయం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు.భారత్-ఇజ్రాయెల్ మధ్య సాంస్కృతిక రాయభారిగా తను పనిచేస్తుందన్నారు. గతంలో భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వచ్చినప్పుడు ఆ రెస్టారెంట్లోనూ విందు ఇచ్చామని భోజనం అద్భుతమని మోదీ ప్రశంసించారని తెలిపారు. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన మోదీకి ఇజ్రాయెల్లో ఘన స్వాగతం లభించింది. -
జింబాబ్వేపై భారత్ విజయం
-
నేటి నుంచి కెనడా ప్రధాని పర్యటన
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ నాలుగు రోజుల భారత పర్యటన శుక్రవారం మొదలుకానుంది. భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని కార్నీల మధ్య చర్చలు ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో విజయం సాధించనున్నాయని భారత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కార్నీ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరుదేశాల నడుమ సంబంధాలు పూర్తిగా క్షీణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్సంబంధాల బలోపేతం కోసం కార్నీ భారత్లో పర్యటిస్తున్నారు. జూన్లో కననాస్కీస్, నవంబర్లో జొహన్నెస్బర్గ్లో ఇరుదేశాల అగ్రనేతల భేటీల తర్వాత రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా పలు రంగాల్లో సహకారంపై మోదీ, కార్నీలు చర్చించనున్నారు. ఇరునేతలు సోమవారం ఇండియా–కెనడా సీఈవో ఫోరమ్లో పాల్గొంటారు. తర్వాత వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భూఅయస్కాంతాలు, వ్యవసాయం, విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాల వంటి అంశాల్లో సహకారంపై చర్చలు జరపున్నారు. -
IND vs ZIM: వెస్టిండీస్పై గెలిస్తే సెమీఫైనల్కు..
భారత జట్టు తమ కసినంతా జింబాబ్వేపై చూపించింది. గత మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో ఒక్కసారిగా షాక్కు గురైన టీమిండియా తర్వాతి పోరులో విధ్వంసకర రీతిలో నష్టనివారణ చేసింది. సామ్సన్ శుభారంభం అందిస్తే, అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చి దూకుడుగా ఆడాడు. మధ్యలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ తమదైన శైలిలో ధాటిని ప్రదర్శిస్తే చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇలా భారత బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి సిక్సర్లతో విరుచుకుపడటంతో జింబాబ్వే బెంబేలెత్తిపోయింది. ఆ జట్టు బౌలర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా రికార్డు స్కోరు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఛేదనలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్ను ముగించింది. ఇక నెట్రన్రేట్ వంటి గందరగోళపు లెక్కలు అవసరం లేకుండా నాకౌట్ పంచ్ మిగిలింది. ఆదివారం వెస్టిండీస్తో జరిగే చివరి పోరులో భారత్ గెలిస్తే సెమీఫైనల్కు చేరుతుంది. ఓడిపోతే నిష్క్రమిస్తుంది. చెన్నై: టి20 వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా గురువారం జరిగిన ‘గ్రూప్–1’ మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తాజా ఫలితంతో జింబాబ్వే సెమీస్ చేరే అవకాశాలు ముగిసిపోయాయి. ఎంఎ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా... తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. పాండ్యా, తిలక్ ఐదో వికెట్కు 31 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ (59 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు) ఒంటరి పోరాటం మినహా అంతా విఫలమయ్యారు. పోటీ పడి పరుగులు... ఇన్నింగ్స్ రెండో బంతికే సంజు సామ్సన్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్లు) కొట్టిన సిక్స్తో ఆరంభమైన భారత్ జోరు చివరి వరకు సాగింది. మపోసా వేసిన మూడో ఓవర్లోనే భారత్ 23 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అభిషేక్ కూడా ఫామ్లోకి వచ్చాడు. క్రీజ్లో ఉన్న కొద్దిసేపు సామ్సన్ ధాటిగా ఆడాడు. సామ్సన్ వెనుదిరిగిన తర్వాత ఇషాన్ అదే వేగాన్ని కొనసాగించాడు. పవర్ప్లే ముగిసేసరికి జట్టు 80 పరుగులు చేసింది. 26 పరుగుల వద్ద ఇషాన్కు లైఫ్ లభించగా, 26 బంతుల్లో అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తయింది. రజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కిషన్ తర్వాతి బంతికి అవుటయ్యాడు. కొద్దిసేపటికి అభిషేక్ కూడా పెవిలియన్కు చేరాడు. 8 పరుగుల వద్ద ముజరబాని క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ మపోసా ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. తర్వాతి ఓవర్లోనూ వేగంగా ఆడే క్రమంలో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది. 