breaking news
India
-
భారత్ కు మద్దతుగా పాక్ నేత కీలక వ్యాఖ్యలు
-
#INDvsSL : విశాఖలో విశ్వవిజేతల దండయాత్ర (ఫొటోలు)
-
పాక్ నేత తిరుగుబాటు.. భారత్కు మద్దతు
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు చెందిన నేత ఒకరు తమ దేశం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ జరిపిన సైనిక దాడులను జమియత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ (జేయూఐ-ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తప్పుబట్టారు. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడం సరైనదని పాక్ భావించినప్పుడు.. భారతదేశం తన పొరుగుదేశమైన పాకిస్తాన్పై దాడులు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రస్తావిస్తూ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే 7న భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోని బహవల్పూర్, మురిడ్కే, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న 26 మంది భారతీయులను లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడులను పాక్ నేత బహిరంగంగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Maulana Fazlur Rehman to Pakistan’s military regime:“If you justify attacking Afghanistan by claiming you are targeting your enemy there, then why do you object when India targets its enemy in Bahawalpur and Murid (inside Pakistan)?” pic.twitter.com/T91sdps611— Afghanistan Times (@TimesAFg1) December 23, 2025కరాచీలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన రెహ్మాన్.. పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాన్ని ఎండగట్టారు. ‘భారతదేశం.. పాక్లోని బహవల్పూర్, మురిడ్కేలలో ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాలపై దాడి చేసినప్పుడు పాక్ ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తింది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్పై అలాంటి ఆరోపణలు చేస్తోంది’ అని ఆయన నిలదీశారు. పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ సారధ్యంలో జరుగుతున్న ఈ సరిహద్దు దాడులు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై పాకిస్తాన్ జరిపిన దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని భారత్ సమర్థిస్తుందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. 2021లో తాలిబాన్ల పాలన వచ్చినప్పటి నుండి పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పాక్ నేతలు తమ దేశ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇది పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడేసే పరిణామంగా మారింది.ఇది కూడా చదవండి: భారత్ ‘మెగా రోడ్డు’తో డ్రాగన్కు చుక్కలే.. -
తేజస్.. మరింత సేఫ్
దేశీయతయారీ తేలికపాటి యుద్ధవిమానం తేజస్ భద్రతను మరింత పెంచే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అత్యాధునిక హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ను తేజస్ వెనుకభాగంతో అనుసంధానించింది. అత్యవసర సందర్భాల్లో అత్యంత వేగంగా యుద్ధవిమానవాహక నౌక లేదా రన్వేపై దిగాల్సిన సందర్భాల్లో ఎలాంటి ప్రమాదం జరక్కుండా పైలట్కు, విమానానికి సాయపడేలా హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ను డిజైన్చేశారు. పూర్తి దేశీయంగా గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ అధునాతన పారాచూట్కు తుదిరూపునిచ్చింది.తేజస్ వంటి యుద్ధవిమానాల రక్షణను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని దీనిని తయారుచేశారు. ఈ పారాచూట్ బరువు సైతం చాలా తక్కువ. దీంతో పేలోడ్(మందుగుండు)ను మోసుకెళ్లే తేజస్కు కొత్తగా అదనపు బరువు లాంటి సమస్యలేవీ ఉండబోవు. దీంతో అత్యంత వేగంగా గాల్లో దూసుకెళ్లేటప్పుడు భార సంబంధ ఇబ్బందులు తలెత్తబోవు. దీంతో అత్యవసర సందర్భాల్లో అత్యల్ప పొడవైన రన్వేలపై ల్యాండ్ అయ్యాక తక్కువ దూరంలో ఆగిపోయేలా ఈ పారాచూట్ ఎంతగానో సాయపడుతుంది. ఎలా ఉపయోగకరం? సాధారణ పౌరవిమానాలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ల్యాండ్ అయినప్పుడు రన్వేకు ఆ కొన వద్ద ల్యాండ్ అయి రెండు, మూడు కిలోమీటర్ల దూరం దాకా రన్వేపై పరుగులు తీస్తాయి. అత్యవసర సందర్భాల్లో తేజస్ వంటి యుద్ధవిమానాలకు అంత పొడవాటి రన్వే ఉండే విమానాశ్రయాలు అందుబాటులో ఉండవు. తక్కువ పొడవున్న రన్వేలపై ల్యాండ్ అయ్యాక వేగంతో అలాగే ముందుకు దూసుకెళ్లకుండా ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ నిలువరిస్తుంది. దీంతో బ్రేకింగ్ వ్యవస్థలపై పనిభారం భారీగా తగ్గుతుంది. వెడల్పాటి ప్లస్ గుర్తు ఆకృతిలో ఉండే భారీ వస్త్రపు చివరలను కలుపుతూ గొడుగు ఆకృతిలో దీనిని తయారుచేస్తారు.ల్యాండింగ్ పూర్తయ్యాక రన్వే మీద విమానం అటూఇటూ ఊగకుండా స్థిరంగా ముందుకు కదిలేలా ఈ పారాచూట్ సాయపడుతుంది. రన్వే మీద విమానం ముందుకు దూసుకెళ్లేటప్పుడు ఎదురుగా వచ్చే అత్యధిక గాలి, ఒత్తిడిని తట్టుకుని ఇది విమానాన్ని వేగంగా ఆపేయగలదు. పారాచూట్ వెడల్పు కేవలం 5.75 మీటర్లు. విస్తీర్ణం 17 చదరపు మీటర్లు. దీని బరువు కేవలం 10 కేజీలు. యుద్ధవిమానం గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ హఠాత్తుగా రన్వేపై ల్యాండ్ అయినా కూడా సమయానుగుణంగా విచ్చుకుని త్వరగా విమానం రన్వే మీద ఆగేలా చేస్తుంది. హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ అంటే?సాధారణ సందర్భాలతోపాటు అత్యవసర సమయాల్లోనూ విమానాన్ని నిర్దేశిత దూరం తర్వాత రన్వే మీద ఆపగలిగే సామర్థ్యమున్న పారాచూట్ను హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్గా పిలుస్తారు. తెగిపోని, అత్యంత కఠినమైన నైలాన్, కెవ్లార్ వంటి కృత్రిమ రసాయన దారాలతో ఈ పారాచూట్ను తయారుచేస్తారు. విమానం రకం, బరువు, ల్యాండింగ్ గరిష్ట వేగాలకు తగ్గ బరువు, సైజు, డిజైన్తో పారాచూట్ను తయారుచేస్తారు. -
శ్రీలంకకు రూ. 4 వేల కోట్ల ఆర్థిక సాయం
కొలంబో: దిత్వా తుపానుతో కలావికలమైన శ్రీలంకను పునరావాసం, పునరుజ్జీవన కార్యక్రమాల కోసం రూ.4,000 కోట్ల ఆర్థికసాయంతో ఆదుకునేందుకు భారత్ ముందుకొచి్చంది. పొరుగున ఉన్న మిత్రదేశం శ్రీలంకకు భారత్సదా అండగా నిలబడుతుందని ఈ 45 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించిన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ తరఫున ప్రత్యేక రాయబారిగా శ్రీలంకకు విచ్చేసిన మంత్రి జైశంకర్ మంగళవారం శ్రీలంక అధ్యక్షుడు అరుణకుమార దిస్సనాయకె, ఆ దేశ మహిళా ప్రధానమంత్రి హరిణి అమరసూర్యలతో విడివిడిగా భేటీ అయ్యారు.‘‘శ్రీలంక పునర్నిర్మాణానికి 45 కోట్ల డాలర్ల ఆర్థికసాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. దిత్వా తుపాను నుంచి తేరుకుని పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్న శ్రీలంకకు ఆపన్న హస్తంఅందించేందుకు మేమున్నామని భారత్ తరఫున ప్రధాని మో దీ రాసిన లేఖను అధ్యక్షుడు అరుణ కుమార దిస్స నాయకేకు అందించా’’అని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిథ హెరాత్తో కలిసి సంయుక్త మీడియా స మావేశంలో జైశంకర్ చెప్పారు. 45 కోట్ల డాలర్లలో 35 కోట్ల డాలర్లను రుణాలరూపంలో, 10 కోట్ల డా లర్లను గ్రాంట్ల రూపంలో భారత్ అందివ్వనుంది. పునర్నిర్మాణం కోసం నిధుల వినియోగం తుపాను కారణంగా దారుణంగా దెబ్బతిన్న మౌలికవసతుల పునరుద్ధరణకు ప్రధానంగా నిధులను ఖర్చుచేయనున్నారు. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన రోడ్ల పునర్నిర్మాణం, రైల్వే ట్రాక్లు, వంతెనల మరమ్మతులు, కుప్పకూలిన ఇళ్లను నిర్మించడం, ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు తోడ్పాటునందించడం, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలకు తగు ఆర్థికసాయం అందించడం వంటి కీలక పనులను నిధులను సది్వనియోగం చేయనున్నారు. ‘‘నిధుల సత్వర విడుదలతోపాటు ఆయా పనుల కోసం సమన్వయంతో పనిచేసేలా ‘ప్రభావవంత సహకార వ్యవస్థ’ఏర్పాటుకు కృషిచేస్తున్నాం’’అని జైశంకర్ చెప్పారు.అంతకుముందు స్టీల్ ప్యానెళ్లతో నిర్మించిన 120 అడుగుల పొడవైన బేలీ రకం వంతెనను తుపాను ప్రభావిత ఉత్తర ప్రావిన్స్లోని కొలినోచ్ఛి జిల్లాలో జైశంకర్ ప్రారంభించారు. 110 టన్నుల బరువైన ఈ వంతెనను విడిభాగాలుగా భారత్ నుంచి విమానంలో తీసుకొచ్చి శ్రీలంకలో బిగించారు. ఆపరేషన్ సాగర్ బంధు కార్యక్రమంలో భాగంగా బేటీ వంతెనను శ్రీలంకకు భారత్ సరఫరాచేసింది. ఆపరేషన్ సాగర్ బంధు సహాయక మిషన్లో భాగంగా భారత్ ఇప్పటికే పెద్ద ఎత్తున టెంట్లు, టార్పాలిన్లు, శుభ్రతా కిట్లు, నిత్యావసర వస్తువులు, నీటి శుద్ధి యంత్రాలను అందించింది. 14.5 టన్నుల ఔషధాలు, వైద్య ఉపకరణాలనూ ద్వీపదేశానికి సరఫరాచేసింది. -
న్యూజిలాండ్తో ఎఫ్టీఏ
ఇది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్టీఏ) యుగం. మన దేశం ఈ ఏడాది ఇంతవరకూ బ్రిటన్, ఒమన్ దేశాలతో ఎఫ్టీఏలపై సంతకం చేసింది. తాజాగా న్యూజిలాండ్తో ఎఫ్టీఏపై అవగాహన కుదిరింది. మరో మూడు నెలల్లో సంతకాలు కాబోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వాణిజ్య, వాణిజ్యేతర కారణాలతో మన దేశంపై ఎడాపెడా సుంకాలు విధించి తన షరతులకు తలొగ్గటమో, ఆర్థికంగా నష్టపోవటమో తేల్చుకోమని సవాలు విసురుతున్నారు. ఆ నష్టాలను వీలైనంత తగ్గించుకోవటానికి ప్రత్యామ్నాయాలు వెదుక్కునే క్రమంలోనే మన దేశం వివిధ దేశాలతో ఎఫ్టీఏలు కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. సరుకులు, సేవల్లో ఇరు దేశాల మధ్యా 130 కోట్ల డాలర్ల విలువైన వర్తమాన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాగల అయిదేళ్లలో 500 కోట్ల డాలర్లకు తీసుకెళ్లటం, వచ్చే పదిహేనేళ్లలో భిన్న రంగాల్లో న్యూజిలాండ్ 2,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడం భారత్–న్యూజిలాండ్ ఎఫ్టీఏ సారాంశం. దీని ప్రకారం మన సరుకులన్నిటిపైనా దాదాపు సుంకాలు విధించకుండా ఉండేందుకు న్యూజిలాండ్ అంగీ కరిస్తే, అక్కడినుంచి యాపిల్స్, కివీ పండ్లు, చెర్రీలు, నూలు ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు మన దేశం సుముఖత వ్యక్తం చేసింది. కార్మికుల అవసరం ఎక్కువున్న జౌళి, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్స్, ఇంజినీరింగ్, మెరైన్, హస్త కళలు వగైరా ఉత్పత్తులకు న్యూజిలాండ్ తక్కువ సుంకాలు విధిస్తుంది. కొన్నింటి విషయంలో అసలు సుంకాలే ఉండవు. అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) పట్టభద్రులకు న్యూజిలాండ్లో ఉద్యోగావకాశాలుంటాయి. అక్కడి వర్సిటీల్లో చదువుకొనేందుకూ, పరిశోధనలు సాగించేందుకూ మన విద్యార్థులకు వీలుంటుంది. మరో విశేషమేమంటే మన తరఫున ఈ ఒప్పందం సాకారానికి కృషి చేసింది మొత్తంగా మహిళా అధికారుల బృందమే.ఎఫ్టీఏలపై ఆరోపణలూ, విమర్శలూ కూడా లేకపోలేదు. ఆహారం, ఆరోగ్యం, కార్మిక వర్గం, పర్యావరణం తదితర అంశాలపై ఇవి తీవ్రంగా ప్రభావం చూపే అవకాశమున్నా అధిక శాతం ఎఫ్టీఏల చుట్టూ గోప్యత అలుముకుని ఉంటుందనీ, ఆచరణ మొదలయ్యాకే వాటి అసలు పర్యవసానాలేమిటో ప్రజలకు తెలుస్తుందనీ సామాజిక కార్యకర్తల ఆరోపణ. తొలి ఆధునిక సమగ్ర ఎఫ్టీఏ ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్తా) 1994లో కుదరగా, మన దేశం తొలిసారి 1999లో శ్రీలంకతో ఎఫ్టీఏ కుదుర్చుకుంది. అటుతర్వాత జపాన్, మలేసియా, దక్షిణ కొరియా, సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల కూటమి ఆసియాన్ వగైరాలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. వర్తమాన యుగంలో ఏ దేశమూ ఒంటరిగా మనుగడ సాగించలేదు. ఆత్మ నిర్భర భారత్, మేకిన్ ఇండియా వంటివి స్వావలంబనకు కొంతమేర తోడ్పడవచ్చుగానీ, వాటినే సర్వస్వంగా భావించటం సాధ్యం కాదు. చిత్రమేమంటే భారత్–న్యూజిలాండ్ ఎఫ్టీఏపై సామాజిక రంగాల కార్యకర్తలకన్నా ముందు న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ చిర్రుబుర్రులాడుతున్నారు. న్యూజిలాండ్ డెయిరీ ఉత్పత్తులకు మన మార్కెట్ను బార్లా తెరవకపోవటం ఆయనగారికున్న అభ్యంతరం. పార్లమెంటులో ధ్రువీకరణకొచ్చినప్పుడు ఒప్పందాన్ని ప్రతిఘటిస్తామని కూడా ప్రకటించారు. న్యూజిలాండ్ అధికార కూటమి ప్రభుత్వంలో ఆయన పార్టీ భాగస్వామి. ఈ ఏడాది ఇంతవరకూ 2,400 కోట్ల డాలర్ల డెయిరీ ఉత్పత్తులు పాలు, వెన్న, జున్ను వగైరాలు తాము ఎగుమతి చేయగా, ఒక్క భారత్ మాత్రమే అందుకు సమ్మతించటం లేదన్నది ఆయన అభ్యంతరం. అయితే కుదరబోయే ఈ ఒప్పందం ఒక వెసులుబాటునిస్తోంది. ముడి పదార్థాలు తీసుకొచ్చి ఉత్పత్తులు చేసి వంద శాతం ఎగుమతులు చేసుకునేందుకు న్యూజిలాండ్కు అవకాశం ఉంటుంది. డెయిరీ, సాగు ఉత్పత్తులకు అనుమతులిస్తే మన సాగు, పాడి రంగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలోనే అమెరికా ప్రధానంగా పట్టుబడుతోంది. ఇప్పుడు న్యూజిలాండ్తో కుదిరిన అవగాహన చూశాక ట్రంప్ ఏమంటారో చూడాలి. మొత్తానికి మన ప్రయోజనాలు దెబ్బతినకుండా, లబ్ధి చేకూరేలా కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా స్వాగతించదగిందే! -
భారీగా పెరిగిన బంగారం ధర: కొత్త రేట్లు ఇలా..
బంగారం ధరల హీట్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2025 జనవరిలో రూ. 79వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు రూ. 1.38 లక్షలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే ఏడాదిలో రూ. 59వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా గత రెండు రోజులుగా పసిడి ధరలు గరిష్టంగా రూ. 4370 పెరిగింది.హైదరాబాద్, విజయవాడలలో గోల్డ్ రేటు రెండు రోజుల్లో (డిసెంబర్ 22, 23) రూ. 4370 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,180 నుంచి రూ. 1,38,550 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,000 దగ్గర నుంచి రూ. 1,27,000 వద్దకు (రూ. 4000 పెరిగింది) చేరింది.ఢిల్లీ నగరంలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. డిసెంబర్ 22, 23 తేదీల్లో రూ. 4370 పెరిగింది. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,700కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల రేటు రూ. 4000 పెరగడంతో రూ. 1,27,150 వద్దకు చేరింది.చెన్నైలో పసిడి ధరలు పెరగడంతో.. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,310 వద్దకు (రూ. 4030 పెరిగింది), 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,27,700 వద్దకు (రూ. 3700 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాలు) రూ. 8000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.34 లక్షలకు చేరింది. -
భారత్ ‘మెగా రోడ్డు’తో డ్రాగన్కు చుక్కలే..
న్యూఢిల్లీ: తరచూ దుందుడుకు చర్యలకు పాల్పడే చైనాకు భారత్ అడ్డుకట్ట వేస్తోంది. చైనా సరిహద్దు వెంబడి భారత్ మరో భారీ వ్యూహాత్మక అడుగు వేసింది. ఉత్తరాఖండ్లోని నీలపాణి నుండి ములింగ్ లా వరకు 16,134 అడుగుల అత్యంత ఎత్తైన ప్రాంతంలో 32 కిలోమీటర్ల మేర నిర్మితమవుతున్న‘మెగా రోడ్డు’ పనులను భారత్ ముమ్మరం చేసింది. అన్ని వాతావరణాలను తట్టుకునేలాంటి రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. రూ. 104 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చేపడుతున్న ఈ ప్రాజెక్టు, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)వద్ద భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచనున్నది.ప్రస్తుతం ములింగ్ లా బేస్ క్యాంపు చేరుకోవాలంటే సైనికులు ఐదు రోజుల పాటు కఠినమైన కొండ మార్గాల్లో ట్రెక్కింగ్ చేయాల్సి వస్తున్నది. శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా ఈ మార్గం పూర్తిగా మూసుకుపోతుంటుంది. దీంతో కేవలం హెలికాప్టర్ల ద్వారానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఈ నూతన రహదారి పూర్తయితే, ఐదు రోజుల ప్రయాణం కేవలం కొద్ది గంటల్లోనే ముగియనుంది. తద్వారా దళాల మోహరింపు, రేషన్, ఇంధనం, యుద్ధ సామగ్రిని ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా సరిహద్దుకు చేరవేసే అవకాశం కలుగుతుంది.ఒకప్పుడు సరిహద్దుల్లో రహదారులు నిర్మిస్తే చైనా చొరబడుతుందని భారత్ భావించింది. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని పక్కనపెట్టి,‘కనెక్టివిటీయే బలం’ అనే దిశగా అడుగులు వేస్తోంది. టిబెట్ ప్రాంతంలో చైనా ఇప్పటికే భారీగా రోడ్డు, రైలు నెట్వర్క్ను నిర్మించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. 2020 తూర్పు లడఖ్ ప్రతిష్టంభన తర్వాత, సరిహద్దుల్లోని చివరి మైలు వరకు సైనిక కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా మెగా రోడ్డు పనులు జరుగుతున్నాయి.హిమాలయాల్లోని అత్యంత కఠినమైన భూభాగంలో సాగుతున్న ఈ రోడ్డు నిర్మాణం ఇంజనీరింగ్ పరంగా పెద్ద సవాలుతో కూడుకున్నది. ఈ రహదారి పూర్తయితే వాయు సేనపై ఆధారపడే అవసరం తగ్గి, రక్షణ వ్యయం గణనీయంగా ఆదా కానుంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఉంటేనే, వేగవంతమైన ప్రతిస్పందన సాధ్యమని భారత్ భావిస్తోంది. తద్వారా సరిహద్దు ప్రాంతాలు మరింత సుస్థిరంగా ఉంటాయని రక్షణ నిపుణులు అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో చైనా చొరబాట్లకు భారత్ సమర్థవంతంగా అడ్డుకట్ట వేయగలదని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: liquor Scam: మాజీ సీఎం కుమారునికి రూ. 250 కోట్లు? -
న్యూజిలాండ్ భారత్ వాణిజ్య ఒప్పందం ఖరారు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు స్థాయికి చేర్చే లక్ష్యంతో భారత్, న్యూజిలాండ్ చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారుచేసుకున్నాయి. సంబంధిత చర్చలు విజయవంతంగా ముగిశాయని ఇరుదేశాలు సోమవారం ప్రకటించాయి. భారత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్లు ఫోన్లో సంభాషించి ఒప్పందాన్ని ఖరారుచేశారని భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముంది. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చే లక్ష్యంతో ఇరుదేశాలు ఉమ్మడిగా ముందుకుసాగనున్నాయి. న్యూజిలాండ్ నుంచి ఉన్ని, బొగ్గు, కలప మొదలు వైన్, అవకాడో, బ్లూబెర్రీల దాకా పలు రకాల ఉత్పత్తులపై 95 శాతం టారిఫ్ను భారత్ తొలగించనుంది. దీంతో ఇవన్నీ సరసమైన ధరలకు భారతీయులకు అందుబాటులోకి వచ్చే వీలుంది. భారతీయ ఎగుమతిదారుల నుంచి పాల ఉత్పత్తులు, ఉల్లి, చక్కెర, మసాలా దినుసులు, వంటనూనెలు, రబ్బర్దాకా పలు రకాల ఉత్పత్తులను న్యూజిలాండ్ మార్కెట్లోకి ఎగుమతిచేసి లాభాలను కళ్లజూడనున్నారు. తయారీ, మౌలికరంగం, సేవలు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పనా రంగాల్లో వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఆపిల్ ఎగుమతులపై టారిఫ్ ప్రయోజనాలు పొందనుంది. ఇరుదేశాల మధ్య పటిష్టమైన ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలతోపాటు రెండు దేశాల మార్కెట్లలోకి సరు కుల అనుమతి, నూతన పెట్టుబడుల ప్రోత్సాహం, వ్యూహాత్మక భాగస్వామాన్ని బలపర్చుకోవడం, ఆవిష్కర్తలు, నూతన పరిశ్రమల స్థాపన సహా రైతులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, విద్యార్థులు, యువత ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయ పాడిరైతుల ప్రయోజనాలను కాపాడుతూ న్యూజిలాండ్ పాలు, పెరుగు, వెన్న, చీజ్ తదితర ఉత్పత్తులపై టారిఫ్లను యథాతథంగా కొనసాగించనున్నారు. కృత్రిమ తేనె, ఆయుధాలు, మొక్కజొన్న, బాదం, వజ్రా భరణాలు, కాపర్, అల్యూమినియం ఉత్పత్తులపై గతంలో మాదిరే భారత్ టారిఫ్ విధించనుంది.వేల మంది భారతీయులకు ప్రయోజనంన్యూజిలాండ్లోని నైపుణ్య ఉద్యోగాల్లోకి ఏటా 5,000 మంది భారతీయ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ వర్క్ వీసాలను ఇచ్చేందుకు న్యూజిలాండ్ అంగీకారం తెలిపింది. దీంతో ఆయుష్ వైద్యులు, యోగా నిపుణులు, పాకశాస్త్ర ప్రవీణులు, సంగీతం, ఐటీ, ఇంజనీరింగ్, ఆరోగ్యసంరక్షణ, విద్య, నిర్మాణ రంగాల్లో భారతీయులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. భారతీయ విద్యార్థులు న్యూజిలాండ్లో చదువుకునేకాలంలో గరిష్టంగా వారానికి 20 గంటలపాటు పనిచేసుకునేందుకు అనుమతిస్తారు. డిగ్రీ కోర్సు అయితే రెండేళ్ల వర్క్ వీసా, బ్యాచిలర్స్ డిగ్రీ(ఆనర్స్) లేదా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్,మెడిసిన్(స్టెమ్) గ్రాడ్యుయేట్ అయితే మూడేళ్ల వర్క్ వీసా, పోస్ట్గ్రాడ్యుయేషన్ అయితే నాలుగేళ్ల వర్క్ వీసా ఇస్తారు. ఈ ఏడాది మార్చినెలలో భారత్లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ పర్యటించిన కాలంలోనే ఈ ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయని భారత వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. భారత్లో కివీపండు, ఆపిల్, తేనె దిగుబడి పెంపే లక్ష్యంగా ఈ మూడింటి కోసం ప్రత్యేకంగా సాగు–సాంకేతికత చర్యా ప్రణాళికను రూపొందించనుంది. భారతీయ వైన్స్, స్పిరిట్లను న్యూజిలాండ్లోనూ రిజిస్ట్రేషన్ చేసే అక్కడి భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ సంబంధ చట్టాలకు సవరణలు చేయనుంది. ఆయుష్, సంస్కృతి, మత్స్య, శ్రవణ దృశ్య పర్యాటకం, అటవీ, ఉద్యానవనాలతోపాటు వైద్యం, వ్యవసాయం వంటి సంప్రదాయ జ్ఞానపరంపరలోనూ సహకార దృక్పథంతో ముందుకుసాగుతాం’’ అని మంత్రి గోయల్ చెప్పారు. ‘‘చర్చలు కేవలం 9 నెలల్లోనే ఒప్పందం ఖరారు స్థాయికి చేరుకోవడం విశేషం. ఇది ఇరుదేశాల ప్రభుత్వాల పరిపాలనా సంకల్పానికి ప్రతీక’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం.. భారతీయుల పరిస్థితి విషమం
ఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా సైన్యంలో చేరిన భారతీయుల పరిస్థితి మరింత విషమంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 50 మంది భారతీయులు రష్యా సైన్యంలో చిక్కుకుని ఉన్నారు.వారిలో ఇప్పటి వరకు 26 మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు అదృశ్యమైనట్లు సమాచారం. వారి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అధికారులు తెలిపారు. మొత్తం మీద, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 200 మందికి పైగా భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది.ప్రభుత్వ చర్యలుభారత ప్రభుత్వం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రష్యా సైన్యంలో చేరిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొంతమందిని రప్పించగలిగామని, కానీ ఇంకా 50 మంది చిక్కుకుని ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.కుటుంబాల ఆందోళనయుద్ధంలో చిక్కుకున్న యువకుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ప్రాణాలు రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులు తమ పిల్లలు మోసపూరిత వాగ్దానాలతో రష్యా సైన్యంలో చేరారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన దక్షిణాసియా దేశాల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడం వల్ల చిక్కుకున్న భారతీయుల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితి భారత విదేశాంగానికి పెద్ద సవాలుగా మారింది.ముగింపురష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నంత కాలం, రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రాణాలు రక్షించేందుకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబాలు కోరుతున్నాయి. -
యూనస్ కళ్లు తెరుస్తారా!
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బంగ్లాదేశ్లో హింస ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనబడటం లేదు. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో గతవారం దేశమంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. హింస చెలరేగింది. దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మైనారిటీ హిందూ యువకుణ్ణి మతాన్ని కించపరిచాడన్న ఆరోపణతో కొట్టి చంపారు. ‘ప్రథమ్ ఆలో’, ‘ద డైలీ స్టార్’ అనే రెండు ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాలకు నిప్పంటించారు. ఈలోగా సోమవారం మరో విద్యార్థి నాయకుడు, నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) స్థానిక నేత మొతలబ్ షిక్దర్ను దుండగులు కాల్చి చంపారు. బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోవటం, ఎన్నికలను ప్రహసన ప్రాయంగా మార్చటం వగైరాలతో జనం ఆగ్రహించి నిరుడు జూలైలో ఉద్యమించారు. దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవటంలో, హింసను రెచ్చగొట్టి మైనారిటీ హిందూ మతస్తులపై, మహిళలపై దాడులు చేయటంలో మతతత్వవాదులు విజయం సాధించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ వీటన్నిటినీ గుడ్లప్పగించి చూస్తున్నారు. ఉద్యమకారులు రోడ్లపైకొచ్చి విధ్వంసం సృష్టిస్తుంటే వాటిని అడ్డుకోవటానికి ప్రభుత్వపరంగా ఆయన చేసిందేమీ లేదు. అది చేతగానితనమా, వ్యూహాత్మకమా అన్నది తేలాల్సి ఉంది. హసీనా నిష్క్రమించాక చోటుచేసుకుంటున్న వరస పరిణామాలు అరాచకానికి బీజాలు వేశాయి. నేరగాళ్లను జైళ్లనుంచి విడిచిపెట్టడం, జమాత్–ఎ–ఇస్లామీ(జేఐ) వంటి పాక్ అనుకూల మతతత్వ సంస్థలకు స్వేచ్ఛనీయటం వగైరాలు ఎడతెగని హింసకు దారితీశాయి. హసీనా సొంత పార్టీ అవామీ లీగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పోటీచేసే అవకాశం లేకపోవటం, మరో ప్రధాన పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) అధినేత ఖలీదా జియా తీవ్ర అస్వస్థత వల్ల ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారటం వగైరా పరిణామాలతో జేఐ వంటి మతతత్వ సంస్థలు తామే విజేతలమన్న భ్రమలో బతుకుతున్నాయి. భారత్ వ్యతిరేకతను ఇదే స్థాయిలో రెచ్చగొడుతూపోతే తమకే అధికారం దక్కుతుందని తలపోస్తున్నాయి. హదీ చురుకైన విద్యార్థి నాయకుడే. కానీ జేఐకి బద్ధ వ్యతిరేకి. ‘ఇంక్విలాబ్ మంచా’(ఐఎం) అనే మరో మతతత్వ సంస్థకు అధికార ప్రతినిధి. ఇటీవలే ‘ప్రథమ్ ఆలో’ పత్రిక సర్వే నిర్వహించి ఐఎం కన్నా జేఐకే ప్రజాదరణ ఎక్కువుందని తెలిపింది. బంగ్లాలో వరసబెట్టి ఆలయాలపై, దర్గాలపై సాగుతున్న దాడులపై అమెరికాలో పరిశోధక విద్యార్థిగా ఉన్న అసిఫ్ బిన్ అలీ రాసిన సవివరమైన వ్యాసాన్ని ప్రచురించింది. ఇదంతా కంటగింపుగా మారి ఐఎం మూకలు ఆ పత్రిక కార్యాలయానికి నిప్పెట్టాయి. పాక్ పాలకులు తమ సంస్కృతినీ, భాషనూ అణగ దొక్కాలని చూసిన పర్యవసానంగానే బంగ్లా ఆవిర్భవించిందన్న కనీస అవగాహన కూడా లేని ఈ మూకలు దేశాన్ని ఎటు తీసుకెళ్తాయో అనూహ్యం.భారత్ వ్యతిరేకత ఎంతగా ప్రదర్శిస్తే అంతగా తమకు జనాదరణ పెరుగుతుందని మతతత్వ సంస్థలు భావిస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న అధిక ధరల సమస్య లేదా నిరుద్యోగాన్ని రూపుమాపటం, కనీసం అవినీతి అంతానికి ఏం చేస్తారో చెప్పటం వగైరాలు మరిచిన ఈ సంస్థలు భారత్ వ్యతిరేకత పైనే ఆశ పెట్టుకున్నట్టు కనబడుతోంది. హదీ భారత వ్యతిరేకి కావొచ్చుగానీ... అంతమాత్రాన ఆ హత్య వెనక భారత్ హస్తం ఉన్నదనీ, హదీ హంతకులకు అది ఆశ్రయమిచ్చిందనీ వదంతులు వ్యాపింపజేయటం, ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి వైఖరే అరాచకానికి దారితీస్తోంది. ప్రజాస్వామ్యం ఒక్కరోజులో కుప్పకూలదు. దీర్ఘకాలం కొనసాగే అరాచకం, హింస అందుకు తోడ్పడతాయి. హదీ సంస్మరణ సభలో మాట్లాడిన వారు భారత్కు హెచ్చరికలు జారీచేయటం, హసీనానూ, హదీ హంతకులనూ అప్పగించాలంటూ తేదీ ఖరారు చేయటం... ఎన్నికలు ముంచుకొస్తుండగా ప్రభుత్వం దీన్ని మౌనంగా వీక్షించటం బాధ్యతా రాహిత్యం. సకాలంలో ఈ అరాచకాన్ని నివారించకపోతే మున్ముందు తనను కూడా ఈ శక్తులు లక్ష్యంగా మార్చుకుంటాయని యూనస్ తెలుసు కోవటం మంచిది. -
బంగ్లా అశాంతి.. తీవ్రవాదానికి తలవంచిన మూర్ఖుల వల్లే!
బంగ్లాదేశ్లో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మహమ్మద్ యూనస్కు ఏమాత్రం రాజకీయానుభవం లేకపోవడం బంగ్లాదేశ్కు శాపంగా మారిందని మాజీ ప్రధాని షేక్ హసీనా అంటున్నారు. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రతిష్ట నానాటికీ దిగజారిపోతుందని.. భారత్లాంటి మిత్రదేశాలతో సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారామె. గతవారం బంగ్లాదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాడికల్ యువ నేత షరీఫ్ ఉస్మాన్ హాది (32)ని ఓ దుండగుడు కాల్చి చంపాడు. తదనంతరం చెలరేగిన ఘర్షణల్లో.. దీపు చంద్ర దాస్ (27) అనే హిందూ యువకుడు అతికిరాతకంగా మూక హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలపై ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు.ముహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వ పాలనను అత్యంత బలహీనంగా ఉందని.. అక్కడ చట్టాలేవీ అమల్లో లేవని అన్నారామె. ‘‘అల్లర్లు.. మైనారిటీలపై దాడులు బంగ్లాదేశ్ స్థిరత్వాన్ని దెబ్బ తీస్తాయి. ప్రపంచం దృష్టిలో ప్రతిష్ట దిగజారిపోతుంది. మరీ ముఖ్యంగా భారత్లాంటి పొరుగు దేశాలతో సంబంధాలను కూడా బలహీనపరుస్తాయి’’ అని అభిప్రాయపడ్డారామె.గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని.. భారత్ ఈ పరిస్థితిని అల్లకల్లోలంగా చూస్తోందని అన్నారామె. అయితే.. బంగ్లాదేశ్ అన్ని మతాలను గౌరవించే దేశమని.. కానీ, కొంతమంది మూర్ఖుల వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రజాస్వామ్యం తిరిగి స్థాపితమైతే, ఇలాంటి అశాంతి ముగుస్తుందని అభిప్రాయపడ్డారామె. యూనస్ ప్రభుత్వం జమాత్-ఇ-ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తివేయడం, తీవ్రవాదులను కేబినెట్లో చేర్చుకోవడం. జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయడం వంటి చర్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తీవ్రవాద శక్తులు యూనస్ను ఉపయోగించుకుంటన్నాయని.. ఇది భారత్ సహా ప్రతీ దక్షిణాసియా దేశానికి ఆందోళన కలిగించే అంశమని అన్నారామె. -
తీరు మార్చుకోకుంటే.. బంగ్లాదేశ్కు దబిడి దిబిడే..!
బంగ్లాదేశ్.. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దించిన తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా మహ్మద్ యూనస్ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దేశ నేతలు చేసే వ్యాఖ్యలు పొరుగెన ఉన్న భారత్ను రెచ్చగొట్టేలా ఉన్నాయి. గతంలో భారత్ చేసిన త్యాగాన్ని మరిచి మరీ బంగ్లాదేశ్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తుంది. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ది కీలక పాత్ర అనేది చరిత్రను అడిగితే చెబుతుంది,. మరి అటువంటిది బంగ్లాదేశ్ నాయకులు కావాలనే కయ్యానికి కాలుదువ్వుతున్నట్లే ఉంది. నిశితంగా గమినిస్తున్న భారత్..కొంతకాలం క్రితం మహ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉన్న సెవెన్ సిస్టర్స్ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాల గురించి బంగ్లాదేశ్ తెగ ఆరాటపడిపోతంది. ఆ తరహా వ్యాఖ్యలే ఇప్పుడు ఆ దేశంలో పలువురి నేతల వెంట కూడా వస్తుంది. ఈ వ్యవహారాల్ని గమనిస్తు ఉన్న భారత్.. వారి వ్యవహార శైలిని ఎండగడుతూనే ఉంది. ఒకనాడు పాకిస్తాన్కు మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన భారత్.. బంగ్లాదేశ్ నాయకులు చేస్తున్న ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అనే దానిపై ఫోకస్ పెట్టింది. ఎటువంటి బలం లేకుండా బంగ్లాదేశ్ ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయదని పసిగట్టిన భారత్.. ‘వారి వెనుక ఎవరున్నారు’ అనే విషయంపై కన్నేసి ఉంచింది. గతంలోనే ప్రధాని మోదీ వార్నింగ్..!ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహ్మద్ యూనస్ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు అప్పుడే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏప్రిల్ నాల్గో తేదీన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ తో భేటీ అయిన సందర్భంగా మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ‘మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. ఆనాడు యూనస్ ఏమన్నారంటే..ఏప్రిల్ మొదటి వారంలో యూనస్.. భారత్ను ఉద్దేశిస్తూ వివాదాస్సద వ్యాఖ్యలు చేసి చైనా మెప్పు పొందాలనే యత్నం చేశారు. సెవన్ సిస్టర్స్గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సాగర రక్షకుడిగా ఉందని, చైనాకు ఇదొక మంచి అవకాశమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ దీని ద్వారా మరింత బలోపేతం చేసుకోవచ్చన్నారు. చైనా సాయం కోసం, వారి మెప్పు కోసం యూసఫ్ తెగ తంటాలు పడిపోతున్నారు. అవకాశవాదానికి మారుపేరైన చైనా వాపును చూసే యూనస్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆనాడే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. భారత్పై మరోసారి పరోక్షంగా అక్కసు..శనివారం రాడికల్ నేతగా పేరున్న షరీఫ్ ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో పాల్గొన్నముహమ్మద్ యూనస్..హాది ఆలోచనలు, సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలో ఆయన చూపిన మార్గాన్ని తాము స్వీకరించామని తెలిపారు. హాది ఇచ్చిన స్పూర్తి ప్రజాజీవితంలో సజీవంగా కొనసాగుతుందన్నారు. అంటే భారత్పై పరోక్షంగా యూనస్ వ్యాఖ్యానించట్లైంది. భారత వ్యతిరేక శక్తిగా, భారతే టార్గెట్గా హాది వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఆయన మార్గాన్ని బంగ్లాదేశీయుల అనుసరిస్తున్నారని యూనస్ అంటున్నారు. అంటే ఆ అంత్యక్రియల కార్యక్రమం భారత వ్యతిరేక కార్యక్రమంలానే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరో చోటా నేత సైతం..బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను భారతదేశం నుండి వేరు చేస్తామంటూ హస్నత్ అబ్దుల్లా చేసిన రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్ను పిలిపించి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది.పాక్ను మోకరిల్లేలా చేసిన వేళను మరిచారా?1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశీయులపై ఊచకోత జరిపారు. ఇది ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద జనసంహారంగా గుర్తించబడింది. సుమారు 300,000 నుండి 3,000,000 మంది వరకు బంగ్లాదేశీయులు హతమయ్యారని అంచనా. పాకిస్తాన్ సైనికులు, వారికి సహాయం అందించిన స్థానికుల చేత 200,000 నుండి 400,000 వరకూ అత్యాచారం బారిన పడ్డారు. సుమారు 30 మిలియన్ల మంది తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా మారారు. ఈ సమయంలో పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత్కు. ఆనాడు భారత్కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సాహోసపేతమైన నిర్ణయంతో పాకిస్తాన్ ఆటనును 13 రోజుట్లోనే కట్టించింది. డిసెంబర్ 3వ తేదీన మొదలైన యుద్ధం డిసెంబర్ 16వ తేదీకి ముగిసింది. 1971లో జరిగిన 13 రోజుల యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్పై సాధించిన విజయంతో ఈస్ట్ పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్గా మారింది. ఆ సమయంలో సుమారు 93 వేల మంది పాక్ సైన్యం ఢాకాలో లొంగిపోయింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైనిక లొంగబాటుగా కూడా రికార్డులెక్కింది. పాకిస్తాన్ను మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్ అనే రాజ్యం ఏర్పాటుకు భారత్ ఇంతటి త్యాగం చేస్తే.. మరి ఇప్పుడు దానిని మరిచి కాలుదువ్వడానికి సిద్దం కావడం. ఒకటైతే.. అప్పుడ పాకిస్తాన్కు ఎదురైన అతి పెద్ద పరాభవం.. నేటి బంగ్లాదేశ్ ఎదురు కాదనేది వారు అనుకుంటే పొరపాటే. -
రాడికల్ నేత ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో యూనస్ ప్రతిజ్ఞ
ఢాకా: బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ శనివారం రాడికల్ నేతగా పేరున్న షరీఫ్ ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హాది ఆలోచనలు, సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. గత వారం గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించిన హాదికి వేలాదిమంది నివాళులు అర్పించారు.అంత్యక్రియల సందర్భంగా యూనస్ మాట్లాడుతూ.. ఇది వీడ్కోలు కాదు, ఒక ప్రతిజ్ఞ. హాది మాకు చెప్పిన మాటలను మేం నెరవేరుస్తాం. మా తరాలే కాదు, రాబోయే తరాలూ ఈ వాగ్దానాన్ని కొనసాగిస్తాయి. హాది ప్రజలతో మమేకమయ్యే తీరును, రాజకీయ దృక్పథాన్ని యూనస్ ప్రశంసించారు. ఆయన మానవత్వం, జీవన విధానం, రాజకీయ ఆలోచనలను దేశం ఎప్పటికీ మర్చిపోవని పేర్కొన్నారు.ప్రపంచం ముందు తల ఎత్తుకుని నడుస్తాం. ఎవరి ముందూ తలవంచం అని యూనస్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పాల్గొనాలన్న హాది ఆశయాన్ని యూనస్ గుర్తు చేశారు.ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలో ఆయన చూపిన మార్గాన్ని తాము స్వీకరించామని తెలిపారు. హాది ఇచ్చిన స్పూర్తి ప్రజాజీవితంలో సజీవంగా కొనసాగుతుందని చెప్పారు.32 ఏళ్ల హాది బంగ్లాదేశ్లో 2024 విద్యార్థి ఉద్యమ సమయంలో వెలుగులోకి వచ్చాడు. అప్పటి ప్రధాని షేక్ హసీనా అధికారం కోల్పోవడానికి దారితీసిన ఆ ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరించారని చెబుతారు. ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలతో హాది గుర్తింపు పొందాడు. ఢాకాలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలో ఆయనపై జరిగిన కాల్పులకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపధ్యంలో సింగపూర్లో చికిత్స పొందుతూ హాది మృతి చెందాడు.ఈ ఘటనలో అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారు భారత్కు పారిపోయి ఉండవచ్చని ఆరోపణలు వచ్చాయి. దాంతో న్యూఢిల్లీ–ఢాకా మధ్య దౌత్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హాది మరణం తర్వాత ఢాకా సహా పలు నగరాల్లో భారీ నిరసనలు చెలరేగాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొన్ని చోట్ల భవనాలకు నిప్పు పెట్టడంతో అక్కడి సిబ్బంది చిక్కుకుపోయిన ఘటనలు కూడా జరిగాయి. -
పొగబట్టిన కాలుష్యం!
దేశంలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో 2022–24 మధ్య ఢిల్లీలోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రులకు 2 లక్షల కంటే ఎక్కువ మంది బాధితులు వచ్చారంటే కాలుష్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో ప్రచురితమైన 2024 అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం కలుíÙతమైన గాలిని పీల్చడం వల్ల భారత్లో ఏటా 15 లక్షల మంది మరణిస్తున్నారు.వాయు కాలుష్యం వల్ల దేశ సగటు ఆయుర్దాయం 3.5 ఏళ్లు తగ్గిందని షికాగో విశ్వవిద్యాలయం 2025 ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్ఐ) వెల్లడించింది. గాలి నాణ్యతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరి్టక్యులేట్ మ్యాటర్–2.5 (పీఎం) ఒక్కో క్యూబిక్ మీటర్కు 40 ్పమైక్రోగ్రాముల వరకు ఆమోదయోగ్యం. అంటే గాలిలో 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసంతో కలిసిన దుమ్ము, ధూళి, పొగ కణాలు అన్నమాట. గాలిలో ఈ కణాలు ఎన్ని ఎక్కువగా ఉంటే వాయు కాలుష్యం అంత తీవ్రంగా ఉన్నట్లు లెక్క.ఏడాది పొడవునా.. దేశంలో వాయు నాణ్యత సంక్షోభం అంతకంతకూ విస్తృతమవుతోంది. ఈ ఏడాది 256 నగరాలు, పట్టణాల్లో పరీక్షలు జరపగా 150 కేంద్రాల్లో వాయు కాలుష్యం నిర్దేశిత ప్రమాణాలను మించిపోయిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తెలిపింది. చాలా మంది పట్టణవాసులకు అనారోగ్యకర లేదా ప్రమాదకర గాలిని పీల్చడం ఏడాది పొడవునా నిత్యకృత్యంగా మారింది. 2025లో ఢిల్లీలో పీఎం–2.5 స్థాయి రోజుకు క్యూబిక్ మీటర్కు 107–130 మైక్రోగ్రాములుగా³ నమోదైంది. ఇది దేశంలో ఒక రోజు పరిమితి అయిన 60 మైక్రోగ్రాములు, డబ్ల్యూహెచ్ఓ నిర్దేశిత 15 మైక్రోగ్రాముల కంటే చాలా ఎక్కువ. తగ్గుతున్న ఆయుర్దాయం..దేశంలో 46% మంది ప్రజలు పీఎం–2.5 స్థాయి కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఏక్యూఎల్ఐ నివేదిక తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రజలు 4.74 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నారని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన కఠినమైన మార్గదర్శకాలను పాటిస్తే ఆయుర్దాయం 9.4 నెలలు పెరుగుతుందని అంచనా వేసింది.ఎనిమిదిలో ఒకటి..వాయు కాలుష్యానికి సంబంధించిన మరణాలను భారత్లో లెక్కించడం లేదని గ్లోబల్ క్లైమేట్, హెల్త్ అలయన్స్ చెబుతోంది. క్రమబద్ధమైన విధానాలు లేకపోవడమే అందుకు కారణమని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణమని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక–2025 తెలిపింది. అన్ని దేశాల్లో కలిపి 2023లో 79 లక్షల మరణాలు వాయు కాలుష్యం వల్ల సంభవించాయని పేర్కొంది. అందులో పీఎం–2.5 స్థాయి కాలుష్యానికి గురై 49 లక్షల మంది మృతిచెందారని తెలిపింది. తగ్గిన సూర్యకాంతి.. 1993–2022 మధ్యకాలంలో గాలిలోని దుమ్ము, ధూళి కారణంగా దేశంలో సూర్యకాంతి దాదాపు 13% తగ్గింది. మేఘాలు అదనంగా 31–44% సూర్యకాంతి క్షీణతకు కారణమయ్యాయని ఐఐటీ కాన్పూర్లోని వాతావరణ శాస్త్రవేత్త సచ్చిదానంద్ త్రిపాఠి తెలిపారు. సూర్యకాంతి తగ్గితే వ్యవసాయం, సౌర శక్తితోపాటు రోజువారీ జీవితాలపైనా ప్రభావం చూపుతుందని వివరించారు. ఫొటోవోల్టాయిక్ సిస్టమ్స్ను బట్టి సౌర విద్యుత్ ఉత్పత్తి 12–41% పడిపోతుందని చెప్పారు. బీజింగ్ ఒక ఉదాహరణ.. చైనాలోని బీజింగ్ 20 ఏళ్ల క్రితం ప్రపంచ పొగమంచు రాజధానిగా పేరొందింది. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా బొగ్గు ఆధారిత బాయిలర్స్ను మూసివేయడం, ప్రజారవాణా, పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించడం, సాంకేతిక సంస్కరణలు, ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం వంటి చర్యలను చైనా సర్కారు యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఫలితంగా పీఎం–2.5 స్థాయి 2013లో ఒక్కో క్యూబిక్ మీటర్కు 72గా ఉండగా గతేడాది 29.3 ్పమైక్రోగ్రాములకు తగ్గిపోవడం విశేషం. -
యాప్స్తో ఫుడ్ పెరిగింది
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు రెస్టారెంట్ల వ్యాపారం.. బిర్యానీ తిన్నంత నిండుగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఎన్సీఏఈఆర్ ఏం చెప్పిందంటే... ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ద్వారా వెల్లువెత్తుతున్న ఆర్డర్ల విలువ రెండేళ్లలోనే రెండింతలైందని ఆర్థిక విధానాల మేధోమధన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అపైŠల్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రోసస్తో కలిసి ఎన్సీఏఈఆర్ రూపొందించిన నివేదిక ప్రకారం.. గతంతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు సేవలు అందించే ప్రాంతం విస్తృతి పెరిగింది. వేలాది రెస్టారెంట్లు కస్టమర్ల మొబైల్ తెరపై ప్రత్యక్షం అవుతున్నాయి. కొత్త కొత్త వంటకాలు ఆఫర్ చేసే అవకాశం రెస్టారెంట్లకు కలిగింది. నూతన కస్టమర్లనూ అందిపుచ్చుకున్నాయి. అయితే అధిక కమీషన్ల కారణంగా ఈ ప్లాట్ఫామ్స్ నుంచి తప్పుకోవాలని కొన్ని హోటళ్లు భావిస్తుండడమూ కొసమెరుపు. రెండింతలైన విలువ..: మన దేశంలో 2023–24లో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ రూ.1.2 లక్షల కోట్ల విలువైన ఫుడ్ను కస్టమర్లకు చేర్చాయి. 2021–22లో ఇది రూ.61,271 కోట్లుగా నమోదైంది. ఈ రంగం భారత ఆర్థికవ్యవస్థ కంటే వేగంగా విస్తరిస్తోంది. తద్వారా శక్తివంతమైన ఆర్థిక చోదకంగా అవతరించింది. దీంతో జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 0.14 నుంచి 0.21 శాతానికి పెరిగింది. ఇతర సేవల రంగాలతో పోలిస్తే ఫుడ్ యాప్స్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఫుడ్ డెలివరీ రంగం రెస్టారెంట్లు, వ్యవసాయం, రవాణా, సాంకేతికత విభాగాల్లో రెండింతల ఆర్థిక విలువను జోడిస్తోంది. ఫుడ్ యాప్స్లో రూ.10 లక్షల విలువైన ఆర్డర్లు కొత్తగా తోడైతే.. మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ.20.5 లక్షల విలువైన ఉత్పత్తి అదనంగా వచ్చి చేరుతోందని నివేదిక వెల్లడించింది. ఉపాధి జోరు..: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ద్వారా ఉపాధి పొందుతున్నవారి సంఖ్య భారత్లో 2021–22లో 10.8 లక్షల నుంచి 2023–24లో 13.7 లక్షలకు చేరింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా 12.3% అధికం అవుతోంది. ఇతర రంగాల్లో వార్షిక వృద్ధి 7.9% ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లో ఒకరికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే.. విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. రుచించని కమీషన్..: ప్రతి ఆర్డర్పై ఫుడ్ యాప్స్ ప్రస్తుతం వసూలు చేస్తున్న కమీషన్ మూడింట ఒక వంతు రెస్టారెంట్ ఓనర్లకు రుచించడం లేదు. ఈ కమీషన్లు ఏటా పెరుగుతూ బిల్ విలువలో గణనీయమైన వాటాను ఆక్రమిస్తున్నాయి. ఆర్డర్ల పరిమాణం బలంగా ఉన్నా, సమకూరే నికర ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో ఆర్డర్పై కమీషన్ 2019లో 9.6% నుండి 2023లో 24.6%కి వచ్చి చేరింది. కమీషన్ల విషయంలో పెద్ద హోటళ్లకు ఈ యాప్స్తో బేరమాడుకునే శక్తి ఎక్కువ. కానీ చిన్న హోటళ్లకు ఆ అవకాశం తక్కువగా ఉండడంతో లాభాలపై ఒత్తిడి ఉంటోంది. పేలవమైన కస్టమర్ సర్వీస్, తగినంత లాభదాయకత లేకపోవడం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్ను విడిచిపెట్టాలని భావిస్తున్నట్టు 35% మంది ఓనర్లు వెల్లడించారు. దేశంలో 28 నగరాల్లోని..: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్తో రెస్టారెంట్లు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 28 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 640 రెస్టారెంట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. 2023లో ఈ ప్లాట్ఫామ్స్ గురించి ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన నివేదికతో పోల్చారు. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ రాకతో.. » ఫుడ్ యాప్స్తో తాము సేవలందిస్తున్న ప్రాంత పరిధి పెరిగిందన్న 59% రెస్టారెంట్లు. » నూతన వంటకాలను జోడించినట్టు 52.7% మంది ఓనర్లు తెలిపారు » కస్టమర్ల సంఖ్య దూసుకెళ్లిందని 50.4% మంది పేర్కొన్నారు. » 2019–23 మధ్య ఈ యాప్స్ ద్వారా రెస్టారెంట్ల ఆదాయ వాటా 22% నుంచి 29%కి చేరింది.ఫుడ్ యాప్స్ విశేషాలు..» భారత్లో ఈ ఏడాది జూన్ నాటికి 19.4 కోట్ల మంది ఫుడ్ యాప్స్ను వినియోగిస్తున్నారు. » రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 6 కోట్లు మాత్రమే. ఈ కాలంలో యూజర్లు మూడింతలు దాటారు. » ఫుడ్ డెలివరీ యాప్స్ వాడకంలో ప్రపంచంలో మన దేశానిదే పైచేయి. » మొత్తం ఫుడ్ యాప్స్ డౌన్లోడ్స్లో భారత్ వాటా ఏకంగా 43.79% ఉంది. -
బంగ్లాదేశ్లో అల్లర్లు.. భారత్ అప్రమత్తం
త్రిపుర: బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రికతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లా సరిహద్దు రాష్ట్రం త్రిపురాలో భద్రతా చర్యల్ని కఠినతరం చేసింది. త్రిపుర సీఎం మాణిక్ సాహా ఆదేశాలతో సరిహద్దు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి.బంగ్లాదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రికత్తగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లు, శరణార్థుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలు,బీఎస్ఎఫ్ సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నీ రక్షణ చర్యల తీసుకుంటోందని త్రిపురా సీఎం స్పష్టం చేశారు.మరోవైపు,బంగ్లాదేశ్లో అశాంతి కొనసాగితే, రెండు దేశాల మధ్య వాణిజ్యం, రవాణా, సాంస్కృతిక సంబంధాలు ప్రభావితం కావచ్చు. అక్రమ వలసలు, స్మగ్లింగ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్ అశాంతి త్రిపురా, అసోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యక్ష ముప్పుగా మారవచ్చు.త్రిపురా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తోంది. స్థానిక ప్రజలు భద్రతా చర్యలను స్వాగతిస్తున్నప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన కొనసాగుతోంది. -
అంతటా జింగిల్ బెల్స్..
భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడి ప్రజలు ప్రతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు, వీధులన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో, చర్చిలు ప్రార్థనలతో, బేకరీలు ఘుమఘుమలాడే కేకులతో కళకళలాడుతుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ నుండి సముద్ర తీర ప్రాంతమైన గోవా వరకు, ప్రతి నగరం తనదైన శైలిలో క్రిస్మస్ వేడుకలకు స్వాగతం పలుకుతుంది.ఢిల్లీ, ముంబై మహానగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కన్నాట్ ప్లేస్ ప్రాంతం పెద్ద క్రిస్మస్ చెట్లు, మెరిసే లైట్లతో పండుగ ధగధగలాడుతోంది. ఇక్కడ షాపింగ్ చేయడంతో పాటు, సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్లో జరిగే అర్ధరాత్రి ప్రార్థనల్లో పాల్గొనడం ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభవం అందిస్తుందని అంటారు. ముంబై నగరంలో బాంద్రా వీధులు పండుగ శోభను సంతరించుకున్నాయి. మౌంట్ మేరీ బసిలికా చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మందిని పాల్గొంటారు. మెరైన్ డ్రైవ్ వెంబడి చల్లని గాలిలో నడుస్తూ, క్వీన్స్ నెక్లెస్ కాంతులను వీక్షించడం పర్యాటకులకు మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.గోవా,పాండిచ్చేరి తీరాల్లో..దేశంలో క్రిస్మస్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది గోవా. ఇక్కడి పురాతన చర్చిలైన బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, సే కేథడ్రల్లు పండుగ వేళ అద్భుతమైన అలంకరణలతో మెరిసిపోతాయి. బీచ్లలో జరిగే రాత్రి పార్టీలు, సంగీత కచేరీలు, బాణసంచా వేడుకలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఫ్రెంచ్ సంస్కృతి మమేకమై ఉండే పాండిచ్చేరిలో క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. వైట్ టౌన్లోని ఫ్రెంచ్ వాస్తుశిల్ప భవనాలు, 'చర్చి ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఏంజిల్స్'లో జరిగే ప్రార్థనలు.. యూరప్లో ఉన్న అనుభూతిని కలిగిస్తాయని పలువురు చెబుతుంటారు.కోల్కతా,బెంగళూరులలో..కోల్కతాలో క్రిస్మస్ను అత్యంత వేడుకగా జరుపుకుంటారు. పార్క్ స్ట్రీట్ ఒక పెద్ద కార్నివాల్లా మారుతుంది. ఎక్కడ చూసినా సంగీతం, లైట్లు, రకరకాల ఆహార స్టాళ్లు కనిపిస్తాయి. సెయింట్ పాల్స్ కేథడ్రల్లో జరిగే కరోల్ గానం వినడానికి రెండు చెవులూ చాలవు. ఇక గార్డెన్ సిటీ బెంగళూరులో బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్లు విద్యుత్ దీపాల వెలుగులతో మెరిసిపోతాయి. చర్చి స్ట్రీట్లోని కేఫ్లు ప్రత్యేకమైన క్రిస్మస్ మెనూలతో పర్యాటకులను ఆహ్వానిస్తాయి. పురాతన సెయింట్ మేరీస్ బసిలికాలో జరిగే వేడుకలు నగరపు పాత కాలపు వైభవాన్ని గుర్తుచేస్తాయి. ఇది కూడా చదవండి: ఈసీఐ ‘ఆపరేషన్ క్లీన్’: ఆ రాష్ట్రాల్లో గగ్గోలు! -
2 నిమిషాల వినోదం
మైక్రో డ్రామా.. భారత్లో ఇటీవలి కాలంలో ‘తెర’పైకి వచ్చిన నూతన వినోద సాధనం. మొబైల్ ఫోన్లో వీక్షించేందుకు వీలుగా రూపొందుతున్న ఈ 1–2 నిమిషాల చిన్న వీడియోలు ఇప్పుడు మన దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. కామెడీ, క్రైమ్, రొమాన్స్, రివెంజ్, ఫాంటసీ.. జానర్ ఏదైనా రీల్స్, షార్ట్స్ స్థానాన్ని మైక్రో డ్రామాలు భర్తీ చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. వేదిక ఏదైనా ప్రపంచవ్యాప్తంగా యూజర్ల వీక్షణ తీరుతెన్నులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. మొబైల్ తెరపై గంటల కొద్దీ ఒకే వీడియోను చూడటం పాత కాలం. జెన్ ఆల్ఫా, జెన్–జీ, మిలీనియల్స్, జెన్–ఎక్స్.. తరం ఏదైనా స్క్రీన్ను వేగంగా స్క్రోల్ చేస్తున్నారు. అంటే స్క్రీన్పై ఉన్న వీడియోను తక్కువ సమయంలోనే స్క్రోల్ చేసి మరో వీడియోను చూస్తున్నారు. ఇటువంటి వారి కోసమే రీల్స్, షార్ట్స్ మాదిరిగా మైక్రోడ్రామా వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో మొదలైన మైక్రో డ్రామా ఫీవర్ మన దేశానికీ పాకింది. భారత్లో మైక్రో డ్రామా వ్యూయర్స్ సంఖ్య 10 కోట్లు ఉన్నట్టు అంచనా. ఆర్మాక్స్ మీడియా ప్రకారం వీరిలో 55 శాతానికిపైగా వీక్షకులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం. దిగ్గజ సంస్థలూ ఎంట్రీ..: మెలో డ్రామా, కొరియన్ డ్రామాలు చాలాకాలంగా భారతీయుల వినోదంలో భాగమయ్యాయి. ఇప్పుడు మైక్రో డ్రామాల వంతు వచ్చింది. సిరీస్లోని అన్ని ఎపిసోడ్స్నూ వీక్షించేంతగా ఈ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. ఇంకేముంది డబ్బులు చెల్లించి మరీ జనం ఆస్వాదిస్తున్నారు. మైక్రోడ్రామాలను ప్రసారం చేసేందుకు మన దేశంలో ప్రత్యేక యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయంటే వీటికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. పైగా అమెజాన్, జీ గ్రూప్ వంటి దిగ్గజాలూ ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. మైక్రో డ్రామాల చిత్రీకరణకు తక్కువ వ్యయం అవుతుంది. వీటితో కంటెంట్ క్రియేటర్లకు ఆదాయాలు మెరుగ్గా ఉంటాయి. బాక్సాఫీస్ను దాటి..: అతి తక్కువ నిడివితో, సీరియళ్ల రూపంలో వీడియో కథనాలు కోవిడ్–19 మహమ్మారి సమయంలో చైనాలో డ్వాంజూగా ఉద్భవించాయి. ప్రస్తుతం ఇవి చైనా బాక్సాఫీస్ కలెక్షన్లను దాటడం ఆశ్చర్యం కలిగించే అంశం. చైనాలో 66 కోట్ల మంది ఈ మైక్రో వీడియోలను వీక్షిస్తున్నట్టు సమాచారం. ఈ విభాగం ఆ దేశ వినోద పరిశ్రమకు ఏటా 7 బిలియన్ డాలర్ల కాసులు కురిపిస్తోంది. ఇంటర్నెట్ వినోదం.. 31.3 కోట్లు కేవలం ఇంటర్నెట్ ఆధారిత వినోదం ఆస్వాదిస్తున్న వీక్షకుల సంఖ్య మన దేశంలో 31.3 కోట్లు ఉన్నట్టు అంచనా. వీరిలో నాలుగింట మూడు వంతులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం విశేషం. కేబుల్, శాటిలైట్, ఓవర్ ద ఎయిర్ ద్వారా ప్రసారమయ్యే సంప్రదాయ టీవీ వీక్షణానికి వీరు దూరం. గత ఏడాదితో పోలిస్తే డిజిటల్ ఆడియెన్స్ సంఖ్య 30 శాతం పెరిగిందని కాంటార్ తన మీడియా కాంపాస్ నివేదికలో వెల్లడించింది. అవీ ఇవీ...» చైనా తరువాత మైక్రో డ్రామా వీక్షకుల సంఖ్యలో అమెరికా, దక్షిణ కొరియా, ఇండోనేసియా, జపాన్ పోటీపడుతున్నాయి. ఆరో స్థానంలో భారత్ నిలిచింది. » 2030 నాటికి మైక్రో డ్రామా పరిశ్రమ వార్షిక విలువ భారత్లో 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. » 18–35 ఏళ్ల వయసున్నవారు అత్యధికంగా మైక్రో డ్రామాలను వీక్షిస్తున్నట్లు జీ గ్రూప్ కంపెనీ బులెటిన్ చెబుతోంది. » సంప్రదాయ ఓటీటీ షోలతో పోలిస్తే మైక్రోడ్రామాల రూపకల్పనకు సమయం 80% ఆదా అవుతుందన్నది నిపుణుల మాట. » భారత్లో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. రోజుకు సగటున 5 నుంచి 7.4 గంటలు మొబైల్లో గడుపుతున్నారు. సింహభాగం వాటా వీడియోలదే. » ఈక్విటీ పరిశోధన, బ్రోకింగ్ సంస్థ బెర్న్స్టీన్ రీసెర్చ్ ప్రకారం.. భారత్లో ద్వితీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లు నెలకు 35–40 జీబీ ఇంటర్నెట్ డేటాను ఉపయోగిస్తున్నారు. ఇది మెట్రో నగరాల్లోని వినియోగదారుల కంటే 30 శాతం ఎక్కువ. 86% భారతీయులు మైక్రోడ్రామాలతోసహా ఓటీటీలో కంటెంట్ కోసం మొబైల్ డేటా వాడుతున్నారు. -
'భారత్' వన్యమృగాల గమ్యస్థానం
ప్రపంచవ్యాప్తంగా వేలాది వన్యప్రాణులు ఇటీవలి సంవత్సరాలలో ఇండియాలోని వివిధ జంతు ప్రదర్శనశాలలకు చేరుకున్నాయి. ఆ జాబితాలో పులులు, సింహాల వంటి క్రూరమృగాలే కాకుండా పక్షులు, కోతి జాతుల వంటివీ ఉన్నాయి. 2023, 2024లలో ప్రపంచంలో అత్యధిక వన్యమృగాలు దిగుమతి చేసుకున్న దేశం మనదే. – సాక్షి, స్పెషల్ డెస్క్2024లో ప్రపంచవ్యాప్తంగా 2,922 వన్యమృగాలు వివిధ దేశాలలోని ‘జూ’లకు చేరుకున్నాయి. వాటిలో 1,640 ఇండియా దిగుమతి చేసుకున్నవే. ఆ ఏడాది, అంతకుముందు ఏడాది కూడా (మొత్తం 4,051 వన్యమృగాలు) ఇండియానే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. 2022లో రెండో స్థానంలో, 2021లో నాలుగో స్థానంలో ఉంది. వన్యమృగాల దిగుమతుల్లో ప్రముఖ దేశాలుగా ర్యాంకులు పొందిన సింగపూర్, యూఏఈల నుంచి కూడా ఇండియా దిగుమతి చేసుకోవటం విశేషం. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజర్డ్ స్పీషీస్ (సి.ఐ.టి.ఇ.ఎస్.) నివేదిక ప్రకారం 1978 నుంచి ఇండియాలోని ‘జూ’లకు చేరుకున్న వన్యప్రాణులలో 90 శాతం గత నాలుగేళ్లలో దిగుమతి అయినవే. దక్షిణాఫ్రికా నుంచే అధికం1978 నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న వన్యమృగాలలో దాదాపు 30 శాతం దక్షిణాఫ్రికాకు చెందినవే. ఐరోపా దేశాల నుంచీ దిగుమతులు అధికంగానే ఉన్నాయి. పులులకే డిమాండ్ ఎక్కువప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం మనదే. గత 46 ఏళ్లలో మనదేశం 314 పులులను దిగుమతి చేసుకుంది. తర్వాతి స్థానాలలో సింహాలు, చీతాలు ఉన్నాయి. -
పర్యాటకులు అమెరికాలో ఎప్పటిదాకా ఉండొచ్చు?
