breaking news
India
-
‘దేశ ప్రజల దుర్భుర జీవితానికి కాంగ్రెస్సే కారణం’
సాక్షి,న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ప్రధాని మోదీ అన్నారు. సామాన్యులపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేలా జీఎస్టీ రేట్ల స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఈ తరుణంలో కొత్త జీఎస్టీ స్లాబ్లపై ప్రధాని మోదీ స్పందించారు. జీఎస్టీ స్లాబ్ సంస్కరణలతో అందరికి ప్రయోజనం.దేశ చరిత్రలో ఇదో మైలురాయి. జీఎస్టీ సంస్కరణలతో దేశం మరింత బలపడుతుంది. నిత్యవసర వస్తువులు తగ్గుతాయి. సమయాన్ని బట్టి సంస్కరణలు అవసరం. యూపీఏ హయాంలోనే అధిక పన్నులు. గతంతో పన్నుల రూపంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారు. దేశ చరిత్రలో ఇదొకమైలురాయి. దేశ ప్రజల దుర్భుర జీవితానికి కాంగ్రెస్సే కారణం. జీఎస్టీ స్లాబుల సవరణలతో జీఎస్టీ సంస్కరణలతో దివాళి గిఫ్ట్ ఇచ్చాం అని అన్నారు. -
‘భారత్పై టారిఫ్ విధించకపోతే అమెరికా అంతమే’.. సుప్రీంకోర్టులో ట్రంప్
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపి.. ఇరు దేశాల్లో మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాను భారత్పై టారిఫ్లు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశ సుప్రీంకోర్టుకు తెలిపారు. సుంకాలు విధించడం వల్లే దేశం ఆర్ధికంగా ముందంజంలో ఉంది.. లేదంటే అంతం అవుతుందని బదులిచ్చారు. భారత్తో పాటు ప్రపంచంలో పలు దేశాలపై 1977 ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్స్ యాక్ట్ (IEEPA) నిబంధనలకు మించి ఎక్కువ మొత్తంలో టారిఫ్లు విధించడాన్ని క్రిందికోర్టు తప్పుబట్టింది. దీంతో ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. టారిఫ్లపై ట్రంప్ ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ జాన్ సౌర్ తన వాదనల్ని వినిపిస్తున్నారు.తనవాదనల్లో ఉక్రెయిన్లో శాంతి కోసం మా ప్రయత్నాల్లో కీలకమైన అంశం. ఉక్రెయిన్లో రష్యా యుద్ధం కొనసాగడానికి కారణం భారత్. భారత్.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. అమ్మకాల ద్వారా వచ్చిన నిధుల్ని యుద్ధం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకుగాను భారత్పై సుంకాలు విధించాం. ఇప్పుడీ టారిఫ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గించినా ఆర్ధికంగా అమెరికాకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సుంకాలతో అమెరికా ధనిక దేశం. సుంకాలు లేకపోతే పేద దేశం. ఇప్పటికే దేశాలపై సుంకాల్ని ఉపసంహరించుకుంటే దేశ రక్షణ-పారిశ్రామిక రంగం బలహీనపడుతుంది. వార్షిక వాణిజ్య లోటులో 1.2 ట్రిలియన్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లుతుంది. కొనసాగుతున్న విదేశీ చర్చలపై అనిశ్చితి నెలకొంటుందని’ అది వాదించింది. సుంకాల కారణంగా..ఆరు ప్రధాన వాణిజ్య భాగస్వాములు,27 యూరోపియన్ యూనియన్ దేశాలతో కుదుర్చుకున్న ఫ్రేమ్వర్క్ ఒప్పందాలు అమెరికాను ప్రపంచ స్థానాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది.ఏడాది క్రితం అమెరికా అంతమైన దేశం. మరి ఇప్పుడు.. వ్యాపారం చేస్తూ లాభాల్ని అర్జించిన దేశాలు చెల్లించే ట్రిలియన్ల డాలర్ల టారిఫ్ల కారణంగా.. అమెరికా మళ్ళీ అన్నీ రంగాల్లో బలమైన,ఆర్థికంగా తన స్థానాన్ని సుస్ధిరం చేసుకుంటుందని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. -
‘భారత్తో రష్యాకు భారీ డ్యామేజ్.. అది చాలదా?’
రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంతోనే భారత్పై ద్వితీయశ్రేణి ఆంక్షలు విధించాల్సి(పెనాల్టీ సుంకాలు) వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నొక్కి చెప్పారు. అయితే ఇది ఇక్కడితోనే అయిపోలేదని అంటున్నారాయన. భారత్ వల్లే రష్యాకు భారీ డ్యామేజ్ కూడా జరిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బుధవారం పోలాండ్ అద్యక్షుడు కరోల్ నావ్రోకితో వైట్హౌజ్లోని తన ఓవల్ ఆఫీస్ ఆఫీస్లో జరిగిన జాయింట్ ప్రెస్మీట్లో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. రష్యాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఓ పోలాండ్కు చెందిన విలేకరి ప్రశ్నించారు. ఇండియాపై ద్వితీయ శ్రేణి సుంకాలు విధించాను. చైనా తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసే పెద్ద దేశం ఇండియానే. ఇది రష్యాకు వందల బిలియన్ల డాలర్ల నష్టం కలిగించింది. మీరు దీన్ని చర్య కాదు అంటారా?.. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 సుంకాలు మిగిలే ఉన్నాయి. మీరేమో చర్య లేదు అంటున్నారు. బహుశా.. మీకు కొత్త ఉద్యోగం అవసరం అంటూ రిపోర్టర్ను ఉద్దేశించి ట్రంప్ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇండియాకు పెద్ద సమస్యలు వస్తాయి అని రెండు వారాల క్రితమే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడు అదే జరిగిందని గుర్తు చేశారు. భారత్ తమకు మిత్రదేశమంటూ జులై 30వ తేదీన ట్రంప్ తొలుత 25 శాతం సుంకాలు(ప్రతీకార సుంకాలు) ప్రకటించారు. ఆ సమయంలో రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్రంగా ఆక్షేపించారు. ఇక ఆగస్టు 6వ తేదీన రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్పై పెనాల్టీగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా ఉక్రెయిన్ యుద్దానికి భారత్ ప్రత్యక్షంగా ఫండింగ్ చేస్తోందని ఆరోపించారాయన. దీంతో ఆగస్టు 27వ తేదీ నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్అదే సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన భారత్ను అత్యధిక సుంకాలు విధించే దేశంగా పేర్కొంటూ.. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్ అంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా వస్తువులపై ఆ దేశం అత్యధికంగా సుంకాలు విధిస్తోందని.. అందువల్లే అమెరికన్ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే.. ఇండియా ఇప్పుడు నో టారిఫ్ ఒప్పందానికి దిగి వచ్చిందన్న ఆయన.. అది ఆలస్యంగా జరిగిందంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇండియా రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. తన సుంకాల వల్లే భారత్ ఇప్పుడు టారిఫ్లు తగ్గించేందుకు సిద్ధమైంది అని అన్నారు.నిజంగానే చమురు ఆగిందా?ఇదిలా ఉంటే.. తన సుంకాల వల్లే భారత్ దిగొచ్చిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసిందంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తుండడం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. రష్యా ఈ విషయంపై అధికారికంగా ఏం స్పందించలేదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తామని, ఆర్థిక లాభదాయకత ఆధారంగా తమ వ్యూహాం ఉంటుందని ఇటు భారత్ చెబుతూ వస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ.. రైతులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలపై రాజీ పడం. ఒత్తిడి పెరిగినా తట్టుకుంటాం అని సుంకాలపై స్పందించారు. మరోవైపు.. చమురు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా ఆపలేదు. కానీ కొంతమేర తగ్గించిన సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన 50% సుంకాలు (25% రెసిప్రోకల్ టారిఫ్ + 25% పెనాల్టీ టారిఫ్) ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో రష్యా చమురు దిగుమతులు తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావం తక్షణమే పూర్తిగా కనిపించక పోవచ్చని.. ఎందుకంటే చమురు కొనుగోలు ఒప్పందాలు వారాల ముందే కుదురుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్తో అలా మాట్లాడాల్సింది కాదుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. చైనా పర్యటన ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇండియా, చైనాలాంటి దేశాలతో అలా వ్యవహారించడం సరికాదని అమెరికా వైఖరిని తప్పుబట్టారు. అమెరికా భారత్పై 50% సుంకాలు విధించడం.. ఆర్థిక శిక్షగా అభివర్ణిస్తూనే ఇది అంతర్జాతీయ సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నంగా పేర్కొన్నారు.ఇండియా, చైనా వంటి దేశాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఇండియా 1.5 బిలియన్ జనాభా కలిగిన దేశం. వీరి చరిత్ర, రాజకీయ వ్యవస్థలు గౌరవించాల్సినవి. వీటి నాయకత్వాన్ని బలహీనపరచాలనుకోవడం పొరపాటు. శిక్షించేందుకు ప్రయత్నించడం, సుంకాలు విధించడం అనేవి ఆర్థిక బలప్రయోగం. ఇది కాలనీల యుగం కాదు. భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని అమెరికా వైఖరిని పరోక్షంగా విమర్శించారు. -
భారత్, చైనాలపై ట్రంప్ టారిఫ్లు సరికాదు: పుతిన్
మాస్కో: భారత్, చైనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. రెండు దేశాలే లక్ష్యంగా విధిస్తున్న టారిఫ్లు సరికాదని హెచ్చరించారు. ట్రంప్ యంత్రాంగం ఈ రకమైన టారిఫ్లతో ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లతో దేశాలను లొంగదీసుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.చైనా మిలటరీ పెరేడ్ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్, చైనాలపై అమెరికా చర్యలు సరైనవి కావు. ట్రంప్ నిర్ణయాలు భాగస్వామ్య దేశాలను దూరం చేసుకునేలా ఉన్నాయి. ట్రంప్ పరిపాలన ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాలపై ప్రభావం చూపుతోంది. రెండు దేశాలను అణగదొక్కేందుకు.. ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. భారత్-చైనాలు భాగస్వాములని పేర్కొంటూ.. వీరి మధ్య సంబంధాలను ట్రంప్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అధిక జనాభా కలిగిన భారత్, చైనాలు శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలు. ఆయా దేశాలకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, దేశీయ చట్టాలు ఉన్నాయి. 🚨🇷🇺 'YOU CANNOT TALK TO INDIA OR CHINA LIKE THAT:' Putin on economic pressure against partners"Attempting to weaken their leadership, built through difficult histories, is a mistake." pic.twitter.com/GsiU3K3mnZ— Sputnik India (@Sputnik_India) September 3, 2025టారిఫ్లతో వారిని శిక్షించే ప్రయత్నాలు చేస్తే.. అవి ఆ దేశ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ క్రమంలో వారిలో ఎవరైనా బలహీనపడితే.. అతని రాజకీయ జీవితం ముగిసిపోతుంది. ఇరుదేశాల చరిత్రలో వలసవాదం వంటి కష్టతరమైన కాలం నడిచింది. వారి సార్వభౌమాధికారంపై చాలాకాలం పాటు పన్ను విధించారు. ఇప్పుడు వాటన్నింటికీ కాలం చెల్లింది. ఇంకా వాటిని అణగదొక్కేలా మాట్లాడటం సరైనది కాదు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు.. సరైన పదాలు ఉపయోగించాలి’ ట్రంప్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరగా.. ఈ ఉద్రిక్తతలు త్వరలోనే ముగుస్తాయని.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో అమెరికా, భారత్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న కారణంగా ట్రంప్.. భారత్ను టార్గెట్ చేసి భారీగా పన్నులు విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కానీ, భారత్ మాత్రం అమెరికా చర్యలకు లొంగలేదు. రష్యాకు మరింత చేరువయ్యే విధంగా చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో రష్యా సైతం చమురు విషయంలో భారత్కు మరిన్ని ఆఫర్లు ప్రకటించింది. -
దశాబ్దాల కృషిని ట్రంప్ నాశనం చేశారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై భారతీయ అమెరికన్, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా విమర్శలు గుప్పించారు. భారత్పై భారీ సుంకాలు విధించి దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నాశనం చేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు చేసిన కృషి ఒక్క సుంకాల వల్ల తుడిచి పెట్టుకుపోయిందన్నారు. అరుదైన అత్యవసర పరిస్థితి అంటూ హెచ్చరించారు. పాకిస్తాన్ చేసినట్లుగా, తనను నోబెల్ శాంతి బహుమతికి భారత్ నామినేట్ చేయనందునే ట్రంప్ అలా చేస్తున్నారని ఆరోపించారు. ‘నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేయడానికి మోదీ నిరాకరించారు. దీంతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి చేసిన 30 ఏళ్ల కృషిని నాశనం చేశారు. చైనా కంటే భారతదేశంపై ఆయన 50% ఎక్కువ సుంకాలను విధించారు. ఇవి బ్రెజిల్, చైనా కంటే ఎక్కువ’ అని ఖన్నా పేర్కొన్నారు. ట్రంప్ విధానాలు భారత్ను చైనా, రష్యాల వైపు నడిపిస్తున్నాయనే అనేక మంది మాజీ దౌత్యవేత్తలు, అధికారుల ఆందోళనను ఆయన పునరుద్ఘాటించారు. సుంకాలు అమెరికాలోకి భారత తోలు, వస్త్ర ఎగుమతులను, అలాగే అమెరికన్ తయారీదారుల నుంచి భారత్లోకి ఎగుమతులను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ అమెరికన్లు స్పందించాలి... రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం వల్లే భారత్పై సుంకాలు విధించినట్టు ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. సుంకాలకు నోబెల్ కోణమే ప్రధానమని భావిస్తున్నారు. భారత్తో సంబంధాన్ని నాశనం చేసే ట్రంప్ అహంకారాన్ని అమెరికా అనుమతించబోదని, భారతీయ అమెరికన్లు అతనికి వ్యతిరేకంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు. ట్రంప్కు ఓటు వేసిన భారతీయ అమెరికన్లందరూ ఇప్పుడు ఆయనను ప్రశ్నించాలని సూచించారు. ట్రంప్కు తాను ఓటు వేయలేదని ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా చేసిన పోస్ట్ను కూడా షేర్ చేస్తూ ఖన్నా తన వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ఆయనకు నోబెల్ వస్తే ఆ తరువాత నోబెల్ ఎవరికిచ్చినా నేను పట్టించుకోను. ఎందుకంటే అది అపవిత్రం అవుతుంది’ అని వినోద్ ఖోస్లా తన పోస్ట్లో పేర్కొన్నారు. -
భారత్కు ట్రంప్ మరోసారి భారీ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ఉత్పత్తుల విభాగంలో 50శాతం టారిఫ్ను విధించారు. ఇప్పుడు అదే బాటలో సేవల విభాగంపై టారిఫ్లు విధించేందుకు సిద్ధమైంది. వాణిజ్య పరంగా భారత్పై మరింత ఒత్తిడి తెచ్చేలా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు భారత ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్లపై సుంకాలు విధింనుంది. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా ట్రేడ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సలహాదారు పీటర్ నవారూ.. అన్ని ఔట్సోర్సింగ్ సేవలపై టారిఫ్ విధించాలి’ అనే అభిప్రాయం వ్యక్తం చేయడం అందుకు బలం చేకూర్చుతోంది. దీంతో విదేశీ సేవలపై కూడా వస్తువుల్లాగే టారిఫ్ విధించాలి అనే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విధానాలు అమలైతే అమెరికా కంపెనీలు ఔట్సోర్సింగ్ ఖర్చులు పెరగడంతో.. భారత్ సంబంధిత కంపెనీలతో కుదుర్చుకునే కాంట్రాక్ట్ల విషయంలో వెనక్కితగ్గుతాయి. ప్రాజెక్టుల ఆలస్యం, లాభాల తగ్గుదల, సరఫరా గొలుసుల అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భారత ఐటీ కంపెనీలు అమెరికా ఆధారిత వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఇంజినీర్లు, కోడర్లు, ఐటీ కన్సల్టెంట్లు, విద్యార్థులు ఎక్కువ మంది వెళుతుంటారు. ఇన్ఫోసిస్,టీసీఎస్,విప్రో,హెచ్సీఎల్ వంటి సంస్థలు హెచ్1బీ వీసాల ప్రధాన స్పాన్సర్లు. ఈ వీసాల ద్వారా అమెరికాలో పనిచేసే అవకాశం లభిస్తుంది. కానీ ఇప్పుడు..హెచ్1బీ వీసా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ పరిణామాలు భారత్ తన ఐటీ రంగాన్ని విస్తరించేందుకు,వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచేందుకు, అమెరికా ఆధారాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ట్రంప్ పాలనలో భారత ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్య దృశ్యాన్ని మలుపు తిప్పే అవకాశం కలిగి ఉన్నాయి. -
వరల్డ్కప్ టోర్నీకి సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. 17 ఏళ్ల బ్యాటర్కు చోటు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Womens World Cup 2025) టోర్నమెంట్కు సౌతాఫ్రికా క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. స్టైలిష్ ఓపెనర్ లారా వొల్వర్ట్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బుధవారం వెల్లడించింది. ఈ జట్టులో పదిహేడేళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మెసో (Karabo Meso)కు కూడా చోటు దక్కడం విశేషం.ఆమెకు ఇదే తొలిసారిఅండర్-19 వరల్డ్కప్ టోర్నీల్లో రెండుసార్లు సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన మెసో.. సీనియర్ జట్టు తరఫున ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్ స్పెషలిస్టు నొన్కులులెకో ఎమ్లాబాతో పాటు సీమర్లు మసబట క్లాస్, తుమి సెఖుఖునె కూడా స్థానం సంపాదించారు. మాజీ కెప్టెన్కు మొండిచేయిమరోవైపు.. ఆల్రౌండర్ల కోటాలో నదినె డి క్లెర్క్, అన్నెకె బాష్, అనెరి డెర్క్సెన్, నొండుమిసో షంగేజ్ వరల్డ్కప్ ఆడనున్నారు. అయితే, ఇటీవలే తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మాజీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ పేరును మాత్రం సౌతాఫ్రికా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. భారత్- శ్రీలంక వేదికగాఇక సీనియర్లు కొంతమంది మిస్సయినా.. హెడ్కోచ్ మండ్లా మషిమ్బీ మార్గదర్శనంలో పూర్తి స్థాయిలో సన్నద్ధమైన సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసంతో వరల్డ్కప్ బరిలో దిగనుంది.కాగా సెప్టెంబరు 30- నవంబరు 2 వరకు భారత్- శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది. ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టుతో పాటు సౌతాఫ్రికా వుమెన్ టీమ్ కూడా ఇంత వరకు ఒక్కసారి వరల్డ్కప్ ట్రోఫీ గెలవలేదు.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్కు సౌతాఫ్రికా జట్టులారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాక, క్లో ట్రియాన్, నదినె డి క్లర్క్, మరిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్కులులెకో ఎమ్లాబా, అన్నెకె బాష్, అనెరి డెర్క్సెన్, మసబట క్లాస్, సునె లూస్, కరాబో మెసో, తుమి సుఖుఖునె, నొండుమిసో షంగేజ్.ఐసీసీ వన్డే వరల్డ్కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి.చదవండి: ‘తిలక్ వద్దు.. సంజూ శాంసన్ను ఆడించండి.. అతడే అందుకు అర్హుడు’ -
ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?
విలాసవంతమైన జీవితం కంటే తల్లిదండ్రుల బాగోగులే ముఖ్యం అంటూ భారత సంతతి మహిళ భారత్కి తిరిగి వచ్చేయాలనకుంటున్నా అంటూ తన మనసులో మాటను నెట్టింట షేర్ చేసుకుంది. అయితే ఇక్కడ అంత జీతంతో తాను లైఫ్ని లీడ్ చేయగలనా అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చింది. అయితే నెటిజన్లు ఆమె ఆలోచన విధానానికి ఇంప్రెస్ అవ్వగా మరికొందరూ వాళ్లు ఎన్నోత్యాగాలు చేసి పంపితే ఆ కష్టమంతా మట్టిలో కలిపేస్తారా అనే ప్రశ్నను లేవనెత్తడం విశేషం. అసలేం జరిగిందంటే..యూఎస్లోని డెన్వర్లో తన జీవిత భాగస్వామితో విలాసవంతమైన జీవితాన్న గడుపుతున్న భారత సంతతి మహిళ రెడ్డిట్ వేదికగా తన గోడుని వెల్లబోసుకుంది. తాను భారత్కి తిరిగి వచ్చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేశారని, వారి బాగోగులు చూసుకునేందుకు తిరిగి ఇండియాకు వచ్చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ భారత్లో ప్రజలు కొందరు చాలా దురుసుగా, కోపంగా ప్రవర్తించడం చూసి చాలా అసహనానికి గురయ్యానని చెప్పుకొచ్చింది. తాను మాస్టర్స్ పూర్తి చేశానని ఏడాదికి రూ. 3 కోట్లు పైనే సంపాదిస్తానని, తన భర్త ఏడాదికి దాదాపు రూ. 2 కోట్లు వరకు సంపాదిస్తారని అన్నారు. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలని భావిస్తున్నా..బెంగళూరులో ఉండే అవకాశం లభిస్తోంది. అక్కడ ఏడాదికి సుమారు రూ. 1.2 కోట్లు వేతనం అని, అక్కడ లైఫ్ లీడ్ చేయడానికి ఆ మాత్రం సంపాదన సరిపోతుందా అని సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే తనకు యూఎస్లో మంచి స్నేహితులు ఉన్నారని, సౌకర్యవంతంగా జీవించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అదీగాక అమెరికాలో తన జీతం పెద్ద మొత్తం కావడంతో చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయగలిగానని, అందువల్లే భారత్తో సహా వివిధ దేశాలకు సులభంగా వెళ్లగలిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలాగే వర్క్ పరంగా ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదంటూ అమెరికాలోని తన లైఫ్స్టైల్ గురించి తెలిపింది. పైగా తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చేందుకు సిద్ధంగా లేరంటోంది. అదీగాక వాళ్లు ఇక్కడ సంస్కృతికి, స్నేహితులకు అలవాటుపడ్డ మనుషులకు అలా నాలుగు గోడల మధ్య బతకడం అంటే అత్యంత దుర్భరంగా అనిపిస్తుందని వాపోయింది. అందుకే వారి బాగోగులును తాను స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.,అయితే తన సొంతూరిలో ఉద్యోగం చేయడం సాధ్యపడదని ఇలా బెంగళూరులో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే మరి బెంగళూరులో బతికేందుకు ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందంటారా అని సందేహ్నాన్ని లేవనెత్తతూ పోస్ట్ ముగించింది. (చదవండి: నాన్న చెప్పిన కథలే.. స్ఫూర్తి..) -
స్నేహబంధం బలోపేతం
బీజింగ్: అమెరికా విసిరిన టారిఫ్ల సవాళ్లతో ఇక్కట్లు ఎదురవుతున్న వేళ చైనా, రష్యా తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటు న్నాయి. చైనాలోని తియాంజిన్లో సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు జరిగిన మర్నాడే ఇరు దేశాలు మంగళవారం మరోసారి సమావేశమై ద్వైపాక్షిక చర్చలు చేపట్టాయి. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చర్చల కోసం రాజధాని బీజింగ్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్కు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సాదర స్వాగతం పలికారు.పుతిన్ను ‘చిరకాల మిత్రుని’గా అభివర్ణించారు. పుతిన్ సైతం తన ప్రసంగంలో జిన్పింగ్ను ప్రియ స్నేహితునిగా సంబోధించారు. ‘నాడు మేము కలిసే ఉన్నాం.. ఇప్పుడు కూడా కలిసే ఉంటాం’అని పుతిన్ చెప్పుకొచ్చారు. ఇరు దేశాధినేతల లాంఛన సమావేశం అనంతరం చైనా అధికార కేంద్ర స్థానమైన ఝోంగన్హాయ్లో ఇరుపక్షాల ఉన్నతాధికారుల మధ్య తేనీటి విందు భేటీ జరిగింది.రష్యా పర్యాటకులకు ఈ నెల నుంచి 30 రోజులపాటు వీసారహిత సదుపాయం కల్పించనున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే చైనాకు మరో సహజవాయు పైప్లైన్ను నిర్మించేందుకు ఆ దేశంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు రష్యా ప్రభుత్వరంగ చమురు సంస్థ గాజ్ప్రోం సీఈఓ అలెక్సీ మిల్లర్ తెలిపారు. ప్రస్తుత పైప్లైన్ మార్గాల ద్వారా సహజవాయు సరఫరాను మరింత పెంచేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. -
అఫ్గాన్కు ఆపత్సమయం
అంతరిక్షాన్ని దాటి గ్రహాలను పలకరించి, సూర్యుడిపై సైతం నిశితంగా చూపు సారించేందుకు తహతహలాడుతున్న మనిషి తన కాళ్లకిందనున్న నేలలో జరిగే కల్లోలం ఏమిటో, అది ఎప్పుడు ఎందుకు కంపించి పెను విపత్తుల్ని తెచ్చిపెడుతున్నదో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు. అంతా అయినాక భూకంప కేంద్రం ఎక్కడో, దాని తీవ్రత ఏపాటో చెప్పగలుగుతున్నా ముందుగా పసిగట్టడం అసాధ్యంగానే ఉంది. సోమవారం అఫ్గానిస్తాన్లో సంభవించిన భూకంపంలో ఇంతవరకూ 1,400 మందికి పైగా మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఆకలి, అనారోగ్యం, పేదరికం వంటి అనేకానేక క్లేశాలతో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలకు అక్కడి తాలిబన్ పాలకులు అదనపు సమస్య. వారి విధానాలను సాకుగా చూపి పలు దేశాలు ఇప్పటికీ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. భారత్ గుర్తించకపోయినా వివిధ రూపాల్లో దౌత్యం నెరపుతున్నది. ఇప్పుడు తక్షణ సాయం అందించింది. 2021 ఆగస్టులో తాలిబన్లు కూలదోసిన అష్రాఫ్ ఘనీ సర్కారే చాలా దేశాల దృష్టిలో ‘నిజమైన’ ప్రభుత్వం. చాలా దేశాల్లో ఘనీ ప్రభుత్వ రాయబార కార్యాలయాలే ఉన్నాయి. అఫ్గాన్కు ఆ దేశాలు అందించాల్సిన సాయమంతా ఐక్యరాజ్యసమితి సంస్థలకే వెళ్తుంది. వాటిని స్వచ్ఛంద సంస్థలు స్వీకరిస్తాయి. అఫ్గాన్ను 2001–21 మధ్య తన ఉక్కు పిడికిట్లో బంధించి, ఆ దేశాన్ని అనేక విధాల ధ్వంసం చేసి నిష్క్రమించిన అమెరికా... యూఎస్ఎయిడ్ కింద ఏటా అఫ్గాన్కిచ్చే 380 కోట్ల డాలర్ల మానవీయ సాయానికి ఈ ఏడాది జనవరి నుంచి కోత విధించింది. పర్యవసానంగా ఆ సాయం 76 కోట్ల డాలర్లకు పడిపోయింది. అందుకే ఇప్పుడు తక్షణమే అందాల్సిన వైద్యసాయం మొదలుకొని పునరావాసం వరకూ అన్నిటికన్నీ పడకేశాయి.ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రీతిలో క్రియాశీలంగా ఉన్న భూకంప ప్రాంతాల్లో అఫ్గాన్ ఉన్న హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతం ఒకటి. ఇక్కడ భారత పలక, యూరేసియా పలకలు పరస్పరం ఢీకొంటున్నాయి. పర్యవసానంగా ఏర్పడే రాపిడి వల్ల శక్తి విడుదలై అది తరంగాల రూపంలో భూ ఉపరితలానికి చేరటంతో ప్రకంపనలు జనం అనుభవంలోకొస్తాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలానికి దగ్గర లో ఉంటే ఆ ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 8 కిలోమీటర్ల లోతులో ఉందంటున్నారు.అందువల్లే తీవ్రత రిక్టర్ స్కేల్పై 6గా నమోదైనా, ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎక్కువున్నాయి. లోలోతు పొరల్లో సంభవించే భూకంపాల వల్ల విడుదలయ్యే తరంగాలు ఉపరితలానికి చేరేలోపే తమ శక్తిని చాలాభాగం కోల్పోతాయి. కనుకనే నష్టం తక్కువుంటుంది. ఉత్తర అఫ్గాన్లోని పామీర్–హిందుకుష్ ప్రాంతంలో భూకంపాల తీవ్రత ఎక్కువ. కానీ అవి దాదాపు 200 కిలోమీటర్ల లోతులో సంభవిస్తుంటాయి. ఇందుకు భిన్నంగా పశ్చిమ పాకిస్తాన్, ఆగ్నేయ అఫ్గాన్ ప్రాంతంలోని సులేమాన్ పర్వత శ్రేణి వద్ద భూ ఉపరితలానికి సమీపంగా భూకంప కేంద్రాలుంటాయి. భూకంపాలు వాటంతటవే ప్రమాదకరమైనవి కాదు. అవి సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే కట్టడాలు, ఆ విపత్తు విషయంలో అక్కడి పౌరుల్లో ఉండే అవగాహన నష్టం తీవ్రతను తగ్గిస్తాయి. భూకంపాల విషయంలో ఎంతో అనుభవాన్ని గడించి, ప్రాథమిక విద్యాస్థాయి నుంచీ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న జపాన్ ఇందుకు ఉదాహరణ. అక్కడ భూకంపాన్ని తట్టుకునే విధంగా భవంతులు నిర్మించటం తప్పని సరి. అందువల్లే భూకంప తీవ్రత ఎక్కువున్న సందర్భాల్లో సైతం జపాన్లో ప్రాణనష్టం కనిష్ఠంగా ఉంటున్నది. మెరుగైన, శాస్త్రీయమైన ఆవాసాల నిర్మాణానికయ్యే అధిక వ్యయాన్ని భరించే స్తోమత దారిద్య్రంలో కొట్టుమిట్టాడే అఫ్గాన్ ప్రజలకు లేదు. అందుకే స్థానికంగా లభించే మట్టి, రాళ్లు, ఇటుకలతో ఇళ్లు నిర్మించుకుంటారు. పైగా అవి పర్వత సానువుల్లో ఉంటాయి. విపత్తుల సమయాల్లో ఒక్కసారిగా కుప్పకూలి పౌరులకు బయట పడే వ్యవధినీయవు. ఈ ఆపత్సమయంలో అఫ్గాన్ను ఆదుకోవటం ప్రపంచ దేశాల బాధ్యత. సాధారణ సమయాల్లో ఏం చేసినా చెల్లుతుందిగానీ, విపత్తులు విరుచుకు పడినప్పుడు అందరూ ఏకం కావాలి. మానవీయతను చాటుకోవాలి. -
ఏకాకిని చేయడమే ట్రంప్ లక్ష్యం
కొన్నాళ్ళుగా మన కళ్ళెదుట నిలుస్తున్న ఒక ప్రశ్నకు జవాబు కనుగొనవలసిన సమయం ఆసన్నమైంది. భారతదేశం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తున్నారా? మన దేశం రోగం కుదిర్చానని ఆయన అనుకుంటు న్నారా? ఔనన్నదే దానికి జవాబు అయితే, మనం భావిస్తున్న దానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్లే లెక్క. రష్యన్ చమురును దిగుమతి చేసు కుంటున్నందుకు భారత్పై 25 శాతం సెకండరీ సుంకాలు విధించి నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించారు. రష్యాను దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ‘సమరశీల ఆర్థిక లివ రేజి’ కింద ఆ సుంకాలు మోపుతున్నట్లు చెప్పుకొన్నారు. భారత దేశానికి ఆనుషంగిక నష్టం వాటిల్లుతోందనీ, మన దేశానికి ఏం జరిగినా ట్రంప్ పట్టించుకోదలచుకోలేదనీ అది సూచించడం లేదా?ఒకవేళ, రష్యాపై ‘సమరశీల ఆర్థిక లివరేజి’యే లక్ష్యమైతే, భారతదేశం కన్నా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న చైనాపై సెకండరీ సుంకాలు విధించలేదు ఎందుకని? పైగా, ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను చైనా కొనసాగించడం మంచిదే. అది అంతర్జాతీయ ఇంధన ధరలలో ద్రవ్యోల్బణం రాకుండా నివారిస్తుం’’దని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యానించారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కావా? చైనాకు ఒక న్యాయం, భారతదేశానికైతే మరో న్యాయమా?ఇది ప్రతీకారం కాదా?ఇంకా విడ్డూరం ఏమిటంటే, ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ ద్వారానే నిధులు అందుతున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించడం. భారత్పై ఆంక్షలు విధించాలని యూరప్ను బిసెంట్ కోరారు. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు వాటిల్లజేస్తోందనీ, ‘‘భారతదేశానికి ఏది ఎక్కువ నష్టదాయకమో అక్కడే దెబ్బ కొట్టడం’’ తమ అభిమతమనీ ట్రంప్కు వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన ఇపుడు ‘‘మోదీ చేస్తున్న యుద్ధం’’గా అభివర్ణించారు. ‘‘శాంతికి రహ దారి న్యూఢిల్లీ గుండానే పడుతుంది’’ అంటున్నారు. భారతదేశపు ‘‘మృతప్రాయ’’ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను పట్టించుకో నని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇది కక్ష సాధింపునూ, ప్రతీకా రాన్నీ సూచించడం లేదా?భారత్పై 50 శాతం సుంకాలు విధించడంలో, చైనాకు ట్రంప్ ఇవ్వదలచుకున్న సందేశం ఇమిడి ఉందనీ, అది కూడా భారతదేశా నికి ఆనుషంగిక నష్టం వాటిల్లజేసేదేననీ స్ట్రాట్ఫర్ సంస్థ మాజీ చైర్మన్ జార్జ్ ఫ్రైడ్మ్యాన్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో చెప్పారు.చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ తహతహలాడు తున్నారు. చైనాకు వ్యతిరేకంగా తాము భారత్ పక్షాన చేర బోమనే ట్రంప్ సందేశంలోని ఆంతర్యమని ఫ్రైడ్మ్యాన్ చెప్పారు. ట్రంప్ మనసులో ఉన్న విస్తృత భౌగోళిక రాజకీయ తంత్రంలో, రష్యా, చైనాలకు ప్రాధాన్యం ఉంది. అందుకే భారతదేశాన్ని ‘‘విడిచి పెట్టేయవచ్చు’’.ఫ్రైడ్మ్యాన్ మాటలే నిజమైతే, రష్యాను హెచ్చరించేందుకు, చైనాకు పూర్తిగా వేరే రకమైన సందేశం పంపేందుకు భారతదేశాన్ని వాడుకున్నారు. రెండిందాలా భారతదేశానికే నష్టం. ట్రంప్ లెక్క లేనట్లే వ్యవహరిస్తున్నారు. ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము!అయితే, సుంకాలు, చమురు, భౌగోళిక–రాజకీయాలను మించిన సంకట స్థితినే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. భారత –అమెరికాల మధ్య సంబంధాలకు పునాది అయిన రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. హెచ్1బి వీసా విధానంలో మార్పు తేదలచినట్లు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లట్నిక్ ప్రకటించారు. దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 70 శాతం మంది భారతీయులే కనుక, అది మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యార్థుల వీసాలను నాలుగేళ్ళ కాలానికి మాత్రమే పరిమితం చేయాలని అమెరికా ఆంతరంగిక భద్రతా శాఖ యోచిస్తోంది. అది భారతీయ విద్యార్థుల సంఖ్యను కుంచింపజేస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థులలో భారతీయులు పెద్ద వర్గంగానే ఉన్నారు. మరోవైపు ఇపుడున్న సంఖ్య కన్నా దాదాపు మూడింతలు ఎక్కువగా 6,00,000 మంది చైనా విద్యార్థులకు ప్రవేశం కల్పించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, భారతదేశంలో అమెరికా కొత్త రాయ బారిగా సెర్గియో గోర్ నియామకాన్ని మనం ఎలా అర్థం చేసుకో వాల్సి ఉంటుంది? ఆయన ట్రంప్కు చాలా సన్నిహితుడు. కానీ ఆయనకు దౌత్యపరమైన అనుభవం గానీ, భారతదేశం పట్ల ముందస్తు అవగాహన గానీ లేవు. హెచ్చరించే విరామం తీసుకోకుండా, లేదా ప్రత్యామ్నాయాలను సూచించకుండా ట్రంప్ ఎంచుకున్న బాటలో సెర్గియో పరుగులు పెడతారని చాలామంది భయ పడుతున్నారు. అది మనకు శుభ సూచకం ఏమీ కాదు. ఆయన బాధ్యత అంతటితో తీరిపోవడం లేదు. దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా కూడా సెర్గియోను నియమించారు. ఈ అసాధారణ చర్య దేన్ని సూచిస్తోంది? భారతదేశానికి ఇష్టం లేని పనిని బలవంతంగా ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాలా? సూటిగా చెప్పాలంటే, భారత–పాకిస్తాన్ల మధ్య తమ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోవాల్సిందేనని చెప్పడమా?ఇది దాడి చేయడమేననే భయం నాలో మొదలైంది. అనేక స్థాయులలో, అనేక విధాలుగా భారతదేశంపై గురిపెడుతున్నారు. ట్రంప్కు ఇక మనం ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము. అంచ నాలు తలకిందులవడంతో ఆయన ఖంగు తిన్నట్లున్నారు. మనపై కోపానికి కూడా లోనై ఉంటారు.సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారని ట్రంప్కు ధైర్యంగా చెప్ప గలిగినవారు, భారతదేశం పక్షాన నిలిచేందుకు సుముఖంగా ఉన్న వారు అమెరికాలో ఎవరైనా ఉన్నారా? డెమొక్రాటిక్ పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సందేహం లేదు! కానీ, అమెరికాను మళ్ళీ గొప్పదిగా చేయడమనే(మాగా) వర్గంలోని వారి నుంచి గొంతుక వినిపించడం లేదు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల గొంతు పెగలకపోవడం మరింత కలవరపరుస్తోంది. మనల్ని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేయాలని ట్రంప్ చూస్తున్నారా? నా వద్ద స్పష్టమైన జవాబు లేదు. కానీ, అలానే అనిపించడం లేదా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అసహనంలో అమెరికా.. భారత్కు రష్యా బంపరాఫర్!
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు అనంతరం, భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు రష్యా బంపరాఫ్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది.ఎస్సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం.మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 50శాతం టారిఫ్ విధించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్..ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ మద్దతిస్తుందని అక్కసు వెళ్లగక్కారు. అయితే,భారత్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను సమర్థిస్తోంది. చమురు ఎక్కడ తక్కవ దొరికితే అక్కడ నుంచి కొనుగోలు చేస్తామని కుండబద్దలు కొట్టి చెప్పింది. అమెరికా విధించిన టారిఫ్లను భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలు భారత్ అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాల్లో కీలక మలుపు తిరగనుంది. చమురు వ్యాపారం కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయంగా పలుదేశాల్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. Always a delight to meet President Putin! pic.twitter.com/XtDSyWEmtw— Narendra Modi (@narendramodi) September 1, 2025 -
రష్యాతో కాదు.. భారత్ ఉండాల్సింది మాతోనే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..మరోసారి భారత్పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా సంబంధాలపై తాజాగా విమర్శలు గుప్పించారు. భారత్ ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తియాంజిన్ (Tianjin) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. పీటర్ నవారో తీవ్ర విమర్శలు చేశారు.వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ.. పుతిన్, షీ జిన్పింగ్లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కానేకాదు అని అన్నారు.అమెరికా విధించిన టారిఫ్లపై భారత్ స్పందించిన తీరు.. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు. తాజాగా.. భారత్లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.అయితే.. భారత్ మాత్రం తన చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. మిగతా దేశాల్లాగే జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని, దేశీయ మార్కెట్ను స్థిరంగా ఉంచేందుకు ఇది అవసరమని భారత్ అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా విధించిన 50 శాతం సుంకాలను అన్యాయమని భారత్ అభిప్రాయపడుతోంది. -
వచ్చే ఏడాది భారత్లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మక టోర్నీ వరల్డ్ చాంపియన్షిప్కు 17 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 ఆగస్టులో న్యూఢిల్లీ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. మన దేశంలో చివరిసారిగా 2009లో వరల్డ్ చాంపియన్షిప్ను హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. పారిస్లో జరిగిన 2025 టోర్నీ ముగింపు సందర్భంగా వచ్చే ఏడాది వేదిక వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షురాలు ఖున్యింగ్ పటామా, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా వంద శాతం అత్యుత్తమ స్థాయిలో ఈ మెగా టోర్నీని తమ దేశంలో నిర్వహిస్తామని మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్లో నిలకడగా విజయాలు సాధిస్తున్న జట్లలో భారత్ కూడా ఒకటి. వరల్డ్ చాంపియన్షిప్లో భారత్ ఇప్పటి వరకు 15 పతకాలు గెలుచుకుంది. 1983లో ప్రకాశ్ పడుకోన్ పురుషుల సింగిల్స్లో కాంస్యంతో తొలి పతకం అందించగా... 2011 నుంచి ప్రతీ ఏటా కచ్చితంగా మన ఆటగాళ్లు ఏదైనా ఒక పతకం గెలుస్తూ వచ్చారు. అత్యధికంగా పీవీ సింధు ఒక స్వర్ణం సహా మొత్తం ఐదు పతకాలు సాధించింది. -
నూతన శిఖరాలకు భారత్–అమెరికా భాగస్వామ్యం
వాషింగ్టన్: రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్పింగ్లతో ప్రధాని మోదీ భేటీ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక సందేశాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. భారత్–అమెరికాల మధ్య భాగస్వామ్యం నూతన శిఖరాలకు చేరుకుంటోందని వెల్లడించింది. ఇరుదేశాల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని, 21వ శతాబ్దంలో ఇది నిర్ణయాత్మక బంధమని ఉద్ఘాటించింది. ప్రజలు, ప్రగతి అనే అంశాలు మనల్ని ముందుకు నడిపిస్తున్నాయని స్పష్టం చేసింది. కీలక రంగాల్లో 2 దేశాలు కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఇరుదేశాల ప్రజల నడుమ ఉన్న ఎడతెగని స్నేహబంధం మన ప్రయాణానికి ఇంధంగా పని చేస్తోందని తేల్చిచెప్పింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యను కూడా అమెరికా రాయబార కార్యాలయం తమ పోస్టుకు జతచేసింది. -
భద్రత, శాంతితోనే అభివృద్ధి
తియాంజిన్: షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) పట్ల భారత్ వైఖరి, విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఎస్ అంటే సెక్యూరిటీ(భద్రత), సీ అంటే కనెక్టివిటీ(అనుసంధానం), ఓ అంటే అపర్చునిటీ(అవకాశం) అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశ అభివృద్ధికైనా భద్రత, శాంతి, స్థిరత్వమే పునాది అని వెల్లడించారు. ప్రపంచ దేశాల పురోగతికి ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై పోరాటం చేయడం మానత్వం పట్ల మన బాధ్యత అని సూచించారు. చైనాలోని తియాంజిన్లో ఎస్సీఓ సదస్సులో రెండో రోజు సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రాంతీయ అభివృద్ధికి అనుసంధానం అత్యంత కీలకమని చెప్పారు. అనుసంధానం దిశగా జరిగే ప్రతి ప్రయత్నమూ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా ఉండాలని సూచించారు. ఎస్సీఓ చార్టర్లోని మూలసూత్రాల్లో ఇది కూడా ఒక భాగమేనని గుర్తుచేశారు. కాలం చెల్లిన విధానాలు వద్దు ఎస్సీఓ కింద ‘సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్’ ఏర్పాటు చేసుకుందామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఘనమైన మన ప్రాచీన నాగరికతలు, కళలు, సాహిత్యం, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరస్పరం పంచుకోవడానికి ఈ ఫోరమ్ తోడ్పడతుందని అన్నారు. దక్షిణార్ధ గోళ దేశాలు(గ్లోబల్ సౌత్) మరింత వేగంగా ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. కాలం చెల్లిన విధానాలతో అనుకున్న లక్ష్యం సాధించలేమని చెప్పారు. ఇంకా వాటినే నమ్ముకొని ఉండడం భవిష్యతు తరాలకు అన్యాయం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించుకోవాలని సూచించారు. భారతదేశ ప్రగతి ప్రయాణాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంస్కరణ, పనితీరు, మార్పు అనే మంత్రంతో తమదేశం ముందుకు సాగుతోందన్నారు. విస్తృత స్థాయిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, దీనివల్ల జాతీయ అభివృద్ధికి, అంతర్జాతీయ సహకారానికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిగా మారాలంటూ ఎస్సీఓ సభ్య దేశాలను మోదీ ఆహా్వనించారు. ముష్కరులను పోషించడం మానుకోవాలి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం కొన్ని దేశాలు ఇకనైనా మానుకోవాలని ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్కు హితవు పలికారు. ముష్కర మూకలను పెంచిపోíÙస్తే మొత్తం మానవళికి ముప్పు తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదని అన్నారు. తాము క్షేమంగా ఉన్నామని ఏ ఒక్కరూ అనుకోవడానికి వీల్లేదన్నారు. కలిసికట్టుగా పోరాడితేనే ఉగ్రవాదం అంతమవుతుందని ఉద్ఘాటించారు. అల్ఖైదా, అని అనుబంధ గ్రూప్లపై యుద్ధం ప్రారంభించామని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడిని కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇది కేవలం భారత్పై జరిగిన దాడి కాదని, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్క దేశానికీ, ప్రతి పౌరుడీకి ఒక సవాల్ అని పేర్కొన్నారు. పహల్గాం దాడి సమయంలో భారత్కు అండగా నిలిచిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
సుంకాలను భారత్ పూర్తిగా ఎత్తేస్తామంది!
న్యూయార్క్/వాషింగ్టన్: బాధ్యతారహిత వ్యాఖ్యలు, పిల్లచేష్టలతో ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు నిత్యం నవ్వులపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిగిలి ఉన్న కాస్త పరువూ పూర్తిగా పోగొట్టుకునేలా ప్రవర్తిస్తున్నారు. అమెరికాపై టారిఫ్లను పూర్తిగా ఎత్తేస్తామంటూ భారత్ ప్రతిపాదించిందని సోమవారం మరో మతిలేని ప్రకటన చేశారాయన. పైగా, ‘అది చాలా ఆలస్యంగా వచ్చిన ప్రకటన! ఎందుకంటే పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయింది’ అంటూ మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శించారు. భారత్ తన రక్షణ, సైనిక, చమురు అవసరాల్లో అత్యధికం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది తప్ప అమెరికా నుంచి పెద్దగా కొనడమే లేదంటూ మరోసారి అక్కసు ప్రదర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన కొద్ది గంటలకే సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్సోషల్లో ఇలాంటి అర్థం పర్థం లేని కామెంట్లకు దిగారు. ‘‘భారత్ మాతో భారీగా వర్తక వ్యాపారాలు జరుపుతోంది. వాళ్లకు అతి పెద్ద క్లయింట్లం మేమే. కానీ భారత్తో మేం చేసే వ్యాపారం మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే మాపై అంత భారీ సుంకాలు విధించింది. మాకు అత్యంత నష్టదాయకమైన ఈ ఏకపక్ష ఉత్పాతపు పోకడ దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవమిది’’ అంటూ వాపోయారు. ‘‘ఇప్పుడు తీరిగ్గా ‘జీరో టారిఫ్’ ప్రతిపాదన చేసి ఏం లాభం? ఆ పని ఏళ్లక్రితమే చేయాల్సింది. ఇదంతా కామన్సెన్స్’’ అంటూ సోషల్ మీడియాలోనే భారత్కు తీరిగ్గా క్లాసు కూడా పీకారు. ట్రంప్ పోస్టులను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెంటనే షేర్ చేసి మద్దతుగా నిలిచారు. అయితే ఇలా భారత్ సున్నా సుంకాల ప్రతిపాదన చేసిందంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ట్రంప్కు ఇది కొత్తేమీ కాదు. వాటిని అప్పట్లోనే విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా ఖండించింది. కాక పుట్టించిన ‘షాంఘై భేటీ’! : తాజా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం తెలిసిందే. పలు అంశాలపై ఇద్దరు నేతలతో ఆయన లోతుగా చర్చలు జరిపారు. ఈ పరిణామాన్ని అమెరికా కర్రపెత్తనానికి శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా పడిన అతి కీలక అడుగుగా పరిశీలకులు ఇప్పటికే అభివరి్ణస్తున్నారు. ఈ పరిణామంతో చిర్రెత్తుకొచ్చి ట్రంప్ ఇలా బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగుతున్నారని వారంటున్నారు. భారత్పై సుంకాలను ఆయన ఇప్పటికే భారీగా 25 శాతానికి పెంచడం తెలిసిందే. దానికి తోడు రష్యా నుంచి భారత్ కొనే చమురుపై మరో 25 శాతం అదనపు సుంకాలు బాదుతున్నట్టు ప్రకటించారు. దాంతో మనపై సుంకాలు ఏకంగా 50 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. -
హతవిధి.. పాక్ ప్రధానికి ఘోర పరాభవం!
2025లో చైనా తియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్, ఉక్రెయిన్ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తూ పాక్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને નીચે જોવા જેવી સ્થિતિ પેદા થઈRead more at: https://t.co/xr1jIGM2b2#PMModiSCOsummit2025 #NarendraModi #PMModi #ShehbazSharif #VladimirPutin #SCOsummit2025 #SCOsummitinChina #XiJinping #Reels #shorts #newskida #treeshinewskida pic.twitter.com/NxjZc9wc6W— NewsKida (@TreeshiNewsKida) September 1, 2025భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని షరీఫ్ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. PM Modi, Putin, Xi Jinping and Shehbaz Sharif meetup in SCO Summit 2025😭🤣#SCOSummit pic.twitter.com/MKnj7TjCO1— Bruce Wayne (@_Bruce__007) September 1, 2025ఇక.. పుతిన్ను కలవాలన్న షరీఫ్ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కరచలనం చేయడానికి షరీఫ్ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో షరీఫ్ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. షరీఫ్ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్ మరోసారి ఆయన్ని పలకరించారు.आतंक पर बड़ी चोट कर रहे थे PM मोदी, सुन रहे थे पाक पीएम शहबाज शरीफ#PMModi #ShehbazSharif #PMModiInChina #SCOSummit2025 #Pakistan pic.twitter.com/EU2UkhZCq1— One India News (@oneindianewscom) September 1, 2025Shehbaz Sharif after seeing Xi and Putin with Modi while ignoring him 😭 pic.twitter.com/fDlEIEQDor— Fazal Afghan (@fhzadran) September 1, 2025 Pakistan PM Shehbaz Sharif Serving Juice to @narendramodi and #Putin Nice Gesture 🙌 #NarendraModi #ShehbazSharif #SCOSummit #SCOSummit2025 pic.twitter.com/R1eZEni9M7— SATYA ᴿᶜᴮ 🚩 (@sidhufromnaayak) September 1, 2025 ఇక సదస్సు ముగిసిన తర్వాత.. గ్రూప్ ఫొటో సమయంలోనూ షరీఫ్కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్-మోదీ-జిన్పింగ్ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఇటు పాక్ షరీఫ్కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విటర్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి ఫేమస్ ఫ్లాట్ఫారమ్లలో మీమ్స్, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్ మీడియా షరీఫ్ను గ్లోబల్ పవర్హౌజ్ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం
చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఈ సదస్సులో రిసెప్షన్ వద్ద చైనీస్ హ్యుమానాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడి అతిధులు అడిగే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెబుతూ ఎంతగానో ఆకట్టుకుంది.ఎస్సీవో సదస్సులో హ్యుమానాయిడ్ రోబో సమాధానాలు చెప్పడానికి సిద్ధం కావడానికి ముందు.. "నేను ఈ రోజు నా గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాను. నన్ను ప్రశ్నలు అడుగుతున్నందుకు ధన్యవాదాలు'' అని చెప్పింది.భారతదేశంపై నీ ఆలోచలను చెప్పమని అడిగినప్పుడు.. నేను ఒక ఏఐ రోబోను. దేశాలు, రాజకీయ పరిణాలను గురించి నేను చెప్పలేనని స్పష్టం చేసింది. అయితే ఎస్సీవో సదస్సుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇది ఇంగ్లీష్, చైనీస్, రష్యన్ భాషలు మాట్లాడుతుంది. View this post on Instagram A post shared by Firstpost (@firstpost) -
Modi in China: షాంఘై శిఖరాగ్ర సమావేశం ప్రారంభం.. నేడు ప్రధాని మోదీ ప్రసంగం
తియాన్జిన్: షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు ఆదివారం రాత్రి తియాన్జిన్లో ప్రారంభమయ్యింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ విందు కార్యక్రమంతో సదస్సు మొదలయ్యింది. నేడు సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.జిన్పింగ్ ఇచ్చిన విందు కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా వివిధ దేశాధినేతలు పాల్గొన్నారు. కూటమి దేశాల మధ్య ఐక్యతను, సహకారాన్ని పెంపొందించి, పురోగమనంలోకి పయనించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని జిన్పింగ్ పేర్కొన్నారు. దక్షిణార్థగోళ దేశాల బలాన్ని పెంపొందించేందుకు, మానవ నాగరికత మరింత పురోగమించడానికి వీలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా 20 మంది విదేశీ నేతలను, 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులను ఈ సదస్సుకు జిన్పింగ్ ఆహ్వానించారు.సోమవారం వీరంతా కీలక సమావేశంలో పాల్గొననున్నారు. వేదికపై మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చైనాతో సంబంధాలపై ఆయన ఈ సదస్సులో మాట్లాడే అవకాశం ఉంది. మోదీ సహా వివిధ దేశాధినేతలు జిన్పింగ్తో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కాగా షాంఘై సహకార సంస్థ సదస్సులో వివిధ దేశాలు అభివృద్ధిపై వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు, భద్రత, ఆర్థిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. PM Modi, President Putin and President Xi shared a light moment on the sidelines of the SCO Summit in China. pic.twitter.com/pEpAdF4qYi— Tar21Operator (@Tar21Operator) September 1, 2025 -
మీ బోర్డర్ దాటి వస్తున్న పాక్ టెర్రరిస్టుల సంగతేంటి?
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఇందులో చైనా సరిహద్దుల నుంచి భారత్లోకి చొరబడుతున్న పాక్ టెర్రరిస్టుల అంశాన్ని కూడా ప్రధాని మోదీ.. జిన్పింగ్ వద్ద ప్రస్తావించారు. అయితే దీనికి చైనా తన సంపూర్ణ మద్దతును భారత్కు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ‘ జిన్పింగ్ వద్ద పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను కూడా మోదీ ప్రస్తావించారు. ఇందుకు చైనా సానుకూలంగా స్పందించింది. టెర్రర్ కార్యకలాపాల వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని జిన్పింగ్ అన్నారు. ఎటువంటి ఉగ్రవాద చర్యల నిర్మూలనకైనా తమ మద్దతు ఉంటుందని జిన్పింగ్ అన్నారు. ఇరుదేశాలకు ప్రమాదంగా మారిన ఉగ్రవాద అంశాన్ని జిన్పింగ్ కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత్కు తమ వంతు సహకారం అందిస్తామన్నారు’ అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. టియాంజిన్ నగరంలో ఎస్సీవో సదస్సులో పాల్గొన్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయ శాంతి, ఆర్థిక స్థిరత్వం, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపు, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచుకునే వంటి అంశాలపై చర్చలు జరిగాయి.వాణిజ్య, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్-చైనా మధ్య స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయి అని ప్రధాని మోదీ తెలపడంతో ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడానికి అడుగులు పడ్డాయి. ఈ పర్యటన ద్వారా భారత్ తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని చాటింది. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. -
‘అసలు ట్రంప్కు బుర్ర ఉందని అనుకోవడం లేదు’
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఫుల్ స్టాప్ పడ్డ పలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా మోదీ.. చైనాలో అడుగుపెట్టారు. ఎప్పట్నుంచో భారత్తో సంబంధాల కోసం ఎదురుచూస్తున్న చైనా కూడా మోదీ పర్యటనకు ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంచితే, భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ సుంకాలను 50 శాతం పెంచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై చైనాకు చెందిన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు ఎయిమర్ టాన్జెన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నానని చెప్పుకుంటున్న ట్రంప్కు కనీసం బుర్ర ఉంటే భారత్పై ఆ విధంగా సుంకాలు విధించే వాడు కాదంటూ మండిపడ్డారు. ప్రపంచ మార్కెట్ పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా భారత్ అతి పెద్దదని, అటువంటి దేశంపై ట్రంప్ విజ్ఞత లేకుండా వ్యవహరించి తప్పు చేశాడన్నారు . ట్రంప్ తన బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకోవడం, అందులోనూ భారత్ లాంటి దేశంపై సుంకాలతో కాలు దువ్వడం వంటిది అమెరికాకే మంచిది కాదన్నారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్పింగ్-మోదీల మధ్య జరుగుతున్న చర్చలతో మరో కొత్త శకం ఆరంభం కానుందన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ను బలవంతంగా లొంగిపోయేలా చేయాలనుకున్నారు. రష్యా ఆయిల్ కొంటే సుంకాలు విధించడం ఏంటి?,. భారత్ లాంటి దేశాన్ని తక్కువ చేసి చూడటం సమంజసం కాదనేది నా అభిప్రాయం. తెలివైన వారు ఎవరూ కూడా ఇలా వ్యవహరించరు. ట్రంప్ చర్య సరైనది కాదు. భారత్కు బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడే శక్తి ఉంది.. అవకాశం కూడా ఉంది’ అని ఎయిమర్ టాన్జెన్ స్సష్టం చేశారు. ఇదీ చదవండి: భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలు -
Editor Comments: ట్రంప్ టారిఫ్ పై రిచర్డ్ వోల్ఫ్ సంచలన విశ్లేషణ
-
పాక్ తో స్నేహం భారత్ తో గొడవ.. టారిఫ్ వార్ తో అమెరికాకు నష్టం..!