4 ఓవర్లలో 69 పరుగులు... 16 ఓవర్లు ముగిసేసరికి నిస్సహాయంగా మారిపోయిన జింబాబ్వే బౌలర్లపై చివర్లో పాండ్యా, తిలక్ మరింత విరుచుకు పడ్డారు. 17–20 ఓవర్లలో భారత్ వరుసగా 14, 19, 21, 15 పరుగులు రాబట్టింది. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి. ఎన్గరవా వేసిన 19వ ఓవర్లో తిలక్ వరుసగా 2 సిక్స్లు కొట్టగా, ఇవాన్స్ వేసిన ఆఖరి ఓవర్లో పాండ్యా వరుసగా రెండు భారీ సిక్స్లతో ముగించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో పాండ్యా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బ్యాటింగ్కి దిగిన ఆరుగురు కనీసం ఒక సిక్స్ బాదగా భారత్ ఇన్నింగ్స్లో మొత్తం 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్ కోసం భారత్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ స్థానాల్లో అక్షర్ పటేల్, సంజు సామ్సన్ జట్టులోకి వచ్చారు. బెన్నెట్ పోరాటం వృథా... భారీ ఛేదనను జింబాబ్వే ఓపెనర్లు బెన్నెట్, మరుమని (20) జాగ్రత్తగా ప్రారంభించారు. తొలి వికెట్కు వీరిద్దరు 38 బంతుల్లో 44 పరుగులు జత చేశారు. మరుమని, మైయర్స్ (6) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... బెన్నెట్, సికందర్ రజా (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) భాగస్వామ్యంతో జట్టు ఇన్నింగ్స్ కాస్త సానుకూలంగా కదిలింది. అక్షర్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టిన బెన్నెట్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత దూబే ఓవర్లో కూడా బెన్నెట్ 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే మూడో వికెట్కు బెన్నెట్తో 42 బంతుల్లో 72 పరుగులు జత చేసిన అనంతరం రజా అవుట్ కావడంతో జింబాబ్వే ఆశలు పూర్తిగా కోల్పోయింది. 256/4 టి20 ప్రపంచకప్లో భారత్కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్పై టీమిండియా చేసిన 217 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఓవరాల్గా శ్రీలంక 260/6 (కెన్యాపై 2007లో) తర్వాత వరల్డ్ కప్లో ఇది రెండో అత్యధిక స్కోరు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బర్ల్ (బి) ముజరబాని 24; అభిషేక్ (సి) రజా (బి) మపోసా 55; ఇషాన్ కిషన్ (సి) ఎన్గరవా (బి) రజా 38; సూర్యకుమార్ (సి) ముసెకివా (బి) ఎన్గరవా 33; పాండ్యా (నాటౌట్) 50; తిలక్ (నాటౌట్) 44; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–48, 2–120, 3–150, 4–172. బౌలింగ్: ఎన్గరవా 4–0–62–1, ముజరబాని 4–0–43–1, మపోసా 2–0–40–1, ఇవాన్స్ 4–0–52–0, రజా 3–0–29–1, బెన్నెట్ 2–0–16–0, బర్ల్ 1–0–10–0. జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (నాటౌట్) 97; మరుమని (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 20; మైయర్స్ (సి) తిలక్ (బి) వరుణ్ 6; రజా (సి) అభిషేక్ (బి) అర్‡్షదీప్ 31; బర్ల్ (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మున్యోంగా (బి) అర్‡్షదీప్ 11; ముసెకివా (సి) సామ్సన్ (బి) దూబే 7; ఇవాన్స్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–44, 2–72, 3–144, 4–144, 5–162, 6–173. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–24–3, పాండ్యా 3–0–21–0, బుమ్రా 3–0–21–0, వరుణ్ 4–0–35–1, అక్షర్ 4–0–35–1, దూబే 2–0–46–1. గెలిచే జట్టు సెమీస్కు... జింబాబ్వేపై భారత్ విజయంతో ‘గ్రూప్–1’ నుంచి సెమీఫైనల్ చేరే జట్ల విషయంలో స్పష్టత వచ్చింది. రెండు విజయాలతో దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ సెమీస్ స్థానం ఖాయం చేసుకోగా, జింబాబ్వేతో ఆ జట్టు ఆడే మ్యాచ్ నామమాత్రమే. మరోవైపు జింబాబ్వేపై నెగ్గి, దక్షిణాఫ్రికా చేతిలోనే ఓడిన భారత్, వెస్టిండీస్ ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య ఆదివారం కోల్కతాలో జరిగే మ్యాచ్ క్వార్టర్ ఫైనల్లాంటిది. ఈ మ్యాచ్లో ఎవరు నెగ్గితే వారికి ఎలాంటి సమీకరణాలు, రన్రేట్లతో సంబంధం లేకుండా సెమీస్లో చోటు ఖాయమవుతుంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో ఆ్రస్టేలియా, శ్రీలంకలను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే ‘సూపర్ ఎయిట్స్’లో వెస్టిండీస్, భారత్లకు 254, 256 పరుగులు ఇచ్చి ఓటములను ఆహ్వానించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్లో నేడుఇంగ్లండ్ X న్యూజిలాండ్ వేదిక: కొలంబో, రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
చేయాల్సింది చాలా ఉంది!