వాషింగ్టన్: ఫలానా తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వమే టూరిస్ట్ వీసాను జారీచేసినాసరే ఆ తేదీకంటే ముందే చాలా సందర్భాల్లో స్వదేశానికి వెనుతిరగాల్సి ఉంటుందని ట్రంప్ సర్కార్ కొత్త మెలిక పెట్టింది. వాస్తవానికి ఈ విషయం వీసా సంబంధ నిబంధన పత్రంలో ఉంటుందని తన వితండవాదాన్ని సమర్థించుకునే ప్రయత్నంచేసింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ అంతర్జాతీయ పర్యాటకులకు ముఖ్య గమనిక. అమెరికాలో ఎన్ని రోజుల వరకు పర్యటించవచ్చు అనేది మీకు జారీచేసిన టూరిస్ట్ వీసా మీద పేర్కొన్న గడువు తేదీ నిర్ణయించబోదు. గడువును అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. మీరు అమెరికాలో అడుగుపెట్టగానే మీతో ఆయన ఒక ఐ–94 దరఖాస్తును నింపిస్తారు. అందులో మీ చట్టబద్ధ పర్యాటకానికి చివరి తేదీ రాసి ఉంటుంది. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలంటే https:// i94.cbp.dhs.gov/ home వెబ్సైట్ను సందర్శించి అందులో మీ టూరిస్ట్ వీసా సంబంధిత వివరాలను సరిచూసుకోండి. ఐ–94 దరఖాస్తులో ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ అని ఒక తేదీ రాసి ఉంటుంది. అదే మీ చట్టబద్ధ పర్యటనకు ఆఖరి గడువు తేదీ. టూరిస్ట్వీసా గడువు తేదీ, ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ తేదీలు ఒకేలా ఉండాలనే నియమం ఏమీలేదు. సాధారణంగా టూరిస్ట్వీసా గడువు కంటే ముందుగానే ‘అడ్మిట్ అన్టిల్ డే’ ముగుస్తుంది’’ అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. -
ఇక స్వేచ్ఛా వాణిజ్యం
మస్కట్: భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ఇరుదేశాలు గురువారం సంతకాలు చేశాయి. ఫలితంగా 98 శాతానికిపైగా భారతీయ ఉత్పత్తులపై ఒమన్లో సుంకాలు సున్నాకు చేరుకోనున్నాయి. ఎలాంటి సుంకాలు లేకుండానే భారతీయ వ్రస్తాలు, వ్యవసాయ, తోలు సహా పలు ఉత్పత్తులను ఒమన్లో విక్రయించుకోవచ్చు. అదేసమయంలో ఒమన్ నుంచి దిగుమతి అయ్యే ఖర్జూరం, మార్బుల్స్, పెట్రో కెమికల్స్ సహా పలు ఉత్పత్తులపై సుంకాలను భారత్ తగ్గించనుంది. ఈ ఒప్పందం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. భారతీయ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం సుంకాలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఒమన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం సానుకూల పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. ఒమన్ రాజధాని మస్కట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎఫ్టీఏపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య మంత్రి ఖాయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసుఫ్ సంతకాలు చేశారు. దీన్ని అధికారికంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)గా పిలుస్తున్నారు. ఒప్పందంలో ముఖ్యాంశాలు → భారతదేశం ఒమన్కు చేసే ఎగుమతుల్లో 99.38 శాతం ఉత్పత్తులపై జీరో–డ్యూటీ అమల్లోకి రానుంది. → భారతీయ సంప్రదాయ ఔషధాలపైనా ఒమన్ సున్నా సుంకాలు విధించబోతోంది. దీనివల్ల ఇండియాలోని ఆయుష్, వెల్నెస్ రంగాలకు లబ్ధి చేకూరనుంది. → భారత్ నుంచి ఎగుమతి అయ్యే బంగారు ఆభరణాలు, తోలు, పాదరక్షలు, క్రీడా పరికరాలు, సామగ్రి, ప్లాస్టిక్, ఫరి్నచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఫార్మా, వైద్య పరికరాలు, ఆటోమొబైల్ పరికరాలపై ఎలాంటి పన్ను ఉండదు. → కంప్యూటర్ సంబంధిత సేవలు, వ్యాపార, వృత్తి సేవలు, ఆడియో–విజువల్, పరిశోధన–అభివృద్ధి, విద్య, ఆరోగ్య సేవలపైనా ఒమన్ ప్రభుత్వం సుంకాలు తగ్గించబోతోంది. ఒమన్ 12.52 బిలియన్ డాలర్ల విలువైన సేవలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఇండియా వాటా కేవలం 5.31 శాతంగా ఉంది. ఎఫ్టీఏతో ఈ వాటా మరింత పెరగనుంది. → భారతీయ వృత్తి నిపుణులకు ఉద్యోగాలు కల్పిచేందుకు ఒమన్ ముందుకొచ్చింది. అకౌంటెన్సీ, టాక్సేషన్, ఆర్కిటెక్చర్, మెడికల్ సంబంధిత రంగాల్లో భారతీయులకు సులువుగా ఉద్యోగాలు లభిస్తాయి. → అంతేకాకుండా భారతీయ కంపెనీల నుంచి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్డీఐ)కు ఒమన్ అనుమతి ఇవ్వనుంది. → ఒమన్ నుంచి దిగుమతి అయ్యే వాటిలో 94.81 శాతం ఉత్పత్తులపై భారత ప్రభుత్వం సుంకాలు రద్దు చేయనుంది. → భారతీయ పరిశ్రమలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం లేదు. ఒమన్ నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు, టీ, కాఫీ, రబ్బర్, పొగాకు, బంగారం, వెండి ఆభరణాలు, పాదరక్షలు, క్రీడాసామగ్రి, కొన్ని రకాల లోహాలపై ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు. వీటిని ఒప్పందంలో చేర్చలేదు. కీలక మిత్రదేశం ఒమన్ → 2006 తర్వాత ఒమన్ ప్రభుత్వం మరో దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. అలాగే గత ఆరు నెలల్లో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో ఇది రెండోది. ఆరు నెలల క్రితం యూకేతో కలిసి ఎఫ్టీఏపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. → ఇండియా, ఒమన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2024–25లో 10.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. → గల్ఫ్ ప్రాంతంలో భారత్కు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి ఒమన్. అంతేకాకుండా భారతదేశ సరుకులు, సేవలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలకు చేరడానికి ఒమన్ ఒక ముఖద్వారంగా ఉపయోగపడుతోంది. → ఒమన్లో దాదాపు 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. 300 ఏళ్ల క్రితమే స్థిరపడిన భారతీయ వ్యాపార కుటుంబాలు కూడా ఉన్నాయి. → ఒమన్లో 6 వేలకుపైగా భారతీయ కంపెనీలు వివిధ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. → ఒమన్లోని భారతీయులు ప్రతిఏటా 2 బిలియన్ డాలర్లను భారత్కు పంపిస్తున్నారు. → 2000 ఏప్రిల్ నుంచి 2025 సెపె్టంబర్ మధ్య ఒమన్ నుంచి భారత్కు 615.54 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. -
సమమా... సొంతమా!
అహ్మదాబాద్: సిరీస్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు శుక్రవారం దక్షిణాఫ్రికాతో చివరి టి20 మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా రెండు విజయాలు సాధించగా... దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ నెగ్గింది. మరో మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు అయింది. దీంతో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ 2–1తో ముందంజలో ఉంది. చివరి మ్యాచ్లో నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా... సుదీర్ఘ పర్యటనను విజయంతో ముగించి సిరీస్ను సమం చేయాలని సఫారీలు చూస్తున్నారు. ఈ టూర్లో భాగంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ నెగ్గగా... టీమిండియా వన్డే సిరీస్ సొతం చేసుకుంది. ఇప్పుడిక టి20 విజేతను తేల్చే మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది. గాయం కారణంగా గత మ్యాచ్కు దూరమైన భారత వైస్ కెపె్టన్ శుబ్మన్ గిల్... జట్టుతో పాటు అహ్మదాబాద్ చేరుకున్నాడు. దీంతో తుది జట్టులో సామ్సన్కు చోటు దక్కుతుందా లేక గిల్ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సఫారీ జట్టు సిరీస్ సమం చేసి సగర్వంగా స్వదేశానికి తిరిగి వేళ్లాలని చూస్తోంది. అహ్మదాబాద్ పిచ్ అటు బ్యాటింగ్కు, ఇటు బౌలింగ్కు సమానంగా సహకరించనున్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయమే! సూర్యకుమార్ సత్తా చాటేనా! స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఆడిన 18 ఇన్నింగ్స్ల్లో సూర్యకుమార్ 14.20 సగటుతో 213 పరుగులు మాత్రమే చేశాడు. అతడు తనకు అలవాటైన మూడో స్థానంలో బరిలోకి దిగి భారీ ఇన్నింగ్స్తో అనుమానాలను పటాపంచలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టి20 వరల్డ్కప్నకు ముందు టీమిండియా మరో ఆరు మ్యాచ్లు మాత్రమే ఆడనున్న నేపథ్యంలో... అటు ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇటు సిరీస్ చేజిక్కించుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ వ్యూహాలు రచిస్తోంది. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. అతడు కాసేపు క్రీజులో నిలిస్తే చాలు ప్రత్యర్థి బౌలర్ల గణాంకాలు తారుమారు కావడం ఖాయమే. ఇక మరో ఓపెనర్గా గిల్, సామ్సన్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. హైదరాబాద్ ప్లేయర్ ఠాకూర్ తిలక్ వర్మ నిలకడ కొనసాగిస్తున్నా... బ్యాటింగ్లో మరింత వేగం పెంచాల్సిన అవసరముంది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా భారీ షాట్లు ఆడగల సమర్థులే. అయితే వీరంతా కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది. బుమ్రా రాకతో బౌలింగ్ విభాగం పటిష్టమవగా... మరోసారి వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు. మార్క్రమ్పై ఆశలు టెస్టు సిరీస్ విజయంతో ఈ పర్యటనను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు టి20 సిరీస్ను సమం చేయడంతో... ముగించాలని చూస్తోంది. బ్యాటింగ్లో నైపుణ్యానికి కొదవ లేకపోయినా... వారంతా సమష్టిగా రాణించలేకపోవడమే సఫారీ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతుంటే... మరో ఓపెనర్ డికాక్ నిలకడలేమితో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో డికాక్తో కలిసి మార్క్రమ్ ఇన్నింగ్స్ను ఆరంభించవచ్చు. భారత పిచ్లపై మంచి అవగాహన ఉన్న డికాక్, మార్క్రమ్ రాణిస్తే సఫారీ జట్టుకు తిరుగుండదు. బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, కార్బిన్ బాష్ రూపంలో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లో యాన్సెన్, ఎన్గిడి, బాష్, బార్ట్మన్ కీలకం కానున్నారు.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, గిల్/సామ్సన్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా/వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, బాష్, లిండే/కేశవ్, ఎన్గిడి, బార్ట్మన్. -
ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం
మస్కట్: భారత్ -ఒమన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ గౌరవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.సుల్తాన్ హైతమ్ స్వయంగా ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించారు. భారత్-ఒమాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన దూరదృష్టి, నాయకత్వం, పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.భారత్–ఒమాన్ మధ్య 1950లలో ప్రారంభమైన దౌత్య సంబంధాలు ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సముద్ర భద్రత, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో సహకారం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ గౌరవం ప్రతీకాత్మకంగా నిలిచింది.ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్భారత్-ఒమాన్ ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెట్టనున్నాయి. మస్కట్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) పై కీలక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఇంధన, సముద్ర భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.12 బిలియన్ డాలర్ల వాణిజ్యం భారత్–ఒమన్ మధ్య ప్రస్తుతం సుమారు 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఎఫ్టీఏ అమల్లోకి వస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఔషధాలు,వ్యవసాయ ఉత్పత్తులు,ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోకెమికల్స్ వంటి రంగాలకు భారీగా లాభం చేకూరనుంది. ఒమాన్, భారత సముద్ర భద్రతా వ్యూహంలో కీలక భాగస్వామి. అరేబియా సముద్రం, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ రంగంలో సంయుక్త విన్యాసాలు, నౌకాదళ సహకారం మరింత పెరగనున్నాయి.ఒమన్లో సుమారు 7 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై కూడా ఇరుపక్షాలు చర్చించాయి. వీసా సౌకర్యాలు, కార్మిక ఒప్పందాల సరళీకరణపై ఒమన్ సానుకూలంగా స్పందించినట్లు వర్గాలు తెలిపాయి.అంతకుముందు మస్కట్లో ప్రధాని మోదీకి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. సుల్తాన్ హైతమ్తో జరిగిన సమావేశం అనంతరం మోదీ, ఒమాన్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి బంధం మరింత బలపడుతోంది అని పేర్కొన్నారు. -
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
-
భారత ఆర్థిక డీఎన్ఏ మారింది: మస్కట్లో ప్రధాని మోదీ
మస్కట్: గడచిన 11 ఏళ్ల కాలంలో భారత్ తన విధివిధానాలను మార్చుకోవడమే కాకుండా, తన దేశ ఆర్థిక డీఎన్ఏనే సమూలంగా మార్చుకున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒమన్ పర్యటనలో భాగంగా గురువారం మస్కట్లో నిర్వహించిన ‘ఇండియా-ఒమన్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. భారతదేశం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు నేడు దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వ మార్కెట్లలో ఒకటిగా నిలిపాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కుదురుతున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) 21వ శతాబ్దపు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను, వేగాన్ని ఇస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.Landed in Muscat, Oman. This is a land of enduring friendship and deep historical connections with India. This visit offers an opportunity to explore new avenues of collaboration and add fresh momentum to our partnership. pic.twitter.com/RKZ5d8M1Jf— Narendra Modi (@narendramodi) December 17, 2025దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడిన కీలక సంస్కరణలను ప్రస్తావిస్తూ, జీఎస్టీ (GST) అమలు ద్వారా భారతదేశం ఒకే సమీకృత మార్కెట్గా ఆవిర్భవించిందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) వంటి నిర్ణయాలు దేశంలో ఆర్థిక క్రమశిక్షణను పెంచి, పారదర్శకతను పెంపొందించాయని వివరించారు. ఈ చర్యల వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భారత్ పట్ల నమ్మకం రెట్టింపు అయిందని, పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోశాయని ఆయన వివరించారు. వ్యాపారవేత్తలతో జరిగిన ఈ సమావేశంలో భారత ఆర్థిక ప్రగతి పథాన్ని ఆయన గణాంకాలతో సహా వివరించారు. భారత్-ఒమన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాండవి నుంచి మస్కట్ వరకు వ్యాపించి ఉన్న అరేబియా సముద్రం రెండు దేశాల సంస్కృతులను, ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక బలమైన వారధి అని ఆయన వ్యాఖ్యానించారు. పూర్వీకుల కాలం నుంచే సముద్ర వాణిజ్యంలో ఇరు దేశాలు సుసంపన్నమైన వారసత్వాన్ని కలిగి ఉన్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్నేహం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని మోదీ ఆకాంక్షించారు.ఇరు దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జోర్డాన్, ఇథియోపియా పర్యటనలను ముగించుకుని సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ఒమన్ చేరుకున్న ప్రధాని, రెండు రోజుల పాటు ఇక్కడ వివిధ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వాణిజ్య రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడం, భవిష్యత్ ప్రణాళికల కోసం ఒక బ్లూప్రింట్ సిద్ధం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఇది కూడా చదవండి: శిల్పకళా భీష్మాచార్యుడు రామ్ సుతార్ కన్నుమూత -
చైనా డ్యామ్ కుట్ర.. భారత్కు పెను ముప్పు తప్పదా?
హిమాలయాల నుంచి భారత్, బంగ్లాదేశ్లలోకి ప్రవహిస్తూ, కోట్లాది మందికి జీవనాధారమైన బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. టిబెట్లోని యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై సుమారు $168 బిలియన్ల(సుమారు రూ. 1,51,860 కోట్లు) వ్యయంతో బీజింగ్ ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును చేపట్టింది. ఇది పర్యావరణానికే కాకుండా, భారత్ వంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలను కూడా దెబ్బతీయనుంది.పర్యావరణ సమతుల్యతకు విఘాతంఈ ప్రాజెక్టులో భాగంగా నది సహజ ప్రవాహాన్ని మళ్లించేలా డ్యామ్లు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నది ఎత్తులో ఉండే 2,000 మీటర్ల మార్పును చైనా వాడుకోనుంది. అయితే ఈ జోక్యం వల్ల నది సహజ ప్రవాహం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చేపల వలసలు, అవక్షేపాల కదలికలు మారిపోయి, దిగువ ప్రాంతాల్లో వ్యవసాయం , జీవవైవిధ్యంపై కోలుకోలేని దెబ్బ పడే ప్రమాదం ఉంది.‘వాటర్ బాంబ్’ కానుందా?చైనా చర్యలను అరుణాచల్ ప్రదేశ్ తదితర సరిహద్దు రాష్ట్రాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. చైనా ఎప్పుడు నీటిని విడుదల చేస్తుందో, ఎప్పుడు నిలిపివేస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. అత్యవసర సమయాల్లో భారీగా నీటిని వదిలితే కృత్రిమ వరదలు, నిలిపివేస్తే కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును భారత్పై ప్రయోగించే ఒక ‘వాటర్ బాంబ్’గా ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు అభివర్ణించడం గమనార్హం.భౌగోళిక రాజకీయ వ్యూహాలుపర్యావరణ కోణంలోనే కాకుండా, ఈ ప్రాజెక్టు వెనుక చైనా రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను పెంచుకోవడం ద్వారా టిబెట్, భారత్ సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధించాలని బీజింగ్ యోచిస్తోంది. మెకాంగ్ నది విషయంలో కూడా చైనా ఇలాగే వ్యవహరించి.. వియత్నాం వంటి దేశాల్లో కరువుకు కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి.చెదిరిపోతున్న స్థానిక జీవనంఈ మెగా ప్రాజెక్టు కారణంగా టిబెట్లోని మోన్పా, లోబా వంటి స్థానిక తెగలకు చెందిన వేలాదిమంది ప్రజలు తమ పూర్వీకుల గృహాలను వదులుకోవాల్సి వస్తోంది. బలవంతపు తరలింపుల వల్ల స్థానిక సంస్కృతి, ఉపాధి వనరులు నాశనమవుతాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్థానికుల స్థానంలో ఇతర ప్రాంతాల వలస కార్మికులను తీసుకురావడం ద్వారా ఆ ప్రాంత జనాభా స్వరూపాన్ని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని టిబెట్ పాలసీ ఇన్స్టిట్యూట్ విమర్శించింది.భారత్ ముందస్తు చర్యలుచైనా కదలికలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం, సరిహద్దు ప్రాంతాల పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకు సిద్ధమవుతోంది. చైనా డ్యామ్కు ప్రతిగా బ్రహ్మపుత్రపై సుమారు 11,200 మెగావాట్ల సామర్థ్యం గల భారీ డ్యామ్ను నిర్మించాలని భారత్ ప్రతిపాదించింది. అయితే ఇరు దేశాల మధ్య ఈ ‘డ్యామ్ నిర్మాణ రేసు’ పర్యావరణానికి మరింత ముప్పు తెస్తుందని, రెండు దేశాలు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘సెవెన్ సిస్టర్స్’పై దారుణ వ్యాఖ్యలు.. ‘బంగ్లా’పై భారత్ సీరియస్ -
ఢాకాలో భారత హైకమిషన్ వద్ద కలకలం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తోందన్న అక్కసుతో, ఆమెను తిరిగి అప్పగించాలన్న డిమాండ్తో బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వ అనుకూల ఆందోళనకారులు బుధవారం పేట్రేగిపోయారు. ఢాకాలోని ఇండియన్ భారత హైకమిషన్ను ముట్టడించేందుకు వందలాది మంది ర్యాలీగా వచ్చారు. బ్యారీకేడ్లను ఏర్పాటుచేసినా వాటిని ధ్వంసంచేసుకుంటూ నిరసకారులు ముందుకొచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జూలై ఐక్యత బ్యానర్ పట్టుకుని ఆందోళనకారులు నిరసన కొనసాగించారు. భారత్కు పారిపోయిన హసీనా, ఇతర అగ్రనేతలు, ఉన్నతాధికారులను తిరిగి అప్పగించాలని డిమాండ్చేశారు. ‘‘ మేం ఇండియన్ హైకమిషన్పై దాడిచేయబోం.కానీ పరోక్షంగా మా దేశాన్ని ఆధిపత్యం చెలాయించేందకు యతి్నస్తే చూస్తూ ఊరుకోం’’ అని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అనూహ్య ఘటనతో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యవేత్త రియాజ్ హమీదులాల్హ్ను తన కార్యాలయానికి తక్షణం రావాలంటూ ఆయనకు భారతవిదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. ఆఫీస్కు వచ్చిన రియాజ్పై మోదీ సర్కార్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ‘‘ ఇటీవలకాలంలో బంగ్లాదేశ్లో భద్రతా పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతున్నాయి. భారత వ్యతిరేక పుకార్లు షికార్లుచేస్తున్నాయి. ఈ తప్పుడు కథనాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. బెదిరింపుల వంటి ఘటనలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, పత్రాలనూ మాతో పంచుకోవట్లేదు’’ అని ఆయనతో కేంద్రప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తంచేసింది. భారత వీసా కేంద్రం మూసివేత పరిస్థితులు అదుపు తప్పొచ్చనే అంచనాతో ముందస్తు చర్యగా ఢాకాలోని భారత వీసా జారీ కేంద్రాన్ని మోదీ సర్కార్ మూసేసింది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్లో ఈ ‘ది ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్(ఐవీఏసీ)’ ఉంది. ఢాకాలోని అన్ని భారతీయ వీసా సేవా సెంటర్లకు ఇదే సమీకృత కేంద్రంగా పనిచేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన వీసాల దరఖాస్తుల పరిశీలనను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఐవీఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
మనది సహజ భాగస్వామ్యం
అడిస్ అబాబా: ప్రాంతీయ శాంతి, భద్రత, అనుసంధానంలో భారత్, ఇథియోపియాలు సహజ భాగస్వామ్య దేశాలు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ శాంతి, సమానత్వం, ప్రగతి కోసం రెండు దేశాలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని ఉద్ఘాటించారు. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం మంగళవారం ఇథియోపియా చేరుకున్న ప్రధాని మోదీ బుధవారం దేశ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ‘తేనా ఇస్టిలిన్ సలామ్’ అంటూ స్థానిక భాషలో ఎంపీలకు అభివాదం చేశారు. సింహాల గడ్డగా ప్రసిద్ధి చెందిన ఇథియోపియాలో అడుగుపెట్టడం అద్భుతంగా ఉందన్నారు. ఇక్కడికి వస్తే సొంత ఇంటికి వచ్చినట్లే ఉంటుందని, తన సొంత రాష్ట్రం గుజరాత్ కూడా సింహాలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ప్రధానమంత్రి హోదాలో మోదీ ప్రసంగించిన విదేశీ పార్లమెంట్లలో ఇది 18వ పార్లమెంట్ కావడం విశేషం. ఆయన మాట్లాడుతుండగా ఇథియోపియా ఎంపీలు 50 సార్లకుపైగా చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తంచేశారు. శుభాకాంక్షలు మోసుకొచ్చా.. ‘‘ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా కీలక స్థానంలో ఉంది. హిందూ మహాసముద్రంలో భారత్ హృదయ స్థానంలో నిలిచింది. ఇరుదేశాలు సహజ భాగస్వామ్య దేశాలు. ఈ ఏడాది కుదుర్చుకున్న రక్షణ సహకార ఒప్పందంతో పరస్పర భద్రత పట్ల అంకితభావం మరింత బలపడింది. భారత్, ఇథియోపియాలు ఒక కుటుంబంగా కలిసి ఉంటున్నాయి. ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకోవడంతోపాటు ప్రపంచ సౌభాగ్యం కోసం కృషి చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్కు అండగా నిలిచినందుకు ఇథియోపియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉగ్రవాదంపై అవిశ్రాంతంగా పోరాటం కొనసాగిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశాలయంలో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 140 కోట్ల మంది భారతీయుల తరఫున శుభాకాంక్షలు మోసుకొచ్చా. జన్మభూమి మన కన్నతల్లి ప్రపంచంలో ప్రాచీన నాగరికతల్లో ఇథియోపియా కూడా ఒకటి. ఇది పాత, కొత్తల సమ్మేళనం. ఇక్కడ ప్రాచీన విజ్ఞానం, ఆధునిక ఆకాంక్షల మధ్య సమతూకం కనిపిస్తోంది. ఇదే ఇథియోపియా అసలైన బలం. భారతదేశ నాగరికత అత్యంత ప్రాచీనమైనది. పూర్తి ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులోకి అడుగులు వేస్తోంది. భారత జాతీయ గీతం, ఇథియోపియా జాతీయ గేయం ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి. జన్మభూమిని కన్నతల్లిగా సంబోధిస్తున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు, జన్మభూమిని కాపాడుకొనే విషయంలో అవే మనకు స్ఫూర్తిదాయకం. ఇథియోపియా అభివృద్ధిలో వేలాది మంది భారతీయ ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మనం పరస్పరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వ్యవసాయమే మనకు వెన్నుముక. మెరుగైన విత్తనాలు, సాగునీటి సరఫరా విధానాలు, భూమిలో సారం పెంచడంపై మనం దృష్టి పెట్టాలి. కలిసికట్టుగా పనిచేయాలి.ప్రజాస్వామ్యం జీవన విధానం ఇథియోపియాలోని కీలక రంగాల్లో భారతీయ కంపెనీలు 5 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టాయి. దీంతో స్థానికంగా 75 వేల ఉద్యోగాల సృష్టి జరిగింది. మన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ఆ దశగానే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించాం. దీనివల్ల టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు, మైనింగ్, క్లీన్ ఎనర్జీ, ఆహార భద్రత వంటి రంగాల్లో రెండుదేశాల బంధం బలపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుంది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో మేము సాధించిన నైపుణ్యాలు, అనుభవాన్ని ఇథియోపియాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్, ఇథియోపియాలు నిఖార్సెన ప్రజాస్వామ్య దేశాలు. ప్రజాస్వామ్యం మన జీవన విధానం. ఇదొక ప్రయాణం. తేనీరు అంటే నాకు ఇష్టం. ఇథియోపియన్ కాఫీ, ఇండియన్ టీ తరహాలోనే మన స్నేహం చక్కటి పరిమళాలు వెదజల్లుతోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత ఇథియోపియా ఎంపీలు మోదీకి ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. పలువురు మంత్రులు, ఎంపీలతో మోదీ మాట్లాడారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్ పే’ కార్యక్రమంలో భాగంగా మోదీ ఇథియోపియా పార్లమెంట్ ప్రాంగణంలో మొక్క నాటారు. మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ఇథియోపియా ప్రభుత్వం భారత ప్రధాని మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిశాన్ ఆఫ్ ఇథియోపియా’ను ప్రదానం చేసింది. ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి విదేశీ నాయకుడు మోదీ కావడం గమనార్హం. ఆయనను ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 28 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాయి. మంత్రముగ్ధులను చేసిన ‘వందేమాతరం’ ప్రధాని మోదీ గౌరవార్థం ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ మంగళవారం ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముగ్గురు ఇథియోపియా గాయకులు భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ను శ్రుతిబద్ధంగా ఆలపించారు. ప్రధాని మోదీ సహా భారత ప్రతినిధులు ముగ్ధులయ్యారు. చప్పట్లతో అభినందించారు. ఇథియోపియా గాయకుల ఆలాపన తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసిస్తూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సంబంధిత వీడియోను సైతం షేర్ చేశారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సమయంలోనే ఈ గీతాన్ని ఇథియోపియా గాయకుల నోటి వెంట వినడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. -
భారత ఫుట్బాల్కు ఉజ్వల భవిత: మెస్సీ
న్యూఢిల్లీ: భారత్లో ఫుట్బాల్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ అన్నాడు. ‘మీ ఆదరణ, మీరు పంచిన ప్రేమాభిమానాలను నాతోపాటు తీసుకెళ్తున్నా. మ్యాచ్ ఆడేందుకైనా... మరో కార్యక్రమానికైనా ఇంకోసారి భారత్కు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. కచ్చితంగా తిరిగి వచ్చే ఆలోచనైతే నాకుంది’ అని మెస్సీ అన్నాడు. తను సందర్శించిన ప్రాంతాల్ని, కలుసుకున్న భారత దిగ్గజాలతో ఉన్న ఒక నిమిషం నిడివిగల వీడియోను మెస్సీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నాడు. ఈ వీడియోలో భారత ప్రముఖ క్రీడాకారులు, సినీ స్టార్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులెందరో ఉన్నారు. కానీ... హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీలతో ఉన్న ఫుటేజీ మాత్రం క్షణమైనా కనిపించలేదు. భారత్లో తన ఐదు రోజుల పర్యటన అద్భుతంగా సాగిందన్నాడు. బుధవారం ముంబై నుంచే మయామికి బయలుదేరాడు. 38 ఏళ్ల అర్జెంటీనా స్ట్రయికర్ తన మయామి క్లబ్ జట్టు సహచరులు స్వారెజ్, రోడ్రిగో డి పాల్లతో కలిసి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చాడు. అయితే మరో రెండు రోజులు పొడిగించాడు. భారత్లోని వివిధ రంగాల ప్రముఖులను, క్రికెట్, ఫుట్బాల్, సినీ స్టార్లను కలుసుకున్నాడు. ముంబైలో సచిన్, మెస్సీల భేటీ వాంఖెడే మైదానానికే వన్నె తెచ్చింది. బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, కరీనా కపూర్, భారత ఫుట్బాల్ మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రి తదితరులు మెస్సీని కలిసిన వారిలో ఉన్నారు. మంగళవారం దేశీ కార్పోరేట్ సంస్థ రిలయన్స్ యాజమాన్యం వంతారాలో అచ్చెరువొందే సదుపాయాలతో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షిత ప్రాంతాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ... మెస్సీకి ఆత్మీయ స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చాడు. ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ అడిడాస్ నిర్వహించిన ఫొటో షూట్లోనూ పాల్గొన్నాడు. ఈ ఫొటో షూట్లో మెస్సీతోపాటు తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్, క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, రేణుక సింగ్, పారాథ్లెట్స్ నిశాద్ కుమార్, సుమింత్ అంటిల్ పాల్గొన్నారు. -
అంధుల మహిళల క్రికెట్ జట్టుకు సచిన్ అభినందన
ముంబై: అంధుల మహిళల టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. తొలిసారి నిర్వహించిన ఈ మెగాటోర్నీలో భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకుంది. తాజాగా వరల్డ్కప్ నెగ్గిన భారత జట్టు... మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ను కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచకప్లో మన అమ్మాయిలు చూపిన ప్రతిభాపాటవాలను మాస్టర్ బ్లాస్టర్ కొనియాడాడని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ‘కఠోర శ్రమ, అకుంఠిత దీక్షతోనే మన జట్టు ప్రపంచకప్ గెలిచింది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు కూడా ఇదే నిలకడ కొనసాగిస్తూ... మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం అందరి బాధ్యతను మరింత పెంచింది. ప్రపంచ కప్ ట్రోఫీ ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది’ అని సచిన్ పేర్కొన్నాడని నిర్వాహకులు తెలిపారు.వరల్డ్కప్ గెలిచిన భారత జట్టు కెపె్టన్ దీపిక మాట్లాడుతూ... ‘సచిన్ మాటలు మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మేము మైదానంలోకి దిగిన ప్రతిసారీ ఎంతో అంకితభావం, ఆత్మవిశ్వాసంతో ఆడాం. దానికి తగ్గ ప్రతిఫలం వరల్డ్ కప్ రూపంలో దక్కింది. సచిన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినడంతో మా మనసు ఉప్పొంగుతోంది’ అని దీపిక పేర్కొంది. -
మ్యాచ్కు ‘పొగ’బెట్టిన ‘మంచు’
వర్షం కారణంగా... మైదానం చిత్తడిగా ఉండటం మూలంగా... ప్రమాదకర పిచ్లు రూపొందించినందుకు... తమ జట్ల పేలవ ప్రదర్శనకు నిరసనగా అభిమానుల ఆగ్రహాంతో... అంతర్జాతీయ క్రికెట్లో అర్ధంతరంగా మ్యాచ్లు రద్దయిన సంఘటనలు చూశాం. కానీ బుధవారం భారత్–దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన టి20 మ్యాచ్కు పైవేవీ ఆటంకం కలిగించలేదు. ఊహించని విధంగా మితిమీరిన పొగమంచు అడ్డంకిలా మారింది. దాంతో కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా దక్షిణాఫ్రికాపై టి20 సిరీస్ నెగ్గాలంటే రేపు అహ్మదాబాద్లో జరిగే చివరి మ్యాచ్లో భారత్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్నో: ఇక ఈ టి20 సిరీస్ భారత్ గెలవొచ్చు. లేదంటే పర్యాటక దక్షిణాఫ్రికాతో పంచుకోవచ్చు. ఎందుకంటే ఆఖరి పోరులో గెలిస్తే సిరీస్ 3–1తో టీమిండియా వశమవుతుంది. కానీ ఓడితే 2–2తో సమమవుతుంది. మొత్తానికి పొగమంచు సిరీస్ ఫలితాన్ని సైతం అటుఇటూ కాకుండా చేసేసింది. బుధవారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడి ఎకానా స్టేడియంలో జరగాల్సిన నాలుగో టి20 మ్యాచ్ రద్దయ్యింది. పొగమంచు, ప్రతికూల వాతావరణం మ్యాచ్కు అవరోధంగా నిలిచింది. మొదట టాస్ ఆలస్యం అని టీవీల్లో బోర్డు కనిపించింది. సమయం గడుస్తున్నకొద్దీ ఫీల్డ్ అంపైర్లు అనంత పద్మనాభన్, రోహన్ పండిట్లు మ్యాచ్ నిర్వహణ కోసం మైదానాన్ని, మంచు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. కనీసం 6 ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహించాలని వేచి చూశారు. చివరకు రాత్రి 9 గంటల 25 నిమిషాలకు ఆరోసారి మైదానాన్ని సమీక్షించి మ్యాచ్ నిర్వహించడం సాధ్యపడదని ప్రకటించారు. మంచు దుప్పటి కప్పేసింది! భారత్లో శీతాకాలం సీజన్ ఇది. పైగా డిసెంబర్ మధ్య నుంచి జనవరి అసాంతం చలి పులిలా పంజా విసురుతుంది. ఇక ఉత్తర భారతమైతే సూర్యుడు ఉదయించాక కూడా వణుకు తప్పదు. ఉదయం, రాత్రి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. పొగమంచు కమ్ముతుంది. కంటికేది కనిపించదు. బుధవారం రాత్రి కూడా సరిగ్గా ఇదే జరిగింది. గరం గరం చేసే హైమాస్ట్ ఫ్లడ్లైట్లు అన్నీ వెలిగించినా కూడా మంచుదుప్పటి ముందు ఆ వెలుగు కూడా దిగదుడుపే అయ్యింది. పొగమంచు మ్యాచ్ జరగకుండా మైదానాన్ని కప్పేయడంతో ఫీల్డు అంపైర్లు పలుమార్లు సమీక్షించి మ్యాచ్ రద్దుకు నిర్ణయించారు. చివరిసారిగా రాత్రి 9.25 గంటలకు మైదానంలోని పరిస్థితిని సమీక్షించాక ఇక మ్యాచ్ జరిగే అవకాశం లేదని ఫీల్డ్ అంపైర్లు తేల్చారు. ఇంతటి చలిని లెక్కచేయకుండా, మంచు కురిసే వేళలో మ్యాచ్ కోసం నిరీక్షిస్తున్న ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్న అంపైర్లు అనంత పద్మనాభన్, రోహన్లు ఆలస్యం చేయకుండా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు జెండాలు, అభిమాన క్రికెటర్ల ఫొటోలు, 4, 6 బోర్డులను ఊపుతూ ఉత్సాహంగా కనిపించిన ప్రేక్షకులు నిరాశగా వెనుదిరగడం మొదలు పెట్టారు. గిల్ అవుట్ భారత టెస్టు, వన్డేల కెపె్టన్ శుబ్మన్ గిల్ కూడా ప్రస్తుత సిరీస్కు దూరమయ్యాడు. అసలే ఈ ఓపెనర్ ఫామ్లేమీతో తంటాలు పడుతున్నాడు. ట్రెయినింగ్ సెషన్లో అతని బొటనవేలికి గాయమైంది. దీంతో ఈ నాలుగో టి20తో పాటు రేపు అహ్మదాబాద్లో జరిగే ఆఖరి మ్యాచ్కూ అందుబాటులో లేకుండా పోయాడు. ఇతని స్థానంలో సంజూ సామ్సన్ బరిలోకి దిగుతాడు. ఇప్పటికే పేస్ ఎక్స్ప్రెస్ బుమ్రా, స్పిన్నర్ అక్షర్ పటేల్ సైతం ఈ సిరీస్కు దూరమమైన సంగతి తెలిసిందే. టిక్కెట్ల డబ్బులు తిరిగి చెల్లింపు మ్యాచ్ మొదలవకుండానే రద్దయ్యింది. కనీసం టాస్కు కూడా నోచుకోలేదు. దీంతో నిబంధనల ప్రకారం టిక్కెట్లకు ప్రేక్షకులు వెచ్చించిన రుసుమును తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తామని స్టేడియం వర్గాలు వెల్లడించాయి. -
బంగ్లాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
బంగ్లాదేశ్ నేతల విద్వేశపూరిత ప్రసంగాల నేపథ్యంలో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని ఇండియా వీసా కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసేస్తున్నట్లు ప్రకటించింది. తీవ్రవాదుల నుంచి ముంపు పొంచిఉన్న నేపథ్యంలో దేశ భద్రతకై ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇండియన్ వీసా సెంటర్ తన కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేసింది. ఇటీవల బంగ్లాదేశ్కి చెందిన నేత భారత్ను విచ్ఛిన్నం చేసే వారికి తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని తద్వారా సెవెన్ సిస్టర్స్ ప్రాంతం చీలిపోయే అవకాశం ఉందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఆదేశ రాయభారి రియాజ్ హమీదుల్లాకి సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి శాంతి భద్రతల సమస్య పొంచిఉన్న నేపథ్యంలో ఆ బంగ్లాదేశీయులకు భారత వీసా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.అసలేం జరిగింది.బంగ్లాదేశ్లో అల్లర్ల నేపథ్యంలో ఆదేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్నారు. అయితే ఆమెకు వివిధ కేసుల్లో మరణశిక్షతో పాటు 21 సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ షేక్ హసీనాను ఆదేశానికి అప్పగించాలని భారత్ను కోరింది. ఈవిషయంపై ఇండియా ఇంకా స్పందించలేదు. ఇంతలోనే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్పై విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. భారత్కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్లో ఆశ్రయం కల్పిస్తామని దాని వల్ల భారత్నుంచి ఈశాన్య ప్రాంతం సెవెన్సిస్టర్స్ వేరయ్యే అవకాశం ఉందన హెచ్చరించారు. దీనిపై సీరియస్ అయిన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హైకమిషనర్ని వివరణ కోరింది. తాజాగా బంగ్లాదేశీయులకు భారత వీసాను నిలిపివేసింది. -
‘సెవెన్ సిస్టర్స్’పై దారుణ వ్యాఖ్యలు.. ‘బంగ్లా’పై భారత్ సీరియస్
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత్తో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు బంగ్లాదేశ్ వ్యవహరిస్తోంది. తాజాగా భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను భారతదేశం నుండి వేరు చేస్తామంటూ హస్నత్ అబ్దుల్లా చేసిన రెచ్చగొట్టే ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా స్పందించింది. బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్ను పిలిపించి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది.ఢాకాలోని షహీద్ మినార్ వద్ద జరిగిన బహిరంగ సభలో అబ్దుల్లా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని తప్పుబట్టారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించని వారికి భారత్ అండగా నిలిస్తే, తాము కూడా భారత్కు వ్యతిరేకంగా పనిచేసే వేర్పాటువాద శక్తులకు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్లో అస్థిరత ఏర్పడితే, ఆ అగ్ని జ్వాలలు సరిహద్దులు దాటి భారతదేశానికి కూడా వ్యాపిస్తాయంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి నరికివేసేలా (చికెన్ నెక్ కారిడార్ను ఉద్దేశించి) బంగ్లాదేశ్ తన వ్యూహాలను అమలు చేయగలదని అబ్దుల్లా పేర్కొనడం కలకలం రేపింది. అస్సాం, మేఘాలయ, త్రిపుర తదితర రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సుదీర్ఘ భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ వేర్పాటువాద శక్తులను ప్రోత్సహిస్తామనే బంగ్లాదేశ్ హెచ్చరికను భారత్ భద్రతా పరమైన ముప్పుగా భావిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా భారత్ తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని అబ్దుల్లా ఆరోపించారు.ఈ పరిణామాల నేపథ్యంలో, బంగ్లాదేశ్లో మారుతున్న రాజకీయ పరిణామాలు, భారత్ పట్ల పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు పొరుగు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు. అస్థిరతను సృష్టించే శక్తులకు చోటు ఇవ్వొద్దని, బాధ్యతాయుతమైన రీతిలో వ్యవహరించాలని భారత్ ఈ సందర్భంగా బంగ్లాదేశ్ రాయబారికి స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: పుస్తకాల మధ్య ప్రాణవాయువు.. ‘అతుల్’ కష్టం ఎవరికీ వద్దు! -
సిరీస్ సొంతం చేసుకోవాలని...
స్టార్ బ్యాటర్ల వరుస వైఫల్యాలు... కీలక బౌలర్లకు గాయాలు... గైర్హాజరీలు... అయితేనేం జోరు కొనసాగించాలని.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకోవాలని... సూర్యకుమార్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు దక్షిణాఫ్రికాతో భారత జట్టు నాలుగో టి20 మ్యాచ్ ఆడనుంది. ఆతిథ్య జట్టులోని ప్రతికూలతల్ని సొమ్ము చేసుకొని లక్నో వేదికను లక్కీగా మలచుకోవాలని పర్యాటక దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. ఫలితంగా ఈ మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. లక్నో: భారత్ ఇక్కడ కాకపోతే... అహ్మదాబాద్ (ఆఖరి మ్యాచ్ వేదిక)లోనైనా సిరీస్ను గెలిచే ధీమాతో బరిలోకి దిగుతుండగా... దక్షిణాఫ్రికా ఇక్కడ ఓడితే ఇక్కడే సిరీస్ను ఆతిథ్య జట్టు చేతిలో పెట్టేసే భయంతో మ్యాచ్ ఆడనుంది. ఈ కారణంతోనే సిరీస్లో పైచేయి సాధించిన టీమిండియా రెట్టింపు హుషారుతో సమరానికి సై అంటోంది. గత మ్యాచ్లో స్పిన్, పేస్, బ్యాటింగ్ అన్నీ కలిసి ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని చిత్తు చేసిన సూర్యకుమార్ బృందం గత ‘షో’ను పునరావృతం చేస్తే ఈ మ్యాచ్ గెలుపు, సిరీస్ కైవసం ఏమాత్రం కష్టం కానేకాదు. ఇక సఫారీ పరిస్థితి పూర్తి భిన్నం! మ్యాచ్లో గెలిచేందుకు లక్నోలో సిరీస్ను సమం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తుంది. కెప్టెన్ మార్క్రమ్ ఫామ్కు, డికాక్ మెరుపులు తోడైతే పరుగుల వరద పారే అవకాశముంది. ఆ ఇద్దరిపై ఒత్తిడి భారత జట్టు ఫలితాల పరంగా పైచేయిగా కనిపిస్తోంది. అలాగని జట్టులోని అందరి ప్రదర్శన బాగుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! నాయకుడు సూర్యకుమార్ మెరిపించి చాలా రోజులైంది. గత 21 ఇన్నింగ్స్లుగా అతను చెప్పుకోదగ్గ ప్రదర్శనేది లేదు. ఫిఫ్టీ చేసి ఏడాది దాటింది. పోయిన ఏడాది అక్టోబర్లో అర్ధశతకం సాధించాక మళ్లీ అలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. ఇక ఓపెనింగ్లో శుబ్మన్ గిల్ వరుస వైఫల్యాలు బ్యాటింగ్ ఆర్డర్పై పెనుభారమే మోపుతోంది. గత మ్యాచ్లో 28 పరుగులు చేశాడు. కానీ 28 బంతులాడాడు. ఓ టాపార్డర్ బ్యాటర్కు... పైగా టి20ల్లో ఇది అత్తెసరు స్కోరే అవుతుంది. అభిషేక్ శర్మ, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మలతో భారత్ బ్యాటింగ్లో గట్టెక్కుతుంది. బౌలింగ్ విభాగానికి వస్తే... భారత పేస్ ఎక్స్ప్రెస్ బుమ్రా ఈ మ్యాచ్కూ అందుబాటులో లేడు. తన సన్నిహితుడొకరు ఆస్పత్రిపాలవడంతో గత మ్యాచ్కు ముందే జట్టును వీడాడు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆఖరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. వీళ్లిద్దరు గత మ్యాచ్ కూడా ఆడనప్పటికీ... ఇది భారత బౌలింగ్ దళంపై ఒత్తిడిని పెంచే అంశం. ఏదో ఒక మ్యాచ్లో నెట్టుకురావొచ్చు. కానీ ప్రతీ మ్యాచ్లోనూ కీలక ఆటగాళ్లు బరిలోకి దిగకపోతే ఏ జట్టుకైన అది ప్రతికూలాంశమే! హెండ్రిక్స్ ఘోర వైఫల్యం ప్రత్యర్థి దక్షిణాఫ్రికా సైతం టాపార్డర్ వైఫల్యంతో తడబడుతూనే ఉంది. ఓపెనర్లలో హెండ్రిక్స్ పేలవమైన ఆటతీరుతో టాపార్డర్కే కాదు మొత్తం జట్టుకే భారంగా పరిణమించాడు. ఒక మ్యాచ్లో 8, ఒకో మ్యాచ్లో డకౌట్. ఇక డికాక్ ఒక్క రెండో టి20 మినహా మిగతా రెండు మ్యాచ్ల్లోనూ 0, 1 సింగిల్ డిజిట్లే! ఇద్దరు ఓపెనర్లు ఘోరంగా ఆడుతుండటంతో దక్షిణాఫ్రికాకు శుభారంభం కాదు కదా కనీసం ఓ మోస్తరు భాగస్వామ్యమైనా దక్కడం లేదు. ఇది మొత్తం ఇన్నింగ్స్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కెప్టెన్ మార్క్రమ్ సహా మిడిలార్డర్ బ్యాటర్లలో బ్రెవిస్, ఫెరిరా, మిల్లర్లతో జట్టు నెట్టుకొస్తుంది. కానీ నెగ్గాలంటే మాత్రం టాపార్డర్ కీలకం కదా! బౌలింగ్లో అనుభవజు్ఞలైన ఎన్గిడి, యాన్సెన్లతో పాటు ఒటెనిల్ బార్ట్మన్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే సిరీస్ను సమం చేయాల్సిన ఈ మ్యాచ్లో మాత్రం ఏ ఒకరిద్దరు బౌలర్లో, బ్యాటర్లో కాదు సమష్టిగా రాణిస్తేనే పటిష్టమైన భారత్ను నిలువరిస్తుంది. లేదంటే గత ఫలితాలే పునరావృతం కాకతప్పదు. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, శుబ్మన్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అర్‡్షదీప్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్ ), డికాక్, రిజా హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరిరా, యాన్సెన్, బాష్, జార్జ్ లిండే/కేశవ్, ఎన్గిడి, బార్ట్మన్.పిచ్, వాతావరణంలక్నో స్పిన్ ఫ్రెండ్లీ వికెట్. తప్పకుండా బ్యాటింగ్ దిగిన జట్టుకు స్పిన్నర్ల నుంచి సవాళ్లు తప్పవు. అయితే మంచు ప్రభావం వల్ల రెండో ఇన్నింగ్స్ అంటే ఛేదించే జట్టుకే అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్కేమొగ్గుచూపుతుంది.. చలి తప్ప వాన ముప్పు లేదు. -
ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్లు
అమ్మాన్: భారత్–జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు రెట్లు వృద్ధి చెందాలని, రాబోయే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత్లో ఆర్థిక అభివృద్ధికి అత్యధిక అవకాశాలు ఉన్నాయని, భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జోర్డాన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ మంగళవారం రాజధాని అమ్మాన్లో జోర్డాన్ రాజు అబ్దుల్లా–2, యువరాజు అల్ హుస్సేన్తో కలిసి బిజినెస్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తోందని చెప్పారు. త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో వ్యాపార అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 140 కోట్ల మందితో కూడిన వినియోగ మార్కెట్, బలమైన తయారీ కేంద్రాలు, స్థిరమైన, పారదర్శక ప్రభుత్వ విధానాలు భారత్ సొంతమని వెల్లడించారు. ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్–జోర్డాన్ మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత బలపడనుందని ఉద్ఘాటించారు. ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు బలోపేతం కావాలని చెప్పారు. పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలి ‘‘భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతానికిపైగానే వృద్ధి సాధిస్తోంది. ఉత్పత్తికి ప్రోత్సాహం ఇచ్చే పాలన, నవీన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే విధానాల వల్ల జీడీపీ అత్యధికంగా నమోదవుతోంది. జోర్డాన్కు మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామి భారత్. నేటి వ్యాపార ప్రపంచంలో అంకెలే కీలకం. కానీ, నేను అంకెలు వల్లెవేయడానికి ఇక్కడికి రాలేదు. గణాంకాలకు అతీతంగా జోర్డాన్తో దీర్ఘకాలిక, విశ్వసనీయ సంబంధాలు నిర్మించుకోవడానికి వచ్చా. ఇరుదేశాల నాగరికతల మధ్య చక్కటి సంబంధాలున్నాయి. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇండియాలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఐటీ, ఫిన్టెక్, హెల్త్టెక్, అగ్రిటెక్ రంగాలతోపాటు విభిన్న స్టార్టప్లలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, వైద్య పరికరాల తయారీ రంగాలు ఇండియాకు ప్రధాన బలం.భౌగోళికంగా కీలక స్థానంలో జోర్డాన్కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫార్మా, వైద్య పరికరాల విషయంలో పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాలకు జోర్డాన్ ఒక హబ్గా మారాలి. అలాగే వ్యవసాయం, కోల్డ్ చైన్, ఫుడ్ పార్కులు, ఎరువులు, మౌలిక సదుపాయాలు, అటోమొబైల్, హరిత రవాణా, సాంస్కృతిక పర్యాటకం వంటి రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలి. పునరుత్పాదక ఇంధన వనరులు, నిర్లవణీకరణ, నీటి శుద్ధి, పునరి్వనియోగం వంటి అంశాల్లో రెండు దేశాల్లో పారిశ్రామిక వర్గాలు భాగస్వామ్యం ఏర్పర్చుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో మాట్లాడుతూ.. తమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, భారత ఆర్థిక వృద్ధి ఒక్కటైతే ఇక తిరుగుండదని అన్నారు. దక్షిణాసియా, పశ్చిమాసియా మధ్య ఎకనామిక్ కారిడార్ను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అబ్దుల్లా–2తో మోదీ భేటీ ప్రధాని మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి నిర్వహణ, డిజిటల్ మార్పు, సాంస్కృతిక సంబంధాలు సహా కీలక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు. రెండు దేశాల పౌరుల అభివృద్ధి, సౌభాగ్యానికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయని మోదీ ఉద్ఘాటించారు. జోర్డాన్ పర్యటన ఫలవంతంగా సాగిందని పేర్కొన్నారు. జోర్డాన్ రాజుకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అబ్దుల్లా–2, మోదీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల సంబంధాల్లో పురోగతి పట్ల హర్షం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ మంగళవారం జోర్డాన్ పర్యటన ముగించుకొని ఇథియోపియాకు చేరుకున్నారు. కారు నడుపుతూ మోదీని తీసుకెళ్లిన యువరాజు ప్రధాని మోదీ పట్ల జోర్డాన్ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా–2 ప్రత్యేకంగా గౌరవాభిమానాలు ప్రదర్శించారు. మంగళవారం తానే స్వయంగా కారు నడుపుతూ మోదీని జోర్డాన్ మ్యూజియానికి తీసుకెళ్లారు. భారత్–జోర్డాన్ మధ్యనున్న స్నేహ సంబంధాలను మరోసారి చాటిచెప్పారు. మహ్మద్ ప్రవక్త వంశంలో 42వ తరానికి చెందిన వారసుడు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా–2. మ్యూజియంలో జోర్డాన్ చరిత్ర, సంస్కృతిని తనకు కళ్లకు కట్టేలా వివరించినందుకు యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అల్ హుస్సేన్తో ఎన్నో అంశాలపై చర్చించానని, జోర్డాన్ ప్రగతి పట్ల ఆయన తపన ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు. జోర్డాన్ మ్యూజియాన్ని 2014లో నిర్మించారు. ఇందులో ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తువులు ఉన్నాయి. -
చైనా ‘మ్యాప్’ రాజకీయం..!
చైనా.. మనకు పొరగునున్న దేశం. ఈ దేశం తీరు ఎవ్వరికీ అర్థం కాదు. ఒకవైపు మిత్రత్వం చేస్తూనే తమ సరిహద్దుల్లో ఉన్న భూభాగాల్ని తమదే అంటుంది. ఆ విషయం ఇటీవల రష్యా భూభాగాన్ని తన మ్యాప్లో చూపించడంతో చైనా వైఖరి మరోసారి బయటపడింది. అంతకుముందు భారత్ భూభాగాల్ని అనేకసార్ల తన మ్యాప్ల్లో చూపించింది చైనా.సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నా..చైనాతో ప్రస్తుతం భారత్ సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నప్పటికీ, అవకాశం వస్తే దొంగ దెబ్బ తీయడానికి కూడా వెనుకాడదు అనేది గతంలో చాలాసార్లు నిరూపణ అయ్యింది. గాల్వాన్ ఎపిసోడ్లో ఎంతటి రాద్దాంతం జరిగిందో అందరికి తెలిసిందే. 2020, జూన్ 15వ తేదీన భారత–చైనా గాల్వాన్ జరిగిన ఘటన హింసాత్మకమనే చెప్పాలి.ఈ సంఘటనలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది చైనా సైనికులు కూడా మరణించారు. ఇది 45 సంవత్సరాల తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద జరిగిన అత్యంత హింసాత్మక ఘర్షణగా నిలిచిపోయింది. ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో చైనా దూకుడు తగ్గించింది. అదే సమయంలో భారత్తో స్నేహ సంబంధాలకోసం చేతులు చాచింది. ఆ క్రమంలోనే ఇటీవల ఇరదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి. ఐదేళ్ల తర్వాత భారత విమానాలు.. చైనా గగనతలంలోకి వెళుతున్నాయి.చైనా మారిందా.. నటిస్తుందా..?కానీ తన వైఖరిని పూర్తిగా మార్చుకుందా అనేది ప్రశ్నార్థకమే. ఎప్పుడు ఏదో వివాదంతో అగ్నికి ఆజ్యం పోయాలనే చూస్తూ, అవకాశం కోసం ఎదురుచూస్తూ తన పొరుగు దేశాలను ఏదో రకంగా గిల్లుతూనే ఉంటుంది. ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే జరిగింది. రష్యాతో స్నేహం నటిస్తూనే ఆ దేశ భూభాగాన్ని చైనా తన మ్యాప్లో చూపించింది. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే.. ప్రత్యర్థి దేశం ఏమాత్రం బలహీనంగా ఉన్నా వారిపైకి మెల్లగా తన అస్త్రాలను వదులుతుంది. రష్యా విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం రష్యా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఉక్రెయిన్తో సుదీర్గకాలంగా చేస్తున్న యుద్ధం కారణంగా రష్యా సైతం ఆర్థికంగా గాడిన పడటానికి అపసోపాలు పడుతోంది. ఇటువంటి తరుణంలో రష్యా భూభాగాన్ని తన మ్యాప్లో చూపించే యత్నం చేసింది డ్రాగన కంట్రీ. ఒక రాయి వేసి చూద్దాం అసలు ఏం జరుగుతుందా అనే వైఖరిని బాగా వంట బట్టించుకున్న చైనా.. అవకాశం వచ్చినప్పుడు ఈ జిత్తులు మారిన చేష్టలు చేస్తూనే ఉంటుంది.అమెరికాతో తీవ్రపోటీ..అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు ఆశాజనకంగా లేవనే సంగతిని పక్కన పెడితే. ఆ దేశంతో ఇటీవల కాలంలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది చైనా. పూర్తిగా ఇరు దేశాల మధ్య శత్వుత్వం లేకపోయినా తీవ్ర పోటీ ఉంది. ఆ క్రమంలోనే వారి మధ్య టారిఫ్ వార్ గట్టిగానే జరిగింది. ఇది కేవలం టారిఫ్ వార్గా అభివర్ణించినా, విషయం మాత్రం సీరియస్గానే ఉండటంతో మిత్రత్వం కోసం భారత్తో మిత్రత్వం కోసం పాకులాడింది.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి అనే భావన చైనాలో ఉండటమే కాదు.. అత్యంత నమ్మదగిన దేశాలలో భారత్ ఒకటి అనే విషయాన్ని కూడా చైనా బాగానే గ్రహించింది. దాంతోనే భారత్తో స్నేహం కోసం నిరీక్షించి మరీ ఆ దిశగా సక్సెస్ అయ్యింది. ఆ క్రమంలోనే ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాడిలో పడ్డాయి.అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ..ఇటీవల చోటు చేసుకున్న ఘటనను చూసుకుంటే.. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళను చైనా ఎయిర్పోర్ట్లో ముప్పుతిప్పలు పెట్టారు చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు. తన పాస్పోర్ట్ను పరిశీలించే క్రమంలో అరుణాచల్ ప్రదేశే్-భారత్ అని ఉందేంటని ఆ అధికారులు ఆ మహిళను వేధింపులకు గురి చేశారు. యూకేలో ఉంటున్నభారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్పోర్ట్పై అరుణాచల్ప్రదేశ్-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్పోర్ట్ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను.పెమా వాంఘజామ్ థోంగ్డాక్ అనే లండన్ నుంచి జపాన్కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. కానీ అక్కడ భారత ఎంబాసీ అధికారులు జోక్యం చేసుకోవడంతో చివరకు ఆ మహిళ ఎలాగోలా బయటపడింది. మరి ఈ విషయం ప్రపంచానికి తెలిసినప్పుడు చైనా ప్రభుత్వానికి తెలియదా.. కచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి ఏమైనా మాట్లాడిందా అంటే అదీ లేదు. ఇది చిన్న విషయంగా కనిపించినా, ఇటువంటి వాటిని ఆదిలోనే తుంచేయాలి. అలాగే డ్రాగన్ కంట్రీపై సీరియస్గా భారత్ దృష్టిసారించి ఉండాల్సిందే.ఇదీ చదవండి: రష్యా భూభాగంపై జిత్తులమారి చైనా కన్ను! -
"సెవన్ సిస్టర్స్ చీలిపోతుంది"
బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్పై కారు కూతలు కూశారు. భారత్ను చీల్చే ప్రయత్నాలు చేసే వ్యక్తులకు, సంస్థలకు తమ దేశం ఆశ్రయం ఇస్తుందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఆశ్రయంతో భారత్లోని ఈశాన్యప్రాంతం ప్రాంతం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని తీవ్రంగా మాట్లాడారు. కాగా ఆ వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు.బంగ్లాదేశ్ ఎన్సీపీ లీడర్ అబ్దుల్లా భారత్ను బెదిరిస్తూ పిచ్చిగా మాట్లాడారు. అబ్దుల్లా మాట్లాడుతూ "నేను ఒక విషయం భారత్కు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తాం. దానివల్ల భారత్ నుంచి ఈశాన్య ప్రాంతం వేరయ్యే అవకాశముంది". అని హెచ్చరించారు. బంగ్లాదేశ్ సౌర్వభౌమాధికారాన్ని, మానవహక్కులని గౌరవించని వారికి భారత్ ఆశ్రయం కల్పిస్తే బంగ్లాదేశ్ సమాధానమిస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. "ఈ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవి, గతేడాది నుంచి తరచుగా ఈశాన్య రాష్ట్రాలని భారత్ నుంచి విడగొడతాం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ ఈ విషయంలో మౌనంగా ఉండకూడదు" అని హిమంత అన్నారు. భారత్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. త్రిపుర రాష్ట్రాలను కలిపి సెవెన్సిస్టర్స్ అని అంటారు.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటుంది. గతేడాది ఆ దేశంలో జరిగిన ఘర్షణల తర్వాత హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్లో ఆశ్రయం పొందింది. అయితే కొద్దిరోజుల క్రితం హసీనాకు బంగ్లాదేశ్లోని కోర్టులు 21 సంవత్సరాల జైలుశిక్షతో పాటు మరణశిక్ష విధించాయి. దీంతో షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది. అయితే దీనిపై భారత్ ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం వెల్లడించలేదు. -
అభిజ్ఞాన్ డబుల్ సెంచరీ.. టీమిండియా ఘన విజయం
అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. మంగళవారం దుబాయ్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్లో 315 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 409 పరుగుల లక్ష్య చేధనలో మలేషియా 32.1 ఓవర్లలో కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. దీపేష్ దేవేంద్రన్ 5 వికెట్లతో ప్రత్యర్ది జట్టు పతనాన్ని శాసించగా.. ఉద్దవ్ మోహన్ రెండు, ఖిలాన్ పటేల్, కనిష్క్ చౌహన్ తలా వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంజా పంగి 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.అభిజ్ఞాన్ డబుల్ సెంచరీ..ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19 జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 125 బంతులు ఆడిన అభిజ్ఞాన్ 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 209 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు వేదాంత్ త్రివేది (106 బంతుల్లో 90 పరుగులు), వైభవ్ సూర్యవంశీ (50 పరుగులు) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వేదాంత్, అభిజ్ఞాన్ నాలుగో వికెట్కు ఏకంగా 209 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మలేషియా బౌలర్ మొహమ్మద్ అక్రమ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: రూ.30 లక్షలతో ఎంట్రీ.. కట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు -
ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి?