-
ముగ్గురు మొనగాళ్లు రెడీ.. ట్రంప్ కు మాస్టర్ స్కెచ్
-
వాణిజ్య చర్చలపై వెనక్కి తగ్గిన భారత్: ట్రంప్ తీరుపై మాజీ ఆర్థిక కార్యదర్శి ఫైర్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు విధించడంతో ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకే భారత్.. అమెరికాతో వాణిజ్య చర్చల నుండి వెనక్కు తగ్గిందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ వ్యాఖ్యానించారు.ఎన్డీటీవీతో సుభాష్ గార్గ్ మాట్లాడుతూ ట్రంప్ ఏకపక్ష సుంకాలు 50 శాతం వరకు ఉండటంతో న్యూఢిల్లీ ఇప్పటికే చర్చల నుండి సమర్థవంతంగా వైదొలిగిందన్నారు. భారత్ ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తూ, భారీగా లాభాలు పొందుతోందంటూ ట్రంప్ పదేపదే చేసిన వాదనలను సుభాష్ గార్గ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణ ఆర్థిక వాస్తవికత కాదని, ఇదొక రాజకీయ నాటకమని ఆయన పేర్కొన్నారు. రష్యా ముడి చమురు కొనుగోలు వలన భారత వాస్తవ పొదుపు సంవత్సరానికి 25 బిలియన్ అమెరికన్ డాలర్లు కాదని, 2.5 బిలియన్ అమెరికా డాలర్లకు దగ్గరగా ఉందని గార్గ్ అన్నారు.ఈ విధంగా తప్పుడు సంఖ్యను చెప్పవచ్చుగానీ, ట్రంప్ దీనిని భారతదేశాన్ని శిక్షించడానికి కత్తిగా ఉపయోగిస్తున్నారని గార్గ్ ఆరోపించారు. గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం షిప్పింగ్, భీమా, బ్లెండింగ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నాక భారత్.. రష్యన్ బారెల్స్ నుంచి అందుతున్న డిస్కౌంట్ బ్యారెల్కు కేవలం మూడు నుంచి నాలుగు అమెరికన్ డాలర్లు మాత్రమేనని అన్నారు. భారత్ చమురు కొనుగోలు విషయంలో అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదని గార్గ్ స్పష్టం చేశారు.అమెరికా విధిస్తున్న సుంకాల స్థాయిలలో ఎవరూ వ్యాపారం చేయలేదని, అమెరికా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ప్రధాని మోదీ దేశంలోని రైతుల ప్రయోజనాల కోసం ఎప్పుడూ రాజీ పడనని ప్రతిజ్ఞ చేశారని గార్గ్ పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులను బహిష్కరించాలని వస్తున్న పిలుపులపై గార్గ్ మాట్లాడుతూ అది పిచ్చితనమని, అమెరికా- భారత్లు వస్తు వినియోగం, సేవారంగాలలో లోతుగా కలిసిపోయాయన్నారు. అందుకే అమెరికా వస్తు బహిష్కరణ సాధ్యం కాదన్నారు. -
ట్రంప్ భారత్కు వచ్చే అవకాశాల్లేవు
న్యూయార్క్: భారత్లో ఈ ఏడాది చివర్లో జరిగే క్వాడ్ శిఖరాగ్రానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే అవకాశాలు లేవని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. గత కొద్ది నెలలుగా ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఆ పత్రిక ఓ కథనంలో ఈ మేరకు విశ్లేషించింది. దీనిపై అమెరికా, భారత్ అధికారులు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నవంబర్లో భారత్ ఆతిథ్యంలో జరిగే శిఖరాగ్రంలో ఆ్రస్టేలియా, జపాన్, అమెరికా దేశాల నేతలు పాల్గొనాల్సి ఉంది. భారత్–పాకిస్తాన్ల మధ్య కొనసాగిన నాలుగు రోజుల సంక్షోభం తన జోక్యంతోనే ముగిసిందంటూ ట్రంప్ పదేపదే చెప్పుకోవడం, భారత్ ఖండించడాన్ని న్యూయార్క్టైమ్స్ కథనంలో ప్రస్తావించింది. దీనిపై ట్రంప్ విషయంలో మోదీ సహనం కోల్పోయారని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడాన్ని ప్రస్తావించిన ట్రంప్..భారత్ కూడా అలాగే చేయాలని ఆశించి భంగపడ్డారని విశ్లేషించింది. ఇదే ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచేందుకు ఆజ్యం పోశాయని పేర్కొంది. వీటికి ప్రతీకారంగానే రష్యా ఆయిల్ కొనుగోలు సాకుతో భారత్పై విపరీతంగా టారిఫ్ల భారం మోపారని తెలిపింది. టారిఫ్లపై చర్చలు కొలిక్కి రాకపోయేసరికి విసుగెత్తిన ట్రంప్ పలుమార్లు మోదీకి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని పేర్కొంది. అందుకే, భారత్–అమెరికాల మధ్య సంబంధాలు దిగజారడానికి రష్యా ఆయిల్ కొనుగోలు చేయడానికి మించిన కారణాలున్నట్లు విశ్లేషకులు సైతం అంటున్నారని ఆ కథనం వివరించింది. -
ఏనుగుపై తొడగొట్టిన ఎలుక!
భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న దశ అనూహ్యంగా మొదలైంది. ఏనుగు కుంభస్థలంపై ఎలుక పిల్ల ఓ మొట్టికాయ వేసిందట! రెండు దేశాలను ఉద్దేశించి ఓ ఆర్థిక నిపుణుడు చేసిన వ్యాఖ్యానం ఇది. అయితే ఇందులో ఏనుగెవరు? ఎలుకెవరు? గత పాతికేళ్లుగా డాలర్ డ్రీమ్స్ను పలవరిస్తూ వస్తున్న మన మిడిల్ క్లాస్ కుటుంబ రావులు ఈ ప్రశ్నకు ఠకీమని సమాధానం చెప్పగలరు. అపారమైన ఆర్థిక – సైనిక బలం, అగ్రరాజ్య హోదా ఉన్న అమెరికా ఎలుకెట్లా అవుతుంది? లక్షల సంఖ్యలో మన వంశోద్ధారకుల్ని కూడా ఉద్ధరిస్తున్న అమెరికా దేశం ఏనుగు కాకుండా ఎలుకవుతుందా అనే సందేహం వారికి ఉంటుంది. మరి నూటా నలభై కోట్ల జనాభా, అందులో 90 కోట్ల మంది యువత ఉన్న భారత దేశాన్ని కూడా ఎలుకతో పోల్చడం సాధ్యంకాదు కదా!వాణిజ్య ట్యారిఫ్లను ఆయుధాలుగా మార్చుకొని కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, తదనంతర ప్రపంచ పరిణామాల నేపథ్యంలో రిచర్డ్ ఓల్ఫ్ అనే అమెరికన్ ఆర్థికవేత్త చేసిన విశ్లేషణ సంచలనంగా మారింది. భారతదేశంపై ట్రంప్ చేసిన 50 శాతం సుంకాల ‘యుద్ధ ప్రకటన’పై ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యానాన్ని విస్తారమైన అర్థంలో చేశార నుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కలిగే దీని పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని ఏనుగుపై ఎలుక మొట్టికాయ వేసినట్టేనని అన్నారు. ప్రపంచ జనాభాలో నాలుగున్నర శాతం లేని దేశం 95 శాతం ప్రజలను ఆజ్ఞాపించాలని చూసే పెత్తందారీతనం బెడిసి కొడుతుందని ఆయన జోస్యం చెప్పారు.అమెరికా ట్యారిఫ్ కొరడా ప్రయోగం భారత్పై ప్రభావం చూపబోదని దాని అర్థం కాదు. తక్షణ ఫలితంగా భారత్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. మొత్తం అంత ర్జాతీయ వాణిజ్యంలో 90 బిలియన్ డాలర్ల పైచిలుకు లోటును భారత్ ఎదుర్కొంటున్నది. ఈ లోటులో సింహభాగం చైనా వాణిజ్యంలోనే! ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలిస్తే తప్ప ఈ లోటును అధిగమించడం సాధ్యం కాదు. ఒక్క అమెరికా వాణిజ్యంలోనే భారత్ మిగులు భాగస్వామిగా ఉంటున్నది. అమెరికాకు 87 బిలియన్ డాలర్ల సరుకుల్ని ఎగుమతి చేస్తున్న మన దేశం అక్కడి నుంచి 45 బిలియన్ డాలర్ల కిమ్మత్తు చేసే సరుకుల్ని దిగుమతి చేసుకుంటున్నది. 50 శాతం ట్యారిఫ్ ప్రభావం 70 శాతం వ్యాపారంపై పడుతుందని, ఫలితంగా వెనువెంటనే 20 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోతామని ఎగుమతిదార్ల సంస్థలు చెబుతున్నాయి. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. తిరుపూర్, నోయిడా, సూరత్ వంటి పట్టణాల్లో అప్పుడే ఉద్యోగాల కోత, ఫ్యాక్టరీల మూత మొదలైంది.అమెరికా కొరడా ఝుళిపిస్తుంటే భారత్ చేతులు ముడుచు కొని కూర్చుంటుందా? కూర్చోలేదు కూడా! ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకూ భారత నాయకత్వం పరిణతితో, ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించిందనే చెప్పాలి. భారత్ – పాక్ల మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతల సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. యుద్ధం మొదలుకావడం, రెండు రోజుల్లోనే పాక్ను భారత్ దారుణంగా దెబ్బతీయడం, ఆ వెనువెంటనే కాల్పుల విరమణ ప్రకటన రావడం జరిగింది. భారత్ – పాక్లు ప్రకటించకముందే తన వల్లనే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ప్రకటించుకున్నారు. దీన్ని భారత్ అధికారికంగా ఖండించ లేదు. ట్రంప్కు మోదీ భయపడ్డారని, ఆయన ఆదేశించగానే కాల్పుల విరమణ అమలు చేశారనే ప్రచారం జరిగింది. చాలా మంది నమ్మారు. తదనంతర పరిణామాలను గమనిస్తే అప్పటి అభిప్రాయం కేవలం అపోహ మాత్రమే కావచ్చనిపిస్తున్నది. గతంలో విధించిన 25 శాతం ట్యారిఫ్కు అదనంగా మరో 25 శాతం విధించడానికి కారణం తాము ఆంక్షలు విధించిన రష్యా నుంచి భారీఎత్తున చమురు కొనుగోలు చేయడమేనని ఇప్పుడు అమెరికా చెబుతున్నది. అసలు కారణం అది కాదన్న సంగతి అందరికీ తెలుసు.అమెరికాలోని వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను చిరకాలంగా భారత మార్కెట్ ఊరిస్తున్నది. అవి భారత్లో ప్రవేశించగలిగితే ఇబ్బడిముబ్బడిగా అమెరికా విత్తన కంపెనీలు, పాల ఉత్పత్తుల కంపెనీలు లాభాలు పోగేసుకోగలుగుతాయి. జన్యుమార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్నలను దిగు మతి చేసుకోవాలని అమెరికా భారత్ను డిమాండ్ చేస్తున్నది. వ్యవసాయ రంగాన్ని పరాధీనం చేయగలిగే జీఎమ్ పంటలను ఒక విధానంగా భారత ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లానే పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా షరతు పెట్టింది. ఈ షరతు అంగీకరిస్తే దేశవాళీ పాడి పరిశ్రమ లక్ష కోట్లకు పైగా నష్టపోతుందని ఒక అంచనా. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశం పాల ఉత్పత్తులను చౌక సుంకాలకు దిగుమతి చేసుకోవడం ఏమిటి? ఇప్పటికీ 40 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడిన దేశం విషతుల్యమైన జీఎమ్ పంటలను దిగుమతి చేసుకో వలసిన అవసరమేమిటి? ట్రంప్ సర్కార్ కోరిన ఈ హిరణ్యాక్ష వరాలకు భారత్ తలాడించలేదు.ఆయన నోబెల్ బహుమతి పిచ్చికి భారత ప్రభుత్వం సహకరించలేదన్న దుగ్ధ కూడా అమెరికా అధ్యక్షుడిని వేధిస్తున్న దట! ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే కాల్పుల విరమణకు ఒప్పు కున్నామని భారత్ ఒక మాట అధికారికంగా చెబితే తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశ. భారత్ – పాక్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని చాలాకాలంగా భారత్ అంగీరించడం లేదు. ఒక దేశాధినేత నోబెల్ పిచ్చిని తీర్చడం కోసం తన దేశ సార్వభౌమాధికారంతో రాజీపడడానికి భారత్ అంగీకరించలేదు. ఇటువంటి రాజీ పట్ల పాక్కు ఎటు వంటి అభ్యంతరమూ లేదు. ట్రంప్ కోరుకుంటున్న ప్రకటనను పాక్ మిలిటరీ చీఫ్ అసీఫ్ మునీర్ చేశారు. దాంతో మునీర్ను పొగడ్తల్లో ముంచడమే గాక ఆయన్ను వైట్హౌస్లో భోజనానికి ప్రత్యేకంగా ట్రంప్ ఆహ్వానించారు.ఏకధ్రువ ప్రపంచం నుండి బహుధ్రువ ప్రపంచం వైపు మానవాళి అడుగులు వేస్తున్న కీలకమైన మలుపులో భారతదేశం తన ప్రయోజనాల కోసం అనుసరించవలసిన విదేశీ విధానంపై కేంద్ర సర్కార్కు ఇప్పటికే ఒక స్పష్టత ఉన్నది. అంతర్జాతీయ సంబంధాల్లో సిద్ధాంతాల పాత్ర ప్రచ్ఛన్న యుద్ధంతోపాటే కరిగిపోయింది. భౌగోళిక రాజకీయ అవరోధాలున్న సందర్భా ల్లోనూ ఉభయతారకంగా నెగ్గుకురావడానికి అవసరమైన వ్యూహాలకు మన విదేశాంగ విధానం పెద్దపీట వేస్తున్నది. విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ దీర్ఘకాలం పాటు దౌత్యవేత్తగా పనిచేశారు. ఆ అనుభవ సారాన్ని రంగరించి, ప్రభుత్వ ఆలోచనల్ని కూడా కలబోసి ‘ది ఇండియా వే’ (భారత్ మార్గం : అనిశ్చిత ప్రపంచంలో అనుసరణీయ వ్యూహాలు) అనే పుస్తకాన్ని రాశారు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అనుసరించదగిన వ్యూహాలపై అందులో చర్చించారు. భారత విదేశాంగ విధానం ఇప్పుడీ తాజా పంథాలోనే కొనసాగు తున్నట్టు కనిపిస్తున్నది.ఇంకెంతోకాలం అగ్రరాజ్యంగా అమెరికా మనలేదని, డాలర్ పెత్తనానికి కూడా రోజులు దగ్గరపడినట్టేనని పలువురు ఆర్థిక నిపుణులు జోస్యం చెబుతున్నారు. ట్రంప్ చర్యలు ఈ పరిణామాన్ని వేగవంతం చేయగలవని అంచనా వేస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని ‘జీ–7’ దేశాల పాశ్చాత్య కూటమిని ఆర్థిక రంగంలో ‘బ్రిక్స్’ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) ఇప్పటికే అధిగమించడాన్ని ఇందుకు రుజువుగా వారు చూపెడుతున్నారు. వచ్చే ఏడాది ‘బ్రిక్స్’ కూటమికి భారత్ నాయకత్వం వహించబోతున్నది. భౌగోళిక రాజకీయాలతోపాటు పలు అంశాలపై వైరుద్ధ్యాలున్న రెండు అతిపెద్ద దేశాలను (భారత్ – చైనా) వ్యూహాత్మక స్నేహం వైపు నడిపించిన ఘనత ట్రంప్దేనని అమెరికన్ నిపుణులే విమర్శి స్తున్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తర ణను అడ్డుకోవడానికి అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా లతో కలిసి ఏర్పడిన ‘క్వాడ్’ కూటమి తాజా పరిణామాలతో నిర్వీర్యమైనట్టే! గల్వాన్ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్యన ఏర్పడిన ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి అవసరమైన కొన్ని చర్య లను రెండు దేశాలూ ఇప్పటికే తీసుకోవడం ఆరంభించాయి. మన విదేశాంగ మంత్రి జైశంకర్ జిన్పింగ్ను కలిశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి వచ్చి మంతనాలు జరి పారు. భారత యాత్రికుల కోసం మానస సరోవరం మార్గాన్ని చైనా తెరిచింది. చైనాకు విమానయానాలను భారత్ పునరు ద్ధరించింది. చైనాలోని తియాంజిన్లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. శనివారం నాడాయనకు చైనాలో ఆత్మీయ స్వాగతం లభించింది. భారతదేశపు శాస్త్రీయ సంగీత నృత్యా లతో చైనా యువతీ యువకులు ఆయన్ను అలరించారు. అమె రికా పెత్తందారీతనానికి వ్యతిరేక వేదికను ఈ సదస్సు బలో పేతం చేసే అవకాశం ఉన్నది.ఆదివారం నాడు చైనా అధ్యక్షుడు షీ–జిన్పింగ్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ద్వైపాక్షిక సమస్యలు, సంబంధాలపై వారి మధ్య చర్చలు జరగవచ్చు. ఎస్సీఓ శిఖ రాగ్ర సభకు అమెరికా బద్ధ శత్రువైన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హాజరవు తున్నారు. ఈ నేతలతో కూడా మోదీ చర్చలు జరిపే అవకాశం ఉన్నది. రష్యాతో మనది చెక్కుచెదరని దశాబ్దాల స్నేహబంధం. ఇరాన్తో మనకున్న అనుబంధానికి శతాబ్దాల చరిత్ర ఉన్నది. ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో భారత్ కొత్త మార్కెట్లకు విస్తరించడం కోసం అందివచ్చిన వేదికలన్నిటినీ ఉపయోగించుకుంటుంది. ఈ ప్రయాణంలో భారత్ వైఖరి వేగిర పడిన చందంగా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఎస్సీఓ సమావేశం ముగిసిన తర్వాత బుధవారం నాడు బీజింగ్లో మరో భారీ ర్యాలీని చైనా నిర్వహిస్తున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాద శక్తులను (ముఖ్యంగా జపాన్ సామ్రాజ్యవాదం) ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఎస్సీఓ సభకు హాజరయ్యే దేశాలన్నీ ఈ ర్యాలీకి హాజరవుతున్నా భారత్ మాత్రం జపాన్ పట్ల స్నేహభావంతో హాజరు కావడం లేదు. పైగా తియాంజిన్ సదస్సుకు ముందు రెండు రోజులపాటు ప్రధాని మోదీ జపాన్లో పర్యటించారు. రెండు దేశాల మధ్య టెక్నాలజీ రంగంలో పలు ఒప్పందాలు కుదిరాయి. జపాన్ కూడా భారత ప్రధానికి ఘనమైన స్వాగతాన్నే ఏర్పాటు చేసింది. జపనీయులు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ ఆయనకు ఆహ్వానం పలికి ఆకట్టుకున్నారు.ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఒక అభివృద్ధి చెందిన దేశం హోదా వైపు అడుగులు వేయడానికి ఆచరణా త్మకమైన, వివేకవంతమైన విదేశాంగ విధానం ఒక్కటే సరి పోతుందా? దేశీయంగా అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామా? అనే విషయాలను సమీక్షించుకోవలసిన సమయమిది. జీఎస్టీ శ్లాబుల కుదింపు, స్వదేశీ వాడకం ఉద్యమానికి ప్రధాని పిలుపు నివ్వడం ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో తీసుకున్న చర్యలే కావచ్చు. వాటివల్లనే స్వదేశీ మార్కెట్ బలపడుతుందా? మన దేశ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉంటే అమెరికా, ఐరోపా దేశాల ఉమ్మడి బలంతో సమానంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థను సృష్టించుకోగలగడమే చైనా విజయ రహస్యంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. చైనా ఆర్థికాభివృద్ధి పంథా ఒక హైబ్రిడ్ మోడల్. అది పూర్తిస్థాయి పెట్టుబడిదారీ విధానం కాదు. సోషలిస్టు విధానమూ కాదు. ప్రభుత్వ నియంత్రణకు లోబడిన పెట్టుబడి పూర్తి లాభాపేక్షతో కాకుండా సామాజిక వృద్ధికి కట్టుబడి ఉంటుంది. ఈ ఆర్థిక విధానం ఫలితంగా కోట్లాది మంది పేదరికం సంకెళ్ళను తెంచుకొని ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలిగారు. మనం మాత్రం సమాజంలో తీవ్ర అసమానతలకూ,పేదరికానికీ ఒక ముఖ్య కారణ మైన ప్రైవేటీకరణ బాట వెంటనే ఇంకా పరుగులు తీస్తున్నాము. ఈ బాట ఇంకెంతమాత్రమూ పేదరికాన్ని నిర్మూలించలేదనీ, అసమానతల్ని పోగొట్టలేదనీ ఇప్పటికే రుజువైంది. దేశీయంగా బలమైన మార్కెట్ను నిర్మించుకోగలిగినప్పుడే రాచవీధిలో పట్టపుటేనుగు నడిచినంత ఠీవిగా అంతర్జాతీయ సంబంధాల్లో నడవగలం. ఎలుకల మొట్టికాయలు అప్పుడు ఏమీ చేయలేవు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అమెరికన్ బ్రాండ్ టాయిలెట్లో ఉంది.. యూఎస్ కీలక నేత సెటైర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల విషయంలో స్వదేశం నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రంప్ చర్యలను ఇప్పటికే పలువురు నేతలు తప్పుపట్టగా.. తాజాగా ఆ లిస్టులో అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా చేరిపోయారు. ట్రంప్ సుంకాల నిర్ణయాల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్లో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ చర్యలు అమెరికాకు తీరని నష్టం కలిగిస్తోంది. మిత్ర దేశాలతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు అమెరికాకు భాగస్వామిగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. పలు దేశాలు అమెరికాను తమకు విఘాతం కలిగించే దేశంగా చూస్తున్నారు. ట్రంప్ చర్యలు చైనాకు అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్ తప్పుల కారణంగా భారత్ కూడా చైనా వైపు చూస్తోంది.అమెరికాకు మిత్ర దేశమైన భారత్పై పెద్ద మొత్తంలో సుంకాలు విధించడంతో.. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో, భారత్.. బీజింగ్తో భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్లో ఉంది. భారత్పై ట్రంప్ భారీ వాణిజ్య దాడి చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా ఢిల్లీ ఇప్పుడు చైనాతో కలవాలని చూస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో.. భారత్పై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. “The American brand globally is in the toilet. Look at India. Trump has executed a massive trade offensive against them. Now, India is thinking shit we have to go sit down with China to hedge against America,” says former US NSA Jake Sullivan on the Bulwark podcast pic.twitter.com/x6bHureqpk— Shashank Mattoo (@MattooShashank) August 29, 2025 -
ఏనుగును ఎలుక ఢీకొడుతున్నట్టుగా ఉంది
వాషింగ్టన్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు భారత్ను శిక్షించాలనే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ఆ దేశానికే ఎసరు తెస్తున్నాయి. భారత్ పట్ల అమెరికా వైఖరిపై ట్రంప్ ప్రభుత్వం సొంత ఆర్థిక వేత్తలనుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. భారత్పై అమెరికా సుంకాల చర్యలు ఏనుగును ఎలుక పిడికిలితో ఢీకొట్టినట్టుగా ఉందని అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వ్యక్తిలా అమెరికా వ్యవహరిస్తోందని, కానీ తనను తానే దహించుకుంటోందని విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు బ్రిక్స్ కూటమిని పోషిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. బ్రిక్స్ను విజయవంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా అమెరికా అభివృద్ధి చేస్తోందని గుర్తు చేశారు. కాగా, భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై రష్యా టుడేకు ఇచి్చన ఇంటర్వ్యూలో వోల్ఫ్ మాట్లాడారు. బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తోంది.. ‘భూమిపై అతిపెద్ద దేశం భారత్. సోవియట్ యూనియన్ కాలం నుంచే అమెరికాతో భారత్కు బలమైన సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ మర్చిపోతున్నారు. భారత్కు అమెరికా మార్కెట్ గేట్లు మూసేస్తే.. ఆ దేశం తన ఎగుమతులను విక్రయించడానికి ఇతర దేశాలను వెదుక్కుంటుంది. చమురును అమ్ముకునేందుకు రష్యా ఇతరత్రా మార్కెట్లను సిద్ధం చేసుకున్నట్లే.. భారత్ కూడా ఇతరత్రా మార్కెట్లను తయారు చేసుకోగలదు. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ కూటమిలోని చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాల వాటా 35 శాతం దాకా ఉంది. జీ7 దేశాల జీడీపీ వాటా 28 శాతమే. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలు బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తాయి. పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారుస్తాయి’అని వోల్ఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా దిగుమతిదారులకూ ప్రమాదం.. ‘ప్రస్తుతం భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో వస్తువులు, సేవలను చౌకగా పొందుతున్న కంపెనీలు అమెరికాకు తరలే అవకాశమే లేదు. అందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించవు. ఇప్పటికే అమెరికాలో కొత్త ఉద్యోగాలు లేవు. సుంకాల వల్ల అమెరికన్ ఎగుమతిదారులూ రిస్్కను ఎదుర్కొంటున్నారు. వాళ్లు విదేశీ మార్కెట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాకు ట్రిలియన్ డాలర్ల అప్పులున్నాయి. విదేశీ అప్పులపై అమెరికా ఇంకా ఎంతకాలం నిలువగలదనేది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా అప్పులపై వడ్డీల భారం పెరిగిపోతుంది. తద్వారా అమెరికా బలహీనపడుతుంది’అని వోల్ఫ్ విశ్లేషించారు. బ్రిక్స్ దేశాలకు బెదిరింపులు.. బ్రిక్స్ పది దేశాలతో కూడిన సమూహం. ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యుదేశాలుగా ఉన్నాయి. ఈ కూటమి పాశ్చాత్య ఆర్థిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. అయితే.. ట్రంప్ అనేక సందర్భాల్లో బ్రిక్స్ను వేగంగా అంతరించిపోతున్న ఒక చిన్న సమూహంగా తోసిపుచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరిలో ఏకంగా బ్రిక్స్ చచి్చపోయిందన్నారు. డాలర్ను కాదని ఉమ్మడి కరెన్సీని సృష్టించడానికి ప్రయతి్నస్తే.. సభ్య దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు. -
ఇగో పెంచిన పగ
రెండోసారి అమెరికా గద్దెనెక్కింది మొదలు, అన్ని దేశాలతోనూ గిల్లికజ్జాలతో తంపులమారిగా, ప్రపంచానికే పెను బెడదగా తయారయ్యారు ట్రంప్. మరీ ముఖ్యంగా భారత్ మీదనైతే మితిమీరిన ప్రతీకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్తో సంధి కుదిర్చే యత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించిందన్న కోపంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. అందుకోసం ఏకంగా తాను అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అన్న వాస్తవాన్ని కూడా పక్కన పెట్టారు. అహంకార (ఇగో) ధోరణితో వ్యవహరిస్తున్నారు. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్ర రాజ్యాల్లో ఏ దేశంపైనా లేనివిధంగా భారత్పై తాజాగా ఏకంగా 50 శాతం సుంకాలు విధించడం వ్యక్తిగత కసి తీర్చుకునే ప్రయత్నాల్లో భాగమే. – అమెరికా ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశానికే చెందిన ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ పలుగురాళ్లతో నలుగు పెట్టింది. భారత్ విషయంలో కొద్ది నెలలుగా ఆయన ప్రదర్శిస్తూ వస్తున్న కురచ బుద్ధిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టింది. ‘‘ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్తో తలెత్తిన యుద్ధ పరిస్థితులను చల్లబరిచేందుకు మధ్యవర్తిత్వం చేస్తానంటే ససేమిరా అంటూ భారత్ తిరస్కరించడాన్ని ట్రంప్ నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బతిమాలినా, బెదిరించినా, చివరికి పదేపదే బ్లాక్మెయిలింగ్కు దిగినా మోదీ సర్కారు దిగి రాలేదని, తనకు అణుమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదని ఆయనలో కడుపుమంట నానాటికీ పెరిగిపో తోంది. ఇరుదేశాల మధ్య చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించి, తనను తాను శాంతిదూతగా చిత్రించుకుని చిరకాల స్వప్నమైన నోబెల్ శాంతి బహుమానం సాధించాలన్న కలలకు అడ్డంగా గండి కొడుతోందన్న ఆగ్రహం పూర్తిస్థాయిలో కట్టలు తెంచుకుంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై భారత్ ఎంత ప్రముఖ దేశంగా వెలిగిపోతోందో తెలిసి కూడా ట్రంప్ ప్రదర్శిస్తున్న ప్రతీకార వైఖరి ఇరుదేశాల నడుమ పూడ్చలేనంతటి అగాధానికి దారి తీస్తోంది. అధ్యక్ష స్థానంలో ఉన్న నాయకుని వ్యక్తిగత ఇగో భారత్, అమెరికా ద్వైపాక్షిక బంధానికే పెను ముప్పుగా పరిణమిస్తోంది’’అంటూ తాజా నివేదికలో నిర్మొహమాటంగా కడిగిపారేసింది.భారత్ ‘తగ్గేదేలే’!ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో, తక్షణం కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే భారీగా సుంకాలు బాదుతానంటూ బెదిరించి భారత్, పాక్ నడుమ అణుయుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ కొద్ది నెలలుగా పదేపదే గొప్పలకు పోతుండటం, ఆ వ్యాఖ్యలను మోదీ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ద్వంద్వంగా ఖండిస్తూ వస్తుండటం తెలిసిందే. పాక్ పూర్తిగా కాళ్ల బేరానికి వచ్చి, స్వయానా మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి పదేపదే ప్రాధేయపడ్డ కారణంగానే ఆ దేశంతో కా ల్పుల విరమణకు అంగీకరించినట్టు కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది కూడా. అలాగే కశ్మీర్ విషయంలో కూడా మధ్యవర్తిత్వానికి ట్రంప్ ఎంతగానో ఉబలాటపడ్డారు. తన సమక్షంలో చర్చలు జరపండంటూ భారత్, పాక్కు పదేపదే బాహాటంగా పిలుపులు కూడా ఇచ్చారు. ఈ విషయంలో మూడో శక్తి ప్రమేయాన్ని ఎన్నటికీ, ఏ విధంగానూ అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అందుకు ఒళ్లు మండి ట్రంప్ సుంకాలు బాదుతున్నా ‘తగ్గేదే లే’దంటోంది.మన ‘సాగు’పైనా గురి!వ్యవసాయ రంగంలో అమెరికా జోక్యానికి మోదీ సర్కారు ససేమిరా అంటుండటం ట్రంప్కు కొరుకుడు పడని మరో విషయమని జెఫ్రీస్ నివేదిక తేల్చింది. భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో పూర్తిస్థాయిలో కాలు పెట్టాలని అగ్ర రాజ్యం చాలాకాలంగా ఉవ్విళ్లూరుతోంది. ఆ ఆకాంక్షలకు కేంద్రం శాశ్వతంగా తలుపులు మూసేసింది. దీనిపై కూడా ట్రంప్ అగ్గి మీద గుగ్గిలంగా ఉన్నట్టు జెఫ్రీస్ వెల్లడించింది. అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణి జ్య చర్చలు మార్చి నుంచీ నానుతుండటం వెనక ఇది కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు కూడా భావిస్తు న్నారు. ‘‘రైతులు, కూలీలు కలిపి భారత్లో 25 కోట్ల మందికి వ్యవసా యమే జీవనాధారం! భారత శ్రామిక శక్తిలో ఇది ఏకంగా దాదాపు 40 శాతం!!’’అని జెఫ్రీస్ నివేదిక చెప్పుకొచ్చింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కనెక్ట్.. యూకే
భారత్పై అమెరికా అనూహ్యమైన సుంకాలు విధిస్తోంది. ఇప్పటికే కొన్ని అమల్లోకి వచ్చాయి. మరి ప్రత్యామ్నాయం? అమెరికాతో దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తూనే.. భారత్ కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) ఒక మైలురాయిగా చెప్పాలి. ఎందుకంటే భారత్ నుంచి ఈ దేశానికి జరుగుతున్న ఎగుమతుల్లో 99 శాతం ఎఫ్టీఏ పరిధిలోకి రాబోతున్నాయి. బ్రిటన్ నుంచి వస్తున్న దిగుమతుల్లో 94 శాతాన్ని ఎఫ్టీఏలోకి తెస్తామని భారత్ హామీ ఇచ్చింది. మరి ఈ ఎఫ్టీఏతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏమైనా లాభం ఉంటుందా? ఏయే రంగాలకు లాభం? యూకే నుంచి ఏ రంగాల్లోకి పెట్టుబడులొచ్చే అవకాశం ఉంది? వాటన్నిటిపై యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్తో ‘సాక్షి’ ప్రతినిధి మంథా రమణమూర్తి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...ఎఫ్టీఏతో తెలుగు రాష్ట్రాలకు లాభమేంటి? యూకేతో విద్య, వ్యాపార, సాంస్కృతిక సంబంధాల్లో పెరుగుతున్న సానుకూలతను మూడేళ్లుగా చూస్తున్నా. ఈ దేశాల ప్రధానులు ఇటీవలే కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఈ పరిధి రక్షణ, టెక్నాలజీ, విద్య, వాతావరణ మార్పులన్నిటికీ విస్తరించనుంది. టెక్నాలజీ, ఫార్మా రంగంలో గట్టి పునాదులున్న హైదరాబాద్కు ఎఫ్టీఏతో చాలా లాభాలుంటాయి. ఏపీలో కొన్నేళ్లుగా పోర్టులు అభివృద్ధి చేస్తున్నారు. లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఎప్పట్నుంచో ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా ఉంది కదా. మరి ఎఫ్టీఏతో కొత్తగా ఏం జరుగుతుంది? నిజమే. రాష్ట్రాన్ని బట్టి అవకాశాలు మారుతాయి. ఏపీ విషయానికొస్తే ఎగుమతులపై దృష్టి పెట్టాలి. ఈ మధ్యే నేను విశాఖలో సీఐఐ సదస్సుకు వెళ్లా. సీఫుడ్, టెక్స్టైల్స్, కాఫీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచడంపై చర్చించాం. ఎఫ్టీఏతో టారిఫ్లు తగ్గుతాయి. సర్టిఫికేషన్ ప్రక్రియ తేలికవుతుంది. దీనివల్ల ఏపీ ఉత్పత్తులు యూకే మార్కెట్లోకి ప్రవేశించడం సులువవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ కీలకంగా మారనుంది. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాల్సి ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే కంపెనీలకు ఎఫ్టీఏ బాసటగా నిలుస్తుంది. ఇది ఏపీ వ్యవసాయ ఎకానమీని మారుస్తుంది. తెలంగాణ విషయానికొస్తే ఎఫ్టీఏ వల్ల సర్టిఫికేషన్ ప్రాసెస్ సులువవుతుంది. టారిఫ్లు తగ్గుతాయి. ఇది ఫార్మా, టెక్నాలజీ రంగాలకు కీలకం. టెక్నాలజీ నిపుణుల రాకపోకలు తేలికవుతాయి. ఈ ఒప్పందం దీర్ఘకాలంలో తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించొచ్చు? దీర్ఘకాలంలో ప్రత్యేకించి ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో వాణిజ్య పరిమాణం పెరుగుతుంది. యూకే ఫార్మా మార్కెట్ ప్రస్తుతం 30 బిలియన్ డాలర్లు. కానీ అందులో భారత్ వాటా 3 శాతమే. దీన్ని పెంచే అవకాశం తెలంగాణకు ఎక్కువ. ఒప్పందం వల్ల ఆర్ అండ్ డీతోపాటు ఏఐ వంటి కొత్త రంగాల్లో భాగస్వామ్యాలు ఏర్పడతాయి. ఏపీకి సంబంధించినంత వరకూ ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులదే అగ్రస్థానమవుతుంది. నిపుణుల రాకపోకలకు నిబంధనలు సడలిస్తున్నారా? అవును. స్వల్ప కాలానికి సంబంధించి ప్రత్యేకంగా కంపెనీల మధ్య రాకపోకలు తేలికవుతాయి. ఎందుకంటే ఇరుదేశాల్లోనూ సోషల్ సెక్యూరిటీ చెల్లించాలనే నిబంధనను ఉండదు. కంపెనీలకిది చాలా పెద్ద ఊరట. యూకే నిపుణుల్ని ఇక్కడికి రప్పించాలన్నా, ఇక్కడి వారిని అక్కడికి పంపాలన్నా ఆయా కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రాకపోకలు పెరుగుతాయి.మరి యూకే నుంచి చౌక ఉత్పత్తులొచ్చి ముంచేయకుండా ఇక్కడి వ్యాపారాలను ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలను దెబ్బతీయకుండా ఒప్పందంలో తగిన జాగ్రత్తలుంటాయా?భారత్కే కాదు. యూకేకు కూడా ఎంఎస్ఎంఈ రంగమే వెన్నెముక. ఏ ఒప్పందంలోనైనా సున్నితమైన రంగాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా ఉంటాయి. డెయిరీ, చేనేత లాంటి రంగాలకు భద్రత ఉంటుంది. ఉదాహరణకు యూకే నుంచి డెయిరీ ఉత్పత్తులను తీసుకుంటే భారత్లో తయారుకాని స్పెషాలిటీ చీజ్ (పనీర్) వంటి వాటికే అనుమతి ఉంటుంది. చేనేతకు యూకే నుంచి పోటీ ఉండదు. ఎందుకంటే యూకేలో చేనేత లేదు. ఈ ఒప్పందంతో భారత చేనేతకు యూకే ఫ్యాషన్ మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి. మరి ఫుడ్ ప్రాసెసింగ్లో కొత్త టెక్నాలజీలు కావాలి కదా? యూకే కంపెనీలు అందిస్తాయా? కచ్చితంగా. యంత్రాలు, టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. ఇక్కడి కంపెనీలు ఇప్పటికే ఈ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అలాంటి పెట్టుబడుల్ని ప్రోత్సహించే వేదికను ఎఫ్టీఏ అందిస్తుంది. దీనివల్ల భారత కంపెనీలు యూకేతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. ఒప్పందం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం 25% పెరుగుతుందని యూకే అంచనా వేస్తోంది. వాటిలో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత ఉండొచ్చు?రాష్ట్రాలవారీగా చెప్పడం కష్టం. కానీ బాగా లబ్ధి పొందే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉంటాయి. ఉదాహరణకు ప్రస్తుతం భారత్ నుంచి యూకేకు ఎగుమతవుతున్న సీఫుడ్లో ఏపీ వాటా 2.25 శాతమే. ఎఫ్టీఏ వల్ల సర్టిఫికేషన్ ప్రక్రియ తేలికవుతుంది కనుక ఏపీకి విస్తృత అవకాశాలుంటాయి. నిజానికి ఎఫ్టీఏ వల్ల సుంకాలు తగ్గటమే కాదు. సరి్టఫికేషన్ కూడా తేలికవుతుంది. త్వరగా పాడైపోయే సీఫుడ్ లాంటి వాటికిది ఆక్సిజన్. అందుకే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) కూడా చాలా ఆశాభావంతో ఉంది.ఫుడ్ ప్రాసెసింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లున్నారు? ఇది కీలక రంగం. ఎందుకంటే భారత్ ప్రస్తుతం తన ఆహార దిగుబడిలో 10 శాతాన్నే ప్రాసెస్ చేస్తోంది. తగినన్ని పెట్టుబడులతో విలువను జోడిస్తే కాఫీ, సీఫుడ్తోపాటు పలు వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేయొచ్చు. యూకేతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఏపీ ఇప్పటికే యూఎస్, చైనాకు ఎగుమతి చేస్తోంది. సర్టిఫికేషన్ ప్రక్రియను సరళం చేయడం ద్వారా యూకే మార్కెట్ను వేగంగా అందుకోవచ్చు.సంప్రదాయేతర ఇంధనాలు, ఏరోస్పేస్, హైదరాబాద్ స్టార్టప్లలోకి ఎక్కువ పెట్టుబడులొస్తాయా? గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుతోపాటు ఏరోస్పేస్, ఇంజనీరింగ్ రంగాల్లో భాగస్వామ్యాలను ఇప్పటికే చాలా యూకే కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఎఫ్టీఏతో భాగస్వామ్యాలు పెరుగుతాయి. యూకే ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ అనేది యూకే–ఇండియా ప్రాజెక్టులకు మద్దతిచ్చే ప్రధాన వనరుగా ఉంటుంది. మరి కార్మికులు, పర్యావరణం, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రతికూలతలేమైనా ఉంటాయా? ఈ ఒప్పందంలో అవినీతి నిరోధక, వినియోగదారుల రక్షణ, పర్యావరణం, లింగబేధంపై ప్రత్యేక చాప్టర్లున్నాయి. వాటన్నిటినీ చేర్చి భారత్ చేసుకున్న తొలి ఎఫ్టీఏ ఇది. కార్మికుల్ని, పర్యారణాన్ని పణంగాపెట్టి వాణిజ్య విస్తరణ జరగదనడానికి ఇదే నిదర్శనం. మరి ఈ ఒప్పందంతో రానున్న అవకాశాలపై చిన్నచిన్న వ్యాపారవేత్తలకు అవగాహన ఎలా? భారత ఎగుమతిదారులకు బాసటగా డీజీఎఫ్టీతోపాటు సీఐఐ, ఎఫ్టీసీసీఐ, కామర్స్ చాంబర్ వంటి పారిశ్రామిక సమాఖ్యలు సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఇరుదేశాల వ్యాపార బృందాలు అవకాశాలపై అవగాహన కల్పిస్తాయి. ఇది పూర్తిగా అమల్లోకి రావడానికి ఒక ఏడాది పడుతుంది. -
మిత్ర లాభం
అంతా సవ్యంగా ఉన్న రోజుల్లో భిన్న దేశాలతో దౌత్య సంబంధాలు సాఫీగా సాగి పోతాయి. కానీ సవాళ్లు ఎదురయ్యే కాలంలో వాటిని నిలబెట్టుకోవటం, కొత్త బంధాలు ఏర్పర్చుకోవటం సులభం కాదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి కారణంగా భారత్–అమెరికా సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్లో రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. ఈ నెల 31న, ఆ మర్నాడూ చైనాలోని తియాన్జిన్లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో కూడా ఆయన పాలుపంచుకుంటారు. జపాన్తో మనకు చిరకాల మైత్రి ఉంది. మన స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ)ని స్థాపించి పోరాడినప్పుడు అన్ని విధాలా చేయూతనందించింది జపానే. స్వాతంత్య్రానంతరం ఆ బంధం మరింత బలపడింది. రెండో ప్రపంచ యుద్ధ పరిసమాప్తి అనంతరం లాంఛనంగా 1951 సెప్టెంబర్ 8న శాన్ఫ్రాన్సిస్కో శాంతి ఒప్పందం కుదిరినప్పుడు జపాన్కు పాక్షిక సార్వభౌమత్వం మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను మన దేశం తీవ్రంగా వ్యతిరేకించి సంతకం చేసేందుకు నిరాకరించింది. అందుకు జపాన్ ఈనాటికీ మన పట్ల కృతజ్ఞతగా ఉంటుంది. తొలిసారి 2014లో ఎన్డీయే సర్కారు ఏర్పడినప్పుడే మోదీ జపాన్ను సందర్శించారు. ఈ దశాబ్ద కాలంలో ఇరు దేశాల సంబంధాలూ మోదీ అన్నట్టు ఎన్నో రెట్లు పెరిగాయి. మన దేశంలో ప్రస్తుత జపాన్ పెట్టుబడుల విలువ 4,200 కోట్ల డాలర్లు. దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్కతా మెట్రో రైలు ప్రాజెక్టులు జపాన్ ఆర్థిక సహకారంతో సాకారమయ్యాయి. ఢిల్లీ–ముంబై పారిశ్రామిక వాడ, సెమీకండక్టర్లు తదితరాలపై జపాన్ ముద్ర బలంగా ఉంది. ముంబై–అహ్మదాబాద్ మధ్య సాకారం కానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అత్యాధునిక ఈ–10 రకం బుల్లెట్ రైలును అందించాలని జపాన్ నిర్ణయించింది. వచ్చే పదేళ్లలో మన దేశంలో జపాన్ పెట్టుబడుల్ని పది లక్షల కోట్ల యెన్ల(6,800 కోట్ల డాలర్ల) స్థాయికి తీసుకెళ్లాలని మోదీ, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయించటం, పెట్టుబడులతోపాటు నవీకరణ, పర్యావరణం, ఆరోగ్యం తది తరాల్లో కలిసి పనిచేయాలనుకోవటం... రాగల అయిదేళ్లలో భిన్న రంగాల నిపుణుల సేవలు పొందేందుకు పరస్పరం అయిదు లక్షల మందిని బదలాయించుకోవాలను కోవటం భారత్, జపాన్ల మైత్రి పటిష్ఠతకు నిదర్శనం. ఈ క్రమంలో సహజంగానే సవాళ్లుంటాయి. స్వేచ్ఛాయుత, శాంతియుత, సంపద్వంత ఇండో–పసిఫిక్ ఆవిర్భవించాలన్న నినాదం అమెరికా ఛత్రఛాయలో ఏర్పడింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంత సరిహద్దుల విషయంలో చైనాతో జపాన్కు తగాదా లేకున్నా, దాని దూకుడు పెద్ద సమస్యగా మారింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల జపాన్కు ఎగుమతుల సమస్య ఏర్పడుతోంది. చైనాను కట్టడి చేయాలన్న బృహత్తర పథకానికి ఈ వివాదం తోడ్పడుతుందని అమెరికా భావించి మనల్ని అందులో కీలక భాగస్వామిని చేసింది. సుంకాల వివాదంలో ఇది ఎటు పోతుందన్న ఆందోళన జపాన్కు సహజంగానే ఉంటుంది. అయితే తమ వైఖరి మారబోదని మోదీ చెప్పటం జపాన్కు ఊరటనిచ్చే అంశం. ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరి చైనాకు కంటగింపుగానే ఉండొచ్చు. జపా న్తో సంబంధాలు సుహృద్భావంతో ఉండగా, చైనాతో సంబంధాలు అందుకు భిన్నం. సుంకాల వివాదం నేపథ్యంలో భారత్ దగ్గరవుతుందన్న అంచనా చైనాకుంది. ఎస్సీవో శిఖరాగ్ర సదస్సుకు మోదీ వెళ్తారా వెళ్లరా అనే సంశయం మొదట్లో ఉన్నా... రష్యా చొరవతో అది సాధ్యపడుతోంది. ఇది సాన్నిహిత్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాలి. చైనా ఇప్పటికే ఎరువులు, అరుదైన ఖనిజాలు, సొరంగాల తవ్వకంలో తోడ్పడే యంత్ర సామగ్రి ఎగుమతులపై ఉన్న నిషేధాలు తొలగించటానికి సూత్రప్రాయంగాఅంగీకరించింది. మోదీ చైనా పర్యటనలో ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది. చైనాతో మన సంబంధాలు బలపడే సూచనలుండగా, ట్రంప్ సైతం చైనాతో సన్నిహితమై దక్షిణాసియాలో పలుకుబడి పెంచుకోవాలనుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన వ్యూహాత్మక ఆధిక్యతను నిలబెట్టుకుంటూ జపాన్, చైనాలతో సఖ్యత కుదుర్చుకోవటం దౌత్యపరంగా మనకు పెను సవాలే. మోదీ దీన్ని ఎలా ఛేదించగలరో చూడాలి. -
ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి సమాధానం!..అంచనాలు మించిన భారత్ జీడీపీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద ప్రతీకార సుంకాలను విధించడం మాత్రమే కాకుండా.. 'ఇండియా డెడ్ ఎకానమీ' అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి భారత్ గట్టి సమాధానం చెప్పింది. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో జీడీపీ అంచనాలను అధిగమించి 7.8% వృద్ధిని నమోదు చేసింది. దీనిని నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ (NSO) శుక్రవారం విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది.కేంద్ర గణాంకాల విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్ధిక వ్యవస్థ 7.8 శాతంగా నమోదైంది. గత ఐదు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.2026 మొదటి త్రైమాసికంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందింది. ఇది జీడీపీ వృద్ధికి దోహదపడింది. అంతే కాకుండా.. మైనింగ్ రంగం, తయారీ, విద్యుత్ రంగాల వృద్ధి కూడా దేశ ఆర్ధిక వ్యవస్థకు బాగా దోహదపడ్డాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో.. భారత్ ముందు వరుసలో ఉంది అనడానికి.. తాజాగా విడుదలైన గణాంకాలే నిదర్శనం. దీన్నిబట్టి చూస్తే భారత్ మరింత వేగంగా వృద్ధి చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.Real #GDP has witnessed 7.8% growth rate in Q1 of FY 2025-26 over the growth rate of 6.5% during Q1 of FY 2024-25.@PMOIndia @Rao_InderjitS @PIB_India @_saurabhgarg@mygovindia @NITIAayog @PibMospi pic.twitter.com/nQw8Iwo9sG— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) August 29, 2025 -
భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
టోక్యో: భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. చైనాలో జరగనున్న ఎస్సీవో (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) సమ్మిట్ కోసం చైనా తియాంజిన్ నగరానికి వెళ్లనున్నారు.అంతకంటే ముందే చైనా పర్యటనపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోదీని ఆ దేశ ప్రముఖ జాతీయ దినపత్రిక ‘యోమియురి షింబున్’ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో అంతర్జాతీయంగా ఆర్ధిక ఒడిదుడుకులు కొనసాగుతున్న తరుణంలో భారత్-చైనాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇరు దేశాలు పరస్పర గౌరవం, ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కలిసి ముందుకు సాగాలి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు తియాంజిన్కి వెళ్లనున్నట్లు చెప్పిన మోదీ.. గతేడాది కజాన్లో జరిగిన ఓ సమావేశం తర్వాత ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని తెలిపారు.భారత్, చైనా వంటి రెండు పెద్ద దేశాల మధ్య స్థిరమైన, అనుకూలమైన సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత్-చైనా కలిసి పనిచేయడం ద్వారా ఆర్థిక స్థిరత సాధించవచ్చని మోదీ పేర్కొన్నారు.ప్రధాని మోదీ శనివారం సాయంత్రం చైనాలోని తియాంజిన్ చేరతారు. ఆదివారం ఉదయం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో 40 నిమిషాల పాటు సమావేశం జరగనుంది. సోమవారం ఎస్సీవో ప్రధాన సమావేశం జరుగుతుంది.ఈ క్రమంలో 2020 నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలను పునరుద్ధరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
నోరుపారేసుకున్న మహువా
కోల్కతా: సంచలనాలకు మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరో వివాదానికి తెరతీశారు. దేశంలోకి యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అడ్డుకోలేకపోతున్నారని, అందుకు శిక్షగా ఆయన తల నరికేయాలని తేల్చిచెప్పారు. శుక్రవారం పశి్చమ బెంగాల్లోని నాడియా జిల్లాలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పొరుగుదేశం బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబాట్లు జరుగుతున్నాయని చెప్పారు. సరిహద్దుల్లో రక్షణ భద్రత కేంద్ర హోంశాఖ మంత్రిగా పదవిలో ఉన్న అమిత్ షాదేనని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ పౌరుల రాకను అడ్డుకొనే సత్తా లేని అమిత్ షా ఆ నెపాన్ని పశి్చమ బెంగాల్ ప్రభుత్వంపై వేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. చొరబాటుదార్లు వస్తున్నారంటూ తరచుగా గొంతు చించుకుంటున్న ఆయనకు వారిని అడ్డుకొనే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. అక్రమ వలసల కారణంగా దేశంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయంటూ ఆగస్టు 15న స్వాతంత్య్రం దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్ షా చప్పట్లు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారని గుర్తుచేశారు. దేశ సరిహద్దులను రక్షించేవారు లేకపోతే పొరుగుదేశాల నుంచి జనం వస్తూనే ఉంటారని, మన తల్లులు, అక్కాచెల్లెమ్మలపై కన్నేస్తారని, మన భూములు ఆక్రమించుకుంటారని పేర్కొన్నారు. సరిహద్దులను కాపాడలేకపోవడంతో చొరబాట్లను ఆపలేనందుకు అమిత్ షా తల నరికి టేబుల్పై పెట్టాలని మహువా మొయిత్రా పేర్కొన్నారు. బంగ్లాదేశ్తో సంబంధాలు క్షీణించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని అన్నారు. గతంలో మన మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు శత్రుదేశంగా మారిపోయిందని చెప్పారు. మొయిత్రాది తాలిబన్ మైండ్సెట్: బీజేపీ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్ షాపై ఆమె చేసిన విమర్శల వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. మొయిత్రాది తాలిబన్ మైండ్సెట్, తాలిబన్ కల్చర్ అని ధ్వజమెత్తారు. ఆమెపై కొత్వాలీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొయిత్రా జిహాదీ ఉగ్రవాదుల తరహాలో మాట్లాడారని బీజేపీ అధికార ప్రతనిధి షెహజాద్ పూనవాలా ఆరోపించారు. మొయిత్రా వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. రాజకీయంగా ఎదిరించాలి తప్ప హింసను ప్రేరేపించేలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై నిలదీయడంలో తప్పులేదన్నారు. వ్యక్తిగతంగా మాటల దాడి చేయొద్దని సూచించారు. ఎవరైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని స్పష్టంచేశారు. Shameful and disgraceful!How can an elected MP like Mahua Moitra stoop so low as to use violent language against Shri Amit Shah ji?Such statements are not just an insult to democracy but also a dangerous encouragement of hatred and violence in public life.We strongly condemn… pic.twitter.com/X9XS5IA9zW— Lakshmi Singh (@LakshmiSinghBJP) August 29, 2025 -
ట్రంప్ ‘నోబెల్’ ఆశలపై నీళ్లు చల్లిన భారత్!!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం చేస్తున్న నిర్విరామ ప్రయత్నాలపై భారత్ నీళ్లు చల్లిందా? ఆ కోపంతోనే భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. ట్రంప్ తన వ్యక్తిగత స్వార్ధం కోసమే భారత్పై టారిఫ్లు విధిస్తున్నారని,ఇందులో దేశ ప్రయోజనాలే లేవంటూ అమెరికా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ ఓ నివేదికను విడుదల చేసింది.ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ల మధ్య ఘర్షణను ఆపేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించారు. అందుకు భారత్ ఒప్పుకోలేదు. ఫలితంగా తనకు దక్కాల్సిన నోబెల్ ఫ్రైజ్ భారత్ వల్లే దూరమైందన్న అక్కుసతో ఈ టారిఫ్లు విధించినట్లు జెఫరీస్ తన నివేదికలో హైలెట్ చేసింది.భారత్పై ట్రంప్కు వ్యక్తిగత కోపం ఉంది. కాబట్టే ప్రపంచంలోనే భారత్పై అత్యధికంగా 50శాతం సుంకాలు విధించినట్లు జెఫరీస్ నివేదిక పేర్కొంది. తద్వారా దీర్ఘకాలంగా అమెరికా-భారత్ల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయనే అభిప్రాయ వ్యక్తం చేసింది. భారత్-పాక్ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేలా మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్ ముందుకు రాగా.. అందుకు భారత్ ఒప్పు కోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ భారత్పై సుంకాలు విధిస్తున్న విషయాన్ని వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ చిన్న ఘర్షణ జరిగినా.. అక్కడ వాలిపోయి పంచాయితీలు చేస్తున్నారు.తనని తాను ప్రపంచానికి శాంతి దూతగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో తన శత్రువు బరాక్ ఒబామా.. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తొమ్మిది నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి అందుకోగా లేనిది తన విషయంలో ఎందుకు సాధ్యం కాదని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. -
క్వాడ్ టు బుల్లెట్ ట్రైన్ .. జపాన్లో ప్రధాని మోదీ చర్చలివే
న్యూఢిల్లీ: అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య సుంకాల ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. జపాన్తో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకునే వార్షిక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ చేరుకున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ ‘క్వాడ్’పై దృష్టి సారించనున్నారు.ప్రధాని మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో పాటు 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్కు చెందిన మీడియా ప్లాట్ఫామ్ నిక్కీ ఆసియా, రాబోయే దశాబ్దంలో భారతదేశంతో ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంచడానికి జపాన్ 10 ట్రిలియన్ యన్ (68 బిలియన్ అమెరికన్ డాలర్ల) పెట్టుబడి పెడుతుందని తెలిపింది. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, పర్యావరణం మరియు వైద్యంతో సహా బహుళ రంగాలో ఇది ఊతం కానున్నదని పేర్కొంది. ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ‘ఎక్స్’లో.. ‘ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు, ఆర్థిక,పెట్టుబడి సంబంధాల పరిధిని, ఆశయాన్ని విస్తరించేందుకు, ఏఐ,సెమీకండక్టర్లతో సహా నూతన సాంకేతిక రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తామని అన్నారు.ప్రపంచంలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు, ఇండో-పసిఫిక్ దేశాలకు నిధులు, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఏర్పడిన వ్యూహాత్మక సమూహమే ‘క్వాడ్’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘క్వాడ్’లో భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ భాగస్వాములుగా ఉన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించిన తర్వాత క్వాడ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జపాన్ వాణిజ్య సంధానకర్త రియోసీ అకాజావా చివరి నిమిషంలో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగే జపాన్.. అమెరికాకు అందించే 550 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీని ఖరారు చేయడంలో ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. Landed in Tokyo. As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new avenues of collaboration.… pic.twitter.com/UPwrHtdz3B— Narendra Modi (@narendramodi) August 29, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్యాకేజీ మొత్తాన్ని తమ ఇష్టానుసారం పెట్టుబడి పెట్టడానికి వినియోగిస్తామని పేర్కొనగా,జపాన్ అధికారులు అందుకు విభేదించారు. తమ పెట్టుబడి పరస్పర ప్రయోజనాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రధాని మోదీ ఈ పర్యటనలో టోక్యోలోని ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీ, బుల్లెట్ రైళ్ల కోచ్లను నిర్మించే తోహోకు షింకన్సెన్ ప్లాంట్ను కూడా సందర్శిస్తారు. భారతదేశ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో టోక్యో భాగస్వామ్యం పై ఇరు దేశాలు చర్చించనున్నాయి. భారత్- జపాన్ మధ్య రక్షణ సహకారాన్ని మరింతగా పెంచాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారు. జపాన్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఆహ్వానం మేరకు టియాంజిన్లో జరిగే షాంఘై శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. -
సుంకాలపై ‘సమష్టి’ పోరు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మన దేశంపై ఉన్న అదనపు సుంకాల భారాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాలకూ బుధ వారం నుంచి మరో 25 శాతం చేరింది. క్షణానికో రకంగా, రోజుకో విధంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడైన ట్రంప్ చివరికి ఏం చేస్తారోనన్న ఉత్కంఠ అందరిలో ఉండేది. మూర్ఖత్వం విచక్షణను ఎరుగదు. తన ఆదేశాలను ధిక్క రిస్తూ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయటం వల్లే ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా చెప్పుకొంటోంది. మనల్ని మించి ముడిచమురు కొంటున్న చైనాకు ఆ తర్కం ఎందుకు వర్తించదో ఇంతవరకూ అది సంజాయిషీ ఇవ్వలేకపోయింది. అసలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే తెరవెనకుండి యూరప్ దేశాల ద్వారా ఉక్రెయిన్ను రష్యాపై ఉసిగొల్పిందీ, ఆ యుద్ధానికి అంకు రార్పణ చేసిందీ తానే. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా... లేక ఇక వెనక్కు తగ్గాలని ఉక్రెయిన్ను కోరటం ద్వారా శాంతికి దోహదపడాల్సింది కూడా తానే. కానీ ఆ పని చేయకపోగా ఆ యుద్ధం కొనసాగటానికి మనమే బాధ్యులమంటూ దబాయిస్తోంది. దాన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణిస్తూ వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో నోరు పారేసుకున్నారు. మనం చమురు కొనటం వల్లే రష్యా యుద్ధం కొనసాగుతోందని తప్పుడు భాష్యానికి దిగారు. ఏ రకంగా చూసినా ప్రపంచంలో సకల అవలక్షణాలకూ బాధ్యత వహించక తప్పని అమెరికాయే రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి కూడా కర్త, కర్మ, క్రియ. ఏకకాలంలో భిన్న సూచనల్ని పంపి అవతలి పక్షాన్ని గందరగోళపరచటం అమెరికాకు అలవాటైన విద్య. ఈ దబాయింపులకు ముందురోజే ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ‘చివరకు రెండు దేశాలూ ఒక్కటవుతాయి’ అని మాట్లాడారు. అందరికన్నా ముందు ఏప్రిల్లోనే వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలెట్టిన భారత్... మే 1 లేదా జూన్ 1 కల్లా దానిపై సంతకాలు చేయాల్సిందని ఆయన చెబుతున్నారు. చర్చించు కుని ఒప్పందంపై సంతకాలు చేస్తారు తప్ప, తమకు నచ్చినట్టు రాసుకుని, ఒప్పందం పూర్తయినట్టేనని చెబితే అంగీకరించేదెవరు? ఇలాంటివి మాఫియా సామ్రాజ్యాల్లో చెల్లుబాటవుతాయి. నాగరిక ప్రపంచంలో సాధ్యపడదు. భారత్–అమెరికా సంబంధాలు ఆదినుంచీ సంక్లిష్టమైనవే. ఇందుకు అమెరికా తనను తానే నిందించుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాకిస్తాన్కు సాయపడుతూ, మనల్ని చీకాకు పరిచేందుకు నిరంతరం ప్రయత్నించేది. ఆ దశ దాటి ఇరు దేశాల మధ్యా స్నేహం చిగురించి, దృఢమైన బంధంగా మారి దశాబ్దాలు దాటుతోంది. కానీ పాకిస్తాన్ను దువ్వటం ఆపలేదు. ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడల్లా మన దేశం డిమాండ్ చేస్తే తాత్కాలికంగా ఆర్థిక సాయం ఆపటం లేదా ఆయుధ సామగ్రి ఎగుమతి నిలిపినట్టు కనబడటం, ఆ తర్వాత పునరుద్ధరించటం అమెరికా దురలవాటు. మొన్నటికి మొన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యపై ఒక్క మాట మాట్లాడటానికి నోరు పెగలని ట్రంప్, భారత్–పాక్ ఘర్షణల్ని ఆపానని స్వోత్కర్షకు పోవటం ఇప్పటికీ ఆపలేదు. సరిగదా పాక్ ఆర్మీ చీఫ్కు ఘన ంగా మర్యాదలు చేశారు. కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు నుంచి రావాలన్న ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించటం, తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులనూ అనుమతించాలన్న ఒత్తిడికి అంగీకరించకపోవటం ట్రంప్ కడుపుమంటకు కారణం. కానీ ముడిచమురు సాకు చెబుతున్నారు. భారత్లో 46 శాతం మంది సాగు రంగంపై ఆధారపడతారు. అమెరికాలో ఇది ఒక్క శాతమే. ఆ ఒక్కశాతం కోసం దేశ జనాభాలో సగంమంది ఆధారపడే రంగాన్ని ధ్వంసం చేయాలట! ఏమైతేనేం తాజా సుంకాల భారం మన దేశంనుంచి పోయే 66 శాతం ఎగుమతులపై తీవ్ర ప్రభావమే చూపగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఈ ఏడాది, వచ్చే ఏడాది మన వృద్ధిపై 0.8 శాతం కోత పడవచ్చంటున్నారు. రత్నాభర ణాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలు, స్టీల్, రొయ్యలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనీ, ఈ రంగాల్లో అనిశ్చితి ఏర్పడుతుందనీ అంచనా. లక్షలాదిమంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు కలగవచ్చు కూడా. ఈ ఎగుమతుల్ని వేరే దేశాలకు మళ్లించగలిగితే నష్టాన్ని తగ్గించుకోగలం. అదృష్టవశాత్తూ మనది ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు. అందుకే దేశ ప్రజానీకమంతా ఒక్కటై పట్టుదలగా ఇక్కడి ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తే ఈ గండాన్ని గట్టెక్కడం కష్టం కాదు. -
కొనసాగిన టారిఫ్ టెన్షన్
ముంబై: అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి రావడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ దాదాపు ఒకశాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండడం సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. సెన్సెక్స్ 706 పాయింట్లు నష్టపోయి 80,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 211 పాయింట్లు కోల్పోయి 24,501 వద్ద ముగిశాయి. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. బలహీనంగా మొదలైన సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. వినిమయ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.ఒక దశలో సెన్సెక్స్ 774 పాయింట్లు క్షీణించి 80,013 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 24,482 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలహీనపడి 87.58 వద్ద స్థిరపడింది. టారిఫ్ సంబంధిత అనిశ్చితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.⇒ సూచీల పతనంతో రెండు రోజుల్లో రూ.9.69 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.445.17 లక్షల కోట్లకు దిగివచి్చంది. గురువారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది. ⇒ ట్రాన్స్ఫార్మర్ ఉపకరణాల తయారీ సంస్థ మంగళ్ ఎల్రక్టానిక్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.561)తో పోలిస్తే బీఎస్ఈలో అరశాతం డిస్కౌంట్ రూ.558 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 6% క్షీణించింది, చివరికి 4.50% నష్టంతో రూ. 534 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,475.31 కోట్లుగా నమోదైంది. -
‘పరిస్థితులు ఎలా ఉన్నా..’.. సుంకాలపై అమెరికా ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతదేశం పై అమెరికా 50 శాతం సుంకాలు అమలు చేయడంపై ఇండియాలోని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించింది. తాజాగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ సుంకాల విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని, పరిస్థితులు ఎలా ఉన్నా, తాము కలిసే పనిచేస్తామని పేర్కొన్నారు. సుంకాల అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు.భారత్పై విధించిన 50 శాతం సుంకాలను అమెరికా బుధవారం (ఆగస్టు 27) నుంచి వీటిని అమలు చేస్తోంది. రష్యా నుంచి ఇకపై ముడి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా భారత్కు సూచించింది. అయితే భారత్.. అమెరికా మాటను లెక్క చేయలేదు. దీంతో అమెరికా అదనపు సుంకాలతో బెదిరింపులకు దిగింది. సుంకాలు అమలవుతున్న సమయంలో అమెరికా ఆర్థిక మంత్రి సామరస్య పూర్వక వ్యాఖ్యలు చేశారు.అమెరికా విధించిన అదనపు సుంకాల కారణంగా భారత్లోని పలు కంపెనీలు మూతపడతాయని, లక్షల మంది ఉపాధి కోల్పోతారనే వాదన వినిపిస్తోంది. తాజాగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ .. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అమెరికా, ఇండియా చివరకు కలిసి పని చేస్తాయని పేర్కొనడం గమనార్హం. బెసెంట్ ఓ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా, భారత్ మధ్య ఇంకా వాణిజ్య ఒప్పందం పూర్తి కాలేదన్నారు. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైతే.. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమన్నారు. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నా చివరకు అమెరికా, ఇండియా కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్నత స్థాయి సంబంధాలన్నాయని, అమెరికా విధించిన సుంకాల మీద చర్చలు జరిపేందుకు భారత్ వెంటనే ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. అయినా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదని, మే, జూన్ నాటికి ఇరు దేశాలు ఓ అభిప్రాయానికి వస్తాయని భావించామన్నారు. అయితే డీల్ ఇంకా పూర్తి కాలేదన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం కారణంగా ఇండియా లాభాలు ఆర్జిస్తున్నదన్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. త్వరలోనే సుంకాల అంశంపై ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉందన్నారు. -
చైనా-భారత్-పాక్.. కనివినీ ఎరుగని రీతిలో విధ్వంసం!
దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనాలను ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలు మూడు దేశాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా.. ఈ ఏడాది మాత్రం అసాధారణంగా నమోదు అవుతోంది. అందుకు కారణాలను పరిశీలిస్తే.. భారీ వర్షాలు భారత్, పాకిస్తాన్, చైనా దేశాలను పెను విపత్తులుగా ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్, మెరుపు/ఆకస్మిక వరద(Flash Floods) ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఇవే ఈ మూడు దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించాయి. జమ్ము కశ్మీర్ ఈ ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది మరణించడం చూస్తున్నదే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి.ఇక.. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్ ప్రాంతాలు వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు నెలల కాలంలో వర్షాలు, వరదలతో పాక్లో 700 మంది మరణించినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో చిన్నారులే అధికంగా ఉన్నారు. చైనాలో రెండు నెలల వర్షాల వల్ల ₹1.84 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం.. దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. మాన్సూన్ ట్రఫ్ అంటే..మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియా దేశాల్లో వర్షాకాలంలో వర్షాల పంపిణీకి దిశానిర్దేశం చేసే వాతావరణ రేఖ. ఇది సాధారణంగా పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రఫ్ చుట్టూ తక్కువ ఒత్తిడి ఏర్పడిన ప్రాంతాల(Low Pressure Formation) వల్ల వర్షాలు కురుస్తుంటాయి. చైనా, పాక్, భారత్లో ఈ సీజన్లో వర్షాలకు కారణం ఇదే. (తక్కువ ఒత్తడి ప్రాంతాల్లోకి చుట్టుపక్కల నుంచి గాలి ప్రవహిస్తుంది. ఆ గాలి ఆవిరితో నిండిన మేఘాలను తీసుకువస్తుంది. ఇది వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే మాన్సూన్ కాలంలో తక్కువ ఒత్తడి ప్రాంతాలు భారీ వర్షాలకు కారణమవుతాయి). అయితే..వాతావరణ మార్పు, నగరీకరణ, అటవీ నాశనం వంటి మానవ చర్యలు ఈ ట్రఫ్ మార్గాన్ని అస్థిరంగా మార్చి వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొండ ప్రాంతాలు, నదుల నుంచి నీటి ఆవిరి ఎక్కువగా ఉంటోంది. ఈ ఆవిరి మేఘాల్లో చేరి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తక్కువ సమయంలో భారీ వర్షంగా కురుస్తుంది. ఇది వర్షపాతం తీవ్రతను పెంచుతూ, ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పైపెచ్చు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆవిరి పెరిగి, తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ✅ పరిష్కార మార్గాలు• ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: ప్రజలకు సమయానికి సమాచారం అందించాలి. అయితే అది కష్టతరంగా మారుతోంది• వరద మైదానాల పునరుద్ధరణ: సహజ జల ప్రవాహ మార్గాలను తిరిగి స్థాపించాలి.• స్థిరమైన నగరీకరణ ప్రణాళికలు: పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి.• అటవీ విస్తరణ: వర్షపు నీటిని శోషించే వనరుల పెంపు.• ప్రజల అవగాహన: వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులపై ప్రజలలో చైతన్యం కలిగించాలి.దక్షిణాసియాలో వర్ష విపత్తులు మామూలు ప్రకృతి ధోరణుల కంటే ఎక్కువగా మానవ చర్యల ప్రభావంతో ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పును అర్థం చేసుకుని, దీన్ని ఎదుర్కొనే విధానాలను అభివృద్ధి చేయడం అత్యవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. -
భారత్పై టారిఫ్ల ఎఫెక్ట్: కంపెనీల దివాళా, లక్షల ఉద్యోగాలు ఉష్కాకి!!
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధింపులపై ప్రముఖ భారత మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త టారిఫ్లతో సంస్థలు దివాళా తీయడం, వాటిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయేందుకు దారితీయనుందని అన్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా 50శాతం విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలపై మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా స్పందించారు.అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారత్ 50శాతం టారిఫ్ చెల్లిస్తోంది. వీటివల్ల భారత్పై కొంతకాలం ప్రతికూల ప్రభావం పడుంది. పలు సంస్థలు దివాళా తీయోచ్చు. షార్ట్ టర్మ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే అంచనా వేశారు.అదనపు టారిఫ్ కారణంగా భారత్ ఉత్పత్తి రంగంపై 30 నుంచి 40 బిలియన్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అజయ్ బగ్గా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ఫలితంగా సమీప భవిష్యత్తులో భారతదేశ జీడీపీ 0.5 శాతం నుంచి 1శాతం వరకు తగ్గుతుంది. రూ.5.25 లక్షల కోట్లు నష్టం వాటిల్లనుంది. అలా అని పరిస్థితులు ఇలాగే స్థిరంగా ఉంటాయా? అని ప్రశ్నిస్తే.. లేదనే సమాధానం చెబుతున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఆగస్టు 7న నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించింది. నేటి నుంచి మరో 25శాతం అదనపు సుంకాలు.. మొత్తంగా 50శాతం అదనపు సుంకాలు చెల్లిస్తూ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్ను చెల్లిస్తున్న దేశాల జాబితాలో చేరినట్లైంది.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం కొనసాగేందుకు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లే కారణమని ట్రంప్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లను ఆపకపోతే భారత్ ఎగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికల్ని భారత్ భేఖాతరు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు టారిఫ్ చెల్లించాలని ప్రకటించారు. దీంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటినుంచి అమల్లోకి వచ్చాయి. ఆ దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్ ఎగుమతులపై 50శాతం భారం పడుతోంది. -
ఫోన్ చేసి బెదిరించా.. మోదీ యుద్ధం ఆపేశారు: ట్రంప్
భారత్ ఎంత ఖండిస్తున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మారడం లేదు. భారత్-పాక్ ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారాయన. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం వైట్హౌస్లో కేబినెట్ సమావేశం జరిగింది. మీడియా బ్రీఫింగ్లో ఆయన ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన రోజు జరిగిన పరిణామాలంటూ స్పందించారు. ‘‘ఆ రోజు ఓ కఠినమైన వ్యక్తి.. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. పాకిస్థాన్తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించాను. ఆ తర్వాత పాక్తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పుఉందని భావించా. అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్, పాక్తో వాణిజ్యఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ టారిఫ్లతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. నేను మరుసటిరోజు దాకా సమయం ఇస్తే.. ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.US President #DonaldTrump once again doubles down on his claim of playing a catalyst in the truce between India and Pakistan.I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said, What's going on with you and Pakistan?, says Trump.For the latest… pic.twitter.com/8eQ86ZU0ql— NDTV Profit (@NDTVProfitIndia) August 27, 2025భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ గత కొంతకాలంగా ట్రంప్ చెబుతూనే ఉన్నారు. ఈ ప్రకటనలో విపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ వాదనను భారత్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్థాన్ మధ్య మిలిటరీ స్థాయి చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. అలాగే.. మోదీ–ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఇక..ఆ మధ్య జీ7 సదస్సు నిమిత్తం కెనడా వెళ్లిన ప్రధాని మోదీ దీనిపై స్పందిస్తూ.. భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ‘‘పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్యఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశం పైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్-పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోం’’ అని నాడు అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టం చేశారు. అయినా కూడా ట్రంప్, అమెరికా అదే పాట పాడుతూ వస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ ఫోన్ కాల్స్కు మోదీ నో -
పవన విద్యుత్కు మహర్దశ
న్యూఢిల్లీ: భారత్లో పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాలు వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం 51 గిగావాట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యం ఉండగా.. 2030 నాటికి 107 గిగావాట్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ పవన విద్యుత్ మండలి (జీడబ్ల్యూఈసీ) తెలిపింది. 2030 నాటికి 100 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. భారత పర్యావరణ అనుకూల ఇంధన ఆకాంక్షలకు పవన విద్యుత్ కీలకంగా ఉండడమే కాకుండా, అంతర్జాతీయంగానూ ప్రభావం చూపిస్తున్నట్టు నివేదికలో పేర్కొంది. కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సెక్రటరీ సంతోష్ కుమార్ సారంగి సమక్షంలో ఈ నివేదికను జీడబ్ల్యూఈసీ విడుదల చేసింది. భారత్ ఇంధన పరివర్తనను తక్కువ ఖర్చుతో విజయవంతంగా సాధించేందుకు పవన విద్యుత్ సాయంగా నిలుస్తుందని తెలిపింది. పవన విద్యుత్ టర్బయిన్ల ఉత్పత్తి పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ అవసరాల్లో 10 శాతాన్ని భారత్ పరిశ్రమ తీర్చనుందని, 1,54,000 మందికి ఉపాధి కల్పించనుందని వెల్లడించింది. పరిశ్రమ గణాంకాల ప్రకారం గతేడాది భారత్ 3 గిగావాట్ల పవన విద్యుత్ ఎక్విప్మెంట్ను ఎగుమతి చేయగా, అంతర్జాతీయంగా ఎగుమతి మార్కెట్ పరిమాణం 117 గిగావాట్లుగా ఉంది. ఈ ఏడాది 135 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ ఎగుమతుల్లో 60 శాతం చైనా సమకూరుస్తోంది. 500 గిగావాట్ల సామర్థ్యం సాధిస్తాం.. 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తామని కేంద్ర నూతన, పనరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందులో 100 గిగావాట్లు పవన విద్యుత్ రూపంలో ఉంటుందన్నారు. భారత్ కేవలం శుద్ధ ఇంధన సదుపాయాలనే సమకూర్చుకోవడం లేదంటూ భవిష్యత్ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. 30 గిగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ ప్రాజెక్టుల అమలు వివిధ దశల్లో ఉన్నట్టు సంతోష్ కుమార్ సారంగి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకటించారు. వచ్చే కొన్నేళ్లలో ఇవి కార్యకలాపాలు మొదలు పెడతాయని చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది ఆరు నుంచి ఏడు గిగావాట్ల సామర్థ్యం అదనంగా కార్యకలాపాల్లోకి వస్తుందన్నారు. అమెరికా టారిఫ్లు పునరుత్పాదక ఇంధన ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చంటూ, భారత్ నుంచి అమెరికాకు సోలార్, విండ్ ఎగుమతులు పెద్దగా లేవన్నట్టు చెప్పారు. 2030 నాటికి ప్రపంచ విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే సగం ఉంటుందని, ఇందులో పవన విద్యుత్ వాటా 20–25 శాతం మేర ఉంటుందని ప్రపంచ పవన విద్యుత్ మండలి ఇండియా చైర్మన్ గిరీష్ తంతి తెలిపారు. -
స్వావలంబన సాధించగలమా?
స్వాతంత్య్రానంతరం 1950వ దశకం మొదటి అర్ధ భాగంలో ఆహార ధాన్యాలు, హెవీ ఇంజినీరింగ్ వస్తువులు, రవాణా పరికరాలు, యంత్రాలు, మెషిన్ టూల్స్, ఇతర మూలధన వస్తువుల దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడింది. స్వావ లంబన, స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభమైన మూడవ పంచ వర్ష ప్రణాళిక, ఆ తర్వాతి హరిత విప్లవం, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్లు సరైన ఫలితాలను అందించలేక పోయాయి. 2024–25లో వస్తు వాణిజ్య లోటు 282.3 బిలియన్ డాలర్లు కాగా, కరెంటు ఖాతా లోటు 23.3 బిలియన్ డాలర్లుగా నమోదవడాన్ని బట్టి, భారత్ వస్తు దిగుమతులపై అధికంగా ఆధారపడటం తేటతెల్లమవుతున్నది.తయారీకి దిగుమతులే ఆధారంతయారీ రంగాన్ని పటిష్ఠపరచడంతోపాటు భారత్ను ప్రపంచంలో ‘తయారీ, డిజైన్ హబ్’గా రూపొందించడానికి 2014 సెప్టెంబర్లో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రారంభమైంది. నియంత్రణ–విధానపరమైన అడ్డంకులు, లాజిస్టిక్స్–సప్లయ్ చెయిన్ వ్యవస్థ సమర్థంగా లేకపోవడం, ప్రైవేటు–విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో తక్కువ వృద్ధి, నైపుణ్యం గల శ్రామిక శక్తి లభ్యత తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో అధిక పోటీ కారణంగా మేక్ ఇన్ ఇండియా తన లక్ష్య సాధనలో వెనుకబడింది.సెమీ కండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో మొబైల్ ఫోన్ తయారీదారులు అధికంగా దిగుమతులపై ఆధార పడుతున్నారు. భారత్లో ఫోన్ల అసెంబ్లింగ్లో నిమగ్నమైన ఆపిల్, శామ్సంగ్, షావోమీ కంపెనీలు చైనా, తైవాన్, దక్షిణ కొరియా నుండి చిప్సెట్స్, డిస్ప్లే ప్యానల్స్, కెమెరా మాడ్యూల్స్ను దిగుమతి చేసు కుంటున్నాయి. కార్ల తయారీలో నిమగ్నమయిన టాటా,హ్యుండాయ్, మారుతి సుజుకీలు ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ, ఇంజిన్ కంట్రోల్ యూనిట్లను దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా నుండి సోలార్ సెల్స్, మాడ్యూల్స్ను పెద్ద సోలార్ పార్క్లు దిగు మతి చేసుకుంటున్నాయి. భారత్లో అవసరమైన ఆరోగ్య సంరక్షణ సాధనాలు 90 శాతం చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రపంచ మార్కెట్లో టెక్స్టైల్స్కు సంబంధించి భారత్ అతి పెద్ద ఎగుమతిదారునిగా నిలిచినప్పటికీ వీటి తయారీలో ఉపయోగించే సింథటిక్ ఫైబర్, ముఖ్య యంత్రాల కొరకు భారత్ దిగుమతులపై ఆధారపడుతోంది. టీవీ, లాప్టాప్స్, వాషింగ్ మెషిన్ ఉత్పత్తుల అసెంబ్లింగ్కు అవసరమైన చిప్స్, సెన్సార్స్, డిస్ప్లేలు కూడా దిగుమతి చేసుకుంటున్నవే.ఎరువుల ఉత్పత్తిని పెంచడమెలా?79వ స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా ప్రధాని ‘స్వయం సమృద్ధ భారత్’ను ప్రస్తావించారు. 2047 నాటికి అన్ని రంగాలలో ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ విజన్ను పేర్కొన్నారు. అయితే, దేశీయంగా వ్యవసాయ డిమాండ్ నేపథ్యంలో ఎరువులు ప్రధాన దిగుమతులుగా నిలిచాయి. 2024–25లో ఎరువు లకు డిమాండ్ 650 లక్షల టన్నులు కాగా, దేశీయంగా ఉత్పత్తి తక్కు వగా ఉండటంతో 170 లక్షల టన్నులకు పైగా దిగుమతి చేసు కున్నట్లు అంచనా. అధిక దిగుమతులపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకున్నప్పుడు వాణిజ్య లోటు తగ్గుతుంది. యూరియా, ఫాస్పటిక్, పొటాసిక్ ఎరువుల దిగుమతులను తగ్గించుకోవడానికి గ్యాస్ ఫీల్డ్స్ అధికంగా ఉన్న ప్రాంతాలలో నూతన ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే మూసివేసిన ఎరువుల కర్మాగారాలను తిరిగి ప్రారంభించడంతో పాటు నానో– ఫెర్టిలైజర్ టెక్నాలజీని ప్రోత్సహించాలి. బయో ఆధారిత, ఆర్గానిక్ ఎరువుల వినియోగం పట్ల రైతులలో అవగాహన పెంపొందించినట్లయితే రసాయన ఎరు వుల వినియోగం తగ్గుతుంది. ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి విదే శాలలో జాయింట్ వెంచర్స్ ఏర్పాటుతో పాటు ప్రపంచ ఎరువుల మార్కెట్లో ప్రధాన దేశాలుగా ఉన్న రష్యా, జోర్డాన్, కెనడాలతో దీర్ఘకాలిక ఒప్పందాలు అవసరం. ‘పునరుత్పాదక’ సమస్యలుజనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో 2040 నాటికి భారత్ శక్తి వినియోగం రెట్టింపు కాగలదని ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ’ అంచనా. భారత్ అవస్థాపిత విద్యుత్ సామర్థ్యం 2025 జూన్ నాటికి 476 గిగావాట్లకు చేరుకుంది. 2013 –14తో పోల్చినప్పుడు 2024–25లో విద్యుత్ కొరత తగ్గినప్పటికీ తలసరి వినియోగంలో 45.8 శాతం పెరుగుదల ఏర్పడింది. భారత్ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో థర్మల్ విద్యుత్ వాటా 50.52 శాతం కాగా, శిలాజేతర ఇంధనాల వాటా 49 శాతం. 2014–15లో భారత్ మొత్తం ఎనర్జీ వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం కాగా, 2025 జనవరి నాటికి 19.60 శాతానికి తగ్గింది. ‘వాణిజ్య బొగ్గు మైనింగ్’, ‘మిషన్ కోకింగ్ కోల్’ వంటి ప్రభుత్వ చర్యల వల్ల స్వదేశీ బొగ్గు ఉత్పత్తి పెరిగి, దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. కానీ 2030–2035 మధ్య బొగ్గుకు డిమాండ్ అధికంగా ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా. రాబోయే కాలంలో శక్తికి బొగ్గు ప్రధాన ఆధారంగా నిలిచే అవకాశం ఉన్నందువలన సౌర, పవన, జల విద్యుత్తు లాంటి పునరుత్పాదక శక్తి వనరులపై దృష్టి సారించాలి. శిలాజేతర ఇంధన ఆధారిత శక్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు చేరుకోవాలని లక్ష్యం. అవస్థాపనా సౌకర్యాల కల్పన, గ్రీన్ ఫైనాన్సింగ్, ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యా లను ప్రోత్సహించినప్పుడు ఆయా ఉత్పత్తులు పెరిగి శక్తి సప్లయ్ పెరుగుతుంది. పునరుత్పాదక శక్తి ఆధారాలు ఎదుర్కొంటున్న సమస్యలైన ట్రాన్స్మిషన్ మౌలిక వసతులు సరిపోయినంతగా లేకపోవడం, నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం, వాతావరణ మార్పులు, సౌర, పవన క్షేత్రాలు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ లాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి.అవసరమైన సంస్కరణలురక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఇటీవల ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ఎఫ్డీఐ పరిమితిని సరళీకరించడంతోపాటు దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యమి స్తోంది. 2020–24 మధ్య ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆయుధాల దిగుమతిలో భారత్ వాటా 8.3 శాతం. మందుగుండు సామగ్రిలో భారత్ 88 శాతం స్వయంసమృద్ధి సాధించింది. రక్షణ రంగంలో భవిష్యత్ ఒప్పందాలు, ప్రాజెక్టులకు సంబంధించిన ‘డిఫెన్స్ ఆర్డర్ పైప్లైన్’ స్వదేశీ రక్షణ ఉత్పత్తుల పెరుగుదలకు దోహదపడగలదు. రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా ‘మిలిటరీ–ఇండ స్ట్రియల్ కాంప్లెక్స్’ను అభివృద్ధి పరచాలి.ముఖ్య రంగాలలో నైపుణ్యం, పోటీతత్వం, స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం, కార్మిక సంస్కరణలు, కీలక పరిశ్రమలలో ప్రైవేటు కంపె నీలను అనుమతించడం లాంటి చర్యలు తీసుకున్నప్పుడే స్వావలంబన లక్ష్యం నెరవేరగలదు.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
పాక్ను అప్రమత్తం చేసి మానవత్వం చాటిన భారత్
-
12లక్షల కోట్ల నష్టం ముంచేసిన విలయం
-
పాక్పై అపార దయ చూపిన భారత్
ఇస్లామాబాద్: భారత్ తన పొరుగుదేశం పాకిస్తాన్ విషయంలో ఎంతో శాంతియుతంగా వ్యవహరిస్తున్నదనడానికి మరో నిదర్శనం మన ముందు నిలిచింది. ఇటీవలి కాలంలో భారత్-పాక్ మధ్య పెరిగిన దౌత్య ఉద్రిక్తతల నడుమ కూడా పాకిస్తాన్పై భారత్ దయ చూపింది. పాక్లో ప్రవహించే తావి నదిలో వరద పరిస్థితిపై ఇస్లామాబాద్ను హెచ్చరించింది.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)ను నిలిపివేసింది. అయినప్పటికీ భారత్ తన దయాహృదయాన్ని చాటుతూ.. తాజాగా ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ద్వారా తావి నది ఉధృతిపై పాక్ను అప్రమత్తం చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. అయితే ఇటు భారత్ అటు పాకిస్తాన్లు దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఈ వాదనలు నిజమైతే, ఉద్రిక్తతల దరిమిలా భారత్ తన దౌత్య మిషన్ను ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది.జమ్ములోని తావి నదిలో పెద్దఎత్తున వరదలు సంభవించే అవకాశం ఉందని భారత్.. పాకిస్తాన్ను హెచ్చరించిందని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ఆదివారం ఈ హెచ్చరికను తెలియజేసిందని సమాచారం. భారతదేశం అందించిన సమాచారం ఆధారంగానే పాకిస్తాన్ సంబంధిత అధికారులకు ఈ విషయం చేరవేసిందని తెలుస్తోంది. టిబెట్లో ప్రారంభమైన సింధూ నది ప్రవాహం పాకిస్తాన్ అంతటా ప్రయాణిస్తుంది. కశ్మీర్ మీదుగానూ వెళుతుంది.ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన సింధూ జల ఒప్పందం 1960లో కుదిరింది. ఇది భారత్- పాకిస్తాన్ మధ్య సింధూ నది, దాని ఉపనదుల వాడకాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ ఒప్పందం కింద భారతదేశానికి సింధూ నదీ వ్యవస్థ నుండి 20 శాతం నీరు, మిగిలిన 80 శాతం నీరు పాకిస్తాన్కు అందుతుంది. ఏప్రిల్ 22న చోటుచేసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్.. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. నాటి నుంచి ఈ నదికి సంబంధించిన మూడు ఉప నదులలోని నీటి మట్టాల డేటాను పాకిస్తాన్తో పంచుకోవడం ఆపివేసింది. అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఈ మూడు నదులలో నీటి మట్టం పెరుగుతున్నదని పాక్కు భారత్ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో, ఆ దేశం.. పంజాబ్, సింధ్ ప్రావిన్సులలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.వర్షాకాలంలో పాకిస్తాన్ అంతటా వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. వరదలు, భారీ వర్షాల కారణంగా పాక్లో ఇప్పటివరకూ 788 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా జనం గాయపడ్డారు. మృతులలో 200 మంది పిల్లలు, 117 మంది మహిళలు, 471 మంది పురుషులు ఉన్నారని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది. -
భారత్ రేటింగ్ యథాతథం
న్యూఢిల్లీ: భారత సార్వభౌమ రుణ రేటింగ్ను బీబీబీ మైనస్, స్థిరమైన అవుట్లుక్ వద్దే కొనసాగిస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. బలమైన ఆర్థిక వృద్ధికితోడు పటిష్టమైన విదేశీ మారకం నిల్వలు, విదేశీ రుణ భారం నియంత్రణలో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుంది. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతంగా ఉండొచ్చన్న తమ అంచనాలను ప్రతిపాదిత 50 శాతం అమెరికా టారిఫ్లు ప్రభావితం చేయొచ్చని తెలిపింది. గత రెండేళ్లలో వృద్ధి వేగం నిదానించినప్పటికీ పోటీ దేశాలతో పోల్చి చూసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నట్టు పేర్కొంది. భారత సావరీన్ రేటింగ్ను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఇటీవలే ‘బీబీబీ’కి అప్గ్రేడ్ చేయగా.. ఫిచ్ రేటింగ్స్ మాత్రం యథాతధ రేటింగ్ను కొనసాగించడం గమనార్హం. ఫిచ్ పేర్కొన్న బీబీబీ మైనస్ అన్నది పెట్టుబడుల్లో అతి తక్కువ గ్రేడ్ రేటింగ్. మరో రేటింగ్ సంస్థ మారి్నంగ్ డీబీఆర్ఎస్ సైతం భారత రేటింగ్ను బీబీబీకి అప్గ్రేడ్ చేస్తున్నట్టు ఈ ఏడాది మేలో ప్రకటించింది. రేటింగ్ను యథాతథంగా కొనసాగించినప్పటికీ, జీడీపీ వృద్ధి రేటు అంచనా 6.5 శాతంలో ఫిచ్ మార్పు చేయలేదు. బలమైన ప్రభుత్వ మూలధన వ్యయాలు, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం, పనిచేయగలిగిన అధిక జనాభా వంటి సానుకూలతలతో మధ్య కాలంలోనూ భారత జీడీపీ 6.4 శాతం వృద్ధిని కొనసాగిస్తుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. జీఎస్టీ తగ్గించడం పాజిటివ్: ప్రతిపాదిత జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణతో వినియోగం పెరుగుతుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. వృద్ధి రిస్్కలను ఇది కొంత వరకు తగ్గిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా భూమి, కార్మిక చట్టాలకు సంబంధించి కీలక సంస్కరణలకు ఆమోదం ఈ దశలో రాజకీయంగా కష్టమేనని అభిప్రాయపడింది. పలు దేశాలతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వాణిజ్య అవరోధాలు గణనీయంగానే ఉ న్నట్టు తెలిపింది. బీబీబీ రేటింగ్ గల పోటీ దేశాల కంటే భారత్కు అధిక ద్రవ్యలోటు, రుణ భారం ఉండడం రేటింగ్ పరంగా బలహీనతగా పేర్కొంది. తలసరి ఆదాయం తక్కువగా ఉండడం కూడా రేటింగ్ను పరిమితం చేస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ వివరించింది. -
భారతీయులకు రష్యా శుభవార్త
మాస్కో: భారతీయులకు రష్యా శుభవార్త చెప్పింది. పాశ్చాత్య దేశాలు వలస నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో.. రష్యా వీసా నిబంధనల్ని సడలించింది. భారతీయులకు ఊతం ఇచ్చేలా వీసా నిబంధనలు మార్చింది. తద్వారా రష్యాలోని పలు రంగాల్లో అనుభవజ్ఞులైన భారతీయులకు డిమాండ్ పెరిగింది. రష్యాలోని ప్రముఖ సంస్థల్లో ఎలక్ట్రానిక్స్,మెషినరీ విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇదే విషయాన్ని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ స్థానిక మీడియాకు వెల్లడించారు.రష్యాకు మ్యాన్పవర్.. భారతీయుల్లో నైపుణ్యం ఉంది.వాటికి అనుగుణంగా రష్యా వీసా నిబంధనలు మార్చింది. తద్వారా స్థానిక రష్యా కంపెనీలన్నీ భారతీయుల్ని నియమించుకుంటున్నాయి. ఇప్పటికే అధికమొత్తంలో రష్యాకు భారతీయులు వచ్చారు. వచ్చిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ, వస్త్ర రంగాలలో ఉన్నారు.వీటితో పాటు మెషినరీ, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో భారతీయుల డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు.రష్యాకు భారతీయల వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రాయబార కార్యాలయం తన సేవల్ని విస్తరించేందుకు మరింత ప్రయత్నిస్తుందని చెప్పారు. పాస్పోర్ట్లు అప్డేట్,అప్రూవల్ వంటి సేవలు వేగవంతం అవుతాయని తెలిపారు. -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాకిచ్చిన భారత్
-
భారత్పై సుంకాలు.. ట్రంప్ టార్గెట్ అదే: జేడీ వాన్స్
వాషింగ్టన్: భారత్పై అమెరికా సుంకాల విధింపుపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను అడ్డుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్పై ఒత్తిడి పెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదని వాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాన్స్ మాట్లాడుతూ..‘రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవడం ఈ చర్యల లక్ష్యం. అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం తర్వాత ఏర్పడిన అడ్డంకులు ఉన్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదు. రష్యాపై ట్రంప్ బలమైన ఆర్థిక ఒత్తిడిని తెచ్చారు.ఎలా అంటే.. భారత్పై అదనపు సుంకాలు విధించడం ద్వారా , చమురు నుంచి వచ్చే రష్యా ఆదాయాలు తగ్గిపోతాయి. రష్యా దాడులను ఆపివేస్తే, దానిని మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేర్చవచ్చని, కానీ దాడులు కొనసాగితే, అది ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే సందేశాన్ని ఇవ్వడానికి ట్రంప్ ప్రయత్నించారని అన్నారు. ఉక్రెయిన్పై బాంబు దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంభించారు. భారత్ ద్వితీయ సుంకాలను విధించడం కూడా ఇందులో భాగమని తెలిపారు.మరోవైపు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా విమర్శలు చేసింది. భారత వస్తువులపై ట్రంప్ సుంకాన్ని 50 శాతానికి రెట్టింపు చేయడం వల్ల భారత్-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదే సమయంలో రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేసే చైనాపై ట్రంప్ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో, ట్రంప్ తీరును పలు దేశాల నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
చికిత ‘పసిడి’ గురి
ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత స్వర్ణ పతకంతో మెరిసింది. కెనడాలోని విన్నీపెగ్లో ఆదివారం ఈ మెగా ఈవెంట్ ముగిసింది. అండర్–21 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చికిత విశ్వవిజేతగా అవతరించింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన చికిత ఫైనల్లో 142–136 పాయింట్ల తేడాతో దక్షిణ కొరియాకు చెందిన యెరిన్ పార్క్పై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్లో చికిత 142–133తో మొరిలాస్ డియాజ్ (స్పెయిన్)పై, క్వార్టర్ ఫైనల్లో 146–143తో పర్ణీత్ కౌర్ (భారత్)పై గెలుపొందింది. క్వాలిఫయింగ్ రౌండ్లో చికిత 687 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి మెయిన్ ‘డ్రా’లో నేరుగా రెండో రౌండ్కు ‘బై’ పొందింది. రెండో రౌండ్లో చికిత 143–140తో మా యువెన్ (చైనీస్ తైపీ)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 142–138తో జిమెనా ఎ్రస్టాడా (మెక్సికో)పై గెలిచింది. అండర్–21 మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత, పర్ణీత్ కౌర్, తేజల్లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 229–232తో టర్కీ చేతిలో ఓడిపోయింది. -
నిలుపుకోవాల్సిన బంధం
ఇండియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరుపారేసు కోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఆయన అక్కసు వెనుక ప్రతిసారీ ఒక భూ స్వామ్య పెత్తందారీ విధానం కనిపిస్తుంది. సుంకాలు, జరిమానాలను రక్షణ కవచంగా ధరించి ఆయన విమర్శలకు, బెదిరింపులకు దిగుతూంటారు. అమెరికా అధ్యక్షుడి వదరుబోతుదనంలో ఒక సామ్రాజ్య వాదిలో ఉండే దురహంకారం ప్రతిబింబిస్తూ ఉంటుంది.రష్యా చమురును ఒక బూచిగా చూపిస్తున్నారంతే. అలనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ధోరణి ఇప్పుడు అమెరికా వ్యవహార శైలిలో కనిపిస్తోంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమ పట్ల భారత దేశం అనుసరిస్తున్నట్లు చెబుతున్న సంరక్షణ విధానంపై నిజంగానే అమెరికా విభేదిస్తోందని మనకు ఎక్కడైనా మనసు పొరల్లో చిన్న సందేహం మిగిలి ఉంటే, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఉపయోగించిన భాషతో అది కాస్తా పటాపంచలైపోతుంది. ‘మహారాజా సుంకాలు’ అనే పద బంధాన్ని గమనిస్తే, భారత దేశాన్ని ప్రాచ్యవాద, పురాతన జాతివాద కళ్ళద్దాలతోనే నవారో చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈసారి ఆయన ‘పాములు ఆడించే వాళ్ళ’ ఉపమానాన్ని ఉపయోగిస్తారేమో! ఏదో ఒక పక్షం వైపు రావలసిందిగా భారతదేశాన్ని నేరుగానే హెచ్చరించారాయన. కొత్తగా ఉపయోగించిన మాటలతో భారతీయుల మనసును నవారో మరింత గాయపరచారు. క్రెమ్లిన్కి ‘లాండ్రోమాట్’గా ఆయన భారతదేశాన్ని అభివర్ణించారు. నిజానికి, అప్ప టికి కొద్ది రోజుల క్రితమే అలాస్కాలో వ్లాదిమీర్ పుతిన్కి ట్రంప్ అక్షరాలా ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికిన సంగతిని ఆయన సమయానుకూలంగా మరచినట్లుంది. అమెరికా ఆత్మవంచనమనం రష్యా ముడి చమురు కొని, శుద్ధి చేసిన తర్వాత, ఆ చమురును యూరప్ దేశాలు కూడా కొనుగోలు చేశాయి. అలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా మనం ‘లాభాలు గడిస్తున్నా’మని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించారు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిజంగా లబ్ధి పొందు తున్నది వారే! ఐరోపా దేశాలు అమెరికా నుంచి ఆయుధాలు కొని ఉక్రెయిన్కు లాభాలకు అమ్ముతున్నాయి. అందుకే అవి విక్రయిస్తున్న అన్ని ఆయుధాలపైనా (అదనపు వ్యయాలు, లాభం కింద) ట్రంప్ ప్రభుత్వం 10% మొత్తాన్ని తీసుకుంటోందని బిసెంట్ మరో ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. ఇండియా మాత్రం రష్యా చమురు కొనడం తమ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతూంటే... అదే వ్యక్తులు, పుతిన్ యుద్ధాన్ని మనం బలో పేతం చేస్తున్నట్లుగా నిందిస్తున్నారు. ఇక్కడ అమెరికా ఆత్మ వంచన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కపటత్వానికీ స్థిరమైన వాదన అవసరం.ఎవరో ఒక అధ్యక్షుడి చపలచిత్త ధోరణిని పట్టించుకోనక్కర లేదని, భారత–అమెరికా స్నేహ సంబంధాలు సుదీర్ఘమైనవి, గాఢ మైనవని వాదించేవారితో నేనూ ఏకీభవిస్తాను. కానీ, ట్రంప్కు అర్థ మయ్యే భాషలోనే ఆయనకు వ్యతిరేకంగా స్వల్పకాలిక చర్యనైనా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. అలా గని వాషింగ్టన్ ఇవ్వనిది చైనా మనకేదో దోచిపెడుతుందని కూడా నేను అనుకోవడం లేదు. చైనాను నమ్మవచ్చా?ట్రంప్ది దూకుడు తత్త్వం. చైనా సైనికంగా మనకి ప్రత్యర్థి. ట్రంప్వి అవాకులో చవాకులో బహిరంగంగానే ఉంటాయి. జిన్పింగ్వి పారదర్శకం కాని తెరవెనుక చర్యలు. పాకిస్తాన్ పట్ల ట్రంప్ మెతక వైఖరిని అర్థం చేసుకోవచ్చు. దాని పొగడ్తలకు ఆయన ఉబ్బి పోయాడు, లేదా అది ఇవ్వజూపిన ప్రయోజనాలకు ప్రలోభపడ్డాడు అనుకుందాం. కానీ, ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాకి స్తాన్తో చైనా చెట్టపట్టాలేసుకుని తిరిగింది.కనుక, ట్రంప్ను, ప్రస్తుత లోటుపాట్లను పక్కనపెట్టి అమెరికా – భారత్ స్నేహ సంబంధాన్ని కాపాడుకోవాలని కోరుకోవడంలో ఔచిత్యం ఉంది. ఇప్పటి అమెరికా స్పందన ఒకటే పాఠం నేర్పుతోంది. అది: ప్రపంచంలో ఓ మూలనున్న ప్రాంతంపై లేదా ఒకే దేశంపై ఆశలన్నీ పెట్టుకోవద్దు. అది ప్రమాదకరం.మనవాళ్లు ఏం చేస్తున్నట్టు?ట్రంప్ను భారత్ ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయింది అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ ఆగి పోవడంలో ట్రంప్ స్వోత్కర్షను సమర్థించనందుకా? ఆయన ‘ఇగో’ దెబ్బతిందా? ట్రంప్ మాజీ అంగరక్షకుడు ఒకరిని పాకిస్తాన్ తన లాబీయిస్టులలో ఒకడిగా చేర్చుకుందని చెబుతున్నారు. మనం అలా కాకుండా, లాంఛన పూర్వకంగా, సంయమనంతో దౌత్యం నెరప డమా? కానీ, నాకొకటే సందేహం. అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన గొప్ప వ్యక్తులు ఏమైపోయినట్లు? యాభై లక్షల మంది ఇండియన్–అమెరికన్ సమూహాన్ని ఒక చక్కని వలస వర్గానికి నమూనాగా తరచూ అభినందిస్తూ ఉంటారు. ఆ వర్గం నాయకులు పెద్ద టెక్, ఫినాన్షియల్ సంస్థలను నడుపు తున్నారు. విద్యా, విధాన నిర్ణాయక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఇండియా పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు చూసి వారికి ఒళ్ళు మండటం లేదా? స్వీయ నిర్ణయాలు తీసుకోవడం భారతదేశానికున్న సార్వభౌమాధికారమనే సంగతిని ట్రంప్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతే, ఆయన శ్వేత సౌధం నుంచి నిష్క్ర మించే నాటికి కాపాడుకోవాల్సినవి పెద్దగా ఏమీ మిగలవు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోండి.. భారత్కు నిక్కీ హేలీ సూచన
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితులపై అమెరికా రిపబ్లికన్ నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయం, చమురు కొనుగోళ్లపై లేవనెత్తిన అభ్యంతరాన్ని భారత్ సీరియస్గా తీసుకోవాలని సూచనలు చేశారు. ట్రంప్, మోదీ మధ్య ఇలాంటి పోరాటం దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చైనాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.భారత్కు నిక్కీ హేలీ మంచి మిత్రురాలిగా పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించి భారత్ను అమెరికా దూరం చేసుకోవడంపై నిక్కీ హేలీ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిక్కీ హేలీ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం ఉంది. రష్యా నుంచి చమురు విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్గా తీసుకోవాలి. దాని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా అమెరికాతో కలిసి పనిచేయాలి. వాణిజ్యంలో, రష్యా చమురుపై అభిప్రాయభేదాలు వంటివి పరిష్కరించుకోవడానికి బలమైన చర్చలు, సంప్రదింపులు అవసరం.India must take Trump's point over Russian oil seriously, and work with the White House to find a solution. The sooner the better. Decades of friendship and good will between the world's two largest democracies provide a solid basis to move past the current turbulence.…— Nikki Haley (@NikkiHaley) August 23, 2025ఇక, చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ మిత్రులుగా ఉండాలి అన్న అంశం చాలా ముఖ్యమైంది. దానిని ఏమాత్రం విస్మరించడకూడదు. చైనాను ఎదుర్కోవాలన్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ట్రంప్ నిర్ణయాలు విపత్కరంగా మారాయి. ప్రపంచంలో ఆరోవంతు జనాభాకు కేంద్రం భారత్. అత్యంత యువ జనాభాతో చైనాను దాటేసింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా, భారత్ మధ్య ఘర్షణల వాతావరణం నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య పోరు దురదృష్టకరమని అభివర్ణించారు. భారత్ లాంటి మిత్రదేశాలను ట్రంప్ దూరం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన దౌత్య ప్రయత్నాలు జరగకుండా, అల్టిమేటంలు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. గొప్ప దేశాలు ఎల్లప్పుడూ ప్రజలకు అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించవు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో చర్చలు పరస్పర సహకారం, గౌరవం ద్వారా జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆదేశాలు, ఒత్తిడితో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
జర్మనీతో పీ–75ఐ సబ్మెరీన్ ఒప్పందానికి కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ 75 ఇండియా(పీ–75ఐ)కింద ఆరు అత్యాధునిక జలాంతర్గాములను సమకూర్చుకునేందుకు జర్మనీతో చర్చలు జరిపేందుకు రక్షణ శాఖకు అనుమతి మంజూరు చేసింది. జాతీయ భద్రతా విభాగం, రక్షణ శాఖ అధికారుల మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జర్మనీ సంస్థతో ఈ నెలాఖరులోనే చర్చలు మొదలయ్యే అవకాశా లున్నాయని సమాచారం. కొత్తగా సమకూర్చుకునే ఆరు సబ్మెరీన్లలో ఎయిర్ ఇండిపెండెంట్ పొపల్షన్(ఏఐపీ)వ్యవస్థలుంటాయి. దీనివల్ల ఈ జలాంతర్గాములు కనీసం మూడు వారాలపాటు నీటి అడుగునే ఉండే సామర్థ్యముంటుంది. జర్మనీ సంస్థతో సంప్రదింపులను 8 నెలల్లో పూర్తి చేసి, ఒప్పందం ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ శాఖ, మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్)లు నిర్మించతలపెట్టిన తరువాతి తరం సబ్మెరీన్లకు ఏఐపీ సాంకేతికతే కీలకం. జర్మన్ సంస్థ నుంచి అందే ఈ సాంకేతికతతో దేశీయంగా సబ్మెరీన్లను డిజైన్ చేసుకుని, నిర్మించనున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక అవసరాల రీత్యా ఇటువంటి జలాంతర్గాముల అవసరం ఎంతో ఉందని నిపుణులు అంటున్నారు. వచ్చే పదేళ్లలో నేవీ నుంచి కనీసం పది పాతబడిన జలాంతర్గాములను విధుల నుంచి తప్పించే అవకాశముంది. -
ఇబ్బందైతే కొనకండి!