ప్రపంచ ఏఐ యవనికపై శక్తిమంత మైన పాత్ర వహించగల దేశంగా భారతదేశాన్ని రూపు కట్టించడంలో ఏఐ ఇంప్యాక్ట్ సమ్మిట్, దానికి సంబంధించి న్యూఢిల్లీలో ఏర్పాటైన ఎగ్జిబిషన్ సఫలమై ఉండాల్సింది. కానీ, దేశంలో పరిశోధన–అభివృద్ధి (ఆర్–డి), నవీ కరణలో వైఫల్యాలకు అది అద్దం పట్టింది. గల్గోటియాస్ అనే ప్రైవేటు విశ్వవిద్యాలయం చైనా నుంచి రోబో డాగ్ను దిగుమతి చేసుకుని, ఏఐ నవీకరణ కేంద్రంగా తనను తాను చాటుకోవాలని ఉబలాటపడటం ఒక ప్రహసనంగా మారింది. దేశ విదేశాల్లో పత్రికలకెక్కి అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ ఉదంతం గత కొన్నేళ్లుగా పరిశోధన రంగాల్లో క్షీణిస్తున్న ప్రమాణాలకు పరాకాష్ఠగా నిలిచింది.నిధుల లేమి‘ఆర్–డి’పై భారతదేశ స్థూల వ్యయం, స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో కనాకష్టంగా 0.64 శాతంగా ఉంది. అమెరికా (3.48), చైనా(2.43)లతో పోల్చితే ఇది చాలా తక్కువ. పరిశోధ నకు ప్రస్తుతం తరలిస్తున్న నిధులలో చాలా భాగం జాతీయ లాబొరేటరీలు, ఐఐటీల వంటి అగ్రశ్రేణి సంస్థలకు వెళుతు న్నాయి. ఈ విషయంలో విశ్వవిద్యాలయాలు చాలా వెనుకబడి పోయాయి. ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’, ‘రిసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్’ వంటి నూతన పథకాల ప్రభావం ఇంకా కనపడవలసి ఉంది. ఏఐ, దాని అనుబంధ రంగాలకు చెందిన పేటెంట్లకు దరఖాస్తు చేయడంలో, పరిశోధన పత్రాల సమర్పణలో చైనా చాలా ముందుంది. బోధనా ప్రమాణాలు, పరిశోధనల ఫలితా లపై భారత్ దృష్టి పెట్టడం లేదు. యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య పొత్తును కూడా సరిగ్గా ఏర్పరచలేకపోతున్నాం. ఫలితంగా, విషయ చౌర్యం, నకిలీ పరిశోధనలు, కుహనా సైన్స్ను ప్రోత్సహించడం, సమర్పించిన పత్రాలను వెనక్కి తీసుకోవడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహా ఓహో అంటూ ఆకా శానికెత్తేయడం, స్టార్టప్లకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మన సంస్థలు గొప్ప వాగ్దానాలు చేస్తున్నాయి; లేదా గల్గోటియాస్లాగా నకిలీ గొప్పలకు పోతున్నాయి.సోషలిస్టు ఏఐ పంథాశాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న ఆంత్రోపిక్ సంస్థ ఏఐ టూల్స్కు సంబంధించి ఇటీవల క్లాడ్ ఓపస్ సిరీస్ విడుదల చేయడం ద్వారా టెక్నాలజీ మార్కెట్లలో కలకలం సృష్టించింది. దాని ప్రకంపనలు స్టాక్ మార్కెట్లలోనూ నమోదయ్యాయి. ఆ టూల్స్ జటిలమైన ఆర్థిక విశ్లేషణకు, లాంగ్–ఫారమ్ కోడింగ్కు ఉపయోగపడతాయి. ఈ ఆటోమేషన్ టూల్స్ ఆవిష్కరణకు భయపడి సంప్రదాయ సిద్ధమైన సాఫ్ట్వేర్, లీగల్–టెక్ కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు అయినకాడికి అమ్మేశారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ సేవల రంగాన్ని కూడా ఏఐ ఏజెంట్లు అతలాకుతలం చేస్తాయే మోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మన దేశంలోని అతి పెద్ద ఔట్ సోర్సింగ్ సంస్థలకు కూడాఆంత్రోపిక్ ఏఐ ఏజెంట్లను విక్రయిస్తోంది. అవి పెద్ద సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు దారితీయవచ్చు. కొన్ని భౌగోళిక ప్రాంతాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే ఏఐకేంద్రీకృతమవుతోందని పసిగట్టిన భారత్ ‘ఏఐ ప్రజాస్వామికీక రణ’కు శ్రీకారం చుట్టింది. ఈ రంగంలో సాగుతున్న అంతర్జా తీయ పోటీలో తన స్థానాన్ని చాటుకునేందుకు ఢిల్లీ సదస్సు ద్వారా భారత్ ఒక ప్రయత్నం చేసింది. విద్య, ఆరోగ్యం, పరిపా లన, వస్తూత్పత్తి, వ్యవసాయం వంటి భిన్నమైన రంగాలలో కూడా ఏఐ సేవలను వినియోగించుకునేటట్లు చేయాలన్నది ఈ సమ్మిట్ వెనుక ఉన్న భావన. పాశ్చాత్య దేశాల్లో ఏఐలో ప్రైవేటు పెట్టుబడులు ముందున్నాయి. కానీ, భారత్ సోషలిస్టు పంథాను ఎంచుకుంది. మన దేశంలో ఏఐ అభివృద్ధికి ఏఐ మిషన్ ద్వారా ప్రభుత్వమే నిధులు సమకూరుస్తోంది. భారత్ జెన్ వంటి వాటిలోనూ ప్రభుత్వ పెట్టుబడులున్నాయి. చాట్ జీపీటీ వంటి కమర్షియల్ మోడళ్లను కాకుండా ‘సావరిన్’ ఏఐ మోడళ్ళను భారత్ అభివృద్ధి చేస్తోంది. బహుళ భాషా, బహుళ సాంస్కృతిక పర్యావరణాలకు అనువైన కొత్త మోడళ్ళను అభివృద్ధి చేస్తోంది. వాటిని ప్రజా శ్రేయస్సుకు వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎన్నో