గుడికెళ్లినా, ఆసుపత్రికెళ్లినా అవే దృశ్యాలు మనల్ని వెక్కిరిస్తుంటాయి. ఆఖరికి రోడ్డుమీద నడిచివెడుతున్నా కూడా చిక్కాకు పుట్టించే పరిస్థితి. ఏ మూల నుంచి ఎవడు పుసుక్కున ఉమ్ముతాడో తెలియదు. ఏ సిగ్నల్ దగ్గర ఆగినా ఇవే దృశ్యాలు.. కొండొకచో పోలీస్ స్టేషన్ల దగ్గర్ల కూడా ఇదే పరిస్థితి. ఇదంతా దేని గురించో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. పాన్ పరాగ్, గుట్కా, ఖైనీ తిని అసహ్యంగా ఉమ్ముతూ పరిసర ప్రాంతాలను, రోడ్లను అత్యంత చెత్తగా తయారు చేస్తున్న వైనం గురించే. వీటిని ఇబ్బడి ముబ్బడిగా సేవిస్తున్న వారి సంఖ్య రోజూ రోజుకు పెరుగుతోంది. ఇవి తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాటు మితిమీరితే వివిధ రకాల కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడటం ఖాయం. దీనికి సంబంధించిన అనేక హెచ్చరికలు చేస్తున్నా.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వీటిని వాడేవారి నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏ సినిమా హాలుకెళ్లినా దీనికి సంబంధించిన యాడ్ ప్లే అవుతుంది. అయినా ఉత్తరభారతంలోని అనేక నగరాలతో పాటు, హైదరాబాద్ నగరంలో గుట్కా తిని ఉమ్మేసేవాళ్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలిస్తే షాకవ్వక మానరు. తాజాగా ఇంగ్లాండ్ లోని లింకన్ షైర్ లో జరిగిన ఘటన గురించి తెలుసుకుంటే.. మన దేశంలో చట్టాల అమలు తీరుపై ఆశ్చర్యం కలగమానదు. లింకన్ షైర్ కు చెందిన, ఆస్తమా, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న రాయ్ మార్ష్ (86) వైద్యుడి సలహా మేరకు వాకింగ్కు వెళ్లాడు. పార్క్లో నడుస్తుండగా ఎండిన ఆకు ఒకటి గాలికి ఎగిరొచ్చి వృద్ధుడి నోట్లో పడింది. చాలా యధాలాపంగా వెంటనే ఆయన దాని ఉమ్మేశారు. అదే ఆయనకు భారీ షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు షైర్కు ఏకంగా రూ.30 వేల ( 250 పౌండ్ల ) జరిమానా విధించారు.చట్ట ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం నేరమని, జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారు. మార్ష్ వివరణ ఇచ్చినా ససేమిరా అన్నారు. ఉద్దేశపూర్వకంగాఅలా చేయలేదని పొరబాటు జరిగిందని, అంతమొత్తం కట్టలేనని లబోదిబో మనడంతో కనికరించిన అధికారులు జరిమానాను 150 పౌండ్ల (సుమారు రూ.18 వేలు) తగ్గించారు. ఈ విషయాన్ని మార్ష్ కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేశారు.అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ ఇలాంటి కఠినచట్టాలు, అమలు మన దేశంలో అమలైతే ఎంతమంది ఎన్ని వేల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుందో ఒక్కసారి ఆలోచించింది. చట్టాలు, అమలు కంటే సమాజ హితంకోసం ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం. లేదంటే ఇంగ్లాండ్లొ వృద్ధుడికి ఎదురైన పరిస్థితే మనకు వస్తే? ఆలోచించండి.కాగా భారతదేశంలో పొగాకు ఉత్పత్తులపై కఠిన నియమ నిబంధలు, కొన్ని రాష్ట్రాల్లో వీటి విక్రయాలపై షేధం ఉన్నప్పటికీ పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు పొగాకు, సున్నం, వక్క, తామలపాకు, మసాలా దినుసులు, చక్కెరతోపాటు సుగంధ రసాయనాలతో గుట్కాలు, ఖైనీలు తయారవుతాయి. వాణిజ్య ఉత్పత్తులైన రజనీగందా, పాన్పరాగ్లో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి సోడియం బెంజోయేట్ లాంటివాటినీ ఉపయోగిస్తారు. ఇవి రుచి, మత్తును కలిగిస్తాయి. అంతిమంగా వారిని మరణం అంచుకునెట్టేస్తాయి. మోటారు ఫీల్డ్లో ఉన్నవారు ప్రధానంగా వీటికి బానిసలవుతున్నారు. ప్యాన్లు సహా దీర్ఘకాల వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇండియాలోదాదాపు 20-25శాతం జనాభా తినే పొగాకు ఉత్పత్తులకు బానిసలేనని అంచనా. నికోటిన్తోపాటు ఆరెకోలిన్ వంటి రసాయనాలు ఈ ఉత్పత్తులను అత్యంత వ్యసనకరంగా మారుస్తాయి. ఎక్కడ బడితే అక్కడ ఉమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ ఉత్పత్తుల గురించి అవగాహన కలిగి ఉండటం ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం. ఏమంటారు? -
ఐరాసలో పాక్ పరువు తీసిన భారత్
పాకిస్థాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. అయితే.. దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అందుకు గట్టిగానే బదులిచ్చారు. పాక్ దృష్టి అంతా భారత్కు ముప్పు తలపెట్టడంపైనే ఉందని.. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను జైలుకు పంపి.. అతడికి విరోధి అయిన అసీమ్ మునీర్కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని చురకలంటించారు.ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లీడర్షిప్ ఫర్ పీస్ అనే అంశంపై జరిగిన ఓపెన్ డిబేట్లో పాకిస్థాన్ మరోసారి జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత్పై దుష్ప్రచారం చేయడానికి వినియోగిస్తోందని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్, లడఖ్ భారతదేశానికి విడదీయరాని భాగాలు. వాటిపై పాకిస్థాన్కి ఎలాంటి హక్కు లేదు. పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా మారి.. గత దశాబ్దాలుగా భారత్పై ఉగ్రదాడులు జరిపింది. పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందనడానికి.. 2025 ఏప్రిల్లో పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడి ఉదాహరణ అని అన్నారాయన. అంతటితో ఆగకుండా.. పాకిస్థాన్లోని రాజకీయ పరిస్థితులను కూడా ఆయన ఎత్తిచూపారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపి, అతనికి విరోధి అయిన ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేతుల్లో సర్వాధికారాలు పెట్టింది. ఇది ఆ దేశపు ప్రజాస్వామ్య విలువలను గౌరవించే ప్రత్యేక పద్ధతి అని హరీశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో, సైన్యం ఎలా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తుందో ప్రపంచానికి చూపించిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల సమయంలో పాక్ ప్రతినిధులు కాస్త అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. VIDEO | New York: Permanent Representative of India to the United Nations, Parvathaneni Harish (@AmbHarishP), delivered India's statement at the Open Debate on ‘Leadership for Peace’ in the UN Security Council."India had entered into the Indus Waters Treaty, 65 years ago, in… pic.twitter.com/hMRWESj0xQ— Press Trust of India (@PTI_News) December 16, 2025 -
డెడ్ ఎకానమీయా?
న్యూఢిల్లీ: భారత్ డెడ్ ఎకానమీ అయితే గ్లోబల్ ఏజెన్సీలు అంతంత గొప్ప రేటింగులు ఎలా ఇస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలను ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను డెడ్ ఎకానమీగా పేర్కొనడంపై కేంద్రం వివరణ ఇచ్చి తీరాలని విపక్షాలు సోమవారం లోక్సభలో పట్టుబట్టాయి. దాంతో నిర్మల మాట్లాడారు. విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 8.2 శాతం వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ గతంలో బయటి సాయంపై ఆధారపడేది. అలాంటిది గత పదేళ్లలో బయటి దేశాలకు ఆదర్శంగా మారేలా ఎదిగింది. డెడ్ ఎకానమీ అన్నదే నిజమైతే డీబీఆర్ఎస్, ఎస్ అండ్ పీ, సర్ అండ్ ఐ వంటి ప్రముఖ సంస్థలు మన క్రెడిట్ రేటింగ్ను పెంచుతాయా? ఎవరో ఏదో అంటే మనం పట్టించుకోవాలా? ఆరోపణలు చేసేది ఎంత పెద్దవారైనా సరే, గణాంకాలు ఏం చెబుతున్నాయన్నదే చూడాలి. వాటి ఆధారంగానే మాట్లాడాలి’’ అంటూ విపక్షాలకు మంత్రి నిర్మల హితవు పలికారు.రూ. 41 వేల కోట్ల వ్యయానికి లోక్ సభ ఆమోదంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు కీలక శాఖలకు సంబంధించి రూ.41,455 కోట్ల మేరకు అదనపు వ్యయానికి లోక్సభ అనుమతి మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్లను సోమవారం ఆమోదించింది. దీన్ని బడ్జెట్ రూపకల్పనలో అసమర్థతగా విపక్ష ఎంపీలు చేసిన విమర్శలను మంత్రి నిర్మల తిప్పికొట్టారు. బాధ్యతాయుత ప్రభుత్వానికి ఇలాంటి సప్లిమెంటరీ డిమాండ్లు చాలా అవసరమన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని చెప్పారు. -
వారానికి 4 రోజులే పని?
వారానికి పని దినాలు ఎన్ని? ఇదేం ప్రశ్న అంటారా? మన దగ్గరైతే మెజారిటీ కంపెనీలు, సంస్థల్లో ఆరు పనిదినాలు. విదేశాల్లోనైతే ప్రభుత్వంలోనైనా, ప్రైవేటులోనైనా ఐదుకు మించవు. మన దగ్గర కూడా ఐటీ వంటి రంగాల్లో ఎన్నో ఏళ్లుగా వారానికి ఐదు రోజుల పని సంస్కృతి అమల్లో ఉంది. కాకపోతే ఆరేడు రోజులకు మించిన పని ఆ ఐదు రోజుల్లోనే చేయిస్తారని ఈ ఐటీ జీవులు వాపోతూ ఉంటారన్నది వేరే సంగతి. అయితే, వారానికి నాలుగే పని దినాలుంటే? ఆ ఆలోచనే చాలా బాగుంది కదా! విదేశాల్లో సాధ్యమేమో గానీ మన దగ్గర ఎక్కడ కుదురుతుంది లెమ్మని అనిపిస్తోందా? కానీ ఇది అచ్చంగా భారత్ గురించే! కొత్త కార్మిక చట్టాలు వారానికి నాలుగు రోజుల పనికి నిజంగానే వీలు కల్పిస్తున్నాయి. ఇక కంపెనీలు నిర్ణయం తీసుకోవడం తరువాయి, ఉద్యోగులు వారంలో నాలుగే రోజులు పని చేసి, మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులు ఆస్వాదించవచ్చు...!పాతకాలం నాటి 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం గత నవంబర్ 21న రద్దు చేసింది. వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి తేవడం తెలిసిందే. వాటిలో భాగంగా వారానికి నాలుగు పని దినాలకు కూడా అనుమతిస్తోంది. కొందరు ఉద్యోగులతో పాటు కొన్ని సంస్థలు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. వారం మొత్తానికి సంబంధించిన పని గంటలను సర్దుబాటు చేసుకునే వెలుసుబాటు సంస్థలు, కంపెనీలకు ఇస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు కూడా పెట్టింది. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తించనున్నాయి! రోజుకు 12 గంటల పని...!వారంలో పని దినాల సంఖ్య తగ్గినా మొత్తం పనిగంటల సంఖ్య మాత్రం తగ్గబోదు. ఉద్యోగులు వారం మొత్తమ్మీద కనీసం 48 గంటలు పని చేయాల్సిందే. అంటే వారంలో 4 రోజులే పనిచేసేలా ఉంటే రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ‘కొత్త కార్మిక చట్టాలు ఇందుకు అనుమతిస్తాయి. అయితే వారంలో పని గంటల సంఖ్య 48కి మించేందుకు వీల్లేదు. మించితే ఆ అదనపు గంటలకు గాను ఉద్యోగులకు కంపెనీలు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది‘ అని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఆ 12 గంటలు కూడా ఉద్యోగులు నిరంతరాయంగా పని చేయాల్సిన అవసరం లేదు. భోజన విరామం, షిఫ్టులు మారే నడుమ విరామం వంటివి ఆ 12 గంటల్లో కలిపే ఉంటాయి. వీటన్నింటికీ కంపెనీలు, కొన్నిసార్లు సిబ్బంది ఎంతవరకు ఒప్పుకోవచ్చన్నది ప్రశ్న. అందుకే, ‘వారానికి నాలుగు రోజుల పని కేవలం ఐచ్ఛికమే. కంపెనీ, సిబ్బంది పరస్పర అంగీకారంతో ఆ మేరకు పని చేసుకోవచ్చు. కంపెనీ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు తదితరాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి‘ అని కార్మిక శాఖ పేర్కొంది. 24 గంటలూ నిరంతరాయంగా పని చేయాల్సిన రంగాలు, విభాగాలకు ఈ నాలుగు రోజుల పని పనికొచ్చే వ్యవహారం కాదన్నది కార్మిక రంగ నిపుణుల అభిప్రాయం. దీనిపై కంపెనీలు, ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుందన్నది తెలిసేందుకు కొద్ది రోజులు పట్టవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ధర్మశాలలో భారత్ పంజా..
-
ప్రవర్తన మార్పుతోనే దేశ ఇంధన ప్రగతి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రంగాలలో శక్తి (ఇంధన) సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రతి పౌరుడిలోనూ ప్రవర్తన మార్పు చాలా కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ’జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం’లో ఆమె మాట్లాడారు. ప్రకృతికి అనుగుణంగా సమతుల్య జీవనశైలిని అవలంబించాలనే చైతన్యం భారతదేశ సాంస్కృతిక సంప్రదాయంలో అంతర్లీనంగా ఉందని స్పష్టం చేశారు. ఈ భావనే ప్రపంచానికి మన సందేశంగా మారుతున్న ‘పర్యావరణం కోసం జీవనశైలి – లైఫ్’నినాదానికి ఆధారమన్నారు. కీలకమైన మార్పులు ‘భారతదేశ ఇంధన పరివర్తన విజయం కోసం ప్రతి రంగం, పౌరుల భాగస్వామ్యం అవసరం. అన్ని రంగాలకు ఇంధన సామర్థ్యాన్ని తీసుకురావడానికి ప్రవర్తనా మార్పు అత్యంత కీలకం.’.. అని రాష్ట్రపతి సూచించారు. ఇంధన సంరక్షణ అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే కాదని.. ప్రస్తుత అత్యంత ముఖ్యమైన అవసరమని తెలిపారు. సమర్థ వినియోగం జరగాలి శక్తిని ఆదా చేయడం అంటే తక్కువగా ఉపయోగించడం మాత్రమే కాదని, దానిని తెలివిగా, బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా వినియోగించడమని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. ‘అనవసరంగా విద్యుదుపకరణాలను వాడకుండా ఉండటం, శక్తి సామర్థ్యం గల పరికరాలను ఉపయోగించడం, మన ఇళ్లు, కార్యాలయాలలో సహజ కాంతి, గాలిని వినియోగించుకోవడం, లేదా సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన మార్గాలను స్వీకరించడం ద్వారా, మనం కేవలం శక్తిని ఆదా చేయడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించగలం’.. అని ముర్ము సూచించారు. పర్యావరణం, ఆర్థిక ప్రయోజనాలు స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన నీటి వనరులు, సమతుల్య పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికి కూడా ఇంధన సంరక్షణ చాలా ముఖ్యమని రాష్ట్రపతి చెప్పారు. ‘మనం ఆదా చేసే ప్రతి యూనిట్ శక్తి, ప్రకృతిపై మన బాధ్యతకు, భవిష్యత్ తరాలపై మన సున్నితత్వానికి చిహ్నంగా నిలుస్తుంది’.. అని స్పష్టం చేశారు. యువత, పిల్లలు ఇంధన సంరక్షణపై అవగాహన పెంచుకుని, ఈ దిశగా ప్రయత్నాలు చేస్తే, దేశం స్థిరమైన అభివృద్ధిని సాధించగలదని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు ’ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’, ’జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ వంటి కార్యక్రమాలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని ముర్ము గుర్తు చేశారు. ’పునరుత్పాదక వినియోగ బాధ్యత’, ’ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల’ ద్వారా ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని, శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.గణనీయంగా శక్తి ఆదా 2023–24లో భారతదేశ ఇంధన సామర్థ్య ప్రయత్నాల ఫలితంగా 53.60 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన శక్తి ఆదా అయిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ ప్రయత్నాలు వార్షికంగా గణనీయమైన ఆర్థిక పొదుపులకు, ఉద్గారాల తగ్గింపునకు దారి తీశాయని వెల్లడించారు. చివరగా, ఇంధన సంరక్షణ రంగంలో కృషి చేస్తున్న వాటాదారులందరినీ రాష్ట్రపతి అభినందించారు. సామూహిక బాధ్యత, భాగస్వామ్యం, ప్రజల సహకార స్ఫూర్తితో భారతదేశం ఇంధన సంరక్షణలో ప్రధాన పాత్ర పోషించి, ’హరిత భవిష్యత్తు’ లక్ష్యాలను సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ఆమె 2025 సంవత్సరానికి ’జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులు’, ’ఇంధన సంరక్షణపై జాతీయ చిత్రలేఖన పోటీ’ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్సీ ప్రస్తుతం ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా భారత్లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నాడు. ఈ టూర్ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా కాగా... తొలిరోజు కోల్కతాలో ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన కోల్కతా పోలీసులు జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా సాల్ట్లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడతాడంటూ ప్రముఖంగా ప్రచారం చేశారు. రూ. వేలల్లో టికెట్లను అమ్మారు. ఫుట్బాల్ క్రేజీ బెంగాలీ వాసులు సుమారు 80 వేల మంది వేలకువేలు వెచి్చంచి స్టేడియానికి తరలివెళ్లారు. కానీ తమ ఆరాధ్య ఫుట్బాలర్ మెస్సీ పట్టుమని పది నిమిషాలైనా మైదానంలో అలరించలేదు. ఆ ఉన్న కొద్దిసేపు కూడా చీమలదండు లాంటి భద్రతా వలయంతో ఏ గ్యాలరీలోని ప్రేక్షకుడు కూడా మెస్సీని చూడలేకపోయాడు. దీంతో సూపర్స్టార్ను ప్రత్యక్షంగా చూసి కన్నుల పండగ చేసుకుందామని రూ.వేలు వెచి్చంచిన అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా వేల మంది విరుచుకుపడటంతో కరతాళ ధ్వనులతో మార్మోగాల్సిన మైదానం రసాభాసగా మారింది. ఈ ఈవెంట్ నిర్వహణ వైఫల్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభిమానుల తాకిడి, అంచనాలకు విరుద్ధంగా ఏర్పాట్లు, నిర్వహణ వైఫల్యంపై చీఫ్ ఆర్గనైజర్ శతద్రు దత్తాను శనివారమే అదుపులోకి తీసుకొని ఆదివారం జడ్జి ముందు హాజరు పరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి... ముఖ్య నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో శతద్రును జైలుకు తరలించారు. -
సింగిల్స్ చాంప్స్ ఉన్నతి, కిరణ్
కటక్: ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత్కు రెండు టైటిల్స్ లభించాయి. మహిళల సింగిల్స్లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల ఉన్నతి హుడా... పురుషుల సింగిల్స్లో కేరళకు చెందిన కిరణ్ జార్జి చాంపియన్స్గా అవతరించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్లో ప్రపంచ 28వ ర్యాంకర్ ఉన్నతి 21–17, 21–10తో భారత్కే చెందిన ప్రపంచ 53వ ర్యాంకర్ ఇషారాణి బారువాను ఓడించింది. 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఉన్నతికి తొలి గేమ్లో కాస్త పోటీ ఎదురైంది. రెండో గేమ్లో మాత్రం ఆరంభం నుంచే ఉన్నతి జోరు కొనసాగింది. పురుషుల సింగిల్స్ తుది పోరులో ప్రపంచ 41వ ర్యాంకర్ కిరణ్ జార్జి 21–14, 13–21, 21–16తో ప్రపంచ 77వ ర్యాంకర్ మొహమ్మద్ యూసుఫ్ (ఇండోనేసియా)పై విజయం సాధించింది. 65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండో గేమ్లో తడబడ్డ కిరణ్ నిర్ణాయక మూడో గేమ్లో కీలకదశలో పాయింట్లు గెలిచి టైటిల్ను ఖాయం చేసుకున్నాడు. విజేతలుగా నిలిచిన ఉన్నతి, కిరణ్లకు 8,250 డాలర్ల (రూ. 7 లక్షల 46 వేలు) చొప్పున ప్రైజ్మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి.. భారత్లో ‘హై అలర్ట్’
ఢిల్లీ: భారత్లోని పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో యూదుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో హై-అలర్ట్ జారీ చేశారు.ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన యూదుల పండుగ హనుక్కా సందర్భంగా ఉగ్రవాదులు పెద్ద దాడులు చేయాలని యోచిస్తున్నట్లు భారత్లోని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇజ్రాయెల్కు సంబంధించిన సంస్థల్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.హనుక్కా పండుగ ఎప్పుడు?యూదులు ఘనంగా జరుపుకునే ఎనిమిది రోజుల పండుగ హనుక్కా. ఈ పండుగ డిసెంబర్ 14 నుండి ప్రారంభమైంది. ఈ పండుగ సమయంలో యూదులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తారు. అందువల్లే పండుగ పర్వదినాన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఏ నగరాలు ప్రధాన టార్గెట్?ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం యూదు సంస్థలు, ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద భద్రత పెంచారు. విదేశీ పర్యాటకులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం, రాష్ట్రాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. -
కొత్త శకానికి భారత్ సారథ్యం: శాంసంగ్
భారత్ నుంచి 14,000 పేటెంట్లను దాఖలు చేసినట్లు శాంసంగ్ వెల్లడించింది. అంతర్జాతీయంగా అర్థవంతమైన నవకల్పనలను ఆవిష్కరించడంలో కొత్త శకానికి భారత్ సారథ్యం వహిస్తుందని ఆశిస్తున్నట్లు దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ తెలిపింది.‘భారత్ నుంచి 14,000 పైగా పేటెంట్లు దాఖలయ్యాయి. తద్వారా గ్లోబల్ ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్ స్థానం మరింత పటిష్టం అయింది. రాబోయే దశాబ్దకాలంలో ప్రపంచం కోసం భారత్లో డిజైన్ చేసిన, తయారు చేసిన మరిన్ని ఉత్పత్తులు రాబోతున్నాయి‘ అని శాంసంగ్ సౌత్వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్, సీఈవో జేబీ పార్క్ వివరించారు.వికసిత్ భారత్ లక్ష్యాల సాకారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. 1995లో టీవీలతో దేశీ మార్కెట్లోకి ప్రవేశించిన శాంసంగ్ క్రమంగా కార్యకలాపాలను విస్తరించింది. చెన్నై, నోయిడాలో రెండు ప్లాంట్లను, ఢిల్లీ, నోయిడా, బెంగళూరులో మూడు పరిశోధన.. అభివృద్ధి కేంద్రాలను, ఢిల్లీ–ఎన్సీఆర్లో డిజైన్ సెంటర్ని ఏర్పాటు చేసింది. -
భారత్తో ట్రంప్ దాగుడు మూతలు..?
ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను చూస్తే.. భారత్తో అమెరికా దూరం పెరిగిపోయిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ఏ విషయాన్ని తెగేసి చెప్పకుండా భారత్-పాక్ల యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకున్న ట్రంప్.. మద్దతు విషయానికొచ్చేసరికి పాక్కే ప్రయారిటీ ఇచ్చారు. ఆ దేశ ఆర్మీ ఛీఫ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్లను అమెరికాకు ఆహ్వానించడమే కాకుండా వారితో రాసుకుపూసుకుని తిరిగారు. ఇక్కడ ట్రంప్ ద్వంద్వ వైఖరి బయటపడింది. భారత్పై ఆంక్షలే లక్ష్యంగా..అదే సమయంలో భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించి అక్కసు తీర్చుకున్నారు. దీనిపై అమెరికాలో ఉన్న నిపణులు సైతం ట్రంప్ను హెచ్చరించారు కూడా. భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తే ఆ దేశంలో ఎన్నో దశాబ్దాల నుంచి సాగుతున్న మిత్రత్వం చెడిపోతుందని కూడా వివరించారు. దానివల్ల అమెరికాక ఒరిగేదేమీ లేకపోయినా మనమే దెబ్బతింటామని కూడా చెప్పారు. కేవలం భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని ఒక్క ఒక్క తలంపుతో 50శాతం సుంకాలను విధించారు ట్రంప్.ఇదిలా ఉంచితే, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించారు. రష్యా చమురును కొనడం ఆపాలనే భారత్ను చాలాసార్లే హెచ్చరించారు. అయితే దాన్న భారత్ పూర్తి సీరియస్గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై ఒక్క ముక్కలో తేల్చి పారేశారు. తాము భారత్కు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్కు అసహనం తెప్పిస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా వేరే దేశాలకు భారత్ దగ్గరవ్వడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. మెక్సికో సుంకాల వెనుక ట్రంప్ హస్తం?గత రెండు రోజుల క్రితం భారత దిగుమతులపై మెక్సికో 50 శాతం సుంకాన్ని విధించింది. దీనికి ఏవో కారణాలు చెప్పుకొచ్చింది. తమ దేశంతో పూర్తిస్థాయి వాణిజ్య సంబంధాలు లేని దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తున్నామంటూ స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారత్తో పాటు చైనా కూడా చేరింది. మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) లేని దేశాలన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయని చెప్పింది. అయితే వీటి వెనుక ఉన్నది ట్రంప్ అని పలు ఆరోఫలణలు వచ్చాయి.. వస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఇప్పటికే మెక్సికో సుంకాలపై స్పందించారు. ఇది ట్రంప్ చర్య కావొచ్చనే అనమానం వ్యక్తం చేశారు. దీన్ని పూర్తిగా కాదనలేం. అమెరికాకు అత్యంత మిత్ర దేశాల్లో మెక్సికో ఒకటి. మెక్సికోను పదే పదే పొగడ్తలతో ముంచెత్తం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది.ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలున్నాయి. గతంలో పలు సందర్భాల్లో మెక్సికో అధ్యక్షరాలు క్లాడియా షీన్బామ్ను అత్యంత సాహసిగా, గొప్ప నాయకురాలిగా అభివర్ణించారు ట్రంప్. ఇక మెక్సికోకు కూడా అమెరికాపై అంతే ప్రేమ ఉంది. ఈ కారణంగానే ట్రంప్ దాగుడు మూతలకు తెరలేపి భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని చూశారనేది నిపుణుల అంచనా. ఇది ట్రేడ్ డైవర్షన్కు అడ్డుకట్టా.. ట్రంప్ అడ్డుకట్టా..?భారత్, చైనాలపై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాలు మెక్సికోకు దిగుమతి చేసే వస్తువులను నేరుగా అమెరికాకు పంపకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. దీన్ని ట్రేడ్ డైవర్షన్ అంటారు.దీనికి అడ్డుకట్టవేయాలనే తలంపుతో మెక్సికో చేసినా, ఇందులో ట్రంప్ హస్తం ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారత్పై అమెరికా విధించిన సుంకాలపై అక్కడ ఎంపీల నుంచే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ట్రంప్ ఇలా చేసే ఉంటారనేది మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి:భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావంట్రంప్ భారీ సుంకాల రద్దు.. ? యూఎస్ కాంగ్రెస్లో తీర్మానం! -
తయారీ హబ్గా భారత్!
భారత్ 2047 నాటికి తయారీ దిగ్గజంగా మారాలంటే.. జీడీపీలో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 25 శాతానికి చేర్చాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), జెడ్47 సంయుక్త నివేదిక సూచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన భారత్లో తయారీ, ఆత్మనిర్భర్భారత్, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)తో దేశీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నట్టు పేర్కొంది.ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఆటోమోటివ్-ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధనం, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 2047 నాటికి 25 ట్రిలియన్ డాలర్ల అవకాశాలున్నట్టు తెలిపింది. రానున్న కాలంలో తయారీ రంగంలో భారత్ వృద్ధికి ఈ రంగాలు కీలకంగా మారనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వీటికితోడు బలమైన జీడీపీ వృద్ధి, పారిశ్రామిక మద్దతు, స్పష్టమైన విధానాలు/పెట్టుబడులతో తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీతత్వాన్ని పెంచడం, టెక్నాలజీ అమలు ద్వారా సామర్థ్యాలను విస్తృతం చేయడం ద్వారా తయారీ రంగానికి బలమైన పునాదులు వేయాలని సూచించింది.2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం కోసం.. రక్షణ, ఈవీ, సెమీకండక్టర్లకు సంబంధించి ప్రాంతీయ తయారీ క్లస్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నివేదిక పేర్కొంది. నోయిడా–చెన్నై–హోసూర్, దొలెరా కారిడార్లు ఇప్పటికే ఫలితాలను చూపిస్తున్నట్టు తెలిపింది. ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల తుది మార్కెట్ 2022లో 33 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి 117 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. రక్షణ రంగానికి 2025–26లో కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉండగా, దేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చే దశాబ్దంలో కేటాయింపులు రెట్టింపు కానున్నట్టు పేర్కొంది. -
ఏఐని బెస్ట్గా వాడుతున్న దేశం ఏదో తెలుసా?
ఒకప్పుడు కంటికి కనిపించే మరయంత్రాలు.. ఇప్పుడు కానరాకుండానే అద్భుతాలు చేస్తున్నాయి. నిమిషాల్లో.. కాదు చిటికేసేలోపే పనులన్నీ చక్కబెట్టేస్తున్నాయి. ఆఖరికి.. మనం తీసుకునే నిర్ణయాలనూ ప్రభావితం చేసేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తి కూడా. ఆరోగ్యం నుంచి విద్య వరకు.. బ్యాంకింగ్ నుంచి వినోదం దాకా.. ప్రతీ రంగంలోనూ ఏఐ తన ముద్రను వేసేసుకుంది. క్రితంతో పోలిస్తే 2025లో వాడకం బాగా పెరిగింది. ఏఐ అభివృద్ధి, పరిశోధన, మోడల్ డెవలప్మెంట్లో ప్రపంచంలోకెల్లా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. సిలికాన్ వ్యాలీ, ఎంఐటీ, స్టాన్ఫోర్డ్ వంటి పరిశోధనా కేంద్రాలు కొత్త మోడళ్లను రూపొందిస్తూ.. ఏఐ ఆవిష్కరణల్లో అగ్రరాజ్యాన్ని ముందంజలో ఉంచాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా.. 87% కంపెనీలు ఏఐని తమ వ్యాపార ప్రణాళికల్లో ప్రధాన ప్రాధాన్యంగా గుర్తించాయి. మొత్తంగా 76% సంస్థలు కనీసం ఒక విభాగంలో ఏఐని వాడుతున్నాయివాస్తవ వినియోగం విషయంలో మాత్రం అత్యధిక జనాభా ఉన్న చైనా (58%), భారతదేశం (57%) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నాయి. చైనాలో ఆరోగ్యం, తయారీ, ప్రభుత్వ సేవల్లో AI విస్తృతంగా అమలవుతోంది. భారతదేశంలో బ్యాంకింగ్, ఈ-కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాలు పెద్ద జనాభా, విస్తృత మార్కెట్ కారణంగా AIని ప్రాక్టికల్గా ఉపయోగించడంలో ముందున్నాయి. అదే సమయంలో.. ఎంటర్టైన్మెంట్ విభాగంలో చూస్తే చైనా కంటే మన దేశమే ముందంజలో ఉంది. అయితే.. ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తున్న దేశాలు ఏంటో తెలుసా?.. ఏఐ వినియోగంలో చిన్న దేశాలు వెనుకబడలేదు. యూరప్లోని చిన్న కంట్రీ అయిన ఎస్టోనియా ప్రపంచంలోనే ఏఐని అతి సమర్థవంతంగా వినియోగించుకుంటున్న దేశంగా గుర్తింపు దక్కించుకుంది. డిజిటల్ పాలసీలతో పాటు ఈ-పౌరసత్వం, డిజిటల్ ఐటీ వంటి ప్రాజెక్టుల కోసం పూర్తిగా ఏఐనే ఉపయోగించుకుంటోందా దేశం. ఈ లిస్ట్లో తర్వాత సింగపూర్ ఉంది. అక్కడి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, పబ్లిక్ సర్వీసుల్లోనూ AIని అత్యుత్తమంగా ఉపయోగిస్తున్నారు. స్పష్టమైన పాలసీలు, సమర్థవంతమైన అమలుతోనే ఇది సాధ్యమైందని సింగపూర్ ఈ మధ్యే గొప్పగా ప్రకటించుకుంది కూడా. ఇక.. మన దేశంలో ఏఐని విచ్చలవిడిగా వాడుతోంది చూస్తున్నదే!. అయితే యూరప్లో మాత్రం ఏఐ తరహా కంటెంట్ వాడకంపై ఆంక్షలు ఉన్నాయి. ఈయూ AI Act ద్వారా ఎథికల్ AI వినియోగానికి(ఎలా పడితే అలా వాడడానికి వీల్లేకుండా..) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలు ఏఐని తక్కువేం వాడడం లేదు. ఏఐ కంప్యూటింగ్ పవర్లో భారీగా పెట్టుబడులు పెడుతూ.. భవిష్యత్తులో గ్లోబల్ AI హబ్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దక్షిణ కొరియాలో ప్రభుత్వం ఉద్యోగులకు AI అక్షరాస్యతలో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.మొత్తంగా.. ప్రపంచ ఏఐ దృశ్యం ఇప్పుడు పెద్ద దేశాల ఆధిపత్యంతో పాటు చిన్న దేశాల సమర్థవంతమైన వినియోగం అనే ద్వంద్వ రూపంలో ఉందని చెప్పొచ్చు. -
సెమీఫైనల్లో భారత్
చెన్నై: ఆతిథ్య భారత జట్టు స్క్వాష్ ప్రపంచకప్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–0తో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. జోష్నా చినప్ప 7–4, 7–4, 7–2తో టీజెన్ రసెల్పై గెలుపొందగా, అభయ్ సింగ్ 7–1, 7–6, 7–1తో డెవాల్స్ వాన్ నికెర్క్పై గెలిచాడు. అనాహత్ సింగ్ 7–3, 7–3, 7–4తో హేలీ వార్డ్ను చిత్తు చేసింది. సెమీస్లో ఈజిప్్టతో భారత్ తలపడుతుంది. క్వార్టర్స్లో ఈజిప్ట్ 3–0తో ఆ్రస్టేలియాపై గెలుపొందింది. లీగ్ దశలో భారత జట్టు స్విట్జర్లాండ్, బ్రెజిల్లపై విజయంతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో భారత్ 2023లో గెలిచిన కాంస్య పతకమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. -
చైనీయులకు సులువుగా బిజినెస్ వీసాలు
న్యూఢిల్లీ: భారత్ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా బిజినెస్ వీసాలు జారీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను సడలించింది. వీసా దరఖాస్తులను ఇకపై వేగంగా ఆమోదించబోతున్నారు. లద్దాఖ్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్–చైనా సంబంధాలు ఇటీవల మళ్లీ గాడిన పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షలు, టారిఫ్ల నేపథ్యంలో చైనాతో వాణిజ్య సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే బిజినెస్ వీసా నిబంధనల్లో తాజాగా మార్పులు చేసింది. తక్కువ కాలంపాటు భారత్ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా వీసాలు ఇవ్వడం ద్వారా వారి సేవలు ఉపయోగించుకోవచ్చని, చైనాతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వీసా దరఖాస్తుదారుల తనిఖీ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఆమోదంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. చైనా వృత్తి నిపుణులకు గతంలో ఎంప్లాయ్మెంట్ వీసాలు(ఈ వీసాలు) జారీ చేస్తుండేవారు. వీటి కాలపరిమితి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ. బిజినెస్ వీసాలకు సంబంధించి మార్పు చేసిన నిబంధనలు అన్ని దేశాల దరఖాస్తుదారులకు వర్తిస్తాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల చైనీయులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఈ వీసాల జారీ ప్రక్రియను నాలుగు వారాల్లోపే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చైనా పరికరాలు, యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలు సాగించే భారతీయ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లాభం చేకూరనుంది. చైనా నిపుణులు బిజినెస్ వీసాలపై ఇండియాకు వచ్చి, సదరు కంపెనీలకు సహకరించే వీలుంది. చైనా పౌరులకు టూరిస్టు వీసాలను జారీ చేసే ప్రక్రియను ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వాగతించిన చైనా విదేశాంగ శాఖ చైనా నిపుణులకు బిజినెస్ వీసాలను సులువుగా, వేగంగా జారీ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ శుక్రవారం స్వాగతించారు. ఇదొక సానుకూలమైన ముందడుగుగా అభివరి్ణంచారు. ప్రయాణాలను సులభతరం చేస్తే ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా ప్రజల మధ్య అనుబంధం బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. -
ఇండిగో.. ఇదేందయ్యో!
టికెట్ బుక్ అయిందంటే చాలు.. విమాన సంస్థ నమ్మకంగా తమను సమయానికి గమ్యానికి చేరుస్తుందన్న హామీ లభించినట్టు భావిస్తాం. వాతావరణం అనుకూలించక, సాంకేతిక సమస్యతో సర్వీసు రద్దయితే ప్రత్యేక పరిస్థితుల వల్లే ఇలా జరిగిందేమోనని అర్థం చేసుకుంటాం. అలాకాకుండా కార్యాచరణ నిర్లక్ష్యంతో కస్టమర్లకు ఇచ్చిన హామీని ఆపరేటర్ ఉల్లంఘిస్తే..? దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కార్పొరేట్ ఉదాసీనతగా భావించాలి. అంతేకాదు పెద్ద వైఫల్యం కూడా. ఇండిగో విషయంలో ఇదే జరిగింది. ప్రపంచం నివ్వెరపోయిన ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా నిలవడానికి బదులుగా నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడం కోట్లాది మందిని ఆశ్చర్యంలో ముంచెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో ప్రజల ఊహలకు అతీతంగా ప్రభుత్వం ప్రవర్తించిందన్నది ప్రయాణికుల మాట. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తినప్పుడు పౌర విమానయాన నియంత్రణ సంస్థ కఠిన చర్యల అమలుకు బదులు సలహా ప్రకటనలకే పరిమితమైంది. వివిధ దేశాల్లో విమానయాన సంస్థలు విఫలమైనప్పుడు ప్రయాణికులకు పరిహారం అందుతుంది. ఆపరేటర్లను వదిలిపెట్టరు. టికెట్కు అయిన ఖర్చు వెనక్కి ఇవ్వడం, భోజనాలు, పానీయాలు, ప్రత్యామ్నాయ విమానాల ఏర్పాటు వంటివి ఒకప్పుడు భారత్లో అమలయ్యాయి. కానీ దశాబ్ద కాలంగా నియంత్రణ చర్యలు పేలవంగా, అస్థిరంగా, అరుదుగా శిక్షలతో అమలవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేయొచ్చంటే.. సర్వీసు ఆలస్యం, కంపెనీ ప్రకటనలు, సమాచారాన్ని కస్టమర్లు రికార్డ్ చేయాలి. చాంతాడంత క్యూలు, ఖాళీ అయిన కౌంటర్లు, సిబ్బంది ప్రవర్తన మొదలైన వాటి ఫొటోలు, వీడియోలను సేకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘భోజనం, వసతి, ప్రత్యామ్నాయ విమానం, ప్రయాణ బిల్లులను ఉంచుకోవాలి. వినియోగదారుల ఫోరమ్స్లో పరిష్కారం కోసం ఇటువంటి ఆధారాలు అవసరం. డీజీసీఏ ఎయిర్సేవా పోర్టల్కు ఫిర్యాదు చేయాలి.జిల్లా వినియోగదారుల కోర్టులనూ ఆశ్రయించాలి. సేవా ఉల్లంఘన కింద ఆపరేటర్కు చట్టపరమైన నోటీసు పంపాలి. బాధిత ప్రయాణికులు సమూహంగా ఏర్పడి ప్రభుత్వానికి, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఉమ్మడి పరిహార దావాలకు క్లాస్ పిటిషన్లను దాఖలు చేయవచ్చు’అని చెబుతున్నారు.బిజినెస్ క్లాస్ అంటేనే..: ఇండిగో వైఫల్యాన్ని బహిరంగంగా ఖండించాలని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ‘వివిధ కంపెనీల ప్రముఖులు, తరచూ ప్రయాణించేవారు ఆపరేటర్ను సామాజిక మాధ్యమాల్లో ఎండగడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ సంస్థల కంటే బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు విమానయాన సంస్థలు ఎక్కువగా భయపడతాయి. పదేపదే సేవలు ఉల్లంఘించే ఆపరేటర్లతో ఒప్పందాలను కార్పొరేట్ సంస్థలు నిలిపివేయొచ్చు. పెద్ద క్లయింట్లను కోల్పోవడం అంటే వ్యాపారాన్ని పోగొట్టుకున్నట్టేనని విమానయాన సంస్థలు భావిస్తాయి’అని చెబుతున్నారు.మన దగ్గరా అమలవ్వాలి..: నియంత్రణ పరంగా సంస్కరణలకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేయాలన్నది నిపుణుల మాట. ‘ఈయూ 261 తరహా నిబంధనల కోసం ఒత్తిడి చేయాలి. ఎయిర్లైన్ వల్ల కలిగే అంతరాయానికి కస్టమర్ల అభ్యర్థన ఆధారంగా కాకుండా ఆటోమేటిక్గా పరిహారం అందాలి. ఆపరేటర్లే భోజనాలు, ఆశ్రయాన్ని కల్పించాలి. జరిమానాలు ఆర్థికంగా ఉండాలి. ఉల్లంఘనలు పెరిగిన కొద్దీ జరిమానా అదే స్థాయిలో అధికం కావాలి’అని సూచిస్తున్నారు.ఏ దేశంలో ఎలా ఉందంటే..చాలా పరిణతి చెందిన విమానయాన మార్కెట్లలో కంపెనీల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తితే అక్కడి ప్రభుత్వాలు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. భారీ జరిమానాలు, కోర్టులు, వినియోగదార్ల ఫోరమ్స్లో వ్యాజ్యాలు, ఆపరేటర్లపై కఠిన చర్యలతోపాటు నియంత్రణ పరంగా జోక్యం చేసుకుంటాయి. యూరప్: ఈయూ నిబంధన 261 ప్రకారం.. విమానం ఆలస్యం, రద్దు అయితే ఒక్కో ప్యాసింజర్కు 600 యూరోల వరకు పరిహారం చెల్లించాలి. తప్పనిసరి భోజనం, పానీయాలు, వసతి కల్పించాలి. టికెట్ ధరను పూర్తిగా వెనక్కి ఇవ్వడం లేదా మరో మార్గంలో (రీ–రూటింగ్) గమ్యస్థానానికి పంపించాల్సిన బాధ్యత ఆపరేటర్దే. అమెరికా: 2022లో సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ సంక్షోభంతో ప్రజల ఆగ్రహం, కోర్టుల్లో వ్యాజ్యాల కారణంగా ప్రభుత్వం దర్యాప్తు జరిపింది. భారీ మొత్తంలో కంపెనీ రీఫండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు హోటల్ కవరేజ్, భోజనం, రీబుకింగ్ సహాయం, రీఫండ్స్ లభించాయి.కెనడా: ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ నిబంధనల ప్రకారం ఎయిర్లైన్ లోపం కారణంగా తలెత్తే అంతరాయాలకు ప్రతి ప్యాసింజర్కు 125–1,000 కెనడియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ్రస్టేలియా: ప్రయాణికులను తప్పుదారి పట్టించడం, వారికి ఏదైనా హాని కలిగితే విమానయాన నియంత్రణ సంస్థలు ఆపరేటర్లకు జరిమానా విధిస్తాయి. -
కోర్–5 సూపర్ క్లబ్
వరల్డ్ ఆర్డర్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే బలం, సామర్థ్యం ఆధారంగా వరుస క్రమంలో దేశాల అమరిక. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలే శాసించే ఈ వరల్డ్ ఆర్డర్ త్వరలో పెను మార్పులను చవిచూడనుందా? ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న జీ7 వైభవం గతించనుందా? దాన్ని తోసిరాజనేలా అతి శక్తిమంతమైన సరికొత్త కూటమి ఒకటి శరవేగంగా పురుడు పోసుకుంటోందా? అన్ని రంగాల్లోనూ నిర్నిరోధంగా దూసుకుపోతున్న నయా భారత్ ది అందులో అతి కీలక పాత్ర కానుందా? అంటే, అవుననే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముఖ్యంగా కొద్దిరోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు, చేతలు, చాప కింద నీరులా ఆయన చకచకా సాగిస్తున్న ప్రయత్నాలు ఇందుకు ప్రబల సంకేతాలేనని చెబుతున్నారు. కోర్–5 పేరిట కొత్త కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిజిటల్ వార్తా పత్రిక పొలిటికో రాసి కథనం అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తోంది. అమెరికా, భారత్, మరో రెండు ఆసియా దిగ్గజాలైన చైనా, జపాన్ తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కానుందని పొలిటికో కథనం సారాంశం. అమెరికాకు సంబంధించిన రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలను అత్యంత కచి్చతత్వంతో నివేదించే డిఫెన్స్ వన్ సైట్ ను ఉటంకిస్తూ అది ఈ మేరకు పేర్కొంది. ఈ కోర్ గ్రూప్నకు ముద్దుగా ’సీ5 సూపర్ క్లబ్’ గా నామకరణం కూడా చేసింది! నిజంగా గనుక అదే జరిగితే చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి ఇదే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో సీ5 గురించి వివరంగా ఉన్నట్టు వాషింగ్టన్, వైట్ హౌస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి! ట్రంప్ తీసుకువస్తున్న సరికొత్త సీ 5 ప్రతిపాదనలపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, జపాన్ ప్రధాని తకాయిచీ స్పందనలేమిటో తెలియాల్సి ఉంది. యూరప్ దేశాలకు చెక్? జీ7 కూటమిలో అమెరికా, కెనడా , జపాన్ ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రూపంలో నాలుగు యూరప్ దేశాలే ఉన్నాయి. పలు అంశాల్లో వాటి దూకుడు పట్ల ట్రంప్ కొద్దికాలం గుర్రుగా ఉన్నారు. చీటికిమాటికి అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలనే ఒంటెత్తు పోకడతో అవి శిరోభారంగా మారాయని భావిస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకే ఈ కొత్త కూటమికి ఆయన తెర తీస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే ఇది పెను మార్పు కానుంది! అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టిన గత 80 ఏళ్లలో నిత్యం యూరప్ ను తన అతి సన్నిహిత భాగస్వామిగానే పరిగణిస్తూ రావడం తెలిసిందే.ట్రంప్ సంకేతాలు సీ 5 గ్రూప్ గురించి నిజానికి ట్రంప్ కొంతకాలంగా స్పష్టమైన సంకేతాలే ఇస్తూ వస్తున్నారు. గత జూన్ లో జరిగిన జీ7 శిఖరాగ్రాన్నే ఇందుకు ఆయన వేదికగా మలచుకోవడం విశేషం. జీ7 కూటమిలో రష్యా కొనసాగి ఉండాల్సిందని, ఆ మాటకొస్తే చైనాకూ ఎన్నడో చోటు దక్కాల్సిందని ఆయన కుండబద్ధ్దలు కొట్టారు. తొలుత జీ8గా ఉన్న ఈ కూటమి కాస్తా, 2014లో క్రిమియాను ఆక్రమించిన కారణంగా రష్యాకు ఉద్వాసన పలకడంతో జీ7గా మారింది. ‘నిజానికి అతి పెద్ద తప్పిదమది. అలా చేయకుంటే నేడు ఇంత భారీ యుద్ధమే జరుగుతుండేది కాదు‘ అని ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఉదేశించి జీ7 వేదికగానే ట్రంప్ కుండబద్ధ్దలు కొట్టారు. సి5 మరీ సత్యదూరం ఏమీ కాకపోవచ్చని బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా మండలిలో కీలకపాత్ర పోషించిన టోరీ తౌసిగ్ చెప్పడం విశేషం. ‘ట్రంప్ కు సిద్ధాంతాలపై పెద్దగా నమ్మకం లేదు. తన ఆలోచనలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు ఏది పనికొస్తే అదే అప్పటికి ఆయన సిద్ధాంతం! ఆ లెక్కన కొంతకాలంగా తనకు శిరోభారంగానే గాక అమెరికాకు ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా భారంగానే పరిణమిస్తున్న యూరప్ దేశాలను వదిలించుకునేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు.అప్పుడే ఎజెండా రెడీ? అవుననే అంటోంది పొలిటికో. జీ7 మాదిరిగా తర చూ భేటీ కావాలని, అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించాలని ట్రంప్ భావిస్తున్నట్టు అది వివరించింది. అంతేకాదు, పశ్చిమాసియా భద్రతే సీ5 తొలి ఎజెండా అని కూడా డిఫెన్స్ వన్ ను ఉటంకిస్తూ చెప్పేసింది! ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఉప్పూ నిప్పుగా ఉన్న సంబంధాలను సరిదిద్దడం సీ5 ’తొలి అసైన్ మెంట్’ అని చెప్పుకొచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్కు మెస్సీ ‘కిక్’
ఓ మారడోనా... ఓ పీలే... ఓ డుంగా... ఓ రొనాల్డిన్హో... వీళ్ల సరసన నిలిచేందుకు తాజాగా అర్జెంటీనా సూపర్స్టార్ మెస్సీ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (జీఓఏటీ) టూర్ ఆఫ్ ఇండియా’లో ఓ పండుగలా దిగి వస్తున్నాడు. అభిమానుల్ని ‘కిక్’ ఎక్కించనున్నాడు. అతి కొద్దిమంది ఎంపిక చేసిన వారితో కలిసి విందు కూడా చేయబోతున్నాడు. ఫొటోలు దిగబోతున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ ఇంత తీరిగ్గా భారత్కు రావడం ఇదే మొదటిసారి. గతంలో 14 ఏళ్ల క్రితం వచ్చాడు. కానీ వచ్చిన పని మాత్రమే చూసుకొని (అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి) వెళ్లాడు. కానీ ఇప్పుడలా కాదు... పని గట్టుకొని మరీ తన భారతీయ అభిమాన గణాన్ని అలరించేందుకే వస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్: మెస్సీ... మెస్సీ... మెస్సీ... కొన్ని రోజులుగా బంగారం ధరల కంటే, స్టాక్ మార్కెట్ సూచీల కంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కంటే కూడా పతాక శీర్షికల్లో ఎక్కుతున్న పేరిది. అందరి నోటా ఇదే మాట. ఏ నలుగురు క్రీడాభిమానులు కలిసినా ఇదే ముచ్చట. అధికార వర్గాలు, పోలీస్ బందోబస్తు (4 నగరాలకు సంబంధించి) ఏర్పాట్లు కూడా అతని కోసమే! అయితే ఎవరీ మెస్సీ! ఎందుకంత క్రేజ్? క్రికెట్ మతమైన భారత్లో ఓ ఫుట్బాల్ స్టార్ను ఇంతలా తలకెక్కించుకుంటారా! అంటే... అవును మరి... అతను ఆడే ఆట ఫుట్బాల్కు మన దేశంలో ప్రాచుర్యం లేకపోవచ్చు. కానీ అతను ఆడే మ్యాచ్లకు మాత్రం దేశం, రాష్ట్రం, మతంతో సంబంధం లేకుండా అభిమాన హారతులిస్తారు. నిజానికి అతను ఆడితే లోకమే చూస్తుంది. ఆ లోకంలో మనమూ ఉన్నాం. అందుకే ఆ క్రేజ్!గతంలో వచ్చి ఏం చేశాడు జగద్విఖ్యాత ఫుట్బాలర్ మెస్సీ 2011లోనూ భారత్కు వచ్చాడు. కానీ ఇది ప్రైవేట్ లేదంటే స్పాన్సర్, చారిటీ కోసం కాదు. క్రికెట్ క్రేజీ భారత్లో ఫుట్బాల్కు ప్రాచుర్యం కల్పించేందుకు ‘ఫిఫా’ ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు లయోనల్ వచ్చాడు. కోల్కతాలో సాల్ట్లేక్ మైదానంలో వెనుజులాతో జరిగిన ఈ మ్యాచ్లో మెస్సీ టీమ్ అర్జెంటీనా 1–0తో జయభేరి మోగించింది. ఈ అంతర్జాతీయ ‘ఫిఫా’ మ్యాచ్ ముగిసిన వెంటనే మరే కార్యక్రమం పెట్టుకోకుండానే అక్కడి (కోల్కతా) నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. అప్పటికి, ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు జట్టులో ఒకడు. ఇప్పుడు అతడొక్కడే ఆకాశమంత ఆనందం!డే–1 ఫస్ట్ హాఫ్ కోల్కతా మెస్సీ ఈవెంట్కు పెట్టిన పేరు ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’. నాలుగు నగరాల్లో ముందుగా అడుగు పెట్టేది కోల్కతాలో. అక్కడ తన 70 అడుగుల విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ ప్రత్యక్షంగా వెళ్లి రిబ్బన్ కట్ లాంటివి కాకుండా... వర్చువల్గా బస చేసిన హోటల్ నుంచే తన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటాడు. తర్వాత 10 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు జరిగే ‘యువభారతి క్రీడాంగణ్’ సత్కారానికి వెళ్తాడు. ఆ రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి వచ్చిన చిన్నారులతోనూ కాసేపు ముచ్చటిస్తాడుఎవరిని కలుస్తాడు: ‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్సౌరభ్ గంగూలీ, సీఎం మమతా బెనర్జీలతోపాటు పలువురు సెలబ్రిటీలను మెస్సీ కలుసుకుంటాడు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల దాకా సాల్ట్లేక్ మైదానాన్ని మోతేక్కిస్తాడు.డే–1 సెకండ్ హాఫ్ హైదరాబాద్ మొదటి రోజే అక్కడి నుంచి సాయంత్రం 4 కల్లా మెస్సీ నేరుగా హైదరాబాద్కు చేరుకుంటాడు. విరామం లేకుండా బిజిబిజీగా షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని రాత్రి 7 గంటలకు ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులతో కలిసి ‘గోట్ కప్’ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతాడు. ఎవరిని కలుస్తాడు: ఫలక్నుమా ప్యాలెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే విందులో మెస్సీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరవుతారు. డే–2 ముంబై పర్యటనలో రెండో రోజంతా వాణిజ్య రాజధాని ముంబైలో మెస్సీ బిజీబిజీగా గడుపుతాడు. వాంఖెడేలో చారిటీ మ్యాచ్ ఆడతాడు. ఇందులో క్రికెట్ స్టార్స్ తదితరులతో కలిసి చారిటీ మ్యాచ్ బరిలోకి దిగుతాడు. తర్వాత ఫ్యాషన్ షోలో స్వయంగా పాల్గొని ర్యాంప్ వాక్ చేయనున్నాడు. ఇది ముగిసిన వెంటనే ఖతర్–2022 ప్రపంచకప్ సాకర్కు సంబంధించిన వేలం జరుగుతుంది. ఇందులో మెస్సీ ఈ మెగా ఈవెంట్లో వేసుకున్న జెర్సీలు, కిట్లను వేలం వేయనున్నారు. ఎవరిని కలుస్తాడు: సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్, ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్లతో చారిటీ మ్యాచ్, బాలీవుడ్ స్టార్స్ జాన్ అబ్రహాం, కరీనా కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులతో ర్యాంప్ వాక్ చేస్తాడు.డే–3 ఢిల్లీ మూడో రోజు మెస్సీ దేశ రాజధానికి విచ్చేస్తాడు. ఇక్కడ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించే ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమంలో ప్రతిభావంతులైన భారత చిన్నారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగమవుతాడు. ఇతరత్రా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఢిల్లీ వాసుల్ని అలరించనున్నాడు. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో కలిసి పెనాల్టీ కిక్ షోలో పాల్గొంటాడు. సాకర్ ప్రియుల్ని ఉత్సాహపరిచే ఈవెంట్లలో భాగమవుతాడు. ఎవరిని కలుస్తాడు: ప్రముఖ సెలబ్రిటీలను కలిసాక... మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని ఫుట్బాల్ ముచ్చటలో భాగమవుతాడు.» దేశంలో సాకర్ దిగ్గజం గడిపేది 72 గంటలే! కానీ.... ఈ కాస్త సమయంలోనే తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్ని కవర్ చేయడమే అతిపెద్ద విశేషం. » కోల్కతా (తూర్పు), హైదరాబాద్ (దక్షిణ), ముంబై (పశ్చిమ), ఢిల్లీ (ఉత్తర) నగరాల్లో ఊపిరి సలపని బిజీ బిజీ షెడ్యూల్లో పాల్గొననున్నాడు. » నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాటామంతీ కలిపాక ఆఖర్లో ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే భేటీతో ఈ పర్యటన ముగుస్తుంది. » భారత టెస్టు, వన్డే కెప్టెన్శుబ్మన్ గిల్... దర్మశాలలో 14న మ్యాచ్ ముగిసిన వెంటనే తన ఫేవరెట్ ఫుట్బాలర్ను కలుసుకోనున్నాడు. » ఈ పర్యటన పూర్తిగా భారత సాకర్ ప్రియుల్ని అలరించడానికే తప్ప సీరియస్ ఫుట్బాల్ మ్యాచో, లేదంటే ఫ్రెండ్లీ మ్యాచో ఆడేందుకు మాత్రం కాదు. » ఫ్యాన్స్కు ఇది కాస్త లోటే అయినా... బోలెండత వినోదాన్ని ఈ నాలుగు నగరాల్లో పంచనున్నాడు. » కోల్కతాలో 78 వేల సీటింగ్ సామర్థ్యమున్న సాల్ట్లేక్ స్టేడియం కిక్కిరిసిపోనుంది. »‘గోట్ టూర్’ మొదలవుతోందే బెంగాల్లో... శనివారం ఉదయమే స్టేడియమంతా నిండిపోతోంది. 45 నిమిషాల పాటు మెస్సీ స్టేడియంలో సరదాగా ఆడుతూ పాడుతూ చేసే కిక్స్, ఫ్రీ కిక్స్ ముమ్మాటికి సాకర్ క్రేజీ బెంగాలీలను ఊపేయనున్నాయి. 60 మంది రూ. 10 లక్షల చొప్పున చెల్లించి...సింగరేణి ఆర్ఆర్9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ ఈ రెండు జట్ల మధ్య 15 నిమిషాల పాటు సరదా మ్యాచ్ జరుగుతుంది. 39 వేల సీటింగ్ సామర్థ్యమున్న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ఇప్పటికే 27 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. నేటి ఉదయం కల్లా హౌజ్ ఫుల్ అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. మెస్సీతో ఫొటో సెషన్ కోసం ఇప్పటికే 60 మంది రూ. 10 లక్షల చొప్పున చెల్లించి రిజిస్టర్ చేయించుకున్నారని..., ఈ 60 మందితో మెస్సీ ఫొటోలు దిగుతారని హైదరాబాద్ గోట్ టూర్ సలహాదారు పార్వతి రెడ్డి తెలిపారు.Hello, Messi fans of Bengal and India.First exclusive video of Messi from Kolkata Airport, shared by me.Follow me for every update on the GOAT’s Kolkata tour, I’ll guide everyone on where to go to see Messi.#MessiInIndia#Messi #GOATTourIndia #GOAT #FCBarcelona pic.twitter.com/clG27zZCWt— Arjya : ) (@ArjyaNeel) December 12, 2025 -
రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
రెండున్నరేళ్ల క్రితం ఉక్రెయిన్తో యుద్ధం మొదలు పెట్టిన రష్యా ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినట్లుంది. ఈ నేపధ్యంలో రష్యా ముందున్న ఒకేఒక్క ఆశాదీపం భారతదేశమేనని, అందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారత్లో పర్యటించారనే వాదన వినిపిస్తోంది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? యుద్ధం ప్రారంభమైన రెండేళ్ల వరకు జీడీపీలో ఎలాంటి తరుగుదల లేకుండా.. పైపైకి దూసుకుపోయిన రష్యాకు ఇప్పుడేమైంది?అది 2022 ఫిబ్రవరి 24. రష్యా దళాలు బెలారస్ మీదుగా ఉక్రెయిన్పై దురాక్రమణను ప్రారంభించాయి. క్రమంగా ఉక్రెయిన్కు సముద్రమార్గంతో సంబంధాలు లేకుండా ఈ ఆక్రమణ కొనసాగింది. అంటే.. దక్షిణ ఉక్రెయిన్లో ఉండే ప్రధాన పోర్టులు ఒడెస్సా, మైకొలైవ్తోపాటు.. మారియుపూల్ వరకు రష్యా కబ్జా చేసేసింది. అంతేకాదు.. నల్లసముద్రంతో సంబంధం లేకుండా.. అతిపెద్ద ప్రావిన్స్ అయిన జాపొరిజియా దక్షిణ భాగాన్ని ఆక్రమించి.. అక్కడి పౌరులకు రష్యా పౌరసత్వాన్ని ఇవ్వడం ప్రారంభించింది. తూర్పున డోనెట్స్క్, లుహాన్స్క్పై పట్టుసాధించింది. అంటే.. 2014లో ఆక్రమించిన క్రిమియా నుంచి రష్యాలోని బెల్గోల్ట్ వరకు రోడ్డు మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ పరిణామాలతో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు ఉక్రెయిన్ సముద్రంపై ఆధారపడకుండా చేసినట్లైంది.2020లో కొవిడ్ కల్లోలం తర్వాత అమెరికా సహా.. దాదాపుగా అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. రష్యా సొంతంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను తయారు చేసినా.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనా.. కారిమకుల జీతాలను పెంచిన పుతిన్ సర్కారు ద్రవ్యోల్బణ ప్రమాదం నుంచి గట్టెక్కింది. 2022లో యుద్ధం ప్రారంభమయ్యాక.. సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ వంటి కిరాయి సేనల కోసం డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం వరకు పరిస్థితులను నియంత్రించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనిపించినా.. 2023 నుంచి నియంత్రణ కోల్పోయింది. 2024లో ముదిరి పాకాన పడే పరిస్థితులు నెలకొన్నాయి.యుద్ధం మూడున్నరేళ్లుగా నడుస్తుండడంతో.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం రష్యాకు తలకు మించిన భారమవుతోంది. చమురు ఎగుమతులపై ఆశలు పెట్టుకున్నా.. ధరలు పడిపోయాయి. అమెరికా ఆంక్షలతో పలు దేశాలు రష్యా చమురు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి. దీంతో.. గత త్రైమాసికంలో జీడీపీ నేలముఖం చూడడం ప్రారంభించింది. 2023, 2024 సంవత్సరాల్లో 3-4% వృద్ధి నమోదైనా.. ఇప్పుడు మాత్రం పరిస్థితి చేయి దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు.. చివరకు వోడ్కాపైనా పన్నులను పెంచుతూ పరిస్థితిని నియంత్రించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి. ఈ పరిస్థితుల్లో రష్యా ముందు ఆశాదీపంగా కనిపిస్తున్న ఒకే ఒక్క దేశం భారత్..! అందుకే.. 2022 నుంచే రష్యా మన దేశానికి మరింత దగ్గరవ్వడం మొదలుపెట్టింది.నిజానికి రష్యా-భారత్ల మైత్రి చారిత్రకమైనది. ఓల్గా నుంచి గంగా వరకు స్నేహం ఫరిడవిల్లిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. అయితే.. చమురు కోసం ఇరాక్, సౌదీలపై ఆధారపడే భారత్కు కూడా ఇప్పుడు తక్కువ ధరకే చమురును అందించే రష్యా ఓ ఆశాజ్యోతిగా మారింది. రష్యా అత్యధికంగా చమురు ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిపోయింది. యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా నుంచి రోజుకు లక్ష బ్యారెళ్లలోపు చమురు మాత్రమే భారత్కు దిగుమతి అయ్యేది. ఇప్పుడు ఆ దిగుమతి ఏకంగా రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు పెరిగిపోయింది. అందుకే ట్రంప్ కూడా పదేపదే రష్యాను ఆర్థికంగా ఆదుకుంటున్నది భారతదేశమేనని వ్యాఖ్యానాలు చేస్తుంటారు. 38% రష్యా చమురు భారత్కే వెళ్తోందని, ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా భారత్ ఆజ్యం పోస్తోందంటూ కారాలుమిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే..!ఇప్పుడున్న పరిస్థితుల్లో.. భారత్ ఏమాత్రం చమురు దిగుమతులను తగ్గించినా.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. రష్యా చమురును భారత్ కొనడం ఆపేయనుందని ట్రంప్ ఒకట్రెండు సార్లు ప్రకటనలు చేసిందే దరిమిలా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. భారత్కు కావాల్సిన రక్షణపరమైన అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధమంటూ కీలక ఒప్పందాలు చేసుకున్నారు. చమురు కొనుగోళ్లను కొనసాగించేలా భారత్ను కోరారు. అవును.. ఇప్పుడు రష్యాకు పెద్దదిక్కు భారతే..! ఉక్రెయిన్లోని కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా భారత్ గనక రష్యా చమురు కొనుగోళ్లను కనీసం 20% తగ్గించినా.. రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందంటూ నివేదిక ఇచ్చింది. ఓ వైపు భారత్ను నమ్ముకుంటూనే.. రష్యా తమ ప్రజలపై పన్నుల భారం వేస్తోంది. రష్యాలో అధిక డిమాండ్ ఉండే వోడ్కాపై అదనంగా 5% పన్ను విధిస్తోంది. ఇక వ్యాట్ను 10శాతం నుంచి 11శాతానికి పెంచింది. అదనంగా పెరిగిన ఒక శాతం వ్యాట్ విలువ ఒక ట్రిలియన్ రూబిల్స్గా ఉంటుంది. అంటే.. 1,304 బిలియన్ డాలర్లన్నమాట. అంతేకాదు. ఇంతకాలం రష్యాలో చిరువ్యాపారులపై వ్యాట్ లేదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే వంకతో.. వారిపైనా దశలవారీగా పన్ను విధించేందుకు సిద్ధమైంది. రష్యాలో రెపోరేటు బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ వడ్డీ రేట్లు 15శాతానికి పైగా ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షల కారణంగా విదేశాల నుంచి అప్పు పుట్టే అవకాశాలు లేకుండా పోయాయి. అమెరికా, ఐరోపాలో ఉండే రష్యా ఆస్తులు, రష్యన్ల బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయి.ఆర్థికపరంగా రష్యాకు ఇప్పుడు భారత్ అత్యంత కీలకమైన మిత్రదేశం. అదే సమయంలో భారత్కు కూడా రక్షణపరంగా రష్యా ఆప్తమిత్రుడు. పాకిస్థాన్ దాడులను భారత్ సమర్థంగా ఎదుర్కొనేందుకు దోహదపడ్డ ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు మనకు రష్యా నుంచి వచ్చినవే. మిగ్ విమానాలు కూడా రష్యా సరఫరానే. నిజానికి భారత్ తన రక్షణ వ్యవస్థల అవసరాలను ‘మేకిన్ ఇండియా’లో భాగంగా తీర్చుకోవాలని నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడు రష్యా అధునాతన ఆయుధాలను విక్రయించేందుకు సిద్ధమవ్వడంతో.. దిగుమతుల వాటా 36శాతానికి పెరిగింది. నిజానికి దశాబ్దాలుగా భారత రక్షణ వ్యవస్థ బలోపేతానికి సహకరిస్తూ వచ్చిన ప్రధాన దేశం రష్యానే..! ఈ నేపథ్యంలో చమురు కొనుగోళ్ల ద్వారా మిత్రదేశం రష్యాను ఆదుకుంటూనే.. భారత్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశలో అడుగులు వేస్తోంది. భారత్ ఈ నిర్ణయం గనక తీసుకోకపోయి ఉంటే.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు..!-హెచ్.కమలాపతి రావు -
ఫస్ట్ క్లాస్ నేషనల్ హైవేలు.. మృత్యు మృగాలు!