న్యూఢిల్లీ: భారత్ నుంచి ముడి చమురు సహా పలు రకాల శుద్ధిచేసిన ఉత్పత్తులను కొనడం మీకు ఇబ్బంది అనుకుంటే అస్సలు కొనొద్దని ట్రంప్ సర్కార్కు భారత విదేశాగ మంత్రి జైశంకర్ తెగేసి చెప్పారు. ట్రంప్ పాలనాయంత్రాంగం అనుక్షణం స్వప్రయోజనాలతో వాణిజ్యంచేస్తూ భారత్ సైతం అదేపనిచేస్తుంటే తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని జైశంకర్ వ్యాఖ్యానించారు. పలుదేశాలపై ఎడాపెడా పన్నుల పిడిగుద్దులు కురిపించే ట్రంప్ అవలంభించే విదేశాంగ విధానం పూర్తిగా అగమ్యగోచరంగా తయారైందని ఎద్దేవాచేశారు. ఢిల్లీలో జరుగుతున్న ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’లో ఆయన అతిథిగా పాల్గొని పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ‘‘మా సరుకు కొనాలని మీపై ఒత్తడి చేయట్లేదు కదా. మీరు భారతీయ చమురు ఉత్పత్తులను కొనకపోతే వేరే దేశాలు కొంటాయి. సరుకులను యూరప్ అమ్ముతుంది. అమెరికా కూడా అమ్ముతుంది. భారత్ సైతం అమ్ముతుంది. మావి వద్దనుకుంటే, సమస్య అనుకుంటే కొనకుంటే సరిపోతుందికదా’’అని జైశంకర్ వ్యాఖ్యానించారు.‘అమెరికా సంప్రదాయక విదేశాంగ విధానానికి ట్రంప్ తిలోదకాలిచ్చారు. ఏ దేశం గురించి ఆయన ఏం అనుకుంటున్నారో ఎవ్వరికీ తెలీదు. అసలు ట్రంప్ సారథ్యంలో అమెరికా విదేశాంగ విధానం అగమ్యగోచరంగా, అధ్వానంగా తయారైంది. ఇలాంటి విదేశాంగ విధానాన్ని, ఇంత బాహాటంగా అమలుచేసిన అమెరికా అధ్యక్షుడిని ప్రపంచం కనీవినీ ఎరుగదు. సొంత వ్యాపారం, వాణిజ్యం పెంచుకోవడంపైనే ట్రంప్ సర్కార్ దృష్టిపెడుతుందని అందరూ అంటారు. మరి అలాంటప్పుడు భారత్ వంటి దేశాలు రష్యా వంటి దేశాలతో వాణిజ్యం చేస్తుంటే మీకొచి్చన ఇబ్బంది ఏంటి?. మీరు చేస్తున్న పనిని వేరొకరు చేయొద్దనడం హాస్యాస్పదం. సొంతింటిని గాలికొదిలేసి పక్కింట్లో ఏం జరుగుతుందా అని ట్రంప్ యంత్రాంగం తొంగి చూస్తుంటే నవ్వొస్తోంది. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి’’అని ట్రంప్కు జైశంకర్ చురకటించారు. మధ్యవర్తిత్వం ఉత్తిదే ‘‘మేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్, భారత్ యుద్ధంలో మునిగిపోకుండా తాను ఆపానని బీరాలు పలుకుతున్న ట్రంప్ మాటల్లో ఆవగింజంత అయినా నిజం లేదు. అసలు మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ ప్రోత్సహించలేదు. గతంలోనూ తగాదా తీర్చమని ఎవ్వరినీ పెద్దమనిíÙగా పిలవలేదు. 1970వ దశకం నుంచి చూసినా గత అర్థశతాబ్దకాలంలో పాకిస్తాన్తో పొరపొచ్ఛాలకు సంబంధించి ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకూడదని భారత్ ఏనాడో నిర్ణయించుకుంది’’అని అన్నారు.అన్నింట్లో వైఖరి సుస్పష్టం‘‘ప్రతి అంశానికి సంబంధించి భారత్కు స్పష్టమైన విధానముంది. అమెరికా 50 శాతం టారిఫ్లు విధించినాసరే ఎలాంటి వాణిజ్య ఒప్పందాల్లోనైనా మన రైతుల ప్రయోజనాలే భారతప్రభుత్వానికి అత్యున్నతం. వ్యూహాత్మక వాణిజ్యం మొదలు రక్షణ, టారిఫ్లు, మధ్యవర్తిత్వం దాకా ప్రతి అంశంలో భారత్ స్వీయప్రయోజనాలకే విలువ ఇస్తుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా ప్రతినిధి బృందంతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. సాగు, డెయిరీ ఉత్పత్తుల విషయంలో రైతుల ప్రయోజనాలు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల పరిరక్షణకు భారత్ పట్టుబట్టడంతో ఈ అంశాల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది’’అని జైశంకర్ అన్నారు. పన్నుల భారం మోపడంతో అమెరికా సత్సంబంధాలు సన్నగిల్లి కొత్తగా చైనాతో బంధం కాస్తంత బలపడిందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ‘‘ఒక సందర్భాన్ని వేరొక సందర్భంతో పోల్చిచూసి తుది నిర్ణయానికి, అంచనాకు రావడం సబబుకాదు’’అని వ్యాఖ్యానించారు. -
కేరళకు మెస్సీ సేన
కొచ్చి: ప్రపంచ ఫుట్బాల్ చాంపియన్ అర్జెంటీనా జట్టు భారత్లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో భాగంగా లయోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ ఏడాది మొత్తం మూడు మ్యాచ్లు ఆడాల్సివుంది. ప్రత్యర్థి జట్లు, నగరాలు ఖరారు కానప్పటికీ ఏ ఏ దేశాల్లో జరిగేవి వెల్లడించారు. ముందుగా మెస్సీ సేన అమెరికాలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6 నుంచి 14వ తేదీల మధ్యలో అర్జెంటీనా... అమెరికాలో ఈ మ్యాచ్ ఆడుతుంది. తర్వాత నవంబర్ 10 నుంచి 18వ తేదీల మధ్యలో లువాండా (అంగోలా), కేరళ (భారత్) రెండు ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో మెస్సీ జట్టు తలపడుతుంది. ఈ మేరకు అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అర్జెంటీనా ఎదుర్కోబోయే జట్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొంది. అయితే మొరాకో, కోస్టా రికో, ఆస్ట్రేలియాలతో పాటు ఆసియా మేటి జట్టు జపాన్లతో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఘనమైన ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తోంది. కొన్నాళ్లుగా సాకర్ స్టార్ మెస్సీని కేరళకు తీసుకొచ్చేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమైంది. మొత్తానికి అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) షెడ్యూల్లో కేరళను చేర్చడంలో సఫలమైంది. మెస్సీ నవంబర్లో గనక జట్టుతో పాటు వస్తే నెల వ్యవధిలో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మళ్లీ డిసెంబర్లో భారత్కు రానున్నాడు. దీనికి సంబంధించి షెడ్యూల్ను ఆర్గనైజర్లు ఇటీవలే ప్రకటించారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్లోని సాకర్ ప్రియులకు, మెస్సీని ఆరాధించే అభిమానులకు ఇది పెద్ద పండగే. -
‘భారత్ అంటే గౌరవం.. మోదీ అంటే అంత కంటే..’
న్యూఢిల్లీ: భారత పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ను ఆర్థికంగా దెబ్బతీయానే ఉద్దేశంతో సుంకాల పెంపునకు నాంది పలికారనే వాదన బలంగా వినిపిస్తోంది.. భారత్పై వరుస సుంకాలతో ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారని అంటున్నారు పలువురు ప్రముఖులు. భారత్ను చైనా కంటే దారుణంగా చూడటం తగదని అంటున్నారు. చైనా కంటే అధికంగా భారత్పై సుంకాలు విధించడమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని దశాబ్డాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న భారత్ పట్ల ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ఆయనకే తెలియాలి. భారత్ను ఆర్థికంగా ఎదుగకుండా చూడాలని ట్రంప్ చేస్తున్నారా? అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే సమయంలో .భారత్పై ట్రంప్ వైఖరి పట్ల అటు అమెరికాలోనే పలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించగా, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనే యత్నం కూడా యూఎస్ నుంచి జరుగుతున్నట్లే కనబడుతోంది. తాజాగా అమెరికా మాజీ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు మిచెల్ బామ్గార్టనర్ అమెరికా-భారత్ల ‘మైత్రి’ తిరిగి గాడిలో పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిచెల్ బామ్గార్టనర్ మాట్లాడుతూ.. ట్రంప్కు భారత్ అంటే చాలా గౌరవమని, ప్రధాని మోదీ అంటే అంతకంటే గౌరవమంటూ స్పష్టం చేశారు. ఏ రకంగా భారత్ను డొనాల్డ ట్రంప్ గౌరవిస్తున్నారో చెప్పకపోయినా, త్వరలోనే ఇరుదేశా మధ్య సంబంధాలు తిరిగి యథాస్థితికి వస్తాయని జోస్యం చెప్పారు. ట్రంప్ వైఖరిపై చాలాకాలం ఓపిక పట్టిన భారత్.. ఇప్పుడు మాటల యుద్ధాన్ని ఆరంభించింది. అటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా రష్యాతో బంధాన్ని చెడగొట్టాలని చూసిన ట్రంప్కు.. భారత్ అనూహ్య షాకిచ్చింది. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు రష్యాతో చమురు కొనుగోలులో ఎటువంటి మార్పు ఉండబోదనే సంకేతాలు పంపింది. దాంతో ట్రంప్కు నోట్లో ఎలక్కాయపడినట్లు అయ్యింది. ప్రస్తుతం నేరుగా మాట్లాడకుండా రాజీ చేసుకునే మంత్రాన్ని అమలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారనేది ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి కనిపిస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహు కూడా అమెరికా-భారత్ సంబంధాలు తిరిగి మెరుగుపడతాయని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని కూడా చెప్పారు. మరి ఇప్పుడు అమెరికా మాజీ దౌత్యవేత్త మిచెల్ బామ్గార్టనర్ సైతం అదే పల్లవి అందుకున్నారు. ఈ రెండు పెద్ద దేశాల మధ్య పలు ప్రాథమిక అంశాలు చాలా బలంగా ఉన్నాయనేది ఒప్పుకోక తప్పదన్నారు. అందువల్ల ఇరు దేశాలు తిరిగి పూర్వ స్థితిని కొనసాగించే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. -
ఎవరూ తప్పించుకోలేరు.. ఏకంగా 8 కోట్ల ట్రాఫిక్ చలాన్లు!
ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ట్రాఫిక్ నియమాలను కఠినతరం చేసింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. 2024లో మాత్రమే అధికారులు దేశం మొత్తం మీద 8 కోట్ల కంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు జారీ చేశారు. ఈ చలాన్ల మొత్తం విలువ సుమారు రూ. 12,000 కోట్లు.దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ తప్పుతున్నట్లు, జరిమానాలు కూడా ఇక్కడ నుంచే ఎక్కువ వసూలవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఓవర్ స్పీడ్, రెడ్-లైట్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్ వంటి ఉల్లంఘనలకు ప్రతోరోజూ 5000 కంటే ఎక్కువ ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ సంఖ్య గురుగ్రామ్లో కూడా ఎక్కువగానే ఉంది.సాధారణ ఉల్లంఘనలు - జరిమానాలుమోటారు వాహనాల చట్టం.. ట్రాఫిక్ విభాగాల డేటా ప్రకారం, జరిమానాలు విధించే సాధారణ ఉల్లంఘనలలో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం, ఓవర్ స్పీడ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, రెడ్ లైట్లు జంప్ చేయడం, స్టాప్-లైన్ ఉల్లంఘనలు, రాంగ్ లేన్లో డ్రైవింగ్ చేయడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: భవిష్యత్ ఇంధనం గురించి చెప్పిన గడ్కరీహెల్మెట్ ధరించకపోతే.. రూ. 1,000, నిర్దిష్ట వేగం కంటే వేగంగా డ్రైవింగ్ చేస్తే రూ. 2,000 లేదా అంతకంటే ఎక్కువ జరిమానాలు (కొన్ని నగరాల్లో మొదటిసారి ట్రాఫిక్ రూల్ అతిక్రమించినవారికి జరిమానా కొంత తక్కువగా ఉంటుంది) ఉంటాయి. ఒకసారి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారు.. మళ్లీ మళ్లీ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్నట్లు తెలిస్తే.. వారికి మరింత ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉంది. రోడ్డు భద్రతలో టెక్నాలజీఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను కనిపెట్టడం చాలా సులభమైపోయింది. ఏఐ కెమెరాలు హై రిజల్యూషన్ ఫోటోలను క్లిక్ చేయడం మాత్రమే కాకుండా.. వీడియో కూడా రికార్డ్ చేస్తాయి. వీటి ఆధారంగానే వాహనదారులకు చలాన్ జారీ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి తప్పించుకోవడం అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన వినియోగదారులు మసలుకోవాలి. దీనివల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. -
‘భారత్తో సమస్య ఉంటే.. ’: ట్రంప్కు జైశంకర్ స్పష్టం
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న ఏకైక కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఆయన మరోమారు స్పష్టం చేశారు. భారత్తో ఏదైనా సమస్య ఉన్న పక్షంలో ఈ దేశపు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు జైశంకర్ స్పష్టం చేశారు.‘ఎకనమిక్ టైమ్స్’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ఎన్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్పై వెల్లువెత్తుతున్న విమర్శల అంశాన్ని ప్రస్తావించారు. భారత్-అమెరికా మధ్యవాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే మన దేశానికంటూ కొన్ని ప్రయోజనాలున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. మన రైతులు, చిన్నస్థాయి ఉత్పత్తిదారుల ప్రయోజాలను కాపాడేందుకే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. #WATCH | Delhi: At The Economic Times World Leaders Forum 2025, EAM Dr S Jaishankar says, "It's funny to have people who work for a pro-business American administration accusing other people of doing business. If you have a problem buying oil or refined products from India, don't… pic.twitter.com/rXW9kCcVuv— ANI (@ANI) August 23, 2025ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వ్యాపార అజెండాతో వ్యవహరిస్తున్న అమెరికా యంత్రాంగానికి మద్దతు పలుకుతూ, కొందరు తమపై నిందలు వేయడం హాస్యాస్పదమని జైశంకర్ పేర్కొన్నారు. నిజంగా మీకు(అమెరికాకు) భారత్తో సమస్య ఉంటే, ఈ దేశపు చమురును, శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకండి. వాటిని కొనాలంటూ మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు. అవి మీకు నచ్చకపోతే కొనకండంటూ జైశంకర్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల గురించి పూర్తిగా ప్రకటించడానికి ముందే, తాము రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేమని జైశంకర్ అన్నారు. -
ఆసియా కప్ కోసం భారత్కు రావడం లేదు: పాక్ హాకీ దిగ్గజం
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్కు ఇదివరకే పాకిస్తాన్ జట్టు దూరంగా ఉంది. ఇప్పుడు ఆ దేశ దిగ్గజం సొహైల్ అబ్బాస్ కూడా మలేసియా జట్టు అసిస్టెంట్ కోచ్ హోదాలో భారత్కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.ఈ మేరకు ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే టోరీ్నకి అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. పాక్ దిగ్గజ డ్రాగ్ఫ్లికర్గా ఖ్యాతి గడించిన అతను ప్రస్తుతం మలేసియా హాకీ జట్టుకు సేవలందిస్తున్నారు. ఈ జట్టు ఆసియా కప్ కోసం భారత్కు రానుంది. ఈ టోర్నీ విజేత నేరుగా ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆసియా ఈవెంట్కు మలేసియా జట్టు తరఫున వచ్చేందుకు అనాసక్తి చూపడం విడ్డూరంగా ఉంది. అయితే తన నిర్ణయానికి స్వదేశం (పాక్) తీసుకున్న గైర్హాజరుకు సంబంధం లేదని అబ్బాస్ చెప్పుకొచ్చాడు.‘నేను ఆసియా కప్ కోసం భారత్కు వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఆ ఈవెంట్కు అందుబాటులో ఉండటం లేదు. ఇది నా సొంత నిర్ణయం. దీనిపై ఎవరి ప్రభావం లేదు’ అని అన్నాడు. అబ్బాస్ 2012లో అంతర్జాతీయ హాకీకి గుడ్బై చెప్పారు. ఆ తర్వాత 2024 వరకు లోప్రొఫైల్ జీవితాన్నే గడిపారు. గతేడాది మలేసియా కోచింగ్ బృందంలో చేరారు. 48 ఏళ్ల సొహైల్ అబ్బాస్ ఏకంగా నాలుగు ప్రపంచకప్లు (1998, 2002, 2006, 2010), మూడు ఒలింపిక్స్ (2000, 2004, 2012)లలో పాల్గొన్నారు. 1998, ఫిబ్రవరిలో భారత్తో పెషావర్లో జరిగిన మ్యాచ్తో అరంగేట్రం చేసిన అబ్బాస్ 311 మ్యాచ్లు ఆడి 21 సార్లు హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. భారత్లో 20 ఏళ్ల క్రితం జరిగిన ఇండియన్ ప్రీమియర్ హాకీ లీగ్లో విజేత హైదరాబాద్ సుల్తాన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. -
చైనాకు దగ్గరవుతోన్న భారత్? టిక్ టాక్ రీ ఎంట్రీ.. నిషేధంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
-
ఇంద్రధనస్సు ఇక భారత్ కనిపించదు..!
ఇంద్రధనస్సు. కొత్త ఆనందాలకు ఉషస్సు. ఆకాశంలో హరివిల్లు కనిపించిందంటే చాలు చిన్నారులు మొదలు పెద్దల దాకా అందరూ ఆసక్తిగా చూస్తారు. రంగురంగుల ఇంద్రధనస్సు ఎంతో మందికి ప్రేమానురాగాల విరిజల్లును కురిపిస్తుంది. వర్షం ఆగిపోగానే, కొన్ని సార్లు చిరుజల్లులు పడుతున్నప్పుడే వినీలాకాశంలో అర్థచంద్రాకృతి ఆవిష్కృతమై కనువిందు చేస్తుంది. హరివిల్లులోని రంగులను లెక్కబెట్టేవాళ్లు కొందరైతే ఆ మొత్తం హరివిల్లు తమకు పూర్తిగా కనిపించట్లేదే అని బాధపడే వాళ్లు ఇంకొందరు. భారతీయులు మెచ్చే అందాల ఇంద్రధనస్సు ఇకపై కనిపించకపోచ్చన్న చేదు నిజాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందమొకటి నిర్ధారించింది. కాలుష్యం, భూతాపోన్నతి, వాతావరణ మార్పులు కారణంగా మళ్లీ మార్చలేనంతగా మారిపోతున్న వాతావరణ పరిస్థితుల కారణంగానే హరివిల్లు అంతర్థానమయ్యే అవకాశాలు బాగా పెరిగిపోయాయని అధ్యయన బృందం వెల్లడించింది. ఈ పరిశోధనా తాలూకు వివరాలు తాజాగా ‘గ్లోబల్ ఎని్వరోన్మెంటల్ ఛేంజ్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం ఆనందానికి, ఆశకు ప్రతిరూపంగా కనిపించే ఇంద్రధనస్సు భారతదేశంతోపాటు మరికొన్ని దేశాల్లో ఏర్పడే అవకాశాలు బాగా సన్నగిల్లుతున్నాయని అధ్యయనం పేర్కొంది. వర్షపాతం నమోదయ్యే రేటు, మేఘావృతమయ్యే పరిస్థితులు ఇటీవలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా మారిపోయాయి. వర్షం పడినప్పుడు తప్పితే మిగతా సందర్భాల్లో హరివిల్లు కనిపించదు. ఈ దృగి్వíÙయం ప్రకారమే వర్షాలకు, ఇంద్రధనస్సు ఆవిర్భావ సందర్భాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడైతే వర్షాలు తగ్గిపోతాయో అక్కడ హరివిల్లు అంతర్థానమవుతుంది. మేఘాల్లోని నీటి ఆవిరి వర్షపు చినుకులుగా మారే సందర్భాల్లో వాటి మీదుగా సూర్యకాంతి ప్రసరించి పరావర్తనం చెందినప్పుడు దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఇలా ఏర్పడిన హరివిల్లులను తమ కెమెరాల్లో బంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు శాస్త్రవేత్తలకు పంపించారు. అలా వేర్వేరు ఖండాల్లో భిన్న ప్రాంతాల్లో ఏర్పడిన హరివిల్లు ఛాయాచిత్రాలతో ఒక పేద్ద డేటాబేస్ను అధ్యయనకారులు సిద్ధంచేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత వాతావరణ మార్పులు, వాతావరణ పరిస్థితులను క్రోడీకరించి భవిష్యత్తు వాతావరణ అంచనాలను రాబట్టారు. దీంతో ప్రస్తుతం ప్రపంచంలో ఏడాదికి 117 రోజులపాటు ఇంద్రధనస్సులు ఏర్పడుతుండగా భవిష్యత్తులో మరింతగా ఏర్పడే అవకాశాలు ఉండటం విశేషం. 2100 ఏడాదికల్లా మరో 4 నుంచి 4.9 శాతం అధికంగా ఇంద్రధనస్సులు ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు అంచానావేశారు. అయితే అన్ని దేశాల్లో సమసంఖ్య ఏర్పడకుండా కొన్ని చోట్ల అత్యధికంగా, కొన్ని దేశాల్లో అత్యల్పంగా ఏర్పడతాయిన తేలింది. అత్యల్పంగా ఏర్పడే దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్లోనే ఎందుకు తక్కువ?మంచుమయ ప్రదేశాలతో పోలిస్తే మైదానాల వంటి నేలమయ ప్రాంతాల్లో హరివిల్లు ఏర్పడే అవకాశాలు 21 శాతం నుంచి 34 శాతం తగ్గిపోతున్నాయని అధ్యయనం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో ఇంద్రధనస్సు ఏర్పడే అవకాశాలు 66 నుంచి 79 శాతం మెరుగుపడ్డాయి. చల్లటి, పర్వతమయ ప్రాంతాల్లోనే హరివిల్లులు అధికంగా ఏర్పడే ఛాన్సుంది. అధిక జనాభా దేశాల్లో ఇంద్రధనస్సు కనివిందు చేయడం తగ్గిపోనుంది. ఆర్కిటిక్, హిమాలయాల్లో రెయిన్బో ఏర్పడే సంభావ్యత అధికంగా ఉందని గణాంకాల్లో తేలింది. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉండే ప్రదేశాల్లో హరివిల్లు సాక్షాత్కార ఘటనలు అధికంకానున్నాయి. భూమధ్యరేఖ నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఇంద్రధనస్సు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఆ లెక్కన భారతదేశం భూమధ్యరేఖకు సమీపంలో ఉంది. భూమధ్యరేఖకు దూరంగా ఉండే అంటార్కిటి ఖండం వంటి ప్రదేశాల్లో అత్యధికంగా హరివిల్లులు ఎక్కువగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు అంచనావేశారు. ఇప్పటికైనా కట్టుతప్పిన శిలాజఇంధన అతి వినియోగం, అడవుల నరికివేత, దారుణంగా పెరిగిపోయిన కాలుష్యం వంటివి తగ్గిపోతే భారత్ను హరివిల్లులు వదిలిపోవని భావించవచ్చు. ఆ మేరకు ప్రజల జీవనశైలిలో మార్పులొస్తాయని, ఆ మేరకు మళ్లీ హరివిల్లులు సందడి చేస్తాయని ఆశిద్దాం. -
‘భారత్ ఫెరారీ కారు, పాక్ చెత్త ట్రక్కు’.. పాక్ ఆర్మీ చీఫ్కు రాజ్నాథ్ కౌంటర్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను విలాసవంతమైన ఫెరారీ కారుతో, తమ దేశాన్ని చెత్త ట్రక్కుతో పోలుస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ దీటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. దీంతో, దాయాదికి ఎదురుదెబ్బ తగిలింది.తాజాగా కేంద్రమంత్రి రాజ్నాథ్ మాట్లాడుతూ.. ‘రెండు దేశాలూ ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందాయి. ఒక దేశం మంచి విధానాలు, ముందుచూపు, కష్టించేతత్వంతో ఫెరారీ కారు వంటి మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పర్చుకోగా, మరో దేశం అప్పటి నుంచి ఇప్పటి దాకా చెత్తగానే మిగిలిపోయింది. అది వాళ్ల సొంత వైఫల్యం. ఇదే విషయాన్ని అసిమ్ మునీర్ స్వయంగా అంగీకరించారని నాకనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మునీర్ పోలిక పాకిస్తాన్ సమస్యాత్మక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని రాజ్నాథ్ అన్నారు. ‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, తెలిసో తెలియకో దోపిడీదారు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. అవతరించినప్పటి నుంచీ ఆ దేశానిది ఇదే తీరు. పాక్ సైన్యం భ్రమలను మనం తొలగించాలి’ అని మంత్రి పేర్కొన్నారు.ఇటీవల అమెరికా పర్యటనలో మునీర్ మాట్లాడుతూ.. ‘హైవేపై ఫెరారీ కారు మాదిరిగా మెరుస్తూ వస్తున్న భారత్ను, గులకరాళ్ల ట్రక్కు వెళ్లి ఢీకొట్టిందనుకోండి, నష్టం జరిగేది ఎవరికి?’ అంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. భారత్ అభివృద్ధి దిశగా సాగుతుండగా, పాకిస్తాన్ వెనుకబడి ఉందని, సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటూ మునీర్పై విమర్శలు వచ్చాయి.ఆర్మీలో మహిళలకు అనుకూల విధానాలు సాయుధ బలగాలతోపాటు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అనే విధానాలను అమలు చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సేవలందించడమే కాదు, నాయకత్వం వహించేందుకు అవకాశమిస్తున్నామన్నారు. శుక్రవారం ఢిల్లీలో మొదలైన 15 దేశాల మహిళా అధికారుల ఐరాస ఉమెన్ మిలటరీ ఆఫీసర్స్ కోర్స్లో ఆయన మాట్లాడారు. ఐరాస మిషన్లలో వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం రెండు వారాలపాటు కొనసాగనుంది. -
ట్రంప్ మరో ఎత్తుగడ: భారత రాయబారిగా సన్నిహితుడు సెర్గియో గోర్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను తనదారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ పై తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ ఇప్పుడు తన దగ్గరున్న మరో అస్త్రం ప్రయోగించారు. భారత్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్లో తమ దేశ రాయబారిని మారుస్తూ అకస్మాత్తు నిర్ణయం తీసుకున్నారు.భారత్- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో ఈ నిర్ణయం కీలకంగా పరిణమంచింది. వైట్ హౌస్లో తనకు అత్యంత సన్నిహితుడు, పర్సనల్ డైరెక్టర్ గా ఉన్న సెర్గియో గోర్ ను ట్రంప్ భారతదేశ నూతన రాయబారిగా నియమించారు. చమురు కొనుగోలు తదితర అంశాలలో భారత్ రష్యా బంధం బలపడుతున్న సమయంలో ట్రంప్.. సర్గియోకు నూతన బాధ్యతలు అప్పజెప్పారు. ఈ పదవి ఖాళీ అయిన ఎనిమిది నెలల తర్వాత ఈ తాజా నియామకం జరిగింది. సెర్గియో గోర్ అధ్యక్షుడు ట్రంప్కు అత్యంత విధేయునిగా పేరుగాంచాడు. భారత రాయబాది సెర్గియో గోర్ నియామకాన్ని తన ట్రూత్ సోషల్లో తెలియజేసిన ట్రంప్ త్వరలోనే ఆయన పరిపాలనా విభాగంలో చేరనున్నారని ప్రకటించారు. సెర్గియో గోర్ దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహించనున్నారు. ఆయనను స్పెషల్ ఎన్వాయ్ ఫర్ సౌత్ సెంట్రల్ ఏసియన్ ఎఫైర్స్గా ట్రంప్ నియమించారు. ఆయన భారత్కు వెళ్లేంతవరకు వైట్హౌస్లోనే తన పాత విధులను నిర్వహిస్తారని ట్రంప్ ఆ పోస్ట్ లో తెలియజేశారు.సెర్గియో తనకు అత్యంత సన్నిహితునిగా ఉన్నారని, చాలా కాలంగా తనకు మద్దుతునిస్తూ, తాను ఎన్నికల్లో గెలిచేందుకు అమితమైన కృషి చేశారని తెలిపారు. అమెరికా అధ్యక్ష సిబ్బందిగా సెర్గియో పాత్ర చాలా కీలకమైనదని ట్రంప్ పేర్కొన్నారు. తాను పాలనలోకి అడుగుపెట్టాక సెర్గియో ఎన్నోమంచి పనులు చేశారన్నారు. ఆయన తన బృందంలో నాలుగువేల మంది దేశ భక్తులను నియమించుకున్నారని,ఫెడరల్ ప్రభుత్వ శాఖల్లోని 95 శాతం ఉద్యోగాలను ఆయన భర్తీ చేశారన్నారు. అతి పెద్ద జనాభా కలిగిన భారత దేశంలో అమెరికా ఎజెండాను పూర్తి చేసేందుకు సెర్గియో తోడ్పడతారని ట్రంప్ పేర్కొన్నారు. -
భారత్లో ఓపెన్ ఏఐ కార్యాలయం
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ ఈ ఏడాది భారత్లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే స్థానికంగా నియామకాలు కూడా ప్రారంభించినట్లు వివరించింది. చాట్జీపీటీకి అమెరికా తర్వాత భారత్ రెండో అతి పెద్ద మార్కెట్గా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో కార్యాలయం తెరవడం వల్ల ఇక్కడి యూజర్లకు మరింత మెరుగైన సరీ్వసులు అందించేందుకు వీలవుతుందని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ తెలిపారు. స్థానిక భాగస్వాములు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, డెవలపర్లు, విద్యా సంస్థలతో కలిసి పని చేయడంపై స్థానిక సిబ్బంది దృష్టి పెడతారని వివరించారు. -
భారత్ – బ్రిటన్ మధ్య స్నేహ వారధి.. పాల్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం స్వరాజ్ పాల్ పంజాబ్లోని జలంధర్లో 1931 ఫిబ్రవరి 18న జన్మించారు. ఆయన తండ్రి ప్యారేలాల్ స్థానికంగా చిన్నపాటి ఉక్కు ఫౌండ్రీని నడిపేవారు. స్వరాజ్ పాల్ 1949లో పంజాబ్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో (ఎంఐటీ) మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. స్వదేశానికి తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారమైన ఏపీజే సురేంద్ర గ్రూప్లో చేరారు. అయితే, ల్యూకేమియాతో బాధపడుతున్న కుమార్తె అంబికాకు మెరుగైన వైద్యచికిత్స కోసం 1966లో ఆయన బ్రిటన్కి వెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తూ నాలుగేళ్లకే కుమార్తె కన్ను మూయడంతో విషాదంలో మునిగిపోయిన పాల్.. ఆ తర్వాత ఆమె పేరిట అంబికా పాల్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్టును ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల కోసం మిలియన్ల కొద్దీ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. 1968లో లండన్ ప్రధాన కేంద్రంగా కపారో గ్రూప్నకు స్వరాజ్ పాల్ శ్రీకారం చుట్టారు. తర్వాత రోజుల్లో అది బ్రిటన్లోనే అతి పెద్ద స్టీల్ కన్వర్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార దిగజాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఏటా 1 బిలియన్ డాలర్ల ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తోంది. లెజెండ్.. లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) మృతిపై ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్–భారత్ మధ్య వారధిగా వ్యవహరించిన పాల్ తనకు స్ఫూర్తిప్రదాత అని కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు లార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. వోల్వర్హ్యాంప్టన్ యూనివర్సిటీ చాన్సలర్గా వర్సిటీ అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చెయిర్ ఏంజెలా స్పెన్స్ పేర్కొన్నారు. బ్రిటన్లోని అనేక మంది భారతీయులకు మార్గదర్శిగా నిల్చిన ‘లెజెండ్’ అని పాల్ను సన్ మార్క్ వ్యవస్థాపకుడు లార్డ్ రామీ రేంజర్ అభివర్ణించారు. భారత్–బ్రిటన్ను మరింత చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన చెరగని ముద్ర వేశారని లండన్లోని భారత హైకమిషన్ ప్రధాని మోదీ సోషల్ మీడియా వ్యాఖ్యలను రీపోస్ట్ చేసింది. ఆయన విదేశాల్లో భారత్కి గొంతుకగా నిల్చారని హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి.. భారత్–బ్రిటన్ మధ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా 1975లో ఇండో–బ్రిటీష్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన లార్డ్ పాల్ దానికి సుదీర్ఘకాలం చైర్మన్గా వ్యవహరించారు. పాల్ సేవలకు గుర్తింపుగా 1978లో బ్రిటన్ రాణి ఆయనకు నైట్హుడ్ ప్రదానం చేశారు. 1983లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ (Padma Bhushan) పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. పలు సంవత్సరాలుగా బ్రిటన్లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 2 బిలియన్ పౌండ్ల సంపదతో ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్లో ఆయన 81వ స్థానంలో నిల్చారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నప్పటికీ ఇటీవలి వరకు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్కి తప్పకుండా హాజరయ్యారు. 2008లో హౌస్ ఆఫ్ లార్డ్స్ డిప్యుటీ స్పీకర్గా పాల్ వ్యవహరించారు. తద్వారా భారత నేపథ్యంతో, ఆ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు. 2000 నుంచి 2005 వరకు ఇండియా–యూకే రౌండ్ టేబుల్కి కో–చెయిర్గా వ్యవహరించారు. 2009లో బ్రిటన్ మోనార్క్కి సలహా మండలి అయిన ప్రీవీ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. మరోవైపు, వ్యక్తిగత జీవితంలో ఆయన్ను విషాదాలు వెన్నాడాయి. 2015లో కపారో గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్న కుమారుడు అంగద్ పాల్, 2022లో ఆయన భార్య అరుణ మరణించారు. దీనితో వారి స్మారకార్థం తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన మరింత సంపద, సమయం వెచ్చించారు. భార్య మరణానంతరం అంబికా పాల్ ఫౌండేషన్ పేరును అరుణ అండ్ అంబికా పాల్ ఫౌండేషన్గా మార్చారు. 2023 ఫిబ్రవరిలో లండన్లోని చారిత్రక ఇండియన్ జింఖానా క్లబ్లో లేడీ అరుణ స్వరాజ్ పాల్ హాల్ని ప్రారంభించారు. -
ఓడిపోయే వ్యక్తిని ఎలా నిలబెడతారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయేలో ఉన్న తాము ప్రతిపక్ష పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఎలా మద్దతిస్తామని, ఓడిపోతామని తెలిసి కూడా ఇండియా కూటమి వాళ్లు తెలుగువాడు అంటూ అభ్యర్థిని పెట్టడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తాము సపోర్ట్ చేస్తామని ఆశించడం కూడా కరెక్ట్ కాదంటూ ఇండియా కూటమిని విమర్శించారు. ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ను మహారాష్ట్ర సదన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే భాగస్వామిగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయనకు తెలిపారు. అనంతరం అక్కడున్న మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది.. ‘సి.పి.రాధాకృష్ణన్ను ఎన్డీయే అభ్యర్థిగా మేమంతా కలిసే నిర్ణయించాం. ఆయన దేశంలో గరి్వంచదగ్గ నేత. దేశానికి, ఆ కుర్చీకి వన్నె తెస్తారు’.. అని చెప్పారు. టీడీపీ మద్దతు ఇస్తుందా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. ‘గెలిచే అవకాశం లేకపోయినా తెలుగువాడు అంటూ అభ్యర్థిని పెట్టిన ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది. రాష్ట్రంలో మేం, కేంద్రంలో ఎన్డీయే ఉన్నప్పుడు మేం వాళ్లకే కదా మద్దతు తెలిపేది’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరో రూ.5 వేల కోట్లు ఇవ్వండి.. మరోవైపు.. చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా రూ.5 వేల కోట్లు అవసరమని ఆమెకు తెలిపారు. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (సాస్కి–స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) కింద ఆ నిధులను అందించాలంటూ వినతిపత్రాన్ని అందచేశారు. అలాగే, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం.. రూ.250 కోట్ల విడుదలకు ఉత్తర్వులివ్వాలని కూడా కోరారు. ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియాతోనూ ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. -
ట్రంప్ కు భారీ షాక్.. భారత్ వెంట చైనా
-
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
వాషింగ్టన్: భారత్ టార్గెట్గా అమెరికా మరోసారి సంచలన విమర్శలు చేసింది. సుంకాల్లో భారత్ను ‘మహారాజ్’ అని పేర్కొంటూ వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారత రిఫైనరీలు యుద్ధానికి ఆజ్యం పోస్తూ డబ్బు సంపాదిస్తున్నాయని అన్నారు.వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీటర్.. ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాలు విధించడంలో భారత్.. ‘మహారాజ్’గా ఉంది. భారత్ సుంకాలు ఎక్కువగా ఉంటాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్కు చెందిన రిఫైనరీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. రష్యా ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది.White House Trade Adviser Peter Navarro on India: "Nonsense that India needs Russian Oil""Profiteering by Indian refiners""India has Maharaja tariffs""Road to peace runs thru New Delhi" pic.twitter.com/w64a9nRg2P— Sidhant Sibal (@sidhant) August 21, 2025భారత్కు రష్యన్ చమురు అవసరం అనేది అర్ధం లేనిది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ తన పాత్రను గుర్తించాలని కోరుకోవడం లేదు. భారత్ మనకు వస్తువులను అమ్మి.. వారు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి మన నుండి వచ్చే డబ్బును ఉపయోగిస్తున్నారు. రష్యన్లు ఆ డబ్బును మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేయడానికి, ఉక్రెయిన్ ప్రజలపై దాడులు చేయడానికి అది వాడుకుంటున్నారు అని ఆరోపించారు. భారత నాయకత్వాన్ని నేను విమర్శించాలని నేను అనుకోవడం లేదు. మోదీ గొప్ప నాయకుడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర ఏంటో చూడండి.. మీరు ప్రస్తుతం చేస్తున్నది శాంతిని పునరుద్ధరించడానికి కాదు.. అది యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రష్యా పట్ల భారత్ తన వైఖరి మార్చుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఆసియాకు డబుల్ ఇంజిన్లు భారత్, చైనా!
న్యూఢిల్లీ: భారత్- చైనా సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతున్న తరుణంలో.. ఆ దేశ రాయబారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వేచ్ఛా వాణిజ్యంతో ఇన్నాళ్లూ లాభపడిన అమెరికా ఇప్పుడు టారిఫ్ల పేరుతో బేరాలాడుతూ భారత్పై వేధింపులకు దిగుతోందని భారత్లో చైనా రాయబారి జు ఫెయింగ్హాంగ్ విమర్శించారు. భారత్పై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించడాన్ని తమ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. మౌనంగా ఉంటే అమెరికా వేధింపుల్ని మరింతగా పెంచుతుందన్న ఆయన.. ఈ విషయంలో భారత్ పక్షాన చైనా గట్టిగా నిలబడుతుందని వెల్లడించారు. భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్లను తెరవడంపై ఫెయింగ్ హాంగ్ స్పందిస్తూ... ఒకరి ఉత్పత్తులకు మరొకరు అవకాశమివ్వడం ద్వారా రెండు దేశాల అభివృద్ధికి ఎంతగానో అవకాశముందని చెప్పారు. ఆసియాకు రెండు దేశాలు డబుల్ ఇంజన్ల వంటివని అభివర్ణించారు. పోటీపరంగా చూస్తే ఐటీ, సాఫ్ట్వేర్, బయోమెడిసిన్ ఉత్పత్తుల్లో భారత్ మెరుగ్గా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నిర్మాణరంగం, నూతన ఇంధన రంగాల్లో చైనాది పైచేయిగా ఉందని వివరించారు. రెండు ప్రధాన మార్కెట్లు అనుసంధానమైతే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వివరించారు. భారత్పై అమెరికా సుంకాల (US Tariffs) విధింపు, వాటిని మరింత పెంచుతామని ఆ దేశం చేస్తున్న ప్రకటనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాణిజ్య, సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫీహాంగ్ వ్యాఖ్యానించారు.ఇటువంటి సందర్భాల్లో మౌనంగా ఉండటం, రాజీ పడటం.. బెదిరింపులకు పాల్పడేవారికి మరింత ధైర్యాన్నిస్తుంది. చైనా (China)లోని తియాంజిన్ వేదికగా ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్ సహా అన్నిపక్షాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ‘‘అంతర్జాతీయ వేదికపై పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, చైనాలు ఐక్యంగా ఉంటూ.. పరస్పరం సహకరించుకోవాలి. ఇరుదేశాల స్నేహం.. ఆసియాకు, ప్రపంచానికీ మేలు చేకూరుస్తుంది. భారత్, చైనాలు కలిసి తమ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టగలవు’’ అని ఫీహాంగ్ పేర్కొన్నారు.జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలురష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విధించిన సుంకాలపై మాస్కో వేదికగా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని.. చైనా అని పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనకు మాస్కో వెళ్లిన జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిశారు. ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత్పై అమెరికా విధించిన సుంకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు.. మాస్కో నుంచి అత్యధిక స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని, యూరోపియన్ యూనియన్ అని వెల్లడించారు. ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత్ సాయాన్ని అమెరికా కోరిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని అన్నారు. 2022 తర్వాత రష్యాతో వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని అన్నారు. అయినా భారత్పైనే ఎక్కువ సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. -
భారత్ గురి ‘బంగారం’
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ సీనియర్ విభాగంలో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్కు బంగారు పతకం లభించింది. రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్లతో కూడిన భారత జట్టు 1892.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని గెల్చుకుంది. రుద్రాంక్ష్ 632.3 పాయింట్లు, అర్జున్ 631.6 పాయింట్లు, అంకుశ్ 628.6 పాయింట్లు స్కోరు చేశారు. అయితే వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ 207.6 పాయింట్లతో నాలుగో స్థానంలో, అర్జున్ 185.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. సత్పయేవ్ (కజకిస్తాన్; 250.1 పాయింట్లు) స్వర్ణం... లూ డింగ్కి (చైనా; 249.8 పాయింట్లు) రజతం... హజున్ పార్క్ (కొరియా; 228.7 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో భారత షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగంలో భారత్కే స్వర్ణాలు దక్కాయి.వ్యక్తిగత విభాగంలో అభినవ్ షా 250.4 పాయింట్లతో పసిడి పతకం నెగ్గగా... టీమ్ విభాగంలో అభినవ్, హిమాంశు, ప్రణవ్లతో కూడిన భారత జట్టు 1890.1 పాయింట్లతో బంగారు పతకాన్ని నెగ్గింది. జూనియర్ మహిళల స్కీట్ ఈవెంట్లో మాన్సి స్వర్ణం, యశస్వి రజతం... జూనియర్ పురుషుల స్కీట్ ఈవెంట్లో హర్మెహర్ రజతం, జ్యోతిరాదిత్య సిసోడియా కాంస్యం గెలిచారు. హర్మెహర్, జ్యోతిరాదిత్య, అతుల్లతో కూడిన బృందం టీమ్ స్కీట్ ఈవెంట్లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్గా భారత్ 16 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో 31 పతకాలతో ‘టాప్’లో ఉంది. -
భారత్, పాక్ పోరుకు రాజముద్ర
ఒకవైపు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం... మన దేశంలో ఉన్న పాక్ జాతీయులను వెంటనే వెనక్కి పంపడంతో పాటు అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటూ ప్రభుత్వ స్పందన... ఇలాంటి స్థితిలో శత్రుదేశం పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లను బాయ్కాట్ చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు... స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ తటస్థ వేదికల్లో కూడా ఆడకూడదంటూ వ్యాఖ్యలు ... వెటరన్ ఆటగాళ్ల ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’లో పాక్తో రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగకుండా తప్పుకున్న భారత బృందంపై ప్రశంసలు...మరోవైపు ‘ఆ మ్యాచ్’ కోసమేనా అన్నట్లుగా ఆసియా కప్ వేదిక భారత్ నుంచి యూఏఈకి మారడం... కొద్ది రోజులకే షెడ్యూల్ విడుదల... జోరుగా ప్రచారం మొదలు పెట్టిన ప్రసారకర్తలు... భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు 10 సెకన్ల ప్రకటనకు రూ. 16 లక్షల రేటు... చూస్తుండగానే టోర్నీలో పాల్గొనే జట్ల ప్రకటన... అయినా సరే చివరి నిమిషంలో మ్యాచ్ రద్దు కావచ్చని, లేదా భారత్ ఆడకుండా పాయింట్లు ఇవ్వవచ్చని చర్చ... కానీ అలాంటి అవసరం లేదని తేలిపోయింది. ఇప్పుడు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి భారత్, పాక్ పోరుకు ఆమోద ముద్ర వేసింది. న్యూఢిల్లీ: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న దుబాయ్లో జరిగే మ్యాచ్ నిర్వహణపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ను చూసేందుకు అమితోత్సాహంతో సిద్ధం కావచ్చు! ఆసియా కప్లో పాక్తో తలపడేందుకు కేంద్ర ప్రభుత్వం మన జట్టుకు అనుమతి ఇచ్చింది. ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న ‘మల్టీలేటరల్ ఈవెంట్’ కావడంతో ఈ మ్యాచ్లో ఆడటంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం లేదని ప్రకటించింది. టోర్నీ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ మ్యాచ్లపై ఉన్న ఆసక్తి, ప్రాధాన్యతను బట్టి చూస్తే తాజా ప్రకటనతో వాణిజ్యపరంగా భాగస్వాములందరూ సంతోషించే నిర్ణయం వెలువడటం విశేషం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది. మార్గదర్శకాలతో స్పష్టత... భారత్, పాకిస్తాన్ మధ్య నిజానికి 2012–13 నుంచి ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కానీ ఇరు జట్లు ఐసీసీ టోర్నీలైన వన్డే, టి20 వరల్డ్ కప్లు, చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ మ్యాచ్లలో తలపడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ప్రకటనలో కొత్తగా పేర్కొన్న అంశం ఏమీ లేదు. అయితే దీనికే మరింత స్పష్టతనిస్తూ అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సరిహద్దు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో క్రీడా సంబంధాల విషయంలో కేంద్రం వీటిని ప్రకటించింది. ‘క్రీడలకు సంబంధించి పాకిస్తాన్తో ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రభుత్వం తమ విధానాన్ని వెల్లడిస్తోంది. ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఉండవు. మన జట్టు అక్కడికి వెళ్లి ఆడేందుకు లేదా ఆ జట్టు ఇక్కడికి వచ్చే ఆడేందుకు కూడా అనుమతించేది లేదు. అయితే పలు ఇతర జట్లతో ముడిపడి ఉన్న టోర్నీల విషయంలో ఆయా క్రీడల అంతర్జాతీయ సంఘాల నిబంధనలను, మన ఆటగాళ్లను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భారత్ పెద్ద ఈవెంట్ల వేదికగా మారుతున్న అంశాన్ని కూడా చూడాలి. కాబట్టి ఇలాంటి ఈవెంట్లలో పాక్ ఆడుతున్నా సరే మన జట్టు పాల్గొనవచ్చు. భారత్ ఆతిథ్యం ఇచ్చే ఇలాంటి టోర్నీల్లో కూడా పాకిస్తాన్ ఆడేందుకు అభ్యంతరం లేదు’ అని కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది. అధికారుల కోసం వీసా సడలింపులు... భవిష్యత్లో కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ కూడా నిర్వహించాలని ఆశిస్తున్న నేపథ్యంలో మన దేశానికి అత్యుత్తమ వేదికగా గుర్తింపు రావాలని కూడా కేంద్రం భావిస్తోంది. అందుకే వివిధ క్రీడా ఈవెంట్ల సమయంలో వీసాలు జారీ చేసే విషయంపై కూడా ప్రకటనలో వివరంగా పేర్కొంది. ‘క్రీడాకారులు, అధికారులు, సాంకేతిక సిబ్బందితో పాటు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులకు వారి అధికారిక పర్యటన సమయం, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వీసాలు జారీ చేస్తాం. ఇది గరిష్టంగా ఐదేళ్లు ఉంటుంది. టోర్నీల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి వచ్చే అధికారులకు ఇబ్బంది లేకుండా తమ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని కేంద్రం వెల్లడించింది. -
మనసుంటే భూపంపిణీ చేయొచ్చు!