రకాల సవాళ్లుఅయితే, దార్శనికతను వాస్తవికతగా మార్చడం పైకి కనిపి స్తున్న దానికన్నా ఎక్కువ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అవసరమైన నిపుణులైన సిబ్బంది కొరత అన్నింటి కన్నా పెద్ద సవాల్. దేశంలో ఐటీ సేవల రంగంలో సుమారు 60 లక్షలమంది పనిచేస్తున్నారు. క్లాడ్ వంటి ఏఐ టూల్స్తో చాలా మంది ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. మిగిలినవారికి మళ్ళీ తర్ఫీదు నివ్వడం, కొత్త నైపుణ్యాలను నేర్పించడం చేయాలి. అయితే, లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ళు, అప్లికేషన్లు, భద్రత, నియంత్రణ పార్శా్వలకు సంబంధించి చాలా మంది ఉద్యోగులు కూడా అవసరమవుతారు. వాస్తవిక పరిస్థితులు ఇలా ఉంటే, గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు ఏఐ ఇంజినీర్లను సరఫరా చేసే దేశంగా భారత్ అవతరిస్తుందని విధాన నిర్ణేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐటీ సేవల విషయంలో కూడా 1990లలో మనం ఇదే రకమైన తప్పు చేశాం. ఫలితంగా, ప్రొడక్ట్ డెవలప్మెంట్లో భారత్ వెనుకబడింది. ఏఐ విషయంలో మనం అదే బాట పట్టకూడదు. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను డెవలప్ చేసి, తర్ఫీదు నిచ్చేందుకు అత్యుత్తమ శ్రేణి హార్డ్వేర్ అవసరం. ఆ కొరత మరో సవాల్. సావరిన్ ఏఐ మోడల్ను అభివృద్ధి చేసేందుకు ఏఐ మిషన్ జీపీయు క్లస్టర్ ఏర్పాటుపై అహరహం శ్రమిస్తోంది.కానీ, హార్డ్వేర్ వెల అధికంగా ఉండటం, గ్లోబల్ సప్లై చైన్లో జాప్యాలు గణనీయమైన ప్రతిబంధకాలుగా ఉన్నాయి. వాటిపై చైనా దాదాపు 98 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. అలాంటిది మనం 2029 వరకు ఐదేళ్ళ కాలంలో 1.25 బిలియన్ డాలర్లను మాత్రమే వెచ్చించాలని నిర్ణయించుకున్నాం. బలమైన, సుస్థిరమైన ఏఐ మౌలిక వసతులను సృష్టించుకోవడంపై దృష్టి పెట్టాలి. కొత్త విధులకు తగ్గట్లుగా ఇపుడున్న సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పించాలి. భారత విధాన నిర్ణేతలు దానికి బదులు, ప్రైవేట్ క్లౌడ్ల రూపంలో క్యాప్టివ్ జీపీయు మౌలిక వసతులను ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రైవేటు క్లౌడ్లు మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాల చేతుల్లో ఉన్నాయి. ఇది మరో రకమైన ఔట్ సోర్సింగ్ కిందకు వస్తుంది. ఇది మరింత హానికరమైనది. భారీ డేటా సంస్థలు విద్యుత్తును, నీటిని పెద్ద మొత్తాలలో మింగేస్తాయి. పర్యావర ణాన్ని కూడా పణంగా పెట్టి ట్యాక్స్ హాలిడేల రూపంలో వాటిని ప్రోత్సహించడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. పరిశోధన, నవీకరణను ప్రోత్సహించడంపై ప్రభుత్వానికి నిజంగా ఆసక్తి ఉంటే, అది ప్రాథమికాంశాలను విస్మరించ కూడదు. మౌలిక, అనువర్తిత ఆర్–డి రెండింటికీ మద్దతు ఇవ్వాలి. విద్యా, నాణ్యతా పరామితులను అమలుపరచాలి. మన విధాన నిర్ణేతలు, మంత్రులు డంబాలకు స్వస్తి చెప్పాలి. ఏఐవంటి నూతన రంగాలు సామాజికంగా కూడా తీవ్ర పర్యవసా నాలకు దారితీసేవిగా ఉన్నాయి కనుక కూలంకషమైన చర్చ అవసరం. పరిశోధన, నవీకరణపై గొప్పలు చెప్పుకోవడం ఆపా లని గాల్గోటియాస్ ఉదంతం గుర్తు చేస్తోంది. -వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత-దినేశ్ సి. శర్మసదస్సుతో ఏం సాధించామంటే...20 దేశాల అధినేతలు, 59 మంది మంత్రులు, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు, దాదాపు 2.5 లక్షల మంది అతిథులతో ఢిల్లీలో ఐదు రోజులపాటు నిర్వహించిన ఏఐ సదస్సు కీలకమైనముందడుగుగా చెప్పాలి. ఫ్యాక్టరీలు, హెల్త్ కేర్ రంగంలో ఉన్న రోబోలు, వ్యాపార రంగంలో ఉన్న డ్రోన్లు, ప్రజలకు ఉపయోగించుకోవటానికి వీలుగా ఉండే వేరబుల్ డివైసెస్ను ఇక్కడ ప్రద ర్శించారు. 300కు పైగా ఎంపిక చేసిన పెవిలియన్లు, 600 స్టార్టప్లు ఇందులో భాగస్వామ్యం వహించాయి.బెంగళూరు ఆధారిత స్టార్టప్ ‘సర్వం’ ఏఐ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విదేశీ టెక్ కంపెనీలకు సవాలు విసిరేలా తన ప్రత్యే కతను చాటుకుంది. విప్రో సంస్థ ఏఐ ఆధారిత మెడికల్ రోబోను ప్రదర్శించింది. క్వాల్కం ఓపెన్ ఏఐ రోబో పారిశ్రామిక రక్షణ సామర్థ్యాన్ని చాటింది.