ప్రతి నిమిషానికి 2.. గంటకు 136.. రోజులో 3,260 మంది.. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల రూపంలో పోతున్న ప్రాణాల సంఖ్య ఇది. సేఫ్టీ ప్రచారాలు.. చర్యలు ఈ లెక్కను మరుసటి ఏడాదికి పెరగకుండా ఆపలేకపోతున్నాయి. ఇందునా భారతదేశం యాక్సిడెంట్లకు హాట్స్పాట్గా కొనసాగుతూ వస్తోంది. లక్షలాది ప్రమాదాలు, అపార ప్రాణనష్టం దేశానికి ఒక పెద్ద సవాలుగా మారాయి. అందునా.. శీతాకాలంలో ఈ రేటు మరింతగా ఉంటోంది. ఆ లోతుల్లోకి వెళ్తే.. భారతదేశం రోడ్డు భద్రతలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. 2025 జనవరి-జూన్ మధ్య యాక్సిడెంట్లో రూపంలో 29,000 మంది(కేవలం జాతీయ రహదారులపైన) బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, భారత్లో ప్రతి సంవత్సరం సుమారు 1.5–1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు (అన్నిరకాల యాక్సిడెంట్ల రూపంలో). ఇది ప్రపంచ మొత్తం మరణాల్లో 11%గా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (2025) నివేదిక ప్రకారం.. రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ అత్యంత ప్రమాదకర దేశంగా ర్యాంక్ అయ్యింది. డ్రైవింగ్ పరిస్థితులు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, అధిక వేగం ప్రమాదాలకు కారణంగా ఈ నివేదిక చూపించింది. డాటా ఫర్ ఇండియా అనే సంస్థ సర్వే ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు నమోదు చేసే దేశం.కారణాలు ఇవిగో..👇👉చాలా రహదారులు సరైన డిజైన్ ప్రమాణాలు లేకుండా నిర్మించబడ్డాయి. వాటిపై సంకేతాలు (sign boards), స్పీడ్ బ్రేకర్లు, డివైడర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైటింగ్ లేకపోవడం రాత్రి సమయంలో ప్రమాదాలకు దారితీస్తోంది. 👉ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం.. అధిక వేగం, తప్పు దిశలో డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ దాటడం వంటి ఉల్లంఘనలు కారణాలుగా ఉంటున్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగతున్నాయి. వీటికి తోడు.. 👉టూవీలర్ హెల్మెట్, ఫోర్ వీలర్లో సీటు బెల్ట్ వాడకాలు కూడా మరణాల రేటుపై ప్రభావం చూపెడుతోంది. హిట్ అండ్ రన్, ఓవర్ స్పీడ్లు కూడా మరణాలకు కారణం అవుతున్నాయి.డబ్యూహెచ్వో అంచనా ప్రకారం, హెల్మెట్ వాడితే తల గాయాలు 40% తగ్గుతాయి, సీటు బెల్ట్ వాడితే మరణాలు 50% తగ్గుతాయి.👉ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ (Golden Hour) లో చికిత్స అందకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అంబులెన్స్ సేవలు, ట్రామా కేర్ సెంటర్లు సరైన స్థాయిలో ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు దూరంగా ఉండటం వల్ల సమయానికి చికిత్స అందక ప్రాణాలు పోతున్నాయి.శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరగుతున్నాయి. గణాంకాల ప్రకారం.. చలికాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 30వేలకు తక్కువగా ఉండడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పొగమంచు (Fog): దృశ్యమానం(విజిబిలిటీ) తగ్గిపోవడం వల్ల వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం సాధారణంగా మారింది.తడి రహదారులు: మంచు, తేమ కారణంగా రహదారులు జారిపోవడం, బ్రేకులు సరిగా పనిచేయకపోవడం.అధిక వేగం: డ్రైవర్లు వేగం తగ్గించకపోవడం, ఫాగ్ లైట్లు వాడకపోవడం.అత్యవసర సేవల ఆలస్యం: ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సహాయం అందకపోవడం వల్ల మరణాలు పెరుగుతాయి.యాక్సిడెంట్.. డెత్స్.. లెక్కలు:2022లో: 4.5 లక్షల ప్రమాదాలు, 1.5 లక్షల అధికారిక మరణాలు2023లో: 4.8 లక్షల ప్రమాదాలు, 1.72 లక్షల మరణాలు2024లో.. 4.73 లక్షల యాక్సిడెంట్లు(కాస్త తగ్గినా) మరణాలు 1.77 లక్షలకు పెరిగాయి2025 (జనవరి–జూన్): జాతీయ రహదారులపై 29,018 మరణాలు (పూర్తి గణాంకాలు రావాల్సి ఉంది) భారతదేశంలో హైవేలు మొత్తం రహదారి నెట్వర్క్లో ఉండేది కేవలం 2% మాత్రమే. వీటికి ఫస్ట్ క్లాస్ హైవేల గుర్తింపు ఉంది. కానీ, దేశంలో జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో 50% కంటే ఎక్కువ వాటా వీటికే ఉంది. 2025లో ఇప్పటిదాకా సగటున రోజుకి హైవేల మీద 150 మరణాలు సంభవించాయి. అంటే.. ప్రతీ గంటకూ ఆరు మరణాలు అన్నమాట. ఈ లెక్కన హైవేలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వెనుక నుంచి ఢీకొనడం (Rear-end collisions) రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా జరుగుతున్న విభాగం. ఇవి మొత్తం ప్రమాదాల్లో 21%కి కారణమవుతాయి. అలాగే మొత్తం మరణాల్లో 20% వీటి నుంచే ఉంటున్నాయి.హిట్-అండ్-రన్ కేసులు రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు పెద్ద కారణం. ఇవి మొత్తం మరణాల్లో 18% వాటా కలిగి ఉన్నాయి. లోయల్లో వాహనాల పడి జరిగే ప్రమాదాలు.. ఐదు శాతం కంటే తక్కువే ఉంటోంది. కానీ, వీటి ద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. మధ్యాహ్నా టైంలోనే అధిక యాక్సిడెంట్లు!గణాంకాలను (MoRTH నివేదికలు) పరిశీలిస్తే.. ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్య ప్రమాదాలు 25–30% వరకు నమోదవుతాయి. - మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో సుమారు 40% దాకా ఉంటోంది(అధిక రద్దీ కారణంగా..). ఇక.. సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి మధ్య ప్రమాదాల సంఖ్య 20–25% దాకా ఉంటోంది. అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల సమయంలోనే ప్రమాదాల సంఖ్య కనిష్టంగానే ఉంటోంది. కానీ, అర్ధరాత్రి దాటాక జరిగే యాక్సిడెంట్లలోనే మరణాల రేటు అధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల సంభవించే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్(2024లో 24వేల మరణాలు.. ఈ ఏడాది కూడా అంతకు మించే..), తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ,రాజస్థాన్లో అత్యధిక మరణాల నమోదు అవుతున్నాయి. ఈ లెక్కన సగం రోడ్డు ప్రమాదాలు ఈ రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. -
భారత టూరిస్ట్లకు షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: వీసాల విషయంలో అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పర్యాటక వీసాలపై కొత్తగా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా అమెరికాలో ప్రసవించి... తమ పిల్లలకు పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటే వీసాలు తిరస్కరించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.కాగా, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో వలసదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యటక వీసా (Visa) జారీ విషయంలోనూ ట్రంప్ సర్కార్ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా జన్మతః పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో పర్యాటక వీసా దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా..‘పుట్టబోయే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందడం పర్యాటకుల ప్రధాన ఉద్దేశంగా తాము భావిస్తే.. అటువంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తాం. ఇటువంటి వాటిని అనుమతించం’ అని పేర్కొంది. మరోవైపు తమ దేశంలోకి వచ్చే పర్యాటకుల్లో కొందరు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా హిస్టరీని అందించడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో, H-1B వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాల సమీక్షను కూడా విస్తరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.అంతేకాకుండగా.. అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో, విదేశాంగ శాఖ ఇప్పటికే F, M, J వంటి విద్యార్థి, సందర్శకుల వీసా వర్గాలకు సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సమీక్ష H-1B, H-4 దరఖాస్తుదారులకు కూడా డిసెంబర్ 15 నుంచి వర్తిస్తుంది. ట్రంప్ యంత్రాంగం ఇటీవల H-1B, H-4 దరఖాస్తుదారులందరికీ సోషల్ మీడియా స్క్రీనింగ్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఇది వేలాది మంది హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ప్రతి కేసును క్షుణ్ణంగా భద్రతా సమీక్ష చేస్తామని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. -
దేశంలోనే తొలిసారిగా హైడ్రో నావ!
వారాణసి: స్వచ్ఛ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ సాయంతో వాణిజ్యపరమైన నా వికా సేవలకు తెర తీసింది. వారణాసిలోని నమో ఘాట్ ఇందుకు వేదికైంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నావను కేంద్ర జల వనరులు, నౌకాయాన మంత్రి శర్బానంద్ సోనోవాల్ గురువారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయేతర, దీర్ఘకాలిక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘మన మిప్పుడు హైడ్రో ఇంధనాన్ని వాడుతున్న చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్ వంటి అతి కొద్ది దేశాల సరసన సగర్వంగా నిలిచాం. ఇది కేవలం సాంకేతిక ప్రగతి మా త్రమే కాదు. స్వచ్ఛ ఇంధనం, దాని వాడకం నిమిత్తం దేశీయ మార్గాల రూపకల్పన దిశగా మనం వడివడిగా వేస్తున్న ముందడుగు తిరుగులేని సూచిక. అంతర్గత జల మార్గాలు దేశాభివృద్ధిలో కీ పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతున్నాయి. జాతీయ జల మార్గాల సంఖ్య గడచిన పదేళ్లలో సంఖ్య 5 నుంచి ఏకంగా 111కు పెరిగింది! వాటిలో 13 జల మార్గాల్లో పర్యాటకం నానాటికీ ఇతోధికంగా పెరిగిపోతోంది. ఇదెంతో శుభసూచకం. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ వల్లే ఇది సాధ్యపడింది‘ అన్నారు. హైడ్రో ఇంధన సేవలను పూర్తిస్థాయిలో వినియోగించాలంటే మరిన్ని పరిశోధనలు, కీలక పరీక్షలు చేయాల్సి ఉంది. -
కీలక టెక్నాలజీల్లో భారత్ స్వావలంబన సాధించాలి
గాందీనగర్: దేశ పురోగతికి అవరోధాలుగా మారే భౌగోళిక, రాజకీయ సవాళ్లను అధిగమించే దిశగా కీలక టెక్నాలజీలను సమకూర్చుకోవడం, పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడంలో భారత్ స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ధీమా సడలిపోతుంటే భారత్ మాత్రం ఆకాంక్షలు, ఆత్మ విశ్వాసంతో ఉత్సాహంగా ముందుకు ఉరకలేస్తోందని.. అధిక ఆర్థిక వృద్ధి సాధిస్తోందని పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం తెలిపారు. ‘దశాబ్దం క్రితం మిగతా దేశమంతా వైబ్రెంట్ గుజరాత్ గురించి మాట్లాడుకునేది. ఇప్పుడు మిగతా ప్రపంచమంతా వైబ్రెంట్ ఇండియా గురించి మాట్లాడుకుంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ సుమారు 8 శాతం వృద్ధి సాధిస్తోంది. కృత్రిమ మేథ, నూతన ఇంధనాలు, స్పేస్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్లాంటి క్రిటికల్ టెక్నాలజీలు, పరిశ్రమల విషయంలో స్వావలంబన సాధించాలి. ఈ రేసులో గెలి్చనవారే విశ్వవిజేతలు‘ అని అంబానీ పేర్కొన్నారు. టెక్నాలజీ శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో ఆసక్తి, ధైర్యాన్ని మార్గదర్శక సూత్రాలుగా పాటించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. -
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ పోటీలకు సింధు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలకు స్టార్ ఆటగాళ్లతో భారత్ సిద్ధమైంది. ఫిబ్రవరి 3 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) గురువారం ప్రకటించింది. రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీల్లో మహిళల విభాగంలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్కాగా... పురుషుల విభాగంలో టీమిండియా రెండుసార్లు కాంస్య పతకాలు సాధించింది. ‘ర్యాంకింగ్, ప్రదర్శన, అనుభవం ఆధారంగా జట్లను ఎంపిక చేశాం. మహిళల జట్టును రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధు ముందుండి నడిపిస్తుంది’ అని ‘బాయ్’ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల జట్టులో భారత నంబర్వన్, ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్తోపాటు ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, రైజింగ్ స్టార్స్ ఆయుశ్ శెట్టి, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి ఉన్నారు. భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, రక్షిత శ్రీ, మాళవిక బన్సోద్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ప్రియా కొంజెంగ్బమ్, శ్రుతి మిశ్రా, తనీషా క్రాస్టో. భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్ మన్నేపల్లి, సాతి్వక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, సాయిప్రతీక్, హరిహరన్. -
తిలక్ పోరాడినా... తప్పని ఓటమి
తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ తర్వాతి పోరులో సునాయాసంగా తలవంచింది. పేలవ బౌలింగ్తో 22 అదనపు పరుగులు ఇచ్చి మరీ ప్రaత్యర్థి భారీ స్కోరుకు కారణమైన జట్టు బ్యాటింగ్లోనూ తేలిపోయింది. బ్యాటింగ్లో డికాక్ మెరుపులతో పాటు మంచులో కూడా పట్టు తప్పకుండా వేసిన బౌలింగ్తో సఫారీలు పైచేయి సాధించారు. హైదరాబాదీ తిలక్ వర్మ ఒంటరి పోరాటం మినహా ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. న్యూ చండీగఢ్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్ 1–1తో సమమైంది. గురువారం జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో భారత్పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... చివర్లో డొనొవాన్ ఫెరీరా (16 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. భారత్ ఏకంగా 22 ఎక్స్ట్రాలు ఇవ్వగా, ఇందులో 16 వైడ్లు ఉన్నాయి. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, బార్ట్మన్కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది.సమష్టి ప్రదర్శన... ఓపెనర్ డికాక్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను దూకుడుగా మొదలు పెట్టగా, హెన్డ్రిక్స్ (8) విఫలమయ్యాడు.అర్ష్ దీప్ ఓవర్లో 4, 6 కొట్టిన డికాక్ బుమ్రా ఓవర్లో మరో సిక్స్ బాదాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. మార్క్రమ్ (26 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్లు) నెమ్మదిగా ఆడగా, జోరు కొనసాగిస్తూ డికాక్ 26 బంతుల్లోనే (4 ఫోర్లు, 4 సిక్స్లతో) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుణ్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన మార్క్రమ్ అదే ఓవర్లో వెనుదిరిగాడు. మరోవైపు అర్ధ సెంచరీ తర్వాత డికాక్ తాను ఆడిన తర్వాతి 19 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. అయితే సెంచరీకి చేరువైన దశలో కీపర్ జితేశ్ చురుకుదనం కారణంగా డికాక్ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. బ్రెవిస్ (14) ఎక్కువ సేపు నిలవలేకపోయినా... ఫెరీరా, మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరును అందించింది. బుమ్రా వేసిన చివరి ఓవర్లో ఫెరీరా రెండు సిక్సర్లు బాదాడు. తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా తర్వాతి 10 ఓవర్లలో 123 పరుగులు రాబట్టింది. ఓపెనర్లు విఫలం... శుబ్మన్ గిల్ (0) తాను ఆడిన తొలి బంతికే వెనుదిరగ్గా, 2 సిక్స్లు బాదిన అభిషేక్ శర్మ (17) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. సూర్యకుమార్ (5) వైఫల్యాల బాట కొనసాగగా, మూడో స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ (21) పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఫోర్, సిక్స్తో ఖాతా తెరిచిన తిలక్ ఆ తర్వాత కూడా నాలుగు బంతుల వ్యవధిలో రెండు సిక్స్లు బాది ఆధిపత్యం ప్రదర్శించాడు. ఎన్గిడి బౌలింగ్లో మరో సిక్స్తో 27 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 20; 1 సిక్స్) ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత తిలక్, జితేశ్ శర్మ (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కలిసి గెలిపించేందుకు పోరాడినా లాభం లేకపోయింది. 14 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ 9 బంతుల వ్యవధిలో 5 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది. సఫారీలు ఒకే ఒక వైడ్ వేయడం విశేషం! స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (రనౌట్) 90; హెన్డ్రిక్స్ (బి) వరుణ్ 8; మార్క్రమ్ (సి) అక్షర్ (బి) వరుణ్ 29; బ్రెవిస్ (సి) తిలక్ (బి) అక్షర్ 14; ఫెరీరా (నాటౌట్) 30; మిల్లర్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 22; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–156, 4–160. బౌలింగ్:అర్ష్ దీప్ 4–0–54–0, బుమ్రా 4–0–45–0, వరుణ్ 4–0–29–2, అక్షర్ 3–0–27–1, పాండ్యా 3–0–34–0, దూబే 2–0–18–0. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 17; గిల్ (సి) హెన్డ్రిక్స్ (బి) ఎన్గిడి 0; అక్షర్ (సి) హెన్డ్రిక్స్ (బి) బార్ట్మన్ 21; సూర్యకుమార్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 5; తిలక్ (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 62; పాండ్యా (సి) బ్రెవిస్ (బి) సిపామ్లా 20; జితేశ్ (సి) బార్ట్మన్ (బి) సిపామ్లా 27; దూబే (బి) బార్ట్మన్ 1;అర్ష్ దీప్ (సి) మిల్లర్ (బి) బార్ట్మన్ 4; వరుణ్ (సి) మార్క్రమ్ (బి) బార్ట్మన్ 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 162. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–32, 4–67, 5–118, 6–157, 7–158, 8–162, 9–162, 10–162. బౌలింగ్: ఎన్గిడి 3.1–0–26–2, యాన్సెన్ 4–0–25–2, సిపామ్లా 4–0–46–2, ఫెరీరా 1–0–14–0, బార్ట్మన్ 4–0–24–4, లిండే 3–0–23–0.అర్ష్దీప్ 13 బంతుల ఓవర్! 6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1...అర్ష్ దీప్ సింగ్ వేసిన ఒక ఓవర్లో 13 బంతుల వరుస ఇది! దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో 11వ ఓవర్ వేసినఅర్ష్ దీప్ ఏకంగా 7 వైడ్లు వేశాడు. తొలి బంతిని డికాక్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదగా... మిగతా 5 లీగల్ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి. -
త్వరలో ప్రధాని మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని భేటీ!
న్యూఢిల్లీ/జెరూసలేం: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో సంభాషించారు. ఈ సంభాషణలో నెతన్యాహూ, ప్రాంతీయ పరిస్థితులపై మోదీకి వివరాలు అందించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి, భద్రత కోసం భారత్–ఇజ్రాయెల్ ఒకే వేదికపై నిలబడుతున్నాయని స్పష్టం చేశారు.నేతన్యాహూ, గాజా-ఇజ్రాయెల్ ఘర్షణలు, ప్రాంతీయ భద్రతా సవాళ్లపై మోదీకి వివరించారు. ఈ పరిస్థితుల్లో భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యం మరింత కీలకమని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. మోదీ-నేతన్యాహూ సంభాషణ, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచనుంది. రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, భద్రతా రంగాల్లో సహకారం పెరుగుతుందని అంచనా. ఫోన్ సంభాషణలోనే ఇద్దరు నాయకులు త్వరలో ముఖాముఖి సమావేశం జరపాలని అంగీకరించారు. ఈ సమావేశం ద్వారా పశ్చిమ ఆసియా శాంతి, స్థిరత్వం కోసం కొత్త వ్యూహాలు రూపొందే అవకాశం ఉంది. Spoke with my friend Prime Minister Netanyahu. We reviewed progress in the India-Israel Strategic Partnership and agreed to further strengthen our cooperation. Also reaffirmed our shared commitment to zero tolerance for terrorism. India supports all efforts aimed at achieving a…— Narendra Modi (@narendramodi) December 10, 2025ఇదిలా ఉంటే.. గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4,5 తేదీల్లో భారత్ పర్యటన చేశారు. ఈ సందర్భంగా రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచాయి. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు,ప్రధాని మోదీల మధ్య ఫోన్ సంభాషణ జరగడం చర్చాంశనీయంగా మారింది. -
భారత్లో నచ్చిన పార్టీకి ఓటేసే ఛాన్స్ వస్తే..
నచ్చిన అభ్యర్థికే ఓటేయడం అన్నది ఓటర్ల ఇష్టం. కానీ, నచ్చిన పార్టీకి కూడా ఓటేసే అవకాశం వస్తే.. దాని ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితుల ఏర్పడితే??. ఇందుకోసం ఒక ఓటరు.. రెండు ఓట్ల విధానం మన దేశంలోనూ అమలయ్యేలా చూడాలని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు. లోక్సభ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విప్లవాత్మక సంస్కరణను ప్రతిపాదన చేశారాయన. ఇంతకీ ఇలాంటి విధానం ఒకటి ఉందని.. అది ఏ దేశంలో అమల్లో ఉందని.. అది ఎలా పని చేస్తుందనే విషయం మీకు తెలుసా?..ఎమ్ఎమ్పీ (మిక్స్డ్ మెంబర్ ప్రపొర్షనల్) మోడల్.. జర్మనీ దేశం ఈ పద్దతిని ఫాలో అవుతోంది. దీని ప్రకారం.. అర్హత గల పౌరులకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటుతో అభ్యర్థులను నేరుగా ఎన్నుకుంటారు. గెలిచిన వారు నేరుగా పార్లమెంట్కి వెళ్తారు. మరో ఓటు మాత్రం పార్టీలకు వేయాల్సి ఉంటుంది!.దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో దాని ఆధారంగా మొత్తం పార్లమెంట్లో ఆ పార్టీకి ఉండాల్సిన సీట్లు(అదనపు) నిర్ణయిస్తారు. ఆ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి కూడా.!ఉదాహరణకు.. A, B, C అనే మూడు పార్టీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్లు.. తమ నియోజకవర్గంలో ఎవరు గెలవాలో నిర్ణయించడానికి ఓటేస్తారు.. రెండో ఓటు దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం సీట్ల రావాలో నిర్ణయించడానికన్నమాట. ఇందులో A అనే పార్టీ స్థానికంగా 180 సీట్ల నెగ్గింది. B అనే పార్టీ 90 సీట్లు గెలిచింది. C అనే పార్టీ 29 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే.. దేశవ్యాప్తంగా ఓట్ల శాతం అంటే పార్టీ ఏకి వచ్చిన ఓట్లు 40% ఓట్లు( రేషియో ప్రకారం.. 280 సీట్లు రావాల్సి ఉంటుంది), పార్టీ బీకి 35% ఓట్లు(రేషియో ప్రకారం.. 245 సీట్లు రావాల్సి ఉంటుంది). పార్టీ సీకి 25% ఓట్లు(175 సీట్లు రావాల్సి ఉంటుంది) పోలయ్యాయి. ఈ లెక్క ప్రకారం.. పార్టీ ఏకి అదనంగా 100 సీట్లు, పార్టీ బీకి అదనంగా 155 సీట్లు, పార్టీ సీకి అదనంగా 146 సీట్లు కేటాయిస్తారు.జర్మనీలో ఎవరు అధికారంలోకి వస్తారో అనేది ఎక్కువ ఓట్లు పొందిన పార్టీ + ఎవరు కూటమి చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పార్టీ A (40%) ఒంటరిగా మెజారిటీ సాధించలేకపోతే, పార్టీ C (25%)తో కలిస్తే 65% మెజారిటీ వస్తుంది. అలాగే పార్టీ B (35%) + పార్టీ C (25%) కలిస్తే 60% మెజారిటీ వస్తుంది. ఇలా MMPలో స్థానిక గెలుపు + జాతీయ ఓట్ల శాతం రెండూ కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి.భారత్లో.. భారత్ పార్లమెంటరీ ఎన్నికల విధానాన్ని అవలంభిస్తోంది. దీనిని ఎఫ్పీటీపీ ( First Past The Post)గా వ్యవహరిస్తారు. ఈ విధానంలో ప్రజలు నేరుగా అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఏ వ్యక్తికైతే అధికంగా ఓట్లు పోలవుతాయో వారినే విజేతగా నిర్ణయిస్తారు. ఎక్కువ సభ్యులు ఏ పార్టీ వాళ్లు ఉంటే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజారిటీ గనుక సాధించకపోతే అప్పుడు కూటమికి వెళ్తుంది. అంతేగానీ.. పార్టీలకు ప్రత్యేకించి సీట్ల కేటాయింపు అనేది ఉండదు.మిక్స్డ్ విధానం వల్ల ఒరిగేదేంటి?..ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం పార్లమెంట్లో న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అంటే, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రకారం సీట్లు కేటాయించబడతాయి, దీనివల్ల చిన్న పార్టీలకు కూడా అవకాశం కలగవచ్చు. అలాగే స్థానిక ప్రతినిధులు కూడా ఎలాగూ ఉండనే ఉంటారు. చట్ట సభలో స్థానికత ఫ్లస్ జాతీయ విధానం రెండూ ప్రతిబింబిస్తాయి.ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అరుదుగా జరగొచ్చు. కాబట్టి రెండు లేదంటే అంతకంటే ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. దీని వల్ల సహకారం, చర్చలు, సమతుల్య నిర్ణయాలు ఎక్కువగా జరుగుతాయి.ఓటర్లు తమ ప్రాంతానికి ఒక ప్రతినిధిని ఎంచుకోవచ్చు. అదే సమయంలో, తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసి దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సీట్లు పెంచవచ్చు. దీని వల్ల ఓటు వృథా అనే ప్రస్తావనే ఉండదు. ఎంఐఎం అధినేత ఒవైసీ ఈ ఎంఎంపీ మోడల్ను భారతదేశంలో అమలు చేయాలని ప్రతిపాదించడం వెనుక బలమైన కారణం ఉంది, భారత్లో ప్రస్తుతం అమలువుతున్న FPTP విధానం వల్ల చట్టసభలో చిన్న పార్టీలకు, మైనారిటీలకు, ప్రాంతీయ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రాతినిధ్యం కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎఫ్పీటీపీ వల్ల విధానంలో ఒక పార్టీకి తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు రావొచ్చు. కానీ ఎంఎంపీలో అలాంటిది జరిగే అవకాశం ఉండదు. తద్వారా ప్రజాస్వామ్యం మరింత సమతుల్యంగా ఉంటుంది. -
టారిఫ్ పిడుగు.. న్యూఇయర్ రోజు భారత్కు భారీ షాక్!
న్యూఢిల్లీ: న్యూ ఇయర్లో కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? లేదంటే ఇతర వాహనాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే తస్మాత్ జాగ్రత్త. త్వరలో ఆటోమొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు భారత్పై మెక్సికో విధించే 50 శాతం సుంకమే కారణమని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.న్యూఇయర్ జనవరి1,2026 నుంచి మెక్సికో నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం వసూలు చేయనుంది. ఇప్పటికే భారత్ దిగుమతులపై అమెరికా 50శాతం అంతకంటే ఎక్కువగా సుంకాలు విధించింది. తాజాగా,మెక్సికో సైతం భారత్ దిగుమతులపై భారీ ఎత్తున టారిఫ్ వసూలు చేసేందుకు సిద్ధం కాగా.. అందుకు ఆదేశ సెనేట్ సైతం ఆమోదం తెలిపింది. మెక్సికో భారత్, చైనాతో పాటు ఇతర ఆసియా దేశాల నుంచి సుంకాలను వసూలు చేయనుంది.ఫలితంగా మెక్సికో నుంచి భారత్ భారీ స్థాయిలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 50శాతం సుంకాల్ని చెల్లించాల్సి వస్తుంది. వాటిలో ప్రధాన ఉత్పత్తులు వాహనాలు, వాహనాల విడిభాగాలు, టెక్స్టైల్స్, ప్లాస్టిక్, స్టీల్ ఉంది. అలా చెల్లించే పరిస్థితి వస్తే దేశీయంగా సంబంధిత వస్తువుల ఉత్పత్తుల అమాంతం పెరిగే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ దేశీయంగా తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తాజాగా, భారత్ దిగుమతులపై సుంకం విధించే దిశగా చర్యలు తీసుకున్నారు. భారత్పై ప్రతికూల ప్రభావంభారత్పై 50శాతం వరకు సుంకాలను విధించాలన్న మెక్సికో చర్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మెక్సికన్ ఎగుమతులకు భారత్ తొమ్మిదవ స్థానంలో ఉంది. ప్రస్తుతం, భారత్.. మెక్సికోతో అధిక మొత్తంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 2024లో భారత్ నుంచి మెక్సికోకు ఎగుమతులు దాదాపు 8.9 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 2.8 బిలియన్లుగా ఉంది.గతేడాది భారత్.. మెక్సికో నుంచి వాహనాలు, వాటి తయారీలో వినియోగించే ఆటో విడిభాగాలు,ఇతర ప్రయాణీకుల వాహనాలు. ఇప్పుడు, మెక్సికో ఈ వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో.. వచ్చే ఏడాది దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశ ఉందని ఆర్థిక నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
భారత్కు ‘బంగ్లా’ దౌత్య ద్రోహం.. పాక్, చైనాలతో జతకట్టి..
న్యూఢిల్లీ: పాకిస్తాన్-చైనా నేతృత్వంలోని కొత్త ప్రాంతీయ కూటమిలో చేరేందుకు బంగ్లాదేశ్ అమితమైన ఆసక్తి చూపిస్తున్నదనే వార్తలు ఇటీవలి కాలంలో విరివిగా వినిపిస్తున్నాయి. ఇది దక్షిణాసియాలో కీలక వ్యూహాత్మక మార్పును సూచిస్తున్నది. భారతదేశం లేకుండా, పాకిస్తాన్తో కలిసి ప్రాంతీయ కూటమిలో చేరడం బంగ్లాదేశ్కు వ్యూహాత్మకంగా సాధ్యమే అని బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఢాకా, బీజింగ్, ఇస్లామాబాద్లతో కూడిన కొత్త త్రైపాక్షిక సమూహంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సూచన చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది.యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారధ్యంలో..2024ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతి అనంతరం పాకిస్తాన్-బంగ్లాదేశ్ సంబంధాలు వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాలలో విస్తరిస్తూ వస్తున్నాయి. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారధ్యంలో ఈ రెండు దేశాల మధ్య సహకారం పెరుగుతోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం.. న్యూఢిల్లీ, బీజింగ్, వాషింగ్టన్లను నొప్పించకుండా సమతుల్య సంబంధాలను చాకచక్యంగా కొనసాగించింది. నాడు భారతదేశం ఒక కీలక భాగస్వామిగా ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులలో ఢాకా.. ఇస్లామాబాద్, బీజింగ్ వైపు మొగ్గు చూపుతూ, భారత్తో సమతుల్య భాగస్వామ్యాన్ని కోల్పోయింది.చైనాలోని కున్మింగ్లో మంతనాలుఈ ప్రాంతీయ కూటమి చర్చలు గత ఏడాది నుండి వేగం అందుకున్నాయి. గత జూన్లో చైనా, బంగ్లాదేశ్,పాకిస్తాన్లు చైనాలోని కున్మింగ్లో తమ మొదటి అధికారిక త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, మౌలిక సదుపాయాలు , రుణ నిర్వహణలో సహకారాన్ని పెంపొందించేందుకు మూడు పక్షాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. మరోవైపు పాకిస్తాన్ తాజాగా భారతదేశాన్ని మినహాయించి, చైనాను భాగస్వామిగా చేర్చుకుంటూ, విస్తృతమైన దక్షిణాసియా కూటమిని ప్రతిపాదిస్తున్నది. ఈ నేపధ్యంలో ఇస్లామాబాద్- బీజింగ్ మధ్య ఈ అంశంపై చర్చలు జరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.‘త్రైపాక్షిక సంబంధం’తో కొత్త చిక్కులు?భారతదేశం కీలక సభ్యురాలిగా ఉన్న సార్క్ (SAARC) స్థానంలో కొత్త ప్రాంతీయ కూటమిని సృష్టించేందుకు పాకిస్తాన్- చైనాలు పనిచేస్తున్నాయనే వార్తలు కూడా కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యూహాత్మక కూటమి ఏర్పాటు దక్షిణాసియాలో చైనాకు పెరుగుతున్న ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తున్నది. భారతదేశాన్ని మినహాయించి, చైనాను భాగస్వామిగా చేర్చుకుంటూ పాకిస్తాన్ ప్రతిపాదిస్తున్న ఈ కూటమి, కొత్త భౌగోళిక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.ఈ అభివృద్ధి చెందుతున్న త్రైపాక్షిక సంబంధం (బంగ్లాదేశ్-చైనా-పాకిస్తాన్) ప్రాంతీయ దౌత్యానికి, భవిష్యత్తులో దక్షిణాసియా కూటమికి చిక్కులను తీసుకువచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: Tamil Nadu: విజయ్-రంగస్వామి మెగా ప్లాన్.. -
జర జాగ్రత్త.. వాయు కాలుష్యం డేంజర్ బెల్స్
వాతావరణ మార్పులతో ప్రపంచ దేశాలన్నీ సతమతమవుతున్నాయి. భారత్ సహా అనేక దేశాల్లో నాణ్యమైన గాలి, మంచి ఆహారం దొరకడం గగనమైతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్లో వాయు కాలుష్యం కారణంగా ఏటా 20 లక్షల మంది వరకు చనిపోతున్నారని ది లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్లో ఓ అధ్యయనం పేర్కొంది. రానున్న రోజుల్లో వాయు కాలుష్యం కారణంగా మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.నివేదిక ప్రకారం.. దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురికావడంతో 2009 నుంచి 2024 మధ్య భారత్లో ఏటా 15 లక్షల నుంచి 20 లక్షల మరణాలు సంభవించాయని పేర్కొంది. దేశంలో 140 కోట్ల మంది జనాభాలో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్దేశించిన ప్రమాణం (ఏడాదికి ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాములు) కంటే ఎక్కువ పీఎం2.5 వాయుకాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారని తెలిపింది. జాతీయ గాలి నాణ్యత ప్రమాణం (ఘనపు మీటరుకు 40 మైక్రాన్లు) కంటే ఎక్కువగా.. వార్షిక సగటు పీఎం2.5 స్థాయి వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో దేశ జనాభాలోని సుమారు 82 శాతం మంది నివసిస్తున్నట్లు పరిశోధన బృందం గుర్తించింది. ఏటా ఈ కాలుష్యం పెరుగుదల 8.6 శాతంగా ఉందని తెలిపింది. ఈ కారణంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.రాష్ట్రాల వారీగా ప్రభావం ఇలా.. (2025 AQI డేటా ఆధారంగా)అధిక ప్రభావం ఉన్న రాష్ట్రాలు / ప్రాంతాలుఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్. పంట అవశేషాల దహనం, ట్రాఫిక్, పరిశ్రమల ఎమిషన్స్, కన్స్ట్రక్షన్ ధూళి ప్రధాన కారణాలు. ఢిల్లీలో 2023లో జరిగిన మొత్తం మరణాల్లో దాదాపు 15%కి పైగా వాయు కాలుష్యం సంబంధం ఉందని పలు అధ్యయనాలు తెలిపాయి. మధ్యస్థ ప్రభావం ఉన్న రాష్ట్రాలుమహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్ము & కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు).మెట్రో నగరాలు: ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె ఉన్నాయి. హైదరాబాద్లో PM2.5, NO₂ స్థాయిలు WHO గైడ్లైన్స్ను అధిగమిస్తున్నాయి. ముఖ్యంగా హై ట్రాఫిక్ కారిడార్లు, పరిశ్రమ ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆమీర్పేట్ వంటి ప్రాంతాలు వాయు కాలుష్యం పెరిగినట్టు ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేశాయి.వాయు కాలుష్య కారకాలు..PM2.5 సూక్ష్మకణాలు: ఇవి ఊపిరితిత్తుల్లోకి లోతుగా వెళ్లి రక్తంలోకి చేరి గుండె, మెదడు మీద ప్రభావం చూపుతాయి. PM2.5 స్థాయిలు WHO సూచించిన పరిమితి కంటే చాలా ఎక్కువగా 10 ప్రధాన నగరాల్లో కనిపిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది.ఓజోన్ (O₃), నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్: ట్రాఫిక్, పవర్ ప్లాంట్లు, పరిశ్రమల వల్ల వస్తాయి. ఇండోర్ కాలుష్యం: వంట కోసం ఘన ఇంధనాలు (wood, dung, coal) ఉపయోగించే ఇళ్లలో, ఎక్కువగా గ్రామీణ మహిళలు, పిల్లలు ప్రభావితం అవుతున్నారు.కార్బన్ డయాక్సైడ్: గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణమైన వాయువు కార్బన్ డయాక్సైడ్. శిలాజ ఇంధనాలు పూర్తిగా దహనం కాకపోవడం వల్ల; విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి ఈ వాయువు విడుదలవుతుంది. కేవలం శిలాజ ఇంధనాల వినియోగం వల్లే ఏటా సుమారు 2.5 × 10*13 టన్నుల కార్బన్డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తోంది.కార్బన్ మోనాక్సైడ్: ఇది చాలా ప్రమాదకర విషవాయువు. శిలాజ ఇంధనాలు అసంపూర్తిగా దహనమవడం, వంట చెరకును మండించినప్పుడు, బొగ్గును కాల్చినప్పుడు ఎక్కువగా విడుదలవుతుంది. దీన్ని పీల్చడం వల్ల రక్తంలోని ‘హీమోగ్లోబిన్’ ఆక్సిజన్కు బదులు, ఈ వాయువుతో ఆక్సీకరణం చెంది ‘కార్బాక్సీ హీమోగ్లోబిన్’గా మారుతుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. దీన్నే ‘హైపోక్సియా’ అంటారు. ఇంకా మెదడు దెబ్బతినడం, కంటిచూపు మందగించడం, మతి భ్రమించడం లాంటి మస్తిష్క వ్యాధులకు దారితీస్తుంది.సల్ఫర్డయాక్సైడ్: ప్రధానంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు, మోటారు వాహనాల నుంచి విడుదలవుతుంది. దీనిస్థాయి వాతావరణంలో 1 PPM దాటినప్పుడు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల ఆమ్లవర్షాలు కురుస్తాయి. ఫలితంగా చర్మక్యాన్సర్లు రావచ్చు. ఈ వ్యాధికారక గాలి మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి.నైట్రోజన్ ఆక్సైడ్: పెట్రోల్, డీజిల్తో నడిచే మోటారు వాహనాలు; విద్యుత్తు జనరేటర్లు, పంట పొలాల్లో వాడిన నత్రజని ఎరువుల వాడకం ద్వారా సాధారణంగా నైట్రోజన్ ఆక్సైడ్ గాలిలో కలుస్తుంది. దీనివల్ల గ్రీన్హౌస్ వాయువులు విడుదలై భూతాపానికి (గ్లోబల్ వార్మింగ్) కారణమవుతున్నాయి. కాలేయం, మూత్రపిండాలకు నష్టం కలగడం, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.క్లోరోఫ్లోరో కార్బన్లు: మస్కిటో కాయిల్స్, ఫ్రిజ్లు, అత్తరు నుంచి ఇవి విడుదలై భూతాపాన్ని పెంచుతున్నాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడం; అధిక రక్తపోటు, ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి. వీటితో పాటు భార లోహలైన మెర్క్యూరీ, లెడ్, కాడ్మియం లాంటివి వాతావరణంలోకి విడుదలై కేంద్ర నాడీవ్యవస్థ, మెదడు దెబ్బతింటాయి. కాడ్మియం నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. మెర్క్యూరీ ప్రభావంతో జింజివాటా, మినిమాటా లాంటి వ్యాధులు వస్తాయి.నివారణ పద్ధతులు..వాహనాల్లో సీసం లేని పెట్రోల్ను వాడాలి.సంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా బయోడీజిల్, బయోగ్యాస్, బయోమాస్ లాంటివి వినియోగించాలి.థర్మల్ విద్యుత్తు పరిశ్రమల నుంచి వెలువడే రేణు రూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అనే ఫిల్టర్లను తప్పనిసరిగా వాడాలి.పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని సూక్ష్మ రేణువుల్లాంటి వాయుకాలుష్య కారకాలను తీసివేయడానికి స్క్రబ్బర్ వాడాలి. అంటే సున్నపురాయి తెట్టు లేదా సిమెంట్ బూడిద స్లర్రీ వినియోగించాలి.వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి, వాయు నాణ్యత ప్రమాణాలను ప్రజలకు తెలియజేయడానికి భారత్/యూరో ఇంధన ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలి. ఇప్పటివరకు యూరో - 6 ప్రమాణాలు అమల్లో ఉన్నాయి.ఇళ్లలో వంటచెరకుగా పిడకలు, కర్రలకు బదులుగా ఎల్పీజీ గ్యాస్ వాడకం పెంచాలి. శీతలీకరణ యంత్రాల్లో సి.ఎఫ్.సి. లకు బదులుగా ద్రవ నత్రజని వినియోగించాలి.రవాణా రంగంలో చమురు ఆధారిత పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కంప్రెసర్, నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) హైడ్రోజన్ ఇంధనం, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలి.వాయు ఉద్గారాల్లో 20 శాతం మేరకు ఉద్గారాలను భారీ స్థాయిలో చెట్ల పెంపకం ద్వారా కార్బన్ సింక్ చేయవచ్చని యూఎన్ఓ చెబుతోంది. దీనికోసం UNO - REDD (Reducing Emissions from deforestation and Degradation) అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. భారీ స్థాయి అటవీకరణ ద్వారా కార్బన్ డయాక్సైడ్ను తొలగించే ప్రక్రియను కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు.కాలుష్య బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం అనే ‘పొల్యూటర్ పే’ సూత్రాన్ని పర్యావరణ చట్టం (1986)లో చేర్చాలని సుప్రీంకోర్టు 1996లో సూచించింది. ఈ సూచనను అన్ని మంత్రిత్వ శాఖల్లో అమలుచేయాలి.వాహనాల పొగ గొట్టాల్లో కెటాలిటిక్ కన్వర్టర్లను అమర్చాలి. వీటితోపాటు ఇంకా అనేక శాస్త్రీయ విధానాలు అమలు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తేనే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాస అందుతుంది.ప్రభుత్వ స్థాయి చర్యలు..పరిశ్రమల నియంత్రణఎమిషన్ స్టాండర్డ్స్ కఠినతరం చేయడంకాలుష్య నియంత్రణ పరికరాలు (Electrostatic Precipitators, Scrubbers) తప్పనిసరివాహనాల నియంత్రణBS-VI నిబంధనలు అమలుపాత వాహనాల స్క్రాప్ పాలసీపబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణనిర్మాణ ధూళి నియంత్రణరోడ్లపై నీటి పిచికారీగ్రీన్ బఫర్ జోన్లు ఏర్పాటువ్యక్తిగత స్థాయి చర్యలు..ప్రయాణ అలవాట్లు మార్చడంకార్పూలింగ్, సైక్లింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగంఇంటి వద్ద LPG/PNG లేదా ఇండక్షన్ వంట వాడటంచెత్త దహనం పూర్తిగా నివారించడం. -
మనకూ సొంత స్పేస్ స్టేషన్
గుజరాత్ నుంచి సాక్షి ప్రతినిధి : ‘సొంత అంతరిక్ష కేంద్రాలు కలిగిన దేశాల సరసన త్వరలో భారత్ నిలవనుంది. 2028లో భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం షురూ అవ్వనుంది’ అని ఇస్రోలో భాగమైన అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) డైరెక్టర్ నీలేశ్ ఎం.దేశాయ్ తెలిపారు. స్వదేశీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఐదు రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి విడి భాగాలు పంపాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా 2028లో తొలి రాకెట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. 2035 నాటికి విడి భాగాలన్నింటినీ అంతరిక్షంలోకి చేర్చి ఇంటిగ్రేషన్ పూర్తి చేస్తామన్నారు. దీంతో భవిష్యత్తులో రోదసీ యాత్ర చేసే వ్యోమగాములు స్వదేశీ అంతరిక్ష కేంద్రంలో దిగి చంద్రుడి మీదకు వెళ్తారని చెప్పారు. ఎస్ఏసీ పనితీరు గురించి నీలేశ్ ఎం.దేశాయ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 2027లో మానవ సహిత ప్రయోగం మానవ రహిత అంతరిక్ష ప్రయోగం దిశగా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) వేగంగా అడుగులు వేస్తోంది. గగన్యాన్ ప్రయోగంలో భాగంగా తొలుత నాలుగు మానవ రహిత ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించింది. 2026 ఫిబ్రవరిలో తొలి ప్రయోగం చేపట్టబోతున్నాం. 2026లోనే మరో రెండు, 2027లో చివరి ప్రయోగం పూర్తి చేస్తాం. అదే ఏడాది ఆఖరులో మానవ సహిత ప్రయోగం పూర్తి చేస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా 2022లోనే గగన్యాన్ పూర్తి చేయాల్సి ఉంది. కరోనా, ఇతర సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదా పడింది. గగన్యాన్ యాత్రకు వ్యోమగాములుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నలుగురు కెపె్టన్లను ఎంపిక చేశాం. వీరిలో ఒకరైన శుభాన్షు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తిరిగి వచ్చారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు తిరిగి ఎయిర్ ఫోర్స్కు వెళ్లగా, ఇద్దరు శిక్షణలో కొనసాగుతున్నారు. 2027లో గగన్యాన్లో ఎంత మంది వ్యోమగాములు రోదసీ యాత్ర చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరు వ్యోమగాములు ఉంటే మంచిదని భావిస్తున్నాం. వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష యాత్ర చేసి, తిరిగి వచ్చేందుకు వీలుగా వాహక నౌకను తీర్చి దిద్దుతున్నాం. డీఆర్డీఏ, ఇతర స్వతంత్ర సంస్థలు నౌకను సర్టిఫై చేస్తాయి. స్వదేశీ సాంకేతికతతో సెమీ కండక్టర్ల తయారీ సెమీ కండక్టర్లలో స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఇస్రో కార్యకలాపాలకు సెమీ కండక్టర్లు కీలకమైనవి. ఇస్రో అవసరాల కోసం సెమీ కండక్టర్లు బయట నుంచి కొనే పని లేకుండా చేస్తున్నాం. అంతే కాకుండా బయటి సంస్థల అవసరాలకూ సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నాం. ఎస్ఏసీలో దేశంలోనే మొదటి సారిగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో సెమీ కండక్టర్లు తయారు చేస్తున్నాం. ఈ సాంకేతికను వాడుకోవడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. సెమీ కండక్టర్ల విషయంలో ఎంతో చిన్న దేశమైన తైవాన్పై ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది. ఎస్ఏసీ ఎంతో విభిన్నం ఇస్రోలో భాగమైన మిగిలిన సంస్థలతో పోలిస్తే ఎస్ఏసీ ఎంతో విభిన్నమైంది. ఉపగ్రహ పేలోడ్లను ప్రజలు, ప్రభుత్వం, సమాజానికి ఉపయోగకరమైన కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్, దేశ రక్షణ, జాతీయ ప్రయోజనం కోసం అభివృద్ధి చేయడంలో ఎస్ఏసీకి ప్రత్యేకత ఉంది. దేశంలో వాతావరణాన్ని అంచనా వేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. అంతరిక్షంలోని శాటిలైట్ వ్యవస్థ ద్వారా 15 రోజుల ముందే వాతావరణ పరిస్థితులను అంచనా వేసి, సమాచారాన్ని ఐఎండీకి చేరవేస్తున్నాం. దీంతో తుపానులు, ఇతర ప్రకృతి విపత్తుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తం అవుతాయి. -
జోరు కొనసాగించాలని...
ముల్లాన్పూర్: సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఐదు మ్యాచ్ల సిరీస్లో శుభారంభం చేసిన భారత క్రికెట్ జట్టు... గురువారం దక్షిణాఫ్రికాతో రెండో టి20 ఆడనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా మరో తొమ్మిది మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. ఇందులోనే జట్టు బలాబలాలు, కూర్పును సరిచూసుకోవాలని భావిస్తున్న టీమ్ మేనేజ్మెంట్ కటక్లో ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్ బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్లో బంతి కాస్త ఆగి వస్తున్న పిచ్పై మన టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ధనాధన్ ఆటతో మంచి స్కోరు చేసిన టీమిండియా... కట్టుదిట్టమైన బౌలింగ్తో మెరిపించింది. దక్షిణాఫ్రికా టి20 చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుందంటే... అందులో మన బౌలర్ల ప్రతిభ ఎంతో ఉంది.ఇప్పుడు అదే జోరు సాగిస్తూ రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్లో మరింత ఆధిక్యం సాధించాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ భావిస్తుండగా... తొలి మ్యాచ్లో తేలిపోయిన దక్షిణాఫ్రికా ఈ పోరులో సత్తా చాటి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. టాపార్డర్ రాణించేనా! పిచ్, ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూకుడే పరమావధిగా దూసుకెళ్తున్న భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై అందరి దృష్టి నిలవనుంది. ముల్లాన్పూర్లో మంచి అనుభవం ఉన్న ఈ పంజాబ్ చిన్నోడు సొంతగడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో సిక్స్ల వర్షం కురిపించిన అభిõÙక్... అదే పరాక్రమం కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక భారత వన్డే, టెస్టు రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గత మ్యాచ్లో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన గిల్ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండగా... మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కీలకం కానున్నారు. పరిస్థితులను బట్టి గేర్లు మార్చే సత్తా వీరిలో పుష్కలం. ఇక గాయం నుంచి కోలుకొని గత మ్యాచ్ ద్వారా పునరాగమనం చేసిన పాండ్యా... తన విలువ ఏంటో చాటుకున్నాడు. అటు బంతితో ఇటు బ్యాట్తో విజృంభించిన హార్దిక్ నుంచి మేనేజ్మెంట్ ఇలాంటి ప్రదర్శన ఆశిస్తోంది. శివమ్ దూబే, జితేశ్ శర్మ ఫినిషర్ల బాధ్యత నిర్తర్తించనున్నారు. గత మ్యాచ్ ద్వారానే మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డు సృష్టించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో కీలకం కానున్నారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. మార్పుల్లేకుండా సఫారీ జట్టు... స్టార్లతో నిండి ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కటక్ పిచ్పై ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకొని రెండో మ్యాచ్లో పూర్తిస్థాయిలో దుమ్మురేపాలని సఫారీలు భావిస్తున్నారు. డికాక్, మార్క్రమ్, స్టబ్స్, బ్రేవిస్, మిల్లర్, యాన్సెన్ రూపంలో ఆ జట్టులో ప్రతిభకు కొదవ లేకపోవడంతో తొలి మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. తొలి స్పెల్లో అర్ష్ దీప్ కట్టిపడేయడంతో వెనుకంజలో పడ్డ సఫారీలు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. దీంతో అతడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ‘ప్రొటీస్’ కసరత్తులు ప్రారంభించారు. ఇక మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు పరుగుల వేగాన్ని నియంత్రిస్తుండటంతో... దానికి విరుగుడు కనిపెట్టాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఓపెనర్లు, మార్క్రమ్, డికాక్లో ఒకరు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే... మిగిలిన వాళ్లు ధనాధన్ షాట్లతో స్కోరు వేగం పెంచగల సమర్థులే. బౌలింగ్లో ఎంగిడి, నోర్జే, యాన్సెన్ మరోసారి కీలకం కానున్నారు. తొలి మ్యాచ్లో ఎంగిడి భారత టాపార్డర్ పని పట్టాడు. ఊరించే బంతులతో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి అతడిని జాగ్రత్తగా ఎదుర్కోక తప్పదు. యాన్సెన్ వికెట్లు తీయకపోయినా 4 ఓవర్లలో కేవలం 23 పరుగులే ఇచ్చాడు. ఎటొచ్చి సఫారీ స్పిన్నర్లనే మనవాళ్లు మరోసారి టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. పిచ్, వాతావరణం ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ పురుషుల మ్యాచ్. గతంలో ఐపీఎల్ మ్యాచ్లతో పాటు... రెండు మహిళల మ్యాచ్లకు ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. పిచ్ అటు బ్యాటర్లతో పాటు ఇటు పేసర్లకు సహకరించనుంది. మంచు ప్రభావం ఎక్కువ ఉండకపోవచ్చు. -
టెక్ దిగ్గజాల పెట్టుబడులజోరు..
సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ మెగా హబ్గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. భారత్ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా భారత్ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్–బు టాన్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్ సైతం భారత్పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్ దిగ్గజం గూగుల్ .. వైజాగ్లో డేటా సెంటర్పై 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఓపెన్ఏఐ కూడా భారత్లో డేటా హబ్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్లో గూగుల్ ఏఐ, డేటా సెంటర్ హబ్తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్ బూమ్తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
హార్దిక్ సూపర్ షో
భారత జట్టులోకి కొంత విరామం తర్వాత పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా తన వాడిని, స్థాయిని ప్రదర్శించాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని వచ్చి అంచనాలకు తగినట్లుగా చెలరేగుతూ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలమైన వేళ పాండ్యా మెరుపులతో భారీ స్కోరు నమోదు చేసిన భారత్... ఆ తర్వాత దక్షిణాఫ్రికాను 75 బంతుల్లోనే 74 పరుగులకు కుప్పకూల్చింది. టీమిండియా పటిష్ట బౌలింగ్ను ఎదుర్కోలేక సఫారీలు పూర్తిగా చతికిలపడటంతో ఆట ఏకపక్షంగా మారిపోయింది. దాంతో బారాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాపై భారత్ తొలి విజయాన్ని అందుకుంది. ఈ మైదానంలో గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టి20 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కటక్: దక్షిణాఫ్రికాతో మొదలైన టి20 సిరీస్లో అలవోక విజయాన్ని అందుకొని భారత్ 1–0తో ముందంజ వేసింది. బారాబతి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన తొలి టి20లో భారత్ 101 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు ఆటతో చెలరేగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. టి20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. డెవాల్డ్ బ్రెవిస్ (22) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టి20 గురువారం ముల్లాన్పూర్లో జరుగుతుంది. ఓపెనర్లు విఫలం... భారత్ స్కోరు ఒకదశలో 17/2, ఆపై 48/3... 14 ఓవర్లు ముగిసేసరికి 104/5... ఈ క్రమాన్ని చూస్తే భారత్ భారీ స్కోరు చేయడం అసాధ్యమనిపించింది. కానీ చివర్లో ఒక్క పాండ్యా బ్యాటింగ్తో అంతా మారిపోయింది. ఆఖరి 6 ఓవర్లలో భారత్ 71 పరుగులు సాధించగలిగింది. భారత ఇన్నింగ్స్కు సరైన ఆరంభం లభించలేదు. పునరాగమనంలో శుబ్మన్ గిల్ (4) ఇన్నింగ్స్ మూడు బంతులకే పరిమితం కాగా, ఎన్గిడి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సూర్యకుమార్ (12) తర్వాతి బంతికి వెనుదిరిగాడు. పవర్ప్లేలో జట్టు 40 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ (17) జోరు ఎక్కువ సేపు సాగలేదు. ఈ దశలో తిలక్ వర్మ (32 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 23; 1 సిక్స్) కలిసి కొద్దిసేపు పట్టుదల కనబర్చారు. అయితే వీరిద్దరు నెమ్మదిగా ఆడుతూ 31 బంతుల్లో 30 పరుగులే జోడించగలిగారు. అయితే పాండ్యా వచ్చీ రాగానే మహరాజ్ ఓవర్లో 2 సిక్సర్లు బాది ఆటకు ఊపు తెచ్చాడు. తర్వాత నోర్జే ఓవర్లోనూ అతను 2 ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్లో శివమ్ దూబే (11) అవుటైన తర్వాత పాండ్యా దూకుడు కొనసాగింది. సిపామ్లా వేసిన 19వ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన పాండ్యా...నోర్జే వేసిన 20వ ఓవర్లోనూ 6, 4 కొట్టి 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టపటపా... ఛేదనలో దక్షిణాఫ్రికా మొదటి నుంచే తడబడింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డికాక్ (0)ను అవుట్ చేసిన అర్‡్షదీప్, తన తర్వాతి ఓవర్లో స్టబ్స్ (14)ను వెనక్కి పంపాడు. అక్షర్ తన తొలి బంతికే మార్క్రమ్ (14) బౌల్డ్ చేయగా, పాండ్యా కూడా తన తొలి బంతికే మిల్లర్ (1) ఆట కట్టించాడు. తర్వాతి ఓవర్లో వరుణ్ బంతిని ఆడలేక ఫెరీరా (5) కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో దక్షిణాఫ్రికా 50/5 వద్ద నిలిచింది. రెండు సిక్స్లు బాదిన యాన్సెన్ (12) కూడా వరుణ్ బంతికే బౌల్డ్ కాగా... మరో ఎండ్లో కొన్ని చక్కటి షాట్లతో బ్రెవిస్ పోరాడే ప్రయత్నం చేశాడు. అయితే బ్రెవిస్ను చక్కటి బంతితో బుమ్రా డగౌట్కు పంపడంతో దక్షిణాఫ్రికా ఆశలు కోల్పోయింది.101అంతర్జాతీయ టి20ల్లో బుమ్రా వికెట్ల సంఖ్య. అర్ష్ దీప్ సింగ్ (107) తర్వాత వంద వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా బుమ్రా నిలిచాడు.100 అంతర్జాతీయ టి20ల్లో హార్దిక్ పాండ్యా సిక్సర్ల సంఖ్య. కోహ్లి, సూర్యకుమార్, రోహిత్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న నాలుగో భారత ఆటగాడిగా పాండ్యా నిలిచాడు.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) యాన్సెన్ (బి) సిపామ్లా 17; గిల్ (సి) యాన్సెన్ (బి) ఎన్గిడి 4; సూర్యకుమార్ (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 12; తిలక్ (సి) యాన్సెన్ (బి) ఎన్గిడి 26; అక్షర్ (సి) ఫెరీరా (బి) సిపామ్లా 23; పాండ్యా (నాటౌట్) 59; దూబే (బి) ఫెరీరా 11; జితేశ్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–5, 2–17, 3–48, 4–78, 5–104, 6–137. బౌలింగ్: ఎన్గిడి 4–0–31–3, యాన్సెన్ 4–0–23–0, సిపామ్లా 4–0–38–2, నోర్జే 4–0–41–0, మహరాజ్ 2–0–25–0, ఫెరీరా 2–0–13–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) అభిషేక్ (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (బి) అక్షర్ 14; స్టబ్బ్ (సి) జితేశ్ (బి) అర్ష్ దీప్ 14; బ్రెవిస్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 22; మిల్లర్ (సి) జితేశ్ (బి) పాండ్యా 1; ఫెరీరా (సి) జితేశ్ (బి) వరుణ్ 5; యాన్సెన్ (బి) వరుణ్ 12; మహరాజ్ (సి) జితేశ్ (బి) బుమ్రా 0; నోర్జే (బి) అక్షర్ 1; సిపామ్లా (సి) అభిషేక్ (బి) దూబే 2; ఎన్గిడి (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 1; మొత్తం (12.3 ఓవర్లలో ఆలౌట్) 74. వికెట్ల పతనం: 1–0, 2–16, 3–40, 4–45, 5–50, 6–68, 7–68, 8–70, 9–72, 10–74. బౌలింగ్: అర్ష్ దీప్ 2–0–14–2, బుమ్రా 3–0–17–2, వరుణ్ 3–1–19–2, అక్షర్ 2–0–7–2, పాండ్యా 2–0–16–1, దూబే 0.3–0–1–1. -
ఆమె కాలాన్ని బంధించింది
చేతిలో కెమెరా...దాని వెనక వేగంగా కదిలే కన్ను...ప్రతి సందర్భానికీ స్పందించే మనసు... ఇవి ఉంటే చాలు...కదిలే కాలాన్ని బంధించి... చాయాచిత్రంగా చరిత్ర పుటల్లో భద్రపరచవచ్చు. ముందు తరాలకు చెదరని తరగని జ్ఞాపకాలు అందించవచ్చు. దృశ్యాన్ని ఫొటోగా మార్చే సాంకేతిక శక్తి కెమెరాకు ఉండొచ్చు. కానీ దాని వెనక ఉన్న కెమెరామన్ కన్ను అంతకన్నా ముఖ్యం. సకాలంలో స్పందించే హృదయం లేని చేతిలో కెమెరా ఒక బొమ్మ మాత్రమే...అని మాటల ద్వారా కాకుండా తను తీసిన చిత్రాల ద్వారా చెప్పిన అద్భుత ఫొటోగ్రాఫర్ పద్మవిభూషణ్ హొమయ్ వ్యారవాలా. హొమయ్ వ్యారవాలా ఇండియా మొట్టమొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్. భారత దేశం తెల్లదొరల వలసపాలన నుంచి స్వంతంత్ర దేశంగా ఎదిగిన ప్రయాణాన్ని తన చిత్రాల ద్వారా చెప్పిన తొలి ఫొటోగ్రాఫర్ హొమయ్. పురుషాధిపత్యం అధికంగా ఉన్న ఈ ఫొటోగ్రఫీ రంగంలో హోమయ్ హద్దుల్ని, సరిహద్దుల్ని చెరిపేసి స్వేచ్చా విహంగం. ఆకాశమే హద్దుగా తన వృత్తిలో అనుక్షణం జీవించారు. దేశ చరిత్రలో అపురూప ఘట్టాలను చాయాచిత్రాలుగా మలచి ఆ అద్భుత దృశ్య సంపదను మనకు అందించారు. హొమయ్ ని కేవలం ఓ ఫొటోగ్రాఫర్ గా మాత్రమే కాదు.... గత చరిత్ర ప్రత్యక్ష సాక్షిగా చూడాలి. ఈ దేశం పరపాలన నుంచి స్వపరిపాలన దాకా చేసిన ప్రయాణాన్ని ఈ దేశ గత చరిత్రను కెమెరా లో బంధించిన వ్యక్తిగా హొమయ్ కు ప్రత్యేక స్థానం దక్కుతుంది.హొమయ్ 1913 డిసెబర్ 9న గుజరాత్ రాష్ట్రం నవ్సారిలో ఓ పర్సి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఓ టూరింగ్ డ్రమా కంపెనీలో నటుడు. తర్వాతి కాలంలో కుటుంబం బోంబేలో స్థిరపడింది. తల్లి ప్రోత్సాహంతో హుమయ్ బోంబే యూనివర్సిటీ, సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదువుకున్నారు. ఆసమయంలోనే ఆమెకు ఫొటోగ్రఫీపై దృష్టి మళ్ళింది. 1941 లో హొమయ్ కు మనీక్షా వ్యారవాలాతో వివాహమయ్యింది. అతను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫొటోగ్రాఫర్, అకౌంటెంట్ గా పనిచేసేవారు. హొమయ్ 1938లో బొంబే క్రానికల్ పత్రికలో ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించారు. ప్రింట్ మీడియా ప్రధాన స్రవంతిలో , ఇల్యుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పనిచేసిన మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్ హుమయ్ . డాల్డా 13 అనే మారుపేరుతో ఆమె చిత్రాలు ప్రచురితం అయ్యేవి. ప్రతిరోజూ నగర జీవనంలో అరుదైన దృశ్యాలను ఫొటోలుగా బంధించి పత్రికకు అందించే వారు. ఆ తర్వాత 1940 నుంచి 1970 దాకా ఢిల్లీలో బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కు పనిచేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వాంతంత్ర్య దినోత్సవ ప్రసంగం, గాంధీ అంతిమయాత్ర లాంటి చారిత్రాత్మక ఘట్టాలను చిత్రించారు. అలాగే క్వీన్ ఎలిజెబిత్ 2 లాంటి విశిష్ట విదేశీ అతిథులు వచ్చినపుడు వారి చిత్రాలను కెమెరాలో బంధించారు. బ్రిటీస్ పాలన అంతిమదశతో పాటు బారత్ స్వాంతంత్ర్య సంబరాలను చిత్రీకరించారు. స్వాంతంత్ర్య సమర ఘట్టాల చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరని జ్ఞాపకాలుగా మనకు మగిల్చిన హొమయ్ కు రోలిఫ్లెక్స్ కెమెరా అంటే ఇష్టం. ఆమె చిత్రాలు మానవీయ కోణంలో, సహజ చిత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ నేతల చారిత్రక సందర్భాలతో పాటు వారు నడుస్తున్నప్పుడో, నవ్వుతున్నప్పుడో సహజ (క్యాండిడ్) చిత్రాలను తీయడంలో హొమయ్ ది అందెవేసిన చేయి. 1970 లో ఫొటోగ్రఫర్ వృత్తినుంచి హొమయ్ రిటైర్ అయ్యారు. 2011 లో ఆమెకు ప్రతిష్టాత్మక పద్మవిభూషన్ గౌరవం దక్కింది. ఎప్పుడూ దుమికే జలపాతంలా చురుగ్గా జీవించిన హుమయ్ తమ రిటైర్ జీవితాన్ని గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చాలా ప్రశాంతంగా గడిపారు. హుమయ్ 2012 జనవరి 15న తమ 98వ ఏట ఈ లోకానికి వీడ్కోలు పలికారు. దేశంలోనే తొలి మహిళా ఫోటోజర్నలిస్ట్ గా.... 1940 లోనే అప్పటి సమాజంలోని పురుషాధిక్యతను నిలదీసిన ధీర మహిళగా హుమయ్ ను మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
పాక్ సీడీఎఫ్గా మునీర్ ప్రసంగం.. భారత్కు హెచ్చరికలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్పై కవ్పింపు చర్యలకు దిగింది. పాకిస్తాన్ త్రివిధ దళాధిపతిగా నియమితుడైన తర్వాత తన తొలి ప్రసంగంలోనే ఆసిమ్ మునీర్.. భారత్కు హెచ్చరిక జారీ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. పాకిస్తాన్పై భారత్ ఎలాంటి దాడి చేసినా ప్రతీకార చర్య చాలా తీవ్రంగా, వేగంగా ఉంటుందని అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే, పాకిస్తాన్ చరిత్రలో పాకిస్తాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF)గా ఆసిమ్ మునీర్ను షహబాజ్ షరీఫ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అనంతరం, మునీర్ సోమవారం తన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్బంగా ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో రక్షణ దళాల ప్రధాన కార్యాలయ స్థాపన చారిత్రాత్మకమైనది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి ఏకీకృత చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. సాయుధ దళాలు యుద్ధానికి కొత్త అవసరాలకు అనుగుణంగా ఉండాలి. పాకిస్తాన్పై భారత్ ఎలాంటి దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనికి పాకిస్తాన్ ప్రతీచర్య తీవ్రంగా ఉంటుంది. పాక్ చాలా కఠినంగా స్పందిస్తుంది. కాబట్టి భారత్ ఎలాంటి ఊహల్లో ఉండకపోతే మంచిది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం పనితీరుపై మునీర్ ప్రశంసలు కురిపించారు. Mere Aziz Humwatano!After deep consultation with myself, as Field Marshal, I am proud to announce the selection of the most qualified candidate for the post of Chief of Defence Forces i.e. myself.Proud of myself for this smooth transfer of power! pic.twitter.com/XYUCZWPbfd— Field Marshal Syed Asim Munir's Ego (@JungjooGernail) December 8, 2025మునీర్ కోసం 27వ రాజ్యాంగ సవరణ..ఇదిలా ఉండగా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్ అడుగులు వేసింది. ఈ క్రమంలోనే పాక్.. తమ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు సీడీఎఫ్ పదవిని సృష్టించింది. ఇందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ చేసింది. మరోవైపు.. పాక్ ఆర్మీ చీఫ్గా పనిచేసిన మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. దీంతో, సీడీఎఫ్ పదవిని ఆసిమ్ మునీర్కు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఏక కాలంలో సైనిక దళాల చీఫ్గా వ్యవహరించేందుకు సీడీఎఫ్ పదవికి ఆసిమ్ మునీర్ను నియమించాలని పాక్ ప్రధాని సమర్పించిన సిఫార్సును అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ నియామకంతో పాక్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు. -
ఎక్కడ చమురు కొనాలనేది భారత్ ఇష్టం
మాస్కో: అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇతర దేశాలకు ముడిచమరును విక్రయించుకునేందుకు అవరోధాలను ఎదుర్కొంటున్న రష్యా.. భారత్ను చమురుకొనుగోళ్ల విషయంలో ఆకర్షిస్తోందన్న ఆరోపణలపై రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సోమవారం మాస్కోలో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్ ఎల్లప్పుడూ సార్వభౌమ దేశమే. విదేశీ వాణిజ్య విధానాలు, నచ్చిన దేశం నుంచి చమురు వనరుల కొనుగోలు కార్యకలాపాల్లో భారత్ పూర్తిగా స్వీయనిర్ణయాలనే తీసుకుంటుంది. అందులో రష్యా వంటి మిత్రదేశాల పాత్ర ఉండబోదు. భారత్ తనకు లాభదాయకమైన చోటే ఇంధన కొనుగోళ్లు కొనసాగిస్తుంది. ఆ స్వేచ్ఛ భారత్ ఎప్పుడూ ఉంటుంది’’అని పెస్కోవ్ అన్నారు. మీ వద్ద చమురు కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకోవాలంటూ భారత్పై అమెరికా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లుచేస్తున్న నేపథ్యంలో భారతవైఖరి మారిందా? అన్న ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. ‘‘భారత్ అనేది తన ఆర్థిక ప్రయోజనాలకే మొదట్నుంచీ పెద్దపీట వేస్తోంది. ఇకమీదట సైతం భారత్లోని మా చమురుభాగస్వాములు అదే బాటలో పయనిస్తారని భావిస్తున్నాం’’అని అన్నారు. వద్దని వారించినా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడిచమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 50 శాతం దిగుమతి సుంకాల భారం పడేసిన విషయం విదితమే. 2022లో మొదలైన ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి అత్యధిక స్థాయిలో క్రూడ్ఆయిల్ను కొంటున్న దేశాల్లో భారత్ సైతం ఒకటిగా నిలిచిన విషయం తెల్సిందే. అయితే ఇటీవలకాలంలో పశ్చిమదేశాల ఒత్తిడితో రష్యా నుంచి కొనుగోళ్లలో తగ్గుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మీడియాలో ఇప్పటికే కథనలు వెలువడ్డాయి. ‘‘మాకు అమెరికా ఆంక్షలను సమర్థవంతంగా ఎదుర్కొన్న చరిత్ర ఉంది. మా నుంచే భారత్ కొనుగోళ్లు చేయాలనుకుంటే ఆంక్షల ఛత్రం నుంచి ఒడుపుగా తప్పించుకుంటూనే భారత్కు ఆయిల్ సరఫరాచేసే నైపుణ్యాలు మాకు ఉన్నాయి’’అని క్రెమ్లిన్ ఆర్థిక సలహాదారు మాక్సిమ్ ఒరెష్కిన్ ‘ఛానల్1’ఇంటర్వ్యూలో చెప్పారు. -
చికిత ‘పసిడి’ గురి
తైపీ ఓపెన్ వరల్డ్ సిరీస్ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల అండర్–21 కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత చాంపియన్గా అవతరించింది. చైనీస్ తైపీలోని తావోయువాన్ సిటీలో జరిగిన ఈ టోరీ్నలో చికిత ఫైనల్లో 148–141 పాయింట్ల తేడాతో జిట్మున్ ఖెమనిత్ (థాయ్లాండ్)పై గెలుపొందింది. సెమీఫైనల్లో చికిత 147–145తో యోన్సియో కాంగ్ (దక్షిణ కొరియా)పై, క్వార్టర్ ఫైనల్లో 149–138తో సియోయూన్ కాంగ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్లో జ్యోతి సురేఖ 149–143తో సో చేవన్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ కూడా కాంస్యం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతక మ్యాచ్లో అభిషేక్ వర్మ 148–146తో మార్కో బ్రునో (ఇటలీ)పై గెలిచాడు. మహిళల రికర్వ్ అండర్–21 కాంస్య పతక మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కొండపావులూరి యుక్తశ్రీ 5–6తో షు యాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. -
ఆ విషయంలో చైనా స్పష్టతనివ్వాలి
ఇటీవల చైనా షాంగై ఎయిర్ పోర్టులో ఇండియాకు చెందిన ఓ మహిళను చైనా అధికారులు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఆ విషయంపై చైనాను వివరణ కోరింది. భారతీయులు చైనా దేశం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని తెలిపింది. ఈ మేరకు డ్రాగన్ దేశం నమ్మకం కలిగేలా హామీ ఇవ్వాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తరచుగా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటుంది. ఆ ప్రాంతం చైనాదేనని చెప్పడం అంతేకాకుండా ఆదేశ మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్ భాగంగా చూపడంతో తరచుగా ఈ అంశంలో ఇరు దేశాలకు ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఓ మహిళ యూకే నుండి జపాన్ ప్రయాణిస్తుండగా మార్గం మద్యలో షాంఘై విమానాశ్రయంలో ఆగింది. ఆసమయంలో అక్కడి ప్రభుత్వాలు ఆమె అరుణాచల్ ప్రదేశ కు మహిళ అని తెలిసి తనను వేధించారని తెలిపింది. అంతే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అన్నారని పేర్కొంది. ఈ ఘటనను భారత్ ఆసమయంలోనే ఖండించింది.తాజాగా భారత్ చైనాను ఒక వివరణ కోరింది. భారత విదేశాంగ కార్యదర్శ రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ " భారతీయులు చైనా మీదుగా వెళ్లేటప్పుడు వారినే టార్గెట్ గా చేసుకొని ఇబ్బందులు పెట్టమని చైనా తెలపాలి. ఆ మేరకు నమ్మకం కలిగేలా అధికారులు ప్రకటన చేయాలి. ఇష్టానుసారంగా వ్యవహరించకుండా అంతర్జాతీయ ప్రయాణ చట్టాలను గౌరవించాలి. చైనా మీదుగా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు భారతీయులు జాగ్రత్తగా ఉండాలి" అని రణధీర్ జైశ్వాల్ తెలిపారు.అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని ఇది వరకే చాలా సార్లు భారత్ చెప్పింది. దాని గురించి మరోసారి మాట్లాడదలుచుకోలేదని రణధీర్ జైశ్వాల్ అన్నారు. అయితే ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని సహృద్భావ వాతరణంలో ఇరు దేశాల మైత్రి సాగుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. -
ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూకుడు
సాక్షి, అమరావతి: ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూసుకుపోతోంది. టెక్నాలజీ వినియోగంలో ముందుండే అమెరికాను దాటేసి భారతీయులు ఆన్లైన్లో వారికి నచ్చిన వస్తువులను కొనేస్తున్నారు. మన దేశంలో అత్యధికంగా అమ్మకాలు జరిగే దసరా–దీపావళి పండుగ సమయంలో జరిగిన అమ్మకాలు.. అమెరికాలో క్రిస్మస్ ముందు జరిగే బ్లాక్ ఫ్రైడే అమ్మకాలను మించిపోయాయని ఎస్బీఐ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ సంవత్సరం పండుగల సీజన్లో రూ.1.24 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు ఎస్బీఐ అంచనా వేసింది.ఇది గతేడాది జరిగిన అమ్మకాలు రూ.94,800 కంటే ఎక్కువ. పండుగల సీజన్కు ముందు కేంద్రప్రభుత్వం జీఎస్టీ రేట్లను సంస్కరించడం ఈ ఏడాది అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. ఇదే సమయంలో అమెరికాలో ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు రూ.1,02,960 కోట్లు ఉంటాయని అంచనా వేసింది. 2024లో ఈ బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు రూ.95,040 కోట్లుగా నమోదయ్యాయి. అంటే భారత్లో ఈ ఏడాది పండుగ అమ్మకాల్లో 31 శాతం నమోదయితే అమెరికాలో మాత్రం ఈ వృద్ధి 8.3 శాతానికి పరిమితమవుతుందని ఎస్బీఐ అంచనా వేసింది. అమెరికా ఆర్థికవ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది అమ్మకాల్లో అంత వృద్ధి నమోదు కాకపోవచ్చని పేర్కొంది.ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువులే దేశీయ ఆన్లైన్ అమ్మకాల్లో అత్యధికభాగం ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయిన్సెస్ వస్తువులే అత్యధికంగా ఉంటున్నాయి. మొత్తం అమ్మకాల్లో 43 శాతం (సుమారు రూ.53 వేలకోట్లు) ఈ రెండు రంగాల్లోనే జరుగుతున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా మొబైల్ ఫోన్లు (26 శాతం) కొనుగోలు చేస్తున్నారు. తర్వాతి స్థానాల్లో లైఫ్స్టైల్ ఉత్పత్తులు (22 శాతం), సౌందర్యసాధనాలు (21 శాతం) ఉన్నాయి. ఈ సారి ఖరీదైన వస్తువులను మెట్రో వాసులే కాకుండా నాన్ మెట్రో వాసులు కూడా అత్యధికంగా కొనుగోలు చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. -
భారత గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘నేటి అవసరాలు తీర్చి..పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని మేం సరిపెట్టలేదు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి.. ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశాం. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్కు మేం ప్రాణం పోశాం. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు రూపొందించాం. భారత దేశ గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. నిన్నటి వరకు ఒక లెక్కం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క.నిన్న, నేడు, రేపుం..మీ ఆశీర్వాదమే నా ఆయుధం. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వంం. మీ సహకారమే నాకు సమస్తం. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకుం ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకుం తెలంగాణ రైజింగ్కు తిరుగు లేదు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆదివారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఎక్స్’వేదికగా రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం తన సందేశం ఇచ్చారు.‘జాతి కోసం, జనహితం కోసంం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలిం. గొప్ప కార్యాలు చేయాలంటేం మహా సంకల్పం కావాలిం. సరిగ్గా రెండేళ్ల కింద నాకు ఆ ధైర్యం ఇచ్చిం తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చిం నిండు మనస్సుతో ఆశీర్వదించిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు’అని సీఎం అన్నారు. రెండేళ్ల ప్రస్థానంలోం అనునిత్యం అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించినట్టు తన సందేశంలో తెలిపారు. రైతుకు దన్నుగా నిలుస్తాం గత పాలన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని సీఎం రేవంత్ ఆ ట్వీట్లో వెల్లడించారు. ‘రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి అదానీ, అంబానీలాగా వ్యాపారరంగంలో నిలబెట్టాం’అని పేర్కొన్నారు. బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామని, వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామన్నారు.చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నామన్నారు. ‘జయ జయహే తెలంగాణ’అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చినట్టు గుర్తు చేశారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500 కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు అని తెలిపారు. -
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
-
భారతదేశంలో మహా భూకంపం.. మరి కొద్ది రోజుల్లోనే!
-
త్వరలో భారత్కు ఇజ్రాయిల్ నుంచి 40 వేల ఎల్ఎమ్జీలు..
త్వరలో భారత్కు 40 వేల లైట్ మెషీన్ గన్లు సరఫరా చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ సంస్థ సిద్ధమవుతోంది. ఇరుదేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్కి చెందిన (Israel Weapon Industries (IWI) సంస్థ భారత్కు లైట్ మెషిన్ గన్స్ సరఫరా చేయడానికి రెడీ అయ్యింది. ఈ సరఫరా 2026 ఆరంభం నుంచి మొదలుకానుంది. వచ్చే ఏడాది ప్రారంభం నుండి 40,000 లైట్ మెషిన్ గన్స్ (ఎల్ ఎంజీ) మొదటి బ్యాచ్ ను భారతదేశానికి పంపిణీ చేయడం ప్రారంభిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాన రక్షణ సంస్థ తెలిపింది.ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (ఐడబ్ల్యూఐ) సీఈవో షుకీ స్క్వార్ట్జ్ మాట్లాడుతూ భారతదేశంలో పిస్టల్స్, రైఫిల్స్, మెషిన్ గన్లు వంటి ఆయుధాల అమ్మకంపై భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన అనేక ఏజెన్సీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు."మేము ప్రస్తుతం మూడు పెద్ద కార్యక్రమాలలో పాల్గొంటున్నాము. మొదటిది గత సంవత్సరం సంతకం చేసిన 40 వేల లైట్ మెషిన్ గన్ల ఒప్పందం. మేము అన్ని పరీక్షలు, ప్రభుత్వ దర్యాప్తులను పూర్తి చేశాం. ఉత్పత్తి చేయడానికి మాకు లైసెన్స్ వచ్చింది. మేము సంవత్సరం ప్రారంభంలో మొదటి సరుకును పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నాం’ అని తెలిపారు. లైట్ మెషీన్ గన్స్( LMG) సరఫరా ఐదేళ్ల పాటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇంతకంటే త్వరగా సరఫరా చేయగలనని, అయితే మొదటి లాట్ సంవత్సరం ప్రారంభంలో పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు. కార్బైన్ కోసం టెండర్ అని చెప్పారు. ఇందులో కంపెనీ రెండో అత్యధిక బిడ్ వేలం వేయగా, 'భారత్ ఫోర్జ్' ప్రధాన బిడ్డర్గా నిలిచింది. మేము ఈ ఒప్పందంలో 40 శాతం సరఫరా చేయాలనుకుంటున్నాము. మేము ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు దశలో ఉన్నాం. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో పూర్తవుతుందని నేను భావిస్తున్నాను.సీక్యూబీ కార్బైన్లో 60 శాతం భారత్ ఫోర్జ్ సరఫరా చేయనుంది, మిగిలిన 40 శాతం (1,70,000 యూనిట్లు) అదానీ గ్రూప్ కంపెనీ పీఎల్ఆర్ సిస్టమ్స్ సరఫరా చేస్తుంది’ అని స్పష్టం చేశారు. అర్బెల్ టెక్నాలజీ గురించి స్క్వార్ట్జ్ మాట్లాడుతూ, ‘ ఇది కంప్యూటరైజ్డ్ ఆయుధ వ్యవస్థ, దీనిలో ఒక సైనికుడు సరైన లక్ష్యంలో ఉన్నప్పుడు సంక్లిష్టమైన అల్గోరిథం గుర్తిస్తుంది మరియు ఆపై గొప్ప వేగం మరియు ఖచ్చితత్వంతో కాల్పులు జరుపుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశాన్ని అనుసంధానించడంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు."అర్బెల్ టెక్నాలజీని అవలంబించడానికి మేము వివిధ ఏజెన్సీలతో ప్రారంభ చర్చలు జరుపుతున్నాం వారు దానిని తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, మేము దానిని ఇజ్రాయెల్తో పాటు భారతదేశంలో సంయుక్తంగా తయారు చేసి సరఫరా చేస్తాం పిఎల్ఆర్ సిస్టమ్స్ భారతదేశంలో ఈ సహ-ఉత్పత్తిని నిర్వహిస్తుంది’ అని తెలిపారు.ఎందుకు ఇది ముఖ్యమైంది?భారత రక్షణ సామర్థ్యం పెరుగుతుంది: కొత్త తరం LMGలు సైనికులకు అధునాతన ఫైర్పవర్ అందిస్తాయి.ఇజ్రాయెల్-భారత్ రక్షణ సంబంధాలు బలపడుతున్నాయి: ఇజ్రాయెల్ ఇప్పటికే భారత్కు డ్రోన్లు, రాడార్లు ఇతర రక్షణ సాంకేతికతలు అందిస్తోంది. ఈ ఒప్పందం భారత్కి రక్షణ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ఇజ్రాయెల్తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుస్తుంది. -
గలీ గలీ మే చోర్ హై!
పోలీసింగ్ వ్యవస్థ ఇప్పుడు టెక్నాలజీని మాగ్జిమమ్ వాడేసుకుంటోంది. అయినా కూడా.. దొంగల చేతిలో తాళాలు విరిగిపోతూనే ఉన్నాయి. కళల్లో చోరకళ ఒకటి అంటారు కదా!. దేశంలో ఎన్ని కళలు అంతరించిపోతున్నా.. చోర కళ మాత్రంకు అలాంటి దుస్థితి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. నేరగణాంకాల నివేదిక ఒకటి ఈ విషయాన్నే బల్లగుద్ది మరీ చెబుతోంది. ప్రతి లక్ష మందికి సగటున 49.5(50 అనుకోండి ఇక) చోరీకి గురవుతున్నారట. ఆ వివరాలేంటో కాస్త లోతుగా చూద్దాం..చోర కళకు స్వర్గధామంగా (పోలీసుల పరిభాషలో హాట్స్పాట్ అని అందురు).. మహారాష్ట్ర (70.4), రాజస్థాన్ (50.9), మధ్యప్రదేశ్ (41.0) వంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ (42.5), బీహార్ (37.5), కర్ణాటక (36.8), ఒడిశా (36.3) కూడా జాతీయ సగటు దరిదాపుల్లో కేసులు నమోదు చేస్తున్నాయి.చండీగఢ్, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం దొంగలకు కలుగుతోంది. సగటును పరిశీలిస్తే.. లక్ష మందికి చండీగఢ్లో 114.3 కేసులు, ఢిల్లీలో 106.3 కేసులు నమోదు అవుతున్నాయి. అంటే ఇవి దేశ సగటు కంటే రెండింతలు ఎక్కువన్నమాట!. ప్చ్.. ఈ విషయంలో చిన్న రాష్ట్రాలు ఏం వెనకబడిపోలేదు. మిజోరాం (94), మణిపూర్ (74.1) లాంటి ఈశాన్య ప్రాంతాలు కూడా దొంగల బారిన పడుతున్నాయి.అయితే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం చోర కళకు చిక్కులు తప్పడం లేదు. తమిళనాడు (23.1), కేరళ (13.1), పశ్చిమ బెంగాల్ (9.4), సిక్కిం (6.7) లాంటి ప్రాంతాలు తక్కువ కేసులతో పాపం.. ఈ జాబితాలో అట్టడుగున నిలిచాయి. అంటే, అక్కడి పోలీసింగ్ వ్యవస్థ అంత బలంగా ఉందన్నమాట. ప్చ్.. లడఖ్ (5.0), దమన్ & దీయూ, డిఎన్హెచ్ (10.0), అండమాన్ & నికోబార్ (16.1), లక్షద్వీప్ (29.0) వంటి ప్రాంతాలు కూడా తక్కువ కేసులు నమోదు చేస్తున్నాయి. అయితే పర్యాటక ప్రాంతమైన గోవా (29.2), గుజరాత్ (29.6)లకు దొంగల పరిస్థితి కాస్త అటు ఇటుగానే నడుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాల స్థాయి మధ్యస్థంగా ఉంది. తెలంగాణలో ప్రతి లక్ష మందికి సగటున 42.5 కేసులు నమోదవుతున్నాయి. ఇది దేశ సగటు (49.5) కంటే కొంచెం తక్కువ అయినప్పటికీ.. మధ్యస్థాయి ప్రమాదంగా పరిగణించొచ్చు. అలాగే.. అర్బన్ భద్రతా వ్యవస్థకు సవాలుగా మారే అవకాశమూ లేకపోలేదు. ఇక ఏపీ విషయానికొస్తే.. సాధారణంగా దేశ సగటు కంటే కాస్త తక్కువ స్థాయిలోనే కేసులు(23.4) నమోదవుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల్లో దొంగతనాలు ఎక్కువగా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దొంగలు తమ చేతి వాటం తక్కువే ప్రదర్శిస్తున్నారని తేలింది.పై లెక్కలు చూస్తే.. మనం ఊహించేంత సురక్షితంగా మన గల్లీలు అందులో ఉన్న ఇల్లులు.. మనమూ లేమన్న మాట. సమర్థవంతమైన పోలీసింగ్కు ప్రజల భాగస్వామ్యం చేరినప్పుడు.. అదే సమయంలో సామాజిక సమస్యల పరిష్కారం కలిసినప్పుడే దొంగతనాలు పూర్తిగా కట్టడి అవుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతూనే ఉన్నారు. -
విశాఖలో క్రికెట్ ఫీవర్.. టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
-
‘బంగ్లా’ గర్భిణి సునాలి కథ సుఖాంతం
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్లో అక్రమ వలసదారుగా అనుమానిస్తూ, బంగ్లాదేశ్కు తరలించిన గర్భిణి సునాలి ఖాతున్ (25), ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు ఎట్టకేలకు భారత్కు చేరుకున్నారు. గత ఐదు నెలలుగా ఆమె జరిపిన న్యాయ పోరాటం దరిమిలా, సుప్రీంకోర్టు ఈ ఉదంతంలో జోక్యం చేసుకుంది. మానవతా కారణాలతో ఆమె భారత్లో ప్రవేశించేందుకు అనుమతించింది. ఈ నేపధ్యంలో ఆ తల్లీకొడుకులు పశ్చిమ బెంగాల్లోని మెహదీపూర్ సరిహద్దు అవుట్పోస్ట్ మీదుగా భారత భూభాగంలోకి అడుగుపెట్టారు.పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్ జిల్లాలో ఉంటున్న సునాలి, ఆమె భర్త డానిష్ షేక్లను జూన్ 26న ఢిల్లీ పోలీసుల అరెస్ట్ చేసి, సరిహద్దు మీదుగా బంగ్లాదేశ్కు తరలించారు. అయితే సునాలి ఆమె కుమారుడిని తిరిగి భారత్ తీసుకురావడంలో సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు విజయం సాధించారు. ఇందుకోసం కృషి చేసిన బిర్భూమ్కు చెందిన సామాజిక కార్యకర్త మోఫిజుల్ ఇస్లాం మాట్లాడుతూ.. సునాలి, ఆమె కుమారుడిని తిరిగి తీసుకురావడంలో తాము విజయం సాధించినప్పటికీ, సునాలి భర్త డానిష్, మరో మహిళ స్వీటీ బీబీతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు ఇప్పటికీ బంగ్లాదేశ్లోనే ఉన్నారని తెలిపారు.వారి భారత పౌరసత్వాన్ని కేంద్రం సవాలు చేస్తున్నందున, దానిని పరిష్కరించి, వారిని తిరిగి తీసుకువచ్చే వరకు విశ్రమించబోమని ఇస్లాం పేర్కొన్నారు. ఈ కుటుంబాలు బంగ్లాదేశ్లో పాస్పోర్ట్, విదేశీయుల చట్టం కింద అరెస్టు అయ్యారు. అయితే వారికి డిసెంబర్ ఒకటిన బెయిల్ లభించింది. గతంలో సునాలి భారతదేశంలోనే తన బిడ్డకు జన్మనివ్వాలని భావించింది. కలకత్తా హైకోర్టు సెప్టెంబర్ 26న రెండు కుటుంబాలలోని ఆరుగురు సభ్యులను నాలుగు వారాల్లోగా తిరిగి తీసుకురావాలని ఆదేశించింది. అక్టోబర్ 3న చపైనావాబ్గంజ్ జిల్లా కోర్టు కూడా ఆధార్ కార్డుల ఆధారంగా వారిని భారతీయ పౌరులుగా ప్రకటించి, తిరిగి పంపాలని ఆదేశించింది.సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోలేకపోయిందని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సమీరుల్ ఇస్లాం తన ‘ఎక్స్’ హ్యాండిల్లో పేర్కొన్నారు. న్యాయవాదులు ఈ విషయాన్ని మరోసారి సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించిన తర్వాతే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. కాగా బాధితురాలు సునాలి, ఆమె కుమారుడు భారత్ వచ్చిన వెంటనే పశ్చిమ బెంగాల్ పోలీసులు వారిని మాల్డా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంఓహెచ్)సుదీప్తో భాదురి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు వారిద్దరినీ కనీసం 24 గంటలు వైద్య పర్యవేక్షణలో ఉంచుతామన్నారు. సునాలికి రక్త లోపం ఉందని, వైద్యుల బృందం ఆమె పరిస్థితిని అంచనా వేసి, అవసరమైన వైద్య సాయం అందిస్తుందన్నారు. ఇది కూడా చదవండి: టపాసులే కాదు.. కొత్త క్యాలెండర్లు కూడా.. -
బలీయ బంధమే ధ్యేయం
-
ఉన్నత శిఖరాలకు మన బంధం. ఇండియా-రష్యా సదస్సులో సంయుక్త ప్రకటన చేసిన మోదీ, పుతిన్
-
అభిమానులతో ఏసీఏ ఆటలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ అభిమానులతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆటలాడుతోంది. ఆన్లైన్లో టికెట్లను విక్రయిస్తున్నామని చెబుతున్న ఏసీఏ.. చివరకు బుకింగ్కు వెళ్లేసరికి మొండిచేయి చూపుతోంది. గంటలకొద్దీ వేచిచూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. డిస్ట్రిక్ట్ యాప్లో క్రికెట్ బుకింగ్ ప్రారంభమవుతుందన్న సమయానికి అరగంట ముందు నుంచే ఆన్లైన్లో వేచిచూస్తున్న అభిమానులకు మొదట్లో మీముందు ఇంకా 30 వేలమంది ఉన్నారంటూ సమాచారం వస్తోంది. మరో అరగంటకుపైగా వేచిచూసిన తర్వాత... సరిగ్గా టికెట్లు సెలెక్ట్ చేసుకుని బుకింగ్ చేసే సమయానికి.. ‘హోల్డ్ రైట్.. టికెట్లను హోల్డ్లో ఉంచాం. ఇతర ఫ్యాన్స్ వారి బుకింగ్ను పూర్తిచేస్తున్నారు. అప్పటివరకు ఆగండి..’ అంటూ సమాచారం వస్తోంది. బుకింగ్ కోసం కేటాయించిన 10 నిమిషాలు పూర్తయ్యేవరకు ఈ సమాచారమే కనిపిస్తోంది.చివరకు సమయం అయిపోవడంతో టికెట్లు బుకింగ్ కాకుండానే ఫ్యాన్స్ నిరాశకు గురికావాల్సి వస్తోంది. అయితే ‘ఇతర ఫ్యాన్స్’ ఎవరు అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇతర ఫ్యాన్స్ పేరిట టికెట్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఆన్లైన్ పేరుతో ఆటలువాస్తవానికి భారత్–దక్షిణాఫ్రియా సిరీస్లో విశాఖ వేదికగా జరగనున్న మూడో వన్డే కీలకంగా మారింది. ఇప్పటికే రెండుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ గెలిచేందుకు విశాఖ వన్డే ఫలితమే కీలకంగా మారింది. దీంతో ఈ వన్డేను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. అంతేకాకుండా రోహిత్, కోహ్లి (రో–కో) ఈ మ్యాచ్లో ఆడుతుండటంతో అభిమానుల నుంచి టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉంది. అదేవిధంగా విశాఖ స్టేడియంలో భారత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో భారత్ 10 మ్యాచ్లు ఆడగా... 7 మ్యాచ్ల్లో గెలిచింది. 2 మ్యాచ్ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. ఇదే స్టేడియంలో రోహిత్కు, కోహ్లికి వ్యక్తిగతంగా మంచి రికార్డులున్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్ ఫలితం తేల్చే ఈ మ్యాచ్పై సహజంగానే క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంది. సరిగ్గా ఇదే అభిమానాన్ని ఏసీఏ సొమ్ముచేసుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వివిధ స్టాండ్ల టికెట్ ధరలను పెంచి ఆన్లైన్లో విక్రయిస్తోంది. దీనికితోడు ఏసీఏలోని కొందరు వ్యక్తులు ఆన్లైన్ ధరలకు టికెట్లను కొనుగోలు చేసి బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్లో సరిగ్గా టికెట్లను బుక్ చేసుకునే సమయానికి ‘ఇతర ఫ్యాన్స్’ పేరిట తరలివెళుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సిరీస్ ఎవరి సొంతం!
భారత పర్యటనకు వచ్చిన ఏ విదేశీ జట్టయినా ఒకే టూర్లోని రెండు ఫార్మాట్ (టెస్టు, వన్డే)లలో మన టీమ్పై సిరీస్లు గెలుచుకోవడం 1986–87 తర్వాత మళ్లీ జరగలేదు. ఇప్పుడు అలాంటి మరో అవమానకర రికార్డును ప్రస్తుత భారత జట్టు నెలకొల్పే ప్రమాదం ఉంది. సఫారీల చేతుల్లో ఇప్పటికే టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా... ఇప్పుడు వన్డేల్లోనూ సిరీస్ కోల్పోకూడదని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. గత రెండు మ్యాచ్లలో ఫలితాన్ని ‘టాస్’ శాసించడంతో ఈ సారైనా టాస్ గెలవాలని భారత్ కోరుకుంటోంది. మ్యాచ్ కూడా గెలిచి రాహుల్ బృందం సిరీస్ను సాధిస్తుందా అనేది చూడాలి. సాక్షి, విశాఖపట్నం: భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి రెండు వన్డేలు హోరాహోరీగా సాగాయి. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లలో ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలిచి ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్నాయి. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు చేతికి సిరీస్ చిక్కుతుంది. గత రెండు మ్యాచ్లలో ప్రదర్శనను బట్టి చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పర్యటనలో లభిస్తున్న వరుస విజయాలు దక్షిణాఫ్రికా బృందంలో మరింత ఆత్మవిశ్వాసం పెంచగా... స్వదేశంలో వన్డే సిరీస్ను కాపాడుకోవాల్సిన ఒత్తిడిలో భారత్ బరిలోకి దిగుతోంది. జైస్వాల్పై దృష్టి... తొలి రెండు మ్యాచ్లలో రెండు సెంచరీలు సాధించి కోహ్లి అద్భుత ఫామ్లో ఉండటం భారత్కు ప్రధాన సానుకూలాంశం. రోహిత్ తొలి మ్యాచ్లో చెలరేగగా, రుతురాజ్ గత మ్యాచ్లో సెంచరీతో సత్తా చాటాడు. కెపె్టన్ రాహుల్ నిలకడైన ఆటతీరు కనబరుస్తున్నాడు. అయితే ఈ టాప్–5లో జైస్వాల్ ఒక్కడే విఫలమయ్యాడు. చివరి మ్యాచ్లోనైనా అతను రాణించాల్సిన అవసరం ఉంది. జడేజా, సుందర్ కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేపోయారు. కుల్దీప్ ఫర్వాలేదనిపించగా, పేసర్లు హర్షిత్, అర్‡్షదీప్, ప్రసిధ్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసిధ్ గత మ్యాచ్లో ఘోరంగా విఫలమైనా... టీమ్లో మరో ప్రత్యామ్నాయ పేస్ బౌలర్ అందుబాటులో లేకపోవడంతో అతడినే కొనసాగించక తప్పని పరిస్థితి. బౌలర్ల ప్రదర్శన పేలవంగానే ఉంటుండటంతో భారత్ విజయావకాశాలన్నీ బ్యాటర్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉన్నాయి. రెండు మార్పులతో... 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రెండో వన్డే గెలవడం సఫారీల పట్టుదలకు నిదర్శనం. చేయాల్సిన రన్రేట్ పెరిగిపోతున్నా సరే... ఏ దశలోనూ జట్టు బ్యాటర్లు ఒత్తిడిని దరి చేరనీయలేదు. ప్రతీ ఒక్కరు పోరాడి సమష్టి ప్రదర్శనతో టీమ్ను విజయం వరకు తీసుకెళ్ళారు. మార్క్రమ్ సెంచరీతో ఫామ్లోకి రాగా, బవుమా మిడిలార్డర్లో మూలస్థంభం. రెండు వన్డేల్లోనూ విఫలమైన డికాక్ తన అనుభవంతో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ ఆశిస్తోంది. బ్రీట్కే, బ్రెవిస్, యాన్సెన్, బాష్ నిలకడగా ఆడుతుండటం జట్టుకు ప్రధాన బలం. గత మ్యాచ్లో కండరాల గాయంతో మధ్యలోనే తప్పుకున్న జోర్జి, బర్గర్ ఈ మ్యాచ్కు దూరం కాగా... వారి స్థానాల్లో బార్ట్మన్, రికెల్టన్ జట్టులోకి వస్తారు. టాస్ గెలిచేనా! సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో మంచు ప్రభావం చాలా కనిపించింది. రాత్రి సమయంలో బౌలింగ్ బాగా కష్టంగా మారిపోతోంది. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే అనే పరిస్థితి వస్తోంది. కాబట్టి టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. అయితే ఈ విషయంలో చాలా కాలంగా భారత్ను దురదృష్టం వెంటాడుతోంది. భారత్ వరుసగా గత 20 వన్డేల్లో టాస్ ఓడిపోయింది! 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత భారత్ మళ్లీ టాస్ గెలవలేదు. ఈ సారైనా రాత మారుతుందా అనేది చూడాలి. -
భారత్, చైనాలు మా సన్నిహిత మిత్రులు
బీజింగ్: భారత్, చైనాలు తమకు సన్నిహిత మిత్రదేశాలంటూనే ఆ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు తమకు లేదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలను చైనా మీడియా ప్రముఖంగా ప్రచురించింది. పుతిన్ భారత్ పర్యటనకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వని చైనా ఈ విషయాన్ని మాత్రం హైలైట్ చేసుకుంది. రష్యాకు ఇటీవలి కాలంలో బాగా దగ్గరైన చైనా భారత్లో పుతిన్ పర్యటనపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘భారత్, చైనా రెండు కూడా మాకు సన్నిహిత మిత్రులే. ఆ సంబంధాన్ని మేము ఎంతగానో గౌరవిస్తాం.ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు మాకుందని నేను భావించడం లేదు’అని పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్, చైనా నేతలు తమ మధ్య ఉన్న అత్యంత సున్నితమైనవి సహా అన్ని విభేదాలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉన్నారు. వీటిపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరేలా ఇద్దరు నేతలు ప్రయతి్నస్తారని నమ్మకం ఉంది. అదే సమయంలో, ఆ సమస్యలు రెండు దేశాలకు సంబంధించినవి అయినందున రష్యాకు కలుగజేసుకునే హక్కు లేదు’అని ఆయన చెప్పిన విషయాన్ని చైనా మీడియా ప్రస్తావించింది. రష్యాతో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగా ఉన్న చైనా.. భారత్, రష్యాలు దగ్గరవడంపై మాత్రం అసహనంతో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.చైనాతో సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేసుకుంటూనే, భారత్తోనూ ఎప్పటిలాగానే మైత్రిని కొనసాగించారు పుతిన్. 2020లో లద్దాఖ్లో ఉద్రిక్తతల సమయంలోనూ ఇదే విధమైన బ్యాలెన్స్ను పుతిన్ కొనసాగించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. దీంతోపాటు, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడులపై పుతిన్ చేసిన వ్యాఖ్యలను కూడా చైనా మీడియా ప్రస్తావించింది. తమ నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అమెరికాకు, భారత్ చమురు కొనడంపై ఎందుకు అభ్యంతరమని పుతిన్ ప్రశ్నించారని కూడా తెలిపింది. ప్రస్తావించాల్సిన అంశమేమంటే..భారత్లో పర్యటనకు కొద్దిరోజుల ముందే చైనా, రష్యాలు ఆసియా పసిఫిక్తోపాటు పొరుగుదేశాల్లో భద్రతా పరమైన ప్రయోజనాలే లక్ష్యంగా వ్యూహాత్మక చర్చలు జరపడం..! -
మురుకులు,ములక్కాయ చారుతో మొదలై..
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఇష్టంగా లాగించే ములక్కాయ చారును పుతిన్ రుచిచూశారు. పుతిన్కు గౌరవార్థం రాష్ట్రపతి ముర్ము శుక్రవారం రాత్రి రాష్ట్రపతిభవన్లో ఇచి్చన విందులో పలు భారతీయ వంటకాలను ఆయనకు వడ్డించారు. సూప్ల కేటగిరీలో మెనూ కార్డులో మొట్టమొదట ములక్కాయ చారు పేరును చేర్చారు. ఆకలిని పెంచే అపిటైజర్ల జాబితాలో కశీ్మరీ స్టైల్లో వాల్నట్లను కలిపిన గుచ్చీ డూన్ చెటిన్, మినప వడలను, కూరగాయలతో నింపిన జోల్ మోమోలును పుతిన్కు వడ్డించారు. ఇక మెయిన్ కోర్స్లో జాఫ్రానీ పనీర్, పాలకూర మెంతికూర పచి్చబఠానీల కూరలతోపాటు పెరుగు, మసాలా దట్టించిన తందూరీ భార్వాన్ ఆలూ, చిన్న వంకాయలతో చేసిన ఆఛారీ బైగన్లనూ పుతిన్కు వడ్డించారు.టమాట, ఉల్లిగడ్డ కలబోతగా వండిన కందిపప్పు కూర సైతం వడ్డించారు. గోంగూర పచ్చడి, మామిడి పచ్చళ్లను సైతం పుతిన్ రుచిచూశారు. డ్రై ఫ్రూట్స్ వేసిన సాఫ్రాన్ పులావ్ను పుతిన్ రుచిచూశారు. లచ్ఛా పరంఠా, మగజ్ నాన్, సతనాజ్ రోటీ, మిస్సీ రోటీ, బిస్కటీ రోటీలను ప్రత్యేకంగా వడ్డించారు. బాదం హల్వా, కేసర్ పిస్తా కులీ్ఫలనూ విడిగా అందించారు.తొలుత అగ్రనేతలతో పిచ్ఛాపాటీగా మాట్లాడేటప్పుడు తెలుగు ప్రజలు ఇష్టంగా తినే మురుకులతోపాటు బెంగాళీ గురు సందేశ్ మిఠాయిని పుతిన్కు ఇచ్చారు. దానిమ్మ, బత్తాయి, క్యారెట్ జ్యూస్లను సిద్ధంగా ఉంచారు. బీట్రూట్, ఖామన్ ఖాక్డీ, కామ్రాక్ బూందీ రైతా కలిపిన షర్కార్కండీ పాపడీ చాట్, అరటి చిప్స్ను అందించారు. సమీపంలో భారతీయ, రష్యన్ వాద్య పరికరాలతో సంగీత విభావరి నిర్వహించారు. సరోద్, సారంగి, తబ్లాలతో రాష్ట్రపతిభవన్ నేవీ వాద్య బృందం అద్బుత ప్రదర్శన ఇచ్చింది. పుతిన్ను పొగిడిన ముర్ము భారత్–రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి పాతికేళ్లు పూర్తవుతున్న వేళ పుతిన్ భారత్లో పర్యటించడం సంతోషదాయకమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. విందు సందర్భంగా ముర్ము కొద్దిసేపు మాట్లాడారు. ‘‘శాంతి, సుస్థిరత, సామాజిక, ఆర్థిక, సాంకేతిక పురోగతే లక్ష్యంగా ఇరుదేశాల భాగస్వామ్యం ముందుకు సాగుతోంది. ఇరుదేశాల బహుముఖ భాగస్వామ్య వాణిజ్యం, ఆర్థిక, రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, శా్రస్తాసాంకేతిక, విద్య, సాంస్కృతి సంబంధాల్లో మరింత ఫలవంతమవుతోంది’’అని ముర్ము అన్నారు. రష్యాకు బయల్దేరిన పుతిన్ రాష్ట్రపతిభవన్లో విందు తర్వాత పుతిన్ తన రెండ్రోజుల భారత పర్యటనను ముగించుకుని రష్యాకు బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతిభవన్ నుంచి నేరుగా ఢిల్లీ లోని పాలం ఎయిర్పోర్ట్కు చేరుకుని సొంత విమానంలో రష్యాకు పయనమయ్యారు. మంత్రి ఎస్.జైశంకర్ పుతిన్కు ఎయిర్పోర్ట్లో వీడ్కోలు పలికారు. -
బలీయ బంధమే ధ్యేయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 23వ ఇండియా–రష్యా సదస్సులో శుక్రవారం కీలక అంశాలపై చర్చించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్తోపాటు ఇరుదేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయానికొచ్చారు. రెండు దేశాల నడుమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించి ఈ ఏడాది అక్టోబర్ నాటికి 25 ఏళ్లు పూర్తికావడం విశేషం. సదస్సు అనంతరం మోదీ, పుతిన్ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.భారత్, రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసం, జాతీయ ప్రయోజనాల పట్ల పరస్పర గౌరవమే పునాది అని ఉద్ఘాటించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి రెండు దేశాల భాగస్వామ్యం దోహదపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, కొన్ని ప్రాంతాల్లో ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాల బంధానికి మరింత ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు. రష్యాలోని యెకటెరిన్బర్గ్, కజన్ నగరాల్లో భారత కాన్సులేట్లు ప్రారంభం కావడాన్ని మోదీ, పుతిన్ స్వాగతించారు. ఉమ్మడి ప్రకటనలోని ముఖ్యాంశాలివీ.. ⇒ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల్యంగా, సుస్థిరమైన రీతిలో పెంపొందించుకోవాలి. భారత్ నుంచి రష్యాకు ఎగమతులు భారీగా పెంచాలి. పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. కొత్తగా సాంకేతికత, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాలి. ఆధునిక రంగాల్లో కలిసి పని చేయడానికి నూతన అవకాశాలను అన్వేíÙంచాలి. 2030 నాటికి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలి. ⇒ భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇంధన రంగమే మూలస్తంభం. అందుకే ఈ రంగంలో సహకారాన్ని విస్తరింపజేసుకోవాలి. ఇంధన రంగంలో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. కొత్త పెట్టుబడులను ప్రోత్సహించాలి. ⇒ రెండు దేశాల నడుమ స్థిరమైన, ప్రభావవంతమైన రవాణా కారిడార్ల నిర్మాణానికి సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. సరుకు రవాణా వ్యవస్థను, ఇరుదేశాల అనుసంధానాన్ని మెరుగుపర్చాలి. మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని ఇంకా పెంచాలి. ⇒ రష్యన్ ఫెడరేషన్లోని దూర ప్రాచ్యం, ఆర్కిటిక్ జోన్లలో వాణిజ్యం, పెట్టుబడుల సహకారాన్ని పెంచుకోవాలి. ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి తరచుగా ద్వైపాక్షిక సంప్రదింపులు జరపాలి. ఆర్కిటిక్ కౌన్సిల్లో పరిశీలక దేశం హోదా పాత్ర పోషించడానికి భారత్ సంసిద్ధత. ⇒ అణు ఇంధన రంగంలో సహకారం బలోపేతం కావాలి. న్యూక్లియర్ ఎనర్జీని శాంతియుత ప్రయోజనాల కోసమే వాడుకోవాలి. రెండు దేశాలు అందుకు మద్దతివ్వాలి. అణు విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు సహకరించుకోవాలి. అలాగే అంతరిక్ష రంగంలోనూ సహకారం బలపడాలి. మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలు, శాటిలైట్ నావిగేషన్, ప్లానెటరీ ప్రయోగాల్లో పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. రాకెట్ ఇంజన్ల అభివృద్ధి, ఉత్పత్తిలో పరస్పరం ప్రయోజనం పొందేలా కలిసి పనిచేయాలి. ⇒ సైనిక, సైనిక సాంకేతిక సహకారాన్ని కూడా పెంపొందించుకోవాలి. సైనిక సామగ్రి విడిభాగాలను భారత్లో తయారు చేయాలి. ఇందుకు రష్యా సహకరిస్తుంది. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి రష్యా తోడ్పాటు లభిస్తుంది. భారత సైనిక దళాల అవసరాలు తీర్చేలా ఉమ్మడి వెంచర్లు ఏర్పాటు చేయాలి. మిత్రదేశాలకు భారత్ నుంచి సైనిక సామగ్రి, ఆయుధాలను ఎగుమతి చేయాలి. ⇒ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి. ఇరుదేశాల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేసేలా ప్రోత్సహించాలి. అరుదైన ఖనిజాల అన్వేషణ, వెలికితీత, శుద్ధి, రీసైక్లింగ్కు ఉమ్మడి కృషి అవసరం. సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల్లో ఉమ్మడి పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డిజిటల్ టెక్నాలజీలో సహకారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇరుదేశాల విద్యాసంస్థలు, శాస్త్రీయ సంస్థల మధ్య భాగస్వామ్యం బలపడాలి. ⇒ భారత్, రష్యా స్నేహ సంబంధాలకు సంస్కృతుల అనుసంధానం, ప్రజల అనుసంధానం అత్యంత కీలకం. మరింత లోతైన సంబంధాల కోసం రెండు దేశాల్లో సాంస్కృతిక వేడుకలు, పుస్తక ప్రదర్శనలు, పండుగలు, కళాత్మక పోటీలు నిర్వహించాలి. ఇందులో ప్రజలను భాగస్వాములను చేయాలి. ఒక దేశం సంస్కృతి సంప్రదాయాల గురించి మరో దేశంలోని ప్రజలు తెలుసుకోవాలి. దీంతో వారి మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. సినీ పరిశ్రమ విషయంలోనూ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఉమ్మడి ఫిలిం ప్రొడక్షన్ను అభివృద్ధి చేయాలి. అలాగే పర్యటనలను ప్రోత్సహించాలి. ఇందుకోసం వీసా నిబంధనలు సరళతరం చేయాలి. రెండు దేశాలు ఈ–వీసా విధానం తీసుకురావాలి. అలాగే భారత్, రష్యాలకు చెందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం బలోపేతమయ్యేలా చర్యలు చేపట్టాలి.⇒ ఐక్యరాజ్యసమితిలో కీలక అంశాలపై ఉన్నతస్థాయి రాజకీయ దౌత్యం, సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలి. యూఎన్ చార్టర్ను గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలు చేపట్టేలా ఉమ్మడిగా కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతి, భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేలా మండలిని ప్రభావవంతంగా తీర్చిదిద్దాలి. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి. ఇందుకు రష్యా సహకరిస్తుంది. జీ20 కూటమిలోనూ భారత్, రష్యా కలిసి పనిచేయాలి. అంతేకాకుండా ‘బ్రిక్స్’లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. అణు సరఫరాదారుల గ్రూప్లో భారత్కు సభ్యత్వం కలి్పంచడానికి రష్యా సహకారం అందజేస్తుంది. ⇒ ఉగ్రవాదం పెను ముప్పుగా మారింది. ఇదొక ఉమ్మడి సవాలు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిందే. తీవ్రవాదం, సంస్థాగత నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చే ముఠాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై పోరాటం కొనసాగించాలి. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే అంతం చేయాలి. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో తీర్మానం చేసేలా ఒత్తిడి పెంచాలి. -
ఉన్నత శిఖరాలకు మన బంధం
న్యూఢిల్లీ: భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఇరుదేశాల అధినేతలు నిర్ణయించారు. ఎనిమిది దశాబ్దాల స్నేహ సంబంధాలకు నూతన శక్తి, వేగాన్ని జోడించాలని తీర్మానించారు. అమెరికా టారిఫ్లు, ఆంక్షల నేపథ్యంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఇందులో భాగంగా ఆర్థిక–వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారానికి ఐదేళ్ల ప్రణాళికను ప్రకటించారు.ఉక్రెయిన్లో ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరపడాలని తాము కోరుకుంటున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధినేత పుతిన్కు స్పష్టంచేశారు. శాంతియుత మార్గాల్లో సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్–రష్యా విషయంలో భారత్ తటస్థంగా లేదని.. శాంతిపక్షం వైపే ఉందని స్పష్టంచేశారు. ఆ రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామన్నారు. మోదీ, పుతిన్ శుక్రవారం ఢిల్లీలో 23వ భారత్–రష్యా సదస్సులో పాల్గొన్నారు. ఇరుదేశాల సంబంధాల్లో పురోగతితోపాటు ముఖ్యమైన అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఆరోగ్యం, రవాణా, వలసలు, ఆహార భద్రత, షిప్పింగ్, ప్రజల మధ్య అనుసంధానం తదితర అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఇరుపక్షాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ రంగంలో ఆయుధాలు, మిలటరీ హార్డ్వేర్ తయారీలో సహకారానికి ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ‘ఆర్థిక సహకార కార్యక్రమం’పై భారత్, రష్యా అంగీకారానికి వచ్చాయి. సదస్సు అనంతరం మోదీ, పుతిన్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు.ధ్రువ నక్షత్రంలా మన స్నేహం ప్రపంచం గత ఎనిమిది దశాబ్దాలుగా ఎన్నో ఒడిదొడుకులకు, సమస్యలకు సాక్షిగా నిలుస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మానవాళికి సవాళ్లు, సంక్షోభాలు ఎదురవుతూనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఎలాంటి ప్రతికూల పరిణామాలు సంభవించినా భారత్–రష్యా స్నేహం మాత్రం ధ్రువ నక్షత్రంలా స్థిరంగా నిలిచే ఉంటోందని స్పష్టంచేశారు. పరస్పర గౌరవం, లోతైన విశ్వాసం ఆధారంగా ఈ బంధం నిర్మితమైందని, కాల పరీక్షకు నిలిచిందని అన్నారు. ఈ పునాదిని ఇంకా పటిష్టంగా మార్చుకొనే దిశగా పరస్పర సహకారమే లక్ష్యంగా అన్ని అంశాలపై చర్చించామని చెప్పారు. ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు చేర్చడం ఉమ్మడి ప్రాధాన్యత కలిగిన అంశమని వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను వైవిధ్యంగా, సమతుల్యంగా, సుస్థిరంగా మార్చబోతున్నట్లు వివరించారు. రష్యా పౌరుల కోసం 30 రోజుల ఉచిత ఈ–టూరిసుŠట్ వీసా, 30 రోజుల ఉచిత గ్రూప్ టూరిస్ట్ వీసాను మోదీ ప్రకటించారు. త్వరలోనే ఇవి అమల్లోకి వస్తాయన్నారు.ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలిభారత్–రష్యా భాగస్వామ్యానికి ఇంధన భద్రత, పౌర అణు ఇంధన రంగాల్లో సహకారం చాలా కీలకమని ప్రధాని గుర్తుచేశారు. ఇరుదేశాల నడుము ‘గెలుపు–గెలుపు సహకారాన్ని’ ఇలాగే కొనసాగిస్తామన్నారు. ప్రపంచమంతటా సప్లై చైన్స్ భద్రంగా, వైవిధ్యంగా ఉండాలంటే భారత్, రష్యా మధ్య అరుదైన ఖనిజాల విషయంలో సహకారం చాలా ముఖ్యమ న్నారు. ఉగ్రవాదంపై పోరాటంపై రెండు దేశాలు భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. భారత్లోని పహల్గాం ఉగ్రదాడి, రష్యాలోని క్రోకస్ సిటీ హాల్పై ఉగ్రదాడి మూలాలు ఒక్కలేనని చెప్పారు. ఉగ్రవాదం అనేది మానవీయ విలువలపై ప్రత్యక్ష దాడిగా మోదీ అభివరి్ణంచారు. ఉగ్రవాద రక్కసిని ఖతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. రహస్య అజెండాలు, ద్వంద్వ ప్రమాణాలు పక్కనపెట్టి ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని ప్రపంచ దేశాలకు స్పష్టంచేశారు.‘మేక్ ఇన్ ఇండియా’కు చోదక శక్తి భారత్, రష్యా ప్రజల మధ్య అనుసంధానం మరింత పెరగాలని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, నార్తన్ సీ రూట్, చెన్నై–వ్లాడివోస్తోక్ కారిడార్కు శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. రష్యా సహకారంతో ధ్రువపు ప్రాంతాల్లో భారత నావికులకు శిక్షణ ఇవ్వపోతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల భారతీయ యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నౌకల నిర్మాణంలో సహకారాన్ని మెరుగుపర్చుకుంటున్నామని, ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇదొక చోదక శక్తి అవుతుందన్నారు. భారత్–రష్యా సంబంధాలను బలోపేతం చేయడానికి తిరుగులేని అంకితభావం ప్రదర్శిస్తున్నారంటూ పుతిన్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మానవ వనరులను ఇచ్చి పుచ్చుకోవడానికి రష్యాతో రెండు ఒప్పందాలు చేసుకున్నామని వెల్లడించారు.భారత ఇంధన అవసరాలు తీరుస్తాంభారత్, రష్యా మధ్య ప్రస్తుతం ఏటా 64 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందని, దీన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచబోతున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చి చెప్పారు. తమపై ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఆంక్షలు విధించినా భారత ఇంధన అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. చమురు, గ్యాస్, బొగ్గు సరఫరా విషయంలో తాము విశ్వసనీయమైన సరఫరాదారులమని తేలి్చచెప్పారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్కు నిరంతరాయంగా ఇంధనం సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. భారత ఉత్పత్తుల కోసం రష్యా మార్కెట్లను మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని పుతిన్ సంకేతాలిచ్చారు. అలాగే చిన్న, మధ్య తరహా అణు రియాక్టర్లు, ఫ్లోటింగ్ అణు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణానికి సహకరించుకోవడానికి భారత్, రష్యా ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.వ్యవసాయం, ఔషధాల వంటి రంగాల్లో అణు టెక్నాలజీని వాడుకోవడానికి భారత్కు సహకరిస్తామన్నారు. భద్రత, ఆర్థికం, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాల్లో సహకారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. భారత్, రష్యాలు ఒకేరకమైన ఆలోచనా ధోరణితో బహుళ ధ్రువపు ప్రపంచ దిశగా పని చేస్తున్నాయని పుతిన్ పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద భూతాన్ని భూస్థాపితం చేయాల్సిందేనని పేర్కొన్నారు.11 ఒప్పందాలపై సంతకాలు 23వ ఇండియా–రష్యా సదస్సు సందర్భంగా మొత్తం 11 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. నైపుణ్యం కలిగిన కారి్మకుల వలసలు, ఆహార భద్రత, షిప్పింగ్, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ పరిశోధనలు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఈ ఒప్పందాలు కుదిరాయి. ప్రతిభావంతులైన భారతీయ కార్మికులను తమ దేశంలో నియమించుకోవడానికి వీలుగా రష్యా ప్రభుత్వం భారత్తో ఒప్పందం కుదుర్చుకుంది. -
శిఖరాగ్ర బంధం!.. రష్యాతో అనుబంధం
సంక్లిష్ట సమయాల్లో సైతం నమ్మకమైన నేస్తంగా నిరూపించుకున్న రష్యాతో అనుబంధం మరింత దృఢతరమైంది. గురువారం భారత పర్యటన కోసం వచ్చిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జరిపిన శిఖరాగ్ర సమావేశమైనా, ఆపై ఇరు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలైనా ఈ సంగతిని నిరూపిస్తున్నాయి. వర్తమాన ప్రపంచ స్థితిగతులు సజావుగా ఏమీ లేవు. ఉక్రెయిన్తో రష్యా నాలుగేళ్లుగా యుద్ధంలో తలమునకలైంది.గడియకో మాట మాట్లాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంగతెలా ఉన్నా యూరప్ దేశాలు ఈ విషయంలో రష్యాపై కత్తులు నూరుతున్నాయి. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించటానికి మధ్యమధ్యలో ట్రంప్ ప్రయత్నిస్తున్నా యూరప్ దేశాలు... ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఎట్లాగైనా రష్యా మెడలు వంచాలని చూస్తున్నాయి. పుతిన్ భారత పర్యటనకు ముందు ‘మా భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి’ అంటూ భారత్లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) రాయబారి హెర్వ్ డెల్ఫిన్ మనకు చెప్పటం గమనించదగ్గది.రష్యా చమురు కొంటున్నందకు ఇప్పటికే అమెరికా ఆగ్రహించి, మనపై 25 శాతం అదనపు సుంకాలు విధించింది. ఇతరత్రా వాణిజ్య ఒప్పందాలకు బ్రేక్ వేయాలంటూ ఒత్తిళ్లు తెస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానంగా నాలుగేళ్ల నుంచి రష్యాకు పాశ్చాత్య బ్యాంకింగ్ వ్యవస్థతో లింక్ తెగిపోయింది. వాణిజ్య సంబంధాలూ అంతే. ఇదే సమయంలో మనతో రష్యా ఆర్థిక సంబంధాలు మెరుగయ్యాయి. మన దేశం నిరుడు 5,600 కోట్ల డాలర్ల విలువైన ముడిచమురు కొనుగోలు చేసింది. అమెరికా ఒత్తిడి పర్యవసానంగా ఇటీవల ఆ కొనుగోళ్లు తగ్గినా ఇరు దేశాల వార్షిక వాణిజ్యం 6,870 కోట్ల డాలర్లకు చేరుకుంది. దీన్ని 10,000 కోట్ల డాలర్లకు చేర్చాలని ఇరుదేశాల లక్ష్యం. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పుతిన్ ఒక దేశంలో అధికారిక పర్యటనకు రావటం ఇదే తొలిసారి.ఈసారి సైనిక సామగ్రి, ఆయుధాలకు సంబంధించికాక ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలపైనే ఇరు దేశాలూ కేంద్రీకరించాయి. ఇరు దేశాధినేతల సమక్షంలో సంతకాలైన ఆర్థిక సహకార ఒప్పందం 2030 వరకూ షిప్పింగ్, కెమికల్స్, ఆరోగ్యం వగైరారంగాల్లో పరస్పర సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా కలిసి పనిచేయాలని కూడా ఇరు దేశాలూ నిర్ణయించాయి. అయిదో తరం సుఖోయ్ ఎస్యూ–57 యుద్ధ విమానాల అమ్మకానికి రష్యా సుముఖత చూపడమేకాక, వాటిని భారత్లోనే ఉత్పత్తి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే రష్యా రియాక్టర్లతో రెండో అణువిద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పే అవకాశాన్ని పరిశీలించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ఈ సమావేశం కోసం మోదీ, పుతిన్లిద్దరూ ఈ ఏడాది అయిదుసార్లు ఫోన్లలో సంభాషించుకోవటంతోపాటు చైనాలోని తియాన్జిన్లో మొన్న సెప్టెంబర్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్రం సందర్భంగా కలుసుకున్నారు. ఈ పర్యటనలో కుదరబోయే ఒప్పందాలపైనా, ప్రస్తావనకు రాబోయే భిన్న అంశాలపైనా గత ఆర్నెల్లుగా రెండు దేశాలమధ్యా ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. మొన్న ఆగస్టులో విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాను సందర్శించి పుతిన్ను కలిశారు. అంత క్రితం మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లారు. ఇవన్నీ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావటానికి దోహద పడ్డాయి.ఎవరితోనైనా తాము కుదుర్చుకునే ద్వైపాక్షిక ఒప్పందాలు మూడో దేశానికి వ్యతిరేకం కాదని మన దేశం మొదటినుంచీ చెబుతోంది. రష్యాతో సంబంధాల విషయంలో అమెరికా, యూరప్ దేశాల ఒత్తిళ్లు పనిచేయబోవని ఈ శిఖరాగ్ర సమావేశం నిరూపించింది. చైనా–రష్యా సంబంధాలు ప్రస్తుతానికి బాగున్నా, ఆసియాలో తన ప్రయోజనాలను విడనాడుకోవటానికి రష్యా సిద్ధంగా లేదు. అలాగే అమెరికా–చైనా సన్నిహితమవుతున్న తీరును కూడా రష్యా గమనించకపోలేదు. ఎవరెవరితో కలుస్తారో, ఏ కూటములు ఎన్నాళ్లు మనుగడలో ఉంటాయో తెలియని అయోమయ స్థితిలో స్వతంత్ర విదేశాంగ విధానమే సర్వవిధాలా మేలైనదని మన దేశం చాటిచెప్పింది. -
టిట్ ఫర్ టాట్ పడిందా?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన దగ్గర్నుంచీ అన్ని వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్.. ప్రధానంగా ప్రతీదేశం తమ అదీనంలో ఉండాలని ఆకాంక్ష ట్రంప్లో బలంగా నాటుకుపోయినట్లుంది. అందుకే ఆ దేశం, ఈ దేశం అని లేదు.. అన్ని దేశాలను తన చర్యలతో భయపెడుతున్నారు. తమది అగ్రరాజ్యమనే అహంకార భావనలో ఉన్న ట్రంప్ చేస్తున్న చేష్టలు కొన్ని దేశాలకు విసుగుతెప్పిస్తూనే ఉంది.అలా ట్రంప్ చర్యలతో ఎక్కువగా విసుగుపోయిన దేశాలలో రష్యా ఒకటి, భారత్ మరొకటి. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. అదే సమయంలో భారత్కు ఆంక్షలు కూడా విధించారు. ‘ మీరు రష్యా ఆయిల్ కొనడానికి వీల్లేదనే హుకుం జారీ చేశారు. ఇది రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపడానికని శాంతి ప్రవచనాలు కూడా చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని ఎంతవరకూ నియంత్రించారో తెలీదు కానీ, రష్యా మాత్రం మళ్లీ భారత్కు చమురు సరఫరా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. భారత్కు చమురు కొనసాగిస్తాం.. : పుతిన్ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. మీడియా సాక్షిగా భారత్కు అన్ని రకాల చమురు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అమెరికా భయపెడితే భయపడిపోవడానికి తామేమీ చిన్న పిల్లలం(చిన్న దేశం) కాదనే సంకేతం ఇచ్చారు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న పుతిన్.. ఇరు దేశాల మధ్య ఒప్పందాల గురించి వివరించే క్రమంలో చమురును భారత్కు యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.అసలే పుతిన్ భారత్ పర్యటనపై ఫుల్ ఫోకస్ పెట్టిన ట్రంప్.. ఈ మాట అనేసరికి నోట్లో వెలక్కాయపడినట్లు అవ్వడం ఖాయం. పుతిన్-మోదీలు ఏం చెబుతారా అనే ఆసక్తిగా గమనిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. పుతిన్ మాటలకు చిర్రెత్తుకొచ్చినట్లు అయ్యి ఉంటుంది. గతంలో వైట్హౌస్ వేదికగా పుతిన్-ట్రంప్ల మధ్య భేటీ జరిగింది. ఆ భేటీ కూడా సజావుగా సాగలేదు. తమ ఆంక్షలకు కట్టుబడి ఉండాలనే ఒత్తిడితో ఆ భేటీ సఫలం కాలేదు. ‘శాంతి’ చర్యలు అంటూ పలు దేశాలకు తలనొప్పివేరే దేశాన్ని నియంత్రించాలని అనుకోవడం ఎంతవరకూ సబబు అనేదే ఇక్కడ ప్రశ్న. ఎంతటి అగ్రజుడు అయినా తమ అధీనంలో అంతా ఉండాలని అనుకోవడం అవివేకం. వీటికి ఎన్నో కథలు, ఉదాహారణలు, సామెతలు కూడా ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసినవే. ఇప్పటి వరకూ ట్రంప్ చేసింది ఏదైనా ఉందంటే అది తన ‘శాంతి’ చర్యలతో మిగతా దేశాలని నొప్పించడమే జరుగుతుంది. ఇక్కడ తమ మాట వింటే ఒక రకంగా, మాట వినకపోతే మరో రకంగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ‘కశ్మీర్’ అంశాన్ని తాను పరిష్కరిస్తానని ట్రంప్ చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు గుర్తే. ఆ మాటలకు భారత ప్రధాని మోదీ కూడా స్ట్రాంగ్గానే సమాధానం ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చిచెప్పారు. తమ సమస్యను పరిష్కరించుకునే సత్తా తమకు ఉందని ట్రంప్ను పరోక్షంగా హెచ్చరించారు. అంటే పుతిన్-మోదీలిద్దరూ ట్రంప్ను అంతగా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నారు. స్నేహ ధర్మంలో హద్దులు దాటి ‘సరిహద్దులు’ వరకూ వస్తే ఊరుకోమని సంకేతాలు పంపుతూనే ఉన్నారు. అందుకే మోదీ-పుతిన్ల భేటీపై ట్రంప్ సీరియస్ లుక్ వేసి ఉంచారు. ప్రస్తుతం పుతిన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్కు వినబడ్డాయా.. లేదా అనే రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇదీ చదవండి:పాక్తో ఇంకా సంబంధాలెందుకు?: అమెరికా ఎంపీల డిమాండ్ -
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
ఢిల్లీ: భారత్-రష్యాలమధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. వివిద రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సహకారం వలస విధానంపై ఒప్పందంతో పాటు, ఆహార భద్రత, వైద్య, ఆరోగ్య రంగాలపై ఒప్పందం, కెమికల్ ఫెర్టిలైజర్స్ సరఫరాపై ఇరు దేశాల మధ్య ఒప్పందం, సముద్ర ఆహార ఉత్పత్తులపైనా ఒప్పందాలు జరిగాయి.దీనిలో భాగంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ-రష్యా అధ్యక్షడు పుతిన్ల సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలపై కీలక సంతకాలు జరిగాయన్నారు. ‘పుతిన్ నేతృత్వంలో భారత్-రష్యాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. గత ఎనిమిది దశాబ్దాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం.భారత్-రష్యాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుంది. రష్యా ఎప్పట్నుంచో మనకు మిత్రదేశం. 2030 వరకూ ఇరు దేశాల మధ్య అనేక ఆర్థిక సహకార ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు శిఖరాగ్రానికి చేరతాయి’ అని స్పష్టం చేశారు.అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. ‘ నాకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులందరికీ కృతజ్ఞతలు. భారత ఆతిథ్యం సంతోషాన్ని ఇచ్చింది. భారత్-రష్యాల మధ్య సహృద్భావ వాతావరణం. నేను మోదీతో అంతర్జాతీయ అంశాలను షేర్ చేసుకున్నా. ఆర్థిక, భద్రత తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాం. అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.. మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్, రష్యాల మధ్య రవాణా అనుసంధానం పెంచడం మా లక్ష్యం. మేకిన్ ఇండియాకు మా మద్యతు ఉంటుంది. భారత్కు చముర సరఫరాను కొనసాగిస్తాం’ అని తేల్చి చెప్పారు పుతిన్. -
రెండున్నర నెలల భారత్ పర్యటనలో గమనించింది ఇదే..!