భారతదేశంలో నూటికి 65 శాతం పైగా ప్రజలు గ్రామీణప్రాంతంలో నివసిస్తున్నారు. భూమిని కలిగి ఉండటం రైతు కుటుంబానికి సామాజిక హోదాను కల్పిస్తుంది. కానీ 78 సంవత్సరాల ‘స్వాతంత్య్రం’ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్నారు. గ్రామాల్లోని సుమారు 10 కోట్ల కుటుంబాలకు, అంటే గ్రామాల్లోని దాదాపు 56 శాతం కుటుంబాలకు సాగు భూమి అనేది లేదు. 1970 దశకంలో ప్రజల, ముఖ్యంగా గిరిజన ప్రజల పోరాటం ఫలితంగా భూమి సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చింది. రాష్ట్రాల వారీగా భూసంస్కరణల చట్టాలు వచ్చాయి. 1972లో జరి గిన ముఖ్యమంత్రుల సమావేశంలో జాతీయ స్థాయిలో ఒకే సీలింగ్ విధానాన్ని రూపొందించారు. ఈ సీలింగ్ ద్వారా 67 లక్షల ఎకరాల మిగులు తేలింది. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 1972లో భూ సంస్కరణల చట్టం చేయబడి 1973లో అమల్లోకి వచ్చింది. భూ సంస్కరణల చట్ట ప్రకారం మొదట 18 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. సవరణలతో కుదిస్తూ చివరికి 7.9 లక్షల ఎకరాల మిగులు భూమి ప్రకటించి, అందులో 6.47 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని, 5.82 లక్షల ఎకరాలను లక్షా 79 వేల మందికి పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చట్టంలో ఉన్న లొసుగు లను ఉపయోగించుకొని భూస్వాములు, ధనిక రైతులు సీలింగ్లోకి రాకుండా తమ భూములను కాపాడుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు 51 లక్షల ఎకరాలను మాత్రమే 57.8 లక్షల పేద రైతులకు పంపిణీ చేయడం జరిగింది. భూ సంస్కరణల చట్టాల వల్ల భూ సంబంధాల్లో మౌలికమైన మార్పులు జరగలేదు. కొద్ది మంది వద్దే భూమి ఇంకా కేంద్రీకరించ బడి ఉంది. 2020 జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం, 84%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులు హెక్టార్ కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారు. కేవలం 4.9% ఉన్న భూస్వాముల వద్ద 32% సాగు భూమి ఉంది. రాష్ట్రాల వారిగా కూడా భూకేంద్రీకరణలో వ్యత్యాసాలు ఉన్నాయి. పంజాబ్, బిహార్ రాష్ట్రాల్లో 10%గా ఉన్న భూస్వాముల వద్ద 80 శాతం భూమి ఉంది. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో 55% భూమి 10%గా ఉన్న భూస్వాముల వద్ద ఉంది. భారతదేశంలో ఒక పెద్ద భూ కామందు ఒక సన్నకారు రైతు కన్నా 45 రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. దేశంలో భూ సంస్కరణలు అమలు జరిపారనీ, భూస్వామ్య విధానం లేదనీ, దాని అవశేషాలు మాత్రమే ఉన్నాయనీ, పంచ టానికి ఇంకా భూములు లేవనీ కొందరు చేస్తున్న వాదనలు వాస్తవ విరుద్ధం. భూ కామందుల వద్దే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద, మత సంస్థల వద్ద లక్షలాది ఎకరాల భూమి ఉంది. ఆ భూము లను ప్రభుత్వం పంపిణీ చేయగలిగినప్పుడే పేదలందరికీ భూమి లభిస్తుంది. 10 నుండి 12 ఎకరాల సీలింగ్ విధించి భూ సంస్కర ణలు అమలు జరిపితే లక్షల కొద్ది భూములను పేదలకు పంపిణీ చేయవచ్చు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలు భూమి కోసం సంఘటితం కావాలి. – బొల్లిముంత సాంబశివరావురైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
‘భారత్ ప్రత్యర్థేమీ కాదు’.. ట్రంప్కు నిక్కీ హేలీ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిక్షాత్మక సుంకాలు విధించడాన్ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తప్పుబట్టారు. ట్రంప్ నిర్ణయాల కారణంగా వాషింగ్టన్- న్యూఢిల్లీ మధ్య సంబంధాలు విచ్ఛిన్నమయ్యే దశకు చేరుకున్నాయని ఆమె అన్నారు. వీటిని తిరిగి ట్రాక్లోకి తీసుకురావడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు.బుధవారం ప్రచురితమైన న్యూస్వీక్ ఆప్-ఎడ్లో.. ఆమె భారతదేశాన్ని చైనా మాదిరిగా ప్రత్యర్థిగా పరిగణించరాదని అన్నారు. ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, భారత్- పాక్ మథ్య సంధి కుదిర్చానంటూ అమెరికా పేర్కొనడం.. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య చీలికకు కారణమవుతున్నాయని హేలీ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా భారత్- అమెరికా సంబంధాలలో విభేదాలు కనిపించాయని, ట్రంప్ యంత్రాంగం భారత్పై 25 శాతం సుంకాలతో దాడి చేసిందని ఆమె అన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలలో అమెరికా పాత్ర లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసిందన్నారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను సమర్థించిన నిక్కీ హేలీ ఇప్పుడు ఆయన చర్యలను తప్పుపడుతున్నారు. భారతదేశాన్ని అత్యుత్తమ ప్రజాస్వామ్య భాగస్వామిగా పరిగణించాలని, అది చైనా మాదిరిగా ప్రత్యర్థి కాదన్నారు. ఇప్పటివరకు రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఎటువంటి ఆంక్షలను విధించలేదని ఆమె పేర్కొన్నారు. ఆసియాలో చైనా ఆధిపత్యానికి దీటుటా ఎదుగుతున్న దేశంతో స్నేహ సంబంధాలను దూరం చేసుకోవడం వ్యూహాత్మక విపత్తు అవుతుందని ఆమె అధ్యక్షుడు ట్రంప్ను హెచ్చరించారు.భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, చైనా తర్వాతి స్థానంలో ఉందని హేలీ గుర్తుచేశారు. కమ్యూనిస్ట్ నియంత్రణలో ఉన్న చైనాతో పోలిస్తే, ప్రజాస్వామ్య భారతదేశం స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరింపులకు గురిచేయదని ఆమె అన్నారు. ట్రంప్ మొదటి పరిపాలనా కాలంలో ఐక్యరాజ్యసమితికి 29వ అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ ఉన్నారు. అమెరికా అధ్యక్ష మంత్రివర్గంలో పనిచేసిన మొదటి భారతీయ అమెరికన్గా ఆమె పేరొందారు. -
చైనాతో సంధి వేళ సరిహద్దులపై నేపాల్ మరో డ్రామా.. భారత్ కౌంటర్
ఢిల్లీ: భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదాలు తగ్గించుకుంటున్న క్రమంలో తెరపైకి నేపాల్ వచ్చింది. లిపులేఖ్ కనుమ ద్వారా చైనాతో భారత్ సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ విషయంలో నేపాల్ వాదనలు అసమగ్రంగా ఉన్నాయని స్పష్టంచేసింది.వివరాల ప్రకారం.. భారత్- చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు చర్చల ద్వారా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో హిమాలయ పర్వత ప్రాంతం ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ ప్రాంతం మీదుగా వాణిజ్య సరిహద్దులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో నేపాల్ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. లిపులేఖ్ కనుమ ద్వారా భారత్, చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం 1954లో ప్రారంభమైంది.దశాబ్దాలుగా వాణిజ్యం కొనసాగుతోంది. ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. ప్రాదేశిక వాదనలను ఏకపక్షంగా విస్తరించడం సాధ్యం కాదు. వాణిజ్య మార్గంపై ఖాట్మండు ప్రాదేశిక వాదన అనుకూలమైనది కాదు. చారిత్రక వాస్తవాలు ఆధారంగా లేవు. కోవిడ్, ఇతర పరిణామాల కారణంగా వాణిజ్యానికి ఇటీవల సంవత్సరాల్లో అంతరాయం కలిగింది. ఇప్పుడు దానిని తిరిగి ప్రారంభించడానికి రెండు వైపులా అంగీకారం కుదిరింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి దౌత్యం ద్వారా నేపాల్తో నిర్మాణాత్మక పరస్పర చర్యకు భారత్ సిద్ధంగా ఉంది అని స్పష్టం చేశారు.అయితే నేపాల్ పశ్చిమ సరిహద్దు లింపియాధురలో 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపులేఖ్ కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి తెరవడానికి భారత్, చైనా ఇటీవల అంగీకరించాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. లిపులేఖ్, లింపియాధురతో సహా కాలాపానీ ప్రాంతం తమ భూభాగమని భారత్ తన వైఖరిని వ్యక్తం చేస్తోంది. కాగా, 1816 సుగౌలి ఒప్పందం ప్రకారం కాలాపానీ, లింపియాధురతో సహా లిపులేఖ్ తమకే చెందుతుందని నేపాల్ వాదిస్తోంది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం, రోడ్ల విస్తరణ, సరిహద్దు వాణిజ్యం వంటి ఎటువంటి కార్యకలాపాలను చేపట్టవద్దని నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. -
ట్రంప్ ఓవరాక్షన్.. భారత్కు రష్యా బంపరాఫర్
మాస్కో: భారత్–రష్యా సంబంధాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా నానాటికీ బలపడుతున్నాయని రష్యా సీనియర్ దౌత్యవేత్త, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బాబుష్కిన్ చెప్పారు. భారత ఉత్పత్తులకు తమ మార్కెట్ ద్వారాలు తెరిచి ఉన్నట్లు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.రొమన్ బాబుష్కిన్ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత హిందీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘ఇక ప్రారంభిద్దాం.. శ్రీగణేషుడే ప్రారంభిస్తున్నాడు’ అని విలేకరులను ఉద్దేశించి చెప్పారు. భారత్–రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసమే మూలస్తంభమని పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికాతోపాటు పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి రష్యా–ఇండియా–చైనా(ఆర్ఐసీ) మధ్య చర్చలు, పరస్పర సహకారాన్ని పునరుద్ధరించుకొనే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.‘మిత్రులను’ అవమానించేందుకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే తప్పేమిటి? దీనిపై పశ్చిమ దేశాలే సమాధానం చెప్పాలి. భారత్ మాకు చాలా ముఖ్యమైన దేశం. భారత్కు చమురు సరఫరాను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదు’ అని బాబుష్కిన్ తేల్చి చెప్పారు. దీంతో, అమెరికాకు రష్యా గట్టి సమాధానం చెప్పినట్టు అయ్యింది.భారత్కు 5 శాతం రహస్య తగ్గింపుమరోవైపు.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి భారత్ పరోక్షంగా అండగా నిలుస్తోందని ట్రంప్ కన్నెర్ర చేస్తున్న వేళ ముడి చమురు కొనుగోలుపై భారత్కు ఐదు శాతం రహస్య తగ్గింపు(డిస్కౌంట్) ఆఫర్ చేస్తున్నట్లు భారత్లోని రష్యా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి ఎవ్గెనీ గ్రీవా బుధవారం వెల్లడించారు. ఇది వాణిజ్య సీక్రెట్ అని చెప్పడం గమనార్హం. ఈ ఐదు శాతం డిస్కౌంట్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు ఉంటాయన్నారు. రష్యా నుంచి చమురు కొనే భారత వ్యాపారవేత్తలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. చమురు విషయంలో షిప్పింగ్, బీమా సంబంధిత అంశాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగం ఉన్నట్లు తెలిపారు. ఇండియా చమురు అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యానే తీరుస్తోందని ఎవ్గెనీ గ్రీవా వివరించారు. బ్యారెల్కు 5 శాతం చొప్పున డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇండియా ప్రతిఏటా 250 మిలియన్ టన్నుల ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని, ఇందులో 40 శాతం రష్యా చమురే ఉంటోందని స్పష్టంచేశారు. -
భారత్లో లైంగిక హింసపై పాక్ మాట్లాడటం సిగ్గు చేటు
న్యూయార్క్: జమ్మూకశ్మీర్లో లైంగిక హింస జరిగిందంటూ ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తిప్ప కొట్టింది. తమ దేశంలో మైనారిటీ మహిళలపై జరుగుతున్న నేరాలపై స్పందించని పాక్. భారత్పై మాట్లాడటం సిగ్గుచేటని ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్త ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ వ్యాఖ్యానించారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఆ దేశానికే దారుణమైన రికార్డు ఉందని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో సంఘర్షణ సంబంధిత లైంగిక హింసపై మంగళవారం జరిగిన బహిరంగ చర్చలో పున్నూస్ మాట్లాడారు.ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతికత పాకిస్థాన్కు లేదని స్పష్టం చేశారు. ‘1971లో పూర్వపు తూర్పు పాకిస్తాన్లో లక్షలాది మంది మహిళలపై పాకిస్తాన్ సైన్యం పాల్పడిన లైంగిక హింస నేరాలకు ఎలాంటి శిక్ష వేయకపోవడం సిగ్గు చేటు. ఆ దేశంలో మైనారిటీ వర్గాల్లో మహిళలు, బాలికలు నేటికీ అపహరణకు గురవుతున్నారు. అక్రమ రవాణా జరుగుతోంది. బలవంతపు వివాహాలు, మత మారి్పడులను ఎదుర్కొంటున్నారు. ఈ నేరాలకు పాల్పడేవారు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నట్లు నటించడం విడ్డూరంగా ఉంది. పాక్ ద్వంద్వ వైఖరి, కపటత్వం స్పష్టమవుతున్నాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. ఘర్షణ సంబంధిత లైంగిక హింస, దారుణమైన చర్యలకు పాల్పడేవారిని న్యాయం ముందు నిలబెట్టాలని పున్నూస్ డిమాండ్ చేశారు.మహిళల రక్షణకు భారత్లో ప్రత్యేక వ్యవస్థలు అంతేకాదు.. మన దేశంలో, ప్రపంచ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన వెల్లడించారు. లైంగిక దోపిడీ, దురి్వనియోగ బాధితుల కోసం యూఎన్ సెక్రటరీ జనరల్ ట్రస్ట్ ఫండ్కు విరాళాలు అందించిన మొదటి దేశాల్లో భారతదేశం ఒకటని గుర్తు చేశారు. ఇటువంటి నేరాలను నివారించడానికి యూఎన్తో స్వచ్ఛంద ఒప్పందంపై 2017లోనే భారత్ సంతకం చేసిందన్నారు. 2007లో లైబీరియాకు మొదటి పూర్తి మహిళా పోలీసు యూనిట్ను మోహరించిందని, ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలకు మహిళా బృందాలను పంపుతూనే ఉందని పున్నూస్ ఎత్తి చూపారు. దేశీయంగా మహిళలను రక్షించడానికి భారత్ ప్రత్యేక వ్యవస్థలను సృష్టించిందని పున్నూస్ చెప్పారు. వీటిలో మహిళల భద్రత కోసం 1.2 బిలియన్ డాలర్లను నిర్భయ నిధికి కేటాయించిదని చెప్పారు.పాక్లో 24 వేల మంది కిడ్నాప్.. పాకిస్తాన్లో గతేడాది 24 వేలమందికి పైగా కిడ్నాప్కు గురయ్యారని సస్టైనబుల్ సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 2024 నివేదిక వెల్లడించింది. అంతేకాదు 5వేల మందిపై అత్యాచారం, 500 హానర్ కిల్లింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. సింధ్ ప్రావిన్స్లోని చాలా మంది హిందూ మైనారిటీ బాలికలకు బలవంతంగా వివాహం చేస్తున్నారని, మత మారి్పడి చేస్తున్నారని పేర్కొంది. -
మళ్లీ చివురించిన చెలిమి
ఏ దేశానికైనా ప్రథమ ప్రాధాన్యం స్వీయ ప్రయోజనాలు. ఆ తర్వాతే మిగిలినవన్నీ. గాల్వాన్ ఘర్షణల తర్వాత గత అయిదేళ్లుగా భారత్, చైనాల మధ్య ఏర్పడిన వివాదాలు అనేకానేక చర్చల పరంపర తర్వాత కూడా అసంపూర్ణంగానే ఉండిపోయిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన దేశంలో రెండురోజులు పర్యటించటం, ఇరు దేశాల మధ్యా ఏదో మేరకు సదవగాహన కుదరటం హర్షించదగ్గ పరిణామం. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అంతకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్తో చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు ఉంటాయి. ఒకటి రెండు పర్యటనలతోనో, రెండు మూడు దఫాల చర్చల్లోనో అవి పరిష్కారం కావాలంటే సాధ్యం కాకపోవచ్చు. అందుకు ఎంతో ఓరిమి, తమ వైఖరిపై అవతలి పక్షాన్ని ఒప్పించే నేర్పు అవసరం. దీర్ఘకాలం ఆ వివాదాలను కొనసాగనిస్తే మూడో దేశం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిరుడు అక్టోబర్లో రష్యాలోని కజాన్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అప్పటికి నాలుగేళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలనూ సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న జూన్లో కైలాస– మానససరోవర్ యాత్రకు భక్తులను అనుమతించేందుకు చైనా అంగీకరించింది. భారత్ సందర్శించే చైనా యాత్రికులకు మన దేశం పర్యాటక వీసాలు పునరుద్ధరించింది. ఈనెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో వాంగ్ యీ వచ్చారు. ఆ సదస్సుకు మోదీ హాజరుకావాలంటే సుహృద్భావ సంబంధాలు అవసరమని కూడా చైనా భావించింది. ప్రధాని ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరైతే ఆయన ఏడేళ్ల అనంతరం చైనా సందర్శించి నట్టవుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్యా జరిగిన ఘర్షణల తర్వాత సైనికాధికారుల స్థాయిలో చాలా దఫాలు చర్చలు సాగాయి. అయినా సరిహద్దుల్లో ఏప్రిల్ 2020కి ముందున్న పరిస్థితులు ఏర్పడలేదు. ఆఖరికి కజాన్లో మోదీ–షీల మధ్య సమావేశం తర్వాత కూడా గత పది నెలల్లో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. వాంగ్ యీ పర్యటన సందర్భంగా ఇరుదేశాలూ 12 అంశాల్లో కీలక నిర్ణయాలు తీసు కున్నాయి. రెండు దేశాల మధ్యా విమాన రాకపోకలను పునరుద్ధరించుకోవాలనీ, వివాదాస్పద సరిహద్దు సమస్యపై చర్చించేందుకు మూడు వేర్వేరు బృందాలు ఏర్పాటు చేసుకోవాలనీ తీర్మా నించాయి. సరిహద్దు విషయంలో ఇప్పుడు పనిచేస్తున్న బృందంతో పాటు తూర్పు, మధ్య సెక్టార్లకు సంబంధించి వేర్వేరు బృందాలు ఏర్పడితే త్వరితగతిన పరిష్కారం సాధించవచ్చని ఇరు దేశాల విదేశాంగమంత్రులూ భావించారు. అలాగే వాణిజ్యాన్ని పెంచుకోవటానికి సరి హద్దుల్ని మళ్లీ తెరవాలని నిర్ణయించారు. లిపూలేఖ్ పాస్, షిప్కి లా పాస్, నాథూ లా పాస్ల గుండా ఈ వాణిజ్యం సాగుతుంది. అలాగే పరస్పరం పెట్టుబడుల ప్రవాహానికి కూడా అనుమ తిస్తారు. అన్నిటికన్నా ముఖ్యం – అరుదైన ఖనిజాల ఎగుమతులకు చైనా అంగీకరించటం. స్మార్ట్ ఫోన్ల నుంచి ఫైటర్జెట్ల వరకూ, విండ్ టర్బైన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకూ ఉత్పాదన ప్రక్రియలో ఈ అరుదైన ఖనిజాలు అత్యవసరం. ఇవి ప్రపంచంలో 99 శాతం చైనాలోనే లభ్యమవుతాయి. వీటితోపాటు ఎరువుల ఎగుమతులపై లోగడ విధించిన నిషేధాన్ని తొలగించ టానికి చైనా అంగీకరించటం ఈ పర్యటనలో ప్రధానాంశం. మన రైతులు ఎక్కువగా మొగ్గు చూపే డీఏపీ ఎరువులు చైనాలో ఉత్పత్తవుతాయి. రెండుచోట్లా ప్రవహించే నదీజలాలపై డేటాను ఇచ్చిపుచ్చుకోవటానికి భారత్, చైనా అంగీకరించాయి. త్రీగోర్జెస్ డ్యామ్ను మించిన స్థాయిలో బ్రహ్మపుత్ర నదిపై 16,000 కోట్ల డాలర్ల వ్యయంతో భారీ ఆనకట్ట నిర్మించాలని చైనా తలపెట్టిన నేపథ్యంలో నదీ జలాల డేటాపై అంగీకారం కుదరటం హర్షించదగ్గది.చర్చల తర్వాత తాజా ప్రపంచ పరిణామాలపై వాంగ్ యీ విడుదల చేసిన ప్రకటనలో పరోక్షంగా అమెరికా వ్యవహారశైలిపై విమర్శలుండటం గమనార్హం. స్వేచ్ఛా వాణిజ్యాన్నీ, అంతర్జాతీయ సంబంధాలనూ భగ్నం చేసేలా కొందరు ఏకపక్షంగా బెదిరింపులకు దిగుతున్న పర్యవ సానంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన ప్రస్తావించారు. ఆధిపత్య ధోరణులు ఏ రూపంలో ఉన్నా గట్టిగా ప్రతిఘటించటం చాలా అవసరం. ఏదేమైనా ఇరుదేశాలూ సాధ్యమైనంత త్వరగా సరిహద్దు సమస్యకు పరిష్కారం అన్వేషించగలిగితే, ఉగ్రవాదం అంతానికి చేతులు కలిపితే... ప్రధాని మోదీ చెప్పినట్టు అది రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఆసియా ఖండంలోనే కాదు... యావత్ ప్రపంచశాంతికీ, సౌభాగ్యానికీ దోహదపడుతుంది. సాధ్యమైనంత త్వరగా అది సాకారం కావాలని ఆశించాలి. -
'అగ్ని 5' బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్
భారత్ 'అగ్ని 5' బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపుర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇది అణు సామర్థ్యం ఉన్న స్వదేశీ క్షిపణి. ఇది రక్షణ రంగంలో దేశానికి ఉన్న బలమైన సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది.ఈ పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) నిర్వహించింది. ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం గల 'అగ్ని 5' ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 5 వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు.మూడు దశల ఘన ఇంధన ఇంజిన్ను కలిగి ఉన్న ఈ క్షిపణి.. ఇది భారత సరిహద్దులను మరింత సురక్షితం చేస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టీపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్’ సాంకేతికతతో రూపొందించారు. దీనిద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. ఈ ఏడాది జులైలో అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించారు. -
రష్యా చమురుతో భారత సంపన్న కుటుంబాలే లాభపడుతున్నాయి
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా మరోసారి స్పందించింది. ఈ క్రమంలో భారతీయ బిలియనీర్లపై అక్కసు వెల్లగక్కింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఎన్బీసీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఏకంగా ఓ పత్రికలో వ్యాసం రాశారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల్లో భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యాతో కొనసాగుతున్న చమురు వాణిజ్యం.. ఈ కుటుంబాలకే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంక్షలనూ లాభార్జనగా మార్చుకున్నారు అని ఆరోపించారాయన.2022 కంటే ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం కంటే ముందు రష్యా నుంచి భారత్ 1 శాతం కంటే తక్కువ చమురును కొనుగోలు చేసేది. ఇప్పుడది 42 శాతానికి చేరి ఉండొచ్చు. భారత దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు రష్యా ఆయిల్ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను(ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు) పొందుతున్నాయి. అందుకే భారత్పై సుంకాలను పెంచే ప్రణాళిక రూపొందించాం. ఇవి సెకండరీ టారిఫ్లుగా ఉండొచ్చు అని బెసెంట్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో గతవారం ఓ ప్రముఖ పత్రిక కాలమ్లో భారతదేశంలోని చమురు వ్యాపారులపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు భారతదేశపు ‘‘బిగ్ ఆయిల్’’ లాబీ లాభాపేక్ష వల్ల జరిగాయని.. దేశీయ అవసరాల కోసం కాదని అందులో పేర్కొన్నారు. ఆ కథనంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్లు విధించారు. ఇందులో సగం శిక్ష రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించబడనుంది. భారత్ మాత్రం తక్కువ ధర ఉన్న చోట నుంచి చమురు కొనుగోలు చేయడం తమ హక్కు అని పేర్కొంటూ, ఈ అదనపు టారిఫ్లను అసమంజసమైనవిగా చెబుతోంది. కానీ.. చరిత్రపరంగా చూస్తే.. భారత్ రష్యా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకోలేదు. ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడేది. కానీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై $60-పెర బ్యారెల్ ధర పరిమితి విధించడంతో.. భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. ఇది అమెరికాకూ తెలుసు. ..ఇక చైనాపై సెకండరీ టారిఫ్లు విధించకపోవడానికి ఓ కారణం ఉంది. అది భారత్ కంటే ఎక్కువగా రష్యా చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే 2022 ముందు 13% ఉండగా, ఇప్పుడు 16%కి పెరిగింది. పైగా చైనా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడమే కాకుండా.. విక్రయిస్తోంది కూడా. అందుకే అమెరికా చైనాపై అదనపు టారిఫ్లు విధించలేదు అని అన్నారాయన. -
మరో అద్భుతం భారతీయ రైల్వే ఖాతాలో..
ఈ మధ్యకాలంలో ఇండియన్ రైల్వేస్ ఎన్నో అద్భుత ఘట్టాలను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్, పొడవైన రైల్వే టన్నెల్, చారిత్రక పాంబన్ బ్రిడ్జ్.. ఇలాంటి నిర్మాణాల తర్వాత ఇప్పుడు మరో ‘వావ్’ ఫీట్ను సాధించింది. అదే.. దేశంలోనే అత్యంత పొడవైన గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ పూర్తి చేయడం. కట్నీ జంక్షన్లో ఇంజినీరింగ్ అద్భుతం.. మధ్యప్రదేశ్లోని కట్నీ జంక్షన్ వద్ద ఈ గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జ్ మొత్తం 33.40 కిలోమీటర్లు పొడవు. ఇందులో ఒకటి "అప్" ట్రైన్ల కోసం (ఇప్పటికే పూర్తయింది). మరొకటి "డౌన్" ట్రైన్ల కోసం.. ఇది 17.52 కిలోమీటర్ల పొడవుతో ఇంకా నిర్మాణంలో ఉంది. అప్ బ్రిడ్జ్ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) ఆమోదించారు. దీంతో అతిత్వరలోనే ఇది ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం.. 15.85 కిలోమీటర్ల పొడవుతో, ఫిల్లర్లపైనే నిర్మించిన ఈ ఎలివేటెడ్ ట్రాక్ నగరాన్ని పూర్తిగా మళ్లించి ట్రాఫిక్ను గణనీయంగా తగ్గిస్తుంది.గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ అంటే.. రవాణా మార్గాలు (రోడ్లు, రైల్వేలు) ఒకే స్థాయిలో కాకుండా, వేర్వేరు ఎత్తుల్లో నిర్మించడమన్నమాట. తద్వారా వాటి మధ్య రాకపోకలలో అంతరాయం లేకుండా చేయొచ్చు. అంటే.. సిగ్నల్స్ లేకుండా ప్రయాణించగలవు. తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలో పూర్తి కావాలనే టార్గెట్ ఉంది. గతి శక్తి పథకంలో భాగంగా.. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతి శక్తి పథకంలో భాగంగా చేపట్టబడింది. "అప్ లైన్" సెపరేటర్ నిర్మాణ ఖర్చు ₹580 కోట్లు కాగా, రెండు సెపరేటర్ల మొత్తం ఖర్చు రూ.1,247.68 కోట్లుగా అంచనా.ట్రాఫిక్ తగ్గింపు, సమయపాలన మెరుగుదల.. దేశంలోనే అతిపెద్ద రైల్వే జెంక్షన్ యార్డ్గా న్యూ కట్నీకి పేరుంది. గూడ్స్ & ప్యాసింజర్ ట్రైన్ల అధిక రాకపోకల వల్ల నిత్యం ఇక్కడ తీవ్ర రద్దీ నెలకొంటోంది. తద్వారా రైళ్ల రాకపోకలపై ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. అయితే.. తాజా గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ వాడకంలోకి వస్తే ఈ సమస్య తొలిగిపోనుంది. అదెలాగంటే.. సింగ్రౌలి, బిలాస్పూర్ నుంచి వచ్చే ట్రైన్లు ఇక న్యూ కట్నీ జంక్షన్(కట్నీ ముద్వారా) వద్ద ఆగాల్సిన అవసరం లేదు. కోటా, బీనా వైపు వెళ్లే ట్రైన్లకు ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. అంటే.. వెస్ట్ సెంట్రల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేజోన్ల నుంచి వచ్చే రైళ్ల రాకపోకలు సునాయసంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రయాణ సౌలభ్యం, సరుకు రవాణా మెరుగుదల.. కట్నీని మళ్లించే ట్రైన్లు ఇక నాన్ స్టాప్గా ప్రయాణించగలవు. ధన్బాద్, గయా, ముజఫర్పూర్ వంటి నగరాలకు వెళ్లే ప్రత్యేక ట్రైన్లు కూడా హాల్టింగ్ లేకుండా ముందుకు వెళ్తాయి. అదనంగా.. పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా సకాలంలో జరిగేందుకు వీలు కల్పించనుంది. నిర్మాణంలో వినియోగించిన వనరులు15,000 టన్నుల స్టీల్1.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్1.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టినాలుగు Rail Over Rail (ROR) బ్రిడ్జ్లు, వాటిలో పొడవైనది 91.40 మీటర్లుఈ అద్భుతమైన నిర్మాణం భారత రైల్వేలు సాధించిన మరో ఘనతగా నిలిచింది. దేశ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. -
‘ఆపరేషన్ సిందూర్’కు తోక ముడిచిన పాక్.. శాటిలైట్ చిత్రాలివే..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో చొటుచేసుకున్న ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని లక్షిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.ఈ దాడులకు పాక్ వణికి పోయిందనడానికి నిదర్శనంగా కొన్ని శాటిలైట్ చిత్రాలు వెలువడ్డాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ నావికాదళం భయంతో ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. పాకిస్తాన్ యుద్ధనౌకలు ప్రధాన నావికా స్థావరాల నుండి తరలించడాన్ని ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని నౌకలను కరాచీ వాణిజ్య రేవులకు తరలించారు. మరికొన్నింటిని ఇరాన్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ సరిహద్దుకు తరలించారు.పాకిస్తాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్యలలో ఆపరేషన్ సింధూర్ ప్రముఖమైనదిగా నిలుస్తుంది. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ తనను తాను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలపై ప్రతి రోజూ కొత్త నివేదికలు అందుతున్నాయి. తాజాగా వెలువడిన ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్ నావికాదళం ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని చూపిస్తున్నాయి.మే 7- మే 10 మధ్య భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అ సమయంలో భారత్కు తగిన సమాధానం ఇచ్చామని పాకిస్తాన్ గతంలో వాదనకు దిగింది.అయితే ఇప్పుడు ప్రత్యక్షమైన శాటిలైట్ చిత్రాలు దీనికి భిన్నమైన తీరును చూపిస్తున్నాయి. పాకిస్తాన్ తన నావికాదళాన్ని సురక్షితంగా ఉంచేందుకు వెనక్కి తగ్గినట్లు ఈ దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. మే 8న భారత్ దాడుల తరువాత రోజున పాక్ యుద్ధనౌకలు వాటి సాధారణ ప్రదేశాలలో కనిపించలేదు. మూడు యుద్ధనౌకలు కరాచీ వాణిజ్య నౌకాశ్రయంలో కనిపించాయి. -
మన దేశంలో 23 రకాల దేశీయ వరి వంగడాలకు జీఐ
పది వేల సంవత్సరాల నాటి సుసంపన్న వ్యవసాయ వారసత్వ సంపద గల ప్రపంచ జీవవైవిధ్య కేంద్రాల్లో ఒక ముఖ్యమైనది భారతదేశం. ఈ అపురూప పాత పంటలకు అవి పుట్టి పెరిగిన స్థానిక ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉంటుంది. అక్కడి వాతావరణం, నేలల స్వభావం, ప్రజల ప్రాధాన్యతలు.. వీటన్నిటితో కూడిన ప్రత్యేక రుచి, రంగు, వాసన, పోషకాలు, ఔషధ గుణాలతో ఈ స్థానికత ముడిపడి ఉంటుంది. అటువంటి అద్భుతమైన దేశీ వరి వంగడాలను అనాదిగా ఏటేటా సాగు చేస్తూ, వాటిని పరిరక్షిస్తూ వస్తున్నది రైతులు, ఆదివాసులు. కొత్త వంగడాలు వెల్లువైన ఈ ఆధునిక కాలంలో వీటిని కాలగర్భంలో కలసిపోకుండా కాపాడుకునే పని కూడా పాత పంటల విలువ తెలిసిన వీరే తమ భుజస్కందాలపై వేసుకున్నారు. ఇటువంటి పాత పంటలను కాపాడుకోవటానికి ఒకానొక మార్గం వాటికి స్థానికతను ఆధారసహితంగా నిరూపించి తగిన చట్టపరమైన గుర్తింపు ఇవ్వటం. దాన్నే జాగ్రఫికల్ ఇండికేషన్(జీఐ) అంటాం. జీఐకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని గత వారం ఇదే సాగుబడి ప్లస్ పేజీలో చదువుకున్నాం. ఈ రోజు మన దేశంలో జీఐ గుర్తింపు పొందిన కొన్ని వారసత్వ దేశీ వరి రకాల విశిష్టతల గురించి తెలుసుకుందాం. ఈ విశిష్టమైన దేశీ వరి వంగడాల ఔషధ గుణాలు, పోషకాలు సమృద్ధిగా మనం అందుకోవాలంటే రసాయన రహిత పద్ధతుల్లో సాగు చెయ్యటం తప్పని సరి!దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పాత వరి రకాల ప్రత్యేకతను మరింతగా రక్షించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం మరిన్ని వరి రకాలకు జీఐ గుర్తింపు ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. రైతులకు ప్రయోజనం చేకూర్చడం, వ్యవసాయ సమాజపు పురాతన సాంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడటం, ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 1. టెక్కలి: జీఐ ట్యాగ్ ΄పొందిన మొట్టమొదటి ఆసియా వరి రకం. కేరళ తీర ప్రాంత జిల్లాల్లో నీటితో ఎక్కువ కాలం నిండి ఉండే చిత్తడి ప్రాంత పొలాల్లో పెరిగే సామర్థ్యం ΄ టెక్కలి రకానికి ఉంది. సేంద్రియ పద్ధతుల్లో దీన్ని సాగు చేస్తున్నారు.2. బాస్మతి: పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులు విస్తృతంగా పండిస్తున్న బాస్మతి వరి బియ్యాన్ని దేశ విదేశాల్లో ప్రజలు ఇష్టపడి తింటుంటారు. జీఐ ట్యాగ్ ΄÷ందిన వరి రకాల్లో ఎక్కువ ప్రజాదరణకు నోచుకుంటున్నది బాస్మతి మాత్రమే అని చెప్పచ్చు. సుగంధం వెదజల్లే ΄÷డవైన గింజ కలిగిన బియ్యం. వండినప్పుడు దాని సువాసన, పొడడవాటి మెత్తటి ఆకృతికి ప్రసిద్ధి చెందింది.3. కాలానమక్: ‘బుద్ధ బియ్యం‘ అని కూడా దీనికి మరో పేరుంది. ఈ పురాతన, సుగంధ రకం పుట్టిల్లు ఉత్తరప్రదేశ్. దీన్ని శతాబ్దాలుగా హిమాలయ తీర ప్రాంతంలో సాగు చేస్తున్నారనే నమ్మిక ఉంది. దీని ప్రత్యేక సువాసన బుద్ధుని బహుమతిగా చెబుతారు.4. గోవింద్భోగ్: పశ్చిమ బెంగాల్కు చెందిన అద్భుత వరి రకం. చిన్న గింజ. మీగడ–తీపి సుగంధ బియ్యం. ఖరీఫ్ సీజన్ లో పండిస్తారు. దీన్ని సాంప్రదాయకంగా శ్రీకృష్ణుడికి నైవేద్యం కోసం ఈ బియ్యాన్ని వాడతారు.5. జోహా: అస్సాంలో, ముఖ్యంగా గారో హిల్స్లో, పండించే జోహా బియ్యం తీపి వాసనకు, రుచికి, మృదువైన ఆకృతికి ప్రసిద్ధి. ఇందులో అమైనో ఆమ్లాలు, ్ర΄ోటీన్లు అధికంగా ఉంటాయి.6. చక్–హావో: మణిపూర్కు చెందిన సువాసనతో కూడిన నల్ల బియ్యం. జిగటగా ఉంటాయి. వండినప్పుడు ఊదా రంగులోకి మారతాయి. ఇది గ్లూటెన్, విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలతో సమృద్ధమై ఉంటుంది. మణిపురి ఇళ్లలో చక్–హావో బియ్యానికి లభించే సాంస్కృతిక ప్రాముఖ్యత దాని విశిష్టతను చాటుతుంది.7. నవర: కేరళకు చెందిన ప్రసిద్ధినొందిన సాంప్రదాయ వరి రకం. ఔషధ గుణాల పుట్ట. వండుకొని తినటంతో పాటు ఆయుర్వేద చికిత్సలలోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు.8. వయనాడ్ జీరకశాల, వయనాడ్ గంధకశాల: ఇవి కేరళలోని వయనాడ్ ్ర΄ాంతం నుంచి వచ్చిన రెండు విభిన్న బియ్యం రకాలు. ప్రత్యేకమైన వాసన, రుచికి ప్రసిద్ధి చెందాయి.9. పాలక్కడన్ మట్ట: ‘రోజ్ మట్ట’ బియ్యం అని కూడా పిలుస్తారు. కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో పండిస్తారు. ఈ బియ్యానికి ఉండే ఒక రకమైన ‘మట్టి రుచి’ ప్రత్యేకమైనది. అలాగే, దాని పోషకాలతో పాటు అధిక పీచు పదార్థం వల్ల ప్రసిద్ధి చెందింది.10. అంబెమోహర్: మహారాష్ట్రలో పుట్టిన ఈ చిన్న బియ్యపు గింజలకు విలక్షణమైన మామిడి పువ్వుల మాదిరి సువాసన ఉంటుంది. సున్నితమైన ఆకృతి కూడా ఆకట్టుకుంటుంది.11. అజరా ఘన్సాల్: మహారాష్ట్రలో, ముఖ్యంగా అజరా జిల్లాలో, పండించే ఈ బియ్యం దాని తీపి వాసన, ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందాయి. సువాసన, అందమైన సన్నని తనానికి సూచికగా దీనికి ‘ఘన్సాల్‘ అని పేరొచ్చింది.12. కతర్ని: బీహార్కు చెందిన కతర్ని ధాన్యపు గింజ చాలా చిన్నది. వండిన అన్నం రుచి, వాసన ప్రత్యేకమైనవి. తీపి, మృదుత్వం, సువాసనతో కూడిన కతర్ని చెయురా (అటుకుల)కు కూడా ప్రసిద్ధి చెందింది.13. తులైపంజి: పశ్చిమ బెంగాల్కు చెందిన మరొక సుగంధ బియ్యం రకం తులైపంజి. జిగట లేని, ప్రకాశవంతమైన, సన్నని ధాన్యపు రకం ఇది. చాలా కాలంపాటు సువాసనను నిలుపుకుంటుంది.14. కైపాడ్ : కేరళకు చెందిన మరో వరి రకం. తీర ప్రాంతాల్లో ఉప్పునీటితో పండించడానికి అనుగుణంగా ఉండే రకం ఇది.15. బాలాఘాట్ చిన్నోర్: మధ్యప్రదేశ్కు చెందిన ఈ రకానికి జీఐ గుర్తింపు ఉంది.16. జీరాఫూల్: ఛత్తీస్గఢ్కు చెందిన సుగంధ బియ్యపు రకం.17. బోకా చౌల్: ఒక విలక్షణమైన అస్సాం వరి రకం. దీన్ని ఉడికించకుండానే నీటిలో నానబెట్టి తినవచ్చు. వేడి నీటిలో ఉడికిస్తే వెంటనే, చల్ల నీటిలో నానబెడితే కొంచెం ఆలస్యంగా తినటానికి సిద్ధమవుతుంది.18. అండమాన్ కరెన్ ముస్లీ: అండమాన్, నికోబార్ దీవులకు చెందిన ఈ వరి రకానికి ఇటీవలే జీఐ ట్యాగ్ పొందింది.19. కోరాపుట్ కలజీర: ఇటీవలే జీఐ ట్యాగ్ పొందిన ఒడిశా సుగంధ వరి రకం.20. కలోనునియా: ఇటీవలే జీఐ ట్యాగ్ పొందిన పశ్చిమ బెంగాల్ సుగంధ వరి రకం.21. మార్చా బియ్యం : బీహార్కు చెందిన సుగంధ వరి రకం. ఇటీవలే జీఐ ట్యాగ్ పొందింది.22. ఉత్తరాఖండ్ లాల్ చావల్: ఉత్తరాఖండ్కు చెందిన ఎర్ర బియ్యపు గింజ రకం.23. ఆడమ్చిని: ఉత్తరప్రదేశ్కు చెందిన చిన్న గింజ సుగంధ వరి రకం ఇది. ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ!నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి,డెస్క్ -
భారత్పై సుంకాలు అందుకే.. కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్పై సుంకాల విషయమై అమెరికా మరోసారి స్పందించింది. ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహంలో భాగంగానే భారత్పై సుంకాల విధించినట్టు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చారు. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలా చేసినట్టు తెలిపారు.వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల నేతలతో ట్రంప్ చర్చల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్పై దాడులు నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్ దృష్టి సారించారు. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకొని ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహం. ఇందులో భాగంగా భారత్పై 50 శాతం సుంకాలను విధించారని అన్నారు. ఇదే సమయంలో భారత్ ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమే అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్- పాక్ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని పాత పాటే పాడారు.మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చలే తొలి అడుగు అని పేర్కొన్నారు. త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. Breaking:President Trump has put 'sanctions' on India to put 'this war (in Ukraine) to a close' & he 'wants to see this war end' says White House Spokesperson Karoline Leavitt pic.twitter.com/rLLq6aiznT— Sidhant Sibal (@sidhant) August 19, 2025 -
బలపడుతున్న చైనా, భారత్ బంధం
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణ ఉదంతం తర్వాత క్షీణించిన భారత్, చైనా సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మంగళవారం ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలో చైనాలో మోదీ పర్యటన నేపథ్యంలో భారత్లో పర్యటిస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో మంగళవారం విస్తృతస్థాయి చర్చలు జరిపారు. పలు రంగాల్లో పరస్పర సహకారం, అభివృద్దే లక్ష్యంగా 12 అంశాలపై ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపు ధ్యేయంగా సరిహద్దులను తెరవడం, ఇరువైపులా పెట్టుబడుల వరద పారించడం, నేరుగా పౌరవిమానయాన సేవలను పునరుద్దరించడం వంటి కీలక అంశాలపై నేతలు అవగాహనకొచ్చారు.అమెరికా మోపిన అధిక టారిఫ్ భారం కారణంగా పరోక్షంగా చాన్నాళ్ల తర్వాత భారత్, చైనా ఏకతాటి మీదకు రావడం విశేషం. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల కీలక ఉమ్మడి ఆశయాల అమలుకు కృషిచేయాలని ఇరు పక్షాలు మంగళవారం నిర్ణయించాయి. లిపులేఖ్ పాస్, షిప్కీ లా పాస్, నాథూ లా పాస్ సరిహద్దుల గుండా తిరిగి విస్తృతస్థాయిలో వాణిజ్యం చేయాలని జైశంకర్, వాంగ్ నిర్ణయించారు. స్నేహపూర్వక సంప్రతింపుల ద్వారా సరిహద్దు వెంట మళ్లీ శాంతిస్థాపనకు ప్రయత్నించనున్నారు. ఈ మేరకు 12 అంశాలతో సంయుక్త పత్రాన్ని నేతలు విడుదలచేశారు. పర్యాటకులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు, ఇతర కారణాలతో సందర్శించే వ్యక్తులకు వీసాలు ఇవ్వాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.వచ్చే ఏడాది కైలాశ్ పర్వత యాత్ర, మానస్సరోవర్ యాత్ర కోసం భారతీయులను చైనా అనుమతించనుంది. ఇరుదేశాల భూభాగాల్లో ప్రవహించే నదీజలాలపై సహకారం, ప్రవాహస్థాయిలు, వరదలపై ఎప్పటికప్పుడు సమాచార మారి్పడికి, ఇరుదేశాల నిపుణుల స్థాయి వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వడం వంటివి ఈ సంయుక్త పత్రాల్లో చోటు దక్కించుకున్నాయి. భారత్కు అరుదైన ఖనిజాలు, ఎరువుల ఎగుమతులపై ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను సడలించడానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అంగీకరించారు. భారత్కు అవసరమైన అరుదైన ఖనిజాలు, ఎరువులు సరఫరా చేస్తామని వాంగ్ హామీ ఇచ్చారు. ఖనిజాలు, ఎరువులతోపాటు టన్నెల్ బోరింగ్ మెషిన్ల అవసరం ఉందని జైశంకర్ చెప్పగా, వాంగ్ యీ వెంటనే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.‘‘తైవాన్పై మా వైఖరిలో మార్పు లేదు’’ తైవాన్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత ప్రభుత్వ వర్గాలు మంగళవారం తేల్చిచెప్పాయి. వాంగ్తో సమావేశమైనప్పుడు చైనాలో తైవాన్ అంతర్భాగం అని జైశంకర్ వ్యాఖ్యానించినట్లు చైనా విదేశాంగ శాఖ పొరపాటున తెలియజేసింది. దీనిపై భారత ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పష్టతనిచ్చాయి. ప్రపంచంలోని ఇతర దేశాల తరహాలోనే తైవాన్తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. తైవాన్తో భారత్కు చక్కటి సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాయి. భారత్ – చైనా సంబంధాలు పైపైకి: మోదీ భారత్–చైనా మధ్య సంబంధాలు స్థిరంగా పురోగమిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరస్పర ప్రయోజనాలను, అవసరాలను గౌరవించుకుంటూ ముందుకెళ్తున్నాయని తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. భారత్–చైనా సంబంధాలపై వారు మాట్లాడుకున్నారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత ఏడాది అక్టోబర్లో రష్యాలోని కజన్ సిటీలో చైనా అధినేత జిన్పింగ్తో భేటీ అయ్యానని, అప్పటి నుంచి భారత్–చైనా సంబంధాలు వేగం పుంజుకున్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల నడుమ స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధ బాంధవ్యాల వల్ల ఆసియాతోపాటు ప్రపంచంలో శాంతి, సౌభాగ్యం నెలకొంటాయని మోదీ స్పష్టంచేశారు. -
రాజ్యాంగ పరిరక్షకులు, వ్యతిరేకుల మధ్య ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికను రాజ్యాంగ పరిరక్షకులకు, రాజ్యాంగ వ్యతిరేకులకు మధ్య జరుగుతున్న ఎన్నికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్న వారికి, ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిన తెలంగాణ రైతు బిడ్డ, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణ మద్దతునివ్వాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్రెడ్డిని ప్రకటించడం తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను పెంచిందన్నారు. ఎన్నికల కమిషన్ను కూడా దుర్వినియోగం చేసి, బతికున్న ఓటర్లను చనిపోయినట్లు, లేని ఓటర్లను ఉన్నవారిగా చూపిస్తూ.. ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీయే ఒక పక్కన, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే, రాజ్యాంగబద్ధ్ద సంస్థలను పరిరక్షించే ఇండియా కూటమి మరోవైపు ఉన్నాయని అన్నారు, ఇండియా కూటమి ఉపరాష్టపతి అభ్యర్థిని ప్రకటించిన తరువాత రేవంత్రెడ్డి తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. మనమంతా ఏకం కావాలి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా, వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్రెడ్డిని అభ్యర్థిగా ఎంపికచేసిందని రేవంత్రెడ్డి చెప్పారు. ‘దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన, ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన పీవీ నరసింహారావు తరువాత తెలంగాణకు చెందిన వ్యక్తి రెండో అత్యున్నత పదవికి పోటీకి ప్రకటించడం మనందరికీ గర్వకారణం. తెలుగు ప్రజలుగా రాజకీయాలకు అతీతంగా ఆత్మప్రబోధనానుసారం ఓటు వేయాలి. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరిది. మొత్తం 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులం ఒకతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించాలని కోరుతున్నా. టీడీపీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, జనసేన పార్టీల నాయకులు చంద్రబాబు, కె.చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, పవన్ కళ్యాణ్ను తెలంగాణ ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ పార్లమెంట్ సభ్యులను, ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కూడా కోరుతున్నా. రాజకీయాలకు అతీతంగా మనం ఏకం కావాల్సిన సందర్భం ఇది’అని రేవంత్ చెప్పారు. తమిళ, తెలుగు రాష్ట్రాల మధ్య పోటీకాదు ‘1991లో ప్రధాని రేసులో ఉన్న పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినపుడు.. కాంగ్రెస్, టీడీపీ సిద్ధాంతపరంగా పూర్తి వైరుధ్యం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఆరోజు పీవీపై పోటీ పెట్టకుండా రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. ఈరోజు ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం, ఆ తరువాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీలు విజ్ఞత ప్రదర్శించాలి’అని రేవంత్రెడ్డి చెప్పారు. జస్టిస్ సుదర్శన్రెడ్డికి మద్దతుగా మీరు ఉభయ రాష్ట్రాల్లోని పార్టీ నాయకులను వ్యక్తిగతంగా కలుస్తారా? అని అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ జస్టిస్ సుదర్శన్రెడ్డికి మద్దతునివ్వా లని బహిరంగంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని బదులిచ్చారు. బీఆర్ఎస్ను ఎలా మద్దతు అడుగుతారని ప్రశ్నించగా.. ‘జస్టిస్ సుదర్శన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాదు. పార్టీ సభ్య త్వం లేదు. కాంగ్రెస్ ఎంపిక చేయలేదు. ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి‘అని అన్నారు. ఇది తమిళ, తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ కాదని వ్యాఖ్యానించారు. ఓబీసీ బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరు.. ఇప్పుడు ఓబీసీ వ్యక్తిని ఎన్డీయే నిలబెడితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్నకు సీఎం స్పందిస్తూ ‘జస్టిస్ సుదర్శన్రెడ్డి బలహీన వర్గాలకు బలమైన గొంతుక. రాష్ట్రపతి వద్దనున్న బీసీల రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటున్న ఎన్డీయే అభ్యర్థి, బలహీనవర్గాల వ్యక్తా.? బలహీనవర్గాలకు అండగా నిలబడాల్సిన వ్యక్తా’అని సీఎం ఎదురు ప్రశ్నించారు. -
మను గురికి రెండు కాంస్యాలు
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో మంగళవారం భారత్కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత స్టార్ మనూ భాకర్ వ్యక్తిగత విభాగంతోపాటు టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మను 219.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మనూ భాకర్, సురుచి సింగ్, పలక్లతో కూడిన భారత జట్టు 1730 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మను 583 పాయింట్లు, సురుచి 574 పాయింట్లు, పలక్ 573 పాయింట్లు సాధిచారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో రష్మిక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. ఫైనల్లో రషి్మక 241.9 పాయింట్లు స్కోరు చేసింది. రషి్మక, వన్షిక, మోహిని సింగ్లతో కూడిన భారత జట్టు 1720 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. -
నెహ్రూ వల్ల రెండు సార్లు దేశ విభజన: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్తో నెహ్రూ కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందంతో మనకు పూడ్చలేని నష్టం జరిగిందన్నారు. అప్పటి మంత్రివర్గాన్ని గానీ, పార్లమెంట్ను గానీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఈ ఒప్పందంపై ఆమోదముద్ర వేశారని విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ ఎంపీలకు మోదీ పిలుపునిచ్చారు.దేశానికి.. ప్రధానంగా రైతన్నలకు నష్టం చేకూర్చేలా నెహ్రూ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తాము అధికారంలోకి వచి్చన తర్వాత నిలిపివేశామని గుర్తుచేశారు. నెహ్రూ నిర్వాకం వల్ల రెండుసార్లు దేశ విభజన జరిగిందన్నారు. ఒకసారి రాడ్క్లిఫ్ లైన్తో భారత్ను విభజించారని, సింధూ నదిని ముక్కలు చేసి దేశాన్ని మరోసారి విభజన తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. అధికార ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సి.పి.రాధాకృష్ణన్ను ప్రధాని మోదీ మంగళవారం ఎన్డీయే ఎంపీలకు పరిచయం చేశారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో రాధాకృష్ణన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే... రాద్ధాంతం ఎందుకని దబాయింపు ‘‘సింధూ నదిలో 80 శాతానికి పైగా నీటిని పాకిస్తాన్కే అప్పగించారు. మన రైతులను దగా చేశారు. అప్పటి జనసంఘ్ ఎంపీ అటల్ బిహారీ వాజ్పేయి సహా పలువురు పార్లమెంట్ సభ్యులు నెహ్రూ నిర్ణయాన్ని తప్పుపట్టారు. నిరసన వ్యక్తంచేశారు. దీనిపై పార్లమెంట్లో రెండు గంటలపాటు చర్చ జరిగింది. కొన్ని బకెట్ల నీరు పోతే రాద్ధాంతం ఎందుకని నెహ్రూ దబాయించారు. పైగా లద్ధాఖ్లో మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే చూసీచూడనట్లు వదిలేశారు. అక్కడ గడ్డి పరక కూడా పెరగదని వ్యంగ్యంగా మాట్లాడారు. చేసిన పొరపాటును నెహ్రూ కొన్నిరోజులకు ఒప్పుకున్నారు. సింధూ నది జలాల ఒప్పందం కుదుర్చుకుంటే పాకిస్తాన్తో ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయని భావించానని, కానీ, అలా జరగలేదని ఒక సహచరుడితో అన్నారు. నెహ్రూ హయాంలో చేసిన తప్పిదాలను సరి చేస్తున్నాం’’ అని అన్నారు. సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు ‘‘ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఇండియా క్రెడిట్ రేటింగ్ను ఇటీవల అప్గ్రేడ్ చేసింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రగతికి ఇదొక నిదర్శనం. దీనివల్ల మన దేశానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు తీసుకొస్తామని, జీఎస్టీ రేట్లను సరళీకృతం చేస్తామంటూ ఎర్రకోట నుంచి చేసిన ప్రకటనను స్టాక్మార్కెట్ స్వాగతించింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు ర్యాలీ చేసింది. మన ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్పోర్టుల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. విదేశీ మారకద్రవ్య నిల్వలకు ఢోకా లేదు. సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి’’ అని అన్నారు.రాజకీయాలతో రాధాకృష్ణన్ ఆడుకోలేదు ‘‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం హర్షణీయం. ఆయన ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు. దశాబ్దాలుగా ప్రజాసేవకు అంకితమయ్యారు. క్రీడల్లో ఆయనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ రాజకీయాలతో ఏనాడూ ఆడుకోలేదు. రాధాకృష్ణన్తో నాకు నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. మాకు నల్లజుట్టు ఉన్నప్పటి నుంచి పరస్పరం మంచి పరిచయం ఉంది. ప్రజాసేవ అంటే ఆయనకు అమితమైన అనురక్తి. వివిధ స్థాయిలో ప్రజలకు సేవలందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ను గెలిపించాలని అన్ని రాజకీయ పారీ్టలకూ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. అందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరుతున్నా’’ అని అన్నారు. -
అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!
భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు వివిధ రంగాలలో ఆందోళనలను రేకెత్తించాయి. ఆంక్షల కారణంగా సుమారు 3,00,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా.అమెరికా విధించిన సుంకాల ప్రభావం చాలా వరకు వస్త్ర పరిశ్రమ, రత్నాల పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రంగాల్లో పనిచేస్తున్న లక్షలమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే.. ఎగుమతులు తగ్గినప్పటికీ.. దేశంలో డిమాండ్ ఉంటుందని, అమెరికా సుంకాలు భారత ఆర్ధిక వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం చూపవని మరికొందరు చెబుతున్నారు.వస్త్ర, రత్నాల రంగాలను పక్కన పెడితే.. ఐటీ సర్వీస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా అమెరికా సుంకాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఆటో విడిభాల సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని జీనియస్ హెచ్ఆర్టెక్ వ్యవస్థాపకులు & సీఎండీ ఆర్పీ యాదవ్ అన్నారు.భారతదేశం వస్త్రాలను, రత్నాభరణాలను ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అయితే టారీఫ్స్ పెరగడం వల్ల ఇప్పుడు ఇది ప్రశ్నార్థకంగా మారింది. సుంకాలు పెరగడం వల్ల.. ధరలు పెరుగుతాయి. దీనివల్ల మార్కెట్లో అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే మన దేశం ప్రత్యామ్నాయంగా వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవడం ద్వారా.. నష్టాన్ని ఆపవచ్చు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?అమెరికాకు భారతదేశం ఎగుమతులు 87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది జీడీపీలో కేవలం 2.2 శాతం మాత్రమే. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక పరిశ్రమలు ప్రస్తుతానికి ప్రభావితం కాలేదు. భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించగలదని టీమ్లీజ్ సర్వీసెస్లో ఎస్వీపీ బాలసుబ్రమణియన్ అనంత నారాయణన్ పేర్కొన్నారు. -
ఇది సాకారమైతే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి చెక్!
భారత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ను శాసించాలి. అధిక నాణ్యత, తక్కువ ధరే మన బలం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన ట్యారిఫ్లను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ పిలుపునిచ్చారని వేరే చెప్పాల్సిన అవ సరం లేదు. ఏ దేశమైనా వేరే దేశం నుంచి వస్తు సేవలను దిగుమతి చేసుకుంటుందంటే అర్థం అవి దానికి అవసరమనే కదా! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో భారత్ తన మీద ఆధారపడి ఉందన్నట్లుగా వ్యవహ రిస్తున్నారు. భారతదేశ ఉత్పత్తుల్ని దయతలిచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా సుంకాలను విధిస్తున్నారు. అమెరికాకు భారత్ ఎగు మతి చేసే వస్తువులు, సేవల మొత్తం సుమారు 87 బిలియన్ డాలర్లు. ఇది భారత్ మొత్తం ఎగుమతులలో 18% వాటా. ఈ ఏడాది చివరి నాటికి సుమారు 90–100 బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవల ఎగుమతి ఉండవచ్చనేది విశ్లేషకుల అంచనా. సుంకాల వల్ల ఈ ఎగుమతులన్నీ ఆగిపోతాయా అంటే కాదనే చెప్పవచ్చు. భారత్ అతి తక్కువ ధరలకు, నాణ్యమైన వస్తువుల్ని సరఫరాచేస్తోంది. ఉదాహరణకు ఫార్మాస్యూటికల్ రంగం దాదాపు 8 బిలి యన్ డాలర్ల విలువైన పేటెంట్ లేని ఔషధ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కాక పోతే అక్కడి ప్రజలే ఇబ్బంది పడతారు. అలాగని పూర్తిగా మనకు ఇబ్బంది ఉండదా అంటే... ట్యారిఫ్ల వల్ల అమెరికా ప్రజలు వస్తువులు కొనలేక వినియోగం తగ్గించుకుంటారు. ఆ ప్రభావం మన మీద పడుతుంది. ఇదీచదవండి : బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పైపైకి ఎగబాకుతుండటాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ఇప్పటివరకూ ఇండో – పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, దాని మిత్ర దేశాలు గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ తన చర్యల ద్వారా స్వీయ ముద్ర వేస్తోంది. తైవాన్తో వాణిజ్య ఒప్పందం, ఫిలిప్పీన్స్తో మిసైల్స్ సరఫరా ఒప్పందం, జపాన్తో టెక్నాలజీ సరఫరాకుసంబంధించిన ఒడంబడిక, వియత్నాంతో సైనిక సహకారం, ఇండో నేషియాతో సముద్ర భద్రత వంటి వాటిపై ఒప్పందాలు కుదుర్చు కుంది. అంతటితో ఆగడం లేదు. రష్యా ప్రతిపాదించిన రష్యా–ఇండియా–చైనా (ఆర్ఐసీ) ప్రతిపాదన మరోసారి తెరమీదికివచ్చింది. ఇది సాకారమైతే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి పూర్తిగా గండికొట్టేయ వచ్చు. నిజానికి ట్రంప్ సుంకాలు విధించింది భారత్పై కాదు. అమెరికా ప్రజలపై! 2025లో అన్ని సుంకాల వల్ల సగటు అమెరికా కుటుంబానికి సంవత్సరానికి 3,800 డాలర్ల నష్టం ఏర్పడుతుందని అంటున్నారు. ట్రంప్ లాంటి వాళ్లు ట్యారిఫ్లు ఎంత ఎక్కువ వేసినా భారత్కు ఇబ్బంది తాత్కాలికమే అవుతుంది. కొత్త మార్కెట్లు భారతీయ వ్యాపారులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సవాళ్లు భారతదేశానికి ఎగుమతులను మెరుగుపరచడానికీ, భౌగోళికంగా వైవిధ్యభరితమైన మార్కెట్లను అన్వేషించడానికీ అవకాశం ఇస్తాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. ట్రంప్ ట్యారిఫ్లు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టేందుకు భారతదేశానికి అవకాశం కల్పిస్తాయి. చదవండి: రూ.13వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?-ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు -
మేకిన్ ఇండియాపై జాగ్రత్త
న్యూఢిల్లీ: ‘మేకిన్ ఇండియా’ నినాదమనేది ‘మేక్ ఆల్ దట్ ఇండియా నీడ్స్’ (భారత్కి కావల్సినవన్నీ ఇక్కడే తయారు చేసుకోవడం)గా మారకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. దీనివల్ల చైనాకు వెళ్లే పెట్టుబడులను మనవైపు ఆకర్షించే అవకాశం కోల్పోతామని, ఉత్పాదకతపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మేకిన్ ఇండియా విజయవంతం కావడమనేది, రక్షణాత్మక ధోరణి కన్నా ఎంత మెరుగ్గా పోటీపడగలమనే దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మిగతావారితో పని లేకుండా విడిగా ఉండిపోవడం కాకుండా స్వేచ్ఛా విధానాలను అమలు చేయడం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని దువ్వూరి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పునరుద్ఘాటించినట్లుగా ఆత్మనిర్భర భారత్ నినాద లక్ష్యం రక్షణ, ఇంధనంలాంటి సున్నిత రంగాల్లో వ్యూహాత్మకంగా స్వయం సమృద్ధి సాధించడమే కావాలే తప్ప దాన్ని ప్రతి ఒక్క దానికి అన్వయించుకోకూడదని తెలిపారు. భారత్కి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికి కూడా అవసరమైన వాటిని ఉత్పత్తి చేసే ఎగుమతుల ఆధారిత తయారీ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దడమే మేకిన్ ఇండియా ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ‘‘అయితే, 50 శాతం టారిఫ్ల వల్ల కీలకమైన అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు ఆసియాలోనే అత్యధిక టారిఫ్లు ఎదుర్కొంటున్న మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి సందేహిస్తారు’’ అని దువ్వూరి తెలిపారు. ‘‘ఆసియాలో బంగ్లాదేశ్, వియత్నాం, ఇండొనేíÙయా కన్నా భారత్పై అత్యధిక టారిఫ్లు వర్తిస్తుండటమనేది ఆందోళనకర అంశం. కీలక తరుణంలో చైనా ప్లస్ వన్గా ఎదగాలన్న ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి దీని వల్ల విఘాతం కలుగుతుంది’’ అని చెప్పారు. అమెరికాకు సగం ఎగుమతులపై టారిఫ్ల ప్రభావం .. మన ఎగుమతుల్లో దాదాపు 20 శాతం వాటా ఉండే అమెరికా మార్కెట్లో 50 శాతం టారిఫ్లు విధిస్తే, కనీసం సగం ఎగుమతులపై ప్రభావం పడుతుందని దువ్వూరి తెలిపారు. ముఖ్యంగా టెక్స్టైల్స్, రత్నాభరణాలు, లెదర్లాంటి కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్కు టారిఫ్ల నుంచి మినహాయింపు ఉండటం శాశ్వతమేమీ కాదని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు కొనసాగుతున్న సమీక్షల వల్ల భవిష్యత్తులో వాటిని కూడా టారిఫ్ల పరిధిలోకి చేర్చే అవకాశం ఉందన్నారు.500 బిలియన్ డాలర్ల వాణిజ్యం డౌటే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న భారత్–అమెరికా లక్ష్యం సాకారం కావడం మిథ్యేనని స్పష్టంగా తెలుస్తోందని దువ్వూరి చెప్పారు. మన ఎగుమతుల మీద పడే ప్రభావాలపై లెక్కలు వేసుకోవడానికి ముందు, అమెరికా మార్కెట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రపంచ దేశాలను చైనా తమ ఉత్పత్తులతో ముంచెత్తే ముప్పు గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, దేశీయంగా డెయిరీ, వ్యవసాయం అనేవి రాజకీయంగా చాలా సున్నితమైన రంగాలని, కోట్ల కొద్దీ ప్రజలకు జీవనోపాధి కలి్పంచడంతో పాటు దేశ ఆహార భద్రతకు కూడా ముడిపడి ఉన్నవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా దిగుమతులకు గంపగుత్తగా అనుమతించడం వాంఛనీయమూ, లాభదాయకమూ కూడా కాదని సుబ్బారావు చెప్పారు. అయితే, కొన్ని విషయాల్లో కాస్త పట్టు విడుపులతో వ్యవహరిస్తే చర్చల్లో ప్రతిష్టంభన తొలగేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
అందుకే భారత్పై సుంకాలు.. చైనా, ఈయూ దేశాలకు మినహాయింపు
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు జరుపుతుందని.. తద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం భారత్పై ఏకంగా 50 శాతం సుంకాలు(25 శాతం పెనాల్టీతో కలిపి) విధించింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతూ.. అదే పని చేస్తున్న చైనా, ఈయూల విషయంలో మినహాయింపు దేనికని అమెరికాను నిలదీసింది. దీనికి తోడు చైనా విషయంలో ట్రంప్ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపైనా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే..అమెరికా చైనాను ఎందుకు మినహాయించింది? ఇండియాపై భారీ టారిఫ్లు ఎందుకు? అనే ప్రశ్నలకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో వివరణ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఈ ప్రశ్నలు ఎదురు కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు జరిపే దేశాలే. ఆ రెండు మాస్కోకు ప్రధాన భాగస్వాములే. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ, భారత్తో పోలిస్తే చైనా పరిస్థితులు అందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి.... భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి లాభపడుతోంది. అదే రష్యా నుండి చమురు కొనుగొలు చేసి.. దాన్ని శుద్ధి చేసి ప్రపంచ మార్కెట్కు చైనా విక్రయిస్తోంది. ఒకవేళ.. చైనా మీద మీద గనుక అదనపు సుంకాలు విధించాల్సి వస్తే ఆ ప్రభావంతో ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది’’ అని రుబియో వ్యాఖ్యానించారు.చైనాలో శుద్ధి అవుతున్న రష్యా చమురు గ్లోబల్ మార్కెట్లోకి వెళ్తోంది. ఒకవేళ చైనాపై అదనపు సుంకాలుగానీ, ఆంక్షలుగానీ విధించాల్సి వస్తే.. శుద్ధి చేసిన ఆ చమురు ప్రపంచ మార్కెట్కు అందదు. చమురు కొనుగోలు చేసే దేశాలు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. లేదంటే.. ప్రత్యామ్నాయ వనరులు వెతకాల్సి ఉంటుంది. అంతెందుకు.. చైనా నుంచి శుద్ధి చేయబడిన చమురును యూరప్ దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. అదే సమయంలో.. యూరప్ దేశాలు స్వయంగానూ చమురు, సహజ వాయువును రష్యా నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఇంతకు ముందు.. చైనా, అమెరికాపై వంద శాతం సుంకాలు విధించాలనే సెనెట్ బిల్లు ప్రతిపాదనపై యూరోపియన్ దేశాలు పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఆందోళన్నింటిని పరిగణనలోకి తీసుకునే ఆ పని చేయడం లేదు అని అన్నారాయన.మరి ఐరోపా దేశాలపై సుంకాలు?మరి రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేస్తున్న యూరప్ దేశాలపై సుంకాలు విధిస్తారా? అనే ప్రశ్నకు రూబియో బదులిచ్చారు. యూరప్ నేరుగా ఆంక్షలు, సుంకాల విధింపు గురించి నా దగ్గర స్పష్టమైన సమాచారం లేదు. కానీ, పరోక్షంగా విధించే అవకాశాలు మాత్రం లేకపోలేదని అన్నారాయన. ఈ విషయంలో యూరోపియన్ దేశాలతో టిట్ ఫర్ టాట్ తరహా వాదనలు (tit-for-tat) చేయడం నాకు ఇష్టం లేదు. కానీ, ఈ సమస్యను పరిష్కరించడంలో యూరోప్ నిర్మాణాత్మక పాత్ర పోషించగలదని మాత్రం నమ్ముతున్నా అని రుబియో అభిప్రాయపడ్డారు. -
భారత్-పాక్లపై ‘అనుమానం’: ట్రంప్కు రూబియో వంతపాట
వాషింగ్టన్: భారత్- పాక్లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అమెరికా అనుక్షణం గమనిస్తున్నదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు. సుదీర్ఘ ఘర్షణల తర్వాత కాల్పుల విరమణను కొనసాగించడం సవాలుగా మారుతుందని అందుకే అమెరికా.. భారత్-పాక్లపై ఓ కన్నేసి ఉంచిందని ఆయన పేర్కొన్నారు.ప్రపంచంలోని ఇతర ఉద్రిక్తతల దేశాలతో పాటు భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న పరిస్థితిని అమెరికా ప్రతిరోజూ గమనిస్తున్నదని, ప్రస్తుత, భావి సంఘర్షణలను నిరోధించే శాంతి ఒప్పందం లక్ష్యంగా అమెరికా దృష్టి సారించిందని రూబియో అన్నారు. ‘ప్రతిరోజూ పాకిస్తాన్-భారతదేశం మధ్య ఏమి జరుగుతున్నదో, కంబోడియా- థాయిలాండ్ మధ్య ఏమి చోటుచేసుకుంటున్నదో తాము నిరంతరం గమనిస్తూనే ఉన్నామని రూబియో మీడియాకు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు అమెరికా కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నదని, అయితే శత్రుత్వం కొనసాగుతున్నప్పుడు చర్చలు జరపడం కష్టమని రూబియో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. Hopefully everybody is OK in South Provo where there’s a large fire raging on the mountain side within the last hour. pic.twitter.com/f96mSWMVH3— Jarom Jordan (@jaromjordan) August 17, 2025యుద్ధ విరమణకు ఏకైక మార్గం ఇరుపక్షాలు పరస్పరం కాల్పుల విరమణకు అంగీకరించడమేనన్నారు. అయితే రష్యన్లు ఇందుకు అంగీకరించలేదని, ఉక్రెయిన్తో యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. సుదీర్ఘ ఘర్షణల తర్వాత కాల్పుల విరమణ అనేది చాలా త్వరగా విచ్ఛిన్నమవుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం మాత్రమే కాకుండా, భవిష్యత్తు సంఘర్షణలను నిరోధించేలా శాంతి ఒప్పందం కుదరడం లక్ష్యంగా ఉండాలని రూబియో పేర్కొన్నారు.కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో తాను భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని, పదేపదే చెబుతూ వచ్చారు. తన జోక్యంతో రెండు అణ్వాయుధ దేశాల మధ్య కాల్పుల విరమణకు సహకరించానని ట్రంప్ వాదించారు. అయితే భారత్ ఈ వాదనలను తిరస్కరించింది. పాకిస్తాన్తో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారం ద్వైపాక్షికంగానే జరుగుతున్నదని, మూడవ పక్షం మధ్యవర్తిత్వం పాత్ర ఏమీలేదని స్పష్టం చేసింది. -
ఆసియా కప్ హాకీ టోర్నీ మస్కట్ ‘చాంద్’ ఆవిష్కరణ
రాజ్గిర్ (బిహార్): ఈ నెలాఖరులో భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీకి సంబంధించి కనువిందు చేసే ‘మస్కట్’ను ఆదివారం ఆవిష్కరించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారిక మస్కట్గా ‘చాంద్’ (చందమామ)ను ఆవిష్కరించారు. భారత దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ ప్రాక్టీస్ స్ఫూర్తితో పాటు బిహార్లోని ప్రఖ్యాత వాల్మీకి టైగర్ రిజర్వ్లోని పులుల శౌర్యానికి ప్రతీకగా ‘చాంద్’ను ఆవిష్కరించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) తెలిపింది. ఫ్లడ్లైట్లు కాదు కదా... కనీసం పూర్తిస్థాయి వీధి దీపాలు లేని ఆ రోజుల్లో చందమామ పంచిన వెన్నెల వెలుగుల్లోనే ధ్యాన్చంద్ తన ప్రాక్టీస్ను పూర్తి చేసేవారు. ఆ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఆయన పుట్టిన రోజున (ఆగస్టు 29) మొదలయ్యే ఆసియా కప్ టోర్నీకి ‘చాంద్’ మస్కట్ను ఖరారు చేశారు. సెపె్టంబర్ 7 వరకు రాజ్గిర్లోని స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఆసియా దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో మొదట్లో ఆసక్తి కనబరిచిన దాయాది పాకిస్తాన్ జట్టు చివరకు వైదొలగింది. పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది. ఆసియా కప్ టోర్నీ విజేత వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. 16 జట్లు పోటీపడే ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటికే ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటీనా, జర్మనీ, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. -
మనమంటే మొహం మొత్తిందా?