ఏఐ ఎకో సిస్టంలో చిప్పులు, డేటా సెంటర్లు, సర్వర్లు, ఎనర్జీ మోడళ్ళు, అప్లికే షన్లు అత్యంత ప్రధానమైనవి. ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలంటే మనం వాటిని సొంతంగా నిర్వహించు కునే శక్తిని సంపాదించుకోవలసి ఉంటుంది. ఇందుకు చాలా దూరం ప్రయాణించాలి. ఇప్పుడు అమెరికా నేతృత్వంలోని పార్క్ సిలికా టెక్ కూటమిలో భారత్ చేరింది. దీనివల్ల సెమీ కండక్టర్లు, ఏఐ టెక్నాలజీ, కీలక ఖనిజాల సప్లై చైన్లు, భారత్కు రక్షణ ప్రాధా న్యం లభిస్తాయి.వివిధ దేశాలతో జట్టు కట్టి...ఆఫ్రికాలో ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ డానికి భారత్, ఇటలీ, కెన్యా మధ్య త్రైపాక్షిక కూటమి ఏర్పడింది. ఐరోపా, ఇండో– పసిఫిక్ దేశాల మధ్య భారత్ను ఒక సాంకేతిక వారధిగా నిలపటం ఇటలీ లక్ష్యం. అలాగే ఏఐ భద్రత, ఆన్లైన్ సేఫ్టీ అంశాల పైన భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జరగనున్న సైన్స్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ సహకారం మరింత బలపడుతుంది. పాలన, రక్షణ రంగాల్లో ఏఐ వినియోగంపై భారత్తో కలిసి ఫ్రాన్స్ పనిచేస్తోంది. ఈ ఏడాది సదస్సులో ఫ్రాన్స్ క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ సేవలో ఏఐ వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై భారత్తో బ్రెజిల్ తన అనుభవాలను పంచుకుంది. ఇలా వివిధ దేశాలు భారత్తో తమ సంబంధాలను మెరుగు పరచుకోవ డానికి ముందుకు రావడం శుభ పరిణామం. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ కంప్యూటింగ్,స్కిల్లింగ్ కోసం ఇండియాలో 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి ప్రకటించింది. ఇది ఆసియాలోనే ఆ సంస్థకు అతి పెద్ద పెట్టుబడి. ఏఐ రంగంలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ‘భారత్ జెన్’ పేరుతో మల్టీ మోడల్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టును ప్రారంభించింది. భార తీయ భాషలు, సంస్కృతికి అనుగుణంగా కృత్రిమ మేధను అభివృద్ధి చేయటం ప్రధాన ఉద్దేశం. దేశంలోని 22 అధికార భాషల్లో ఏఐ మోడల్స్ రూపొందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. భారత్... గ్లోబల్ సౌత్లో మొట్టమొదటి సారిగా, అంతర్జా తీయంగా 4వ సదస్సు నిర్వహణ ద్వారా కొంత ప్రగతిని సాధించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లు సాధిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
జెరూసలేం: ఇజ్రాయెల్తో భారత్ పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. పలు ఒప్పందాలపై నరేంద్ర మోదీ-నెతన్యాహు సంతకాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధానితో నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్లో పర్యటించాలని నెతన్యాహును ప్రధాని మోదీ ఆహ్వానించారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.విద్య, వ్యవసాయం, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ సెక్టార్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్లో యూపీఐ వాడకంపైనా భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి భారత్-ఇజ్రాయెల్ నిర్ణయించాయి.#WATCH | Jerusalem | Addressing a joint press briefing with Israel PM Benjamin Netanyahu, PM Modi says," India’s vision is clear that humanity must never become a victim of conflict. The Gaza Peace Plan has opened a route to peace. India has supported such efforts. In future too,… pic.twitter.com/p5iXfkLrzX— ANI (@ANI) February 26, 2026వ్యవసాయం నుంచి ఏఐ వరుకు పలు ఎంవోయూలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. 16 ఎంవోయూలపై భారత్-ఇజ్రాయెల్ సంతకాలు చేసుకున్నాయి. 11 కీలక ప్రకటనలు చేశాయి. టెక్నాలజీ కేంద్రంగా భవిష్యత్ సంబంధాలు ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు త్వరలోనే తుదిరూపు ఇస్తామన్నారు. పశ్చిమమాసియాలో శాంతిస్థాపనకు మోదీ పిలుపునిచ్చారు. సంఘర్షణల్లో మానవత్వం బాధితురాలు కాకూడదన్నారు. -
టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు పరీక్షా సమయం
-
ఐరాసలో పాక్ ఆరోపణలు.. సాక్ష్యాలతో తిప్పికొట్టిన భారత్!
జెనీవా: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 55వ సాధారణ సమావేశాల్లో పాకిస్తాన్కు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) భారత్పై చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఖండించింది. జమ్ముకశ్మీర్ అభివృద్ధిని చూసి పాక్ అసూయతో రగిలిపోతోందని, అందుకే అంతర్జాతీయ వేదికలపై విషం చిమ్ముతోందని భారత తొలి కార్యదర్శి అనుపమ సింగ్ ధ్వజమెత్తారు.జమ్ముకశ్మీర్ భూభాగం భారత్లో అంతర్భాగమని, అది ఎప్పటికీ విడదీయలేని అంశమని ఆమె స్పష్టం చేశారు. 1947 భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం జమ్ముకశ్మీర్ భారత్లో విలీనం కావడం చట్టబద్ధమని, ఇది ఎవరూ మార్చలేని సత్యమని ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న ఆక్రమిత భూభాగాలను వెంటనే ఖాళీ చేయడమే ప్రస్తుతం ఉన్న ఏకైక అపరిష్కృత అంశమని ఆమె స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ శాతం.. అక్కడి ప్రజలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, హింసను తిరస్కరించారని చెప్పడానికి నిదర్శనమని అనుపమ సింగ్ పేర్కొన్నారు. VIDEO | Switzerland: At the High-Level Segment of the 55th Regular Session of the UN Human Rights Council, First Secretary, Anupama Singh in Geneva, says, “India is compelled to exercise its right of reply in response to the references made during the high-level segment by… pic.twitter.com/uHOrmIEf4g— Press Trust of India (@PTI_News) February 26, 2026కశ్మీరీ ప్రజలు అభివృద్ధి, ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు సాగుతున్నారని ఆమె అన్నారు. గత ఏడాది ప్రారంభమైన 'చీనాబ్ రైల్వే బ్రిడ్జి'ని కూడా పాక్ నకిలీదని భావిస్తే.. ఆ దేశం ఖచ్చితంగా వాస్తవాలకు దూరంగా ‘లా-లా ల్యాండ్’ (కలల లోకం)లో బతుకుతున్నట్లేనని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం గురించి పాక్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ, ఎన్నికైన పౌర ప్రభుత్వాలు కనీసం తమ పదవీకాలాన్ని కూడా పూర్తి చేసుకోలేని దేశం నుండి భారత్ ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అనుపమ సింగ్ ఘాటుగా స్పందించారు. బుధవారం జరిగిన ఈ హై-లెవల్ సమావేశంలో పాకిస్తాన్ ప్రచారం వెనుక ఉన్న కుట్రలను సాక్ష్యాధారాలతో సహా భారత్ తిప్పికొట్టింది. ఫిబ్రవరి 23 నుండి 31 వరకు కొనసాగనున్న ఈ 61వ ఐరాస మానవ హక్కుల మండలి సమావేశాల్లో భారత్ తన గొంతును బలంగా వినిపిస్తూ, పాక్ కుట్రలను ప్రపంచ దేశాల ముందు ఉంచింది.ఇది కూడా చదవండి: అరుదైన నేతగా ప్రధాని మోదీ ఘనత -
నేడు కీలక మ్యాచ్.. నిలవాలంటే గెలవాల్సిందే..
-
1917 నాటి అప్పు తిరిగి ఇవ్వాల్సిందే
సీహోర్(ఎంపీ): వారసత్వంగా తమకు దక్కాల్సిన ఆస్తులు, భవనాలు, వజ్రాభరణాలపై వారసులు న్యాయస్థానాల మెట్లెక్కడం మనం చూస్తూనే ఉంటాం. సబార్డినేట్ కోర్టుల మొదలు సుప్రీంకోర్టు దాకా ఇలాంటి కేసులు కోకొల్లలు. అవన్నీ వ్యక్తుల మధ్య నెలకొన్న సివిల్ తగాదాలు. వీటికి పూర్తి భిన్నంగా ఏకంగా ఆనాటి బ్రిటిష్ పాలకులపై మధ్యప్రదేశ్ వ్యాపారి ఒకరు 35,000 రూపాయల పాత బాకీ కట్టాలని ఇప్పుడు న్యాయపోరాటానికి సంసిద్ధమవుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో భారత్లోని సంపన్నుల నుంచి నాటి బ్రిటన్ ప్రభుత్వం కొంత మేర నగదు మొత్తాలను రుణాలరూపంలో సమీకరించింది. వాటిని తిరిగి చెల్లించేలోపే మనకు స్వాతంత్య్రంఇచ్చేసి వెళ్లిపోయింది. దీంతో తన తాతకు రావాల్సిన రూ.35వేలు అలాగే ఉండిపోయాయని, బ్రిటన్ ఇప్పటికైనా బాకీ తీర్చాల్సిందేనని సేఠ్ జుమ్మా లాల్ రూథియా మనవడు వివేక్ డిమాండ్చేస్తున్నారు. అసలేం జరిగింది? 1914లో మొదలైన మొదటి ప్రపంచయుద్ధకాలంలో నిధుల కటకట నుంచి గట్టెక్కేందుకు బ్రిటన్ ప్రభుత్వం నాటి మధ్యప్రదేశ్ ప్రాంతంలోని సంపన్నుల నుంచీ రుణాలను తీసుకుంది. అప్పట్లో సీహోర్, భోపాల్ సంస్థానాల్లో సంపన్నులుగా ఖ్యాతి పొందిన రూథియాలు సైతం బ్రిటన్ పాలకులకు రుణాలు ఇచ్చారు. సేఠ్ జుమాలాల్ నుంచి భోపాల్ రాజకీయ ప్రతినిధిగా డబ్ల్యూ ఎస్ డేవిస్ రూ.35 వేలు పుచ్చుకున్నారు. ఆ మేరకు రసీదు రాసి సంతకంచేసి ఇచ్చారు. 1917 జూన్ నాలుగోతేదీన ఈ అప్పు ఇచ్చినట్లు రసీదులో ఉంది. అప్పు ఇచ్చాక రెండు దశాబ్దాల తర్వాత 109 ఏళ్ల వయసులో 1937లో సేఠ్ చనిపోయారు. అప్పు పత్రం మాత్రం భద్రంగా ఉంది. ఇటీవలికాలంలో తమ ఇంట్లో పాత వస్తువులను దులుపుతుండగా ఈ అరుదైన పత్రం ఆయన మనవడు, ప్రస్తుతం భోపాల్లో పెద్ద వ్యాపారి వివేక్(65) కంటబడింది. దీంతో ఎలాగైనా తన తాత ఇచ్చిన రుణాన్ని యూకే సర్కార్ నుంచి ముక్కుపిండి వసూలుచేస్తానని ఆయన శపథంచేశారు. ఈ మేరకు తన వద్ద ఉన్న అన్ని అనుబంధ డాక్యుమెంట్లనూ ఆయన మీడియా ముందుపెట్టారు. ‘‘ఇండియా వార్ లోన్ కోసం సేఠ్ నుంచి రూ.35వేలు ముట్టాయి. రుణమిచ్చి ఆయన ప్రభుత్వం, రాజ్యం పట్ల తన విధేయతను ప్రకటించుకున్నారు’’అని అప్పుపత్రంలో రాసి ఉంది. ‘‘వలసరాజ్యపాలనాకాలంలో నాటి పాలకులు తీసుకున్న రుణాలను ఏ విధంగా రాబట్టాలో మా లాయర్లతో చర్చిస్తున్నా. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వానికి నోటీస్లు పంపిస్తా. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినా సార్వ¿ౌమదేశానికి పాత రుణాలను తీర్చే బాధ్యత ఉంటుంది. ఆ లెక్కన మా తాత డబ్బు మాకు తిరిగి ఇవ్వాల్సిందే. అప్పు ఇచ్చి వందేళ్లు దాటింది. అసలుకు చక్రవడ్డీ లేదా కనీసం సాధారణ వడ్డీగా ఐదు శాతం లెక్కేసుకున్నా ఇప్పడా రుణం కోట్ల రూపాయల్లో ఉంటుంది. నాటి బంగారం రేట్లతో పోల్చుకున్నా సరే ఇప్పుడా మొత్తం 3,000 రెట్లు పెరిగి రూ.10 కోట్లుదాకా రావాల్సిందే’’అని వివేక్ అన్నారు. అయితే వివేక్ వాదన అంతర్జాతీయ చట్టాల్లో ఏ మేరకు చెల్లుబాటు అవుతుందనే సందేహాన్ని న్యాయనిపుణులు వెలిబుచ్చారు. ‘‘నాటి రాజరికం ఇప్పుడు లేదు. పాలకులూ మారిపోయారు. వలసరాజ్యంగా తీసుకున్న ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పును ఇప్పుడు ఏ నిబంధనల ప్రకారం బ్రిటన్ సర్కార్ చెల్లిస్తుంది? స్వాతంత్య్రం ఇచ్చాక పోతూపోతూ పాత ఒడంబడికలు, ఒప్పందాలు, హామీలతో మాకు సంబంధం లేదు అని బ్రిటిషర్లు చేతులు దులుపుకునే ఉండి ఉంటారు. ఈ లెక్కన నాటి అప్పు నేడు రాబట్టడం కష్టం’’అని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అప్పు రాకపోయినా శతాబ్దకాలంనాటి పురాతన పత్రంగాఅయినాఇది ఘన చరిత్రను చాటుతూ శాశ్వతంగా నిలిచి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పత్రం చరిత్రగా ఉండిపోతుందా లేదంటే అప్పు రాబట్టి కొత్త చరిత్ర లిఖిస్తుందా అనేది వివేక్ కొనసాగించే తదుపరి పోరుపై ఆధారపడి ఉంటుంది. -
సోలార్పై సుంకాల మోత
న్యూఢిల్లీ: భారత సోలార్ ఉత్పత్తులపై అమెరికా చర్యలకు దిగింది. భారత్ నుంచి వచ్చే సోలార్ విడిభాగాలపై 125.87 శాతం ప్రాథమిక కౌంటర్ వెయిలింగ్ (వ్యతిరేకంగా) సుంకం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్పత్తులకు భారత్ అనుచితంగా సబ్సిడీలు సమకూరుస్తున్నట్టు ఆరోపించింది. భారత్తోపాటు ఇండోనేసియా, లావోస్ నుంచి వచ్చే క్రిస్టలిన్ సిలికాన్ ఫొటోవోల్టాయిక్ సెల్స్పై (సోలార్ మాడ్యూళ్లలో అసెంబుల్ అయినా, కాకపోయినా) సుంకాలు విధిస్తూ అమెరికా వాణిజ్య శాఖ 24న ఆదేశాలు జారీ చేసింది. అధ్యక్షుడు ట్రంప్ విధించిన 10 శాతం సార్వత్రిక సుంకాలకు ఇది అదనమని పేర్కొంది. ఈ దేశాల నుంచి చౌకగా వస్తున్న దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విచారణలు సైతం నిర్వహించనున్నట్టు తెలిపింది. భారత్ నుంచి అమెరికాకు సోలార్ ఎగుమతులు 2022లో 83.86 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2024లో 792.6 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు ప్రస్తావించింది. విదేశీ చౌక ఉత్పత్తుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు ఈ చర్యకు ఉపక్రమించింది. సంప్రదాయ విద్యుత్ వనరులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలమైన సోలార్, పవన ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించడం తెలిసిందే. సోలార్ విడిభాగాల కోసం చైనా తదితర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించి, దేశీయంగానే వాటి తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) సైతం ప్రకటించింది. దీంతో 26.6 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూళ్లు, 10.5 గిగావాట్ల సోలార్ పీవీ సెల్స్, 2 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్ తయారీ సామర్థ్యాలు దేశీయంగా ఏర్పాటు కావడం గమనార్హం. దీంతో 2023–24లో 4.35 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు 2024–25లో 2.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ప్రభావం పరిమితమే.. భారత సోలార్ ఉత్పత్తులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం పరిమితమేనని విక్రమ్ సోలార్, వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ తెలిపాయి. ‘‘యూఎస్ ఏడీ/సీవీడీ సుంకాలు ప్రత్యేకంగా భారత తయారీ సెల్స్కు ఉద్దేశించినవి. అమెరికా ఆర్డర్లకు సంబంధించి చేసే సరఫరాల్లో భారత సెల్స్ను వినియోగించడం లేదు. తక్కువ టారిఫ్లున్న భౌగోళిక ప్రాంతాల నుంచి వాటిని సమకూర్చుకుంటున్నాం. కనుక ఈ సుంకాల వల్ల పడే ప్రత్యక్ష ప్రభావం పరిమితం’’అని విక్రమ్ సోలార్ సీఎండీ జ్ఞానేష్ చౌదరి స్పష్టం చేశారు. దేశీయంగా డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్ ఆయిల్–ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నుంచి ఇటీవలే 378.75 మెగావాట్ల మాడ్యూళ్ల ఆర్డర్ను గెలుచుకోవడాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత యూఎస్ ఆర్డర్ల సరఫరాలపై తాజా సుంకాల ప్రభావం ఉంటుందని భావించడం లేదని వారీ ఎనర్జీస్ గ్రూప్ హెడ్ అభిõÙక్ పరీక్ తెలిపారు. మరోవైపు వారీ ఎనర్జీస్ అమెరికాలోనే తన సోలార్ సెల్స్ తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ప్రణాళికతోనూ ఉంది. ‘‘మా వ్యాపారంలో ఎగుమతుల వాటాను పూర్తిగా సున్నాకు తగ్గించుకున్నాం. కనుక అమెరికా సుంకాల ప్రభావం మాపై ఏమీ ఉండదు’’అని ప్రీమియర్ ఎనర్జీస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వినయ్ రస్తోగి తెలిపారు. -
‘ఇజ్రాయెల్ బాధను భారత్ అనుభవిస్తోంది’.. హమాస్ దాడిపై ప్రధాని మోదీ
జెరూసలేం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం తర్వాత ఒకే రోజులో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా నిలిచిన హమాస్ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగం, సముద్రం, గగనతలం నుంచి సమన్వయ దాడి జరిపింది. ఈ దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు.తాజా ఇజ్రాయెల్ పర్యటనలో మోదీ హమాస్ దాడి గురించి ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్)లో ప్రసంగించారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి అమానుషమైనది. 1.4 బిలియన్ భారతీయుల తరఫున నేను సంతాపం తెలియజేస్తున్నాను. ఇజ్రాయెల్ బాధను భారత్ అనుభవిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము మీతో ఉన్నాం అని హామీ ఇచ్చారు.ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ..‘భారతదేశానికి కూడా ఇలాంటి గాయాలు ఉన్నాయి. ఉగ్రవాదం ఎంతటి విషాదాన్ని మిగులుస్తుందో మాకు తెలుసన్నారు. ఈ ప్రసంగం ద్వారా మోదీ, ఉగ్రవాదం ఒక దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికి ముప్పుగా అభివర్ణించారు. ఉగ్రవాదం ఎక్కడైనా జరిగితే, అది మానవత్వంపై దాడి చేసినట్లేనని స్పష్టం చేశారు.