అమెరికా భారత్ మధ్య సాంస్కృతిపరంగా, సామాజికంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేకంగా ఎంతలా ఆ వ్యత్సాసం ఉంటుదనేది తెలియదు. అయితే ఇటీవల భారత్లో గడిపి వెళ్లిన ఇద్దరు పిల్లలు తల్లి ఆ విభిన్నతను క్షుణ్ణంగా గమనించి మరీ నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటో తెలిస్తే మాత్రం ఇంత తేడా ఉందా ఇరు దేశాల మధ్య అనిపిస్తుంది. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. రెండున్నర నెలల పర్యటన కోసం కుటుంబంతో సహా భారత పర్యటన వచ్చిన ఇద్దరు పిల్లల తల్లి అన్నా హాకెన్సన్ ఇన్స్టాగ్రామ్లో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. తనకు రెండు దేశాలు ఎంత భిన్నంగా ఉంటుందో తెలుసుగానీ, వాస్తవికంగా అదెలా అనేది స్పష్టంగా తెలియదని చెప్పుకొచ్చింది. కానీ ఈపర్యటనలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానంటూ ఆ ఇరుదేశాల వ్యత్యాస జాబితా గురించి వివరించింది. ఆమె గమనించి తొమ్మది తేడాలు ఏంటంటే..హాంకింగ్: అమెరికాలో హాంకింగ్ అంటే వేరే అర్థం వస్తుంది, కానీ భారతదేశంలో, హాంకింగ్ అంటే, "హాయ్, నేను ఇక్కడ ఉన్నాను, చూడండి, ధన్యవాదాలు". అని అర్థం. మాటిమాటికి గట్టిగా అరుస్తు మాట్లాడతారని అర్థం.ఆహారం: అమెరికాలో, కారం అంటే తేలికపాటి వేడి అని అర్థం. కానీ భారతదేశంలో, కారం అంటే కొన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది, ముఖ్యంగా విదేశీయులకు.ప్రజలు: యూఎస్ఏ మనం ఉన్నట్లు ఎవ్వరూ గుర్తించరు, పైగా గమనించనట్లు నటిస్తారు. అదే భారత్లో అవతలి వాళ్లు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనే కుతుహలం ఎక్కువ.చెత్త: USAలో చెత్త డబ్బాల్లో చెత్త ఉంటే భారతదేశం దీని గురించి స్పష్టంగా చెప్పలేము. అది ప్రాంతం బట్టి మారిపోతుంటుంది.కార్లు: యూఎస్లో ట్రాఫిక్ చట్టాలను పాటిస్తారు. కానీ భారతదేశంలో బయట నుంచి వచ్చేవారికి అర్థంకానీ గందరగోళంగా కనిపిస్తుంది.వాతావరణం: అమెరికా - శీతాకాలం, వసంతకాలం, వేసవి, చాలా ప్రదేశాలలో శరదృతువు; భారతదేశం: వేడి అది కూడా ఆశ్చర్యకరమైన రేంజ్లో అదనపు వేడి ఉంటుంది.మతం: అమెరికా - ఎక్కువగా కాథలిక్ చర్చిలు, నిశ్శబ్ద సమావేశాలు; భారతదేశం: ప్రతిచోటా దేవాలయాలు, నగరాలను ఆక్రమించే పండుగలు.స్థోమత: యూఎస్లో ప్రతీది ఖరీదైనది, కానీ భారత్లో పర్లేదు, నిర్వహించగలం.కుటుంబం: అమెరికా - ఒకే కుటుంబ జీవనం; భారతదేశం - ఒకే చోట బహుళ తరాలు చూడొచ్చు. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు.."మా దేశానికి అపరిచిత వ్యక్తే అయినా..మీరు చాలా క్షుణ్ణంగా వ్యత్యాసాలను గమనించారు . చాలా గ్రేట్." అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Anna Haakenson | Adventure Family Travel (@wanderlust.haaks) (చదవండి: ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్కు..!) -
భారత్కు అండగా రష్యా.. పుతిన్పై ట్రంప్ ఫుల్ ఫోకస్?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నారు. 2021 తర్వాత భారత పర్యటనకు పుతిన్ రావడం ఇదే తొలిసారి. అలాగే, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత పర్యటనకు పుతిన్ వచ్చిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. కాగా, పుతిన్ పర్యటనలో భాగంగా భారత్, రష్యా మధ్య వాణిజ్య, రక్షణ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, పుతిన్ భారత పర్యటనలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణంగా భారత్కు రష్యా మిత్ర దేశం కావడమే.రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు దేశాల్లో అనేకమంది పాలకులు మారారు. దాదాపు పాతికేళ్లుగా పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో అమెరికాలో ఐదుగురు అధ్యక్షులు మారారు. భారత్ ముగ్గురు ప్రధానులను చూసింది. పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పుతిన్ హయాంలో భారత్, రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. రష్యా నేతలు భారత్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేశారని గతంలో ఒకసారి పుతిన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా పుతిన్ తొలి భారత పర్యటన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జరిగింది. ఆ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి బాటలు వేసింది. ఇప్పుడు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి.ఆయుధాలు రష్యావే.. భారత్ రష్యా రక్షణ పరిశ్రమకు పెద్ద మార్కెట్గా ఉంది. భారత సాయుధ దళాలు వినియోగించే ఆయుధాల్లో 36 శాతం రష్యావే. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు ఐదోతరం సుఖోయ్-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్లో పాక్ దాడుల నుంచి భారత్కు రక్షణ కవచంలా నిలిచిన S-400కు అప్డేటెడ్ వర్షనైన S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై ఇరుదేశాలు ఓ అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక, మిగ్–29, బ్రహ్మోస్ క్షిపణులు, అణు జలాంతర్గాములు వంటి కీలక వ్యవస్థలు రష్యా సహకారంతోనే నడిచాయి. మరోవైపు.. చైనా సైతం భారత్-రష్యా సంబంధాలు అత్యంత వ్యూహాత్మకమైనవి, ప్రపంచ రాజకీయ ఒత్తిళ్లకు లోబడనిది అని పేర్కొంది.కీలక ఒప్పందాలు ఇలా.. 1. RELOS ఒప్పందం (Reciprocal Exchange of Logistic Support)- రష్యా పార్లమెంట్ 2025లో ఆమోదించిన కీలక ఒప్పందం.- రెండు దేశాల సైన్యాలు ఒకరి నౌకాదళ, వైమానిక స్థావరాలు, లాజిస్టిక్ సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు.2. 2021–2031 సైనిక-సాంకేతిక సహకార కార్యక్రమం- 2021లో 2+2లో సంతకం.- పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ వంటి విభాగాల్లో దీర్ఘకాలిక సహకారం.3. సుఖోయ్–30 MKI ఒప్పందం- 1996లో మొదటి ఒప్పందం.- 50 విమానాల కొనుగోలు, 140 విమానాల HALలో లైసెన్స్ ఉత్పత్తి.4. బ్రహ్మోస్ క్షిపణి సంయుక్త ప్రాజెక్ట్- భారత్-రష్యా సంయుక్త సంస్థ (BrahMos Aerospace).- ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థ.5. మిగ్–29 అప్గ్రేడ్, కొనుగోలు ఒప్పందాలు- పలు దశల్లో మిగ్–29 విమానాల కొనుగోలు, అప్గ్రేడ్.6. అణు జలాంతర్గామి (INS Chakra) లీజ్ ఒప్పందాలు- రష్యా నుండి అణు శక్తితో నడిచే జలాంతర్గాముల లీజ్.7. S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒప్పందం- 2018లో సంతకం.- ఐదు రెజిమెంట్ల కొనుగోలు.8. కా-226T హెలికాప్టర్ సంయుక్త ఉత్పత్తి ఒప్పందం- భారత్లో తయారీకి ఒప్పందం (Make in India).9. AK-203 అసాల్ట్ రైఫిల్ ఉత్పత్తి ఒప్పందం- ఉత్తరప్రదేశ్లో సంయుక్త ఉత్పత్తి.10. పది అంతర్ ప్రభుత్వ ఒప్పందాలు, 15 వాణిజ్య ఒప్పందాలు (2025)- పుతిన్ పర్యటనలో సంతకం చేయడానికి సిద్ధం చేసిన ప్యాకేజ్.11. సంయుక్త సైనిక విన్యాసాలు- ఇండ్రా (INDRA)- అవియాడ్రిల్- నౌకాదళ, వైమానిక, భూసేనల సంయుక్త వ్యాయామాలు.12. అంతరిక్ష–రక్షణ సహకారం- గగనయాన్ వ్యోమగాముల శిక్షణలో రష్యా పాత్ర.- అంతరిక్ష–రక్షణ రంగంలో కొత్త ఒప్పందాలు పుతిన్ పర్యటనలో చర్చించబడ్డాయి.రష్యా-ఉక్రెయిన్ అంశం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్ ఎంతో సంయమనం పాటించింది. రెండు దేశాల శాంతి కోసమే ప్రయత్నాలు చేసింది. ఓవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరుపుతూనే.. రష్యా దూరం కాకుండా ముందుకు సాగింది. రష్యా నుంచి చమురు విషయంలోనూ భారత్ ప్లాన్ ప్రకారం నడుచుకుంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోలా ఉంది. 50 శాతం దిగుమతి సుంకాలతో భారత్ను లొంగదీసుకోవచ్చని ఆయన భావించారు. కానీ అది జరగలేదు. అమెరికాకు అనుకూలమా? వ్యతిరేకమా? ఏదో ఒకటి చెప్పేయండి అంటూ భారత్కు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. అయినా రష్యాతో స్నేహ బంధాన్ని భారత్ తెంచుకోలేదు. దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ఎక్కువని గతంలో భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. పుతిన్ పర్యటన వేళ కూడా ఇదే దిశగా ఒప్పందాలు, నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు అంచనా వేస్తున్నారు.రష్యాతో వాణిజ్యం.. 2024-25లో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ 4.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయగా.. రష్యా నుంచి ఏకంగా 64 బిలియన్ డాలర్ల దిగుమతులను చేసుకుంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని ఇరుపక్షాలు ప్రకటించాయి. పుతిన్ పర్యటనలో ఇంధనం ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. భారత్కు తక్కువ ధరకే రష్యా ముడి చమురును సరఫరా చేస్తోంది. ఇది రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉన్న వేళ ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారత అణు పరిశ్రమలో రష్యా సహకారం మరవలేనిది. పుతిన్ పర్యటన వేళ.. పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవనం ఉన్న రష్యా.. వాటిని భారత్కు ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. కుడంకుళంలో అణుశక్తి ప్రాజెక్టు కొనసాగింపుపై చర్చించనున్నట్లు రష్యా అధికారులు తెలిపారు.ట్రంప్ రియాక్షన్? ఒకవేళ రష్యాతో చమురు అనుబంధాన్ని, రక్షణ రంగ సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంటే, అమెరికా సీరియస్గా స్పందించే ఛాన్స్ ఉంది. ట్రంప్ మరోసారి భారత్పై సుంకాలు విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు కోపాన్ని తెప్పించే నిర్ణయాలు, ఒప్పందాల దిశగా భారత్ ప్రస్తుతానికి అడుగులు వేయకపోవచ్చని వారు అంటున్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ఆపద కాలంలో ఆదుకునే రష్యాతో చెలిమిని నిలుపుకునే దిశగా లౌక్యంగా భారత్ ముందుకు సాగుతుందని విశ్లేషిస్తున్నారు.డాలర్కు చెక్ పెట్టే ప్లాన్భారత్, రష్యాలు ప్రస్తుతం అమెరికా డాలరుతో పాటు తమ తమ దేశాల కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలు జరుపుతున్నాయి. రానున్న రోజుల్లో పూర్తిగా సొంత కరెన్సీల్లో వాణిజ్యం జరిపేలా వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే అంశంపై పుతిన్, మోదీ చర్చించనున్నారు. అందుకే పుతిన్ వెంట రష్యాకు చెందిన స్పర్ బ్యాంక్ సీఈఓ ఇవాన్ నోసోవ్ కూడా వచ్చారు. వాణిజ్య లావాదేవీల ద్వారా రష్యాకు పెద్దమొత్తంలో భారత రూపాయలు చేరాయి. వాటితో భారత్లోని మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని స్పర్ బ్యాంక్ యోచిస్తోంది. భారత్తో వాణిజ్య లావాదేవీలు జరిపే క్రమంలో రష్యా వ్యాపారులకు రూపాయి విలువ కలిగిన లెటర్ ఆఫ్ క్రెడిట్ను జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ఈ బ్యాంకు ప్రారంభించింది. ఒకవేళ దీనిపై భారత్-రష్యాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రష్యా, భారత్పై ట్రంప్ మరోసారి కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. -
ప్రోటోకాల్ పక్కనపెట్టి పుతిన్ కి స్వయంగా స్వాగతం పలికిన మోదీ
-
టెస్టు ఫార్మాట్కే పరిమితమా!
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. హైదరాబాదీ పేస్ బౌలర్ సిరాజ్కు ఇందులో చోటు కల్పించలేదు. సిరీస్ నుంచి విశ్రాంతి నిచ్చారా అనుకుంటే దానికి ముందు వన్డే సిరీస్లో కూడా అతను ఆడలేదు. తగినంత విరామం లభించిన అతను ఇప్పుడుదేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్కు ఆడుతున్నాడు. అంతకుముందు ఆ్రస్టేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో కూడా సిరాజ్ను ఎంపిక చేయలేదు. టి20 వరల్డ్ కప్ చేరువైన నేపథ్యంలో సెలక్టర్ల ఆలోచనను బట్టి చూస్తే సిరాజ్కు అవకాశం సందేహంగానే కనిపిస్తోంది. వన్డేల విషయంలో కూడా అతని ఎంపికపై ఎలాంటి స్పష్టతా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాక్షి క్రీడా విభాగం : సరిగ్గా నాలుగు నెలల క్రితం... ఇంగ్లండ్ గడ్డపై ఓవల్ టెస్టులో అసాధారణ బౌలింగ్తో భారత్ను గెలిపించిన హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఒక్కసారి హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా చివరి రోజు పోరాటయోధుడిలా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కుప్పకూల్చిన అతను... భారత్ను సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి కాపాడటంతో పాటు ఒక రకంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పరువు నిలబెట్టాడు. లేదంటే భారత్ 1–3తో ఓడి తిరుగుముఖం పట్టేది. అలాంటి అద్భుత ప్రదర్శన తర్వాత సిరాజ్ ఒక్కసారిగా తెర వెనక్కి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. అసలు భారత జట్టులో ఉన్నాడా లేదా అనే సందేహాల మధ్య అతని ఆట కొనసాగుతోంది. నిజానికి ఇంగ్లండ్తో టెస్టుల్లో చెలరేగినా... అప్పటికే అతను వన్డే ఫార్మాట్లో తానేమిటో నిరూపించుకున్నాడు. టి20ల్లో కూడా పదునైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లపై పైచేయి సాధించడంతో పాటు ఐపీఎల్లో రెగ్యులర్గా రాణిస్తున్న బౌలర్లలో అతనూ ఒకడు. కానీ తాజా పరిణామాలు చూస్తే 31 ఏళ్ల సిరాజ్ను ఒక ఫార్మాట్కే పరిమితం చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. నిలకడైన ప్రదర్శన... ఓవరాల్గా సిరాజ్ వన్డే కెరీర్ రికార్డు చాలా బాగుంది. 47 వన్డేల్లో కేవలం 24.67 సగటుతో అతను 73 వికెట్లు పడగొట్టాడు. గత కొంత కాలంగా ఫార్మాట్కు తగినట్లు తన ఆటను మార్చుకుంటూ నిలకడైన ప్రదర్శనతో సిరాజ్ తనను తాను ‘ఆల్ ఫార్మాట్ బౌలర్’గా మలచుకున్నాడు. ప్రస్తుతం భారత బౌలింగ్ దళంలో బుమ్రా తర్వాత నిస్సందేహంగా రెండో స్థానం తనదే. నిజానికి చాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్కు చోటు దక్కకపోవడమే ఆశ్చర్యం కలిగించింది. అంతకుముందు రెండేళ్లలో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సిరాజ్ నిలిచాడు. బంతి పాతబడితే ప్రభావం చూపలేకపోతున్నాడంటూ కెపె్టన్ రోహిత్ శర్మ ఇచ్చిన వివరణ కూడా సరైంది కాదని అందరికీ అర్థమైంది. ఓవల్ టెస్టు ప్రదర్శనతో పాటు వన్డేల్లో నిలకడైన ప్రదర్శన చూసుకుంటే సిరాజ్కు వన్డేల్లోనూ వరుస సిరీస్లలో స్థానం లభించాలి. ఆ్రస్టేలియా గడ్డపై ఆడిన 3 వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీయకపోయినా కేవలం 4.94 ఎకానమీతో పరుగులివ్వడం చక్కటి ప్రదర్శనే. కానీ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కు వచ్చేసరికి టీమ్లో స్థానం లేదు. గత రెండు వన్డేల్లో ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణాల బౌలింగ్ ప్రదర్శన చూస్తుంటే సిరాజ్ కచ్చితంగా ఇంతకంటే బాగా బౌలింగ్ చేసేవాడనే అభిప్రాయం అన్ని వైపుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పుడు టి20లకు కూడా ఎంపిక చేయకపోవడం, త్వరలోనే వరల్డ్ కప్కు కూడా దాదాపు ఇదే జట్టు ఎంపికయ్యే అవకాశం ఉండటంతో ఈ ఫార్మాట్లో సిరాజ్ను పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్థమవుతోంది. విశ్రాంతి ఇచ్చారా...వేటు వేశారా... సిరాజ్కు వన్డే, టి20 ఫార్మాట్లలో స్థానం లభించకపోవడంపై కావాల్సినంత చర్చ జరగడం లేదని అర్థమవుతోంది. సెలక్టర్లు సాధారణంగా తమ ఎంపికపై ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో చైర్మన్ అజిత్ అగార్కర్ మాట్లాడినా అసలు సిరాజ్ పేరును కూడా ప్రస్తావించనే లేదు. జట్టుకు దూరమైన షమీ గురించి కూడా మాట్లాడిన అగార్కర్... రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న ఆటగాడి గురించి సమాచారం ఇవ్వడం లేదు. బుమ్రా ఫిట్నెస్, విశ్రాంతి విషయంలో ప్రతీ సిరీస్, ప్రతీ మ్యాచ్ సందర్భంగా సెలక్టర్లు స్పష్టతనిస్తున్నారు. అదే సిరాజ్కు విశ్రాంతినిచ్చారా లేక వేటు వేశారా కూడా తెలియడం లేదు. సిరాజ్ పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఎలాంటి గాయాల సమస్యలు లేవు. తాను ఎలాంటి విశ్రాంతి కోరుకోవడం లేదు. ఏ స్థితిలోనైనా మైదానంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్లో ఐదు టెస్టులూ ఆడాడు కాబట్టి విశ్రాంతి అవసరమని భావించి ఆసియా కప్కు ఎంపిక చేయలేదని అనిపించింది. నిజానికి సిరాజ్కు విరామం ఇవ్వాలని అనుకుంటే స్వదేశంలో పేసర్లకు ప్రాధాన్యత లేని వెస్టిండీస్తో సిరీస్లో ఇవ్వాల్సింది. నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి అతను మొత్తం 49 ఓవర్లే బౌలింగ్ చేశాడు. వెంటనే దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల్లోనూ ఆడించడం అంటే ఈ ఫార్మాట్లోనే అతని అవసరాన్ని చూపించింది. కానీ ఎలాంటి కారణం లేకుండా ఇప్పుడు వన్డే, టి20ల నుంచి అతడిని పక్కన పెట్టారు. లోయర్ ఆర్డర్లో కొన్ని పరుగులు సాధించే హర్షిత్ రాణా వల్ల సిరాజ్ స్థానం సందేహంలో పడినట్లు కనిపిస్తోంది. కానీ సిరాజ్ లాంటి టాప్ బౌలర్ను బ్యాటింగ్ కారణంగా పక్కన పెట్టడంతో అర్థం లేదు. మున్ముందు సిరాజ్ విషయంలో సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. -
India Tour : పాలెం ఎయిర్ పోర్టులో పుతిన్ ల్యాండింగ్
-
నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!
మంచి ఉద్యోగం, మెరుగైన జీతం, సౌకర్యవంతమైన జీవితం, కెరీర్లో అవకాశాలు వీటికోసం కలలు కంటూ చాలామంది భారతీయులు విమానాల్లో విదేశాలకు ఎగిరిపోతున్నారు. కానీ కనిపెంచిన తల్లిదండ్రులను కన్నతల్లి లాంటి ఊరినీ, వదిలి ఉండటం అంత సులువు కాదు. దేశం కాని దేశం, మన భాషకాదు..మన తిండి కాదు, మన జాన్ జిగిరీ దోస్తులు ఆసలే లేని చోట ఉండటం చాలా వేదనతో కూడుకున్నదే. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అన్నట్టు ఒక పక్క ఒంటరితనం, మరోపక్క ఇంటి బెంగతో ఒక్కోసారి ఊపి రాడదు. ఇదీ నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) అనుభవించే మానసిక బాధ అందుకే ఒక ఎన్ఆర్ఐ ఏం చేశాడో తెలుసా?కష్టపడి ఐదేళ్ల పాటు కెనడాలో జీవితాన్ని గడిపేసిన ఎన్ఆర్ఐ ఇక నావల్ల కాదు బాబోయ్ అంటూ ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలన్న తన నిర్ణయంపై సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. అయిదేళ్లు కెనడాలో ఉన్నాను.విదేశాలలో జీవితం రోబోటిక్గా అనిపించింది. అందుకే ఇక భరించ లేను. ఇక్కడ స్నేహితులు ఉన్నప్పటికీ, కానీ సామాజిక ఒంటరితనం బాధిస్తోంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం అని పేర్కొన్న రెడ్డిట్ పోస్ట్ వైరలవుతోంది.చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడాకెనడాలో మితిమీరిన క్రమశిక్షణ భరించడం కష్టంగా ఉంది. ప్రతీదీ పద్ధతిగా సిస్టమ్యాటిగ్గా జరగాలి. కనీసం బియ్యం కొనడానికి దుకాణానికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వేచ్ఛను మిస్ అవుతున్నా అనిపిస్తోందన్నాడు. భారతదేశంలో వ్యవస్థీకృత గందరగోళం ఉంది. దానిని మిస్ అవుతున్నా. కానీ ఇండియాలో గడపబోయే జీవితంపై చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇండియాలో మురికి, కనీస పౌర జ్ఞానం లేకపోవడం లాంటి లోపాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది మన ఇల్లు. అందుకే ఇండియాకు తిగిరి వచ్చేస్తున్నానని పేర్కొన్నాడు.నెటిజన్లు అతని నిర్ణయాన్ని ప్రశంసించారు. మనసుకు నచ్చినట్టు జీవించాలి భయ్యా అని కొందరు, ప్రతి దేశానికి దాని సమస్యలు ఉంటాయి. ఏ దేశానికైనా దాని లాభనష్టాలు దానికి ఉంటాయి. ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఫైనల్గా ఎక్కడ సంతోషంగా ఉంటామో, అక్కడ ఉండటమే సరైంది అని మరికొందరు ఎంతైనా మన ఇల్లు ఇల్లే కదా భాయ్.. అనే కమెంట్లు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి : ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య -
నేడు భారత్ కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
-
రాయ్ పూర్ వన్డేలో భారత్ పై సౌతాఫ్రికా విజయం
-
IndiGo: భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గగనతల ప్రయాణాల సంక్షోభం కొనసాగుతోంది. వివిధ ఎయిర్లైన్స్ విమానాల సర్వీసులు రద్దు అవుతున్నాయి. అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇందుకు కారణమైన ఆ కొత్త రూల్స్ ఏంటో తెలుసా?.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల అవస్థలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదంటూ ఆగ్రహం వెల్లగక్కతున్నారు. రీఫండ్ విషయంలోనూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఇండిగో మీద ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, ప్రతికూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి. అయితే.. ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్డీటీఎల్) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు. ఏంటా కొత్త రూల్స్.. ?FDTL కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. వాటి ప్రకారం.. రాత్రి సమయంలో (రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు) డ్యూటీ గంటలు తగ్గించబడ్డాయి. వరుసగా ఎక్కువ గంటలు పని చేయకుండా, మధ్యలో ఎక్కువ విరామం తప్పనిసరి. కేబిన్ సిబ్బందికి ల్యాండింగ్స్ పరిమితం చేశారు. 11 గంటల డ్యూటీలో గరిష్టంగా 6 ల్యాండింగ్స్ మాత్రమే ఉండాలి. అలాగే.. 11.30 గంటల డ్యూటీలో గరిష్టంగా 5 ల్యాండింగ్స్ ఉండాలి. ఇక14 గంటల డ్యూటీలో (9 గంటల ఫ్లైయింగ్) కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేశారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో.. ఎయిర్లైన్స్ తమ షెడ్యూల్లను కొత్త నియమాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా రాత్రిపూట నడిపించే విమానాలు, అధిక ఫ్రీక్వెన్సీ రూట్లలో అంతరాయానికి దారి తీస్తోంది. ఇలాగే ఇంకొన్ని గంటలురెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. అయితే పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రూల్స్ నుంచి పశమనం కోరుతూ డీజీసీఏను ఆశ్రయించింది. ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
భారత దివాలా చట్టం భేష్
న్యూఢిల్లీ: భారత్ దివాలా పరిష్కార చట్టానికి (ఐబీసీ) ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ కితాబిచి్చంది. అధికారిక ర్యాంకింగ్ మదింపును సవరించింది. దివాలా పరిష్కార కార్యాచరణ రుణదాతలకు స్నేహపూర్వకంగా ఉండడాన్ని గుర్తించింది. భారత్లో దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) రుణ క్రమశిక్షణను బలోపేతం చేసిందని, పరిష్కార ప్రక్రియను రుణదాతలకు అనుకూలంగా మార్చిందని ఎస్అండ్పీ తన నివేదికలో పేర్కొంది. గతంలో దివాలా పరిష్కార విధానాలకు భిన్నంగా ఐబీసీ కింద సంక్షోభంలోని కంపెనీల ప్రమోటర్లు తమ వ్యాపారాలపై నియంత్రణ కోల్పోతున్నట్టు వివరించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత దివాలా పరిష్కార చట్టానికి అధికారిక ర్యాంకింగ్ మదింపును గ్రూప్–సి నుంచి గ్రూప్–బికి మారుస్తున్నట్టు ప్రకటించింది. రుణదాతలకు స్నేహపూర్వకంగా ఉన్న దివాలా పరిష్కార ప్రక్రియను బలహీనం నుంచి మధ్యస్థానికి మెరుగుపరిచిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిపింది. ఐబీసీ కింద రుణదాతల ఆధ్వర్యంలో విజయవంతమైన పరిష్కారాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది. రుణాల వసూళ్లు, రికవరీ రేటు మెరుగుపడ్డాయని.. సగటు రుణ వసూలు గత చట్టం కింద ఉన్న 15–20 శాతం నుంచి ఐబీసీ కింద 30 శాతానికి పెరిగినట్టు తెలిపింది. గతంలో ఒక్కో కేసు పరిష్కారానికి ఆరు నుంచి ఎనిమిదేళ్ల సమయం తీసుకోగా, ఐబీసీ కింద రెండేళ్లకు తగ్గినట్టు ఎస్అండ్పీ పేర్కొంది. అధికార ర్యాంకింగ్ మదింపు అన్నది.. ఒక దేశ దివాలా చట్టం కింద రుణదాతలకు ఉన్న భద్రతను సూచిస్తుంటుంది. -
358 సరిపోలేదు
విరాట్ కోహ్లి తన అసాధారణ ఫామ్ను కొనసాగిస్తూ వన్డేల్లో 53వ సెంచరీతో చెలరేగాడు. అండగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. జట్టు గత మ్యాచ్లోకంటే మరో 9 పరుగులు ఎక్కువే చేసింది. అయినా సరే, రెండో వన్డేలో భారత్కు ఓటమి తప్పలేదు. రాంచీలో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయిన సఫారీలు ఈసారి రాయ్పూర్లో పట్టు వదల్లేదు. ఏకంగా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ను సమం చేశారు. మార్క్రమ్, బ్రెవిస్, బ్రెట్కీ బ్యాటింగ్ జోరుతో పాటు బౌలర్ల వైఫల్యం, అతి పేలవ ఫీల్డింగ్తో భారత్ నుంచి మ్యాచ్ చేజారింది. రాయ్పూర్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ 1–1తో సమమైంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (93 బంతుల్లో 102; 7 ఫోర్లు, 2 సిక్స్లు) వరుసగా రెండో శతకంతో చెలరేగగా... రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 105; 12 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడి కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. కోహ్లి, రుతురాజ్ మూడో వికెట్కు 26 ఓవర్లలో 156 పరుగులు జోడించగా, చివర్లో కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు సాధించింది. మార్క్రమ్ (98 బంతుల్లో 110; 10 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ నమోదు చేయగా... మాథ్యూ బ్రీట్కే (64 బంతుల్లో 68; 5 ఫోర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (34 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే శనివారం విశాఖపట్నంలో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) జాగ్రత్తగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా... బర్గర్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (14) అదే ఓవర్లో వెనుదిరిగాడు. కొద్ది సేపటికే జైస్వాల్ కూడా అవుటయ్యాడు. అయితే కోహ్లి, రుతురాజ్ భారీ భాగస్వామ్యంతో జట్టును నడిపించారు. సిక్స్తో ఖాతా తెరిచిన కోహ్లి ఆ తర్వాత తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 66 పరుగులు చేసింది. గత మ్యాచ్లో అవకాశం వృథా చేసుకున్న రుతురాజ్ ఈసారి పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు. ఇద్దరిలో ముందుగా రుతురాజ్ 52 బంతుల్లో, ఆ తర్వాత కోహ్లి 47 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్ను అందుకున్నారు. అనంతరం మరింత జోరు పెంచిన రుతురాజ్... మహరాజ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. యాన్సెన్ బౌలింగ్లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ అతని ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. మరోవైపు బాష్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన రుతురాజ్ 77 బంతుల్లోనే తన తొలి శతకాన్ని అందుకొని సంబరాలు చేసుకున్నాడు. 50 నుంచి 100కు చేరేందుకు అతను 25 బంతులే తీసుకున్నాడు. సెంచరీ తర్వాత రుతురాజ్ అవుట్ కాగా... యాన్సెన్ ఓవర్లో సింగిల్తో కోహ్లి సెంచరీ (90 బంతుల్లో) పూర్తయింది. ఆవెంటనే కోహ్లి వెనుదిరిగాడు. సుందర్ (1) విఫలం కాగా, రాహుల్, రవీంద్ర జడేజా (24 నాటౌట్) కలిసి స్కోరును 350 పరుగులు దాటించారు. ఈ క్రమంలో రాహుల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకోగా, ఆఖరి 10 ఓవర్లలో భారత్ 76 పరుగులు రాబట్టగలిగింది. బ్రెవిస్ దూకుడు... దక్షిణాఫ్రికా టాప్–5లో డికాక్ (8) మినహా మిగతా వారంతా లక్ష్య ఛేదనలో తమవంతు పాత్ర పోషించారు. జట్టు ఇన్నింగ్స్లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన తర్వాత మార్క్రమ్, బవుమా కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన మార్క్రమ్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 88 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. అతను అవుటయ్యే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 30 ఓవర్లలో 197/3. మిగిలిన 20 ఓవర్లలో 8.10 రన్రేట్తో 162 పరుగులు అసాధ్యంగా కనిపించింది! అయితే ఇక్కడే బ్రెవిస్ ఆట స్వరూపాన్ని మార్చాడు. కుల్దీప్, హర్షిత్ బౌలింగ్లో చెరో రెండు చొప్పున మొత్తం ఐదు సిక్సర్లు బాదడంతో చేయాల్సిన రన్రేట్ ఒక్కసారిగా తగ్గిపోయింది. బ్రెవిస్, బ్రీట్కే నాలుగో వికెట్కు 64 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త కట్టడి చేయగలిగినా... కార్బిన్ బాష్ (15 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) నిలిచి మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బాష్ (బి) యాన్సెన్ 22; రోహిత్ (సి) డికాక్ (బి) బర్గర్ 14; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 102; రుతురాజ్ (సి) జోర్జి (బి) యాన్సెన్ 105; రాహుల్ (నాటౌట్) 66; సుందర్ (రనౌట్) 1; జడేజా (నాటౌట్) 24; ఎక్స్ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–40, 2–62, 3–257, 4–284, 5–289. బౌలింగ్: బర్గర్ 6.1–0–43–1, ఎన్గిడి 10–1–51–1, యాన్సెన్ 10–0–63–2, మహరాజ్ 10–0–70–0, బాష్ 8–0–79–0, మార్క్రమ్ 5.5–0–48–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రుతురాజ్ (బి) హర్షిత్ 110; డికాక్ (సి) సుందర్ (బి) అర్‡్షదీప్ 8; బవుమా (సి) హర్షిత్ (బి) ప్రసిధ్ 46; బ్రీట్కే (ఎల్బీ) (బి) ప్రసిధ్ 68; బ్రెవిస్ (సి) జైస్వాల్ (బి) కుల్దీప్ 54; జోర్జి (రిటైర్డ్హర్ట్) 17; యాన్సెన్ (సి) రుతురాజ్ (బి) అర్‡్షదీప్ 2; బాష్ (నాటౌట్) 29; మహరాజ్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 18; మొత్తం (49.2 ఓవర్లలో 6 వికెట్లకు) 362. వికెట్ల పతనం: 1–26, 2–127, 3–197, 4–289, 5–317, 6–322. బౌలింగ్: అర్ష్ దీప్ 10–0–54–2, హర్షిత్ 10–0–70–1, ప్రసిధ్ 8.2–0–85–2, సుందర్ 4–0–28–0, జడేజా 7–0–41–, కుల్దీప్ 10–0–78–1. 11 కోహ్లి వరుసగా రెండు వన్డేల్లో సెంచరీలు సాధించడం ఇది 11వ సారి.34 కోహ్లి తన వన్డే కెరీర్లో 34 వేర్వేరు వేదికల్లో సెంచరీ సాధించాడు. సచిన్ కూడా 34 వేదికల్లో శతకాలు బాదాడు.44 ఒకే వన్డే ఇన్నింగ్స్లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది 44వ సారి.3 దక్షిణాఫ్రికాపై మూడుసార్లు వన్డేల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయగా.. మూడుసార్లూ భారత్ ఓడిపోవడం గమనార్హం. 1991 నవంబర్ 14న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్... 2001 అక్టోబర్ 5న జొహనెస్బర్గ్లో జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సెంచరీలు చేశారు. ఈ రెండింటిలోనూ భారత్ ఓటమి పాలైంది.2 రుతురాజ్ గైక్వాడ్ టి20 (2023 నవంబర్ 28న ఆ్రస్టేలియాపై గువాహటిలో 123 నాటౌట్), వన్డే (2025 డిసెంబర్ 3న రాయ్పూర్లో దక్షిణాఫ్రికాపై 105) ఫార్మాట్లలో తన తొలి సెంచరీ చేసిన రెండు సందర్భాల్లోనూ భారత్ ఓడిపోయింది.2 వన్డేల్లో భారత్పై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. 2019లో మొహాలీలో జరిగిన వన్డేలోనూ ఆ్రస్టేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. -
అస్థిర ప్రపంచంలో సుస్థిర బంధం
ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సు నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ రాక ఒక పాత సంగతిని గుర్తుకు తెస్తోంది. దాదాపు ఐదు న్నర దశాబ్దాల క్రితం భారతదేశంతో ‘స్నేహ ఒడంబడిక’ కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో చేతులు కలిపేందుకు అప్పటి సోవియట్ యూనియన్ నాయకులు ఇలాగే ఢిల్లీ వచ్చారు. తూర్పు పాకిస్తాన్లో మారణ హోమాన్ని అంత మొందించే ప్రత్యక్ష ప్రమేయానికి ముందు అది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచం రెండు అగ్ర రాజ్యాల మధ్యన చీలిపోయింది. కానీ, ఇపుడు అంతర్జాతీయ వ్యవస్థ ఏ దిశగా సాగుతోందో తెలియని ఒక కొత్త స్థితిలోకి జారు కుంది. అమెరికా శక్తిమంతమైనదిగానే కొనసాగుతోంది కానీ, దాన్ని అంతగా నమ్మడానికి లేదనే అభిప్రాయం పాదుకుంది. చైనా శిఖరా రోహణ ఇతర ప్రవర్ధమాన దేశాలలో ఆందోళనను పెంచుతోంది. ఐరోపా మరింత స్వయం ప్రతిపత్తిని చాటుకునేందుకు తారట్లాడు తోంది. గాలివాటుగా ఉన్న భారత–రష్యాలు అవసరార్థమే అయిన ప్పటికీ, వ్యూహాత్మక పొందికను పునరుద్ధరించుకుంటున్నాయి. ఒకరికొకరు నిలబడి...అమెరికా నిలకడలేనితనంతో దానిపై చాలా దేశాలకు నమ్మకం కొరవడింది. దానికి తోడు అది ఎక్కడెక్కడో సుదీర్ఘ కాలం యుద్ధా లను కొనసాగించి, చివరకు అక్కడ పరిస్థితులు కుదుటపడక పోయినా నిష్క్రమిస్తూ వచ్చింది. అమెరికా లోపల కూడా పరి స్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. తాజాగా, సుంకాల విష యంలో అది అనుసరిస్తున్న తలతిక్క ధోరణి అందుకు ఉదాహరణ. ఇదంతా ప్రపంచంలో ఒక అస్థిర వాతావర ణానికి దారితీసింది. చైనా తన వంతు ఆకర్షణలను, భయాలను రెండింటినీ సృష్టించు కుంది. క్రమేపీ అది దృఢ వైఖరిని చాటడం పెరగడంతో, దాని ప్రత్య ర్థులు, మిత్రులు కూడా దానిపై చిరకాల అభిప్రాయాలను పునరా లోచించుకోవడం ప్రారంభించాయి. ఉక్రెయిన్పై యుద్ధం మొదలెట్టిన తర్వాత, చైనాతో రష్యా వ్యూహాత్మక ఏకీకరణ బలపడిందికానీ, సంబంధాలు అసమంగానే ఉన్నాయి. మాస్కో వ్యూహాత్మక ఆలోచనల ప్రకారం, దీర్ఘకాలంలో తనకు బెడదగా పరిణమించగల శక్తి అమెరికా కన్నా చైనాకే ఉంది. మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని కనబరచేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు, సైబీరియాకు సంబంధించి రష్యా పడుతున్న ఆందోళన, చైనాకు తాను జూనియర్ భాగస్వామిగా మారవలసి వస్తుందే మోననే భయం క్రెమ్లిన్ను మరోసారి భారతదేశానికి సన్నిహితం చేస్తున్నాయి. అయితే, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నిలుస్తుందని కాదు. చైనాపై తాను ఎక్కువ ఆధారపడకుండా భారత్ తనకొక రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని రష్యా ఆలోచన. స్నేహమే కాదు, వ్యూహాత్మకం కూడా!సోవియట్ యూనియన్ చీలికలు పీలికలైన తర్వాత కూడా భారత్తో రష్యా స్నేహ సంబంధాలు నిలదొక్కుకుంటూ వచ్చాయి. కశ్మీర్పై భారత్ ఇరకాటంలో పడకుండా ఐరాసలో రష్యా తన వీటో గొడుగు పడుతోంది. దానికి తగ్గట్లుగానే, ఉక్రెయిన్పై యుద్ధం పర్యవసానంగా రష్యాపై ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు పదేపదే కోరినా భారత్ తలొగ్గలేదు. ఈ విషయమై అమెరికా విధిస్తానన్న సుంకాల బెదిరింపును కూడా భారత్ ఖాతరు చేయలేదు. దీనికి రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకంతో కూడిన స్నేహ సంబంధం ఒక్కటే కారణం కాదు. ఈ బంధాన్ని నిలబెట్టుకునేందుకు రెండు దేశాలకు తమవైన వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి.దానికి తోడు, కొన్నేళ్ళుగా ఎన్నడూ చూడనంత అస్థిర పరిస్థి తులు ప్రపంచంలో తాండవిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ ఒక్క దేశమూ పరిస్థితులను శాసించగలిగిన స్థితిలో లేదు. అగ్ర రాజ్యంగా నిలవాలని కలలు కంటున్న దేశపు అడుగులకు మడుగు లొత్తడానికి ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో చాలా మధ్య స్థాయి దేశాలు సిద్ధంగా లేవు. తమ వ్యూహాత్మక స్వయం ప్రతి పత్తిని కాపాడుకోవాలని గాఢంగా కోరుకుంటున్న భారత – రష్యాలకు ఆ సెంటిమెంట్లో ఒక ఉమ్మడి ప్రయోజనం కనిపిస్తోంది. పరస్పర రక్షణభారత్–రష్యాల మధ్య స్నేహ సంబంధాలకు రక్షణ అంశమే ఇప్పటికీ వెన్నెముకగా ఉంది. లాజిస్టిక్స్ విషయంలో పరస్పర సహ కారానికి సంబంధించిన ఒప్పందం కుదరబోతోంది. అది కార్య రూపం ధరిస్తే ఇరు దేశాలు సైనిక స్థావరాలను, రేవులను, వైమానిక క్షేత్రాలను పరస్పరం వినియోగించుకోవచ్చు. దీంతో ఇండో–పసిఫిక్ నుంచి ఆర్కిటిక్ వరకు కార్యకలాపాలు నిర్వహించగలిగినదిగా భారత్ తయారవుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రష్యా భౌతికంగా కాలు మోపేందుకు వీలు చిక్కుతుంది. ప్రపంచంలో సగం వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ ప్రాంతమే జీవనాడి. భారత–రష్యా అధికారులు అత్యంత ఆశావహమైన సైనిక– సాంకేతిక ప్యాకేజీకి రూపుదిద్దుతున్నారు. దీనివల్ల ఎస్–400 గగన రక్షణ వ్యవస్థలను మరిన్ని చోట్ల ఏర్పాట్లు చేయవచ్చు. సు–30 ఎంకెఐ యుద్ధ విమానాలను భారత్ చాలా ఎక్కువగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మరింత దూరం వెళ్ళగలిగినవిగా బ్రహ్మోస్ క్షిపణు లను ఉన్నతీకరించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. సు–57ఇ స్టెల్త్ యుద్ధ విమాన టెక్నాలజీ బదిలీకి సంబంధించి తాత్కాలిక చర్చలైనా మొదలయ్యేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇక భారత్–రష్యా స్నేహంలో అణు సహకారం మరో అంశం. బృహత్తర వీవీఈఆర్–1200 రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలతో రోసాటమ్, భారత అణు శక్తి సంస్థలు ముందుకు ఉరకాలని చూస్తున్నాయి. అలాగే, కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ల అన్వేషణ రెండు దేశాల మధ్య సంబంధాలను గుణాత్మకంగా మార్చివేయవచ్చు. వీటి అంత ర్జాతీయ సరఫరాలో చైనాదే పైచేయిగా ఉంది. ఖనిజాలు సుసంపన్నంగా ఉన్న రష్యా తూర్పు దూర ప్రాంతాలలో సంయుక్త రంగంలో పనులు సాగించాలని భారత్ ఎదురు చూస్తోంది. భారత వైజ్ఞానిక సంస్థలు, రష్యా పరిశోధన కేంద్రాల మధ్య భాగస్వామ్యాలు ఏర్పడితే దేశీయంగా రేర్–ఎర్త్ ప్రాసెసింగ్కు, పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీకి రంగం సిద్ధమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, అత్యున్నత ఎలక్ట్రానిక్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల వాల్యూ చైన్ను నియంత్రించగల పరిశ్రమలు రెండు దేశాలకు సొంతమవుతాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం సుమారు 65–66 బిలియన్ డాలర్లుంది. 2030 నాటికి దీన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో ఉన్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో వ్యక్తమయ్యేది కేవలం పొత్తు కాదు. స్నేహ సంబంధాలు ఏవీ దెబ్బతిని లేవు కనుక ఇండో–సోవియట్ మైత్రి పునరుద్ధరణ అనడానికి కూడా లేదు. ఇది మరింత ఆచితూచి వేస్తున్న అడుగు కాబోతోంది. మరింత ఆచరణాత్మక దృక్పథం కన పడబోతోంది. అధికార కేంద్రాలు మసకబారి, సమీకరణాలు అను క్షణం మారిపోతున్న వర్తమాన ప్రపంచంలో అంతకన్నా ఇంకేం కావాలి!జయంత రాయ్ చౌధురీవ్యాసకర్త పీటీఐ వార్తా సంస్థ తూర్పు ప్రాంత మాజీ అధిపతి -
పుతిన్ పర్యటనపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు భారత్ రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్- రష్యా 23వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ఎంపీ శశి థరూర్ భారత్ - రష్యా మధ్య మైత్రి ఎంతో ముఖ్యమైనదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్యా సోవియట్ యూనియన్ గా ఉన్న సమయం నుంచే రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఆకాలం నుంచే రెండు దేశాలు పరస్పర సహకారాలు అందించుకుంటూ వస్తున్నాయి. కాగా రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈ పర్యటనపై మాట్లాడారు."రష్యా అధ్యక్షుడి పర్యటన చాలా ముఖ్యమైనది. ఈ స్నేహం చాలా పాతది, బలమైనది, అదే విధంగా అమెరికా, చైనాలతోనూ ద్వైపాక్షిక బంధాల్ని కొనసాగించాలి. భారత ఆర్థిక వ్యవస్థను వేరే ఏ దేశం కోసం తనఖా పెట్టకూడదు" అని శశి థరూర్ అన్నారు. ఈ మూడు దేశాలతో భారత్ వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కొనసాగించాలని తెలిపారు.రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఈయూతో పాటు అమెరికా పలు ఆంక్షలు విధించి ఏకాకిని చేసే యత్నం చేశాయి. భారత్ సైతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే వీటిని భారత్ లెక్కచేయకుండా మాస్కోతో మైత్రిని కొనసాగించింది. తన చిరకాల మిత్రునికి అండగా నిలిచింది. రష్యా నుంచి భారత్ రక్షణ రంగ సామాగ్రి , పెట్రోలియం, ఎరువులు పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా జౌషదాలు, ఇతర రసాయనాలు, యంత్రాలు మాస్కోకు ఎగుమతి చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చివరిసారిగా 2021లో ఇండియాలో పర్యటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. -
2028లో భారతీయ అంతరిక్ష స్టేషన్
2028 సంవత్సరం నాటికి స్పేస్ లో "భారతీయ అంతరిక్ష స్టేషన్" ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతోనే దీని నిర్మాణం చేపడుతున్నామని పార్లమెంటులో బుధవారం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి తొలి మాడ్యూల్ ప్రక్రియ సజావుగా సాగుతుందని పేర్కొన్నారు.భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన కీలమైన డిజైన్ మైల్ స్టోన్ ను ఇస్రో పూర్తిచేసిందన్నారు. దీని నిర్మాణం పూర్తయితే భారత వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం, సాంకేతిక ప్రయోగాలు, పరిశోధనలు చాలా సులభతరమైతాయని వారు పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్ 1న భారతీయ అంతరిక్ష స్టేషన్ మెుదటి మాడ్యుల్ నిర్మాణానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనికి రూ.20,193 కోట్ల నిధులు కేటాయించగా 2028 వరకూ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2035 నాటికి ఇది పూర్తిస్థాయిలో సేవలు అందించే అవకాశం ఉంది. భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు పూర్తయితే అమెరికా, రష్యా, చైనా దేశాల తర్వాత స్పేస్ లో స్వంత అంతరిక్ష స్టేషన్ కలిగిన నాలుగవ దేశంగా భారత్ రికార్టు సృష్టిస్తుంది. -
‘సుప్రీం’ ఆదేశం.. బంగ్లాదేశ్ గర్భిణికి ఉపశమనం
న్యూఢిల్లీ: భారత్ నుంచి బహిష్కృతురాలై బంగ్లాదేశ్కు చేరిన గర్భిణీ సోనాలి ఖాటూన్, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడికి సుప్రీంకోర్టు ఉత్తర్వుతో ఊరట లభించింది. న్యాయస్థానం ‘మానవతా దృక్పథం'తో తీసుకున్న ఈ నిర్ణయం.. చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న ఒక నిస్సహాయ కుటుంబానికి స్వాంతన కల్పించింది. సోనాలి ఖాటూన్ బంగ్లాదేశీయురాలైనప్పటికీ, ఆమె పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్లో నివసిస్తున్నారనే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.మానవతా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, వారిద్దరినీ తిరిగి తీసుకువస్తామని, వారిని నిఘాలో ఉంచి, ఉచిత వైద్య సహాయం అందిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ప్రత్యేక దృష్టితో విచారించింది. ఒక గర్భిణీ పరిస్థితిని, ఆమె కుమారుడిని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రులు/తల్లి బిడ్డలను వేరు చేయకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కోర్టు నొక్కి చెప్పింది. ఈ ఉత్తర్వుతో సోనాలికి అవసరమైన వైద్య సంరక్షణతో పాటు ఆమె కుమారుడికి రోజువారీ సంరక్షణ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.ఈ న్యాయపోరాటం సోనాలి తండ్రి భోడు సేఖ్తో ప్రారంభమైంది. తన కుమార్తె, అల్లుడు, మనవడిని మే 2025లో గుర్తింపు ధృవీకరణ డ్రైవ్ పేరుతో అక్రమంగా నిర్బంధించి, జూన్లో బంగ్లాదేశ్కు పంపించారని ఆయన ఆరోపించారు. తాను, తన కుటుంబ సభ్యులు పుట్టుకతో భారత పౌరులమని ఆయన వాదించారు. సెప్టెంబర్లో కలకత్తా హైకోర్టు వీరిని తిరిగి తీసుకురావాలని ఆదేశించినా, పౌరసత్వ ధ్రువపత్రాలు లేవనే కారణంతో ఆ తీర్పును సవాలు చేస్తూ, కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరసత్వ రుజువులు చూపడంలో విఫలమైనప్పటికీ, తల్లి, బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. చట్టపరమైన నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, అత్యవసర సందర్భాల్లో మానవతా దృక్పథంపైచేయి సాధిస్తుందని ఈ కేసు నిరూపించింది.ఇది కూడా చదవండి: ‘20 ఏళ్లుగా చావులే లేవు’..‘సర్’ డేటాలో భారీ గోల్మాల్! -
ఇమ్రాన్ ఖాన్కు జైల్లో ప్రత్యక్ష నరకం!
పొరుగు దేశం భారత్తో ఇమ్రాన్ ఖాన్ ఏనాడూ కయ్యానికి కాలు దువ్వలేదని.. పైగా సంబంధాలను మెరుగుపర్చుకునేందుకే అడుగులు వేశాడని ఆయన సోదరి అలీమా ఖాన్ అంటున్నారు. పాక్ మాజీ ప్రధాని భద్రతపై పుకార్లు షికార్లు చేయడంతో.. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఆయన కుటుంబ సభ్యుల్ని ములాఖత్కు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఖాన్ సోదరి అలీమా ఖాన్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ... సంచలన వ్యాఖ్యలు చేశారు.అసిమ్ మునీర్ పాక్తో యుద్ధం జరగాలని ఆశించారు. కానీ, ఇమ్రాన్ ఖాన్ మాత్రం దోస్తీ కోసం తీవ్రంగా ప్రయత్నించారని ఆమె అన్నారు. ఈ క్రమంలో మునీర్పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ ఇమ్రాన్ ఖాన్ స్వేచ్ఛగా ఆలోచించేవాడు. అందుకే అధికారంలోకి రాగానే భారత్తో, అక్కడి అధికార పార్టీ బీజేపీకి స్నేహ హస్తం అందించే ప్రయత్నం చేశాడు. కానీ, మునీర్ రాడికలైజ్డ్ ఇస్లామిస్ట్. అందుకే భారత్తో కయ్యానికి కాలు దువ్వాడు. అతని ఆ ప్రయత్నంలో భారత్ మిత్రదేశాలు కూడా ఇబ్బంది పడ్డాయి’’ అని అన్నారామె. ఇమ్రాన్ ఖాన్ను పాక్ జాతి సంపదగా అభివర్ణించిన అలీమా.. చెర నుంచి విడిపించేందుకు పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు.ఒంటరిగా చిన్న సెల్లో బంధించారు. ఎవరితో మాట్లాడనివ్వడం లేదు. బయటకు కూడా రానివ్వడం లేదు. సరైన తిండి పెట్టడం లేదు. మందులూ అందించడం లేదు. మానసికంగా ఆయన కుంగిపోయి ఉన్నారు. జైల్లో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితికి అసిం మునీర్ కారణం. పాక్ ప్రభుత్వానికి ఇమ్రాన్ఖాన్ అంటే భయం పట్టుకుంది. ఎందుకంటే ఆయనకు పాక్ ప్రజల మద్దతు ఉంది కాబట్టి. ఇలాంటి చర్యల ద్వారా ఆయన్ని ప్రజలు మరిచిపోయేలా చేయాలనుకుంటున్నారు. కానీ, ఎంత అణిచివేస్తే అంత పెద్ద ఉద్యమం పుడుతుంది అని అలీమా సదరు మీడియా సంస్థతో అన్నారు.మునీర్తో చెడింది అక్కడే..2019లో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ విషయంలో ఆనాడు ఐఎస్ఐ డైరెకటర జనరల్గా ఉన్న మునీర్.. అతిగా ఆసక్తి చూపించారు. ఇది నచ్చని ఇమ్రాన్ఖాన్.. మునీర్ను పదవీ నుంచి తొలగించాడు. ఇది సాధారణంగానే ఇమ్రాన్ ఖాన్పై పగను పెంచుకునేలా చేసింది.పలుకేసుల్లో శిక్ష పడడంతో ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి రావల్పిండి అడియా జైల్లో ఉంటున్నారు. అయితే.. నెల రోజుల నుంచి ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. చివరి సందేశంలో ఆయన మునీర్పైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలను ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఆయన జైల్లోనే మరణించారని.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని.. అనారోగ్యం బారిన పడ్డారని.. ఇలా రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈలోపు..షెహబాజ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో.. మంగళవారం ఇమ్రాన్ ఖాన్ మరో సోదరి ఉజ్మా ఖానుమ్ 20 నిమిషాలపాటు ఇమ్రాన్ ఖాన్తో ములాఖత్ అయ్యారు. జైల్లో ఆయన మానసికంగా నరకం అనుభవిస్తున్నారని అన్నారామె. ఇది పీటీఐ వర్గాలకు తీవ్రాగ్రహం తెప్పించింది.ఇండియా-పాక్ ఉద్రిక్తతలుఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన.. జమ్ము కశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసింది భారత సైన్యం. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మెరుపు దాడులు నిర్వహించి ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నేలమట్టం చేసింది.Aleema Khanum, sister of Imran Khan, claims that her brother represents 90% of the people of Pakistan so by isolating him they are suppressing the people of Pakistan.Watch the full interview with @SkyYaldaHakim ⬇️https://t.co/YOYuCbPbZj📺 Sky 501, Virgin 602 and YouTube pic.twitter.com/oOacMmtHKP— Sky News (@SkyNews) December 2, 2025 -
సిరీస్ పై భారత్ గురి
-
రాకెట్ స్లెడ్ పరీక్ష దిగ్విజయం
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. యుద్ధ విమానాల ఎస్కేప్ వ్యవస్థ తాలూకు రాకెట్ స్లెడ్ పరీక్షను దిగ్విజయంగా జరిపింది. ఈ ఘనత సాధించిన అతి కొద్ది దేశాల సరసన సగర్వంగా నిలిచింది. అత్యంత అపరిమిత వేగంతో కూడిన ఈ పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీఓ) మంగళవారం విజయవంతంగా జరిపింది. ఎయిర్ క్రూ రికవరీతో పాటు పలు కీలక భద్రతా పరిమితులను విజయవంతంగా సాధించింది. ‘చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లాబోరేటరీ లో ఉన్న రైలు ట్రాక్ రాకెట్ స్లెడ్ వేదికగా గంటకు ఏకంగా 800 కి.మీ. నియంత్రిత వేగంతో ఈ పరీక్షను నిర్వహించారు.కనోపీ సెవెరెన్స్ ఎజెక్షన్ సీక్వెన్సింగ్ తో పాటు పూర్తిస్థాయిలో ఎయిర్ క్రూ రికవరీ వంటి అన్ని లక్ష్యాలనూ ఈ పరీక్ష సాధించింది‘ అని రక్షణ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తద్వారా ఈ ఘనత సాధించిన అరుదైన దేశాల క్లబ్లో భారత్ సగర్వంగా నిలిచిందని తెలిపింది. డీఆర్ డీఓతో పాటు వాయు సేన, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందూస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ లను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. మన దేశీయ రక్షణ సామర్థ్యాల పెంపులో స్వావలంబన దిశగా కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాల్లో దీనిని ఒక మైలురాయిగా ఆయన అభివరి్ణంచారు. ఏమిటీ స్లెడ్ టెస్టు? విమానం గాల్లో అత్యధిక వేగంతో ఎగిరేటప్పటి పరిస్థితులను రాకెట్ స్లెడ్ పద్ధతిలో నేల మీదే కృత్రిమంగా సృష్టిస్తారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రెండు పట్టాలపై రాకెట్ ప్రొపల్షన్ వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. -
వచ్చే ఏడాది నుంచి జనగణన షురూ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ మొదలు వృద్ధాప్య పెన్షన్ల దాకా పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులను గణించడంతోపాటు దేశ జనాభా సరళిని తెలియజెప్పే అత్యంత కీలకమైన జనగణన క్రతువు ఎట్టకేలకు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఆరంభంకానుంది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విషయాన్ని లోక్సభలో వెల్లడించారు. రెండు విడతల్లో జనగణనను పూర్తిచేస్తారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్దాకా తొలి విడత పూర్తిచేసి 2027 ఫిబ్రవరిలో మలివిడతతో ముగిస్తారు. తొలి విడతలో దేశంలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయి, నివాస ప్రాంతాల్లో పక్కా గృహాలు ఎన్ని, ఎన్ని అంతస్తుల్లో భవనాలు నిర్మించారు? పూరి గుడిసెలు ఎన్ని? కాంక్రీట్ నిర్మాణాలు ఎన్ని? ఏఏ రకం ముడి పదార్థాలతో ఏ తరహా ఇల్లు నిర్మించారు? ఇలా ఇళ్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. రెండో విడతలో ఆయా ఇళ్లలో ఉంటున్న కుటుంబాలెన్ని? కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు? వారి పేరు, వయసు వంటి వివరాలు సేకరిస్తారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి 30 రోజులకు ఒక కాలావధిగా తీసుకుని లెక్కిస్తారు. 2027 మార్చి ఒకటోతేదీని రిఫరెన్స్ తేదీగా లెక్కలోకి తీసుకుంటూ 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు మొదలెడతారు. మంచు, అతి చలి, అననుకూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్లలో అనువైన సమయాల్లోనే జనగణన చేపట్ట నున్నారు. ఇక్కడ 2026 అక్టోబర్ ఒకటోతేదీని రెఫరెన్స్ తేదీగా తీసుకోనున్నారు. కేంద్రప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు అందించే సలహాలు, సూచనలతోపాటు పాత డేటాను లెక్కలోకి తీసుకుని జనగణన ప్రశ్నావళిని ఖరారుచేశామని మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న కేంద్ర కేబినెట్ కమిటీలో నిర్ణయించిన మేరకు ఈసారి కులగణన సైతం చేపట్టనున్నారు. స్వీయ జనగణనతోపాటు మొబైల్ యాప్ల సాయంతో ఈసారి డిజిటల్ రూపంలో జనగణన–2027 కొనసాగనుంది. -
సిరీస్ విజయంపై భారత్ గురి
రాయ్పూర్: వన్డే క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికాపై గత మ్యాచ్లో పైచేయి సాధించిన భారత్ ఇప్పుడు మరో విజయంపై గురి పెట్టింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు జరిగే రెండో వన్డేలో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, దక్షిణాఫ్రికా కోలుకోవాలని భావిస్తోంది. గత మ్యాచ్లో 349 పరుగులు చేసిన తర్వాత కూడా కేవలం 17 పరుగుల తేడాతో భారత్ గెలవడం ఇరు జట్ల మధ్య బలమైన పోటీని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయం. మార్పుల్లేకుండా... భారత్ ఆడిన గత వరుస రెండు వన్డేల్లో ఒక మ్యాచ్లో (ఆ్రస్టేలియాతో) రోహిత్ శర్మ, మరో మ్యాచ్లో విరాట్ కోహ్లి సెంచరీలు సాధించి తమ విలువేంటో చూపించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి ప్రదర్శనపై చర్చ అనవసరం. భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఇలాంటి స్థితిలో జట్టు సిరీస్ సాధించడంపైనే పూర్తిగా దృష్టి పెట్టింది. తొలి మ్యాచ్లో మన జట్టు ఆటను చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రిషభ్ పంత్ మరోసారి పెవిలియన్కే పరిమితం కావచ్చు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ తమ సత్తాను ప్రదర్శించే ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉంది. రాంచీ వన్డే ప్రదర్శన తర్వాత పేసర్ హర్షిత్ రాణాపై విమర్శలు తగ్గాయి. బరిలోకి బవుమా... తొలి వన్డేతో పోలిస్తే దక్షిణాఫ్రికా జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. గత మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ తెంబా బవుమాతో పాటు స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా బరిలోకి దిగుతున్నాడు. రికెల్టన్, సుబ్రాయెన్ స్థానాల్లో వీరు ఆడతారు. రాంచీలో ఓడినా దక్షిణాఫ్రికా చివరి వరకు పట్టుదలను ప్రదర్శించింది. అంచనాలకు తగినట్లు బ్రీట్కీ, బ్రెవిస్ రాణించగా, మార్క్రమ్ వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. ఆల్రౌండర్లు యాన్సెన్, కార్బిన్ బాష్ బ్యాటింగ్ జట్టుకుఅదనపు బలంగా మారింది. -
‘ప్రత్యేక’ విద్య అందించాలి!
వైకల్యం అనేది శరీరానికి సంబంధించిన ఒక పరిమితి మాత్రమే, మనసుకు కాదు. ఈ మహత్తరమైన సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ‘అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. శారీ రక, మానసిక, దృశ్య, శ్రవణాల్లో ఏ వైకల్యం ఉన్నవారికైనా మిగతా వారితో పాటు సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవ ప్రదమైన జీవితం ఉండాలని గుర్తు చేసే రోజు ఇది. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా... క్రీడా రంగంలో వికలాంగులు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్యారా అథ్లెటిక్స్ వారి ధైర్యానికీ, పట్టుదలకూ, నిశ్చయానికీ ప్రతీక. మన దేశం ప్యారా అథ్లెట్ల వల్ల ప్రపంచ వేదికపై వెలుగొందు తోంది. భారతదేశానికి తొలి ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించిన మురళీకాంత్ పేట్కర్ 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యం పాలయ్యారు. దీంతో వీల్ చైర్పై కొత్త జీవితం ప్రారంభించారు. 1972లో పశ్చిమ జర్మనీ లోని హీడెల్బర్గ్లో జరిగిన ప్యారాలింపిక్ క్రీడల్లో చరిత్ర సృష్టించారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో 37.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డుతో పాటు భారతదేశానికి మొట్ట మొదటి వ్యక్తిగత ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించారు. క్రీడ లకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2018లో ‘పద్మశ్రీ’, 50 ఏళ్లకు పైగా నిరీక్షణ తర్వాత 2024 సంవ త్సరానికిగానూ ‘అర్జున’ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆయన అసాధారణ జీవిత కథ ఆధారంగా హిందీ చిత్రం ‘చందు ఛాంపి యన్’ 2024లో విడుదలైంది. భారతదేశం ఇప్పటివరకు ప్యారాలింపిక్స్లో 60 పతకాలను గెలుచుకుంది. దేవేంద్ర ఝాఝరియా తన బాల్యంలోనే ప్రమాదవ శాత్తు తన ఎడమ చేతిని కోల్పోయాడు. ప్యారా అథ్లెటిక్స్ విభాగంలో ఏథెన్స్ (2004), రియో డీజెనీరో (2016)లో జావలిన్త్రోలో స్వర్ణాలు గెలిచాడు. అవనీ లేఖరా 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీవ్ర కారు ప్రమాదం కారణంగా రెండు కాళ్లు దాదాపు పనిచేయడం మానుకున్నాయి. ప్యారాప్లీజియా వ్యాధిని ఎదుర్కొంది. ఈ స్థితిలో షూటింగ్లో కెరీర్ ప్రారంభించి ప్రపంచ స్థాయికి ఎదిగింది. ప్యారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది. మారియప్పన్ తంగవేలు భారతీయ పారా హైజంపర్, వరుసగా మూడు ప్యారాలింపిక్స్లో పతకాలు గెలుచు కున్న మొదటి భారతీయుడు.పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించిన శీత్లా దేవి కాళ్లతో, నోటితో విల్లును, బాణాన్ని పట్టుకుని వదలడంలో శిక్షణ పొంది. 2024 ప్యారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. 2023లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘అర్జున’ అవార్డు అందుకుంది. ప్రపంచ దేశాల్లో అనేకం ఇటువంటి విజయగాథలు కనిపిస్తాయి. మనదేశంలో అందరికీ చదువుకునే హక్కు ఉంది కానీ అంగ వైకల్యం ఉన్నవారికి అది ఇంకా దూరంగానే ఉండిపోయింది. అంగ వైకల్య విద్యార్థుల కోసం ప్రత్యేక శారీరక విద్య అందించాలని చట్టం ఉన్నా అది సరిగా అమలుకు నోచుకోవడం లేదు. భారత దేశంలో సుమారు 78 లక్షల అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఉన్నారు. వారిలో 70% విద్యార్థులు ప్రత్యేక శారీరక విద్య పొందడం లేదు. పాఠశాలల్లో వీరికి బోధించగల అర్హతలు ఉన్న టీచర్లు 15 శాతమే. అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఆటల ద్వారా ఎదగాలి, గెలవాలి, ప్రపంచాన్ని మార్చాలి. ప్రత్యేక శారీరక విద్య అంటే ఒక కార్యక్రమం కాదు, వారి భవిష్యత్తుకు తలుపులు తెరచే బంగారు తాళం చెవి. – జక్కుల వెంకటేశ్ యాదవ్ ‘ విద్యార్థి నాయకుడు(రేపు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం) -
ఇండియా సాయం కోరిన పాక్.. భారత్ గ్రీన్సిగ్నల్
ఢిల్లీ: శ్రీలంకకు సాయం చేసే విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మీడియా తప్పుడు ప్రచారాన్ని భారత్ ఖండించింది. దిత్వా తుపాను కారణంగా దెబ్బతిన్న శ్రీలంకకు సాయం చేసేందుకు గగనతల అనుమతి కోరినప్పటికీ.. భారత్ అనుమతించలేదని పాక్ మీడియా ఫేక్ ప్రచారం చేసింది. అయితే, ఇది అసత్య ప్రచారమని భారత్ క్లారిటీ ఇచ్చింది.వివరాల ప్రకారం.. దిత్వా తుపాను నేపథ్యంలో శ్రీలంకకు సాయం చేయడానికి పాక్.. భారత గగనతలం నుంచి ప్రయాణించేందుకు సాయం కోరింది. సోమవారం భారత్ను సంప్రదించింది. అనంతరం, తమకు భారత్ అనుమతి ఇవ్వలేదని పాక్ మీడియా తప్పుడు ప్రచారం అందుకుంది. ఈ నేపథ్యంలో పాక్ మీడియా ప్రచారాన్ని భారత్ ఖండించింది. ఈ సందర్బంగా భారత్.. మన గగనతలంలో ప్రయాణించేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పాక్ సంప్రదించిందని, సాయంత్రం 5.30 గంటలకు భారత్ అనుమతి ఇచ్చిందని, అధికారిక ఛానల్ ద్వారా ఈ సమాచారం చేరవేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మానవతా దృక్పథంతోనే అనుమతులు ఇచ్చినట్లు భారత్ స్పష్టం చేసింది. ఇది అసత్య ప్రచారమని భారత అధికారులు పేర్కొన్నారు. ఇది తప్పుదారి పట్టించే వార్తలు అని తెలిపారు.ఇదే సమయంలో గగనతల సంబంధిత నిర్ణయాలకు సంబంధించి భారత్ ప్రామాణిక కార్యచరణ, సాంకేతిక, భద్రతా అంచనాలను పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో అనుమతుల నిరాకరణ ఉండదని అధికారులు పేర్కొన్నారు. పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించేందుకు వీలు లేనప్పటికీ పూర్తి మానవతా కోణంలో ఆలోచించి అనుమతులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పాక్ మీడియా నివేదికలు పూర్తిగా తప్పుఅని, బాధ్యత రాహిత్యమైనవని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా.. దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే, వరద నీటిలో పలువురు గల్లంతయ్యారు. ఇటీవలి కాలంలో శ్రీలంకలో ఇంతటి పెను ముప్పు రాలేదని అధికారులు చెబుతున్నారు. దిత్వా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆగని పసిడి పరుగు.. ఒకే రోజు రూ.3 వేలు పెరుగుదల
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి ధర సోమవారం 10 గ్రాములకు రూ.3,040 పెరిగి రూ.1,33,200కు చేరింది. ఇటీవలే నమోదైన జీవితకాల గరిష్ట ధర రూ.1,34,800కు చేరువైంది. మరో రూ.600కు పైగా పెరిగితే పసిడి ధరల్లో కొత్త రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడంతో డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు, ఇది ధరలకు మద్దతునిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర సైతం వరుసగా ఐదో రోజు ర్యాలీ చేసింది. కిలోకి రూ.5,800 పెరిగి రూ.1,77,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 42 డాలర్లు ఎగసి (ఒక శాతం) 4,262.52 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర (స్పాట్ మార్కెట్) ఔన్స్కి 3 శాతానికిపైగా ర్యాలీ చేసి 59 డాలర్లకు చేరింది. గత వారం రోజుల్లోనే వెండి ధర 16.7 శాతం పెరగడం గమనార్హం. అంతేకాదు 2025లో వెండి ధర రెట్టింపైంది. 2024 డిసెంబర్ 31న ఔన్స్ ధర 28.97 డాలర్ల వద్ద ఉంది. ‘‘యూఎస్ డాలర్ బలహీనపడడం, యూఎస్ ఫెడ్ వచ్చే వారంలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరగడం, సెంట్రల్ బ్యాంకుల నుంచి పసిడి కొనుగోళ్లు బలంగా కొనసాగుతుండడం ధరలను మరింత గరిష్టాల దిశగా నడిపిస్తోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
‘కోహ్లి భవిష్యత్తుపై చర్చ అనవసరం’
రాంచీ: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అద్భుత ఇన్నింగ్స్తో ఆదివారం తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు. గత కొంత కాలంగా జట్టులో కోహ్లి స్థానంపై, 2027 వరల్డ్ కప్ వరకు ఆడటంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్లోనూ అతని ప్రదర్శనపై అందరి దృష్టీ నిలుస్తోంది. అయితే ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఖండించాడు. కోహ్లి భవిష్యత్తు అనేది అసలు చర్చించాల్సిన అంశమే కాదని అతను స్పష్టం చేశాడు. ఇంత బాగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంకేం ఆశిస్తామని కొటక్ వ్యాఖ్యానించాడు. ‘కోహ్లి గురించి ఈ తరహాలో ఆలోచించాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు. అతను చాలా గొప్పగా ఆడుతున్నాడు. అసలు అతని భవిష్యత్తుపై మాట్లాడాల్సిన అవసరం ఏముంది. అతని ఆట, ఫిట్నెస్ చూస్తే మరో చర్చకు తావు లేదు. కోహ్లి బ్యాటింగ్ అసాధారణంగా ఉంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే మరో విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కోహ్లి, రోహిత్ ఇద్దరూ జట్టు విజయంలో తమ పాత్ర పోషిస్తున్నారు. వారిద్దరికీ ఎంతో అనుభవం ఉంది. అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. జట్టు విజయంలో వారి భాగస్వామ్యం కూడా కీలకంగా మారింది’ అని కొటక్ భారత్ బ్యాటర్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మంచు ప్రభావం కారణంగా తమ బౌలర్లను పట్టు చిక్కలేదని, అందుకే దక్షిణాఫ్రికా కూడా భారీగా పరుగులు సాధించి విజయానికి చేరువగా రాగలిగిందని విశ్లేíÙంచిన కొటక్...ఆరంభంలో వికెట్లు తీసి ప్రత్యరి్థని కట్టడి చేసిన హర్షిత్ రాణాపై ప్రత్యేకంగా ప్రశంసించాడు. -
ఒడిశా మేల్కొనాలి!
వలస జీవులపై విషం కక్కే సంస్కృతి ఒడిశాలో ఇంకా పోలేదని అక్కడ జరుగుతున్న దాడులు తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు పిల్లల్ని అపహరించడానికొచ్చారనో, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడబోయారనో బెంగాల్ నుంచి వలసవచ్చి చిన్నా చితకా పనులు చేసుకుంటున్నవారిపై దాడులు జరిగాయి. ఇప్పుడు ‘విదేశీయుల’ పేరిట ఆ వేలంవెర్రి కొనసాగుతోంది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బెంగాల్ నుంచి ఉన్ని దుస్తులు అమ్ముకోవటానికి వచ్చిన యువకులపై అయిదారు నెలలుగా మూకలు దాష్టీకం చేస్తున్నాయి. ఎవరూ అకారణంగా ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి వలసలకు సిద్ధపడరు. సరైన జీవిక దొరక్క తప్పనిసరై వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతారు. కొన్ని వలసలు సీజనల్గా ఉంటాయి. తొలకరి సమయంలో పంట పొలాల్లో పనులు దొరుకుతాయని వచ్చేవారుంటారు. శీతకాలం సమీపించే సమయానికి ఉన్ని దుస్తులు, దోమతెరలు వగైరాలు అమ్ముకోవడానికి పోతారు. అదేమీ భద్రమైన జీవితం కాదు.సంపాదనపై అనిశ్చితి. వచ్చిన తృణమో, పణమో రక్షించుకోవటం కూడా సమస్య. స్థానికుడు కాదని తెలిశాక రౌడీ మూకల ఆగడాలుంటాయి. పోలీసులు సరేసరి. వలస పోయేవారికి శాశ్వత చిరునామా ఉండదు గనుక స్వరాష్ట్రంలోనూ, వలసపోయే రాష్ట్రంలోనూ కూడా తిప్పలే. వారు ఎక్కడా ఓటు బ్యాంకు కాదు. కనుక సంక్షేమం ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది. ఇప్పుడు వలస జీవులను అకారణంగా వేధించటానికి ‘విదేశీయులు’ అనే ఆయుధం అక్కరకొస్తోంది. పార్టీలు తమకు రాలిపడతాయనుకున్న ఓట్ల కోసం ఈ ఆయుధాన్ని నిర్విచక్షణగా ఉపయోగిస్తుంటే రౌడీ మూకలకూ అదే ఆదర్శం! నాలుగు రోజుల క్రితం రాహుల్ ఇస్లాం అనే యువకుడిపై గంజాం జిల్లాలోని గ్రామంలో మూక విరుచుకుపడి తీవ్రంగా దాడిచేసి, అతని దగ్గరున్న రూ. 6,000 అపహరించింది. ఆధార్ కార్డు అడగటం, అది నకిలీదని ఆరోపిస్తూ కొట్టడం సరే.... అతని పేరునుబట్టి వేరే మతం వాడని తెలిశాక ‘జై శ్రీరాం’ అని బలవంతంగా అనిపించి సమస్తం ఊడ్చి పంపారు. అంతకు నాలుగు రోజుల ముందు బెంగాల్ నుంచి వెళ్లిన మరో ఇద్దరు యువకులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ ఉదంతాలపై పశ్చిమ బెంగాల్ వలస కార్మికుల సంక్షేమ సంఘం ఒడిశా డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఫలితం ఉంటుందా? ఫిర్యాదు చేయడానికి పోతే ‘బతకాలని ఉంటే ఇటువైపు వచ్చే ప్రయత్నం చేయొద్ద’ని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారట. కొన్ని వారాల క్రితం బెంగాల్ నుంచి పోయిన ముగ్గురు కూలీలు పోలీసుల నుంచి ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నారు. వారిపై బంగ్లాదేశీయులన్న ముద్రవేసి మూడు రోజులపాటు పోలీసు స్టేషన్లో నిర్బంధించగా, చివరకు పశ్చిమబెంగాల్ పోలీసుల జోక్యంతో బయటపడ్డారు. కేంద్రపారా, ఝార్సుగూడ, జగత్సింగ్ పూర్ జిల్లాల్లో బెంగాల్ నుంచి వచ్చిన 500 మందికి పైగా వలస కార్మికులను పోలీసులు నిర్బంధించి పలు విధాలుగా వేధించారు.ఏడేళ్ల క్రితం గుజరాత్లో ఒక పసిపాపపై బిహార్కు చెందిన యువకుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ వచ్చినప్పుడు మూకలు చెలరేగి ‘బయటి వ్యక్తుల’ని అనుమానం వచ్చినవారిని తీవ్రంగా కొట్టి, వారి గుడిసెలకు నిప్పంటించారు. దాంతో బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది ప్రాణభయంతో స్వస్థలాలకు తరలిపోయారు. ఆలస్యంగానైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని భరోసా ఇచ్చాకే పరిస్థితి చక్కబడింది. ఒడిశాలో రౌడీ మూకల ఆగడాలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటమే కాదు... తనవంతుగా వేధింపులకు దిగుతోంది. ఇది సరికాదు. వలసలు నిజానికి జనాగ్రహం నుంచి పాలకుల్ని కాపాడే రక్షాకవచాలు. కడుపు మండిన వారు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా, తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ వేరేచోటకు వలసపోవడంలో అభ్యంతరం ఎందుకుండాలి? దేశభక్తి గురించి లెక్చెర్లిస్తూ పక్క రాష్ట్రం నుంచి వచ్చినవారిని విదేశీయులుగా ముద్రేయటం సిగ్గనిపించటం లేదా? ఒడిశా నుంచి కూడా లక్షల మంది వలసపోతుంటారు. ఈ చీడ విస్తరిస్తే అన్ని రాష్ట్రాల వారికీ పరాయి రాష్ట్రాల్లో ఇదే దుఃస్థితి తలెత్తదా? ఈ పోకడలు సమైక్య భారత్ భావనకు ముప్పు కలిగించవా? ఒడిశా పాలకులు ఆలోచించాలి. -
ఏఐ స్మార్ట్ గ్లాసెస్: ఉపయోగాలెన్నో..
ఓక్లీ మెటా గ్లాసెస్ గురించి చాలామంది వినే ఉంటారు. జూన్లో ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ గ్లాసెస్ ఇప్పుడు భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ను.. స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ పరికరాల తయారీదారు ఓక్లీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు.. ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేయవచ్చు. అంతే కాకుండా వాయిస్ అసిస్టెంట్ ద్వారా.. చాలా పనులను సులభంగా చేసుకోవచ్చు కూడా.భారతదేశంలో ఓక్లీ మెటా HSTN గ్లాసెస్.. క్లియర్ & ప్రిజం అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ ధరలు రూ. 41,800. అయితే ఎందుకుని లెన్స్ ఆధారంగా ధరలు మారుతాయి. కాబట్టి ప్రిజం పోలరైజ్డ్ వేరియంట్ ధర రూ. 44,200 కాగా, ప్రిజం ట్రాన్సిషన్ లెన్స్లతో కూడిన ఓక్లీ మెటా HSTN ధర రూ. 47,600.ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఈరోజు (డిసెంబర్ 1) నుంచి సన్గ్లాస్ హట్.. దేశంలోని ప్రముఖ ఆప్టికల్ & ఐవేర్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.ఓక్లీ మెటా గ్లాసెస్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 100-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో సెకనుకు 30 ఫ్రేమ్ల వద్ద 3K వీడియో రిజల్యూషన్లో పాయింట్-ఆఫ్-వ్యూ వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్, స్లో మోషన్ & హైపర్లాప్స్ వీడియో రికార్డింగ్ మోడ్లకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు 3024 x 4032 పిక్సెల్స్ రిజల్యూషన్లో కూడా ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ 32GB ఆన్బోర్డ్ స్టోరేజితో వస్తుందని సంస్థ వెల్లడించింది. మొత్తం మీద ఇచ్చి చాలా విధాలుగా పనికొస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
అన్నంత పని చేయబోతున్న ట్రంప్?!
ఇల్హాన్ ఒమర్ను అమెరికా నుంచి వెళ్లగొడతారా? ఆమెను పంపించేయాల్సిందేనని అక్కడి ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?. ట్రంప్ చెబుతున్నట్లు ఆమె నిజంగానే ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్కు పాల్పడ్డారా? భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు ఆమె ఎందుకు చేయాల్సి వచ్చింది?.. అసలు ఇంతకీ ఇల్హాన్ ఒమర్ నేపథ్యం ఏంటి?.. అమెరికా చట్ట సభ్యురాలు, మిన్నెసోటా రాష్ట్రానికి చెందిన డెమోక్రాటిక్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్. తాజాగా ఆమె వివాహం,ఇమ్మిగ్రేషన్ విషయంలో మోసానికి పాలపడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా పౌరసత్వం కోసం సొంత సోదరుడినే వివాహం చేసుకున్నారని ప్రధాన ఆరోపణ. దీంతో పాటు ఆమె చేస్తున్న యాంటీ అమెరికా కామెంట్లకు అక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. డీనేచురలైజ్ చేసి (పౌరసత్వం రద్దు చేసి) దేశం నుంచి వెల్లగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ట్రంప్ అలా అనేసరికి.. 2009లో ఒమర్ అహ్మద్ నూర్ సయీద్ ఎల్మీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె అక్రమంగా అమెరికాకు వలస వచ్చారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తిని ఆమె వివాహమాడారని.. కేవలం అమెరికాలో స్థిరపడేందుకు ఆమె మోసం చేశారని ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆమెను అమెరికా నుంచి బయటకు పంపించేస్తామని వ్యాఖ్యానించారు. వలసల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న ట్రంప్ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో సాధారణంగానే చర్చ పెద్దదైంది. ఈ ఆరోపణలను ఒమర్ ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇస్లామోఫోబిక్, రాజకీయ ప్రేరేపితమైనవిగా అభివర్ణించారామె. రాజకీయంగా తనను బలహీనపర్చేందుకు జరుగుతున్న దాడి అని అన్నారామె. అయితే.. గతంలోనూ..ఇల్హాన్ ఒమర్పై ఈ ఆరోపణలు కొత్తవేం కావు. 2016లో సోమాలి-అమెరికన్ ఫోరమ్ ఒకటి ఈ అభియోగాన్ని తెరపైకి తెచ్చింది. 2018 కాంగ్రెస్ ఎన్నికల సమయంలోనూ ఈ అంశంపై పెద్ద చర్చ నడిచింది. తీవ్ర అభియోగాల నేపథ్యంతో కొన్ని మీడియా సంస్థలు ఇన్వెస్టిగేషన జర్నలిజంతో వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయతనం చేశాయి. 2019-20 మధ్య ఎఫ్బీఐ, హౌజ ఎథిక్స్ కమిటీ ఈ అభియోగాన్ని పరిశీలించి ఏం తేలకపోవడంతో కేసులు మూసివేశాయి కూడా. అయినా కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఈ ఆరోపణలను మళ్లీ ప్రస్తావించారు. దీంతో అమెరికా రాజకీయాల్లో ఇమ్మిగ్రేషన్ & పౌరసత్వంపై పెద్ద చర్చకు దారితీస్తోంది. వెళ్లగొట్టాల్సిందే..! ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ఆమెను అమెరికా నుంచి పంపించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ఉద్యమిస్తున్న మాగా కార్యకర్తలు, కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కోరుతున్నారు. ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు. ఆమె మ్యారేజ్ సర్టిఫికెట్ను ఎక్స్ ఖాతాలో వైరల్ చేస్తూ.. సాగనంపాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు.ఇల్హాన్ ఒమర్(43).. పుట్టింది సోమాలియాలో. ఆ దేశ అంతర్యుద్ధంతో 8 ఏళ్ల వయసులో కెన్యాకు చేరుకుని నాలుగేళ్లపాటు శరణార్థ శిబిరాల్లో గడిపింది. అక్కడి నుంచి అమెరికాకు చేరుకున్న ఆమె.. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందింది. 2018 నుంచి ఇప్పటిదాకా నాలుగుసార్లు ఆమె చట్టసభకు ఎన్నికయ్యారు. అది సాధ్యమేనా?అమెరికా చట్టం ప్రకారం, నేచురలైజ్డ్ సిటిజన్ (పౌరసత్వం పొందిన వ్యక్తి)ను డీనేచురలైజ్ చేయవచ్చు, కానీ అది స్పష్టమైన, బలమైన ఆధారాలతో మాత్రమే సాధ్యం. డీనేచురలైజేషన్ జరిగితే, ఆ వ్యక్తి పర్మనెంట్ రెసిడెంట్ లేదంటే అక్రమ వలసదారుగా మారతారు. తర్వాతే డిపోర్టేషన్ జరుగుతుంది. ఈ మధ్యలో కోర్టు జోక్యాలతో ఏదైనా జరగొచ్చు. అయితే.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా ఇలాంటి చర్యలు ప్రధానంగా యుద్ధ నేరస్తులు, ఉగ్రవాదులపై మాత్రమే జరిగాయి. ఒమర్పై వినిపిస్తున్న ఈ ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు(ఫోరెన్సిక్ సహా) లేకపోవడం వల్ల చట్టపరంగా చర్యలు తీసుకోవడం కష్టమే. భారత్కు ఎందుకు అంత కోపంవివాదాలు ఆమెకు కొత్తేం కాదు. ఆమె బహిరంగంగా చేసిన పలు ప్రకటనలు తీవ్ర దుమారం రేపాయి. సోమాలియా నా సొంతం దేశం అంటూ అమెరికాను ఆమె కించపరిచేలా వ్యవహరించారనే విమర్శ ఒకటి బలంగా వినిపిస్తుంటుంది. అంతేకాదు.. గాజా సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్, అమెరికాను ఉగ్ర గ్రూపులతో పోల్చారామె. అలాగే.. ఇల్హాన్ ఒమర్ గతంలో భారత వ్యతిరేక వైఖరితో వార్తల్లో నిలిచారు. 2022లో ఆమె పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)ను సందర్శించి, స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆమె భారతదేశంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ ఈ పర్యటనను తీవ్రంగా ఖండించింది. -
అణుశక్తి బిల్లు.. గేమ్ చేంజర్ అయ్యేనా?
నేటి(సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున కేంద్ర ప్రభుత్వం దేశ ఇంధన రంగాన్ని సమూలంగా మార్చగల కీలక చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. అదే అణుశక్తి బిల్లు- 2025. ఈ చారిత్రక బిల్లు ముఖ్య ఉద్దేశ్యం అణుశక్తి రంగాన్ని మొదటిసారిగా ప్రైవేట్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తెరవడం. తద్వారా దేశంలో క్లీన్ ఎనర్జీ సామర్థ్యం పెంపొందుతుందని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.విధానపరమైన అంతరానికి చెక్ఈ బిల్లులోని అత్యంత కీలక అంశం.. అణు విద్యుత్ ప్లాంట్లకు టారిఫ్ల (సుంకాల)పై తగిన నిర్ణయం తీసుకోవడం. ఇప్పటివరకు అణు రంగంలో ప్రైవేట్ పెట్టుబడిని పరిమితం చేసేలా విధానపరమైన అంతరం ఎదురవుతోంది. సరైన టారిఫ్ రెగ్యులేషన్ విధానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, ప్రభుత్వం దేశీయ ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించాలని, వారికి లాభదాయకతను కల్పించాలని చూస్తోంది. అంతేకాకుండా ఈ బిల్లు ఆమోదం పొందితే ఇది విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లకు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాల సాయంతో భారతదేశ అణు సామర్థ్యం బలోపేతం కానుంది.ఇప్పటివరకు న్యూక్లియస్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఆధిపత్యంలో ఉన్న అణుశక్తి రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం మరింతగా పెరగనుంది. బిల్లులో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ప్రైవేట్ రంగ ప్రవేశం: ఈ బిల్లు దేశంలోని ప్రైవేట్ కంపెనీలు నేరుగా అణు విద్యుత్ ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడానికి మొదటిసారిగా అనుమతినిస్తుంది.టారిఫ్ రెగ్యులేషన్: అణు విద్యుత్ ప్లాంట్లకు సుంకాల (టారిఫ్) నిర్ణయాన్ని పరిష్కరించడానికి ఈ బిల్లు ఒక విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఇది పెట్టుబడిదారుల లాభదాయకతను, వినియోగదారుల స్థోమతను సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది.టెక్నాలజీ యాక్సెస్: బిల్లు ఆమోదం పొందిన తర్వాత విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశించడం మరింత సులభం అవుతుంది.వికసిత భారత్ : భారత ప్రభుత్వం ఈ సంస్కరణను ‘వికసిత భారత్’ దార్శనికతలో భాగంగా చూస్తున్నది. క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు.ఎదురయ్యే సవాళ్లుఅయితే ఈ సంస్కరణ పలు సవాళ్లను లేవనెత్తనుంది. విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడనున్నటప్పటికీ భద్రత, ప్రమాద బాధ్యతల ఆందోళనలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే అణు కార్యకలాపాలలో కఠిన నియంత్రణ, పర్యవేక్షణ అత్యవసరం. మరోవైపు కొన్ని ప్రాంతాలలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను ప్రభుత్వం చల్లార్చాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుత శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి 19వరకూ జరగనున్నాయి. అణు బిల్లుతో పాటు, చండీగఢ్ కోసం రాజ్యాంగ సవరణ, ఉన్నత విద్యలో సంస్కరణలు సహా 10 ప్రతిపాదిత చట్టాలను ప్రభుత్వం జాబితా చేసింది. అయితే ప్రతిపక్షం ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (సర్), జాతీయ భద్రత, పర్యావరణ ఆందోళనలు తదితర అంశాలపై చర్చను లేవనెత్తాలని భావిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ అణుశక్తి బిల్లు- 2025 భారతదేశ ఇంధన భవిష్యత్తుకు ఒక చారిత్రక మలుపు కానుంది. ఇది కూడా చదవండి: AIDS Day: హెచ్ఐవీ నయం అవుతుందా? తాజా పరిశోధనల్లో.. -
Andhra Pradesh: ట్రంప్ దెబ్బకు కుయ్యో రొయ్యో..!
ట్రంప్ దెబ్బకి.. రొయ్య గడ్డ కడుతోంది. కోల్డ్ స్టోరేజ్లోనే కాలం సాగిస్తోంది. సముద్ర ఉత్పత్తులు కంటైనర్ ఎక్కించేందుకు వ్యాపారులూ గజగజమంటున్నారు. అగ్రరాజ్యం విధించిన సుంకాల ప్రభావం భారత్పై కనిపించబోదని కేంద్రం.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించామంటూ రాష్ట్ర ప్రభుత్వం బీరాలు పలుకుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం తిరోగమనం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా పన్ను టారిఫ్ల దెబ్బకు విశాఖలోని కంటైనర్ కార్గో ఎగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత ఆరు నెలలుగా దాదాపు 20 నుంచి 30 శాతం వరకూ ఎగుమతులు క్షీణించాయి. పన్ను టారిఫ్ల వ్యవహారం ఓ కొలిక్కి రాకుండా ఈ వ్యత్యాసం భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, విశాఖపట్నం: మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా ఉండే విశాఖపట్నం.. ఇప్పుడు అమెరికా విధించిన సుంకాల దెబ్బ నుంచి కోలుకోలేకపోతోంది. అమెరికా పన్నుల ప్రభావం భారత్పై ఏ మాత్రం ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితుల్లో ప్రతికూల ప్రభా వం ఉంటోంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇందులో 75 శాతం అంతర్గత మత్స్య, ఆక్వా కల్చర్ సంపద కాగా 25 శాతం వరకూ సముద్ర రంగం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో 66 శాతం వాటా రొయ్యలదే కావడం విశేషం. దేశంలో ముఖ్యంగా విశాఖ నుంచి ఎగుమతయ్యే రొయ్యలకు విదేశాల్లో భారీగా గిరాకీ ఉంది. దాని తర్వాత స్థానంలో ట్యూనా చేపల ఎగుమతులున్నాయి. విశాఖ సముద్ర జలాల్లో దొరికే ట్యూనా చేపలు దాదాపు అన్ని దేశాలకు ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. అమెరికా ఈ ఏడాది మొదట్లో మన ఎగుమతులపై 25 శాతం సుంకాలు విధించడం వల్ల రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విశాఖ నుంచి ఎగుమతయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 52 శాతం వరకూ మార్కెట్ అమెరికాలోనే జరుగుతోంది. ట్రంప్ సుంకాల పెంపు ఇక్కడ ఎగుమతిదారులకు ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ గణనీయంగా పడిపోయాయి. కోల్డ్ స్టోరేజ్లోనే రొయ్యలు.! రాష్ట్రంలోని దాదాపు 45 రొయ్యల ఉత్పత్తుల ఎగుమతి సంస్థలుండగా.. విశాఖ జిల్లాలో 10కిపైగా ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో రకం ప్యాకేజీ విధానాన్ని అమలు చేస్తుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పంపించేందుకు దాదాపు లక్ష టన్నుల వరకూ ప్యాకేజీలు చేసి కోల్డ్ స్టోరేజ్లోనే మూలుగుతున్నాయి. వీటి ప్యాకింగ్ మార్చి.. ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు తలప్రాణం తోకకొస్తోందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా సుంకాల ప్రభావం మత్స్యరంగంపై ప్రతికూల ప్రభావం చూపించకుండా కొత్త మార్కెట్ల విస్తరణపై దృష్టిసారించామని కేంద్రం చెబుతున్నా.. ఆ పరిస్థితులు ఎక్కడా క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదని వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మార్కెట్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఆరు నెలలుగా అథఃపాతాళానికి.. విశాఖ నుంచి ఆరు నెలలుగా సముద్ర ఎగుమతులు దిగజారుతూ వస్తున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపెడా) నివేదికల ప్రకారం సీఫుడ్ ఎక్స్పోర్ట్స్లో దేశంలోనే విశాఖపట్నం ఏకంగా 26.36 శాతం వాటాని కలిగి ఉంది. విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యూఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. విశాఖపట్నం కంటైనర్ టెరి్మనల్ ప్రైవేట్ లిమిటెడ్(వీసీటీపీఎల్) ఆధ్వర్యంలో కంటైనర్ కార్గో ఎగుమతులు జరుగుతుంటాయి. విశాఖపట్నం పోర్టులో 32 బెర్త్లు ఉండగా.. గంగవరం పోర్టులో 9 బెర్తులున్నాయి. ఇందులో మొత్తం 23 బెర్త్ల ద్వారా కార్గో కంటైనర్ ఎగుమతులు జరుగుతున్నాయి. ఏటా ఇక్కడి నుంచి సుమారు రూ.17 వేల కోట్ల విలువైన 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. ప్రతి నెలా ఇక్కడి నుంచి 4000 రిఫ్రొజినేటెడ్ కంటైనర్స్(సీఫుడ్) ఎగుమతులు జరుగుతుంటాయి. ఒక్కో కంటైనర్ ద్వారా 30 టన్నుల సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి. అంటే నెలకు లక్షా 20 వేల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతుండేవి. అమెరికా సుంకాల ప్రభావంతో దాదాపు 30 శాతం వరకూ ఈ ఎగుమతులు క్షీణించాయి. జూన్ నెల నుంచి నవంబర్ వరకూ చూ స్తే.. ప్రతి నెలా 2000 నుంచి 3000 కంటైనర్లకు మించడం లేదని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల బుకింగ్స్ కూడా 20 నుంచి 30 శాతం కంటే దిగువకే ఉన్నాయని పోర్టు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా గడిచిన 6 నెలల్లో వేల కోట్ల టర్నోవర్కు బ్రేక్ పడిందని పోర్టు వర్గాలు చెబుతున్నాయి. -
హసీనా చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. భారత్పై సంచలన ఆరోపణలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చుట్టు ఉచ్చు మరింత బిగుస్తోంది. వరుస కేసులతో.. కఠిన శిక్షలతో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆమెకు ఊపిరి సలపనివ్వడం లేదు. తాజాగా భారత్పైనా సంచలన ఆరోపణలు చేస్తూ ఆమెపై మరో అభియోగం మోపే దిశగా అడుగులు వేస్తోంది.2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనానే కారణమని.. ఇందులో భారత్ ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తోంది. హసీనా హయాంలో జరిగిన హింసాకాండపై సమగ్ర దర్యాప్తునకు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త కమిటీ ఈ మేరకు నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ ప్యానెల్కు రిటైర్డ్ మేజర్ ఏఎల్ఎం ఫజ్లుర్ రెహ్మాన్ నేతృత్వం వహిస్తున్నారు.2009లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే.. బంగ్లాదేశ్ రైఫిల్స్ (BDR) తిరుగుబాటు జరిగింది. ఈ ఘటనలో సీనియర్ ఆర్మీ అధికారులతో సహా 74 మంది మరణించారు. ఫజ్లుర్ కమిషన్ ఆదివారం సమర్పించిన నివేదికలో ఇలా ఉంది.. మాజీ ప్రధాని షేక్ హసీనా తిరుగుబాటుకు "గ్రీన్ సిగ్నల్" ఇచ్చారు. ఆనాడు అవామీ లీగ్ ఎంపీగా ఉన్న ఫజ్లే నూర్ టాపోష్ నేతృత్వంలోనే ఈ దమనకాండ జరిగింది. పైగా ఈ తిరుగుబాటులో "విదేశీ శక్తి" ప్రమేయం స్పష్టంగా కనిపించింది. అది భారతదేశమే. ఆ సమయంలో 921 మంది భారతీయులు బంగ్లాదేశ్లోకి చొరబడ్డారు. వాళ్లలో 67 మంది ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదు అని పేర్కొంది.హసీనా ప్రభుత్వ హయాంలో బీడీఆర్ తిరుగుబాటుకు సైనిక వేతనాలు, గత ప్రభుత్వంలో వాళ్ల దీనావస్థలే కారణమని ప్రకటించుకుంది. అయితే ఫజ్లుర్ కమిషన్ మాత్రం దానిని అంతర్గత కుట్రగా అభివర్ణించింది. హసీనా ప్రభుత్వం సైన్యాన్ని బలహీనపరచి తన అధికారాన్ని మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశంతో తిరుగుబాటును ప్రోత్సహించిందని పేర్కొంది. ఆమెకు మద్దతుగా భారతదేశం బంగ్లాదేశ్లో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించింది.ఉద్యోగాల్లో బంగ్లా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ల పెంపు నిర్ణయంతో బంగ్లాదేశ్లో కిందటి ఏడాది ఢాకా వర్సిటీ విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. అయితే ఈ నిరసనలు భద్రతా బలగాల మోహరింపుతో అల్లర్లకు దారి తీశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో పలువురు మరణించారు. ప్రభుత్వం కుప్పకూలి తిరుగుబాటు పరిస్థితుల నడుమ ఆమె భారత్కు శరణుకోరి వచ్చారు. అటుపై హింసాత్మకంగా ఆందోళనలకు అణచివేశారంటూ ఆమెపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా.. ఆమెకు తీవ్ర నేరాల దృష్ట్యా మరణశిక్ష, అటుపై మరో కేసులో 21 ఏళ్ల జైలు శిక్షా పడింది కూడా. మరోవైపు హసీనాను(ఫ్యూజిటివ్) తమకు వీలైనంత త్వరగా అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరుతుండగా.. భారత్ మాత్రం తొందరపడబోమని, ఆ అంశాన్ని పరిశీలిస్తామని అంటోంది. తాజా నివేదిక నేపథ్యంలో భారత్పై ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి భారత్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
-
Mann Ki Baat: ‘వికసిత్ భారత్’కు యువత అంకితభావమే బలం
న్యూఢిల్లీ: యువతలోని అంకితభావమే ‘వికసిత్ భారత్’కు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. అంతరిక్ష నుంచి వ్యవసాయం దాకా ఎన్నో కీలక రంగాల్లో మన యువత అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. ‘మన్ కీ బాత్’128వ ఎపిసోడ్లో భాగంగా ఆయన ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. పరిశోధన రంగంలో భారత్ వేగంగా ముందుకు దూసుకెళ్తోందని హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచంలో ఏదైనా సాధించే శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని తేల్చిచెప్పారు. యువతలోని అసమాన శక్తి, బలీయమైన సంకల్పం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయని ఉద్ఘాటించారు. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి వంటి కీలక రంగాల్లో యువతీ యువకులు చక్కటి ప్రతిభ కనబరిచారని కొనియాడారు. కష్టతరమైన విజయాలను సైతం అలవోకగా సాధిస్తున్నట్లు చెప్పారు. అంధుల మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించి, చరిత్ర సృష్టించిందని తెలిపారు. క్రీడల్లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నామని చెప్పారు. 2030లో కామన్వెల్త్ క్రీడలను మన దేశంలో నిర్వహించడానికి బిడ్డింగ్లో నెగ్గడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వైఫల్యం తర్వాత దక్కిన విజయంతో.. ‘‘కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో కనిపించిన ఓ వీడియో నా దృష్టిని ఆకట్టుకుంది. అంగారక గ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి, అక్కడే డ్రోన్లను ఎగరవేయడానికి పుణేకు చెందిన యువకులు ప్రయతి్నంచారు. జీపీఎస్ మద్దతు లేకపోవడంతో డ్రోన్లు నేలకూలుతున్నప్పటికీ నిరాశ చెందకుండా వారు మరింత పట్టుదలతో ప్రయతి్నంచారు. ఎట్టకేలకు డ్రోన్లు కొంతసమయం ఎగిరేలా చేశారు. కెమెరాలు, ఇన్–బిల్ట్ సాఫ్ట్వేర్తోనే వారు ఈ ప్రయోగం నిర్వహించారు. మన యువతలోని ఇలాంటి మహోన్నత సంకల్ప బలమే దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మారుస్తుందనడంలో సందేహం లేదు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో యువత వికసిత్ భారత్ స్వప్నాన్ని కచ్చితంగా సాకారం చేస్తారని నేను విశ్వసిస్తున్నా. ఇస్రో సైంటిస్టులు కూడా చంద్రయాన్–2 వైఫల్యంతో కొంత నిరాశ చెందారు. తర్వాత రెట్టించి ఉత్సాహంతో పనిచేసి చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేశారు. వైఫల్యం తర్వాత దక్కిన విజయం గొప్ప విశ్వాసాన్ని అందిస్తుంది. యువత సంకల్పాన్ని, సైంటిస్టుల అంకితభావాన్ని చూసినప్పుడు నా హృదయం ఉత్సాహంతో నిండిపోతుంది. అంతరిక్ష రంగంలో ప్రయోగాలకు కొత్త శక్తి నవంబర్లో ఎన్నో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహించుకున్నా. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. పార్లమెంట్ పాత భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం జరిగింది. అయోధ్య భవ్య రామమందిరంపై ధర్మధ్వజం ఎగరవేశాం. ఐఎన్ఎస్ మాహే నౌక భారత నావికాదళంలో చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజన్ ఎంఆర్ఓ సంస్థను హైదరాబాద్లో ప్రారంభించాం. అంతరిక్ష రంగంలో ప్రయోగాలకు స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ కొత్త శక్తిని అందించింది. దేశంలో నూతన ఆలోచనా విధానానికి, నవీన ఆవిష్కరణలకు, యువ శక్తికి ఇదొక ప్రతీక. కాశీ–తమిళ సంగమంలో పాల్గొనండి వారణాసిలోని నమో ఘాట్లో డిసెంబర్ 2 నుంచి జరుగబోయే కాశీ–తమిళ సంగమం నాలుగో ఎడిషన్లో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నా. తమిళ భాష నేర్చుకొనే అవకాశం వదులుకోవద్దు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాషను, అత్యంత ప్రాచీన నగరాన్ని అనుంధానించే గొప్ప కార్యక్రమం ఇది. తమిళ భాషతో అనుబంధం ఉన్నవారికి కాశీ–తమిళ సంగమం ఒక ముఖ్యమైన వేదికగా మారుతోంది. తమిళ సోదరులు, సోదరీమణులను ఆహ్వానించడానికి కాశీ ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఇతర కార్యక్రమాల్లోనూ ప్రజలు భాగస్వాములుగా మారాలి. ఏక్ భారత్–శ్రేష్ట భారత్ స్ఫూర్తిని బలోపేతం చేయాలి.‘వోకల్ ఫర్ లోకల్’ సెంటిమెంట్ నేను ఇటీవలే దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు హాజరయ్యాను. అక్కడ ప్రపంచ దేశాల నేతలకు అందజేసిన బహుమతుల్లో ‘వోకల్ ఫర్ లోకల్’సెంటిమెంట్ కనిపించింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కంచు నటరాజ స్వామి విగ్రహం బహూకరించా. తమళినాడులో చోళుల కాలం నాటి హస్తకళా నిపుణ్యానికి ఇది నిదర్శనం. తెలంగాణలోని కరీంనగర్ కళాకారులు రూపొందించిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానమంత్రికి అందజేశా. సంప్రదాయ లోహ కళాకృతులకు ఇదొక ఉదాహరణ. భారతీయ కళలు, సంప్రదాయాలు, కళాకృతులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నదే నా లక్ష్యం. దీనివల్ల మన కళాకారులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వారి నైపుణ్యానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభిస్తుంది’’అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. -
కోహ్లి దూకుడు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
టెస్టు సిరీస్ పరాభవం నుంచి కోలుకున్న టీమిండియా... వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. ‘స్టార్స్’ రోహిత్ శర్మ తనలో చేవ తగ్గలేదని నిరూపించగా... కోహ్లి వీరోచిత సెంచరీతో సత్తా చాటాడు. సింగిల్స్, డబుల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా భారీ సిక్స్లతో అచ్చమైన వన్డే ఇన్నింగ్స్తో కట్టిపడేశాడు. బంతితో కుల్దీప్, హర్షిత్ రాణించారు. సుదీర్ఘ ఫార్మాట్ గెలుపు ఇచి్చన స్ఫూర్తితో వన్డే సిరీస్లో బరిలోకి దిగిన సఫారీ జట్టు కడదాకా పోరాడినా పరాజయం తప్పలేదు. రాంచీ: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు... వన్డే సిరీస్లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (120 బంతుల్లో 135; 11 ఫోర్లు, 7 సిక్స్లు) వన్డే కెరీర్లో 52వ సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్ కేఎల్ రాహుల్ (60; 2 ఫోర్లు, 3 సిక్స్లు), రోహిత్ శర్మ (51 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. బ్రాట్కీ (80 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్), యాన్సెన్ (39 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్లు), కార్బిన్ బాష్ (51 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం రాయ్పూర్లో రెండో వన్డే జరగనుంది. సెంచరీ భాగస్వామ్యం...ఇప్పటికే టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... ఆడుతున్న ఒక్క ఫార్మాట్లోనే అదరగొడుతున్నారు. చివరగా ఆ్రస్టేలియాతో ఆడిన వన్డేలో దంచికొట్టిన ఈ జంట ... సిడ్నీలో ఎక్కడ ఆపిందో రాంచీలో అక్కడి నుంచే మోత మోగించింది. ఫామ్, ఫిట్నెస్లో యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మరోసారి చాటింది. నాలుగో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (18; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుట్ కాగా.. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది విరాట్ తన ఉద్దేశాన్ని చాటాడు. సాధారణంగా నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించే కోహ్లి చూడచక్కటి షాట్లతో కట్టిపడేయగా... రోహిత్ కూడా లయ అందుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో భారత జట్టు 80/1తో నిలిచింది. సుబ్రాయెన్ బౌలింగ్లో రోహిత్ రెండు వరుస సిక్స్లు బాదితే... కార్బిన్ బాష్ బౌలింగ్లో కోహ్లి చెలరేగిపోయాడు. రోహిత్ తనదైన పుల్ షాట్లతో రెచ్చిపోగా... విరాట్ వన్డేల్లో తన రెండో అత్యధిక సిక్స్ (7)లు ఈ మ్యాచ్లో నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి 48, రోహిత్ 43 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్కు 136 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ అవుట్ కాగా... రుతురాజ్ (8), సుందర్ (13) విఫలమయ్యారు. 102 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాక జూలు విదిలి్చన విరాట్... సుబ్రాయెన్ వేసిన 39వ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాదాడు. మరో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో కోహ్లి అవుటయ్యాడు. ఆఖర్లో జడేజా (20 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో... రాహుల్ కీలక పరుగులు జోడించాడు. యాన్సెన్ దూకుడు... భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం దక్కలేదు. రికెల్టన్ (0), డికాక్ (0), మార్క్రమ్ (7) పెవిలియన్కు చేరడంతో ఆ జట్టు 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో టోనీ జార్జి (39; 7 ఫోర్లు), బ్రెవిస్ (37; 2 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి బ్రిట్కీ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ ఇద్దరు ఎక్కువసేపు నిలవలేకపోయినా... యాన్సెన్ రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. టెస్టు సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యాన్సెన్... భారీ షాట్లతో టీమిండియాను భయపెట్టాడు. దీంతో సఫారీ జట్టు పోటీలోకి రాగా... కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో ఈ ఇద్దరినీ అవుట్ చేసి జట్టులో ఆనందం నింపాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి బాష్ ఆఖర్లో పోరాడినా... జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.వన్డే ‘సిక్స్’లలో రోహిత్ రికార్డుఈ మ్యాచ్లో మూడు సిక్స్లు బాదిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ... వన్డే క్రికెట్లో అత్యధిక (352) సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెపె్టన్ షాహిద్ అఫ్రిది (351) పేరిట 15 ఏళ్లుగా ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్స్లు బాదగా... రోహిత్ 278 మ్యాచ్ల్లోనే అతడిని అధిగమించాడు. గేల్ (301 మ్యాచ్ల్లో 331 సిక్స్లు) మూడో స్థానంలో ఉన్నాడు.కోహ్లి కాళ్లు తాకాలని... ఈ మ్యాచ్లో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి విరాట్ వరకు చేరుకున్న అభిమాని... కోహ్లికి పాదాభివందనం చేశాడు. అంతలో అప్రమత్తమైన సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లారు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) డికాక్ (బి) బర్గర్ 18; రోహిత్ (ఎల్బీ) (బి) యాన్సెన్ 57; కోహ్లి (సి) రికెల్టన్ (బి) బర్గర్ 135; రుతురాజ్ (సి) బ్రెవిస్ (బి) బార్ట్మన్ 8;సుందర్ (సి) బాష్ (బి) బార్ట్మన్ 13; రాహుల్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 60; జడేజా (సి) మార్క్రమ్ (బి) బాష్ 32; హర్షిత్ (నాటౌట్) 3; అర్షదీప్ (బి) బాష్ 0; కుల్దీప్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు)349. వికెట్ల పతనం: 1–25, 2–161, 3–183, 4–200, 5–276, 6–341, 7–347, 8–347. బౌలింగ్: యాన్సెన్ 10–0–76–2; బర్గర్ 10–0–65–2; బాష్ 10–0–66–2; బార్ట్మన్ 10–0–60–2; సుబ్రాయెన్ 10–0–73–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) అర్షదీప్ 7; రికెల్టన్ (బి) హర్షిత్ 0; డికాక్ (సి) రాహుల్ (బి) హర్షిత్ 0; బ్రీట్కీ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 72; జోర్జి (ఎల్బీ) (బి) కుల్దీప్ 39; బ్రెవిస్ (సి) రుతురాజ్ (బి) హర్షిత్ 37; యాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 70; బాష్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 67; సుబ్రాయెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 17; బర్గర్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 17; బార్ట్మన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు: 6; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 332. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–11, 4–77, 5–130, 6–227, 7–228, 8–270, 9–312, 10–332. బౌలింగ్: అర్షదీప్ 10–1–64–2; హర్షిత్ రాణా 10–0–65–3; సుందర్ 3–0–18–0; ప్రసిధ్ 7.2–1–48–1; కుల్దీప్ 10–0–68–4; జడేజా 9–0–66–0. -
రైతుల హక్కుల మాటేమిటి?
దాదాపు రెండు దశాబ్దాల చర్చలు, కోర్టు కేసులు, విత్తన వైఫల్యాలు, పెరుగుతున్న సాగు వ్యయాల తర్వాత, భారత దేశం మరోసారి తన విత్తన చట్టాలను మార్చే దశకు వచ్చింది. 2004, 2019 ముసాయిదాల తర్వాత వచ్చిన విత్తనాల ముసాయిదా బిల్లు 2025 ఎన్నో ఆశలను రేకెత్తించింది. నేడు రైతులు ఎదుర్కొంటున్న అస్థిర విత్తన నాణ్యత, ఊగిసలాట ధరలు, పెరుగుతున్న కార్పొరేట్ ఆధి పత్యం వంటి భారాలను దృష్టిలో పెట్టుకుని రైతులను బలోపేతం చేస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ బిల్లులో ‘వ్యాపార సౌలభ్యం’ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)కు ఉన్న ప్రాధాన్యం, ‘వ్యవసాయ సౌలభ్యం’ (ఈజ్ ఆఫ్ ఫార్మింగ్)కు లేదు.నష్టపోయిన రైతుల్ని వదిలేసి...బిల్లులోని ఉద్దేశ్య వాక్యం దీని అసలు వైఖరిని తేటతెల్లంచేస్తోంది. ఇది ‘నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరాను సులభ తరం చేయుటకు’ అని చెబుతుందే తప్ప, రైతుల హక్కులు, పంట నష్టపరిహారం, ధరల నియంత్రణ వంటి అంశాలపై ఒక్క మాటా లేదు. ఇది ముసాయిదాలో లోపం కాదు. ఇది చట్టం ఏ ధోరణిలో ఉన్నదో స్పష్టంగా తెలియజెబుతోంది. అసలు బిల్లే పరిశ్రమ – వాణిజ్య చట్టంలా కనిపిస్తుంది తప్ప, రైతుల హక్కుల చట్టంలా కాదు! నాణ్యత నియంత్రణ బలోపేతం అవుతుందనీ, కేంద్రీకృత విత్తన ట్రేసబిలిటీ పోర్టల్ వస్తుందనీ బిల్లు మద్దతుదారులు చెబు తున్నారు. క్యూఆర్ కోడ్లు, డిజిటల్ ట్రేసింగ్– ఇవన్నీ కాగితంపై బానే కనబడతాయి. కానీ ఇవి న్యాయం సాధించడానికి సరిపోవు. ట్రేసబిలిటీ డేటా ఆధారంగా చెడు బ్యాచ్లు ఆటోమేటిక్గా వెనక్కి పోతాయనీ, పునరావృత దోషులను బ్లాక్ లిస్ట్లో పెడతారనీ, రైతులకు నష్టపరిహారం స్వయంచాలకంగా అందుతుందనీ బిల్లు ఎక్కడా నిర్దేశించలేదు.విత్తనాల ముసాయిదా బిల్లులోని అత్యంత పెద్ద లోపం? రైతులకు చట్టబద్ధ, కాలపరిమితి ఉన్న నష్టపరిహారం వ్యవస్థ లేకపోవడం! తేలిక, చిన్న, పెద్ద తప్పులకు భారీ జరిమానాలు, జైలు శిక్ష వరకూ బిల్లు నిర్దేశిస్తోంది. కానీ ఆ జరిమానాలు రైతులకు కలిగిన నష్టాలను భర్తీ చేయలేవు. పాత, నాసిరకం, నకిలీ విత్తనం వల్ల పంటనష్టం జరిగిన రైతు, ఇంకా వినియోగదారుల కోర్టులకే వెళ్లాలి; సాక్ష్యాధారాలు సమర్పించాలి; సంవత్సరాల తరబడి కేసును లాగాలి. చిన్న రైతులకు ఇది సాధ్యం కాని వ్యవస్థ.ధరల నియంత్రణపై చేతులెత్తేసి...ధర నియంత్రణ విషయంలో కూడా బిల్లు బలహీనంగానే ఉంది. సెక్షన్ 22 ప్రకారం ధరలను కేవలం ‘అత్యవసర పరిస్థితుల్లో’ – అసాధారణ పెరుగుదల, కొరత, ఏకాధిపత్య ధోరణి సమయాల్లో మాత్రమే నియంత్రించవచ్చు. దీని అర్థం: సాధారణ పరిస్థితుల్లో విత్తన ధరలపై ప్రభుత్వం తన చేతులు దులుపుకొంటుంది. గతంలో రాష్ట్రాలు అత్యవసర ఉత్పత్తుల చట్టం కింద బీటీ కాటన్ ధరలు, రాయల్టీలను నియంత్రించిన చట్టపరమైన హక్కులు ఇప్పుడు క్షీణి స్తాయి. విత్తన మార్కెట్ ఇప్పటికే కొద్ది కంపెనీల చేతుల్లో ఉండగా, ఈ బలహీన నియంత్రణ రైతులపై మరింత భారాన్ని మోపుతుంది. ఇంకో ప్రధాన సమస్య– ఈ బిల్లు కేంద్రాధిపత్యాన్ని బలపరచడం, రాష్ట్రాల హక్కులను బలహీన పరచటం! సెక్షన్ 17(8)లో సూచించిన ‘కేంద్ర అక్రెడిటేషన్ వ్యవస్థ’ వల్ల, ఒకసారి కేంద్రం నుండి అక్రెడిటేషన్ పొందిన కంపెనీలు అన్ని రాష్ట్రాల్లో ఆటోమే టిక్గా నమోదు అయినట్లే! రాష్ట్రాలు సాంకేతిక, ఆర్థిక, వసతి కారణాల మీద ఆ కంపెనీలను నిరాకరించలేవు. సెక్షన్లు 38, 41తో కలిపి చూస్తే, ఈ బిల్లు రాష్ట్రాల విత్తన పాలనా హక్కులను దాదాపుగా తొలగిస్తుంది.వెరైటీ ట్రయల్స్, సర్టిఫికేషన్లో విదేశీ సంస్థలను అనుమతించే నిబంధనలు దీనికంటే ప్రమాదకరమైనవి. ఐసీఏఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థానిక శాస్త్రీయ పరీక్షలను పక్కన పెట్టి, విదేశీ ట్రయల్ డేటాకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత వాతావరణానికి సరిపోని వెరైటీలు వేగంగా మార్కెట్లోకి రావచ్చు. ఇది విత్తన స్వావ లంబనకు ముప్పు. జన్యుమార్పిడి పంటలు (జీఎం) లేదా ‘ప్రొప్రై టరీ హైబ్రిడ్స్’ నిర్బంధం లేకుండా ప్రవేశించే పరిస్థితి వస్తుంది. కమ్యూనిటీ విత్తన వ్యవస్థలు, ఇప్పటికీ అనేక పంటలలో ప్రధాన విత్తన వనరుల గురించి బిల్లులో కేవలం ప్రస్తావన స్థాయిలోనే చూపారు. రైతు–బ్రీడర్ల హక్కులు, ఎఫ్పీఓలు చేసే స్థానిక విత్తన వ్యాపారం, కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు–వీటిని బలపరచడంలో బిల్లు పూర్తిగా విఫలమైంది. కాంట్రాక్ట్ ఆధారంగా విత్తనాలు ఉత్పత్తి చేసే విత్తన రైతుల హక్కులను కూడా పూర్తిగా పట్టించుకోలేదు.పాలనా నిర్మాణం అంతా కూడా కేంద్రీకృతమైపోయింది. రైతుల ప్రతినిధులు సెంట్రల్ కమిటీలో కొన్ని రొటేటింగ్ సీట్లు పొందినా, ఎన్ఫోర్స్మెంట్ లేదా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ వ్యవస్థల్లో వారికి ప్రత్యక్ష పాత్ర లేదు. దీని వల్ల పెద్ద కంపెనీలు వ్యవస్థను సులభంగా తమ వైపు తిప్పుకోగలవు. చిన్న డీలర్లు, చిన్న కంపెనీలు మాత్రమే నియంత్రణ బరువును మోస్తాయి.మరి బిల్లు ఎలా ఉండాలి?నిజమైన రైతు కేంద్రీకృత విత్తన చట్టం ఎలా ఉండాలంటే:1. నష్ట పరిహారం ఆటోమేటిక్ కాల పరిమితితో, పంట నష్టానికి అనుసంధానంగా ఉండాలి. కంపెనీల నుంచే సీడ్ లయబిలిటీ ఫండ్ ఏర్పడాలి. 2. విత్తన ధరలు, రాయల్టీలను శాశ్వతంగా నియంత్రించే స్వతంత్ర సంస్థ ఉండాలి. అందులో రైతులు, రాష్ట్రాలు, శాస్త్రవేత్త లకు భాగస్వామ్యం ఉండాలి. 3. స్థానిక అవసరాల ప్రకారం విత్తన రకాలను అనుమతించడానికి/నిరాకరించడానికి రాష్ట్రాలకు పూర్ణ అధికారం ఉండాలి. 4. రైతు బ్రీడర్లను, కమ్యూనిటీ సీడ్ వ్యవస్థలను బలపరచాలి. 5. సీడ్ ప్రొడ్యూసర్ రైతులకు న్యాయమైన కాంట్రా క్టులు, కచ్చితమైన చెల్లింపులు, రక్షణ ఇవ్వాలి. 6. లెసెన్సింగ్, ట్రేస బిలిటీ రెండూ తప్పనిసరి కావాలి. 7. జెర్మినేషన్, పేరెంటేజ్, రాయల్టీ, రిజిస్ట్రేషన్ వివరాలపై పూర్తి పారదర్శకత ఉండాలి.8. ‘పీపీవీ అండ్ ఎఫ్ఆర్’ చట్టంలోని రైతుల హక్కులు బలపడాలి తప్ప బలహీనపడకూడదు. ‘విత్తనాల బిల్లు 2025’ భారత విత్తన వ్యవస్థను సమానత్వం, ప్రతిస్పందనశీలత, స్వావలంబన దిశగా మలిచే అవకాశం. కానీ బిల్లు రైతుల రక్షణ కంటే వ్యాపార నిర్వహణ సులభతరంపై ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే, ఆ అవకాశం వృథా అవుతుంది. బిల్లుకు తుది రూపం దిద్దేముందు రైతు సంఘాలు, రాష్ట్రాలు, శాస్త్ర సమాజం, ప్రజా పరిశోధనా సంస్థలతో కేంద్రం అర్థవంతమైన సంప్రదింపులు జరపాలి. విత్తనం వేస్తున్న రైతు ప్రమాదం భరించాల్సిన చివరి వ్యక్తి కాకుండా ఉండేలా చట్టాన్ని పునర్నిర్మించాలి. డా. జి.వి.రామాంజనేయులు వ్యాసకర్త ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
అతిపెద్ద ఆలయం ఎక్కడ ఉందంటే..!
ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం అనగానే భారత్లోనే ఎక్కడ అని ఆత్రుతగా వెతక్కండి. ఎందుకంటే..అతి పెద్ద ఆలయం మన ఇండియాలో లేదు కంబోడియాలో ఉంది. చుట్టూ కందకంతో చుట్టుబడి అద్భుతానికి ప్రతిరూపంలా అలారారుతోంది ఆ ఆలయం. అది హిందూ దేవాలయమేనా కాదా అనేది చరిత్రకే తెలియని ఓ మిస్టరీ. ఇప్పటికీ ఈ దేవాలయం చర్చనీయాంశంగా ఉంటుందట. ఎందుకంటే ఇందులో అడగడుగున కనిపించే అద్భుతమైన కళా సంపద, ఆ గోడలపై కనిపించే రాతి కళా నైపుణ్యం మనల్ని కట్టిపడేయడమే కాదు..ఎన్నో అనుమానాలు, సందేహాలను రేకెత్తిస్తుంటదట. మరి అలాంటి ఆలయం ప్రత్యేకత గురించి సవివరంగా చూద్దామా..!.యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు దక్కించుక్ను కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం దాదాపు 400 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. కంబోడియాలోని ఒక అందమైన, కందకంతో చుట్టుముట్టిన అంగ్కోర్ వాట్ దేవాలయం అతి పెద్ద ఆలయంగా ఖ్యాతీ దక్కించుకుంది. ప్రతి ఏడాది వేలాదిగా ప్రయాణికులను మంత్రముగ్ధులన్ని చేసే ఈ గుడి గొప్ప సంక్లిష్టంగా చెక్కిన ఆలయ సముదాయం. నిజానికి ఈ దేవాలయం దానికదే ఓ పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది అందులోకి అడుగుపెట్టగానే. దీన్ని 12వ శతాబ్దం ప్రారంభంలో ఖైమర్ రాజు సూర్యవర్మన్ II విష్ణువు దేవుని కోసం నిర్మించిన స్మారక చిహ్నంగా చెబుతుంటారు. పశ్చిమాన ఉన్న అరుదైన ఆగ్నేయాసియా దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. అంతేగాదు అంగ్కోర్ పురావస్తు ఉద్యానవనానికి కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఉంది. అది హిందూ దేవాలయమా?నివేదికల ప్రకారం, అంగ్కోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద మత ఆయమే గానీ హిందూ దేవాలయమేనే అనేది నేటికి మిస్టరీనే. ఎందుకంటే దాని సంక్లిష్ట చరిత్ర కారణంగా దీనిని కొన్నిసార్లు హిందూ-బౌద్ధ దేవాలయం అని కూడా పిలుస్తారు. మొదట హిందూ దేవాలయంగా నిర్మించిన అంగ్కోర్ వాట్ శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. సియామ్ రీప్లోని అంగ్కోర్ ఖైమర్ రాజ్యానికి కేంద్రంగా ఉండేది. పైగా ఇది అనేక స్మారక చిహ్నాలు, పట్టణ ప్రణాళికలు, పెద్ద నీటి జలాశయాలను కలిగి ఉంది. అంగ్కోర్ లోపల, అంగ్కోర్ వాట్, బయోన్, ప్రీహ్ ఖాన్, టా ప్రోహ్మ్ వంటి దేవాలయాలు గొప్ప కళా సంపదకు నిలయంగా ఉన్నాయి.అయితే ఈ ప్రాంతంలో హిందూ మతం క్రమంగా తగ్గుముఖం పట్టి బౌద్ధమతం అభివృద్ధి చెందడంతో, ఆలయం కూడా క్షీణించకుండా దినదినాభివృద్ధి చెందింది. పైగా ఈ ఆలయానికే బౌద్ధ మందిరాలు కూడా జోడించారు. దాంతో చాలామంది సన్యాసులు ఇక్కడికి తరలివచ్చేవారు. అంగ్కోర్ సామ్రాజ్యంలోని ఇతర నిర్మాణాలను అడవి తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఈ ఆలయం చాలా కాలం పాటు సజీవంగా, ప్రార్థనా మందిరంగా ఉంది.వందలాది విభిన్న దేవాలయాలు, స్మారక చిహ్నాలకు నిలయంగా ఉన్న అంగ్కోర్ వాట్ ఆలయ సముదాయం గుండా నడవడం, రాతితో చెక్కిన పురాతన ఇతిహాసం గుండా ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. అర కిలోమీటరుకు పైగా విస్తరించి ఉన్న బాస్-రిలీఫ్ గ్యాలరీలు రామాయణం, మహాభారతం, ఖగోళ యుద్ధాలు, ప్రసిద్ధ క్షీర మహాసముద్ర మథనం వంటి దృశ్యాలను వర్ణిస్తాయి. అంగ్కోర్ వాట్ మూడు స్తంభాలు ఖైమర్ వాస్తుశిల్పానికి విలక్షణమైనది. పైగా హిందూ మతంలోని దేవతల నివాసమైన మౌంట్ మేరు సాంప్రదాయ ఆలయ శిఖరాన్ని(పర్వతాన్ని) సూచిస్తాయి. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్నట్లు కనిపించినా..దగ్గర నుంచి చేస్తే ఇప్పటికీ ఈ కట్టడం ఎలా మనగలిగింది అనే సందేహం మెదులుతుంటుంది.(చదవండి: రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి స్క్రాబుల్ గ్రాండ్మాస్టర్ టైటిల్! అసలేంటి గేమ్..) -
జట్టులో కీలక మార్పులు
-
త్వరలో భారత్ లో భారీగా భూకంపాలు
-
పసిడి ధరను నిర్దేశించే స్థాయికి భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పసిడి ధరను నిర్దేశించే స్థాయికి భారత్ త్వరలో ఎదుగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. రాబోయే దశాబ్దకాలంలో భారత పసిడి డిమాండ్లో 20 శాతం అవసరాలు దేశీయంగా బంగారం మైనింగ్ ద్వారా తీరుతుందని పేర్కొన్నాయి. 2047 నాటికి వికసిత్ భారత లక్ష్యం దిశగా దేశం ముందుకెళ్తున్న నేపథ్యంలో మైనింగ్ చాలా కీలకంగా ఉంటుందని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్వహించిన రత్నాభరణాల సదస్సులో పాల్గొన్న సందర్భంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజనల్ సీఈవో సచిన్ జైన్ చెప్పారు. పసిడి మైనింగ్లో ఉద్యోగాలు, విదేశీ పెట్టుబడులు గణనీయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. దేశీయంగా ప్రస్తుతం చెప్పుకోతగ్గ స్థాయిలో మైనింగ్, గోల్డ్ బ్యాంకింగ్ లేకపోవడం వల్ల వేరే వారు నిర్ణయించిన ధరను భారత్ పాటించాల్సి వస్తోందని, లండన్ ఏఎం, పీఎం బెంచ్మార్క్ ధరలపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా పరివర్తన చెందే కొద్దీ ధరలపై కూడా మనం ప్రభావం చూపగలిగే అవకాశం ఉంటుందని జైన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే రెండు మూడేళ్లలో భారత్ అంతర్జాతీయంగా కీలకమైన జ్యుయలరీ హబ్గా ఎదుగుతుందని చెప్పారు. -
భారత్ జీడీపీ వృద్ధి 6.6 శాతం
న్యూయార్క్/వాషింగ్టన్: భారత్ జీడీపీ 2025–26లో 6.6 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. జీఎస్టీ సంస్కరణలతో అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ల ప్రభావాన్ని భారత్ అధిగమిస్తుందని తెలిపింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును కొనసాగిస్తోంది. 2024–25లో 6.5 శాతం వృద్ధి అనంతరం, 2025–26 క్యూ1లో వాస్తవ జీడీపీ 7.8 శాతానికి విస్తరించింది’’అని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్య సాధనకు వీలుగా నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని సూచించింది. అంతర్జాతీయంగా సమస్యలు నెలకొన్నప్పటికీ దేశీయంగా సానుకూల పరిస్థితులతో వృద్ధి బలంగా ఉంటుందని అంచనా వేసింది. అమెరికా 50 శాతం టారిఫ్లు మరింత కాలం పాటు కొనసాగుతుతాయని అనుకుంటే అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ 2025–26లో 6.6 శాతం, తర్వాతి ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.3 శాతానికి తగ్గుతుంది’’అని ఐఎంఎఫ్ పేర్కొంది. సమీప కాలంలో రిస్క్ లు ఆర్థిక వృద్ధికి సంబంధించి సమీప కాలంలో రిస్్కలు ఉన్నట్టు ఐఎంఎఫ్ తెలిపింది. కొత్త వాణిజ్య ఒప్పందాలను త్వరగా ముగించడం, దేశీయంగా నిర్మాణాత్మక సంస్కరణలను వేగంగా అమలు చేయడం, ప్రైవేటు పెట్టబుడులు, ఉపాధి అవకాశాలపై వృద్ధి వేగం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. భౌగోళికంగా సమస్యలు మరింత పెరిగితే కఠినతర ఆర్థిక పరిస్థితులకు దారితీయొచ్చని, అధిక ముడి సరుకుల ధరలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎగుమతులు తగ్గడం వంటివి వృద్ధిని కిందకు తీసుకెళ్లే రిస్క్ లుగా ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం చక్కని నియంత్రణలో ఉండడాన్ని గుర్తు చేసింది. ఆర్థిక, కార్పొరేట్ రంగాలు బలంగా ఉండడం, తగినంత నగదు నిల్వలు, వసూలు కాని మొండి రుణాలు కనిష్ట స్తాయికి చేరడాన్ని సానుకూలతలుగా పేర్కొంది. -
61 శాతం భారత్ భూకంప జోన్లోకి..
ప్రపంచంలో పలు దేశాలను అల్లాడించిన భూకంపాలు త్వరలో భారత్పైకీ విరుచుకుపడే ప్రమాదం హెచ్చుగానే కనిపిస్తోంది. దేశంలో ఏకంగా 61 శాతం ప్రాంతం సాధారణం నుంచి ప్రమాదకర భూకంప రిస్కు పరిధిలోకి చేరడమే ఇందుకు కారణం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) కొత్తగా సవరించిన భూకంప డిజైన్ కోడ్ ఈ ప్రమాదకర విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, పొంచి ఉన్న భూకంప ప్రమాద తీవ్రతను తెలియజెప్పేందుకు కొత్తగా ‘అత్యంత ఎక్కువ రిస్కు’జోన్ కేటగిరీని కూడా చేర్చింది. మొత్తం హిమాలయ ప్రాంతమంతటినీ జోన్–6గా పేర్కొన్న ఈ కేటగిరీలోకే చేర్చడం మరింత ఆందోళన పడాల్సిన అంశం! ఇప్పడేం మారింది? హిమాలయాలు గతంలో 4, 5 జోన్ల పరిధిలో ఉండేవి. ఆ ప్రాంతమంతా నిజానికి ఒకే టెక్టానిక్ పలకపై ఉన్నా భూకంప రిస్కు తీవ్రతలో తేడా ఆధారంగా అప్పట్లో అలా విభజన చేశారు. అయితే ఆ క్రమంలో భూ లోతుల్లోని పొడవాటి అగాధపు ప్రాంతాలతో పొంచి ఉన్న ముప్పును సరిగా మదింపు చేయడంలో విఫలమైనట్టు సైంటిస్టులే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా మధ్య హిమాలయ ప్రాంతాల్లో పలు అత్యధిక భూకంప రిసు్కన్న పలు భూభాగాలు ఈ తప్పిదం వల్ల సాధారణ రిసు్కన్నవిగా పరిగణన పొందుతూ వచ్చాయి. దాన్నిప్పుడు సరిచేసినట్టు బీఐఎస్ వెల్లడించింది. నిజానికి మధ్య హిమాలయ ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాల్లో భూకంపం జాడలు కూడా కని్పంచలేదు. అంత మాత్రాన అక్కడ అంతా సజావుగా ఉన్నట్టు అసలే కాదని బీఐఎస్ పేర్కొంది. ఎందుకిలా డేంజర్ జోన్లోకి? హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుగ్గా ఢీకొట్టే టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉన్నాయి. మరోలా చెప్పాలంటే ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశమున్న మందుపాతరపై ఉన్నాయన్నమాట. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేíÙయన్ ప్లేట్లోకి చొచ్చుకుపోతూ వస్తోంది. ఫలితంగా ఏటా కనీసం 5 సెంటీమీటర్ల మేరకు అందులోకి చొరబడుతూ వెళ్తోంది. రెండు ప్లేట్లు ఢీకొంటున్న కారణంగానే అక్కడ భూ ఉపరితలం పైపైకి పెరుగుతూ వస్తోంది. హిమాలయాల ఆవిర్భావానికి మూలకారణం కూడా ఇదే. ఎవరెస్టుతో పాటు ప్రపంచంలోకెల్లా పలు పర్వత శిఖరాలు హిమాలయాల్లోనే ఉండేందుకూ ఇదే కారణం. కనుక అవి చల్లగా కని్పంచేది కేవలం పైకి మాత్రమే. ఈ టెక్టానిక్ ఒత్తిడి మూలంగా హిమాలయ గర్భమంతా నిత్యం అలజడిమయంగానే ఉంటూ ఉంటుంది. టెక్టానిక్ పలకల పరస్పర తాకిడి భూ కేంద్రంపైనా విపరీతమైన ఒత్తిడికి కారణమవుతోంది.ఆ ఒత్తిడి ఎప్పుడో ఓసారి హఠాత్తుగా విడుదలవుతుంటుంది. అది కాస్తా అత్యంత శక్తిమంతమైన భూకంపాల రూపంలో పైకి ఎగదన్నుకొస్తుంది. ఇది చాలదన్నట్టు భూమ్మీద అత్యంత అస్థిరమైన పర్వత ప్రాంతం హిమాలయాలే. వయసుపరంగా అన్ని పర్వతాల కంటే చిన్నవి కూడా. దాంతో హిమాలయాల్లోని రాళ్లు తదితరాలు నిత్యం అటూఇటూ మంద్రస్థాయిలో కదలాడుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ గనక భూకంపం సంభవిస్తే అతి అత్యంత ప్రాణాంతకమే అవుతుంది. అంతా అక్కడే! మెయిన్ బౌండరీ, మెయిన్ సెంట్రల్, మెయిన్ ఫ్రంటల్... ఇలా భూ కేంద్రంలోని ప్రధాన ఫాల్ట్ సిస్టమ్స్ (భారీ రంధ్రాలని చెప్పుకోవచ్చు)లో అతి పెద్దవన్నీ హిమాలయాల కిందే కేంద్రీకృతమై ఉన్నాయి. అంతేగాక పలు భూకంప విరామ ప్రాంతాలు (కొన్ని శతాబ్దాలుగా అసలు భూకంపమే రానివి) కూడా హిమాలయాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు. అలాంటి ప్రాంతాల్లో భారీ భూకంపానికి ఎప్పుడైనా ఆస్కారం పుష్కలంగా ఉంటుందట. కర్ణుని చావుకు మాదిరిగా ఇన్ని కారణాలు కలగలిసి హిమాలయాలను ప్రపంచంలోకెల్లా భూకంప రిస్కు అత్యంత ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలోకి చేర్చేశాయి. హిమాలయాల్లోని డెహ్రాడూన్, మొహంద్తో పాటు మొత్తం ఉత్తరాఖండ్ అంతా తాజాగా భూకంప డేంజర్ జోన్లోకి వచి్చంది. అక్కడ జనాభా నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వన్డే సమరానికి సై
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో అనూహ్యంగా చిత్తయిన తర్వాత ఇప్పుడు సొంతగడ్డపై మరో ఫార్మాట్లో పరువు నిలబెట్టుకునేందుకు భారత్ బరిలోకి దిగుతోంది. గత రెండేళ్లలో నిలకడగా రాణిస్తూ వరుస విజయాలు సాధించిన వన్డేల్లో అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టెస్టు జట్టుతో పోలిస్తే కెప్టెన్గా రాహుల్ రావడం సహా పలు మార్పులతో భారత్ సిద్ధం కాగా...చాలా కాలం తర్వాత భారత గడ్డపై ఆడుతున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలపైనే అందరి దృష్టీ నిలిచింది. మరో వైపు వన్డేల్లో ఇటీవల పెద్దగా రాణించలేకపోయినా... టెస్టు సిరీస్ విజయం ఇచి్చన ఉత్సాహంతో సఫారీ జట్టు మరో సంచలనాన్ని ఆశిస్తోంది. కెప్టెన్గా తెంబా బవుమా మరోసారి టీమ్ను విజయం దిశగా నడిపించాలని ఆశిస్తున్నాడు. రాంచీ: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) కారణంగా టెస్టు మ్యాచ్లకు, వచ్చే ఏడాది ఆరంభంలో ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టి20లపై ప్రస్తుతం అన్ని జట్లూ ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వన్డే మ్యాచ్ల ప్రాధాన్యత తాజా సీజన్లో కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే భారత గడ్డపై జరిగే ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్పైనైనా ఉండే ఆసక్తి వేరు. ఈ నేపథ్యంలో మరో వన్డే సిరీస్కు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల పోరులో భాగంగా నేడు తొలి వన్డే జరుగుతుంది. గత రెండు దశాబ్దాల్లో ఇరు జట్ల మధ్య 10 వన్డే సిరీస్లు జరగ్గా...చెరో ఐదు సిరీస్లు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా సమంగా ఉన్నాయి. జైస్వాల్, రుతురాజ్కు చాన్స్... దాదాపు నెల రోజుల క్రితం భారత జట్టు సిడ్నీలో తమ చివరి వన్డే ఆడింది. నాటి టీమ్తో పోలిస్తే రెండు తప్పనిసరి మార్పులు జట్టులో చోటు చేసుకున్నాయి. తొలి టెస్టులో గాయపడి ఆటకు దూరమైన గిల్ స్థానంలో ఓపెనర్గా యశస్వి జైస్వాల్ రానున్నాడు. గిల్ గైర్హాజరులో రాహుల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. మరో వైపు గాయంతోనే ఆటనుంచి తప్పుకున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో రుతురాజ్కు చోటు ఖాయమైంది. అయితే ఎప్పటిలాగే రోహిత్, కోహ్లిల గురించి మరో సారి చర్చ సాగుతోంది. 2027 వరల్డ్ కప్లో ఆడాలని పట్టుదలగా ఉన్న వీరిద్దరు ఎలాంటి అవకాశం వదులుకోరాదని భావిస్తున్నారు. సిడ్నీలో రోహిత్ సెంచరీలతో చెలరేగగా, కోహ్లి కూడా 74 పరుగులతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో వీరి ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. అభిమానుల కోణంలో చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో వీరు ఆఖరి సారిగా భారత గడ్డపై ఆడారు. ఇప్పుడు మైదానంలోకి దిగి సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లు ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది కాబట్టి నితీశ్ రెడ్డికి అవకాశం దక్కవచ్చు. మరో ముగ్గురు రెగ్యులర్ పేసర్లు హర్షిత్, ప్రసిధ్, అర్ష్ దీప్ ఆడే అవకాశం ఉంది. ఆ్రస్టేలియా సిరీస్తో చాన్స్ లభించని రవీంద్ర జడేజా మరోసారి తన స్థాయిని ప్రదర్శించాలని భావిస్తున్నాడు. పంత్కు తుది జట్టులో చోటు కష్టమే. మాథ్యూ బ్రీట్కీ జోరు కొనసాగేనా... చాలా కాలం తర్వాత దక్షిణాఫ్రికా వన్డేల్లో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. టాప్ పేసర్ రబాడ గాయంనుంచి పూర్తిగా కోలుకోలేదు కాబట్టి ఇక్కడా ఆడటం సందేహంగానే అనిపిస్తోంది. అయితే టెస్టుల్లో చెలరేగిన యాన్సెన్తో పాటు బర్గర్, ఎన్గిడి రూపంలో పదునైన పేసర్లు టీమ్లో ఉన్నారు. కేశవ్ మహరాజ్ స్పిన్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. సీనియర్ ప్లేయర్ డి కాక్తో పాటు ఐపీఎల్ స్టార్ బ్రెవిస్, మార్క్రమ్లపై ప్రధానంగా జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. మూడో స్థానంలో కెప్టెన్ బవుమా కీలక ఆటగాడు. అయితే ఇటీవల అందరికంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ప్లేయర్ మాథ్యూ బ్రీట్కీ. తన తొలి ఐదు వన్డేల్లోనే ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన ప్లేయర్గా అందరి దృష్టిలో పడిన బ్రీట్కీ భారత గడ్డపై ఎలా ఆడతాడో చూడాలి.పిచ్, వాతావరణంఅటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమానంగా అనుకూలించే సాధారణ వికెట్. గతంలో జరిగిన ఐదు వన్డేల్లో ఒకే ఒక్కసారి స్కోరు 300 దాటింది కాబట్టి పరుగుల వరద పారించే మైదానం మాత్రం కాదు. వాతావరణం అనుకూలంగా ఉంది. వర్షసూచన లేదు. మంచు ప్రభావం లేకపోతే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.తుది జట్ల వివరాలు (అంచనా)భారత్: రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, కోహ్లి, రుతురాజ్, సుందర్, జడేజా, నితీశ్ రెడ్డి, హర్షిత్, అర్ష్ దీప్, ప్రసిధ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), మార్క్రమ్, డి కాక్, బ్రీట్కీ, బ్రెవిస్, హెర్మన్, యాన్సెన్, బాష్, మహరాజ్, బర్గర్, ఎన్గిడి. -
అందరికీ ఆహార భద్రత ఓ ఎండమావేనా!
దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో మొదటిది ఆహార భద్రత. ప్రపంచ ఆహార భద్రత సూచీ ప్రకారం 2022 నాటికి 113 ప్రధాన దేశాలలో భారత్ 68వ స్థానం పొందగా 2024 నాటికి, అంటే రెండేళ్ల తర్వాత 127 ప్రధాన దేశాలలో 105వ స్థానానికి దిగజారింది. దేశ జనాభాలో ఆకలితో బాధపడుతున్న వారిసంఖ్య 22 కోట్లుగా అంచనా వేస్తుండగా, అందులో అధిక శాతం మంది వ్యవసాయం వృత్తిగా చేసుకొన్న రైతులు, రైతు కూలీల కుటుంబాల వారే. దేశ జనాభాకు తిండిగింజల్ని పండిస్తున్న రైతాంగమే కడుపు నిండా తిండికి నోచుకోకపోవడం అన్నది జీర్ణించుకోలేని చేదు వాస్తవం. ఇతర రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగంలో ఆదాయాలు పెరగడం లేదు. జాతీయ శాంపుల్ సర్వే ప్రకారం 1960–2020 మధ్య వ్యవసాయ రంగంలో నికరా దాయం 4 రెట్లు మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో పారిశ్రామిక నికరాదాయం 75 రెట్లు పెరిగింది. 2004లో ఒక వ్యవసాయ రంగ శ్రామికుడి ఉత్పాదకత రూ. 11,964 ఉండగా, పారిశ్రామిక రంగ కార్మికుడి ఉత్పాదకత రూ. 66,323గా ఉన్నట్లు తేలింది. అంటే ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు వ్యవసాయదారుల కంటే ఎక్కువ ఆదాయం వస్తోందన్నమాట! ఈ కారణంగానే కార్మికులు, కూలీలు వ్యవసాయ రంగాన్ని వీడి పెద్ద సంఖ్యలో ఇతర రంగాల వైపు మళ్లుతున్నారు. ప్రతీ ఏటా సాగు ఖర్చులు నిరంతరంగా పెరుగు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటేటా 14 ప్రధాన పంటలకు కొంతమేర కనీస మద్దతు ధరల్ని పెంచుతున్న మాట నిజమే గానీ, ఆ పెరిగే మొత్తం రైతు కుటుంబ, సాగు ఖర్చులను పూడ్చలేక పోతున్నాయి. హరిత విప్లవం స్ఫూర్తిగా...దేశంలో 1950 దశకం చివర్లో వచ్చిన ‘హరితవిప్లవం’ కారణంగా వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పెరిగాయి. హరిత విప్లవం నాటి సమయంలో దేశంలోని పలు రాష్ట్రాలు వ్యవసాయ, భూ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశాయి. అధిక దిగుబడి సామర్థ్యం గల వంగడాలను ప్రవేశపెట్టాయి. బంజరు భూములు సాగులోకి వచ్చాయి. సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువుల ఉపయోగం మొదలైంది. యంత్రాల వినియోగం కూడా రావడంతో సకాలంలో వ్యవసాయ పనులు పూర్తికావడం సాధ్యమైంది. గోధుమ, వరి, నూనె గింజలు, పప్పు ధాన్యాలు పుష్కలంగా పండి వాటి ఉత్పత్తి సాలీనా 7 శాతం చొప్పున పెరిగింది. దాంతో, ప్రజల అవసరాలకు పోను కొంతమేర ఎగుమతులు చేసే స్థాయికి దేశం చేరింది. ఇప్పుడు దేశంలో సాగు భూములు క్రమంగా కుంచించుకు పోతున్నాయి. వ్యవ సాయ యోగ్యమైన భూముల్ని పారిశ్రామిక వాడలుగా, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేయటం గత దశాబ్దకాలంగా ఎక్కువైంది. హరిత విప్లవమే కాదు... 1980–90 మధ్యకాలంలో పాల ఉత్పత్తిని పెంచడానికి పలు చర్యలు చేపట్టి శ్వేత విప్లవాన్ని సాధ్యం చేశారు. చేపలు, రొయ్యల ఉత్పత్తుల తలసరి లభ్యతను పెంచి నీలి విప్లవాన్నీ, అలాగే నూనెగింజల ఉత్పత్తిలో అనూహ్య వృద్ధిని సాధించి ‘బ్రౌన్ రివల్యూషన్ను సాధించిన ఘనత మనది. అయితే ‘అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి దప్పులు మరొక చోట’ అన్నట్లుగా తలసరి ఆహార ధాన్యాల లభ్యత పెరిగినప్పటికీ దేశాన్ని ఆకలి రహిత భారత్గా తీర్చిదిద్దలేక పోవడం లోపమే!ప్రజలందరికీ ఆహార భద్రత ఉండాలంటే ఏడాది పొడవునా వారికి ఉపాధి, మెరుగైన ఆదాయం లభించాలి. అరకొరగా తీసుకొనే ఆహారంలో తగినన్ని పోషకాలు లేకపోవడంతో వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఆహార భద్రతకు తోడుగా పోషకాహార భద్రత కల్పించాలంటే, ప్రజల ఆహార అలవాట్లను మార్చాలి. ఇటీవలి కాలంలో పాతకాలపు ఆహారపు అలవాట్లకు మెజారిటీ ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అంటే, వరి అన్నానికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలైన, జొన్న, సజ్జ, రాగులు, ఊదలు, కొర్రలు వంటివాటిని ఎక్కువగా తీసుకొంటున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలతో పాటు చిరు ధాన్యాలను కూడా తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలి.ప్రజలందరికీ ఆహార భద్రత చేకూరాలంటే ముందుగా రైతులకు ఆదాయ భద్రత కలగాలి. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది గానీ అది ఆచరణలో అరకొరగానే అమలు జరుగుతోంది. రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయరంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరగాలి, మౌలిక సదుపాయాలు, గిడ్డంగుల సౌకర్యం మెరుగుపడాలి. వ్యవసాయ దిగుమతులు తగ్గాలి. సాగు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి. ఆహార భద్రత అనే అంశం రైతాంగం ఆదాయ భద్రతతో ముడిపడి ఉందనే వాస్తవాన్ని గ్రహించనంత వరకూ, ఆ దిశగా చర్యలు చేపట్టనంత వరకూ అందరికీ ఆహార భద్రత అన్నది ఓ ఎండమావిగానే మిగిలిపోతుంది.డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త మాజీ కేంద్ర మంత్రి, శాసన మండలి సభ్యులు -
భారీగా పెరిగిన బంగారం ధర
-
భారత్–రష్యా బంధానికి కొత్త శక్తి!
న్యూఢిల్లీ: రష్యా అధినేత పుతిన్ వచ్చేనెల 4, 5వ తేదీల్లో భారత్లో పర్యటించబోతున్నారు. 23వ ఇండియా–రష్యా వార్షిక సదస్సుకు ఆయన హాజరవుతారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ రాబోతున్నారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. పుతిన్ అధికారిక పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల మరింత బలపడడానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ తదితర రంగాల్లో కీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పుతిన్–మోదీ భేటీ తర్వాత ఉమ్మడి ప్రకటన విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పుతిన్ రాకతో భారత్–రష్యా బంధానికి నూతన శక్తి లభించడం తథ్యమని అంటున్నారు. ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లు? స్థానిక కరెన్సీల్లో వాణిజ్య లావాదేవీలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ఇంధన రంగంలో సహకారం, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై పుతిన్, మోదీ చర్చించబోతున్నారు. పౌర అణు ఇంధన రంగంలో సహకారంపైనా సంప్రదింపులు జరుగనున్నాయి. అంతేకాకుండా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల్లో పురోగతిని వారు సమీక్షిస్తారు. ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకుంటారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రష్యా అధ్యక్షుడి గౌరవార్థం ప్రత్యేక విందు ఇవ్వబోతున్నారు. మరోవైపు రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాల కొనుగోలుపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే ఎస్–400 మిస్సైల్ వ్యవస్థలను అదనంగా కొనుగోలు చేయడంపై పుతిన్పై చర్చించనున్నట్లు సమాచారం. భారత్కు పుతిన్ శుభవార్త చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లను ఆయన ప్రకటించే వీలుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇటీవలి కాలంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. చమురు ఎగుమతులను భారీగా పెంచాలని పుతిన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. పుతిన్ చివరిసారిగా 2021లో ఇండియాలో పర్యటించారు. గత ఏడాది జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించి, పుతిన్తో భేటీ అయ్యారు. భారత్–అమెరికా సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో ఏనాడూ లేనంతగా బలహీనపడిన సమయంలో పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సమాజం ఎవరికీ పట్టదా?
సమాజం పరిస్థితి తీవ్రమైన విచారాన్ని కలిగిస్తున్నది. ఈ మాట అంటున్నది అభివృద్ధి, పేదరికం, అవినీతి, తారతమ్యాలు, కులతత్వం, మతతత్వం వంటి విషయాల గురించి కాదు. ఆ సమస్యలపై చర్చలు ఎప్పుడూ జరుగుతున్నవే. ఉద్యమాలూ సాగుతున్నవే. అందుకు పరిష్కారాలపై అనేక థియరీలు, ఆలోచనలు చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తావిస్తున్నది వీటన్నింటికి భిన్నమైనది. కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, వ్యక్తులకు తమతో తమకు ఉండే ఆత్మ సంబంధాలు, ఈ సంబంధాలకు ఆలవాలమయే విలువల గురించి. ఇవి అన్నింటికీ అన్నీ క్రమక్రమంగా క్షీణిస్తుండటం గురించి.సామాజిక క్షీణత ఆ యా కాల పరిస్థితులను బట్టి ఈ సంబంధాలు బలంగా ఉండటం, బలహీనపడటం జరుగుతూనే ఉంటుంది. అది సాధారణ స్థాయిలో ఉండటానికీ, ఒక ధోరణిగా మారి తీవ్రతరం కావటానికీ తేడా ఉంది. దానికదే ఒక ఆందోళనకరమైన స్థితి కాగా, అంతే ఆందోళన కలిగిస్తున్నది మరొకటి ఉంది. అది, ఈ విషయమై ఎవరికీ పట్టినట్లు లేకపోవటం. ప్రభుత్వం, పార్టీలు, పెద్దలు, మేధావులు, రచయితలు, కళాకారులు, వివిధ మతాల పెద్దలు, గురువులు, సంస్కర్తలు, లెక్క లేనంతగా ఉన్న సంఘాల వారు, ఆ యా ఇజాల వారు. అందరికీ అందరూ. ఎవరికి ఏదీ పట్టడం లేదు. ఒక మాట సూటిగా చెప్పుకోవాలంటే, మనుషులు తమను తాము చంపుకోవటం, ఇతరులను చంపటం ఎక్కువవుతున్నాయి. అందుకు స్థూలంగా కనిపిస్తున్న కారణాలు ఆర్థికం, లైంగికం, మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం, బలహీనపడుతున్న కుటుంబ సంబంధాలు, పెరిగిపోతున్న అసహనం వంటివి. ఇది స్థూలమైన పరిభాష. వీటిలో ఒక్కొక్క అంశాన్ని విడిగా పరిశీలిస్తే అన్నింటికీ కలిపి ఒక సమగ్ర సామాజిక స్థితి కనిపిస్తుంది. ఈ అంశాలలో కొన్నింటికి పరస్పర సంబంధం ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. వాటి జమిలి ప్రభావాలతో మన సమాజం, మనుషులు, కుటుంబాలు ప్రమాదానికి గురవుతున్నాయి. వాస్తవానికి ఇటువంటి అధ్యయనాలను సామాజిక శాస్త్రజ్ఞులు చేయాలి. సమాజ అధ్యయన శాస్త్రంలోకి రాజకీయం, ఆర్థికం, సమాజ సంస్కృతి, కుటుంబం, వ్యక్తిత్వ రూపకల్పనలు, మానసికతలు వీటన్నింటి పరస్పర సంబంధాలు, పరిణామాలు, మంచి చెడులు అన్నీ వస్తాయి. సామాజిక శాస్త్రం మనకు శ్రీకృష్ణుని నోటిలో సమస్త విశ్వ సందర్శనం వంటిది. కానీ దురదృష్టవశాత్తు, ఇతరత్రా మన విద్యా రంగాల వలె, సామా జిక శాస్త్ర విభాగాలు కూడా బలహీనపడుతూ, ఇటువంటి అధ్యయ నాలు చేయటం లేదు. తెలుగు రాష్ట్రాలలోని ఈ విభాగాల వారికి ఆ స్పృహ అయినా ఉన్నట్లు లేదు.చెదురుతున్న సంబంధాలువివరాలలోకి వెళితే, పైన పేర్కొన్న కారణాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు జరగని రోజంటూ ఉండటం లేదు. డబ్బు, వ్యసనాలు, లైంగికాలు, హీన సంస్కృతి, వినియోగదారీతత్వం పాత్రలు పెరుగుతూ, మనుషులకు తమతో తమకు స్వీయ సంబంధాలు, వ్యక్తిత్వాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాల పాత్రలు, అనుబంధాలు బలహీనపడి అప్రధానమవుతున్నాయి. ధన ప్రభావం, క్రమంగా వ్యాపిస్తున్న కొత్త కన్జూమరిజం, కొత్త సంస్కృతి ప్రభావం పట్టణ ప్రాంతాలకు, కొన్ని తరగతులకు పరిమితమై ఉండక గ్రామాలకూ, అన్ని తరగతులకూ విస్తరిస్తున్నది. పట్టణాలకు ఎక్స్పోజర్, కొత్త మీడియా, వినోదం, బలహీనపడిన విద్య, కుటుంబ శిక్షణలు, క్రమశిక్షణలు, కన్జూమరిజం పెంచుతున్న కోరికలు ఈ సరిహద్దులను చెరిపివేస్తున్నాయి. అది జరిగినప్పుడు మనిషి ఒక భిన్నమైన ప్రపంచంలోకి ప్రవేశించటంతో మొదట తనతో తనకే స్వీయ సంబంధం చెదిరిపోతుంది. వ్యక్తిత్వం కలుషి తమవుతుంది. ఒకసారి అది జరగటం మొదలైతే కుటుంబంతో, ఇతర వ్యక్తులతో, సమాజంతో సంబంధాలు చెదిరిపోవటమన్నది తార్కికమైన సహజ పరిణామం. అది, వేర్లకు పురుగుపట్టిన చెట్లు మామూలు గాలికే కూలిపోవటం వంటిది. అట్లా కూలటంలో భాగంగానే అన్ని విధాలైన సంస్కారాలూ దెబ్బతిని వ్యక్తులు ఆత్మహత్యలకు, హత్యలకు, కుటుంబ సభ్యులపై దాడికి, లైంగిక నేరాలకు, ఇతర నేరాలకు, వ్యసనాలకు, తత్సంబంధిత అకృత్యాలకు పాల్ప డటం పెరుగుతున్నది. ఇదే సామాజిక క్షీణ స్థితి. పైన చెప్పుకున్నట్లు, ఇటువంటి స్థితి ఏర్పడటం వర్తమానకాల పరిస్థితుల ప్రభావంతో జరుగుతున్నది. అటువంటికాల పరిస్థితులకు పరిష్కారం ఏమిటన్నది ఒక ప్రశ్న కాగా, పరిష్కార ప్రయత్నాలు ఒక స్థాయిలో జరుగుతూనే వీలైనంత నివారణ ప్రయత్నాలు కూడా ఏమి జరగాలన్నది మరొక ప్రశ్న. ఈ ధోరణిని భిన్న కోణాల నుంచి మౌలికంగా ఎదుర్కోవటం, పరిష్కరించటం, ప్రభుత్వాలు విధానపరంగా తీసుకోగల చర్యలపై ఎక్కువగా ఆధారపడిఉంటుంది. పైన పేర్కొన్న వివిధ సమస్యలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు సాధ్యమే. విద్య, వినోదం, ఆర్థికం, కొత్త తరహా మీడియా, కన్జూమరిజం, సమస్త అంశాలలో డబ్బు పాత్ర మొదలైనవి విధానపరమైన నిర్ణయాల పరిధిలోకి రాగలవు.క్రియాశీలంగా మారితేనే...కానీ, అది మాత్రమే ఎంత మాత్రం చాలదు. అందుకు సమాజ పరంగా జరిగేది సరిసమానంగా అనుబంధం కావాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు, సమాజం ఏదీ శ్రద్ధ చూపటం లేదన్నది సమస్యగా మారింది. ఒకోసారి ప్రభుత్వం ఎట్లా వ్యవహరించినా కనీసం సామాజికులు, సంస్కర్తలు, మత పెద్దలు, మేధావులు, రచయితలు, కళాకారులు ఇటువంటి పరిస్థితుల పట్ల ఆందోళన చెంది చైతన్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తారు. సంస్కరణోద్యమాలు తెస్తారు. ఆ విధంగా పాలకులపై కూడా ఒత్తిడిని సృష్టిస్తారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చూపినా ఇటువంటి సామాజిక వర్గాల క్రియాశీలతపై సమాజాలు ఆశలు పెట్టుకుంటాయి. కానీ ఈ వర్గాలు నిష్క్రియాపరంగా మారటం ఇంకా పెద్ద సమస్య అవుతున్నది. వారికి రాజకీయాలపై ఉన్న ఆసక్తి సమాజం పట్ల కలగటం లేదు. కనీసం ఇప్పటికైనా, ఈ సామాజిక ఉపద్రవం మరింత తీవ్రంగా మారకముందే, ఈ వర్గాలు కళ్ళు తెరవటం అవసరం. లేనట్లయితే, కొంతకాలంగా మారుతున్న కాల పరిస్థితుల ప్రభావాలు పెరిగి సమాజం మరింత ప్రమాదకరం అవుతుంది. టంకశాల అశోక్-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మళ్లీ క్రీడా సంరంభం
ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావించే కామన్వెల్త్ శతవార్షిక క్రీడా సంరంభం 2030లో నిర్వహించే అవకాశం లాంఛనంగా మన దేశానికి దక్కింది. గత నెలలో కామన్వెల్త్ క్రీడల కార్యనిర్వహణా బోర్డు ఈ క్రీడోత్సవాలకు అహ్మదాబాద్ వేదికైతే బాగుంటుందని సిఫార్సు చేసింది. మనతోపాటు నైజీరియా కూడా పోటీపడినా ఇంత పెద్ద ఉత్సవాన్ని నిర్వహించగల సామర్థ్యం భారత్కే ఉన్నదని మెజారిటీ సభ్యులు భావించారు. కామన్వెల్త్ క్రీడల్లో దాదాపు వంద దేశాలకు చెందిన వేలాది మంది మెరికల్లాంటి క్రీడాకారులు, క్రీడాకారిణులు పాల్గొంటారు. బహుళ మాధ్యమాల ప్రభావం ఎంతగానో పెరిగిన వర్తమానంలో ఈ క్రీడలు యువతపై చూపే ప్రభావం అపారం. అయితే అట్టహాసంగా నిర్వహించటం, పరమాద్భుతమని ప్రపంచం మెచ్చటంతోనే సంతృప్తిపడకూడదు. 2036లో ఒలింపిక్ క్రీడోత్సవాల నిర్వహణకు సైతం భారత్ సంసిద్ధంగా ఉన్నదని ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకెళ్లాలి. ఈ సందర్భంలో 2010 నాటి కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో మనకెదురైన చేదు అనుభవాలు, తత్కారణంగా మన దేశం అభాసుపాలైన వైనమూ దృష్టిలో పెట్టుకోవాలి. అప్పటికే మనకు పలు క్రీడోత్సవాలు నిర్వహించిన నేపథ్యం ఉంది. 1951, 1982 సంవత్సరాల్లో ఆసియా క్రీడోత్సవాలు నిర్వహించాం. 2003లో ఆఫ్రో–ఆసియన్ క్రీడలకు భారత్ వేదిక పరిచింది. ఇక క్రికెట్ టోర్నమెంట్లు, హాకీ ప్రపంచ కప్ ఈవెంట్లు దేశంలో పలు నగరాల్లో నిర్వహించిన అనుభవం ఉంది. అయినా 2010 కామన్వెల్త్ క్రీడోత్సవాల నిర్వహణ అసమర్థంగా, కుంభకోణాలమయంగా మారడం, అందరూ మనల్ని వేలెత్తి చూపే దుఃస్థితి ఏర్పడటం ఎవరూ మరిచిపోలేరు. భారీ మొత్తాలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం, నాసిరకం నిర్మాణ పనులు, అవి కూడా సమయానికి పూర్తికాకపోవటం, ఆర్థిక అవకతవకలు, విధానపరమైన ఉల్లంఘనలు దిగ్భ్రాంతిపరిచాయి. సీబీఐ దర్యాప్తు, అప్పటి కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ అరెస్టు కావటం, నిర్మాణ పనుల్లో ఏమాత్రం అనుభవం లేనివారికి కాంట్రాక్టులు అప్పగించారనీ, లంచాలు మెక్కి నాసిరకం ఉపకరణాలు కొన్నారనీ సీవీసీ తేల్చటం ఎవరూ మరిచిపోరు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రీడా బృందాలకు అద్భుతమైన సదుపాయాలున్న వసతి కల్పించి, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన బృందాలకు నాసిరకం వసతినిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తమపై జాతివివక్ష చూపారని ఆ దేశాల క్రీడాకారులు తీవ్ర విమర్శలు చేయటం దేశ ప్రతిష్ఠను మట్టిపాలు చేసింది. భారీ క్రీడోత్సవాలు జరగబోయే నగరాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తాయి. సరికొత్త స్టేడియాలు నిర్మాణమవుతాయి. ఆతిథ్యం ఇచ్చే దేశం గనుక ప్రతి ఈవెంట్లోనూ విజయం సాధించేలా క్రీడా బృందాల నైపుణ్యాలకు పదును బెడతారు. అథ్లెట్లకు మంచి సదుపాయాలతోపాటు మెరుగైన పారితోషికాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామస్థాయి వరకూ యువతలో క్రీడలపై ఉత్సాహాన్ని పెంచేలా చేయగలిగితే, ప్రాథమిక పాఠశాలలు మొదలుకొని విద్యా సంస్థ లన్నీ పిల్లల్లో క్రీడాసక్తిని పెంపొందిస్తే, క్రీడా ఉపకరణాల కొనుగోలుకూ, ఈవెంట్ల నిర్వహణకూ, విజేతలకు ప్రోత్సహకాలిచ్చేందుకూ ఇతోధిక కేటాయింపులు చేస్తే భవిష్య త్తరాలు పదునైన క్రీడాకారులను చూడగలుగుతాయి.స్టేడియంలో గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పక్షాల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టు తలపడటం ఒక్కటే కాదు క్రీడలంటే. అవి యువతకు శారీరక, మానసిక దృఢత్వాన్ని స్తాయి. క్రమశిక్షణను నేర్పుతాయి. నిబంధనల పరిమితుల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించి పైచేయి సాధించటానికి ఏం చేయాలన్న వ్యూహ రచనా నైపుణ్యాన్ని పెంచుతాయి. ఓటమిని సైతం అంగీకరించగల స్థైర్యాన్నందిస్తాయి. ఒక టీమ్గా కలిసి పనిచేయటం, ఆ క్షణమే దాని ఫలితాలు కళ్లెదుట కనబడటం క్రీడల్లోనే చూడగలం. అవి అహంభావం స్థానంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రతిష్ఠిస్తాయి. తనలోని దార్ఢ్యమెంతో, పరిమితులేమిటో గుర్తించటానికి క్రీడలే తోడ్పడతాయి. ఈసారి కుంభకోణాల క్రీనీడ పడకుండా నిర్వహించి శభాష్ అనిపించుకుంటామని మన ప్రతినిధులు హామీ ఇచ్చివచ్చారు. చూద్దాం... ఎంతవరకూ నిలబెట్టుకుంటారో! -
ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ .. మూడో ప్లేసులో భారత్
పుల్వామా అటాక్ కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల లోవీ ఇనిస్టిట్యూట్ చేపట్టిన సర్వేలో భారత్ 40 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. అమెరికా 80 పాయింట్లతో మెుదటి స్థానంలో నిలువగా చైనా 73.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. భారత్ తరువాత 38.8 తో జపాన్ , 32.1తో రష్యా వరుసగా , నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.అయితే రక్షణ నెట్ వర్క్ ల అంశంలో భారత్ రెండు స్థానాలు కోల్పోయి 11 స్థానంలో నిలిచింది. అదే పెట్టుబడులను ఆకర్షించే అంశంలో చైనాను వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ సూచికలో అమెరికా మెుదటి ప్లేస్ లో ఉంది. ఆర్థిక, మిలిటరీ రంగాలలో మంచి పురోగతి సాధించడంతోనే భారత్ ర్యాంకు మెరుగుపడిందని విశ్లేశకులు అంచనా వేస్తున్నారు. సాంకేతికత, పరపతి, అంతర్జాతీయ సంబంధాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను లోవీ ఇనిస్టిట్యూట్ ర్యాంకులను ప్రకటిస్తుంది. భారత్ సైనిక సామర్థ్యం ప్రస్తుతం ఎంతో మెరుగ్గా ఉందని సంస్థ పేర్కొంది. -
పుతిన్-మోదీ దోస్తీ.. టెన్షన్లో ట్రంప్!
ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యాపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ చమురు విషయంలో భారత్పై సుంకాల యుద్ధమే చేశారు. రెండు దఫాలుగా 50 శాతం అన్యాయంగా పన్నులు విధించారు. అయితే ఏకపక్ష నిర్ణయాలకు తాము తలొగ్గబోమని.. జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని భారత్ కుండబద్ధలు కొట్టింది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన పలు ప్రకటనలనూ (పాక్-భారత్ ఉద్రిక్తతలను ఆపానంటూ చేసినవి కూడా) ఖండించింది కూడా. ఈలోపు.. షాంగై సదస్సులో పుతిన్-మోదీ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావడంలాంటివి ట్రంప్కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆ రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని.. అవి ఎలా పోయినా తనకు సంబంధం లేదంటూ ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆయన స్వరం మారింది. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించబోతోందని.. ప్రధాని మోదీ మాట మీద తనకు నమ్మకం ఉందని.. భారత్తో అమెరికా అనుబంధం కొనసాగుతుందంటూ స్వరం మార్చారు. అఫ్కోర్స్ భారత్ వాటిని ఖండించింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్కు రానున్నారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాస్తవంగా ఈ ఇద్దరు శక్తివంతమైన నేతల భేటీపై గత ఆరు నెలలుగా ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వీళ్ల కలయిక అంటే ఏమాత్రం మిండుగు పడని ట్రంప్ ఎలా స్పందిస్తారో ? అనేదే అందుకు ప్రధాన కారణం. వాస్తవానికి రష్యా చమురును భారత్కు దూరం చేయాలని ట్రంప్ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే ఆ పాచికలేవీ పారలేదు. సరికదా ట్రంప్ నుంచి రష్యా చమురు సరఫరాదారులైన ఆంక్షల ప్రకటన వెలువడగానే భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ మాస్కోకు వెళ్లి పుతిన్తో సమావేశం అయ్యారు. అటుపై పుతిన్ సన్నిహితుడైన నికోలాయ్ పెత్రుషెవ్తో ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడేమో డిసెంబరు 4, 5 తేదీల్లో పుతిన్ భారత్లో పర్యటిస్తారనే ప్రకటన వెలువడింది. పుతిన్ ఢిల్లీలో జరగబోయే 23వ రష్యా-భారత్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొంటారు. అయితే భారత్తో భారీ ఎత్తున ఒప్పందాల ఎజెండాతోనే రష్యా అధ్యక్షుడు భారత్కు వస్తున్నారా?.. ఉక్రెయిన్ సంక్షోభం ముగించేందుకు మోదీ మధ్యవర్తిత్వాన్ని పుతిన్ కోరనున్నారా? రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ మాటల్ని పట్టించుకోకూడదని చెబుతారా? అసలు ఇవేవీ కావు.. సైనికపరమైన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నారా?.. పుతిన్ భారత్కు ఎందుకొస్తున్నారనే ప్రశ్నలపై చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో పాక్ క్షిపణులను తుక్కు చేసి ప్రపంచానికి సత్తా చాటిన భారత్ ఇప్పుడు రష్యా ఆయుధ సంపత్తిపై ఆసక్తి ప్రదర్శిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా మేక్ ఇన్ ఇండియానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితుల్లో అది కష్టతరమేనన్న అభిప్రాయమూ రక్షణ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే అమెరికా ఆంక్షలను లెక్కచేయని తరుణంలో పుతిన్ భారత్తో మరో కోణంలోనూ ఒప్పందాలు చేసుకునే అవకాశం లేకపోలేదు. అందులో.. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్తు ప్లాంట్లో కొత్త మాడ్యులర్ రియాక్టర్ల నిర్మాణంలో రష్యా భాగస్వామిగా మారే అవకాశం బలంగానే కనిపిస్తోంది. ఎస్సీవో శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సుదీర్ఘంగా భేటీ అయిన పుతిన్.. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు రావడం ట్రంప్ను ఒత్తిడికి గురిచేసే అంశమే. అందుకే వీళ్ల దోస్తీపై ఆయన పగబట్టారు. అదీగాక అమెరికా, యూరప్ దేశాలకు వ్యతిరేకంగా పుతిన్ ఆసియా దేశాలతో ఓ బలమైన కూటమిగా ఎదిగేతే గనుక.. అందులో భారత్ ప్రధాన భూమిక అవకాశాలను తోసిపుచ్చలేం. అందుకే భారత్తో మరింత దగ్గరైతే రష్యా మళ్లీ సూపర్ పవర్గా ఎదుగుతుందనే భయం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.:::వెబ్డెస్క్ స్పెషల్ -
ప్రైవేట్ రాకెట్ ప్రత్యేకత.. ఇది ఎక్కడుందంటే?
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు తేదీలు ఖరారు
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో చమురు కొనుగోళ్లు, రక్షణ మరియు వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చలు ఉంటాయని భావిస్తున్నారు.దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కూడా రాష్ట్రపతి భవన్లో పుతిన్కు స్వాగతం పలుకుతారు. ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి 2025 డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశంలో అధికారిక పర్యటన చేస్తారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.చదవండి: లక్ష కంఠ గీతా పారాయణం : ప్రధానికి ఘన స్వాగతంపుతిన్ తన భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కూడా చర్చలు జరుపుతారు. పుతిన్ పర్యటన భారత, రష్యా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించడానికి, ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాల మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది.ఈ ఏడాది ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ భారత పర్యటనను ప్రకటించారు. అయితే, ఆ సమయంలో తేదీలను ఖరారు చేయలేదు. తరువాత షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్ చైనాలో సమావేశమయ్యారు.ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు -
భారత్లోని ప్రాంతాలతో మ్యాప్..
కఠ్మాండు: భారత్లోని కాలాపానీ, లిపులెఖ్, లింపియధుర ప్రాంతాలు తమవంటూ వాదిస్తున్న నేపాల్ ప్రభుత్వం మరో వివాదానికి తెరతీసింది. తాజాగా విడుదల చేసిన రూ.100 నోటుపై ముద్రించిన నేపాల్ మ్యాప్లో ఆ మూడు ప్రాంతాలు ఉండటమే ఇందుకు కారణం. నేపాల్ రాష్ట్ర బ్యాంక్(ఎన్ఆర్బీ) గత గవర్నర్ మహా ప్రసాద్ అధికారి సంతకంతో కూడిన ఆ నోట్పై నేపాల్ క్యాలెండర్ ప్రకారం 2081లో విడుదల చేసినట్లుగా ఉంది. అంటే, ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఇది గతేడాది 2024. 2020లో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం లిపులెఖ్, కాలాపానీ, లింపియధుర తమవేనంటూ ఆ దేశ కొత్త మ్యాప్ను విడుదల చేయడం వివాదం రేపింది. దీనిపై అప్పట్లో భారత్ తీవ్రంగా స్పందించింది. ఏకపక్ష చర్యగా అభ్యంతరం తెలిపింది. భూభాగాన్ని కృత్రిమంగా విస్తరించి చూపడాన్ని ఆమోదించబోమంది. -
సుమిత్ నగాల్కు నిరాశ
చెంగ్డూ (చైనా): టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని భారత నంబర్వన్ సుమిత్ నగాల్ చేజార్చుకున్నాడు. ఆసియా–పసిఫిక్ వైల్డ్ కార్డు ప్లే ఆఫ్ టోర్నీలో ప్రపంచ 278వ ర్యాంకర్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సుమిత్ 2–6, 2–6తో టాప్ సీడ్, ప్రపంచ 120వ ర్యాంకర్ యుంచావోకెటె బు (చైనా) చేతిలో ఓడిపోయాడు. మ్యాచ్ మొత్తంలో ఒక్క ఏస్ కొట్టి, ఒక్క డబుల్ ఫాల్ట్ చేసిన సుమిత్ తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సుమిత్కు 1,500 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 87 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. 28 ఏళ్ల సుమిత్ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు గ్రాండ్స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డాడు. కానీ రెండో రౌండ్ను దాటి ముందుకెళ్లలేకపోయాడు. ఫైనల్లో నిక్కీ పునాచా జోడీ ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో నిక్కీ పునాచా (భారత్)–ప్రుచాయ ఇసారో (థాయ్లాండ్) జోడీ ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో నిక్కీ–ఇసారో ద్వయం 6–4, 6–2తో జిసుంగ్ నామ్–యుసుంగ్ పార్క్ (దక్షిణ కొరియా) జంటపై గెలిచింది. ఫైనల్లో గెలిచిన జోడీకి ఆస్ట్రేలియన్ ఓపెన్ వైల్డ్ కార్డు బెర్త్ లభిస్తుంది. -
ఆహా... ఇక మాకు పండగే
న్యూఢిల్లీ: భారత్కు మళ్లీ కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య భాగ్యం దక్కడంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), క్రీడాశాఖ కంటే కూడా అంతర్జాతీయ క్రీడా షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్), ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తెగ సంబరపడిపోతున్నాయి. భారత్కు 2030 ఆతిథ్య హక్కులు దక్కడాన్ని ఈ రెండు క్రీడా సమాఖ్యలు స్వాగతించాయి. దీంతో ఈ మెగా ఈవెంట్లో తిరిగి ఈ రెండు క్రీడాంశాలు చేరతాయని ఆశిస్తున్నాయి. వచ్చే ఏడాది స్కాట్లాండ్ దేశంలో జరిగే గ్లాస్గో–2026 కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్, బ్యాడ్మింటన్ ఈవెంట్లను తొలగించారు. ఇది భారత శిబిరాన్నే కాదు... ఐఎస్ఎస్ఎఫ్, బీడబ్ల్యూఎఫ్లను సైతం తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఎందుకంటే ఈ రెండు ఈవెంట్లలో చెప్పుకోదగ్గ సంఖ్యలో బంగారు, రజత, కాంస్య పతకాల్ని మన క్రీడాకారులు సాధిస్తారు. ఈ పతకాలతో ఆయా అథ్లెట్లకు నజరానాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఈపాటికే ఉద్యోగాలుంటే పదోన్నతులు సైతం దక్కుతాయి. కానీ ఈవెంట్లకు కత్తెర వేయడంతో భారత షూటర్లు, షట్లర్లకు అశనిపాతమైంది. అయితే 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కుల్ని బుధవారం భారత్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆతిథ్య దేశం ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ రెండు క్రీడల్ని చేరుస్తారని ఐఎస్ఎస్ఎఫ్, బీడబ్ల్యూఎఫ్ గట్టిగా ఆశిస్తున్నాయి. వడోదరలో క్రికెట్! అహ్మదాబాద్ వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా నిర్వహించబోయే క్రికెట్ పోటీలకు సమీప నగరం వడోదర వేదికయ్యే అవకాశముందని ఐఓఏ సీఈఓ రఘురామ్ అయ్యర్ తెలిపారు. దీనిపై ఇంకా అధికారక నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. భారత్లో జరిగే మెగా ఈవెంట్లో 15 నుంచి 17 క్రీడాంశాలకు చోటు ఉంటుందని క్రీడా వర్గాలు వెల్లడించాయి.