ఇండియాపై ట్రంప్కు మొహం మొత్తిందా? ఆయన తన చేతల ద్వారా అదే విషయాన్ని తెగేసి చెబుతున్నారా? ఆయన మనపై 50% సుంకాలు విధించారు. సుంకాలపై వివాదం పరిష్కారమ య్యేంత వరకూ వాణిజ్య చర్చలను సుప్తావస్థలో పెడుతున్నట్లు ఆయన తెలి పారు. భారతదేశ మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను లెక్క చేయబోనని కరాఖండీగా చెప్పేశారు. రష్యా చమురును కొంటూ, అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు తెస్తోందని ట్రంప్కు వాణిజ్య సలహాదారైన పీటర్ నవారో ప్రకటించారు. పుతిన్తో ట్రంప్ చర్చలు విఫలమైతే భారత్పై సెకండరీ సుంకాలు పెరగ వచ్చని ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ వెల్లడించారు. యూరప్ కూడా భారత్పై సెకండరీ సుంకాలు విధించాలని ఆయన కోరారు. అమె రికా స్నేహహస్తం నుంచి భారత్ చేజారిందని ఇవన్నీ సూచిస్తున్నాయా? చైనా, రష్యాలను హెచ్చరించేందుకు భారత్ను ట్రంప్ వాడు కుంటున్నారనే అభిప్రాయమూ ఉంది. అది కూడా సంతోషపడదగ్గ అంశం కాదు. మనం ఆనుషంగిక నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మనం ఏమైపోయినా నిజంగానే, ఆయనకు పట్టదు.మరోపక్క, ట్రంప్ పాకిస్తాన్తో ప్రేమలో పడినట్లు కనిపిస్తోంది. అదీ మనల్ని సంకటంలో పడేసే సంగతే. ఆయన పాక్పై 19% సుంకాలే విధించారు. ఆయన ప్రభుత్వం ఇస్లామాబాద్ను ఉగ్రవాదంపై పోరాటంలో ‘అసాధారణ భాగస్వామి’గా పరిగణి స్తోంది. ‘ఉగ్రవాద సంస్థలను అరికట్టడంలో విజయాలను కొనసా గిస్తున్నందుకు’ అది ఇటీవల పాకిస్తాన్ను కొనియాడింది. ట్రంప్... పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ను విందుకు ఆహ్వానించి, చమురును వెలికితీయడంలో పాక్కు సాయపడతామని చెప్పారు. నిజం చెప్పా లంటే, ఏదో ఒక రోజున పాక్ నుంచి భారత్ కూడా చమురును కొనుగోలు చేసే రోజు రావచ్చని, ఆయన మనల్ని కవ్వించారు.అంటే, ఆయనకు పాకిస్తాన్ కొత్త ముద్దుగుమ్మగా మారినట్లా? రష్యన్ చమురు ఢిల్లీని చీకాకుపరచే అంశంగా మారడమేకాదు, అది పరిష్కారమయ్యేంత వరకూ భారత్తో వాణిజ్య చర్చలు జరి పేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు కనుక మొదట దానిపై దృష్టి కేంద్రీకరిద్దాం. పైగా, జరిమానా కింద మరిన్ని సుంకాలు విధిస్తా మని బిసెంట్ హెచ్చరించారు. సత్యం ఏమంటే, రష్యన్ చమురు కొనేటట్లుగా ఇండియాను బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ‘వాస్తవానికి, ధరపై పరిమితి ఉన్న రేటు వద్ద రష్యన్ చమురు కొనుగోలు చేయాల్సిందిగా మేము (అమెరికా) కోరబట్టే వారు (ఇండియా) కొనుగోలు చేశారు...ఎందుకంటే, చమురు ధరలు పెరగడం మాకిష్టం లేదు. వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు’ అని ఢిల్లీలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి 2024 మే నెలలో చెప్పారు. ట్రంప్ ఈరోజు, తనకు ముందున్న ప్రభుత్వ విధానాన్ని కావాలని ఉపేక్షిస్తూ, ఇండియాను నిందిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ ఆత్మవంచన తేటతెల్లమవుతోంది. రష్యా నుంచి అమెరికా పాలాడియం, యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే, గడచిన ఆరు నెలల్లో ఈ దిగుమతుల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది. రష్యా నుంచి అమెరికా స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నప్పుడు లేని అభ్యంతరం, ఇండియా పట్లనే ఎందుకు? ఇక మూడవ అంశం – ట్రంప్ అసలు ఉద్దేశాలను బయట పెడుతోంది. ఆయన ద్వంద్వ ప్రమాణాలకు ఇది మరో నిదర్శనం. రష్యా చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్న, మూడవ పెద్ద దిగుమతిదారులుగా ఉన్న చైనా, తుర్కియేలను ట్రంప్ హెచ్చరించ లేదు. రష్యన్ చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ, స్లొవేకియా – రెండూ యూరప్ దేశాలు, ‘నాటో’లో సభ్యత్వం ఉన్నవీనూ! కానీ ట్రంప్ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి జపాన్ కూడా దిగుమతి చేసుకుంటున్న సంగతిని ఆయన సమయానుకూలంగా విస్మరిస్తున్నారు. చైనాపై సుంకాల విధింపులో ఇచ్చిన విరామాన్ని ఆయన ఇటీవల మరో 90 రోజులు పొడిగించారు. ఆయన ఢిల్లీపైన మాత్రమే మూడవ కన్ను తెరిచారని స్పష్టమవుతోంది. ఈ సమస్యకు సంబంధించి మరో పార్శ్వం కూడా అంతే కలవరపరుస్తోంది. ‘క్వాడ్’ (ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమె రికా)లోని మిగిలిన మూడు దేశాలతో తనకు అవసరం తీరిపోయిందని ట్రంప్ భావిస్తున్నారని... ఆయన వైఖరి, నడతను బట్టి అర్థం చేసుకోవచ్చా? అదే నిజమైతే, ఇండో–పసిఫిక్ వ్యూహం విషయంలో అమెరికా వైఖరి ఏమిటి? చైనాతో మనకున్న సమస్యల దృష్ట్యా ‘క్వాడ్’ కూటమి మనకు ఊరటనిచ్చిన మాట నిజం. ‘క్వాడ్’ పట్ల ట్రంప్ నిబద్ధత చూపకపోతే, అది మనకు మరిన్ని చిక్కులు సృష్టించవచ్చు.చైనాతో ట్రంప్ ఆర్థిక ఒప్పందానికి వస్తారా? ఊహించడం కష్టం. కానీ, షీ జిన్ పింగ్తో శిఖరాగ్ర సమావేశమై ఆయన ఇప్పటికే మాట్లాడుతున్నారు కనుక, అటువంటి దానికి అవకాశం ఉందని పిస్తోంది. చైనాను రాజకీయంగా మరింత మెరుగ్గా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందా అనేది ప్రశ్న. బీజింగ్ ప్రాంతీయ ఆకాంక్షలకు అమెరికా మరింత వెసులుబాటు కల్పిస్తుందా? ఒకవేళ అదే కార్యరూపం ధరిస్తే, చైనాతో సరిహద్దు వివాదంపై అమెరికా మద్దతు మనకు కొనసాగుతుందా? ఈ విషయమై మనం ఎటువంటి వైఖరిని అనుసరించాలన్నది పెద్ద ప్రశ్న? జవాబు కోసం మనం గాభరా పడాల్సిన అవసరం లేదు. మన నుంచి దిగుమతి చేసుకోకపోతే బతకలేమన్నంతగా, అమెరికా మొహం వాచి చూస్తున్నవాటిని మనం ఏమీ అమెరికాకు ఎగుమతి చేయడం లేదు. చైనా వద్ద రేర్ ఎర్త్ ఖనిజాలు, లోహాలు ఉన్నాయి. మనకి లేవు! కనుక, బేరసారాలకి మనకున్న అవకాశం తక్కువ. మనకున్న ఆశ ఒక్కటే! ఉక్రెయిన్పై పుతిన్–ట్రంప్ ఒక ఒప్పందానికి రాగలిగితే, అది మనపై విధించిన సెకండరీ ఆంక్షలను ఎత్తివేయడానికి తోడ్పడవచ్చు. అమెరికా దృష్టిలో భారత్ ఇప్పటికీ ఉందని స్కాట్ బిసెంట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అనుకున్నట్లు జరగకపోతే ట్రంప్ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు మనం గురికావాల్సిందే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
టీ ఒక్కటి వెయ్యి రూపాయలా..?
దుబాయ్: భారత్లో ఒక్క టీ ఖరీదు వెయ్యి రూపాయలుందంటూ వ్లాగర్ పరీక్షిత్ బలోచ్ ఆశ్చర్యంతో చేసిన పోస్ట్కు భారీగా స్పందన లభిస్తోంది. దుబాయ్లో ఉంటున్న భారతీయ ట్రావెల్ వ్లాగర్, రేడియో ప్రజెంటేటర్ ఇటీవల ముంబైలో తనకు కలిగిన అనుభవాన్ని ఇన్స్టాలో పంచుకున్నారు. ‘ముంబైలోని ఓ హోటల్లో ఒక కప్పు టీ తాగితే నాకు వెయ్యి రూపాయల బిల్లయింది. అది చూసి షాకయ్యా. సాధారణమైన అవసరాలు సైతం ఇంత ఖరీదుగా మారడం చూసి నమ్మలేకపోయా. దుబాయ్లో ఉంటూ దిర్హామ్లలో సంపాదన కలిగిన నేను భారత్లో ఉండగా ఎన్నడూ పేదవానిగా భావించలేదు. కానీ, టీ బిల్లు చూసి మునుపటిలా కాకుండా, భారత్లో సైతం పరిస్థితులు మారాయని అనిపించింది’అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. దీనికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. భారత్లో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. పలువురు ఇలాంటి అనుభవాల్నే పంచుకున్నారు. ముంబైలాంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ‘నేను ఏటా ముంబై వెళ్తుంటా. కొన్నిటికైతే దుబాయ్ కంటే ముంబైలోనే ఖరీదెక్కువ’అని ఒకరంటే, ‘చివరికి ఏవరో ఒకరు ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. భారత్కు వచ్చాక పేదవానిగా మారింది నేను ఒక్కడినే అని ఇప్పటిదాకా అనుకునేవాణ్ని’అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఇండియా వెళ్లిన ప్రతిసారీ నాకు ఇదే అనుభవం ఎదురవుతోంది. డాలర్లలో సంపాదన కలిగిన నేనే ఇంతగా ఇబ్బంది పడితే, స్థానికంగా ఉండే వారు ఎలా బతుకుతున్నారో ఏమో? ఇంత డబ్బు వారికి ఎలా వస్తుంది? నాకీ విషయం తెలిస్తే, ఇండియాను వదిలేసే వాణ్నే కాదు’అంటూ ఇంకొకరు ముక్తాయింపునిచ్చారు. -
నేడు స్వదేశానికి శుభాంశు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో గడిపి చరిత్ర సృష్టించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆదివారం అమెరికా నుంచి స్వదేశానికి రానున్నారు. యాగ్జియం–4 మిషన్ కోసం అమెరికాలో గత ఏడాదిగా శిక్షణ పొందిన శుక్లా ముందుగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు. అనంతరం, యూపీలోని సొంతూరు లక్నోకు బయలుదేరి వెళతారు. ఆ తర్వాత అక్టోబర్లో మొదలయ్యే గగన్యాన్ మిషన్ శిక్షణలో పాల్గొంటారు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం–4 మిషన్లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. జూన్ 26వ తేదీ నుంచి ఐఎస్ఎస్లో పలు ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి జూలై 15న భూమిపైకి చేరుకున్నారు. శనివారం శుభాంశు విమానంలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నేను స్వదేశానికి చేరుకునేందుకు విమానంలో కూర్చు న్నప్పుడు, మిశ్రమ భావోద్వేగాలు కలిగాయి. గత ఏడాదికాలంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుగా ఉన్న అద్భుతమైన వ్యక్తులను విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు ఓ వైపు బాధ, మిషన్ తర్వాత మొదటిసారిగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, దేశంలోని ప్రతి ఒక్కరినీ కలవబోతున్నందుకు మరో వైపు ఉత్సాహం ఉన్నాయి. జీవితం అంటే ఇదేనేమో అని అనుకుంటున్నాను’అని శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం హూస్టన్లోని భారత కాన్సులేట్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో శుక్లాతోపాటు వ్యోమగామిగా ఎంపికైన ప్రశాంత్ నాయర్ కూడా పాల్గొన్నారు. -
నా దేశం.. శత్రుదుర్భేద్యం!
శ్రీకృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం స్ఫూర్తితో.. దేశానికి భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించారు. దీంతో ప్రపంచదేశాల దృష్టి ఒక్కసారిగా మనపై పడింది. నిజమే.. రక్షణ రంగంలో ఇప్పుడున్నది ఒకప్పటి భారత్ కాదు. గత పదేళ్లలోనే రక్షణ రంగంలో ఉత్పత్తుల విలువ పెరగడం.. దిగుబడులు తగ్గడమే ఇందుకు నిదర్శనం. అప్పట్లో మన ఆయుధాల్లో 65 శాతం దిగుమతులే. అది ఇప్పుడు 35 శాతానికి పరిమితం చేయగలిగాం. ‘మేడిన్ ఇండియా’ ఆయుధాలతో మన సత్తా ఏంటో ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రపంచానికి చాటాం. – సాక్షి, స్పెషల్ డెస్క్త్వరలో దేశానికి సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ రానుంది. ఇందులో భాగంగా దేశంలోని కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని ఏర్పాటు చేయనున్నారట. అంతేకాదు, ప్రతిదాడి వ్యవస్థను కూడా రూపొందిస్తారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటి వాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్డోమ్ తరహాలో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్షణ ఉత్పత్తుల్లో మన దేశం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందనడానికి ప్ర‘బల’ నిదర్శనం. ఉత్పత్తుల్లో రికార్డు2013–14లో దేశ రక్షణ రంగ బడ్జెట్ రూ.2.53 లక్షల కోట్లు. 2025–26లో అది 2.6 రెట్లు పెరిగి రూ.6.81 లక్షల కోట్లకు చేరింది. 2024–25లో మనదేశం రికార్డు స్థాయిలో రూ.2.09 లక్షల కోట్ల విలువైన 193 డిఫెన్స్ కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇందులో రూ. 1.69 లక్షల కోట్ల విలువైన 177 కాంట్రాక్టులు దేశీయ సంస్థలవే కావడం గమనార్హం. 2014–15లో దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.46,429 కోట్లు. 2024–25లో ఇది రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షల కోట్లకు చేరిందని ఇటీవల కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అంటే మూడు రెట్లకుపైగా పెరిగింది! 2019–20లో ఇది కేవలం రూ.79,071 కోట్లే. అంటే 5 ఏళ్లలోనే దాదాపు రెట్టింపయిందన్నమాట. ఎగుమతుల జోరు» 2013–14లో రూ.686 కోట్లుగా ఉన్న మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు.. 2024–25 నాటికి ఏకంగా 34 రెట్లు పెరిగి రూ.23,622 కోట్లకు చేరాయి. ఈ ఎగుమతుల్లో రక్షణ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల వాటా 77 శాతం కాగా.. ప్రైవేటు రంగ వాటా 23 శాతం కావడం విశేషం. వీలైనంత త్వరలో రక్షణ పరికరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. మనదేశ రక్షణ ఉత్పత్తులు అమెరికా, ఫ్రాన్స్ వంటి 100 దేశాలకు వెళ్తున్నాయి. అమెరికా వాటా 10% లోపే!గత దశాబ్దకాలంలో మనదేశ రక్షణ దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. మనకు ప్రధాన ఎగుమతిదారులు రష్యా, ఫ్రాన్స్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) గణాంకాల ప్రకారం.. » మన మొత్తం దిగుమతుల్లో సుమారు 40 శాతం రష్యా నుంచే వస్తున్నాయి. » 2020లో ఫ్రాన్స్ నుంచి దిగుమతులు 25 శాతానికిపైగా ఉంటే.. 2021లో ఏకంగా 50 శాతానికి పెరిగాయి. ఆతరవాత తగ్గుతూ 2024లో సుమారు 15 శాతానికి పరిమితమయ్యాయి.» మొత్తం దిగుమతుల్లో ఇజ్రాయెల్ నుంచి 2022 వరకు 10 శాతంగానే ఉన్న వాటా.. 2023లో ఒక్కసారిగా 40 శాతానికి చేరింది. 2024లో అది సుమారు 28 శాతానికి చేరింది. » 2020 నుంచి చూస్తే అమెరికా వాటా ఎప్పుడూ 20 శాతం కూడా దాటలేదు. ప్రస్తుతం 10 శాతంలోపే ఉంది.ఆ మూడు దేశాలే..మనదేశానికి యుద్ధ విమానాల సరఫరాలో ఫ్రాన్స్ కీలకపాత్ర పోషిస్తోంది. 2020–25 మధ్య రికార్డు స్థాయిలో 2,543 సరఫరా చేయగా, రష్యా నుంచి 1,280 దిగుమతి చేసుకున్నాం. ఇక మిసైళ్ల విషయానికొస్తే రష్యా నుంచి 1,149, ఇజ్రాయెల్ నుంచి 802 వచ్చాయి. శత్రువుల దాడులను తట్టుకోగలిగే దుర్భేద్యమైన రక్షణ వాహనాలు రష్యా నుంచి మాత్రమే 963 వచ్చాయి. గగన తల భద్రతా వ్యవస్థలు రష్యా నుంచి 390, ఇజ్రాయెల్ నుంచి 376 వచ్చాయి. ఫ్రాన్స్ నుంచి 899, రష్యా నుంచి 304 షిప్స్ దిగుమతి చేసుకున్నాం. ఏయే ఆయుధాల కోసం ప్రధానంగా ఏయే దేశాలపై ఆధారపడుతున్నామంటే..విమానాలు: ఫ్రాన్స్, రష్యా, అమెరికాగగనతల రక్షణ వ్యవస్థలు: రష్యా, ఇజ్రాయెల్దుర్భేద్యమైన రక్షణ వాహనాలు: రష్యామిసైళ్లు: రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్సెన్సర్లు: ఇజ్రాయెల్, జర్మనీ, ఫ్రాన్స్షిప్స్ : ఫ్రాన్స్, రష్యా -
యాపిల్ ఉత్పత్తుల సరఫరా 21% అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో భారత్లో యాపిల్ ఉత్పత్తుల సరఫరా వార్షికంగా 21.5 శాతం పెరిగి 59 లక్షల యూనిట్లకు చేరుకుంది. అత్యధికంగా సరఫరా అయిన మోడల్గా ఐఫోన్ 16 నిల్చింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఓ నివేదికలో ఈ విషయాలు తెలిపింది. దీని ప్రకారం గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే దేశీ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల సరఫరా 0.9 శాతం పెరిగి 7 కోట్లకు చేరింది. పోకో, షావోమీ, వన్ప్లస్, రియల్మి తదితర చైనా సంస్థల ఫోన్ల సప్లై తగ్గింది. ఇక రెండో త్రైమాసికంలో మొత్తం 3.7 కోట్ల స్మార్ట్ఫోన్స్ సరఫరా అయ్యాయి. యాపిల్ ఐఫోన్ల సరఫరా 19.7 శాతం పెరిగి 27 లక్షల యూనిట్లకు చేరింది. స్మార్ట్ఫోన్ మార్కెట్లో 7.5 శాతం వాటా దక్కించుకుంది. మరిన్ని విశేషాలు.. → జూన్ క్వార్టర్లో 19 శాతం మార్కెట్ వాటాతో వివో అగ్ర స్థానంలో (23.5 శాతం వార్షిక వృద్ధి) నిల్చింది. 14.5 శాతం వాటాతో శాంసంగ్ (21 శాతం వృద్ధి) రెండో స్థానంలో ఉంది. ఒప్పో (13.4 శాతం వాటా, 25.4 శాతం వృద్ధి), మోటరోలా (8 శాతం వాటా, 39.4 శాతం వృద్ధి) ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. → వన్ప్లస్ మార్కెట్ వాటా 4.4 శాతం నుంచి 2.5 శాతానికి, సరఫరా 39.4 శాతం మేర పడిపోయాయి. → రియల్మి మార్కెట్ వాటా 9.7 శాతానికి, స్మార్ట్ఫోన్ల సప్లై 17.8 శాతం మేర క్షీణించాయి. అటు షావోమీ మార్కెట్ వాటా కూడా 9.6 శాతానికి, వాల్యూమ్స్ 23.5 శాతం స్థాయిలో తగ్గాయి. పోకో 3.8 శాతానికి తగ్గగా, సరఫరా 28.8 శాతం మేర క్షీణించింది. → ప్రీమియం సెగ్మెంట్ డివైజ్లు (రూ.52,000 నుంచి రూ. 70,000 వరకు) అత్యధికంగా 96.4% వృద్ధి చెందాయి. మార్కెట్ వాటా 2 నుంచి 4 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో ఐఫోన్ 16/15ల వాటా అయిదింట మూడొంతులు ఉంది. → సూపర్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లు (రూ. 70,000 కన్నా పైన) 15.8% వృద్ధి చెందగా, మార్కెట్ వాటా పెద్దగా మార్పులు లేకుండా 7 శాతంగా కొనసాగింది. శాంసంగ్, యాపిల్ మార్కెట్ వాటా వరుసగా 49%, 48%గా ఉంది. ఈ సెగ్మెంట్లో ఐఫోన్ 16, గెలాక్సీ ఎస్25, ఎస్24 అల్ట్రా, ఎస్25, ఐఫోన్ 16ప్లస్ కీలక మోడల్స్గా ఉన్నాయి. → స్మార్ట్ఫోన్ల సగటు విక్రయ ధర (ఏఎస్పీ) 10.8% పెరిగి రికార్డు స్థాయిలో 275 డాలర్లకు చేరింది. → ఎంట్రీ స్థాయి (రూ. 8,700 లోపు) సెగ్మెంట్ 22.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది క్వార్టర్తో పోలిస్తే మార్కెట్ వాటాను 14 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. → మాస్ బడ్జెట్ సెగ్మెంట్ (రూ. 8,700 నుంచి రూ. 17,400 వరకు) ఫోన్ల సరఫరా పరిమాణం 1.1 శాతం పెరగ్గా, ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్ (రూ. 17,400 – రూ. 35,000) సరఫరా 2.5 శాతం, మార్కెట్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గాయి. -
గూగుల్ని అడిగేస్తూ..చెప్పింది చేసేస్తూ..
ఒకప్పుడు.. తేలికపాటి అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుడి దగ్గరికో దగ్గరిలోని మెడికల్ షాపుకో వెళ్లేవాళ్లం. డాక్టర్ రాసినవో, మెడికల్ షాపువాళ్లు ఇచ్చినవో మందులు తెచ్చుకునేవాళ్లం. దగ్గరివాళ్లు ఇచ్చే ఆరోగ్య సలహా పాటించేవాళ్లం. ఇప్పుడు ఇంటర్నెట్ కాలం నడుస్తోంది. ఆరోగ్యం, శరీర సంరక్షణకు సంబంధించి ప్రజల ప్రవర్తన, ప్రాధాన్యతలు ఎంతలా మారాయంటే సమస్య వచ్చినప్పుడే కాదు ఆర్యోగంగా ఉండేందుకూ ఏం చేయాలో సింపుల్గా గూగుల్ను అడిగేస్తున్నారు! – సాక్షి, స్పెషల్ డెస్క్ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు, అనుమానాలను.. ఇతరులతో చర్చించడానికి చాలామంది ఇష్టపడరు. అంతేకాదు, హాస్పిటల్కు వెళితే ఖర్చు అని వెనకడుగు వేసేవారూ ఉన్నారు. ఇంటర్నెట్ రాక, గూగుల్ సెర్చ్ ఇంజిన్ దైనందిన జీవితంలో భాగమయ్యాక ఇలాంటి వాళ్లందరికీ పెద్ద ఉపశమనం లభించినట్టు అయింది. చిన్న సమస్య తలెత్తినా, అనుమానం ఉన్నా, వేరొకరికి చెప్పలేనిదైనా.. ఒకరిపై ఆధారపడకుండా సింపుల్గా గూగుల్ని అడిగేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ ‘కాంటార్’ రూపొందించిన ‘హెల్త్ అండ్ వెల్నెస్ ఇన్ ఇండియా’ నివేదికే ఇందుకు నిదర్శనం. హెల్త్, వెల్నెస్కు సంబంధించి 2024లో నెటిజన్లు గూగుల్లో వెతికిన 110 రకాలకుపైగా అంశాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. ‘మన’ గూగుల్‘ఫలానా ఉత్పత్తి వాడాను, చాలా బాగా పనిచేసింది’. ‘ఫలానా పద్ధతి పాటించడం వల్ల పరిష్కారం దొరికింది’ అంటూ మన అనుకున్నవారిచ్చే సలహా పాటిస్తాం. మరి మన అని అనుకున్నవారు లేకపోతే? గూగుల్ను ఆశ్రయిస్తున్నారు! ప్రపంచవ్యాప్తంగా రోజుకు 850 కోట్ల వరకు గూగుల్ సెర్చెస్ నమోదవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ సెర్చ్ ఇంజిన్ ‘మన’ అయిందో అర్థం చేసుకోవచ్చు. భారత్ నుంచి గూగుల్లో నెలకు 1,200 కోట్ల విజిట్స్ నమోదవుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో యూఎస్ తర్వాత రెండో స్థానం మనదే. అయితే సెర్చ్ ఇంజిన్ చూపించే ఉత్పాదనను ఎంత మంది కొన్నారు, రేటింగ్స్ ఏంటి, రివ్యూలు ఏం చెబుతున్నాయో తెలుసుకున్నాకనే యూజర్లు అడుగు ముందుకేస్తున్నారు. జాగ్రత్త అవసరంగూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లను నమ్మి ఔషధాలు కొని, వాడేయటం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుడు.. పేషెంట్ శరీర తత్వాన్ని పూర్తిగా తెలుసుకుని మందులు సిఫార్సు చేస్తాడు. కానీ గూగుల్ అలాకాదు.. సాధారణీకరించి మందులు చెప్పేస్తుంది. అందువల్ల గూగుల్ సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలు పోషకాలు–సప్లిమెంట్లు, ప్రత్యామ్నాయ వైద్యం, చర్మ సంరక్షణ, శారీరక దృఢత్వం, శరీర బరువు నిర్వహణ, మానసిక ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, నిద్ర, రోగనిరోధక శక్తి, అధునాతన వైద్యం, డీటాక్సిఫికేషన్ , దీర్ఘాయువు, బీ12 అధికంగా ఉండే ఆహారం, నడకకు ఉత్తమమైన షూ, సున్నిత చర్మానికి సౌందర్య సాధనాలు, చక్కెర లేని ఆహార పదార్థాలు.. వగైరా.టాప్–5 పోకడలునమ్మదగిన ఆరోగ్య పరిష్కారాలుప్రత్యక్షంగా కనిపించే, నమ్మకమైన ఫలితాలను వినియోగదారులు కోరుకుంటున్నారు. చర్మ సంరక్షణ, శరీర బరువు నిర్వహణ, వ్యాయామంపై 2.66 కోట్ల సెర్చులు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇవి 39% పెరిగాయి. చర్మ ఆరోగ్యానికి కొల్లాజెన్, మెరుగైన నిద్ర కోసం మెలటోనిన్, శక్తి కోసం ప్రీ–వర్కౌట్ సప్లిమెంట్స్ కోసం జనంలో ఆసక్తి పెరిగింది.క్లినికల్, స్వీయ–సంరక్షణసైన్ ్స ఆధారిత వెల్నెస్ ఎక్కువగా కోరుకుంటున్నారు. బరువు తగ్గించే జీఎల్పీ–1 మందులు, జ్ఞాపకశక్తి పెంచే సప్లిమెంట్లు, హార్మోన్ల ట్రాకింగ్ కోసం 1.46 కోట్ల శోధనలు జరిగాయి. 2023తో పోలిస్తే ఇవి 13 శాతం ఎక్కువ. అంతర్గత ఆరోగ్యం–బాహ్య శక్తిఅందం, మానసిక స్థితి, శరీర బరువు నిర్వహణ, వృద్ధాప్యం వంటి సమస్యలు.. పోషకాహారం, పేగు (గట్) ఆరోగ్యం, రోగనిరోధక శక్తితో ముడిపడి ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. ఈ తరహా సెర్చ్లు 1.45 కోట్ల వరకు జరిగాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహకరించే ఔషధాలు, మల్టీవిటమిన్ లపై జనంలో ఆసక్తి పెరిగింది.ఆరోగ్యకర దినచర్యలురోజువారీ దినచర్యలు, ఆరోగ్య నిర్వహణలపై ప్రజల శ్రద్ధ పెరిగింది. 9% పెరుగుదలతో ఈ విభాగంలో 99 లక్షల శోధనలు నమోదయ్యాయి. హైడ్రేషన్, ఋతు చక్రం, ధ్యానం, యోగా వంటివి ట్రాక్ చేయడానికి సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మహిళలు నెలసరి సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యామ్నాయ వైద్యంఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, డిటాక్స్ టీ, బయోహ్యాకింగ్ వంటి వాటి గురించి 17% వృద్ధితో 87 లక్షల సెర్చ్లు జరిగాయి. (శాస్త్ర, సాంకేతికతల సాయంతో మన శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం లేదా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడాన్ని బయో హ్యాకింగ్ అంటారు.)పోషకాలు–సప్లిమెంట్లువిటమిన్ బీ12 కోసం 27 లక్షల శోధనలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇవి 54 శాతం ఎక్కువ కావడం గమనార్హం.చర్మ ఆరోగ్యంసున్నితమైన చర్మం కోసం సెర్చులు 30% పెరిగాయి.బరువు నిర్వహణజీఎల్పీ1 ఔషధాలైన ఓజెంపిక్ కోసం 216%, జెప్బౌండ్కు 943% అధికంగా సెర్చులు నమోదయ్యాయి.ఒత్తిడి తగ్గేందుకు కార్టిసాల్ కోసం శోధనలు 59% పెరిగాయి.మహిళల ఆరోగ్యంగతంతో పోలిస్తే.. రుతుచక్రంలోని దశల గురించి వెతకడం 100 శాతానికిపైగా పెరిగింది.నిద్రమెలటోనిన్ సంబంధిత స్ప్రే, గమ్మీలు, ట్యాబ్లెట్ల కోసం సెర్చులు 27% పెరిగి 45 లక్షలకు చేరుకున్నాయి. చక్కెరచక్కెర రహిత, చక్కెరకు ప్రత్యామ్నాయాల కోసం.. గతంలో కంటే 14 శాతం ఎక్కువగా 74 లక్షల శోధనలు జరిగాయి. -
టాప్ షూటర్లంతా బరిలోకి...
న్యూఢిల్లీ: కజకిస్తాన్లో జరిగే ఆసియా చాంపియన్షిప్లో భారత టాప్ షూటర్లంతా పతకాలపై గురిపెట్టేందుకు సిద్ధమయ్యారు. డబుల్ ఒలింపిక్ పతకాల విజేత మను భాకర్, సిఫ్త్ కౌర్, అర్జున్ బబుతా, సౌరభ్ చౌదరి తదితర మేటి షూటర్లు సహా 182 మందితో కూడిన భారత బృందం ఆసియా చాంపియన్షిప్లో పాల్గొంటోంది. ఈ టోర్నీ బరిలోకి దిగుతున్న భారీ సేన మన జట్టే కావడం విశేషం. సోమవారం నుంచి కజకిస్తాన్లోని షింకెంట్ నగరంలో ఈ పోటీలు జరుగనున్నాయి. రైఫిల్, పిస్టల్, షాట్గన్ విభాగాల్లో 58 ఈవెంట్లలో పోటీలుంటాయి. ఇందులో 46 వ్యక్తిగత ఈవెంట్లు కాగా, 12 మిక్స్డ్ టీమ్ ఈవెంట్ పోటీలు నిర్వహిస్తారు. భారత్ సీనియర్ విభాగంలోనే ఒక్కో ఈవెంట్లో ఐదుగురు చొప్పున షూటర్లను బరిలోకి దింపుతోంది. వీటిలో మూడు పతకాలకు ఆస్కారం ఉండగా, మరో ఇద్దరు ర్యాంకింగ్ పాయింట్స్ కోసం ఆడతారు. ఇప్పటివరకు జరిగిన ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లలో భారత్ 59 పతకాలు గెలుపొందింది. ఇందులో 21 స్వర్ణాలు, 22 రజతాలు, 16 కాంస్యాలున్నాయి. చివరిసారిగా చాంగ్వాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన ఈవెంట్లో భారత జట్టు ఆరు బంగారు పతకాలు, 8 రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 19 పతకాలతో టాప్–3లో నిలిచింది. గత టోర్నీలో సత్తా చాటిన మను భాకర్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ విజయోత్సాహంతో ఉంది. ఆమె 10 మీ., 25 మీ పిస్టల్ ఈవెంట్లతో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ పోటీపడనుంది. ఆమెతో పాటు ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబుతా, సౌరభ్, అనిశ్ భన్వాలాలపై భారత్ పతకాల ఆశలు పెట్టుకుంది. సీనియర్, జూనియర్ విభాగాల్లో ఒలింపిక్ ఈవెంట్స్తో పాటు ఒలింపిక్స్లో లేని సెంటర్ ఫైర్, స్టాండర్డ్, ఫ్రీ పిస్టల్, రైఫిల్ ప్రోన్, డబుల్ ట్రాప్ ఈవెంట్లలో కూడా పోటీలు నిర్వహిస్తారు. -
ట్రంప్-పుతిన్ల భేటీపై భారత్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య అలస్కాలో జరిగిన సమ్మిట్ను భారత్ స్వాగతించింది. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సుదీర్ఘంగా సాగిన సమావేశాన్ని భారత్ అభినందించింది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న దీర్ఘ కాలిక యుద్ధానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎక్కడైనా శాంతికి తొలి అడుగు పడాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.‘అమెరికా-రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం పురోగతిని భారత్ అభినందిస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు వెళ్లడం మంచి పరిణామం. ఉక్రెయిన్ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) అర్థరాత్రి గం. 12.30 ని.లు దాటాకా ఇరువురి అధ్యక్షుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిపోయింది వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు.కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పుకొచ్చారు.మరొకవైపు ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తానని ట్రంప్ తెలిపారు. కానీ ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు ట్రంప్. -
తలసేమియా లేని భారత్ కోసం : అకాన్ ఆహ్వానం పేరుతో నిధుల సేకరణ
హైదరాబాద్: తలసేమియా లేని భారత్ తమ లక్ష్యంతో బ్లడ్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది. “భారతదేశాన్ని తలసేమియా నుండి విముక్తి చేయడం తమ లక్ష్యమనీ రోగులకు సమయానికి రక్తం అందించడం, కొత్త కేసులు రాకుండా తక్కువ ఖర్చుతో స్క్రీనింగ్ చేయించడం ద్వారానే ఇది సాధ్యమని వ్యవస్థాపకుడు కృష్ణ వంశీ వెల్లడించింది. గతంలో పోలియో నిర్మూలన చేసినట్లు, మనం కలసికట్టుగా కృషి చేస్తే తలసేమియాను కూడా నిర్మూలించవచ్చని ఆయన తెలిపారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ప్రముఖ లౌంజ్ అండ్ పబ్ అకాన్ సౌజన్యంతో బ్లడ్ వారియర్స్కు నిధుల సేకరణ కోసం అకాన్ ఆహ్వానం కార్యక్రమం నిర్వహించింది. రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పౌరులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. తలసేమియా లేని భారత నిర్మాణానికి మద్దతుగా ఈ సందర్భంగా అందరూ ప్రతిన బూనారు.అకాన్ వ్యవస్థాపకుడు నిహాల్ రెడ్డి గుర్రాల మాట్లాడుతూ.. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనతో అకాన్ ఆహ్వానం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజాన్ని చైతన్యపరచి, కలసికట్టుగా చర్యలు తీసుకునేలా చేస్తాయని కృష్ణ వంశీ అభిప్రాయపడ్డారు. బ్లడ్ వారియర్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కొత్తగూడెం–భద్రాచలంను దేశంలోనే తొలి తలసేమియా రహిత జిల్లాగా మార్చాలని సంకల్పించినట్టు చెప్పారు. -
రష్యా చమురుకి భారత్ దూరమైంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్ దూరమైందని ప్రకటించారు. అదే సమయంలో.. భవిష్యత్తులో భారత్పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు.అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చలపై భేటీ జరిపిన సంగతి తెలిసిందే. అయితే భేటీకి ముందు విమాన ప్రయాణంలో ది ఫాక్స్న్యూస్కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అతను(రష్యా అధినేత పుతిన్ను ఉద్దేశించి) ఇప్పటికే ఓ క్లయింట్ను కోల్పోయారు. అది 40 శాతం కొనుగోళ్లు జరిపే భారత దేశం. చైనా గురించి కూడా తెలిసిందే. ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోంది. ఒకవేళ.. పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు గనుక విధించాల్సి వస్తే.. అది ఆ దేశాల దృష్టిలో చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అందుకే అవసరం అయితే చేస్తాను. అవసరం లేకపోతే ఉండదు’’ అని అన్నారాయన.Trump says he may not impose 25% tariffs on India (to kick in from 27 August) for buying Russian oil..Trump: "They lost oil client India which was doing about 40% of the oil & China's doing a lot, if I did a secondary tariff it would be devastating, if I have to I will, may be… pic.twitter.com/dhyC7RpHNh— Dhairya Maheshwari (@dhairyam14) August 16, 2025అదే సమయంలో.. అలస్కా భేటీ తర్వాత కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాలు గురించి మళ్లీ ఆలోచిస్తానని, రెండు-మూడు వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్ తాజా ప్రకటనపై ఢిల్లీ వర్గాలు స్పందించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో భారత్పై ట్రంప్ జులై 30వ తేదీన 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ మిత్రదేశమైనప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని.. పైగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చమురు, ఆయుధాల కొనుగోళ్ల ద్వారా పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో.. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే తాను చెప్పినా కూడా భారత్ రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపలేదంటూ ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం పెనాల్టీ సుంకం విధించారు. దీంతో భారత్పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరింది. పెరిగిన ఈ 25 శాతం ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్ 50 శాతం సుంకాలను భారత్ అన్యాయమని పేర్కొంది. సుంకాలను తాము పట్టించుకోబోమని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఎనర్జీ భద్రత, ధరల లాభం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే.. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వెనక్కి తగ్గలేదు. ఆయిల్ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అమెరికా టారిఫ్లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ‘‘‘మాకు రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనొద్దనీ కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అలాగే రష్యా చమురు దిగుమతులను పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మేం ప్రయత్నాలు కూడా చేయడం లేదు’’ అని అన్నారాయన. రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు యథాతథంగానే కొనసాగిస్తున్నాయని, జులైలో ఇది రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లుగా ఉంటే.. ఆగస్టులో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లకు పెరిగిందని ఓ నివేదిక వెలువడింది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ట్రంప్ 50 శాతం టారిఫ్ల ప్రభావంతో తాత్కాలికంగా కొంత తగ్గినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం.. తదితర సంస్థలు రష్యన్ ఆయిల్ను స్పాట్ మార్కెట్ నుంచి కొనడం ఆపేశాయని, రిలయన్స్, నారాయణ ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం దీర్ఘకాలిక ఒప్పందాలకు అనుగుణంగా కొనుగోళ్లను యధాతథంగా జరుపుతున్నాయన్నది ఆ కథనాల సారాంశం. -
ట్రంప్కు జాన్ బోల్టన్ హెచ్చరిక.. ‘మాస్కో, బీజింగ్, ఢిల్లీ ఒక్కటైతే..’
వాషింగ్టన్: అమెరికా- భారత్ మధ్య వాణిజ్య సుంకాల యుద్ధం నడుస్తోంది. ఈ నేపధ్యంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మండిపడ్డారు. ట్రంప్ చర్యతో భారత్.. చైనా-రష్యా కూటమికి దగ్గరవుతుందని, ఇది అమెరికా అధ్యక్షుని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమిస్తుందని జాన్ బోల్టన్ పేర్కొన్నారు.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించడాన్ని జాన్ బోల్టన్ తప్పుబట్టారు. అలాస్కాలోని యాంకరేజ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా కౌంటర్ వ్లాదిమిర్ పుతిన్ల సమావేశ సమయంలో జాన్ బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై సుంకాలు విధించారని అయితే ఇదేవిధంగా రష్యా నుండి అత్యధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అదనపు సుంకాలను విధించలేదన్నారు. ఈ చర్య భారతదేశాన్ని చైనా-రష్యా కూటమి వైపు ఆకర్షితమయ్యేలా చేయవచ్చని బోల్టన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.‘Unforced error’: John Bolton calls Trump’s anti-India pitch lack of strategic thinking https://t.co/CVDLrD07ll— Financial Express (@FinancialXpress) August 15, 2025సీఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడుతూ, రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారతదేశం లాంటి దేశాలపై వైట్ హౌస్ ద్వితీయ సుంకాలను విధించిందని అన్నారు. భారతదేశంపై 25 శాతం సుంకం విధించిందని. అయితే ఇది ఇంకా అమలు కాలేదన్నారు. దీనిపై భారత్ చాలా ఆగ్రహంతో ఉన్నదని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అలాంటి సుంకం విధించకుండా భారత్పైననే విధించడమేమిటని బోల్టన్ ప్రశ్నించారు. మాస్కో, బీజింగ్, ఢిల్లీ(మూడు దేశాల రాజధానులు) ఒక్కటైతే అమెరికాపై ప్రతికూల పరిణామాలు తలెత్తవచ్చని హెచ్చరించారు. 2018 తర్వాత పుతిన్ భారత్ పర్యటన, భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలు అమెరికాపై ప్రతికూల పరిణామాలకు ఉదాహరణలు కావచ్చని బోల్టన్ అన్నారు. ట్రంప్ ఎటువంటి సంప్రదింపులు లేకుండా సుంకాల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బోల్టన్ ఆరోపించారు. ఇటీవల ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఈ పర్యటన 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరుగనుంది. మరోవైపు ఈ నెల చివరిలో ప్రధాని మోదీ చైనాను సందర్శించే అవకాశం ఉంది. ఆగస్టు 31- సెప్టెంబర్ ఒకటి మధ్య టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. -
భారత్లో రొనాల్డో ఆట!
చెన్నై: అంతా అనుకున్నట్లు జరిగితే... పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆటను భారత అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఆసియా ఫుట్బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) చాంపియన్స్ లీగ్–2లో భాగంగా రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నాసర్ జట్టుతో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తలపడాల్సి ఉంది. దీంతో ఆ మ్యాచ్లో పాల్గొనేందుకు పోర్చుగల్ స్టార్ భారత్కు వచ్చే అవకాశం ఉంది. అయితే అల్ నాసర్ క్లబ్తో కాంట్రాక్ట్ ప్రకారం విదేశీ వేదికలపై జరిగే మ్యాచ్ల్లో రొనాల్డో పాల్గొనే అంశంలో కొన్ని సడలింపులు ఉన్నాయి. మరి రొనాల్డో గోవా ఎఫ్సీతో మ్యాచ్ కోసం భారత్కు వస్తాడా లేదా అనేది త్వరలోనే తేలనుంది. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్2కు సంబంధించిన ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి గోవా ఎఫ్సీతో పాటు మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు పాల్గొననుంది. వచ్చే నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పాల్గొననుండగా... వాటిని ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో నాలుగు జట్లు ఉన్నాయి. గ్రూప్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించనున్నాయి. గత సీజన్లో లీగ్ షీల్డ్ దక్కించుకోవడం ద్వారా మోహన్ బగాన్ జట్టు నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించగా... ‘సూపర్ కప్’ గెలవడం ద్వారా గోవా ఎఫ్సీ ముందంజ వేసింది. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్లో గోవా జట్టు పాల్గొనడం ఇది రెండోసారి. 2021లోనూ గోవా జట్టు ఈ టోర్నీలో ఆడింది. సెపె్టంబర్ 16న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్... వచ్చే ఏడాది మే 16న జరగనున్న ఫైనల్తో ముగియనుంది. లీగ్లో భాగంగా... ఇంటాబయట మ్యాచ్లు జరగడం పరిపాటి కావడంతో గోవా ఎఫ్సీతో తలపడేందుకు అల్ నాసర్ తరఫున రొనాల్డో భారత్కు వస్తాడనే వార్తలు వ్యాపించాయి. గ్రూప్ ‘సి’లో ఫూలద్ మొబారకేశ్ సెపాహన్ ఎస్సీ (ఇరాన్), అల్ హుసేన్ (జోర్డాన్), అహల్ ఎఫ్సీ (తుర్క్మెనిస్తాన్)తో కలిసి మోహన్ బగాన్ పోటీ పడనుంది. గ్రూప్ ‘డి’లో గోవా ఎఫ్సీతో పాటు అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా), అల్ జవ్రా ఎస్సీ (ఇరాక్), ఇస్తిక్లోల్ ఎఫ్సీ (తజకిస్తాన్) ఉన్నాయి. -
దేశానికి రక్షణగా.. శ్రీకృష్ణుడి స్పూర్తితో ‘మిషన్ సుదర్శన్ చక్ర’
న్యూఢిల్లీ, సాక్షి: మహాభారతంలో శ్రీకృష్ణుడి స్పూర్తితో ఎలాంటి ముప్పునుంచైనా దేశాన్ని రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రను అనే ఆధునిక ఆయుధ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 103 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో .. రాబోయే పదేళ్లలో అంటే 2035 నాటికి, దేశ భద్రత కోసం రక్షణా కవచాన్ని అందుబాటులోకి తేనున్నాం. అందుకే శ్రీకృష్ణుడి స్పూర్తితో సుదర్శన చక్ర మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సుదర్శన్ చక్ర ఆయుధ వ్యవస్థ 2035 నాటికి అభివృద్ధి అవుతుంది. మిషన్ సుదర్శన్ చక్ర దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు ప్రార్ధనా స్థలాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కీలక ప్రదేశాలను సురక్షితంగా ఉంచేలా మిషన్ సుదర్శన చక్ర కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ఈ మిషన్లో ఖచ్చితమైన లక్ష్య వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, ఇది శత్రువుల దాడిని అడ్డుకునేందుకు.. సుదర్శన్ చక్రం వలె శక్తివంతమైన ప్రతీకార దాడుల్ని తిప్పికొడుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాగా, గత పదేళ్లలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత్ .. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణి, డ్రోన్ దాడులను నిలువరించిన ఆపరేషన్ సిందూర్ గురించి ఆయన ప్రస్తావించారు. -
దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు
న్యూఢిల్లీ: భారత్ను హెచ్చరిస్తూ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేస్తూ దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని పాకిస్తాన్ను గురువారం భారత్ హెచ్చరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ నేతలు తరచూ పూర్తి నిర్లక్ష్యపూరిత, యుద్దోన్మాద, విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పాకిస్తాన్ తన గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేంకు భారత వ్యతిరేక వాణిని తరచూ వినిపిస్తోంది. మరోసారి ఏదైనా కవ్వింపు చర్యలతో దుస్సాహసానికి తెగిస్తే తీవ్రమైన పర్యావసా నాలను చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తో భారత్ తన సత్తాను మీకు రుచి చూపించింది’’ అని జైశ్వాల్ అన్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించినవేళ ట్రంప్ భేటీ సమయంలో భారత్నుద్దేశిస్తూ మునీర్ హెచ్చరిక వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. ‘‘ భారత్ కారణంగా పాకిస్తాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారితే అణుబాంబు ప్రయోగానికికైనా సిద్ధం. మా దేశం ఇబ్బందుల్లో పడితే సగం ప్రపంచాన్ని మాతోపాటు సమస్యల సుడిగుండంలోకి తీసుకెళ్తాం’’ అని వ్యాఖ్యానించారు. మునీర్ వ్యాఖ్యలపై ఆనాడే భారత్ ఘాటుగా బదులిచ్చింది. ‘‘ అణు బెదిరింపులకు భయపడేది లేదు. పాతకాలంనాటి అణుబెదిరింపులు ఆపితే మంచిది. అణ్వాయుధాలు ప్రయోగిస్తామనడం పూర్తి బాధ్యతారాహిత్యం. సైన్యం కనుసన్నల్లో పాలన వెళగబెట్టే పాక్ లాంటి దేశం నుంచి ఇలాంటి అణుబెదిరింపులు రావడం అంతర్జాతీయ సమాజానికి అత్యంత ప్రమాదకరం’’ అని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. -
ప్రపంచ చెస్లో భారత్ ఆధిపత్యం
న్యూఢిల్లీ: ప్రపంచ చెస్లో భారత్ ఆధిపత్యం కనబరుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కితాబిచ్చారు. దేశ పౌరులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఆమె తన సందేశంలో భారత చెస్ క్రీడాకారుల ఘనతను ప్రస్తావించారు. క్రీడల్లో భారత్ గణనీయమైన విజయాలను సాధిస్తోందని ప్రశంసించారు. ‘దేశ యువత సరికొత్త ఆత్మవిశ్వాసంతో క్రీడల్లో ముందడుగు వేస్తోంది. చెస్ ఈవెంట్ను చూసుకుంటే... భారత యువ చదరంగ క్రీడాకారులదే హవా! మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ చెస్లో ఆధిపత్యాన్ని మన గ్రాండ్మాస్టర్లు చలాయిస్తున్నారు. ఇక మీదట అమలయ్యే కొత్త క్రీడా పాలసీతో ప్రపంచ క్రీడాశక్తిగా భారత్ ఆవిర్భవించే అవకాశలున్నాయి. మన అమ్మాయిలు మనకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రతి రంగంలోనూ మహిళలు సత్తా చాటుకుంటున్నారు. రక్షణ, భద్రత, క్రీడలు ఇలా ఏ రంగమైనా సరే ఎవరికీ తీసిపోని విధంగా సాటిలేని విజయాలు సాధిస్తున్నారు. పురుషుల్లో 18 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చాంపియన్షిప్ సాధించడం, మహిళల్లో 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయి దివ్య దేశ్ముఖ్, 38 ఏళ్ల వెటరన్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల ప్రపంచకప్ ఫైనల్స్కు అర్హత సాధించడం చెస్లో మన సత్తా ప్రపంచానికి చాటినట్లయ్యింది’ అని రాష్ట్రపతి తన సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం. తరాలు మారుతున్నా... మన మహిళలు స్థిరంగా ప్రతిభ చాటుకుంటున్నారని, ప్రపంచంతో పోటీ పడేందుకు సై అంటున్నారని ప్రశంసించారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నారీశక్తి వందన్ అధినియమ్’ ఇకపై నినాదం మాత్రమే కాదు... నిజమైన సార్థకతగా అభివర్ణించారు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ చెస్లో భారత క్రీడాకారులు విశేషంగా రాణిస్తున్నారు. గుకేశ్, దివ్యలతో పాటు తెలంగాణ తేజం ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్, వైశాలి ఇంటా బయటా విజయకేతనం ఎగురవేస్తున్నారు. -
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందినప్పుడే...
భారతదేశం నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో మనం ప్రశ్నించుకోవాలి. 2024 ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, భారతదేశం 127 దేశాలలో 105వ స్థానంలో ఉంది. ‘సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్: ది ఇండియా స్టోరీ’ అనే శీర్షికతో ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ తాజా నివేదిక భారతదేశంలో గణనీయమైన ఆదాయ అసమానతను పేర్కొంది. అత్యంత ధనవంతులైన 1% మంది ఇప్పుడు దేశ మొత్తం సంపదలో 40% కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. దిగువన ఉన్న 50% మంది కేవలం 3% మాత్రమే సంపద కలిగి ఉన్నారు. వీటితో పాటు 2024లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ‘కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్’ ప్రకారం భారతదేశం అవినీతి అవగాహన సూచికలో 180 దేశాలలో 96వ స్థానంలో ఉంది.2025 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై చేసే మొత్తం వ్యయం జీడీపీలో 4.64%గా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. అయితే ఇది నూతన విద్యా విధానం –2020 నిర్దేశించిన 6% లక్ష్యం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2025–26 కేంద్ర బడ్జెట్లో, భారతదేశం ఆరోగ్య రంగానికి రూ. 99,859 కోట్లు కేటాయించింది. ఇది గత సంవత్సరం సవరించిన అంచనాలతో పోలిస్తే 11% పెరుగుదలను సూచిస్తుంది. మొత్తం ఆరోగ్య బడ్జెట్లో 96%తో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ఎక్కువ కేటాయింపులు లభించాయి. అయితే ఇది వార్షిక బడ్జెట్ కేటాయింపులు, విధాన మార్పుల ఆధారంగా మారవచ్చు. ఆర్థిక వ్యవస్థలో రెడ్ టేపిజం ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. బంధుప్రీతి దాదాపు అన్ని రంగాలలో కనిపిస్తోంది. ఇప్పటికీ మనం వరకట్నం, ఆడ శిశువుల హత్య, లింగ అసమానత, గృహ హింస, అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలతో కునారిల్లడం బాధాకరం.అయితే మన దేశం ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో (జనాభా) భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భారతదేశం ప్రపంచంలోనే పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. బియ్యం, గోధుమలు, చెర కు, వేరుసెనగ, కూరగాయలు, పండ్లు, పత్తి ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశంగా ఉంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్యలో అమెరికా, చైనాల తర్వాత మూడవ స్థానంలో ఉంది. ప్రపంచంలో 10వ అతిపెద్ద దిగుమతిదారుగా, 16వ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. 2024లో, భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించడంలో ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో నిలిచింది. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అనుసరిస్తున్న ట్రంప్ విధానాల నుండి, యుద్ధాల నుండి రక్షించుకోవడం కోసం నిరంతర ఆర్థికాభివృద్ధి, విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలపై అవగాహన ఉన్న పౌరుల భాగస్వామ్యంతోనే స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని అందుకుని అభివృద్ధి సాధించగలం.– డా‘‘ పి.ఎస్. చారి, కామర్స్– మేనేజ్మెంట్ స్టడీస్లో ప్రొఫెసర్ -
అదే జరిగితే భారత్కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా
భారత్ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం బ్లూమరాంగ్టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్పై సెకండరీ టారిఫ్లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్ స్పష్టం చేశారు.భారత్ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్పై అగ్రరాజ్యం టారిఫ్లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్న్యూస్తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. -
భారత్ వైపు ప్రపంచం చూపు!
ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామం ఈ నెల 6వ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాలను మరొక 25 శాతం పెంచి, మొత్తం 50 శాతానికి చేర్చారు. దానితో మోదీ ప్రభుత్వం ఒత్తిడికి గురై రష్యన్ చమురు కొనుగోళ్ళను ఆపటంతో పాటు, వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలో తమ ప్రతిపాదనలకు అంగీకరించగలదన్నది ట్రంప్ ఎత్తుగడ. అనూహ్యమైన రీతిలో ప్రధాని మోదీ అదేరోజు రాత్రి ఎదురుదాడి ప్రారంభించారు.ప్రపంచం కోసం నిలబడగలమా?ట్రంప్ చర్యలను చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా వంటివి మొదటి నుంచి పూర్తిగానో, పాక్షికంగానో వ్యతిరేకిస్తుండటంలో విశేషం లేదు. వీటన్నింటికి భిన్నంగా పెద్ద దేశాలలో ఇండియా ఒక్కటే మొదటి నుంచి అమెరికాతో మెత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఒక పెద్ద వర్ధమాన దేశం అయి ఉండి, ‘బ్రిక్స్’లో ప్రధాన పాత్ర వహిస్తూ, ట్రంప్ చర్యల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా, ప్రతిఘటించకపోవటంపై అంతటా విమర్శలు వినిపించాయి. అటువంటి స్థితిలో మోదీ చేసిన ప్రసంగం, అందులోని భాష, తనలో కనిపించిన దృఢమైన వైఖరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడిక ఆయన భారతదేశం కోసమే గాక, తక్కిన ప్రపంచంతో కూడా కలిసి నిలబడవచ్చుననే ఆశాభావాలు వినవస్తున్నాయి.అదే సమయంలో, ఇల్లలకగానే పండుగ కాదనే పెద్దల హెచ్చరికను గుర్తుంచుకోవలసి ఉంటుంది. వీటికి స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రభావాలు అనేకం ఉంటాయి. అవి వాస్తవంగా భూకంపానికి దారితీయగలవు. స్లో మోషన్లో ఆర్థిక ప్రపంచ యుద్ధాన్ని సృష్టించగలవు. మన ప్రపంచం నిజమైన అర్థంలో రాజకీయంగా, ఆర్థికంగా, ప్రజాస్వామికంగా మారాలంటే, చిరకాలపు అధిపత్య శక్తుల భూమి కింద అటువంటి భూకంపం రావటం అవసరం.కొండ చరియలలో కింది వైపున కేవలం ఒక రాయి కదలికలో మొత్తం చరియలే కూలినట్లు, చరిత్రలో ఒకోసారి చిన్న ఘటనలు పెనుమార్పులకు దారి తీస్తుంటాయి. క్రమంగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక ఆధిపత్యాన్ని తిరిగి శక్తిమంతం చేయదలచిన ట్రంప్, అమెరికన్ కొండచరియలో ఒకొక్క రాయినే తనకు తెలియకుండానే తోసివేస్తున్నారు. ఇప్పుడు ఇండియా రూపంలో ఒక ముఖ్యమైన రాయి తొలగిపోతున్నదనుకోవాలా?ఇండియా దృఢ వైఖరినిజంగానా, లేక ఇది తొందరపాటు మాటా అన్నది ప్రశ్న. ఒకవైపు అమెరికా నాయకత్వాన ఒక శక్తిమంతమైన కూటమి ఉంది. అది బలహీన పడుతున్న మాట నిజమేగాని అవసాన దశకేమీ చేరలేదు. మరొకవైపు భారత్తో కూడిన ‘బ్రిక్స్’ దేశాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇది తమ ఆధిపత్యానికి ఎంత ప్రమాదకరం కాగలదో అర్థమైనందువల్లనే ట్రంప్ ‘బ్రిక్స్’పై కత్తిగట్టారు. ఆయన వేర్వేరు దేశాలపై వేర్వేరుగా ప్రకటిస్తున్న ట్యారిఫ్లను, వేర్వేరు పద్ధతులలో సాగిస్తున్న చర్చలను గమనిస్తే, ‘బ్రిక్స్’ దేశాల పట్ల ‘విభజించి పాలించే’ వ్యూహాన్ని అనుసరిస్తున్నటు స్పష్టమవుతుంది.చర్చలోకి వెళితే, మోదీ నాయకత్వాన భారతదేశానికి అమెరికాతో అవసరాలున్నాయి, పేచీలు కూడా ఉన్నాయి. గతకాలపు చిన్నచిన్న పేచీలను అటుంచి ఇప్పుడు ట్యారిఫ్లతో, వాణిజ్య ఒప్పందంలోని ప్రతిపాదనలతో పెద్ద పేచీ తలెత్తింది. ఒకవైపు భారతదేశం స్వతంత్ర శక్తిగా గతం కన్నా బలపడుతూ తన భవిష్యత్తు పట్ల దృష్టి మారుతుండటం, మరొకవైపు అమెరికా క్రమంగా బలహీనపడుతూ ఏకధ్రువ ప్రపంచ స్థితి మారుతుండటం గమనించవలసిన కొత్త పరిణామాలు.ఇటువంటిది ఏర్పడినపుడు, వ్యూహాత్మకంగా అగ్రరాజ్యం ఎంతో వివేకంగా, చతురతతో వ్యవహరించాలి. ట్రంప్ నాయకత్వాన అమెరికా అవివేకపు వ్యూహాన్ని అనుసరిస్తున్నందున, ఇండియా వంటి మిత్రదేశంతోనూ సంబంధాలు చెదిరిపోతున్నాయి. అట్లా జరగకుండా ఉండేందుకు మోదీ మొదట గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, ఏమి చేసైనా సరే తన ‘మాగా’ లక్ష్యాలను సాధించాలనే ఒత్తిడుల మధ్య అమెరికా అధ్యక్షుడు– యూరప్, కెనడా, జపాన్, మెక్సికో వంటి ఇతర మిత్ర దేశాలకు వలెనే ఇండియాను కూడా దారికి తెచ్చుకోగలనని నమ్మారు. వాటికీ,భారత్కూ మధ్యగల వ్యత్యాసాలను గ్రహించలేకపోయారు. దానితో, ఇంధనం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి... దేశ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం నిలబడక తప్పలేదు. వాస్తవానికి వ్యవసాయ రంగం విషయమై, గాట్ – డబ్ల్యూటీవో చర్చల దశలో ఇండియా ఇతర వర్ధమాన దేశాలతో కలిసి గట్టిగానే నిలబడింది. అదే ఇపుడు కూడా జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోనిది అమెరికా కూటమే!ఆర్థిక భూకంపం రానుందా?ఇంతవరకు బాగున్నది. రాగల కాలపు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. ట్రంప్ తన ధోరణిని మార్చుకుని అంతా సుఖాంతం కావచ్చునా? భారతదేశంతో తగినంత రాజీ పడవచ్చునా? ట్రంప్ స్వభావమేమిటో ఈ సరికి బోధపడింది గనుక ఆయనను నమ్మలేమని ప్రధాని మోదీ తన స్వతంత్ర వైఖరిని కొనసాగించగలరా? మొన్నటి 6వ తేదీ తర్వాత వడివడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో సంప్రతింపులు జరిపి, పుతిన్ను ఆహ్వానించి, చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశాలకు వెళ్ళనున్నట్లు ప్రకటించి, అక్కడ జిన్పింగ్తో సమావేశం జరగవచ్చుననే సంకేతాలు పంపినందున, ఇవన్నీ మునుముందు బ్రిక్స్ వేదికగా కొత్త మార్గాన్ని మరింత దృఢంగా అనుసరించగలమనే సూచనలు కావచ్చునా? అటువంటిది గనుక అయితే, ఆగస్టు 6 నాటి భూ ప్రకంపనలు రాగల కాలపు భూకంపానికి నాంది అవుతాయి. అట్లా జరగాలన్నదే వర్ధమాన ప్రపంచపు కోరిక కావచ్చు కూడా! కానీ అది తేలిక కాదు. ట్రంప్ ప్రతీకారాన్ని తట్టుకునేందుకు సైతం సిద్ధపడవలసి ఉంటుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
కెనడా అవుట్.. రేసులోకి భారత్.. ఆతిథ్య హక్కులు మనకే!
న్యూఢిల్లీ: 2030 కామన్వెల్త్ క్రీడలను స్వదేశంలో నిర్వహించాలనే ఉద్దేశంతో వేసిన బిడ్ను భారత ఒలింపిక్ సంఘం (IOA) బుధవారం ఆమోదించనుంది. అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యమివ్వాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న భారత్... 2036 ఒలింపిక్స్ నిర్వహణకు సైతం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వక్రీడలకు ముందు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించి మన సత్తా ప్రపంచానికి చాటాలనుకుంటోంది.ఇప్పటికే ఈ క్రీడలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్నట్లు కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్యకు భారత్ వెల్లడించింది. అహ్మదాబాద్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. బిడ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 31 తుదిగడువు కాగా... దానికి ముందే ఫైనల్ బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న భారత ఒలింపిక్ సంఘం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు ఇతర అంశాలు సైతం సమావేశంలో చర్చకు రానున్నాయి.ఆతిథ్య రేసు నుంచి కెనడా అవుట్ఇక ఆతిథ్య రేసు నుంచి కెనడా తప్పుకోవడంతో... భారత్కే హక్కులు దక్కే అవకాశాలున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ డైరెక్టర్ డారెన్ హాల్ నేతృత్వంలోని అధికారుల బృందం మూడు రోజుల పాటు అహ్మదాబాద్లో పర్యటించి వేదికలను పరిశీలించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించింది.ఈ నెలాఖరులో కామన్వెల్త్ గేమ్స్కు చెందిన మరో ప్రతినిధి బృందం భారత్ను సందర్శించనుంది. ఆతిథ్య హక్కుల ప్రకటన ఈ ఏడాది నవంబర్లో వెలువడే అవకాశాలున్నాయి. ‘కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు పలు అంశాలతో ముడిపడి ఉంటాయి. క్రీడా సదుపాయాలు, ప్రభుత్వ సహకారం, నిర్ణయాల్లో స్థిరత్వం, ఆకర్షణ ఇలాంటివి కీలకం. 2030 కామన్వెల్త్ ఆతిథ్య హక్కులు భారత్కే దక్కుతాయనే నమ్మకముంది’ అని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు హర్పాల్ సింగ్ పేర్కొన్నారు. చదవండి: మీకు ఆటే ముఖ్యమా?: బీసీసీఐ తీరుపై హర్భజన్ ఆగ్రహం -
మునీర్ మూర్ఖత్వం!
ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పాలకులకూ, సైన్యానికీ ఆత్మాహుతి భాష నిండా ఒంటబట్టినట్టుంది. మున్ముందు భారత్ దాడికి దిగితే అణ్వస్త్రాలు ప్రయోగించి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని పాకిస్తాన్ సైనిక చీఫ్ మునీర్ బెదిరించటాన్ని గమనిస్తే ఆ దేశంలో మూర్ఖత్వం ఎంతగా ముదిరిందో అర్థమవుతుంది. పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడిన నాటినుంచీ సక్రమంగా మాట్లాడటం, సవ్యంగా మసులుకోవటం దానికి చేతకావటం లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు దాన్ని తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తూనే వచ్చాయి. అమెరికా ఈ విషయంలో ఒకడుగు ముందుంది. ఎదురుతిరిగిన పాలకుల్ని సైనిక కుట్రలో కూలదోయటం, కీలుబొమ్మను ప్రతిష్ఠించటం దానికి అలవాటైన విద్య. అమెరికా సాగు, పాడి రంగ ఉత్పత్తుల్ని భారత్లో అనుమతించాలన్న డిమాండ్ను మన ప్రభుత్వం అంగీకరించనందుకు ఆగ్రహంతో రగిలిపోతున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మన సరుకులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆసిఫ్ మునీర్ అధిక ప్రసంగం కూడా ఆయనగారి పథక రచనే కావొచ్చన్న సంశయాలు తలెత్తుతున్నాయి. మొన్న జూన్లో మునీర్ను పిలిపించుకుని అయిదు రోజులపాటు ఇంటల్లుడి మర్యాదలు చేసిన వైనం మరవకముందే మరోసారి ఆయన అక్కడికి వెళ్లి వాలాడంటే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకూడదు. తొలి పర్యటనలో ప్రోటోకాల్స్ పక్కనబెట్టి మునీర్కు దేశాధినేతలకిచ్చే స్థాయి ఘనమైన విందునిచ్చి, ముడి చమురు సహా పాకిస్తాన్తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించిన తీరు చూసి ప్రపంచం విస్మయపడింది. పాకిస్తాన్లో చచ్చో పుచ్చో... ఎన్నికైన ప్రభుత్వం అంటూ ఒకటుంది. అమెరికాతో సహా ఏ దేశంలోనైనా సైన్యం పని ప్రభుత్వాదేశాలు పాటించటం మాత్రమే. కానీ తోకే కుక్కను ఆడిస్తున్న చందంగా పాక్ పోకడ ఉంది. సైన్యం ఏం చేసినా అక్కడి పాలకులు కిక్కురుమనరు. అందువల్లే మునీర్ ట్రంప్తో సహకార ఒప్పందాలు కుదుర్చుకోగలిగాడు. ఈ విషయంలో ట్రంప్ను తప్పుబట్టాలి. తమ సైనిక దళాల చీఫ్ జనరల్ రాండీ ఏ. జార్జి ఏ దేశమైనా పోయి ఒప్పందాలు కుదుర్చుకొని వస్తే ఆయన శిరసావహిస్తారా? ఈసారి మునీర్ నాలుగు రోజులు అక్కడ తిష్ఠ వేశారు. నెల రోజుల్లోనే ఎందుకెళ్లాడో, ఆయన చేస్తున్న రాచకార్యమేమిటో తెలియదు. అటు అమెరికా ప్రభుత్వమూ బయటపెట్టదు. కానీ అమెరికాకు సంబంధించిన రాజకీయ నాయకులతోనూ, సైనిక నాయకత్వంతోనూ ఆయన భేటీలు జరిపాడు. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ ఈ.కురిలా రిటైర్మెంట్ సభలో పాల్గొనడానికి అక్కడికెళ్లినట్టు మీడియా కథనం. పాకిస్తాన్ సంతతి ప్రజలతోనూ సమావేశమయ్యారు. మునీర్ బెదిరింపులుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నవన్నీ ఆ సమావేశంలో మాట్లాడినవేనని చెబుతున్నారు. అధికారికంగా అయితే మునీర్ లేదా పాకిస్తాన్ సైన్యం ఈ మాటల్ని ధ్రువీకరించటానికి సిద్ధపడటం లేదు. అణ్వస్త్ర దేశమని మిడిసిపడితే ఎవరు వూరకున్నా ఇరుగు పొరుగు దేశాలు మౌనంగా ఉండవు. మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పినట్టు ఈమాదిరి బాధ్యతా రాహిత్యాన్నీ, బ్లాక్మెయిలింగ్నూ మన దేశమైతే సహించదు. మునీర్ మాటల్ని భారత్ వక్రీకరిస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనేమీ కోడ్ భాషలో మాట్లాడలేదు. ఆ ప్రసంగానికి సంబంధించిన కథనాన్ని బయటపెట్టింది కూడా అమెరికా మీడియానే. పైగా పాకిస్తాన్ ఏలికలు ఇలా మాట్లాడటం మొదటిసారేమీ కాదు. ఇక వక్రీకరణకు చోటెక్కడ?! ఏదో ఉన్మాదంలో నోరు జారివుంటే ఆ మాట చెప్పి తప్పయిందని ఒప్పుకోవాలి. విషయం బయటికొచ్చాక వణుకుడు దేనికి? ఉగ్రవాద మూకల్ని పంపి కల్లోలం సృష్టిస్తే, అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తే భారత్ హడలెత్తుతుందని పెహల్గాం అనంతర పరిణామాల తర్వాత కూడా పాకిస్తాన్ భ్రమల్లో ఉందంటే దాన్ని ఎవరూ రక్షించలేరు. అమెరికా సంపన్న రాజ్యమే కావొచ్చుగానీ మంచీ మర్యాదా పాటించటం నేర్చుకోవాలి. కొత్తగా వచ్చిన భుజకీర్తుల మత్తుతో అమెరికాలో వాలిన మరో దేశ సైనిక దళాల చీఫ్ మిత్రదేశంతోపాటు ప్రపంచాన్నే బెదిరిస్తున్న వైనం కనబడుతున్నా గుడ్లప్పగించి చూడటం సబబేనా? చీవాట్లు పెట్టి పంపాల్సిన బాధ్యత లేదా? ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఈ మాదిరి వైఖరే ప్రదర్శించి అమెరికా భారత్కు దూరమైంది. ఆర్థిక సంస్కరణల అనంతరం క్రమేపీ చక్కబడుతూ వచ్చిన ద్వైపాక్షిక సంబంధాలు ఇలాంటి వింత చేష్టలతో ఛిద్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రంప్దే! మునీర్ లాంటివాళ్లు ఇష్టానుసారం చెలరేగటాన్ని నిలువరించకపోతే తమకూ నష్టమేనని ఆయన గ్రహించాలి. -
ఒక్క నీటి చుక్కా తీసుకోనివ్వం..!
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు చెందాల్సిన జలాల్లో భారత్ను ఒక్క నీటి చుక్క కూడా తీసుకోనివ్వబోమని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 22న కశ్మీర్లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్కు వ్యతిరేకంగా పలు చర్యలను ప్రకటించింది. ఇందులో 1960ల నాటి సింధూ జలాల ఒప్పందం(ఐడబ్ల్యూటీ)నుంచి వైదొలగడం కూడా ఉంది. తద్వారా సిందూ జలాలను దిగువకు విడుదల చేయకుండా ఆపేసింది. దీనిపై పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇది యుద్ధ నేరమే అవుతుందంటూ ప్రకటనలు కూడా చేసింది.ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ప్రధాని షరీఫ్..‘మా శత్రు దేశానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. మా నీళ్లను ఆపుతామంటూ మీరు బెదిరిస్తున్నారు కదా. పాకిస్తాన్కు చెందాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా మిమ్మల్ని తీసుకోనివ్వం. ఇది గుర్తుపెట్టుకోండి’అంటూ వ్యాఖ్యానించారు. పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా సోమవారం ఇలాంటి ప్రేలాపనలే చేయడం గమనార్హం. -
2036 ఒలింపిక్స్ భారత్లో.. చర్చలు కొనసాగుతున్నాయన్న కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: 2036లో ఒలింపిక్స్ను నిర్వహించాలని ఆసక్తి కనబరుస్తున్న భారత్ ఈ దిశగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఒలింపిక్ నిర్వహణా హక్కుల ప్రక్రియలో భాగంగా రెండో దశలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో తాము ‘నిరంతర చర్చలు’ కొనసాగుతున్నాయని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. పార్లమెంట్లో ఆప్ పార్టీ ఎంపీ గురీ్మత్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ‘ఒలింపిక్స్ నిర్వహణ బిడ్డింగ్ ప్రక్రియను పూర్తిగా భారత ఒలింపిక్ సంఘం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే తమ ఆసక్తిని కనబరుస్తూ ఐఓసీకి లెటర్ ఆఫ్ ఇన్టెంట్ను ఐఓఏ ఇచ్చింది. దీనిపై ఐఓసీలో భాగమైన ఆతిథ్య కమిషన్తో సంప్రదింపులు సాగుతున్నాయి. అయితే ఒకవేళ భారత్కు క్రీడలను కేటాయిస్తే వేదికలు ఏమిటనే విషయంపై ఇప్పుడే చర్చ అవసరం. మన దేశానికి ఒలింపిక్స్ను కేటాయించడమే అన్నింటికంటే ముఖ్యం’ అని మంత్రి స్పష్టం చేశారు. ఒలింపిక్స్ హక్కుల కేటాయింపులో రెండో దశ అయిన ‘కంటిన్యూయస్ డైలాగ్’లో బిడ్ వేసిన ఆయా దేశాల సన్నద్ధత, ఆర్ధిక పరిస్థితి, ఆ దేశంలో సాధ్యాసాధ్యాలపై ఐఓసీ ఒక అంచనాకు వస్తుంది. 2036 క్రీడల కోసం భారత్తో పాటు ఖతర్, టర్కీ కూడా పోటీ పడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ దశను ఐఓసీ నిలిపివేయడం గమనార్హం! ప్రస్తుత ఐఓసీ అధ్యక్షురాలు కిర్స్టీ కొవెంట్రీ స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. ‘2028, 2032 క్రీడలతో పాటు 2030లో జరిగే వింటర్ గేమ్ ఆతిథ్య హక్కులు కూడా వరుసగా లాస్ ఏంజెలిస్, బ్రిస్బేన్, ఫ్రెంచ్ ఆల్ప్స్కు ఇప్పటికే ఇచ్చేశాం. ముందు వీటి నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో 2036 క్రీడల కేటాయింపు గురించి ఆలోచించడం అనవసరం. అందుకే డైలాగ్ ప్రక్రియను ఆపేస్తున్నాం. ఐఓసీ సభ్యులందరూ దీనికి మద్దతు పలికారు’ అని గత నెలలో కొవెంట్రీ స్పష్టం చేసింది. మరోవైపు భారత్లో ఫుట్బాల్ అధ్వాహ్న పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు మాండవీయ సమాధానిస్తూ... ‘ఈ విషయంలో భారత ఫుట్బాల్ సమాఖ్యదే పూర్తి బాధ్యత. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచన ప్రకారం వారు అన్ని అంశాలు పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్ ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు’ అని చెప్పారు. -
రితిక ‘పసిడి’ పంచ్
బ్యాంకాక్: ఆసియా అండర్–22 బాక్సింగ్ చాంపియన్షిప్ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. చివరిరోజు సోమవారం భారత్కు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు లభించాయి. మహిళల ప్లస్ 80 కేజీల విభాగంలో రితిక భారత్కు పసిడి పతకాన్ని అందించింది. ఫైనల్లో రితిక 4:1తో అసెల్ తొక్తాసియన్ (కజకిస్తాన్)పై గెలిచింది. ఫైనల్స్లో ఓడిన యాత్రి పటేల్ (57 కేజీలు), ప్రియ (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో నీరజ్ (75 కేజీలు), ఇషాన్ కటారియా (ప్లస్ 90 కేజీలు) కూడా రజత పతకాలు సాధించారు. ఫైనల్స్లో బొల్తాయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో నీరజ్... ఖాలిమ్జన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఇషాన్ ఓడిపోయారు. -
టార్గెట్ 50
న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లను గణనీయంగా పెంచేయడంతో ప్రత్యామ్నాయాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకునే వ్యూహరచనకు తెరతీసింది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా తదితర ప్రాంతంలో 50 దేశాలకు ఎగుమతులను ఇతోధికం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత మొత్తం ఎగుమతుల్లో 90 శాతం ఈ 50 దేశాలకే వెళుతుండడం గమనార్హం. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు, ఎగుమతుల పోటీతత్వం పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా లోతైన విశ్లేషణ కొనసాగుతోందని చెప్పాయి. వాణిజ్య శాఖ ఇప్పటికే 20 దేశాలపై ప్రత్యేక దృష్టి సారించగా, ఇప్పుడు మరో 30 దేశాలు ఈ జాబితాలోకి వచ్చి చేరినట్టు పేర్కొన్నాయి. కొత్త మార్కెట్లను అన్వేషించండి.. అధిక యూఎస్ టారిఫ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని.. రొయ్యలు, ఇతర చేపల ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ఎగుమతిదారులకు కేంద్రం సూచించింది. ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, యూకే, రష్యా, ఆ్రస్టేలియా, పశి్చమాసియా, దక్షిణాసియా తదితర ఎన్నో ప్రాంతాలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. ఇతర దేశాలను ఎగుమతులను పెంచుకునే ముందు విలువను పెంచుకోవడం, ప్యాకేజింగ్పై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఇందుకు ఫిషరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 55 శాతం ఎగుమతులపై ప్రభావం అమెరికాకు ఎగుమతి చేస్తున్న మొత్తం వస్తు ఎగుమతుల్లో 55 శాతం మేర 25 శాతం ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రైతులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాల పరిరక్షణకు, ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఉత్పత్తుల వైవిధ్యం, డిమాండ్, నాణ్యత, కాంట్రాక్టు ఒప్పందాలు భారత ఎగుమతులపై పడే ప్రభావాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పై భారత విదేశాంగ శాఖ ఫైర్
-
ప్రేలాపనలు ఆపు
న్యూఢిల్లీ: బాధ్యత లేని అణ్వస్త్ర దేశం పాకిస్తాన్ అని భారత ప్రభుత్వ వర్గాలు మండిపడ్డాయి. పొరుగు దేశంలో ప్రాణాంతక అణ్వాయుధాలు ప్రభుత్వేతర శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో భారత సైన్యం తమపై దాడి చేస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు సోమవారం తిప్పికొట్టాయి. అమెరికా మద్దతు లభించినప్పుడల్లా రెచి్చపోవడం, నోరుపారేసుకోవడం, అసలు రంగు బయటపెట్టుకోవడం పాకిస్తాన్కు అలవాటేనని ఎద్దేవా చేశాయి. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేదే లేదని, అక్కడ సైన్యమే రాజ్యమేలుతోందని చెప్పడానికి అసిమ్ మునీర్ నోటిదురుసే తార్కాణమని వివరించాయి. మునీర్కు అమెరికాలో ఘనమైన స్వాగతం, గౌరవ మర్యాదలు లభించాయంటే దాని అర్థం ఆయన మౌనంగా ఉండొచ్చు లేదా అమెరికా అండతో పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, అధ్యక్షుడు కావొచ్చని తెలిపాయి. ఫీల్డ్ మార్షల్ తదుపరి ప్రెసిడెంట్గా మారే పరిస్థితి కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అణ్వాయుధాలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తే బెదిరిపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పాయి. అణ్వాయుధాలు కలిగిన దేశం బాధ్యతగా నడుచుకోవాలని హితవు పలికాయి. వాటిని చూపించి ఇతరులను బెదిరిస్తామంటే అది సాధ్యం కాదని సూచించాయి. తమ దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమని స్పష్టంచేశాయి. పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని అసిమ్ మునీర్కు తేల్చిచెప్పాయి. మునీర్ వ్యాఖ్యలను అమెరికా ఆమోదిస్తోందా? ‘‘పాకిస్తాన్లో అణ్వాయుధాల బటన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలో కాకుండా సైన్యం చేతుల్లో చిక్కుకుంది. దక్షిణాసియాలో అణు అస్థిరతకు పాకిస్తాన్ అడ్డాగా మారింది. అసిమ్ మునీర్ వాగుడు దీనినే సూచిస్తోంది. అమెరికా గడ్డపై ఆయన అనుచితంగా మాట్లాడారు. ఈ బాధ్యతరహితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను అమెరికా ప్రభుత్వం ఆమోదిస్తోందా? అణ్వాయుధ ఘర్షణలకు తెరపడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగా కోరుకుంటున్నారా? ఆయన వైఖరి ఏమిటి? మునీర్ వ్యాఖ్యలకు ట్రంప్ సర్కార్ బాధ్యత వహిస్తుందా?’’ అని భారత ప్రభుత్వ వర్గాలు ప్రశ్నించాయి. -
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఒళ్లుబలుపు వ్యాఖ్యలు
-
నోరు పారేసుకున్న మునీర్
న్యూయార్క్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి రెచి్చపోయారు. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన భారత్పై నోరుపారేసుకున్నారు. భారత సైన్యం గనుక పాకిస్తాన్పై దాడి చేస్తే తాము నష్టపోవడం కాకుండా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. శనివారం ఫ్లోరిడాలోని టాంపా పట్టణంలో ప్రవాస పాకిస్తానీల సమావేశంలో మాట్లాడారు. కాశ్మీర్ అంశాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. కాశ్మీర్ అనేది పాకిస్తాన్కు ‘తల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే సిర’ లాంటిదని చెప్పారు. తమ దేశానికి రావాల్సిన నీటిపై హక్కులను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జల హక్కులకు కాపాడుకుంటామన్నారు. ఇటీవల భారత్–పాక్ మధ్య ఘర్షణలో తాము పైచేయి సాధించమని వ్యాఖ్యానించారు. భారత్ మరోసారి దాడిచేస్తే తగిన సమాధానం చెప్తామన్న సందేశం ఇచ్చామని పేర్కొన్నారు. కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారం కాదని, అది పూర్తిగా అంతర్జాతీయ ఎజెండా అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్కు కాశ్మీర్ అత్యంత కీలకమని మహ్మద్ అలీ జిన్నా చెప్పారని గుర్తుచేశారు. Pakistan Army Chief Asim Munir in Florida dinner:“We are a nuclear nation — if we go down, we’ll take half the world down with us.”On India’s Indus dam plan: “We’ll wait for them to build it, then destroy it with 10 missiles.”Loose threats, no shame. Remember Kargil — we…— Praffulgarg (@praffulgarg97) August 10, 2025సింధూ నది ఇండియా జాగీర్ కాదు తమ దేశానికి నీరు రాకుండా ఎగువన భారత్ గనుక డ్యామ్లు నిర్మిస్తే వాటిని కచ్చితంగా పేల్చేస్తామని అసిమ్ మునీర్ హెచ్చరించారు. డ్యామ్లు నిర్మించేదాకా వేచి చూస్తామని, వాటి నిర్మాణం పూర్తయ్యాక ధ్వంసం చేస్తామని అన్నారు. సింధూ నది ఇండియా జాగీర్ కాదని స్పష్టంచేశారు. అది సొంత ఆస్తిలాగా భావించొద్దని ఇండియాకు సూచించారు. నదులకు అడ్డుకట్ట వేయాలని చూస్తే అడ్డుకొని శక్తి తమకు ఉందన్నారు. పాకిస్తాన్–అమెరికా మధ్య సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయని మునీర్ హర్షం వ్యక్తంచేశారు. నెలన్నర వ్యవధిలోనే తాను మరోసారి అమెరికాకు రావడమే అందుకు నిదర్శనమని తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని అపేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మునీర్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ⚡️🤯 Asim Munir Threatens Nuclear Armageddon: "We'll Take Half the World Down with Us" - ReportThe Pakistani military chief was speaking at a black-tie event in the US, saying if his country faces an existential threat in a future war with India, “we are a nuclear nation, if we… pic.twitter.com/P8E3n0yUHJ— Tarique Hussain (@Tarique18386095) August 11, 2025 -
అంతరిక్షం నుంచి గంగా నది డెల్టా కనువిందు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి భారత్లోని గంగా నది డెల్టా ప్రాంతం కనువిందు చేస్తోంది. నాసా వ్యోమగామి డాన్ పెటిట్ ఈ ఫోటోను చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పోస్టుచేశారు. గంగా నది డెల్టా ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ డెల్టాగా గుర్తింపు పొందింది. తూర్పు భారతదేశం, బంగ్లాదేశ్లో విస్తరించి ఉంది. సారవంతమైన భూములు, పచి్చక బయళ్లకు పెట్టింది పేరు. దీన్ని గంగా–బ్రహ్మపుత్ర డెల్టా లేదా బెంగాల్ డెల్టా లేదా సుందర్బన్స్ డెల్టా అని కూడా అంటారు. విస్తీర్ణం లక్ష చదరపు కిలోమీటర్లకు పైమాటే. లక్షలాది మందికి ఇదొక జీవరేఖ. డాన్ పెటిట్ నియర్–ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీతో ఈ చిత్రాన్ని బందించారు. నదులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో, సైన్స్ చానళ్లలో ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు డాన్ పెటిట్ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా కళాత్మక దృష్టి కూడా ఇందులో కనిపిస్తోంది. -
పదేపదే యాడ్స్.. విసిగిస్తున్నాయ్..!
టీవీ చూస్తున్నప్పుడు ప్రకటనలు రావడం సహజం. మనం చూస్తున్న ఛానల్లో కొన్ని యాడ్స్ పదేపదే ప్రత్యక్షం అవుతుంటాయి. ఇలా ఒకే ఛానల్లో ఎక్కువసార్లు ప్రసారం కావడంతో ప్రేక్షకులు విసిగిపోతారు. సింపుల్గా ఛానల్ మారుస్తారు. ప్రకటన ప్రభావమేకాదు యాడ్స్పట్ల వీక్షకుడికి శ్రద్ధ కూడా తగ్గిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం పదేపదే వచ్చే ప్రకటనల కారణంగా 70% మంది భారతీయ వినియోగదారులు విసిగిపోతున్నారట. ఇలా యాడ్స్తో విసుగుచెందుతున్న వారి సంఖ్య శాతం పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది.చూస్తున్న ఛానల్లో పదేపదే ఒకే యాడ్ వస్తే సహజంగానే ఎవరికైనా విసుగొస్తుంది. ఇలా విసుగుచెందుతున్న వారి అంతర్జాతీయ సగటు 68 శాతం ఉందని యాడ్స్ టెక్నాలజీ కంపెనీ ‘ది ట్రేడ్ డెస్క్’ ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఇలా అత్యధికంగా విసుగు చెందినవారితో ప్రపంచంలో యూఎస్, ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉన్నాయి. ప్రకటనలపట్ల నిరాసక్తత పెరుగుతున్న నేపథ్యంలో బ్రాండ్స్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు అమలు చేయాల్సిన ఆవశ్యకతను నివేదిక వివరించింది. ఐదుకుపైగా ఛానళ్ల వీక్షణంకేబుల్ టీవీ, ఓటీటీ.. వేదిక ఏదైనా సినిమాలు, వెబ్ సిరీస్, సంగీతం, వార్తలు, గేమింగ్.. ఇలా విభిన్న మాధ్యమాల కోసం సగటున ఒక్కో వ్యక్తి రోజుకు 5.4 మీడియా ఛానళ్లను వీక్షిస్తున్నారట. ఇందుకు 9 గంటలు సమయం వెచ్చిస్తున్నారు. ఆడియోతో స్వల్వ, దీర్ఘకాలంలో ప్రకటనలు గుర్తుండిపోతున్నాయి. వినియోగదారులకు మరింత ప్రభావశీలమైన అనుభవాన్ని అందించగలిగితే.. ప్రకటన పట్ల ఉన్న విసుగును 2.2 రెట్లు తగ్గించడంతోపాటు ఉత్పాదన కొనుగోలు చేసేలా ఒప్పించే ప్రభావం 1.5 రెట్లు పెరుగుతుందని నివేదిక తెలిపింది.కేబుల్ టీవీ, ఓటీటీలతో..» బ్రాండ్స్ గురించి తెలుసుకోవడానికి కేబుల్ టీవీ, ఓటీటీలు ప్రధాన మాధ్యమాలుగా నిలిచాయి. వీటిద్వారా బ్రాండ్స్ను తెలుసుకున్నామని 73 శాతం భారతీయులు చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 51 శాతం మాత్రమే.» ప్రకటనలతో కూడిన స్ట్రీమింగ్ సేవలను మనదేశంలో 72% మంది సబ్స్క్రైబ్ చేశారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 42%.» భారత్లో 18–34 ఏళ్ల వయసువారిలో 55% మంది ఒకే ప్లాట్ఫామ్పై కాకుండా ప్రీమియంగా భావించి కేబుల్ టీవీ, ఓటీటీల్లో ప్రకటనలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.ప్రకటనలు గుర్తుపెట్టుకుంటున్నారు» వీక్షిస్తున్నప్పుడు కొత్త బ్రాండ్స్, సేవలు, ఉత్పత్తులను 73% మంది గుర్తించారు.» ఇతర మాధ్యమాలతో పోలిస్తే 66% మంది కేబుల్ టీవీ, ఓటీటీ ప్రకటనలను విశ్వసిస్తున్నారు.» కేబుల్ టీవీ, ఓటీటీల్లో ప్రకటనల్లో కనపడిన ఉత్పత్తులను 69% మంది గుర్తు చేసుకుంటున్నారు.» 47% మంది.. పోస్టర్లు, బిల్బోర్డులు లాంటి డిజిటల్ అవుట్ ఆఫ్ హోమ్ (డీఓఓహెచ్) మీడియాను గుర్తిస్తున్నట్టు, అవి తమకు గుర్తుంటున్నాయని చెప్పారు.» ప్రకటనలు వింటున్న 86% సందర్భాలలో కస్టమర్లు మమేకం అవుతున్నారు. » జెన్ జీ (1997–2012 మధ్య పుట్టినవారు)లో 75% మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇష్టపడుతున్నారు. -
మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ కాదు.. మూడో స్థానానికి ఎదుగుతున్నాం
సాక్షి, బెంగళూరు: భారతదేశ ఆర్థిక వ్యవస్థ మృతప్రాయంగా మారిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా తిప్పికొట్టారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్ పరుగులు తీస్తోందని తేలి్చచెప్పారు. స్పష్టమైన ఉద్దేశాలు, నిజాయితీగల ప్రయత్నాలతో ముందుకెళ్తున్నామని వివరించారు. మన ఆర్థిక వ్యవస్థలో వేగానికి ‘సంస్కరణ, పనితీరు, మార్పు’ చోదక శక్తిగా పని చేస్తున్నాయని వెల్లడించారు. 11 ఏళ్ల క్రితం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ పదో స్థానంలో ఉండేదని, ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు. మూడో స్థానానికి ఎగబాకడం ఇక ఎంతో దూరంలో లేదన్నారు. ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు. బెంగళూరు మెట్రోరైలు నెట్వర్క్కు సంబంధించిన ‘ఎల్లో లైన్’ను ప్రారంభించారు. ఆర్.వి.రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సంభాíÙంచారు. బెంగళూరు మెట్రోరైల్ ప్రాజెక్టు మూడో దశకు(ఆరెంజ్ లైన్) మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే మూడు వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. 2014లో ఇండియాలో మెట్రో రైలు వ్యవస్థ కేవలం ఐదు నగరాల్లోనే ఉండేదని, ప్రస్తుతం 24 నగరాల్లో అందుబాటులోకి వచి్చందని చెప్పారు. ఈ వ్యవస్థ వెయ్యి కిలోమీటర్లకు విస్తరించిందని తెలియజేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ మన దేశంలోనే ఉందన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... పట్టణ ప్రణాళిక అత్యంత కీలకం ‘‘దేశంలో 2014 కంటే ముందు కేవలం 20 వేల కిలోమీటర్ల రైలు మార్గం విద్యుదీకరణ జరిగింది. గత 11 ఏళ్లలో 40 వేల కిలోమీటర్లకు పైగా విద్యుదీకరణ పూర్తిచేశాం. 2014లో దేశంలో కేవలం 74 ఎయిర్పోర్టులు ఉండేవి, ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరింది. 2014లో జాతీయ జలరహదారులు కేవలం మూడు ఉండగా, ప్రస్తుతం అవి 30కి చేరుకున్నాయి. మన నగరాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది, ప్రభావంతంగా మారితేనే మన దేశం ప్రగతి పథంలో సాగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకే నగరాల్లో అధునిక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 21వ శతాబ్దంలో పట్టణ ప్రణాళిక, పట్టణ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దుకోవాలి. నవ భారత్ ఎదుగుదలకు బెంగళూరు ఒక ప్రతీక. ఆధ్యాతి్మక జ్ఞానం, సాంకేతిక విజ్ఞానం బెంగళూరు ఆత్మలో మిళితమయ్యాయి. ‘సిందూర్’ విజయం వెనుక సాంకేతికత‘మేక్ ఇన్ ఇండియా’ ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక భారతీయ సాంకేతికత, ‘మేక్ ఇన్ ఇండియా’ ఉన్నాయి. మన దేశంపైకి ఉగ్రవాదులను ఏగదోసిన పాకిస్తాన్ను కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మోకాళ్లపై నిల్చోబెట్టాం. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంలో కొత్త ముఖాన్ని ప్రపంచం తొలిసారిగా దర్శించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం, మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాం. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ‘మేక్ ఇన్ ఇండియా’ బలం మనకు విజయం చేకూర్చిపెట్టాయి. ఆపరేషన్ సిందూర్లో బెంగళూరుతోపాటు ఇక్కడి యువత కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా బెంగళూరు గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది. మనదేశం ప్రపంచంతో పోటీ పడడమే కాకుండా, ప్రపంచాన్ని స్వయంగా ముందుకు నడిపిస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ట్రంప్కు ప్రధాని మోదీ కౌంటర్!
బెంగళూరు: భారత్ ‘డెడ్ ఎకానమీ’ అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ప్రపంచంలో భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదంటూ స్పష్టం చేశారు. ఈరోజు( ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) బెంగళూరులో మెట్రో ఫేజ్-3 కి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన మోదీ ప్రసంగించారు. భారత్ మూడో ఆర్థిక శక్తి కాబోతుందంటూ ఆయన స్పష్టం చేశారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనేవి భారత్ ఆర్థికంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ‘గత 11 ఏళ్లలో భారత ఆర్థికంగా బలోపేతమైంది. 10వ స్థానం నుంచి 5 స్థానానికి వచ్చాం. ఇప్పుడు మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే ట్రాక్లో ఉన్నాం. కచ్చితమైన, నిజాయితీ పరమైన దృష్టి పెట్టడంతోనే ఇది సాధ్యమవుతూ వస్తుంది. అందుకే ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి మనం దగ్గర్లోనే ఉన్నాం,’ అని తెలిపారు.2014 నాటికి మన దేశంలో ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు అందుబాటులో ఉండేది. ఇప్పుడు 24 నగరాల్లో ఆ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో నెట్వర్క్. 2014 నాటికి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లు అనేవి ఏడు, మెడికల్ కాలేజీలు 387 ఉండేవి. ఇప్పుడు మెడికల్ ఇన్స్టిట్యూట్లు 22, మెడికల్ కాలేజీలు 704 ఉన్నాయి. ఎలక్రికల్ రైళ్లు 2014 నాటికి 20వేలు మాత్రమే ఉంటే నేటికి అవి 40వేలు అయ్యాయి. ఇక ఎయిర్పోర్ట్లు 74 నుంచి 180కు పెరిగాయి’ అని ప్రభుత్వం సాధించిన ఘనతలను చెప్పుకొచ్చారు మోదీ. -
‘భారత్ అభివృద్ధిని చూసి ట్రంప్ అసూయతో రగిలిపోతున్నారు’
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెటైర్లు వేశారు. భారత్ ఎదుగుదలను చూసి ట్రంప్ అసూయతో రగిలిపోతున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అందుకే టారిఫ్ల పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.భారత్ ‘సూపర్ పవర్’కానుంది. అన్ని రంగాల్లో విశ్వవిజేతగా నిలుస్తోంది. అలాంటి భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. భారత్ అభివృద్ధిపై జరుగుతున్న చర్చను చూసి కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఎదుగుదల వాళ్లకు ఇష్టం లేదు.అందుకే ప్రపంచ దేశాల్లో మేడిన్ ఇండియా ఉత్పత్తుల కొనుగోళ్లు జరగకుండా కుట్ర చేస్తున్నారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులు చాలా ఖరీదైనవనే ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం వల్ల కొనుగోళ్లు ఆపొచ్చని అనుకుంటున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేను మీకు మాటిస్తున్నా.. ప్రపంచంలోని ఏ శక్తి భారత్ సూపర్ పవర్ అవ్వకుండా ఆపలేదని స్పష్టం చేశారు.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధానికి రష్యాకు భారత్ పరోక్షంగా సహకరిస్తోందని ట్రంప్ వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ వెనక్కి తగ్గాలని హెచ్చరించారు. కాదంటే సుంకాల పెంపు ఉంటుందన్న ట్రంప్ పనిలోపనిగా.. భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించారు. అదనంగా పెనాల్టీ విధించారు. అంతేకాదు,రష్యాతో తన ఒప్పందాలను భారత్ నిలిపివేయాలని బెదిరించారు. ఇరు దేశాల మధ్య వ్యాపార,వాణిజ్య ఒప్పందాలు ఇలాగే కొనసాగితే మరింత సుంకాల పెంపు ఉంటుందని అన్నారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ట్రంప్ చర్యలను ఉద్దేశిస్తూ రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ట్రంప్ చర్యలకు ధీటుగా బదులిచ్చారు. -
అయిదో భారీ ఏవియేషన్ మార్కెట్గా భారత్
న్యూఢిల్లీ: గతేడాది 24.1 కోట్ల మంది ప్యాసింజర్లతో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారత్ ఆవిర్భవించింది. అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాల జాబితాలో ముంబై–ఢిల్లీకి చోటు దక్కింది. 2024 సంవత్సరానికి గాను అంతర్జాతీయ ఎయిర్లైన్స్ సమాఖ్య ఐఏటీఏ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం గతేడాది భారత్లో విమాన ప్రయాణికుల సంఖ్య 2023తో పోలిస్తే 11 శాతం పెరిగి 21.1 కోట్లుగా నమోదైంది. అత్యధికంగా 87.6 కోట్ల మంది ప్యాసింజర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 74.1 కోట్ల మందితో చైనా రెండో స్థానంలో ఉంది. ఇక యునైటెడ్ కింగ్డం మూడో స్థానంలో (26.1 కోట్ల మంది) స్పెయిన్ 4వ స్థానంలో (24.1 కోట్ల మంది ప్రయాణికులు) నిల్చాయి. టాప్ 10 జంట ఎయిర్పోర్టుల్లో 59 లక్షల మంది ప్రయాణికులతో ముంబై–ఢిల్లీ జత 7వ ర్యాంకులో ఉంది. అంతర్జాతీయంగా ప్రీమియం క్లాస్ ప్రయాణాలు (బిజినెస్, ఫస్ట్ క్లాస్) 11.8 శాతం, ఎకానమీ ట్రావెల్ 11.5 శాతం పెరిగాయి. మొత్తం ఇంటర్నేషనల్ ప్యాసింజర్లలో ప్రీమియం క్లాస్ ట్రావెలర్లు 6 శాతం పెరిగి 11.69 కోట్లకు చేరింది. ప్రాంతాలవారీగా చూస్తే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రీమియం ప్యాసింజర్ల సంఖ్య 22.8 శాతం పెరిగి 2.1 కోట్లకు చేరింది. యూరప్, లాటిన్ అమెరికా, మధ్య ప్రాచ్యం, ఉత్తర అమెరికాల్లో ప్రీమియం ప్రయాణికుల సంఖ్య, ఎకా నమీ తరగతి వారికన్నా అధికంగా నమోదైంది. -
ఈయూతో ఒప్పందంపై దూకుడు పెంచాలి
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల మోత నేపథ్యంలో యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) కుదుర్చుకోవడంపై భారత్ దూకుడు పెంచాలని 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా చెప్పారు. అదే సమయంలో అధిక వృద్ధి సాధించే దిశగా భూ, కార్మిక మార్కెట్ సంస్కరణలను వేగవంతం చేయడంతో పాటు నియంత్రణల భారాన్ని తగ్గించడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ‘ఒక మార్కెట్ దాదాపు మూసుకుంటున్నప్పుడు మరో మార్కెట్ వైపు మళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈయూతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా, చాలా ముఖ్యం. అదే సమయంలో భూ, కారి్మక మార్కెట్కి సంబంధించి సంస్కరణలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పనగారియా చెప్పారు. ‘మనపై టారిఫ్లు అమెరికా మార్కెట్లో ఎక్కువగా ఉండి యూరోపియన్ యూనియన్లో తక్కువగా ఉంటే.. మన ఎగుమతులను అమెరికా నుంచి ఈయూకి మళ్లించాలి. మార్కెట్లలో లాభాపేక్ష చాలా బలంగా ఉంటుంది. ఎంట్రప్రెన్యూర్లు చాలా స్మార్ట్గా వ్యవహరిస్తారు. చాలా వేగంగా సరఫరా వ్యవస్థల్లో మార్పులకు అనుగుణంగా సర్దుకుంటారు‘ అని చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితి ఒక రకంగా 1991 నాటి పరిస్థితులను తలపిస్తోంది. అమెరికా భారీ టారిఫ్ల వల్ల సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో అప్పట్లో మనం ఏం చేశామనేది ఒకసారి గుర్తు చేసుకుని, ఏం చేయగలమనేది ఆలోచించాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంస్కరణల అజెండాలో చాలా చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి‘ అని సంపన్న దేశంగా ఎదగాలంటే భారత్ తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని, ఎగుమతుల కోసం ఆసియా మార్కెట్లపై ఫోకస్ చేయాలని, అలాగే చైనాపై మన వైఖరిని కూడా పునఃసమీక్షించుకోవాలని పనగారియా సూచించారు.డెడ్ ఎకానమీ .. అత్యధిక వృద్ధి.. భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ (నిరీ్వర్యంగా) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పనగారియా స్పందించారు. ’భారత ఎకానమీ నిజంగా నిరీ్వర్యమైపోతే.. 7 శాతం స్థాయిలో అత్యధిక వృద్ధి సాధించదు. డాలర్ల మారకంలో చూస్తే మన వృద్ధి బహుశా ఇంకా ఎక్కువే ఉంటుంది. డెడ్ ఎకానమీకి ఆయన నిర్వచనం ఏమిటో నాకు తెలియదు. బహుశా (ఆయన ఉద్దేశం ప్రకారం) మృత దేహాల్లోనూ కదలిక ఉంటుందేమో’ అని వ్యాఖ్యానించారు. -
సెమీకండక్టర్ల మార్కెట్ @ రూ. 9.6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి 100–110 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.6 లక్షల కోట్లు) స్థాయికి చేరనుంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం రెండు రెట్లు వృద్ధి చెందనుంది. 2023లో 38 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2024–25లో 45–50 బిలియన్ డాలర్లకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం ఈ రంగంపై తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, అమెరికా తదితర దేశాల ఆధిపత్యం ఉంటోందని వివరించాయి. సెమీకండక్టర్ల ఆవశ్యకత, కోవిడ్ మహమ్మారి కాలంలో నిర్దిష్ట ప్రాంతాలపై ఆధారపడటం వల్ల ఆటోమొబైల్ తదితర సెగ్మెంట్లు ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులు, సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరిశ్రమ స్పందన తదితర అంశాల గురించి ఇందులో తెలిపాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదగాల్సిన అవసరాన్ని ప్రస్తావించాయి. ప్రకటన ప్రకారం.. ప్రపంచంలో తయారయ్యే మొత్తం సెమీకండక్టర్లలో తైవాన్ 60 శాతం ఉత్పత్తి చేస్తోంది. అత్యంత అధునాతన సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్ వాటా ఏకంగా 90 శాతం ఉంటోంది. ఒకే ప్రాంతంపై భారీగా ఆధారపడటమనేది అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కోవిడ్ తరహా మహమ్మారులు, ప్రకృతి విపత్తులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లాంటి అనేకానేక అంశాల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించాయి. దీన్ని గుర్తించే చాలా దేశాలు ప్రస్తుతం సురక్షితమైన, వైవిధ్యమైన సరఫరా వ్యవస్థలను ఏర్పర్చుకుంటున్నాయని పేర్కొన్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా దేశీయంగా చిప్ల తయారీని ప్రోత్సహించేందుకు, ఒకే ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు జాతీయ స్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయని వివరించాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న మార్పుల్లో భారత్ కూడా కీలకమైన, విశ్వసనీయమైన భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్నాయి. 1 ట్రిలియన్ డాలర్లకు గ్లోబల్ మార్కెట్ .. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 2030 నాటికి అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల మార్కెట్ 1 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్లకు చేరనుంది. భారత్ ఇందులో గణనీయమైన వాటా దక్కించుకునే అవకాశం ఉంది. సెమీకండక్టర్ల తయారీ సరఫరా వ్యవస్థకు మూడు ప్రధాన మూల స్తంభాలైన పరికరాలు, మెటీరియల్స్..సరీ్వసులు, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాల విభాగాల్లో కీలక భాగస్వామిగా ఎదిగే సత్తా భారత్కి ఉంది. సెమీకండక్టర్ల ఎక్విప్మెంట్కి అవసరమైన విడిభాగాలను ఉత్పత్తి చేసేందుకు చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) ఉపయోగించుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్ సప్లై చెయిన్ కంపెనీలకు అవసరమైన రసాయనాలు, లోహాలు మొదలైనవి మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయని వివరించాయి. ఇక సరీ్వసుల విషయానికొస్తే ఆర్అండ్డీ, లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థకు సంబంధించి కృత్రిమ మేథ, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లాంటి విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా ఉందని పేర్కొన్నాయి. ప్రభుత్వం దన్ను.. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ వేల్యూ చెయి న్లకి భారత్ను మరింతగా అనుసంధానం చేసే దిశగా సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్, డిస్ప్లేల తయారీ, చిప్ డిజైన్ మొదలైన వాటిల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పరిశ్రమకు ఆర్థిక మద్ద తు కలి్పంచేలా 2021 డిసెంబర్లో రూ. 76,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ఆవిష్కరించింది. అమెరికాకు చెందిన మెమొరీ చిప్ల తయారీ దిగ్గజం మైక్రాన్, టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (టీఎస్ఏటీ), కేనెస్ సెమీకాన్, హెచ్సీఎల్–ఫాక్స్కాన్లతో పా టు తైవాన్ సంస్థ పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ (పీఎస్ఎంసీ) భాగస్వామ్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ (టీఈపీఎల్), రెనిసాస్ అండ్ స్టార్స్ భాగస్వామ్యంలో సీజీ పవర్ అండ్ ఇండ్రస్టియల్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలైనవి భారత్లో సెమీకండక్టర్ల ఉత్పత్తి కోసం రూ. 1.55 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద చిప్ డిజైనింగ్ కోసం రూ. 1,000 కోట్లతో డిజైన్ ఆధారిత ప్రోత్సాహకాలకు కూడా ఐఎస్ఎం ప్రొవిజనింగ్ ఏర్పాటు చేసింది. అర్హత కలిగిన స్టార్టప్లకు ఆర్థికంగా మద్దతునిచ్చేందుకు ఇందులో రూ. 234 కోట్లు కేటాయించారు. ‘22 కంపెనీలు ప్రతిపాదించిన చిప్ డిజైన్ ప్రాజెక్టులకు కేంద్రం రూ. 234 కోట్ల మద్దతుకి హామీ ఇచి్చంది. ఈ మొత్తం ప్రాజెక్టుల వ్యయం రూ. 690 కోట్లుగా ఉంటుంది. ఈ చిప్లను సీసీటీవీ కెమెరాలు, మొబైల్ నెట్వర్క్లు, ఉపగ్రహాలు, కార్లు, స్మార్ట్ డివైజ్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. దేశీయంగా చిప్ల తయారీ వ్యవస్థను అభివృద్ధి చేసే క్రమంలో సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ ఇంటర్నేషనల్ (సెమీ) భాగస్వామ్యంతో కేంద్రం సెమీకాన్ ఇండియా సదస్సుకు కూడా మద్దతునిస్తోంది‘ అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సులో అంతర్జాతీయ పరిశ్రమ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, అంకుర సంస్థలు కూడా పాల్గొంటాయి. పె ట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలకు ఇది వేదికగా నిలుస్తోంది. ఈ ఏడాది సెపె్టంబర్ 2 నుంచి 4 వరకు సెమీకాన్ ఇండియా 4వ ఎడిషన్ న్యూఢిల్లీలో జరుగనుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం), సెమీ కలిసి సెమీకాన్ ఇండియా 2025ని నిర్వహించనున్నాయి. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల వ్యవస్థలో భారత్ పాత్ర గురించి చాటి చెప్పే విధంగా ఈ సదస్సు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
‘మా ట్రంప్ అతి పెద్ద తప్పిదం చేశారు’
వాషింగ్టన్: భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాల నిర్ణయం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదని అంటున్నారు ఆ దేశ జాతీయ సెక్యూరిటీ మాజీ సలహాదారు జాన్ బాటమ్. భారత్ వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాల తీరును తీవ్రంగా తప్పబట్టారాయన. కచ్చితంగా ఇది ట్రంప్ చేసిన అతి పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. ఎన్నో దశాబ్దాల నంచి భారత్తో ఉన్న మిత్రత్వం ట్రంప్ సుంకాల దెబ్బతో అది కాస్తా బెడిసి కొట్టే ప్రమాదం అధికంగా ఉందన్నారు. చైనా కంటే అత్యధిక సుంకాలు విధించడం భారత్ పట్ల వివక్ష ధోరణికి నిదర్శమన్నారు. చైనాకు సుంకాలు పెంచి ఉపశమన కల్పించిన ట్రంప్.. భారత్పై 50 శాతం సుంకాలంటూ బెదిరింపు చర్యలకు దిగడం అమెరికా-భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. చైనాపై ఉదాసీనత కనబరిచిన ట్రంప్.. భారత్ను రష్యా, చైనాలను దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ప్రమాదంలో పడేస్తాయన్నారు. భారత్ను రష్యా, చైనాల నుంచి వేరు చేయడానికి చేసిన ట్రంప్ వ్యూహం కచ్చితంగా అతి పెద్ద తప్పిదమేనని నొక్కి మరీ చెప్పారు. సీఎన్ఎన్తో మాట్లాడిన ఆయన ట్రంప్ విధించే సుంకాలపై గురించి, ప్రత్యేకంగా భారత్పై విధించిన సుంకాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరొకవైపు అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు, ఆ దేశ మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ పాడిల్లా కూడా భారత్పై ట్రంప్ విధించిన సుంకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సుంకాలు ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు దీర్ఖకాలిక నష్టం కల్గించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ఇక్కడ అమెరికా నమ్మకమైన భాగస్వామి కాదు అనేది తలెత్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
టారిఫ్ అంటే ఏమిటి?: దేశ ఆర్ధిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా..
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' భారతదేశంపైన 50 శాతం సుంకాలను ప్రకటించారు. ఇది భారత ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ సుంకం (టారిఫ్) అంటే ఏమిటి?, అది దేశ ఆర్ధిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సుంకం అంటే?సుంకం అంటే పన్ను. దీన్ని ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధిస్తుంది. దీనివల్ల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల ధరలు చౌకగా కాకుండా ఉండటానికి.. ఆ దేశ ప్రభుత్వం ఈ సుంకాలను విధిస్తుంది.దేశ ఆర్ధిక వ్యవస్థపై సుంకాల ప్రభావం..ట్రంప్ భారతదేశంపై విధించిన 50 శాతం సుంకాల వల్ల.. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్త్రాలు, ఇనుము, ఉక్కు, ఫార్మా, బంగారం మొదలైన వాటి ధరలు పెరుగుతాయి. వీటి ధరలు పెరిగితే అక్కడ డిమాండ్ తగ్గుతుంది. ఇది ఇండియన్ కంపెనీలపై ప్రభావం చూపుతుంది. క్రమంగా ఎగుమతులు తగ్గుతాయి. తద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా తగ్గుతుంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద కొంతవరకు ప్రభావాన్ని చూపుతుంది.సుంకాలు విధించడం వల్ల ప్రయోజనాలుసుంకాలు విధించడం వల్ల దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. విదేశీ వస్తువుల ధరలు అధికంగా కావడంతో ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల మీదనే మొగ్గు చూపుతారు. ఇది దేశీయ పరిశ్రమలను బలపరుస్తుంది, కర్మాగారాల సంఖ్య కూడా పెంచుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.ఇదీ చదవండి: మేడ్ ఇన్ ఇండియా రాఖీలదే హవా.. ఏకంగా రూ.17000 కోట్ల బిజినెస్సుంకాల వల్ల ప్రతికూల ప్రభావంఒక దేశం ఇతర దేశాలపై భారీ సుంకాలను విధిస్తే.. ఆ దేశం కూడా అదే స్థాయిలో సుంకాలను విధిస్తుంది. తద్వారా ఆ దేశం వస్తువుల ధరలు కూడా ఇతర దేశాల్లో పెరుగుతాయి. ఇది వాణిజ్య యుద్దానికి దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా భారతదేశంలో 50 శాతం సుంకాలను ప్రకటించింది. ఇండియా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచే అవకాశం ఉంది. -
ఓపెన్ ఏఐ నుంచి జీపీటీ 5: అందరికీ ఫ్రీ
ప్రస్తుతం అంతర్జాతీయంగా తమకు అతి పెద్ద మార్కెట్లలో రెండో స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే అగ్ర స్థానానికి చేరుతుందని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ తెలిపారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ప్రజలు, వ్యాపార సంస్థలు గణనీయ స్థాయిలో కృత్రిమ మేధను వినియోగిస్తున్నాయని ఆయన వివరించారు.కొత్త తరం మోడల్ జీపీటీ-5ని ఆల్ట్మన్ ఆవిష్కరించారు. ఇది అందరికీ ఉచితమని వివరించారు. తాము మరిన్ని ఉత్పత్తులను భారత మార్కెట్లో ప్రజలకు ఏఐని మరింతగా అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నామని, స్థానిక భాగస్వాములతో కూడా కలిసి పని చేస్తున్నామని ఆల్ట్మన్ చెప్పారు.జీపీటీ–5 గురించి వివరిస్తూ, కోడింగ్.. ఏజెంటిక్ టాస్క్లకు ఇప్పటివరకు వచ్చిన మోడల్స్లో ఇది అత్యుత్తమమైనదని వివరించారు. డెవలపర్లకు మరింత వెసులుబాటు లభించేలా ఏపీఐలో జీపీటీ–5, జీపీటీ–5–మినీ, జీపీటీ–5–నానో అని మూడు విధాలుగా ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ సమస్యకు చెక్!.. జపాన్ కంపెనీ వ్యూహం ఇదే..కొత్త మోడల్ 12 భారతీయ భాషలను అర్థం చేసుకోగలుగుతుందని ఆల్ట్మన్ చెప్పారు. ఉచిత, ప్లస్, ప్రో యూజర్లకు జీపీటీ–5 ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి రాగా, ఎంటర్ప్రైజ్.. ఎడ్యుకేషన్ యూజర్ల సెగ్మెంట్కు వారం తర్వాత నుంచి లభిస్తుందని వివరించారు. -
అమెరికాతో రక్షణ ఒప్పందాలు యథాతథం
న్యూఢిల్లీ: భారత్ వస్తువులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన వేళ రక్షణ ఒప్పందాలను నిలిపి వేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం కొట్టివేసింది. రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. రక్షణ సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. అమెరికా నుంచి అందాల్సినవి ఒప్పందం ప్రకారం అందుతూనే ఉంటాయని, తదుపరి ఆర్డర్లపై చర్చలు కూడా కొనసాగుతాయని వివరించింది. అమెరికా నుంచి రక్షణ కొనుగోళ్లను భారత ప్రభుత్వం ఆపేసిందంటూ వస్తున్న వార్తలు అసత్యాలు, అభూత కల్పనలు అని రక్షణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. టారిఫ్ల పెంపు నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ అమెరికా వెళ్లి, కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. అయితే, ఆ పర్యటనను ప్రభుత్వం రద్దు చేసిందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. టారిఫ్ల పెంపు వేళ..రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల మధ్య విశ్వాసం సడలిన మాట వాస్తవమేనని, అయితే దీని ప్రభావం రక్షణ సంబంధాలపై ప్రత్యక్షంగా పడబోదని ఐజీ డ్రోన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్ మేజర్ జనరల్ పధి విశ్లేషించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 20 వరకు రక్షణ ఒప్పందాలున్నాయన్నారు. అమెరికాకు చెందిన అపాచీ, చినూక్, పీ–81 విమానాలు, ఎంక్యూ–9 డ్రోన్లను భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తోందని, వీటిపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. -
ఫార్మాపైనా.. టారిఫ్ పిడుగు
భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నామని ప్రకటించిన అమెరికా... రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొంటున్నదన్న కారణంతో మరో 25 శాతం పెనాల్టీ సుంకాలు కూడా విధించింది. వెరసి ఈ 50 శాతం సుంకాలూ ఈ నెల్లోనే అమల్లోకి రానున్నాయి. దీనివల్ల చాలా భారత కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల్ని పెంచాలి. ఇలా పెంచితే మిగతా దేశాల నుంచి ఎదురయ్యే పోటీలో వెనకబడిపోవచ్చు. ఇవన్నీ పలు కంపెనీల ఆదాయాలకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సెక్షన్ 232 ప్రకారం దిగుమతి సుంకాల నుంచి ఫార్మా సహా కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు ఉండటంతో ఫార్మా కంపెనీలు ప్రస్తుతానికి ధీమాగానే ఉన్నాయి. కానీ ఫార్మాను కూడా సుంకాల్లో చేరుస్తామని, 250 శాతం టారిఫ్లు వేస్తామని ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదే జరిగితే అమెరికాయే ప్రధాన ఆదాయ వనరుగా సాగుతున్న పలు భారత ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అమెరికా జనరిక్ డ్రగ్ మార్కెట్లో భారత్ది ఏకంగా 33 శాతం వాటా. టారిఫ్లు గనక వర్తిస్తే మన కంపెనీలకు ఎదురయ్యే ఇబ్బందులపై ‘సాక్షి బిజినెస్’ ప్రత్యేక కథనమిది... – సాక్షి బిజినెస్ డెస్క్ఇవీ.. మన సానుకూలతలు» మన దేశంలో కార్మికుల వ్యయాలు తక్కువ. నిపుణుల లభ్యత ఎక్కువ. టెక్నాలజీ కూడా ఉంది. అందుకనే యూఎస్ ఎఫ్డీఏ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను భారత ఫార్మా సంస్థలు తయారు చేయగలుగుతున్నాయి. అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మన కంపెనీలు గట్టి పోటీనివ్వగలుగుతున్నాయి.» అమెరికా మార్కెట్లో అమ్ముడుపోయే ప్రతి మూడు జనరిక్ ఔషధాల్లో ఒకటి భారత కంపెనీలు సరఫరా చేస్తున్నదేనంటే... కారణమిదే » మన ఫార్మా రంగం గనక 25– 50 శాతం టారిఫ్లను ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు మన ఔషధాలు అమెరికా మార్కెట్లో ప్రియమవుతాయి. ధరల పరంగా ఉన్న వెసులుబాటు తగ్గిపోతుంది. » తక్కువ ధరలకే ఉత్పత్తులు విక్రయించే అవకాశం పోయినట్లయితే... పోటీలో వెనకబడే ప్రమాదం ఉంటుంది. తక్కువ మార్జిన్ ఉండే జనరిక్స్లో ఇది మరింత సుస్పష్టం.ఆదాయం, లాభాలకు గండి» చాలా ఫార్మా సంస్థల ఆదాయాల్లో అమెరికా మార్కెట్ వాటా 30–55 శాతం వరకు ఉంటోంది. » అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సన్ఫార్మా, లుపిన్, సిప్లా, గ్లాండ్ ఫార్మా తదితర సంస్థలపై అధిక ప్రభావం పడుతుంది.» కనీసం 17 శాతం వరకు ఆదాయాలు తగ్గిపోతాయన్నది విశ్లేషకుల అంచనా.ఏ దేశం నుంచి పోటీ ఉండొచ్చు?చైనా» యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియెంట్స్ (ఏపీఐ) మార్కెట్లో బలంగా ఉంది. » భారత ఫార్మా సంస్థలు ఫార్ములేషన్లపై ప్రధానంగా దృష్టి సారించడంతో ఏపీఐ మార్కెట్లో చైనా వాటా పెరిగింది.» చైనా మందులపై అమెరికాలో నమ్మకం తక్కువ. కోవిడ్ తరవాత ఇది మరింత పెరిగింది కూడా.» నాణ్యత, నమ్మకం, నియంత్రణల పరమైన అంశాల కారణంగా ఫార్మా విషయంలో భారత్ స్థానాన్ని చైనా భర్తీ చేయలేదు. మెక్సికో» అమెరికా మార్కెట్లోకి పన్నుల్లేకుండా వెళ్లగలగటం మెక్సికోకు ఉన్న సానుకూలత.» మెక్సికోలో జనరిక్స్ తయారీ సదుపాయాలు తక్కువే. గణనీయంగా ఎగుమతులు చేసే స్థాయిలో లేదు. దగ్గర్లో ఉండడం వల్ల, వాణిజ్య ఒప్పందాల వల్ల భవిష్యత్తులో మార్కెట్ను పెంచుకోగలదు.పోలాండ్, తూర్పు యూరప్» కాంట్రాక్టు తయారీ పరంగా పోటీనిస్తున్నాయి. ఈయూ నియంత్రణపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి.» భారత్తో పోల్చి చూస్తే తయారీ వ్యయాలు బాగా ఎక్కువ. కాకపోతే భౌగోళికంగా చూస్తే అమెరికా, ఈయూకు దగ్గర.» డిమాండ్లో మార్పులతో కొంత లాభపడొచ్చు.బంగ్లాదేశ్» తక్కువ ఖర్చుకే జనరిక్స్ ఔషధాలు తయారు చేయడంలో బంగ్లాదేశ్ ముందుంది.» వెనకబడిన దేశాలకు కల్పించిన ‘ట్రిప్స్ వైవర్’ కారణంగా ప్రయోజనం పొందగలదు.» అయితే భారత్లో మాదిరి ఎఫ్డీఏ ఆమోదం పొందిన ప్లాంట్లు ఇక్కడ చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు.» కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎఫ్డీఏ ప్రమాణాలను అందుకోవటం అంత తేలిక కాదు. బ్రెజిల్» ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఫార్మా మార్కెట్. ఎగుమతి సదుపాయాలు తక్కువే. దేశీయంగా ఉన్న డిమాండ్ను అందుకోవటమే ఇక్కడి కంపెనీలకు కష్టం. కనుక భారత ఎగుమతులకు ముప్పు కాదు.వ్యూహాత్మక అడుగులు» ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే... అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయటం.. అక్కడి కంపెనీలను కొనుగోలు చేయటం వంటి ప్రత్యామ్నాయాలను మన కంపెనీలు పరిశీలించే అవకాశం ఉంటుందన్నది నిపుణుల మాట. అరబిందో ఫార్మా ఇటీవలే యూఎస్కు చెందిన లానెట్ ఫార్మాను 250 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడాన్ని ఈ కోణంలో చూడొచ్చు. » ప్రత్యామ్నాయ మార్కెట్లలో... అంటే యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లో అవకాశాలపై ఫార్మా కంపెనీలు దృష్టి పెట్టొచ్చు. » అమెరికా మార్కెట్పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు కొత్త ఆవిష్కరణలు, బయోసిమిలర్స్, స్పెషాలిటీ డ్రగ్స్ దిశగా కంపెనీలు అడుగులు వేయొచ్చు. » ప్రభుత్వాల మధ్య ఫార్మా డీల్స్ కోసం లాబీయింగ్ చేయొచ్చు.అమెరికా వినియోగదారులపైనే భారం..భారత ఫార్మా రంగంపై టారిఫ్లు విధించడం ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది. అంతిమంగా అమెరికా వినియోగదారులపైనే భారం పడుతుంది. భారతీయ కంపెనీలు ఎక్కువగా మార్జిన్ లభించని అత్యంత చౌకైన జనరిక్స్ను తయారు చేస్తాయి. కాబట్టి, టారిఫ్లపరంగా భారం మోపితే అది అమెరికన్ వినియోగదారుల మీదే పడుతుంది. ఉత్పత్తి పరిమాణం, ఖరీదు తదితర అంశాలపరంగా భారత్ తరహా సామర్థ్యాలను సాధించాలంటే కనీసం 3–5 ఏళ్లు పట్టేస్తుంది. దేశీ సంస్థలకు 700 పైగా అమెరికా ఎఫ్డీఏ ఆమోదం పొందిన ప్లాంట్లు ఉండగా, 12 శాతం ఆదాయాలను నిబంధనలను పాటించడంపై వెచ్చిస్తున్నాయి. –నమిత్ జోషి, చైర్మన్, ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్టారిఫ్లు తీవ్రంగా ఉండకపోవచ్చు..గత నాలుగు దశాబ్దాలుగా, భారత ఫార్మా రంగం బాగా పెరిగి అంతర్జాతీయ హెల్త్కేర్ సరఫరా వ్యవస్థల్లో కీలకంగా మారింది. మన సంస్థలు ఏపీఐలు, ఇంటర్మీడియట్స్, స్పెషలైజ్డ్ ఫార్ములేషన్లను విస్తృత స్థాయిలో తయారు చేస్తాయి. విశేషమైన నైపుణ్యాలు, తక్కువ ధరకే అందించగలిగే సామర్థ్యాలతో పాటు అమెరికా హెల్త్కేర్ వ్యవస్థతో గణనీయంగా అనుసంధానమయ్యాయి. ఒకరిపై ఒకరు ఆధారపడటం వల్లే ప్రస్తుత టారిఫ్ వ్యవస్థలో ఫార్మాకు మినహాయిపు ఉంటోంది. ఈ నేపథ్యంలో మన ఫార్మా మీద మిగతా పరిశ్రమల్లాగా అమెరికా తీవ్ర స్థాయి టారిఫ్లు వేయకపోవచ్చు. – డి. శ్రీనివాస రెడ్డి, చైర్మన్, ఆప్టిమస్ ఫార్మామన బలాన్ని మనమూ ఉపయోగించుకోవాలి..మన ఫార్మాపై టారిఫ్లు విధిస్తే ఇవి అమెరికా ప్రయోజనాలకే విఘాతం కలిగిస్తాయి. 2013– 2022 మధ్య పదేళ్లలో మన జనరిక్స్ కారణంగా అమెరికా ఎకానమీకి 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అయ్యాయి. 200–250 శాతం స్థాయిలో టారిఫ్లు వేయకపోవచ్చు కానీ, మిగతా వాటిలా 50 శాతం వేసినా మన ఫార్మాకు ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. ప్రస్తుతానికైతే జనరిక్స్కి సంబంధించి భారత్కి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి మనం కూడా మన బలాన్ని ఉపయోగించుకుని, గట్టిగా మాట్లాడాలి. – రావి ఉదయ భాస్కర్, డైరెక్టర్ జనరల్, అఖిల భారత ఔషధ నియంత్రణ అధికారుల సమాఖ్య (ఏఐడీసీవోసీ)సింహ భాగం అమెరికా నుంచే..2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా మొత్తం ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లయితే... అందులో 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. అంటే.. మూడో వంతు ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. ఈ సమయంలో అమెరికా మార్కెట్ నుంచే అత్యధిక ఆదాయాన్ని పొందిన కొన్ని భారత ఫార్మా కంపెనీలను చూస్తే...ఫార్మా ఉత్పత్తులపైనా టారిఫ్లు బాదేస్తే.. అమెరికా మార్కెట్లో కీలకంగా పనిచేస్తున్న ఈ కంపెనీల ఆదాయాలపై గణనీయమైన ప్రభావం పడనుంది. సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బయోకాన్ సంస్థలకు 17 శాతం వరకు ఆదాయం తగ్గొచ్చన్నది విశ్లేషకుల మాట. దివీస్ ల్యాబొరేటరీస్ ఇటీవలే ప్రకటించిన జూన్ త్రైమాసికం ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లో తలెత్తిన ధరలపరమైన ఒత్తిళ్ల వల్లే ఇలా జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేస్తే పెనుభారమే!
భారత్ తన చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశంలో ఉపయోగిస్తున్న చమురులో ఏకంగా 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఇందులో ప్రధాన వాటా రష్యాదే. రష్యా నుంచి చౌకగా ముడిచమురు లభిస్తోంది. ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేయడానికి, 50 శాతం సుంకాలు విధించడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడమే కారణం. ఒకవేళ రష్యా నుంచి ముడిచమురు కొనడం ఆపేస్తే భారత్పై మోయలేని భారం పడడం ఖాయం. అది దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రతికూలంగా మార్చేయగలదు. రష్యా చమురును వద్దనుకుంటే ఇండియా ఆయిల్ దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుందని ఎస్బీఐ ఒక నివేదికలో తేల్చిచెప్పింది. 2026లో 9 బిలియన్ డాలర్లకు, 2027లో 12 బిలియన్ డాలర్లకు చేరుతుందని వెల్లడించింది. చమురు కోసం పూర్తిగా అరబ్ దేశాలపైనే ఆధారపడితే విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అంతిమంగా ఆ భారం మోయాల్సింది ప్రజలేనన్న సంగతి తెలిసిందే. 1.7 శాతం నుంచి 35.1 శాతానికి.. భారత్ 2022 నుంచి రష్యా నుంచి ముడిచమురును చౌక ధరకే కొంటోంది. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా చమురు ధరపై పరిమితిని నిర్దేశించాయి. దాంతో రష్యా తన చమురును ఇండియాకు విక్రయిస్తోంది. దీనివల్ల ఇండియాకు ఎనలేని మేలు జరుగుతోంది. చమురు బిల్లుల భారం చాలావరకు తగ్గిపోయింది. మన దేశానికి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో తొలి స్థానం రష్యాదే. 2020లో ఇండియా చమురు అవసరాల్లో రష్యా వాటా కేవలం 1.7 శాతం ఉండేది. ప్రస్తుతం అది ఏకంగా 35.1 శాతానికి చేరడం గమనార్హం. 2025లో 245 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు దిగుమతి చేసుకోగా, ఇందులో రష్యా వాటా 88 మిలియన్ మెట్రిక్ టన్నులు. ధరలు 10 శాతం పెరిగే అవకాశం అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా ఆయిల్ను ఇండియాతోపాటు ఇతర దేశాలు కొనడం ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచమంతటా ఉపయోగిస్తున్న ఆయిల్లో 10 శాతం రష్యా నుంచే వస్తోంది. ఈ ఆయిల్ సరఫరాను హఠాత్తుగా నిలిపివేస్తే.. కొరత వల్ల చమురుకు డిమాండ్ పెరిగి ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయి. ఇండియాతోపాటు అన్ని దేశాలపైనా భారం పడుతుంది. ఇండియాకు ఉన్న సానుకూలత ఏమిటంటే.. రష్యా నుంచే కాకుండా మరో 40 దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి సరఫరా ఆగిపోయినా ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు. ధరల భారం మాత్రం తప్పదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రైతుల ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించాలని.. అంతర్జాతీయ కంపెనీలు అనుసరించే దోపిడీ విధానాల నుంచి భారత రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఎస్బీఐ అధ్యయన నివేదిక సూచించింది. అమెరికాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ నెలలో తదుపరి చర్చల కోసం అమెరికా బృందం భారత్ను సందర్శించాల్సి ఉంది. ‘‘బలమైన బహుళజాతి సంస్థలు భారత మార్కెట్లో సదుపాయాలు, వ్యవసాయ విలువ ఆధారిత ఉత్పత్తుల కల్పన, రైతుల సంక్షేమం, వారి శ్రేయస్సు దిశగా పెద్దగా పెట్టుబడులు పెట్టుకుండానే ఇక్కడి మార్కెట్ అవకాశాలను కొల్లగడతాయి. కనుక వీటి బారి నుంచి రైతుల ప్రయోజనాలను తప్పకుండా కాపాడాలి’’అని ఈ నివేదిక సూచించింది.ఒత్తిడి పెంచుతున్న ట్రంప్...బహుళజాతి సాగు సంస్థలు బడా మార్కెట్లలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండడాన్ని ప్రస్తావించింది. మొక్కజొన్న, సోయాబీన్, యాపిల్స్, బాదం, ఇథనాల్పై టారిఫ్లు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తుండడం గమనార్హం. వీటితోపాటు అమెరికా పాడి ఉత్పత్తులకు అవకాశాలు కలి్పంచాలంటూ డిమాండ్ చేస్తోంది. మన రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనతో కేంద్ర సర్కారు అమెరికా డిమాండ్లను అంగీకరించడం లేదు. దీంతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడింది. రైతులు, మత్స్యకారులు, పాడి పెంపకందారుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడబోదని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం తేల్చి చెప్పారు. భారత ఉత్పత్తులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రోజే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం ద్వారా యూఎస్కు స్పష్టమైన సంకేతం పంపారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించుకునే దిశగా భారత్పై ఒత్తిడి పెంచేందుకు టారిఫ్లను అమెరికా అధ్యక్షుడు పెంచేయడం గమనార్హం. ఇంధన బిల్లు పెరగొచ్చు.. ఒకవేళ అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి భారత్ నిలిపివేసినట్టయితే చమురు దిగుమతుల బిల్లు 9 బిలియన్ డాలర్లు మేర పెరుగుతుందని.. 2026–27లోనూ 11.7 బిలియన్ డాలర్లు అధికం కావొచ్చని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.‘‘ అంతర్జాతీయ చమురు సరఫరాలో రష్యా 10 శాతం వాటా కలిగి ఉంది. అన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తే, అదే సమయంలో మిగిలిన దేశాలు ఉత్పత్తిని పెంచకపోతే చమురు ధరలు 10 శాతం పెరిగే అవకాశం ఉంది’’అని ఈ నివేదిక పేర్కొంది. -
ప్రపంచ ఏఐని శాసించేది మనమే.. అన్ని అవకాశాలూ మనకే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తృతి అంతటా పెరిగిపోయింది. అన్ని రంగాలను, పరిశ్రమలను ఈ సరికొత్త సాంకేతికత కమ్మేస్తోంది. దీంతో ఉద్యోగాలు, పని చేసే విధానం పూర్తిగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో 16వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ 2025లో ఫిక్కీ, కేపీఎంజీలు 'నెక్ట్స్ జనరేషన్ స్కిల్స్ ఫర్ ఎ గ్లోబల్ వర్క్ఫోర్స్: ఎనేబుల్ యూత్ అండ్ ఎంపవర్ ఎకానమీ' పేరుతో ఓ కీలక నివేదికను ఆవిష్కరించాయి.కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి విడుదల చేసిన ఈ నివేదిక గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్ గా మారడానికి భారతదేశ రోడ్ మ్యాప్ ను వివరిస్తుంది.ప్రాంప్ట్ ఇంజినీర్లు, స్మార్ట్ గ్రిడ్ అనలిస్టులు వంటి సరికొత్త భవిష్యత్ ఉద్యోగాలతో ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వేగవంతమైన కృత్రిమ మేధ ఆధారిత పరివర్తనను కీలక పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి. అయితే భారతీయ యువతలో కేవలం 26.1% మంది మాత్రమే సరైన వృత్తి శిక్షణను పొందుతున్నారు. ఇది అత్యవసర నైపుణ్య అంతరాలను తెలియజేస్తోంది.రంగాల వారీగా ఏఐ శిక్షణ, ఐటీఐలను ఆధునీకరించడం, టైర్ 2, 3 నగరాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం గ్లోబల్ సర్టిఫికేషన్ అలైన్ మెంట్, నైతిక ఏఐ ప్రమాణాలు, సమ్మిళిత విధానాలు అవసరమని పేర్కొంది.కలిసొచ్చే అంశాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్న యువ జనాభా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఎకోసిస్టమ్ మనం ఏఐ వర్క్ఫోర్స్లో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగడానికి సానుకూల అంశాలుగా కేపీఎంజీకి చెందిన నిపుణులు పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, సాహసోపేతమైన సంస్కరణలతో, భారత్ ఏఐ నిపుణులను బయటి దేశాలకు అందించగలదని అభిప్రాయపడ్డారు. -
అమెరికా సుంకాలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా భారీ సుంకాలపై భారత్ గట్టి కౌంటర్కు సిద్ధమైంది. అగ్రరాజ్యం నుంచి కొత్త ఆయుధాలను, వైమానిక విమానాలను కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారని సమాచారం. డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అందుకు ట్రంప్ భారత్పై విధించిన భారీ సుంకాలే కారణం. భారత్ మిత్రదేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని.. పైగా రష్యాతో చమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ ట్రంప్ గతంలో 25 శాతం టారిఫ్ విధించారు. ఆపై అగష్టు 6వ తేదీన.. తాను చెప్పినా వినలేదంటూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాల్లో భారత్పై విధించిన సుంకమే హయ్యెస్ట్. దీంతో.. ట్రంప్ నిర్ణయాన్ని భారత్ అన్యాయంగా పేర్కొంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ దేశాలకు అనుగుణంగా రష్యాతో వాణిజ్యం చేస్తుండడాన్ని ప్రముఖంగా లేవనెత్తింది కూడా. అయితే భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్ వార్పై తీవ్రంగా స్పందించేందుకు ఇప్పుడు సిద్ధమైంది.రష్యాతో చమురు ఒప్పందాలు ఆగేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో.. రాజీ పడేది లేదని, సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. అమెరికా సుంకాలపై అటు రష్యా, ఇటు అనూహ్యంగా చైనా భారత్కు మద్ధతుగా నిలిచాయి. ఈ క్రమంలో.. భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే..ఈ నెల చివర్లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో ఐదురోజులపాటు పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలోనే అగ్రరాజ్యంతో భారత్ భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. అయితే ఈ పర్యటన రద్దు అయినట్లు రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ-ట్రంప్ సమావేశంలో పలు ఒప్పందాలు ప్రకటించారు. బోయింగ్ P8I విమానాలు, Stryker యుద్ధ వాహనాలు, Javelin యాంటీ-ట్యాంక్ మిసైళ్లు కొనుగోలు అందులో ఉన్నాయి. సుమారు 3.6 బిలియన్ డాలర్ల(రూ.31 వేల కోట్లు) విలువైన ఆ రక్షణ ఒప్పందాలు రాజ్నాథ్ అమెరికా పర్యటనలో కుదరాల్సి ఉంది. అయితే. ట్రంప్ టారిఫ్ వడ్డన నేపథ్యంలో ఈ ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకున్నాయని రక్షణ శాఖకు చెందిన అధికారులిద్దరు వ్యాఖ్యానించారు. రాతపూర్వకంగా అమెరికా నుంచి కొత్త ఆయుధాల కొనుగోళ్ల నిలిపివేతపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని, అయినప్పటికీ ఈ వ్యవహారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ ఒప్పందం రద్దు కాలేదని.. తాత్కాలికంగా నిలిచిపోయిందని.. ఇప్పుడు కొనసాగుతున్న ఒప్పందాలు యధాతథంగా కొనసాగుతాయని.. టారిఫ్ల నిర్ణయం ఓ కొలిక్కి వచ్చాక ద్వైపాక్షిక సంబంధాల దిశపై స్పష్టత వచ్చిన కొత్త ఒప్పందాల అడుగులు ముందుకుపడే అవకాశం కనిపిస్తోందని ఆ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ కథనం ఇచ్చింది. దీనిపై ఇటు భారత రక్షణ మంత్రిత్వ శాఖ.. అటు పెంటగాన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
రాత్రి 8 గంటలకే వీధులన్నీ నిర్మానుష్యం, ఎక్కడో తెలుసా?
ప్రస్తుత బిజీ రోజుల్లో ఏ ఊరి లోనైనా సరే వీధులన్నీ నిర్మానుష్యం అవ్వాలి అంటే కరోనా అన్నా రావాలి కర్ఫ్యూ అన్నా పెట్టాలి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే అర్ధరాత్రుళ్లు కూడా పట్టపగల్ని తలపించేంత రద్దీ కనిపిస్తుంది. రాత్రి మొత్తం చేసే ఉద్యోగాలు పెరిగిపోవడంతో నైట్ లైఫ్ కూడా అందరికీ అలవాటై పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో... కొన్ని గ్రామాలు, పట్టణాలలో మాత్రం రాత్రి 8గంటల నుంచే వీథులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆ తర్వాత ఉదయం సూర్యోదయం అయే దాకా రోడ్ల మీద జనసంచారం కోసం భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. అలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయా అంటే ఉన్నాయి మరి. అది కూడా మన దేశంలోనే ఉన్నాయి.తెల్లవారుఝామునే నిద్ర లేవడం, సూర్యుడి వెలుతురులోనే పనులన్నీ చక్కబెట్టుకోవడం, సూర్యాస్తమయం తోనే ఇల్లు చేరడం, చీకటి పడకముందే రాత్రి భోజనం పూర్తి చేసి నిద్రపోవడం...ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి వింటే...అబ్బో అదెప్పుడో మన తాత ముత్తాతల కాలం నాటిదిలే అనుకుంటాం కానీ.. ఇప్పటికీ చిత్కుల్, కల్ప, తీర్థన్ స్పితి వంటి గ్రామాలలో అదే జీవనశైలి కనిపిస్తోంది. ఈ గ్రామాల పేర్లు బహుశా మనలో చాలామందికి తెలియక పోవచ్చు కానీ ఆయా గ్రామాల్లో జన జీవితం మన తాత ముత్తాతల కాలం నాటి జీవనశైలినే తలపిస్తుంది. ఇలాంటి గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి కాబట్టే... హిమాచల్ ప్రదేశ్ను స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అక్కడి ప్రజలు అనుసరించే ప్రశాంతమైన జీవనశైలి తత్ఫలితంగా ఆస్వాదించే నాణ్యమైన నిద్ర నుంచే ఆ రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది. ఈ రాష్ట్రం దాని సహజ సౌందర్యం, స్వచ్ఛమైన పర్వత గాలితో పాటు నిశ్చింతగా నడిచే గ్రామ జీవితానికి కూడా ప్రసిద్ధి చెందింది. రద్దీగా ఉండే నగరాల మాదిరిగా కాకుండా, ఇక్కడి జీవితం నిశ్శబ్దంగా విశ్రాంతిగా ఉంటుంది.హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు చాలా సరళమైన దినచర్యను అనుసరిస్తారు. ఎక్కువ మంది పెందరాళే పడుకుని సూర్యోదయంతో మేల్కొంటారు. పగటిపూట పని చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత, దుకాణాలు మూసి వేస్తారు. వీధులన్నీ బోసిపోయి నిశ్శబ్దంగా మారుతాయి, కుటుంబాలు ఇంటి లోపలే ఉంటాయి. చీకటి పడకముందే భోజనం చేస్తారు రాత్రి 8 నుంచి 9గంటల మధ్యలోనే నిద్రపోయే వీరి అలవాటు ‘స్లీపింగ్ స్టేట్‘ గా కిరీటాన్ని అందించింది.హిమాచల్ ప్రదేశ్లో, ప్రజలు ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. పర్వత వాతావరణం, పుష్కలమైన సూర్యరశ్మి ప్రశాంతమైన వాతావరణం ప్రజలు విశ్రాంతిగా రోజువారీ దినచర్యను నిర్వహించుకునేలా సహాయ పడతాయి. కొండలలో నదులు గాలుల ప్రవాహంలాగే వారి జీవితాలు నెమ్మదిగా సున్నితంగా కదులుతుంటాయి. పర్యాటకులు తరచుగా బిజీగా ఉన్న నగర జీవితం నుండి విరామం తీసుకొని ప్రశాంతమైన గ్రామ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఈ ప్రదేశాలను సందర్శిస్తారు. అయితే ‘‘స్లీపింగ్ స్టేట్’’ అంటే ఆ ప్రదేశం అభివృద్ధిలో మందగమనంతో ఉందని కొందరు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ పదం ప్రశాంతమైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది తప్ప సోమరితనం లేదా అభివృద్ధి లేకపోవడం కాదు. భారతదేశంలో. హిమాచల్ ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆపిల్లను పండిస్తుంది సిమ్లా కిన్నౌర్ వంటి పట్టణాలు వాటి ఆపిల్ తోటలకు ప్రసిద్ధి చెందాయి. ఈ రాష్ట్రం పర్యావరణ హితంగా పేరుపడింది. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా పొగ రహిత రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఇదే. పర్యావరణాన్ని కాపాడటానికి, ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక్కడి ధర్మశాల దలైలామా నివాసం. ఈ పట్టణం ప్రశాంతమైన ప్రదేశం భారతదేశంలో టిబెటన్ సంస్కృతి, బౌద్ధమతానికి ముఖ్యమైన కేంద్రం. దీనితో పాటే మనాలి నుంచి స్పితి వరకు పర్యాటకులు నగర జీవితం నుంచి విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి హిమాచల్ను ఎంచుకోవడానికి కారణాల్లో...ప్రకృతి అందాలతో పాటు నాణ్యమైన నిద్ర కూడా ఓ కారణం కావచ్చు. -
భారత్-పాక్ సీజ్ఫైర్.. ‘ట్రంప్ నేరుగా జోక్యం చేసుకున్నారు’
తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరైన సమయంలో కలుగజేసుకున్నారని.. లేకుంటే భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండేదని అమెరికా మరోసారి ప్రకటించుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ట్రంప్ నేరుగా జోక్యం చేసుకున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో తాజాగా ప్రకటించారు.‘‘ట్రంప్ శాంతికి కట్టుబడి ఉన్నారు. అందుకే శాంతి అధ్యక్షుడిగా ఆయనకు గుర్తింపు దక్కింది. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది ఆయనే. ఆ సమయంలో ఆయనే నేరుగా జోక్యం చేసుకున్నారు. తద్వారా ఇరు దేశాల ఉద్రిక్తతలను చల్లార్చారు. లేకుంటే ఆ దక్షిణాసియా దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉండేదేమో.. ఇది వాస్తవం’’ అని రుబియో గురువారం ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరికొన్ని దేశాల సంక్షోభాలకు ట్రంప్ తెర దించారని.. అది అమెరికన్లు ఎంతో గర్వించదగ్గ విషయమని రుబియో అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై అమెరికా దృష్టిసారించిందని అన్నారాయన. భారత్ ఖండనపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత్. అయితే ఆ సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపై ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఇరు దేశాల యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ఇప్పటికి పదుల సంఖ్యలో ప్రకటించుకున్నారు. అయితే భారత్ మాత్రం ఆ దౌత్య ప్రకటనను తోసిపుచ్చుతూ వస్తోంది.ఇరు దేశాల సైన్యాల మధ్య చర్చలు జరిగాయని.. పాక్ కోరినందునే తాము కాల్పుల విరమణకు అంగీకరించామని, ఇందులో అమెరికా సహా మరేయితర దేశపు జోక్యంగానీ.. ఒత్తిడిగానీ చేసుకోలేదని భారత ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే ట్రంప్ జోక్యంపై విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. ఈ తరుణంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్లు ‘‘ఎవరీ జోక్యం లేదు’’ అని పార్లమెంట్లోనూ స్పష్టమైన ప్రకటనలు చేశారు. అయినప్పటికీ అమెరికా మాత్రం ట్రంప్కు క్రెడిట్ ఇచ్చుకోవడం మానడం లేదు. -
మరో బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
-
భారత్కు మరో షాకిచ్చిన ట్రంప్.. మోదీ కీలక భేటీ!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ను టార్గెట్ చేసి అదనపు సుంకాలు విధిస్తున్నారు. ఇక, తాజాగా భారత్ సుంకాలపై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో భారత్తో చర్చలకు తాను సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరో చర్చకు దారి తీశాయి.వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధించడంతో ట్రంప్ విధించిన భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ చూస్తోంది. అయితే, అందుకు అధ్యక్షుడు ట్రంప్ మాత్రం సిద్ధంగా లేనట్లు స్పష్టం చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. టారిఫ్ల వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవు అని తేల్చి చెప్పారు. దీంతో, భారత్కు గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. ఇదిలా ఉండగా.. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగితే భారత్పై మరిన్ని ఆంక్షలు ఉంటాయని ట్రంప్ మళ్లీ హెచ్చరించడం గమనార్హం.#WATCH | Responding to ANI's question, 'Just to follow up India's tariff, do you expect increased trade negotiations since you have announced the 50% tariffs?', US President Donald Trump says, "No, not until we get it resolved."(Source: US Network Pool via Reuters) pic.twitter.com/exAQCiKSJd— ANI (@ANI) August 7, 2025ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీకి సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్లపై భారత్ ఎలా స్పందించాలనే విషయంపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం తర్వాత సుంకాలపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.Prime Minister Narendra Modi will chair a high-level Cabinet meeting at 1 pm on Friday to review the impact of the recent tariff hike imposed by the United States on Indian exports.— indian DOTS (@AMEERALIHU1807) August 8, 2025అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన..మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో ప్రకటన చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. టారిఫ్ల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంతో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామన్నారు. వాణిజ్యం, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో ట్రంప్ స్పష్టంగా ఉన్నారన్నారు. దానికి ప్రతిస్పందనగానే ట్రంప్ నేరుగా చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. -
‘ఎట్టిపరిస్థితుల్లోనూ తలొంచద్దు’.. ట్రంప్ సుంకాలపై భారత్కు చైనా మద్దతు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కక్షగట్టిన రీతిలో భారతదేశంపై అత్యధికంగా 50 శాతం సుంకం విధించారు. అలాగే ఇతర దేశాలకూ సుంకాలు ప్రకటించారు. అయితే భారత్పై అత్యధిక సుంకాలు విధించడంపై చైనా మండిపడుతూ, భారత్కు మద్దతు ప్రకటించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రంప్కు తలవంచవద్దంటూ భారత్కు చైనా సలహా ఇచ్చింది.భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని దుయ్యబట్టారు. ట్రంప్ను ‘బెదిరింపులకు గురి చేస్తున్న దొంగ’గా అభివర్ణించారు. ఆయన తన ‘ఎక్స్’ పోస్టులో ‘ఒక దొంగకు ఒక అంగుళం అవకాశం ఇస్తే.. అతను ఒక మైలు దూరం వరకూ వెళ్తాడు’ అని కామెంట్ చేశారు. చైనా రాయబారి తన పోస్టులో..‘ఇతర దేశాలను అణచివేయడానికి సుంకాన్ని ఆయుధంగా ఉపయోగించడం ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమే అవుతుంది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను బలహీనపరుస్తుంది. ఇది ప్రజాదరణ లేనిది, అస్థిరమైనది’ అని పేర్కొన్నారు. కాగా ట్రంప్ బృందంతో వ్యాపార ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశాలలో ఒకటిగా ఉండాలని భారతదేశం ఆశించింది. అయితే రష్యన్ చమురు కొనుగోళ్ల కారణంగా అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు ఐదు రౌండ్ల తర్వాత కూడా ముందుకు కదలలేదు. Give the bully an inch, he will take a mile. pic.twitter.com/IMdIM9u1nd— Xu Feihong (@China_Amb_India) August 7, 2025వైట్ హౌస్లో చైనాపై సుంకాలు విధించే ప్రణాళిక గురించి మీడియా ట్రంప్ను అడిగినప్పుడు ఆయన తాను ఇప్పుడే ఏమీ చెప్పలేదనని, భారతదేశానికి ఏదైతే చేశామో.. బహుశా మరికొన్ని దేశాలతో కూడా అలాగే చేస్తామని, వాటిలో చైనా ఒకటి కావచని’ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు శుక్రవారం నాటికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోతే, తాను ద్వితీయ సుంకాలను విధిస్తానని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనా- అమెరికాల మధ్య సుంకాల యుద్ధం ప్రారంభమైంది. అమెరికా తన సుంకాలను 145 శాతానికి పెంచగా, చైనా తన సుంకాలను 125 శాతానికి పరిమితం చేసింది. చైనాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ఈ ఏడాది చివర్లో చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ను కలవబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. -
ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 47% అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 12.4 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన 8.43 బిలియన్ డాలర్లతో పోలిస్తే 47 శాతం పెరిగాయి. ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొబైల్ ఫోన్స్ ఎగుమతులు 55 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 55 శాతం వృద్ధితో 7.6 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మొబైల్యేతర ఎల్రక్టానిక్స్ సెగ్మెంట్ 3.53 బిలియన్ డాలర్ల నుంచి 37 శాతం పెరిగి 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ విభాగంలో సోలార్ మాడ్యూల్స్, స్విచి్చంగ్.. రూటింగ్ పరికరాలు, చార్జర్ అడాప్టర్లు, ఇతర విడిభాగాలు మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు ఐటీ హార్డ్వేర్, వేరబుల్స్, హియరబుల్స్, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ చెప్పారు. విడిభాగాలు, సబ్–అసెంబ్లీస్ నుంచి తుది ఉత్పత్తుల వరకు వేల్యూ చెయిన్వ్యాప్తంగా అంతర్జాతీయంగా పోటీపడగలిగేలా భారతీయ బ్రాండ్లు మరింతగా ఎదగాల్సి ఉంటుందని మహీంద్రూ చెప్పారు. దశాబ్దకాలంలో దేశీయంగా మొత్తం ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి 31 బిలియన్ డాలర్ల నుంచి 133 బిలియన్ డాలర్లకు ఎగిసింది. 50 బిలియన్ డాలర్ల అంచనాలు.. క్యూ1 తరహాలోనే జోరు కొనసాగితే 2026 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 46–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఐసీఈఏ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇవి 29.1 బిలియన్ డాలర్ల నుంచి 38.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. -
ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడి ఫోన్
న్యూఢిల్లీ: ట్రంప్ దురహంకారాగ్రహానికి గురై 50 శాతం టారిఫ్ భారాన్ని మోస్తున్న భారత్, బ్రెజిల్ దేశాల అగ్రనేతలు గురువారం ఫోన్లో సంభాíÙంచుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డసిల్లా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్చేసి పలుఅంశాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చిన గురువారం రోజే ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం గమనార్హం. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, సాంస్కృతిక సంబంధాల అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారని ప్రధాని కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ మీదనే ప్రధానంగా ఇరునేతలు చర్చించుకున్నారని తెలుస్తోంది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకు వచ్చాయి. -
AI తో హోమ్వర్క్ సిద్ధం! పరీక్షకు సన్నద్ధం!!
సాక్షి, స్పెషల్ డెస్క్: హోమ్వర్క్లో సాయం చేసే ఓ స్నేహితుడు.. పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో మార్గదర్శనం చేసే టీచర్.. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ గురించే. ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీపీటీ స్టడీ మోడ్ను, గూగుల్ జెమినై గైడెడ్ లెర్నింగ్ టూల్ను ప్రారంభించి చాట్బాట్ను వ్యక్తిగత ట్యూటర్గా మార్చేశాయి. ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు, అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు, ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ వంటి భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వి ద్యార్థులకు కృత్రిమ మేధ ఆధారిత చాట్బాట్స్ మంచి అధ్యయన సహాయకులుగా అవతరిస్తున్నాయి. దీంతో భారత్లోని ఎడ్టెక్ సంస్థలు, సంప్రదాయ కోచింగ్ కేంద్రాలు ఏఐ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కోనున్నాయని నిపుణులుఅంటున్నారు.గైడెడ్ లెర్నింగ్ ఇలా..అర్థవంతమైన అభ్యాసానికి కేవలం ప్రాంప్టింగ్ను (ఆదేశాలు) మెరుగుపరచడం సరిపోదని గూగుల్ అంటోంది. విద్యార్థుల ముందున్న సందేహాలు, సమస్యలను దశలవారీగా గైడెడ్ లెర్నింగ్ విభజిస్తుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా వివరణలను మారుస్తుంది. చిత్రాలు, రేఖాచిత్రాలు, వీడియోలు, ఇంటరాక్టివ్ క్విజ్లను ఉపయోగించి స్పందిస్తుంది. సమాధానం ఇవ్వడం కంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి, పరీక్షించుకోవడానికి యూజర్లకు సహాయపడుతుంది. చురుకైన, నిర్మాణాత్మక ప్రక్రియ అనే ప్రధాన సూత్రంపై ఆధారపడి బోధనలో భాగస్వామిగా ఉండేలా విద్యావేత్తలతో కలిసి గైడెడ్ లెర్నింగ్ను రూపొందించినట్టు గూగుల్ తెలిపింది.» ‘హోమ్వర్క్ హెల్ప్’ ద్వారా విద్యార్థుల హోమ్వర్క్లను.. స్టెప్ బై స్టెప్ మార్గదర్శనం ద్వారా చేసి పెడుతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా దానికి సంబంధించిన చిత్రాలు లేదా డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడమే.» అలాగే పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు కూడా ఎలా చదవాలా అనిఆలోచించాల్సిన పనిలేదు. మన దగ్గర ఉన్న నోట్స్, ఇతర డాక్యుమెంట్లుఅప్లోడ్ చేస్తే చాలు, వాటిని ఒక స్టడీ గైడ్గా, ఒక ప్రాక్టీస్ టెస్ట్గా,పాడ్కాస్ట్గా కూడా చేసి మన ముందు పెడుతుంది.» విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే ప్రశ్నలతో విద్యార్థులకుమార్గనిర్దేశం చేయడం ద్వారా వారి సొంత ఆలోచనను అభివృద్ధి చేసుకోవడానికి, మెదడుకు పదును పెట్టడానికి ప్రోత్సహిస్తుందని గూగుల్ వివరించింది.» ఈ విధానాన్ని చేరువ చేయడానికి విద్యావేత్తలు నేరుగా గూగుల్క్లాస్రూమ్లో పోస్ట్ చేయగల, విద్యార్థులతో పంచుకోగల ప్రత్యేక లింక్ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.ఇంటర్నెట్ వచ్చాక సంప్రదాయ గైడ్స్కు కాలం చెల్లింది. సాంకేతికతను ఉపయోగించి ఎడ్టెక్ కంపెనీలు విద్యావ్యవస్థ స్వరూపాన్నే మార్చేశాయి. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం, లోతుగా అధ్యయనం చేయడానికి అభ్యాస విధానంలో కొత్తదనం తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏఐ రాకతో తరగతి గదికి మించి నేర్చుకోవడంలో గూగుల్ గైడెడ్ లెర్నింగ్, ఓపెన్ ఏఐ స్టడీ మోడ్ కొత్త రకం అనుభవం అందిస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.‘విద్యార్థులకు లాభదాయకమే’నిజానికి ఏఐ చాట్బాట్లు విద్యార్థులకు నేరుగా ప్రత్యక్ష సమాధానాలను ఇచ్చేస్తాయని.. దానివల్ల వారి మెదడుకు పని ఉండదని, దాంతో అభ్యాస ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని చాలామంది విద్యావేత్తలు చెబుతున్నారు. కానీ, అది నిజం కాదంటున్నాయి గూగుల్, ఓపెన్ ఏఐ సంస్థలు. ఈ సంస్థలు స్టడీ మోడ్, గైడెడ్ లెర్నింగ్ పేరుతో వ్యక్తిగత ట్యూటర్లను ప్రవేశపెట్టాయి. ఈ సరికొత్త సాధనాలు చాట్బాట్లను సాధారణ సమాధాన వేదికలుగా కాకుండా.. అభ్యాస సాధనాలుగా మలచడం ద్వారా విద్యా విధానం కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనపడుతోంది.ఇదీ ‘స్టడీ మోడ్’దీన్ని కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని ఓపెన్ ఏఐ చెబుతోంది. ఇది కూడా హోమ్వర్క్, పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో విద్యార్థులకు సాయం చేస్తుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు స్టడీ మోడ్లో చాట్ జీపీటీ ప్రత్యక్ష సమాధానాలను అందించదు. విద్యార్థులు వారి లక్ష్యం, జ్ఞాన స్థాయిని బాట్కు వివరించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమంత తాముగా, చురుకుగా నేర్చుకునేలా, పాఠ్యాంశాలపట్ల లోతైన అవగాహన కలిగేలా హింట్స్, క్విజ్ ద్వారా ప్రోత్సహించడం ఇందులోని ప్రత్యేకత. ఏదైనా టాపిక్ కొత్తదైతే లేదా ఇప్పటికే మెటీరియల్పై పట్టు ఉండి తాజా సమాచారం కోరితే.. చాట్బాట్ వ్యక్తిగతీకరించిన పాఠాన్ని అందిస్తుంది. – విద్యార్థుల కోసం స్టడీ మోడ్ సిద్ధం చేయడంలో భాగంగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీ) ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు, పాఠ్యాంశాలను కంపెనీ ఉపయోగించింది. » ఐఐటీల వంటి ముఖ్య పరీక్షలతో పాటు భారత్లో జరుగుతున్న ఇతర పరీక్షల్లో కూడా పనితీరునుఅంచనా వేయడానికి స్టడీ మోడ్ పరీక్షించినట్టు ఓపెన్ ఏఐ తెలిపింది. » వాయిస్, ఇమేజ్, టెక్స్›్టను సపోర్ట్ చేస్తూ 11 భారతీయ భాషల్లో స్టడీ మోడ్ అందుబాటులో ఉంది.కొన్ని సందేహాలుతమ ఏఐ సేవలను పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు మరింత అందుబాటులో, చవకైన మార్గాల ద్వారా అందించడానికి కృషి చేస్తున్నామని గూగుల్, ఓపెన్ ఏఐ చెబుతున్నాయి. అయితే వీటిపై విద్యా, వైద్య రంగ నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.» విద్యార్థులు చాట్బాట్లపై ఎక్కువగా ఆధారపడినప్పుడు వారి విద్యా పరిశోధన నైపుణ్యాలు, పఠన గ్రహణశక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. » ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ను గంటల తరబడి చూడటం.. కంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అలాగే చూసే విధానం వల్ల మెడ, వెన్ను వంటి వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు.