India
-
2040లో చంద్రుడిపై మన జెండా
పిల్లలూ, రాత్రి పూట ఆకాశంలో నవ్వుతూ కనిపించే చందమామ మీదకు మనం వెళ్లొచ్చా? వెళ్లడమే కాదు, అక్కడ మన మువ్వన్నెల జెండా కూడా పాతేయొచ్చా? పాతేయొచ్చు’ అని గట్టిగా చెప్పారు నారాయణన్. హైదరాబాద్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ‘2040 సంవత్సరానికి ఒక భారతీయుడు చందమామ మీద కాలు పెడతాడు. చేతిలో త్రివర్ణ పతాకం ఉంటుంది’ అని మాట ఇచ్చారు. నారాయణన్ చెప్పిన విశేషాలు ఇలా అర్థం చేసుకోవాలి.మొదట గగనయాన్చందమామ చాలా దూరం. వెళ్లడం చాలా కష్టం. అందుకే మన సైంటిస్ట్లు ఇప్పటి నుంచే ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. మొదట 2027లో ‘గగనయాన్’ మిషన్ నిర్వహిస్తారు. అంటే ముగ్గురు వ్యోమగాములను భూమి చుట్టూ తిప్పి తీసుకువస్తారు. ఇందుకోసం నలుగురు వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ సింగ్, కమాండర్ శుభాంశు శుక్లా లను సెలెక్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వెళ్లి వస్తారు.చంద్రయాన్– 4,5:చంద్రయాన్లో భాగంగా 2027లో ఎ20 ఉపగ్రహం పంపుతారు. అది ఆకాశంలోంచి భూమిని చూస్తూ, ‘అమ్మో, ఇక్కడ కాలుష్యం ఎక్కువైంది, అక్కడ వర్షాలు తక్కువైయ్యాయి’ లాంటి వార్తలు చేరవేస్తుంది. 2028కి వచ్చేసరికి అంతరిక్షంలో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాం. దాని పేరు ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’. మన శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి అక్కడే ఉండి పరిశోధనలు చేస్తారు. ఇక చంద్రయాన్–4లో మన రాకెట్ని పంపి, చందమామ మీద వాలేలా చేస్తారు. అది అక్కడి మట్టిని, రాళ్లను ఒక డబ్బాలో పెట్టుకుని మళ్లీ భూమి మీదకు తీసుకొస్తుంది. ఆ మట్టిలో ఏముందో ల్యాబ్లో చూస్తాం. 2030లో నిర్వహించే చంద్రయాన్–5 ఇంకా పెద్దది. అది ఒక పెద్ద ల్యాండర్ని, చిన్న కారు లాంటి రోవర్ని చందమామ మీద దింపుతుంది. ఆ రోవర్ వంద రోజులు చందమామ వీధులన్నీ తిరిగి ఫోటోలు, వీడియోలు పంపుతుంది. ఇవన్నీ అయ్యాక, అన్నీ సక్సెస్ అయ్యాక... 2040లో ‘మానవ సహిత చంద్రయాన్’ నిర్వహిస్తారు. ఆ రోజున మన భారతీయుడు రాకెట్ ఎక్కి, చందమామ మీద దిగి, ‘భారత్ మాతా కీ జై’ అని అక్కడ మన జెండా పాతుతాడు. ఇదీ చదవండి: సెలబ్రిటీ చెఫ్కు నీతా అంబానీ అద్భుత గిఫ్ట్, వీడియో వైరల్మీరూ వెళ్లొచ్చుపిల్లలూ... ఇప్పుడు నీకు 12 ఏళ్లా? 2040కి మీకు 28 ఏళ్లు. అంటే ఆ రాకెట్ ఎక్కేది మీరే కావచ్చు! అందుకే ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలి. లెక్కలు, సైన్స్ అంటే భయపడకూడదు. ఆటలు ఆడాలి. అన్నం బాగా తిని బలంగా తయారవ్వాలి. చందమామ మన కోసం చూస్తున్నాడు. వెళ్లి ‘జైహింద్’ చెప్పొద్దూ? -
ప్రత్యక్ష ప్రసారం చూడలేమా!
టీమిండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు... అభిమానులు టీవీలకు అతుక్కుపోవడం మనదేశంలో తరాలుగా వస్తున్న ఆనవాయితీ! ఐపీఎల్ వచ్చాక వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. అరచేతిలో ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశం వచ్చినప్పటి నుంచి ఆ సంఖ్య కోట్లు దాటేసింది. ఇదే బాటలో బ్యాడ్మింటన్ లీగ్, రెజ్లింగ్ లీగ్, టేబుల్ టెన్నిస్ లీగ్, ఖో ఖో లీగ్, ప్రీమియర్ టెన్నిస్ లీగ్, ఆర్చరీ లీగ్ ఇలా లెక్కకు మిక్కిలి లీగ్లు కాస్తో కూస్తో ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)... క్రికెట్ తరహాలో దేశవ్యాప్తంగా బాగా ఆదరణ దక్కించుకుంది. మట్టి ఆటతో మనకున్న అనుబంధాన్ని మ్యాట్పై చూపించడంతో గ్రామీణ ప్రేక్షకులు పీకేఎల్కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఎటొచ్చి యావత్ ప్రపంచం వీపరీతంగా ఆదరించే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ పోటీలకు మాత్రం మన దేశంలో ఆదరణ చాలా తక్కువ. మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ వరల్డ్కప్ జరగనున్నా... ఇప్పటి వరకు మనదేశంలో ఈ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఉన్న కొద్దిమంది అభిమానులు కూడా ప్రపంచకప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫిఫా’ వరల్డ్కప్ ప్రత్యక్ష ప్రసార తీరు తెన్నులపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ప్రపంచకప్ ఫుట్బాల్ సమరానికి సమయం దగ్గరపడుతోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్బాల్ మహాసంగ్రామం జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాగనుంది. నాలుగేళ్ల క్రితం ఖతర్లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇప్పుడు మూడు దేశాలు కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. కెనడా, మెక్సికో, అమెరికాలో ఈ వరల్డ్కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా 48 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతుండగా... మొత్తం 104 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 48 జట్లను 12 గ్రూప్లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. గత వరల్డ్కప్లో కేవలం 64 మ్యాచ్లు మాత్రమే జరగ్గా... ఇప్పుడా సంఖ్య బాగా పెరిగింది. దీంతో సాధారణంగా ఆసక్తి కూడా మరింత పెరిగింది. ప్రపంచంలో 200కు పైగా దేశాల్లో ఫుట్బాల్ అభిమానులు ఉన్నారు. అందులో దాదాపు అన్నీ దేశాల్లో ఈ వరల్డ్కప్ ప్రసారాలు సాగనున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఐపీఎల్ ముగిసిన 11 రోజులకే... ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతుండటంతో... ఎక్కడ చూసినా ఫోర్లు, సిక్స్లు, స్కోర్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. వచ్చే నెల 31వ తేదీతో ఐపీఎల్ ముగియనుండగా... ఆ తర్వాత 11 రోజులకే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. క్రికెట్ను మతంలా భావించే మనదేశంలో మొదటి నుంచి ఫుట్బాల్కు ఆదరణ అంతంతమాత్రమే... ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ వంటి చోట్ల తప్ప ఫుట్బాల్పై ఆసక్తి కనబర్చే వారి సంఖ్య చాలా తక్కువ. మన దేశ ఫుట్బాల్ జట్టు కూడా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా విజయాలు సాధించలేక పోతుండటంతో పాటు... దక్షిణ అమెరికా, యూరప్ దేశాల హవా సాగే ఫుట్బాల్ వరల్డ్కప్పై మనవాళ్లకు ఆసక్తి తక్కువే. ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ రోజు రోజుకు పెరుగుతూ ఉంటే... ఈ టోర్నమెంట్ ప్రసార హక్కులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరం. 100 నుంచి 35 మిలియన్ డాలర్లలకు... తాజా ప్రపంచకప్తో పాటు 2030లో జరగనున్న వరల్డ్కప్ను కలిపి సంయుక్త ప్రసార హక్కులను భారత మార్కెట్లో 100 మిలియన్ డాలర్లకు నిర్వాహకులు విక్రయించే ప్రయత్నం చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండు టోర్నీల ప్రసార హక్కులను 35 మిలియన్ డాలర్లకు తగ్గించినా... ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. ‘భారత్లో ఫుట్బాల్ వీక్షణ గత కొంతకాలంగా బాగా క్షీణిస్తోంది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ను చూస్తే 2013–14లో దాని విలువ 145 మిలియన్ డాలర్లు ఉండేది... అది ఇప్పుడు 60 మిలియన్ డాలర్లకు పడిపోయింది’ అని స్పోర్ట్స్ గేమింగ్ రంగ నిపుణుడు తెలిపాడు. చేతులు కాల్చుకున్న సోనీ, రిలయన్స్ 2014, 2018 ‘ఫిఫా’ వరల్డ్కప్ టోర్నీలను భారత్లో సోనీ స్పోర్ట్స్ ప్రసారం చేసింది. వీటితో 2016 యూరో కప్ను కలిపి మొత్తం 90 మిలియన్ డాలర్లకు వాణిజ్య హక్కులు దక్కించుకుంది. ఆ తర్వాత 2022 వరల్డ్కప్ ప్రసార హక్కులను 60 మిలియన్ డాలర్లకు రిలయన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సంస్థలు కూడా ఆశించిన లాభాలు గడించలేకపోయాయి. దీంతో ఈసారి ప్రసార హక్కుల విషయంలో తర్జన భర్జన ఇంకా సాగుతోంది.‘భారత్లో కేవలం అభిమానులు లేకపోవడమే కాక... మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫుట్బాల్ వీక్షణల విషయంలో జపాన్తో భారత్ను పోల్చడం అవివేకం’ అని స్పోర్ట్స్ గేమింగ్ ఈ స్పోర్ట్స్ లైవ్ మేనేజింగ్ పార్ట్నర్ రోహిత్ అన్నారు. టైమింగ్తో తలనొప్పి... ఈసారి ఫుట్బాల్ పండగ జరుగుతున్న కెనడా, మెక్సికో, అమెరికా కాలమానంతోనూ మనకు ఇబ్బంది ఎదురవుతోంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామునే ఎక్కువ మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో వీక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. ఎంత ప్రధానమైన ఈవెంట్ అయినా... ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించే సమయంలో కాకుండా... అర్ధరాత్రి, అపరాత్రి ప్రసారం చేస్తే వీక్షణలు తగ్గడం సహజమే. ఈ టోర్నమెంట్లోని 104 మ్యాచ్ల్లో 14 మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రికి ముందు ప్రారంభం కానున్నాయి. 2022 ఖతర్ వేదికగా జరిగిన టోర్నమెంట్లోని 64 మ్యాచ్ల్లో 44 మ్యాచ్లు ‘ప్రైమ్ టైమ్’లోనే ప్రసారమయ్యాయి. లాభాలు లేకే... మన దేశంలో 2022 ప్రపంచకప్ స్పోర్ట్స్–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. జియో సినిమా యాప్లో ఉచితంగా లైవ్ అందించగా... స్పోర్ట్స్–18 ఛానల్ మాత్రం ఈ మెగా టోర్నీ కోసం నెలకు 12 రూపాయలు వసూలు చేసింది. ఫుట్బాల్ దేశాల్లో ఈ ధర ఎంత భారీగా ఉన్నా... వాటి వీక్షణల్లో ఎలాంటి మార్పు రాదని... కానీ మనదేశంలో మాత్రం ఫుట్బాల్ కోసం సభ్యత్వం తీసుకునే వారు చాలా తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఏ రంగంలో అయినా లాభాలు రాకపోతే దాన్ని కొనసాగించడం కష్టమే కాబట్టి... ఏ రకంగా చూసుకున్న మన దేశంలో ఫిఫా ప్రపంచకప్నకు ఆదరణ పెద్దగా ఉండదనే ఉద్దేశంతోనూ ప్రసార హక్కులు కొనుగోలు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాణిజ్య ప్రకటనలకు సమయమేది? భారత ఫుట్బాల్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్న సమయంలో సైతం అభిమానులు లైవ్పై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రోజురోజుకూ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. గత ఏడాది కాలంలో ఐఎస్ఎల్ ప్రసార హక్కుల విలువలో 97 శాతం తగ్గుదల నమోదైంది. క్రికెట్లో అయితే ఓవర్కు ఓవర్కు మధ్య వచ్చే వాణిజ్య ప్రకటనలతో ప్రసార కర్తలకు భారీగా డబ్బు వచ్చి పడుతుంది. కానీ... ఫుట్బాల్కు మన దేశంలో అంతటి ఆదరణ ఉండదని ప్రసార సంస్థల నిపుణులు అంటున్నారు. ‘క్రికెట్లో ఓవర్ మారినా, వికెట్ పడినా... వాణిజ్య ప్రకటనలకు వీలు ఉంటుంది. టెన్నిస్లోనూ సెట్ తర్వాత స్లాట్లు ఉంటాయి. కానీ ఫుట్బాల్లో మ్యాచ్లకు ముందు, తర్వాత, విరామంలో మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనలకు అవకాశం చాలా తక్కువ’ అని ఆయన అన్నారు. దూరదర్శన్కే చాన్స్... మనదేశంలోని ప్రముఖ ప్రసారకర్తలు జియో హాట్స్టార్, ఫ్యాన్కోడ్, సోనీ స్పోర్ట్స్, జీ ఎంటర్టైన్మెంట్లతో చర్చలు నిర్వహించాలని ‘ఫిఫా’ భావిస్తోంది. ఒకవేళ ప్రసార కర్తలు ఎవరూ ముందుకు రాకపోతే... ప్రభుత్వ ప్రసారకర్త దూరదర్శన్లో వరల్డ్కప్ ప్రసారమయ్యే అవకాశముంది. 1998, 2002, 2006 ప్రపంచకప్లోని పలు మ్యాచ్లను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. 1998 ప్రపంచకప్ ప్రసార హక్కుల ద్వారా దూరదర్శన్ రూ. 3.5 కోట్ల లాభం కూడా పొందడం విశేషం. -
ఒలింపిక్స్కు 'సై' అంటున్న ఇండియా
ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సైఅంటోంది. అహ్మదాబాద్ లో 2036లో ఈ పోటీలకు ఆతిథ్యం వహించేందుకు భారత్ అధికారికంగా బరిలోకి దిగింది. ఖతార్ (దోహాలో), చిలీ (శాంటియాగోలో), తుర్కియే (ఇస్తాంబుల్లో) ఈ పోటీలు నిర్వహిస్తామంటూ మనకు ప్రస్తుతానికి పోటీగా నిలుస్తున్నాయి. దక్షిణాఫ్రికా కూడా ముందుకొచ్చిందికానీ, ఏ నగరంలో నిర్వహించదలచుకున్నదీ పేర్కొన లేదు. బెర్లిన్, కలోన్, హ్యాంబర్గ్, మ్యూనిక్లలో ఎక్కడో ఒకచోట నిర్వహించాలని జర్మనీ యోచిస్తోంది. సెప్టెంబర్లో తుది నిర్ణ యాన్ని ప్రకటించవచ్చు. అయితే, బెర్లిన్, మ్యూనిక్ నగరాలు చేదు జ్ఞాపకాలనే రేపుతాయి. జర్మనీ 2036 అవకాశాన్ని దక్కించుకోలేక పోతే, 2040 లేదా 2044లలో నిర్వహించేందుకు ప్రయత్నించవచ్చు. అపఖ్యాతిని మూటగట్టుకున్న జర్మనీజర్మనీ నేడున్నట్లుగా సమైక్యంగా ఉన్నప్పుడు 1936లో బెర్లిన్లో ఒకసారి ఒలింపిక్స్ నిర్వహించింది. ఆ తర్వాత, 1972లో ఆనాటి పశ్చిమ జర్మనీలోని మ్యూనిక్లోనూ నిర్వహించారు. 1936లో ఎక్కడ పోటీలు నిర్వహించాలో 1931లో నిర్ణయించారు. ఆ మరుసటి ఏడాది (1932లో) అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చారు. ఆయన ఆ క్రీడోత్సవాలను ప్రాపగాండా వ్యవహారంగా మార్చేశారు. తమను ఆధిపత్య (ఆర్య) జాతికి చెందినవారుగా చాటుకోవాలని హిట్లర్ చేసిన ప్రయత్నంతో, అవి ‘నాజీ ఒలింపిక్స్’గా అపకీర్తిని మూటగట్టుకున్నాయి. దాని ప్రతీకార జ్వాలను మ్యూనిక్ 1972లో చవిచూసింది. పాలస్తీనా విమోచన సంస్థకు చెందినవారు ఒలింపిక్ గ్రామంలోకి అథ్లెట్ల ముసుగులో అడుగుపెట్టి, ఇజ్రాయెల్ క్రీడాకారుల బసలోకి ప్రవేశించి కొందరిని బందీలుగా పట్టుకుని, ఆ తర్వాత వారిని హత మార్చారు. మొత్తం 11 మంది క్రీడాకారులను బలి తీసుకున్న ఆ ఉదంతం క్రీడా చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది. జర్మన్లకు వారి నాజీ గతం ఇబ్బందికరంగానే ఉంది. బెర్లిన్ను 2036 క్రీడలకు ఎంచుకుంటే, పాత గాయాలను రేపినట్లు అవుతుందేమోనని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్–వాల్టర్ స్టెయిన్మయర్ ఆందోళన వ్యక్తపరచారు. అపఖ్యాతి పాలైన ‘నాజీ ఒలింపిక్స్’కు సరిగ్గా ఆ ఏడాదిలోనే నూరేళ్ళు నిండుతాయి. హిట్లర్కు ప్రీతిపాత్రమైన జాతి సిద్ధాంతం బెర్లిన్లో తుత్తు నియలైంది. ఆఫ్రో–అమెరికన్ జెస్సీ ఓవెన్స్ ఆ పోటీల్లో 100 మీటర్ల, 200 మీటర్ల , 4గీ100 మీటర్ల రిలే, లాంగ్ జంప్ విభాగాల్లో స్వర్ణాలు సాధించి శాశ్వత కీర్తిని గడించారు. 1936 ఒలింపిక్స్లో ఇండియాబ్రిటన్ పతాకం కింద భారత బృందం పాల్గొన్న చివరి ఒలింపిక్స్గా కూడా 1936 ఒలింపిక్స్ లెక్కకు వస్తాయి. ఆ బృందంలో ధ్రువతార ధ్యాన్చంద్ నేతృత్వంలోని హాకీ జట్టు, నలుగురు రన్నర్లు, బర్మా (నేటి మయన్మార్) నుంచి వచ్చిన ఒక వెయిట్ లిఫ్టర్ కూడా ఉన్నారు. అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో బర్మా భాగంగాఉండేది. బెర్లిన్ (1936) ఒలింపిక్స్లో భారత్ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా, నేటి సోషల్ మీడియాయుగంలో కల్పనల నుంచి వాస్తవాలను వేరు చేసి చూడటం కష్టం. వీఐపీ బాక్స్లో కూర్చున్న హిట్లర్ వంక చూస్తూ కుడివైపు తిరిగి శాల్యూట్ చేయడానికి అమెరికాతోపాటు తిరస్కరించిన ఏకైకబృందం భారతదేశానిదేనని ఒక కథ ప్రచారంలో ఉంది. దాన్ని మన ధైర్యానికి, లొంగనితత్వానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదు. కవాతులో పాల్గొన్న 49 బృందాలలో నాజీ వందనం సమర్పించింది ఆతిథేయ దేశమైన జర్మనీ మాత్రమే. జర్మన్ ఒలింపిక్ చరిత్రకారుల పితామహుడు, ముఖ్యంగా, 1936 బెర్లిన్ ఒలింపిక్స్కు సంబంధించిన నిపుణుడు ఫోల్కా క్లట్జ్ ప్రకారం, నాజీ శాల్యూట్కి, ఒలింపిక్ శాల్యూట్కి మధ్యనున్న సారూప్యత కారణంగా రకరకాల అపోహలు తలె త్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ శాల్యూట్కి 1946లో స్వస్తి పలికింది. సాటిలేని భారత హాకీ జట్టు 1928, 1932 ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు గెలుచుకుని, 1936లో హ్యాట్రిక్ సాధించే ప్రయత్నంచేసింది. దానికి తగ్గట్లుగానే ఫైనల్లో జర్మనీతో తలపడి 8–1 గోల్స్ తేడాతో దాన్ని ఓడించింది. ఆగస్టు 14న జరగవలసిన ఆ పోటీ భారీ వర్షం వల్ల వాయిదా పడి ఆ మరుసటి రోజైన ఆగస్టు 15న ఉదయం 11 గంటలకు జరిగింది. ఆ తర్వాత, ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్–జర్మనీల మధ్య ఫైనల్ మ్యాచ్ చూసేందుకు హిట్లర్ వచ్చారనీ, ధ్యాన్చంద్ హాకీ స్టిక్ ఒడుపులు చూసి, ఆయన కళ్లు చెదిరాయనీ చెప్పే కథనంలో కూడా వాస్తవం లేదని క్లట్జ్ అంటారు.ఒలింపిక్స్లో క్రీడా జర్నలిస్ట్!ఈ సందర్భంగా చార్లెస్ సెబాస్టియన్ అరుళ్ స్వామి గురించి కూడా చెప్పుకోవాలి. మన స్వామి ఎంత ఘటికుడో తెలుసా? ‘హిట్లర్ అంతటివాడిని టీ తాగేందుకు వేచి ఉండేటట్లు చేశాడు’ అని క్రీడా జర్నలిస్టులు ఆయనను ఆటపట్టిస్తూ ఉండేవారు. స్పోర్ట్స్ జర్నలిజంలో ఆయనే నాకు గురువు. ఇంతకూ ఏం జరిగిందంటే, ఆ ఒలింపిక్స్ మారథాన్లో స్వామి పాల్గొన్నారు. ఆయన ఆపసోపాలు పడుతూ చివరలో ఎప్పటికో వచ్చారనీ, ఫలితంగా ముగింపు వేడు కలో జాప్యం జరిగిందనీ జర్నలిస్టులు ఆ విధంగా ఎద్దేవా చేసేవారు. వాస్తవం ఏమిటంటే, మారథాన్ పూర్తి చేసిన 42 మందిలో స్వామి 37వ వ్యక్తిగా నిలిచారు. ఆ రోజు 14 మంది దాన్ని పూర్తి చేయలేకపోయారు. కనుక, స్వామి దృఢత్వాన్ని మెచ్చుకోవాల్సిందే. పైగా, జ్వరంతో కోలుకుని మరీ ఆ పోటీలో పాల్గొన్నారు. సుదీర్ఘ నౌకాయానం వల్ల పారాటైఫాయిడ్ బారినపడ్డారు. ఫలితంగా, 3 వారాలు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో, మార థాన్ను చివరకు మార్చారుకానీ, అప్పట్లో అది ముందే ఉండేది. స్వామి తన 83వ ఏట, కోయంబత్తూరులో 1997లో కన్ను మూశారు. భారతదేశపు క్రీడా జర్నలిజం వైతాళికు లలో ఆయనొ కరు. స్వామి గట్టి పోటీనివ్వగల షూటర్ కూడా. ఫుట్బాల్ కోచ్గా, రిఫరీగా కూడా వ్యవహరించారు. ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్న ఏకైక క్రియాశీల జర్నలిస్ట్ ఆయనొక్కరేనని చెబుతారు. -వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)-గులు ఇజికియల్ -
ఏఐ యుగంలో భారత్: నాస్కామ్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు!
ఐటీ సంస్థల ఆదాయ వృద్ధి మెరుగుపడేలా చూడటం, అలాగే కంపెనీల్లో కృత్రిమ మేథ, సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు నాస్కామ్ కొత్త చైర్మన్గా నియమితులైన శ్రీకాంత్ వెలమకన్ని తెలిపారు. ఏఐ యుగంలో భారత్ మరింత మెరుగ్గా, దూకుడుగా పోటీపడేలా చూసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.టెక్నాలజీపై కంపెనీలు ప్రస్తుత స్థాయికి మించి వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. టెక్నాలజీ పురోగతి వల్ల మనుషుల కన్నా మెషిన్లు మెరుగ్గా పనులు పూర్తి చేయగలిగినా, మనుషులు పోషించాల్సిన పాత్ర ప్రాధాన్యత తగ్గిపోదని తెలిపారు.ఏఐ ఆధిపత్యం కనిపిస్తున్న తరుణంలో కూడా గత ఏడాది నికరంగా ఉద్యోగుల సంఖ్య పెరగడం సానుకూలాంశమని ఆయన పేర్కొన్నారు. ఏఐ పురోగతితో చిన్నా, పెద్ద కంపెనీలు తమ వ్యాపారాలను సరికొత్తగా తీర్చిదిద్దుకునేందుకు అసాధారణ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని శ్రీకాంత్ వివరించారు. -
భారత్ ఓ నరకకూపం అంటూనే.. ఊసరవెల్లిలా మాట మార్చిన ట్రంప్
-
‘ఓసారి భారత్ రండి’.. ట్రంప్నకు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇరాన్ దౌత్య కార్యాలయాలు ఘాటుగా స్పందించాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. రీపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భారత్, చైనా వంటి దేశాలను నరక కూపాలు(Hell-holes)గా అభివర్ణించడమే కాకుండా.. అక్కడి నుండి వచ్చే వలసదారులను ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అంటూ విమర్శించారు.ఈ క్రమంలో ‘భారత్ వచ్చి చూడండి’ అంటూ ముంబాయిలోని ఇరాన్ ఎంబసీ.. ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. భారత్కు వచ్చి చూసి ఆ తర్వాత మాట్లాడాలంటూ సూచించింది ‘భారత్లోని అభివృద్ధి, సంప్రదాయాలు ట్రంప్నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారత పర్యటనకు తీసుకురావాలి’’ అంటూ పోస్ట్ పెట్టింది. భారత్ అందాలు ప్రశంసిస్తూ.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు హెవెన్ మోడ్(స్వర్గంలా)ఉంటాయని... సాంస్కృతిక విలువలు ఎంతో గొప్పవని ఇరాన్ పేర్కొంది. మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా, ట్రంప్ ‘నరకం’ వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని.. అత్యంత దారుణంగా ఉన్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు భారత్-అమెరికా మధ్య ఉన్న పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలను దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు.ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇచ్చే "బర్త్రైట్ సిటిజన్షిప్"(జన్మతః పౌరసత్వం) రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర దేశాల నుండి వచ్చే వలసలను విమర్శిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అయితే, పరిస్థితి ముదురుతుండటంతో అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ.. ట్రంప్ గతంలో భారత్ను "గొప్ప దేశం" అన్న విషయాన్ని గుర్తు చేస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. -
భారత్ను లొంగదీసుకోవడం చాలాకష్టం: అమెరికా
అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ భారత్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అంత సులువుగా లొంగే దేశం కాదని అమెరికా చట్ట సభల్లో మాట్లాడుతూ అన్నారు. వాణిజ్య పన్నుల విషయంలో వారి దేశ ప్రయోజనాలను ఎట్టిపరిస్థితుల్లో వారు పణంగా పెట్టరని తేల్చిచెప్పారు.ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల ప్రతినిధుల బృందం అమెరికాతో వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్కు వెళ్లింది. అమెరికా తరపున చర్చలకు దక్షిణ మరియు మధ్య ఆసియాకు సంబంధించిన అసిస్టెంట్ USTR అయిన బ్రెండన్ లించ్ నేతృత్వం వహించారు. మూడు రోజుల పాటు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు సోయాబీన్, ఎథనాల్ మరియు సుంకాల తగ్గింపుపై ఇరు దేశాలు తమ వాదనలను బలంగా వినిపించాయి. అనంతరం భారత ప్రతినిధులతో జరిగిన చర్చల సారాంశాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసర్ గ్రీర్ చట్టసభల్లో ప్రస్థావించారు.జేమీసర్ గ్రీర్ అమెరికా చట్టసభల్లో మాట్లాడుతూ... "ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం. అది చాలాకాలంగా వ్యవసాయ మార్కెట్లకు సంరక్షురాలిగా ఉంది, కనుక ఆ రంగలో రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. భారత్ అంత సులువుగా లొంగదు. ఆ దేశాన్ని లొంగదీయడం చాలా కష్టం" అన్నారు. భారత్ తన మార్కెట్ను అంత సులభంగా అమెరికాకు వదిలిపెట్టడం లేదని, చర్చల్లో భారత్ చాలా పట్టుదలగా వ్యవహరిస్తోందని గ్రీర్ అభిప్రాయపడ్డారు.ఏ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలుఅమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులు సోయాబీన్, పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు మొదలైనవి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని చూస్తోంది. అయితే, భారత ప్రభుత్వం మన దేశ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కఠినమైన నిబంధనలను, టారిఫ్లను (సుంకాలను) అమలు చేస్తోంది. వాటిని తగ్గించాలని అమెరికా ప్రతినిధులు కోరగా భారత్ దేశ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఒప్పుకోనట్లు తెలుస్తోంది.కాగా ఇటీవల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య చర్చలు జరిగాయి. రాబోయే ఐదేళ్లలో అమెరికా నుండి దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను (ముఖ్యంగా ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు) కొనుగోలు చేసే దిశగా ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
భారత్ నరకం ట్రంప్ వ్యాఖ్యలు.. భారత్ ఘాటు రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై విషం చిమ్మారు. దేశాన్ని నరకంతో పోలుస్తూ జాత్యాహాంకార వ్యాఖ్యలు చేశారు. కాగా దీనిపై తాజాగా భారత్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.ట్రంప్ వ్యవహార శైలి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎప్పుడు ఏవిధంగా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అమెరికా గ్రేట్ ఎగేన్ అంటూ తరచుగా వేరే దేశాలపై విషం చిమ్ముతుంటారు. ఆ దేశ సంపదను అవతలి వారి కొల్లగొడుతున్నారంటూ అవతలి దేశాలపై ఏడుస్తూ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత్ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన వివాదాస్పద లేఖను తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.కాగా దీనిపై తాజాగా భారత్ స్పందించింది " మేము ట్రంప్ వ్యాఖ్యలను, అలాగే వాటికి ప్రతిస్పందనగా యూఎస్ రాయబార కార్యాలయం జారీ చేసిన ప్రకటనను కూడా చూశాము. ఆ వ్యాఖ్యలు స్పష్టంగా అవగాహన లేనివి, అనుచితమైనవి మరియు అసభ్యకరమైనవి. అవి ఖచ్చితంగా భారత్-యూఎస్ ప్రస్తుతమున్న సంబంధాల వాస్తవికతను ప్రతిబింబించవు. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా కాలంగా పరస్పర గౌరవం మరియు ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.మళ్లీ భారత్ను పొగిడిన ట్రంప్కాగా భారత్లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ దీనిపై మరో విధంగా స్పందించారు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ తనతో అన్నారని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ రెండు సంఘటనలను ఊటంకిస్తూ స్పందించింది.అసలేం జరిగింది ?ఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు. ఒక దేశానికి అధ్యక్షుని హోదాలో ఉండి మరో పెద్ద దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
బిలియనీర్ల హబ్గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్లో ప్రస్తుతం 207 మంది బిలియనీర్లు ఉంటే, 2031 నాటికి 51 శాతం పెరిగి 313కి చేరుకోనున్నట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. అత్యంత ధనవంతులు (అల్ట్రా హెచ్ఎన్ఐలు) 19,877గా ఉంటే, 2031 నాటికి వీరి సంఖ్య 25,217కు చేరుకోనుంది. బిలియన్ డాలర్లు, అంతకుమించి సంపద కలిగిన వారిని బిలియనీర్లు (కుబేరులు)గా, 30 మిలియన్ డాలర్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన వారిని అల్ట్రా హెచ్ఎన్ఐలుగా చెబుతారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అయిన నైట్ఫ్రాంక్ ఈ మేరకు 20వ ఎడిషన్ ‘ద వెల్త్ రిపోర్ట్, 2026’ను విడుదల చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు, వడ్డీ రేట్ల పెరుగుదల, అసమాన ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. సంపద సృష్టి వేగంగా జరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత్లో టెక్నాలజీ, ఇండ్రస్టియల్స్, క్యాపిటల్ మార్కెట్స్ రంగాల్లో అసాధారణ సంపద సృష్టి జరుగుతున్నట్టు తెలిపింది. రాజధానిగా ముంబై.. దేశంలోని అల్ట్రా హెచ్ఎన్ఐలలో 35.4 శాతం మందికి ముంబై చిరునామాగా ఉంది. అల్ట్రా హెచ్ఎన్ఐల జనాభా పరంగా భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగానూ అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 2021లో ఉన్న 5,51,435 నుంచి 7,13,626కు పెరిగింది. గత ఐదేళ్లలో భారత్లో బిలియనీర్ల సంఖ్య 58 శాతం పెరిగి 2026లో 207కు చేరింది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా అమెరికాలో 914 మంది ఉండగా, చైనాలో 485 మంది ఉన్నారు. ‘‘భారత్లో సంపన్నుల సంఖ్య పెరుగుతుండటం ఆర్థిక పరిణామ క్రమానికి అద్దం పడుతోంది. పారిశ్రామిక స్ఫూర్తితో ఎదుగుతూ.. బలమైన మూలధన నిల్వలు, అత్యాధునిక ఆర్థిక మార్కెట్లతో రాణిస్తోంది. వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల సమూహం పెరుగుతోంది. డిజిటలైజేషన్, లిస్టెడ్ కంపెనీలు, ప్రైవేటు క్యాపిటల్, కుటుంబ వ్యాపారాలు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి’’ అని నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. -
ఇండియా గ్రేట్ కంట్రీ
న్యూఢిల్లీ: ట్రూత్ సోషల్లో తాను చేసిన రీపోస్టు వివాదాస్పదంకావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నష్టనివారణ చర్యలకు దిగారు. డ్యామేజ్ను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. భారత్ చాలా గొప్ప దేశమని ప్రశంసించారు. ఆ దేశానికి తన మంచి మిత్రుడు(నరేంద్ర మోదీ) నాయకత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. భారత్పై మోదీ ప్రశంసల వర్షం కురిపించినట్లు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అయితే, ఇండియా గ్రేట్ కంట్రీ అంటూ ట్రంప్ ఎక్కడ, ఎప్పుడు వ్యాఖ్యానించారో స్పష్టం చేయలేదు. -
ఊసరవెల్లి సిగ్గుపడుతుందేమే.. భారత్పై మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊసరవెల్లి కంటే వేగంగా ట్రంప్ తన మాటలను మార్వగలరు. ఈ రోజు ఉదయమే భారత్పై విషం వెల్లగక్కుతూ అవమానించేలా మాట్లాడిన ట్రంప్.. అంతలోనే ఇండియాను ప్రశంసిస్తూ మాట్లాడారని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వలసల విషయంలో భారత్పై మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. కొన్ని గంటల్లోనే ట్రంప్ తన బుద్ధిని బయటపెట్టాడు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ అన్నారని భారత్లోని అమెరికా కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మైఖేల్ సావేజ్ వివాదాస్పద వ్యాఖ్యలుఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు.భారత్ స్పందనఅటు ట్రంప్ ఇటు సావేజ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘మేము కొన్ని నివేదికలను చూశాము. వాటిని అక్కడే వదిలేశాం’ అని అన్నారు. -
‘అవి నరకాలు కావు..మానవాళికి మహోన్నత దేశాలు’
భారత్, చైనా నరకాలు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్లోని నాగరికతను నాశనం చేస్తామంటూ ప్రకటనలు మీద ప్రకటనలు ఇస్తున్న ట్రంప్ ఉంటున్న అమెరికానే నరకం అంటూ ఇరాన్ రిప్లై ఇచ్చింది. భారత్, చైనాలు మానవాళికి మహోన్నత దేశాలు అంటూ ఇరాన్ పేర్కొంది. భారత్, చైనాలను నాగరికతకు పుట్టినిల్లు అని పేర్కొంటూ ట్రంప్పై విరుచుకుపడింది. చైనా, భారత్ నాగరికతకు పుట్టినిల్లు. నిజానికి అమెరికా దేశ యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు ఇరాన్లో నాగరికతను నాశనం చేస్తానని బెదిరించిన చోటే ఆ నరకమనేది ఉంది’ అంటూ ఇరాన్ బదులిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో భారత్, చైనాలను నరక కూపాలు అని అభివర్ణిస్తూ వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా స్పందించింది. ట్రంప్ ప్రకటనలకు సంబంధించి కొన్ని నివేదికలను చూశామని పేర్కొంది. తాము కొన్ని నివేదిలైతే చూశామని, ఈ వ్యాఖ్యల వివాదాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్పై విషం కక్కిన ట్రంప్ -
భారత్కు రాలేము.. కీలక టోర్నీ నుంచి పాకిస్తాన్ అవుట్
భారత్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (SAFF) మహిళల ఛాంపియన్షిప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫుట్బాల్ సమాఖ్య ధ్రువీకరించింది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ వైదొలగడంతో ఈ టోర్నమెంట్ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు.ఈ ఫుట్బాల్ టోర్నీ మే 25 నుండి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదికగా జరగనుంది. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు-లో నేపాల్, శ్రీలంక, భూటాన్.. గ్రూపు-బిలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. అయితే సాఎఫ్ఫ్ టోర్నీలో భారత్కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్పటివరకు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ వేదికగా జరిగే టోర్నీలకు పాక్ దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది తమిళనాడులో జరిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుండి పాక్ వైదొలిగింది. అంతకుముందు రాజ్గిర్లో ఆసియా కప్-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్ పంపలేదు.భారత్ కూడా పాక్ వేదికగా క్రీడా ఈవెంట్లను బాయ్కాట్ చేస్తూ వస్తుంది. ఆసియా టీ20 కప్తో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాక్కు వెళ్లలేదు. తమ మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంక, దుబాయ్ వేదికలగా ఆడింది.చదవండి: IPL 2026: సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్ -
హర్మూజ్ జల సంధిలో భారత్ నౌకను సీజ్ చేశాం : ఇరాన్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్ అడ్డుకుంటూ, స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఇరాన్ నౌకాదళం రెండు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారత్కు చెందిన నౌక కూడా ఉంది. ఈ నౌక దుబాయ్ నుంచి బయలుదేరి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఇరాన్ కమాండోలు గన్బోట్ల ద్వారా భారత్ నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎస్ఈ పేరుతో పనామా జెండాతో వెళ్తున్న మరో ఫ్రాన్స్ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు నౌకలను ఇరాన్ తీరానికి తీసుకెళ్లారు.ఇరాన్ విడుదల చేసిన వీడియోలో ముసుగులు ధరించిన కమాండోలు తుపాకులతో నౌకపైకి ఎక్కి తనిఖీలు చేపట్టిన దృశ్యాలు చూడొచ్చు. నౌకపై కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసరడంతో బ్రిడ్జ్ (కమాండ్ సెంటర్) దెబ్బతింది. అయితే సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు.ఈ ఘటనకు ముందు అమెరికా మెరైన్లు రెండు ఇరాన్ జెండా కింద నడుస్తున్న నౌకలను స్వాధీనం చేసుకోవడంతో, ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధికారులు ఇరాన్ ‘మస్కిటో ఫ్లీట్’ అనే చిన్న, వేగవంతమైన పడవలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.భారత్కు వెళ్తున్న వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్గం కావడంతో, ఇలాంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 🇮🇷⚡️BREAKING: IRGC releases footage showing their Navy forces seizing the 'MSC Epaminondas' vessel in the Strait of Hormuz earlier today. pic.twitter.com/Mx8Jt6QIAB— IRGC (@IRGC_Press) April 22, 2026 -
భారత్పై మరోసారి విషం కక్కిన ట్రంప్
వాషింగ్టన్: వలసల విషయంలో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్ను నరకంతో పోల్చిన ఓ లెటర్ను ట్రంప్ షేర్చేశారు. ఇండియా, చైనా దేశాలను అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్.. నరకకూపాలతో పోల్చగా.. ఆయన రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు. జన్మహక్కు పౌరసత్వం గురించి మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థిస్తూ ఆ పోస్టు షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. ఆ జాత్యహంకార లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై చేస్తున్న వాదనలను విమర్శిస్తూ సావేజ్ రాసిన లేఖతో పాటు వీడియోను కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పంచుకున్నారు.ఇక్కడ జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం ఇచ్చే విధానంపై సావేజ్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో కోర్టులకు వదిలేయకుండా జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆయన కోరారు. అంతేకాకుండా భారత్, చైనా వలసదారులు ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు.. వీళ్లు మనల్ని దోచుకున్నారు. ఈ గ్యాంగ్స్టర్లు అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది.. మొత్తం కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మనల్ని రెండో తరగతి పౌరులుగా చూశారు’’ అంటూ సావేజ్ రాసుకొచ్చారు. అమెరికా జెండాను భారతీయులు తొక్కేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
భారత్లో 500 హోటల్స్ లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్లో 2030 నాటికి ప్రాపర్టీల సంఖ్యను 500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాడిసన్ హోటల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎలీ యూనిస్ తెలిపారు. దీనితో 60,000–80,000 వరకు ఉద్యోగావకాశాలు లభించగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా రిక్రూట్ చేసుకోవడం కోసం ఉద్యోగార్థులకి శిక్షణ కలి్పంచేందుకు టూరిజం, హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్, స్థానిక వర్సిటీలు, ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాడిసన్కి 200 పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రథమ నుంచి నాలుగో శ్రేణి నగరాలవ్యాప్తంగా కొత్త హోటల్స్ని ఏర్పాటు చేయనున్నట్లు యూనిస్ చెప్పారు. వీటిల్లో 15 శాతం ఫైవ్ స్టార్వి, 45–50 శాతం అప్స్కేల్, త్రీ–స్టార్, ఫోర్–స్టార్ హోటల్స్ ఉంటాయని వివరించారు. కొత్తగా చేపట్టే వాటిల్లో 55 శాతం ప్రాజెక్టులు ప్రథమ శ్రేణి, 25 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉంటాయని యూనిస్ వివరించారు. 10 శాతం రిసార్టుల్లో, ఇంకో 10 శాతం ఆధ్యాతి్మక కేంద్రాల్లో ఉంటాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ప్రస్తుతం భారత్లో వ్యాపారం యథావిధిగానే నడుస్తోందని యూనిస్ వివరించారు. దుబాయ్, సౌదీ అరేబియాలాంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. తమకు అంతర్జాతీయంగా టాప్ 3 కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. -
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యం, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. కరెంటు అకౌంటు లోటు, రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రభావం పడుతుందని 2025–26 అక్టోబర్, డిసెంబర్ ట్రేడ్ వాచ్ రిపోర్టులో నీతి ఆయోగ్ ఈ విషయాలు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఇండియా–గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) పురోగతి నెమ్మదించి, డైవర్సిఫికేషన్పై ప్రభావం పడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనేవి వన్–వే మార్గం కాదని, దీని వల్ల కొత్త మార్కెట్ లభిస్తుందని మనం అనుకున్నట్లే అటువైపు దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. కఠినతరమైన పరిస్థితుల్లోను భారత్ వాణిజ్య కార్యకలాపాలు మెరుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తూ గత 20 ఏళ్లుగా భారత్ సగటున 6 శాతం వృద్ధి చెందింది. → రత్నాభరణాల రంగం మిడ్–వేల్యూ ఉత్పత్తుల నుంచి అధిక విలువ చేసే ఎగుమతులవైపు మళ్లాలి. → డిజైన్ ఆధారిత తయారీ, క్లస్టర్ ఆర్అండ్డీ, జీఐ బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. → డ్యూటీ డ్రాబ్యాక్/ రీఫండ్స్ను క్రమబదీ్ధకరించాలి. ముడి సరుకుల వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ) మార్జిన్లను పెంచేందుకు, సరఫరాను మెరుగుపర్చాలి. → రుణ లభ్యతను పెంచాలి. పెట్టుబడుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి. క్రెడిట్ గ్యారంటీలు, వడ్డీ రాయితీ, సప్లై చెయిన్ ఫైనాన్స్ను మెరుగుపర్చాలి. → 2026 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో ఉత్పత్తులు, సేవల వాణిజ్యం 5.3 శాతం పెరిగి 1.37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. → మొత్తం వాణిజ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్టీఏ) భాగస్వాముల వాటా పెరిగింది. → రత్నాభరణాల రంగంలో భారత్ కీలకంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, హాంకాంగ్ వాటా 73 శాతంగా ఉంది. దిగుమతుల్లో యూఏఈ, స్విట్జర్లాండ్, హాంకాంగ్ వాటా 60 శాతంగా ఉంది. -
పదేళ్ల తర్వాత... దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నీకి భారత్ ఆతిథ్యం
ఢాకా: దశాబ్దం తర్వాత భారత్ వేదికగా దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ ఏడాది మే 25 నుంచి జూన్ 6వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి గోవా రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది. భారత్లో చివరిసారి 2016లో (సిలిగురి, పశ్చిమ బెంగాల్) దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీకి సంబంధించి గ్రూప్ వివరాలను బుధవారం ఢాకాలోని దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య కార్యాలయంలో విడుదల చేశారు. గ్రూప్ ‘ఎ’లో నేపాల్ (87వ ర్యాంక్), శ్రీలంక (162), భూటాన్ (164)... గ్రూప్ ‘బి’లో భారత్ (69వ ర్యాంక్), బంగ్లాదేశ్ (112), మాల్దీవులు (167) జట్లున్నాయి. భారత్ తమ లీగ్ మ్యాచ్లను మే 25న మాల్దీవులతో, మే 31న బంగ్లాదేశ్తో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ జూన్ 3న జరుగుతాయి. ఫైనల్ను జూన్ 6న నిర్వహిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆ జట్టు ఈ టోర్నీలో ఆడటం లేదు. అత్యధికంగా ఐదుసార్లు (2010, 2012, 2014, 2016, 2019) భారత జట్టు దక్షిణాసియా టోర్నీ టైటిల్స్ సాధించింది. -
మాడిపోతున్న ఉత్తరాది.. తడిసిపోతున్న దక్షిణాది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పంజాబ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా భానుడి ప్రతాపానికి సాధారణ జీవనం స్తంభించిపోతోంది. ఒకవైపు పర్యాటకులు వడదెబ్బకు గురవుతుంటే, మరోవైపు రాత్రుళ్లు సైతం వేడి గాలులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తీవ్రమైన హీట్వేవ్ పరిస్థితులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.ఢిల్లీలో ‘వాటర్ బెల్స్’.. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు, ప్రతి 45-60 నిమిషాలకు ఒకసారి విధిగా ‘వాటర్ బెల్’ మోగించాలని పాఠశాలలను ఆదేశించింది. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే, ప్రయాగ్రాజ్ లో ఏకంగా 44.6 డిగ్రీలు నమోదు కాగా, 26 జిల్లాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఆగ్రాలోని తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన ఆరుగురు పర్యాటకులు ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. ఎండల భయానికి రాజస్థాన్ లోని జైపూర్, ఉదయ్పూర్ వంటి పర్యాటక ప్రాంతాలు సైతం సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి.రాత్రి పూట కూడా వీడని ‘వేడి’సాధారణంగా పగలు ఎండలు మండినా, రాత్రికి వాతావరణం చల్లబడుతుంది. కానీ, మధ్యప్రదేశ్లోని భోపాల్ సహా మరో ఎనిమిది జిల్లాల్లో ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడమే కాకుండా, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.5°C నుంచి 6.4°C మేర పెరగడంతో వాతావరణ శాఖ ‘వార్మ్ నైట్’ (వెచ్చని రాత్రి) అలర్ట్ జారీ చేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలకు పైగా నమోదవుతూ, వేడి గాలులు వీస్తుండటం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది.మున్ముందు మరింత ఉక్కపోతభగభగమండే ఎండల నుంచి ఉపశమనం కోసం రైల్వే స్టేషన్లు, రోడ్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ (43.8°C) స్టేషన్లో మిస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయగా, బీహార్ (42°C) లో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లపై నీళ్లు చల్లుతోంది. వాతావరణ అంచనాల ప్రకారం.. మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు హీట్ వేవ్ కొనసాగనుంది. అదే సమయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.ఇది కూడా చదవండి: ఛార్ ధామ్లో చిరు వ్యాపారం.. లైఫు సెట్టు! -
నిప్పుల కొలిమి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో మంగళవారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని బందాలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. యూపీతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్–20 నగరాల్లో 19 మన దేశంలోనివే కావడం గమనార్హం. మరో మూడు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ సీజన్లో యూపీ, హరియాణా, జార్ఖండ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణానికి మించి వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.వీటితోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులుంటాయని హెచ్చరించారు. మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్–20 జాబితాలో యూపీలోని బందా, బిహార్లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ నగరాలు న్నాయి. ఇక్కడ 44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వీటితోపాటు బిహార్లోని బెగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్పూర్, సివాన్లతోపాటు యూపీ, పశ్చిమ బెంగాల్లలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. టాప్–20 నగరాల్లో మనదేశంలో లేని ఏకైక నగరం నేపాల్లోని లుంబిని మాత్రమే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా భోపాల్లో ‘నైట్ హీట్ వేవ్’(రాత్రిపూట వడగాల్పులు) హెచ్చరికలు జారీ అయ్యాయి. -
టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్లో ఉద్యోగాలు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది.ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే.. కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.భారీ పెట్టుబడులుటెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్వర్క్లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి.తయారీ రంగంలో టెస్లాటెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసంపీసీబీ లేఅవుట్ ఇంజనీర్ల నియామకం ద్వారా వాహనాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇన్ఫోటైన్మెంట్, కంప్యూటింగ్ హార్డ్వేర్ అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది టెస్లా భారతదేశాన్ని తన గ్లోబల్ ఆపరేషన్లకు సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రంగా ఉపయోగించాలనే యోచనను సూచిస్తోంది.ఆపరేషన్స్, రిటైల్ప్రోటోటైప్ వాహనాలను నడిపి.. డేటా సేకరించే డ్రైవర్లు, అలాగే సేల్స్, సర్వీస్ ఉద్యోగులు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఇవి టెస్లా భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి చేస్తున్న ఏర్పాట్లను చూపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే టెస్లా భారతదేశంలో చేస్తున్న నియామకాలు కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఏఐ, తయారీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సరఫరా గొలుసు వంటి విభిన్న రంగాలలో సమగ్ర స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికను తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
ఎండతో గుండెకు ముప్పు.. తప్పేదెలా?
వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతోంది. అధిక వేడి, డీహైడ్రేషన్, రక్తపోటు మార్పులు గుండెపై అదనపు ఒత్తిడి తెచ్చి ప్రాణాల మీదకు తేవొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, హై బీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లు వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. శరీరం చల్లబడేందుకు గుండె ఎక్కువగా పని చేసే క్రమంలో అలసిపోతుంది. అదే సమయంలో డీహైడ్రేషన్ కారణంగా నీరు, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, మాగ్నీషియం) కోల్పోవడం వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వేడి కారణంగా రక్తనాళాలు విస్తరించి బ్లడ్ ప్రెషర్(రక్తపోటు) పడిపోవడం కూడా జరగొచ్చు. వీటితో పాటు..వేసవిలో అధిక ఉప్పు, కొవ్వు, మద్యం తీసుకోవడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. అవుట్సైడ్ ఫ్యాకర్లుగా.. కాలుష్యం కూడా ఓ ముప్పుగా మారుతోంది.ఎవరికీ ఎక్కువ ప్రమాదం?వృద్ధుల్లో.. చెమట పట్టే సామర్థ్యం తగ్గిపోవడం వల్లే ఎక్కువ రిస్క్ ఉంటుంది. హైబీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లకు.. గుండెపై అదనపు ఒత్తిడి పడొచ్చు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవా ఇప్పటికే బలహీనమైన గుండె మరింత ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. డయూరెటిక్స్(వాటర్ పిల్స్), బీటా బ్లాకర్స్(గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తాయి). NSAIDs మెడిసిన్స్ వాడేవాళ్లలో డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను పెంచుతాయి. ఈ మందులు వేసవిలో వాడేవారు నీరు ఎక్కువగా తాగడం, ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవడం, డాక్టర్ సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.వేసవిలో గుండెపోటు నివారణకు జాగ్రత్తలుతగినంత నీరు తాగండి.. రోజుకు కనీసం 8 గ్లాసులు, బయటకు వెళ్లేవాళ్లు మరింత ఎక్కువగాకాఫీ, మద్యం, అధిక చక్కెర పానీయాలు తగ్గించండి – ఇవి డీహైడ్రేషన్ను పెంచుతాయి.ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో (10 AM – 4 PM) బయటకు వెళ్లకండి.తేలికపాటి, గాలి చొరబడే దుస్తులు ధరించండి.. కాటన్, లినెన్ ఉత్తమం.తీవ్రమైన వ్యాయామం వేసవిలో మధ్యాహ్నం చేయకండి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేయడం మంచిది.ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలు.. వేడి నుంచి రక్షణ కోసం ఏదైనా ఉపయోగించండి.వేసవిలో ఆహారం నియంత్రించండి – ఉప్పు, కొవ్వు, మద్యం తగ్గించండి.హీట్ స్ట్రోక్ లక్షణాలు గుర్తించి అప్రమత్తం కావాలి. అధిక చెమట, తల తిరగడం, గందరగోళం, వేడి చర్మం, అధిక జ్వరం. ఇవి ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి. -
అగ్రరాజ్యంతో అదిరిపోయే డీల్.. భారత్కు బహుళ ప్రయోజనం!
న్యూఢిల్లీ: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగాలలో కొత్త శకానికి నాంది పలుకుతూ, వాషింగ్టన్ డీసీ వేదికగా జరుగుతున్న తాజా చర్చలు అత్యంత వేగంగా, విజయవంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి.ముగింపు దశలో కీలక చర్చలువాషింగ్టన్ డీసీలో భారత్, అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతున్న తాజా వాణిజ్య చర్చలు అత్యంత సానుకూలంగా, ఉత్పాదక దిశగా కొనసాగుతున్నాయని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక చర్చల్లో భారత బృందానికి దర్పణ్ జైన్ నాయకత్వం వహిస్తుండగా, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం తరపున బ్రెండన్ లించ్ నేతృత్వం వహిస్తున్నారు. ఒప్పందానికి సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ ఇప్పటికే పరిష్కారమయ్యాయని, కేవలం కొన్ని చిన్నపాటి అంతరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘ఎక్కువ భాగం పూర్తయింది, ఇక మిగిలి ఉన్నవి చాలా తక్కువే’ అని వారు పేర్కొన్నారు.ఇరు దేశాలకు భారీ ప్రయోజనంఈ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతగానో మేలు చేస్తుందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని ఇరువురికి లాభదాయకమైన ‘విన్-విన్’ ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. సుంకాలు తగ్గించడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చాలా కాలంగా ఈ చర్చలు సాగుతున్నాయి. కాగా తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్పై ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు దేశాలు అంగీకారం తెలపడం ఈ డీల్లో కీలక ముందడుగు.భవిష్యత్తును మార్చేలా బహుముఖ బంధంఈ ఒప్పందంలో భారతదేశ ప్రయోజనాలను పూర్తిగా కాపాడామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మొదటి దశ ఒప్పందం దాదాపు సిద్ధమైందని తెలిపిన ఆయన.. పోటీ దేశాలతో పోలిస్తే ఇది అత్యుత్తమ డీల్స్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడగలదని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాదని, సాంకేతికత, కీలక ఖనిజాలు, రక్షణ రంగాలలో భాగస్వామ్యంతో కూడిన బహుముఖ బంధమని ఆయన పేర్కొన్నారు. ఇది భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే రెండు బలమైన దేశాల కలయిక అని అన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ సంచలన వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ -
ఇక బలీయ బంధం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, దక్షిణ కొరియా నిర్ణయించుకున్నాయి. వార్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చాలని తీర్మానించాయి. అంతేకాకుండా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఏడాది లోగా మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సోమవారం ఢిల్లీలో సమావేశయ్యారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కీలక రంగాల్లో సరస్పర సహకారానికి సంబంధించి ఇరుదేశాల మధ్య 15 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇంధనం, రక్షణ, అరుదైన ఖనిజాలు, నౌకా నిర్మాణం, సెమీకండక్టర్ల వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని మోదీ, లీ జే మ్యూంగ్ నిర్ణయించారు. ఇండియా–సౌత్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఒక ఉమ్మడి వ్యూహాత్మక విజన్ను ఆవిష్కరించారు. నౌకా నిర్మాణం, నౌకా రవాణా, సముద్ర రవాణా రంగాల్లో భాగస్వామ్యం కోసం ఒక సమగ్ర విధానాన్ని భారత్, దక్షిణ కొరియా విడుదల చేశాయి. ఇంధన భద్రతపై ఒక సంయుక్త ప్రకటనను సైతం వెలువరించాయి. భారత్లో కొరియన్ పారిశ్రామిక టౌన్షిప్ 2010లో అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఉన్నతీకరించడమే లక్ష్యంగా చర్చలను పునఃప్రారంభించడంపై ఒక ఉమ్మడి ప్రకటనపై భారత్, దక్షిణకొరియా సంతకాలు చేశాయి. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకొనే చర్యల్లో భాగంగా భారత్లో కొరియన్ పారిశ్రామిక టౌన్షిప్ను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. వాతావరణ మార్పు, ఆర్కిటిక్, సముద్ర సహకారంపై చర్చల కోసం న్యూఢిల్లీ, సియోల్ ‘ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్’తోపాటు విదేశాంగ మంత్రిత్వ శాఖల ఫ్రేమ్వర్క్ను కూడా ప్రారంభించాయి. పశ్చిమాసియా పరిణామాలపై మోదీ, లీ జే మ్యూంగ్ చర్చించుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు పెరుగుతుండడం కూడా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో–పసిఫిక్ దిశగా ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేస్తామని భారత్, దక్షిణ కొరియా తేల్చిచెప్పాయి. అవి రెండు దేశాల డీఎన్ఏలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తమ రెండు దేశాలు శాంతి, స్థిరత్వ సందేశాన్ని అందిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, దక్షిణ కొరియా మధ్య ప్రస్తుతం వార్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు చెప్పారు. దీన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, చట్టబద్ధమైన పాలన పట్ల గౌరవం అనేవి రెండు దేశాల డీఎన్ఏలో ఉన్నాయని ఉద్ఘాటించారు. -
ఎండాకాలం వేళ రైళ్లలో ప్రయాణం చాలా ఈజీ
న్యూఢిల్లీ: వేసవి కాలం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రయాణికులు సాఫీగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులకు ఆమోదం తెలిపింది. 2026 ఏప్రిల్ 15 నుంచి 2026 జులై 15 వరకు మొత్తం 908 వేసవి ప్రత్యేక రైళ్లను నడపడానికి అధికారులు నిర్ణయించారు. ఇవి 18,262 ట్రిప్స్ నడుస్తాయి. వాటిలో 660 రైళ్లను ఇప్పటికే నోటిఫై చేశారు. ఇవి 11,294 ట్రిప్స్ కు సంబంధించినవి. దీని వల్ల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం, మీ జర్నీ ప్లాన్ను రూపొందించడం సులభమవుతుంది. సెలవులు, పండుగలు, పీక్ ట్రావెల్ సమయాల్లో ఇటువంటి ప్రత్యేక సర్వీసులు ఎంతో కీలకంగా మారతాయి. వేసవి ప్రత్యేక రైళ్ల నిర్వహణ భారతీయ రైల్వేల అన్ని ప్రధాన జోన్లలో జరుగుతోంది. సౌత్ సెంట్రల్ రైల్వే 124 రైళ్లు (1,184 ట్రిప్స్)కు ఆమోదం తెలిపి, 76 రైళ్లు (324 ట్రిప్స్) నోటిఫై చేసింది.వెస్ట్రన్ రైల్వే 106 రైళ్లు (2,078 ట్రిప్స్) ఆమోదం తెలిపి 92 రైళ్లు (1,667 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (2,245 ట్రిప్స్) ఆమోదం తెలిపి 62 రైళ్లు (1,878 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్తర్న్ రైల్వే 76 రైళ్లు (2,090 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (1,535 ట్రిప్స్) నోటిఫై చేసింది.సెంట్రల్ రైల్వే 74 రైళ్లు (3,082 ట్రిప్స్) ఆమోదం తెలిపి 70 రైళ్లు (2,238 ట్రిప్స్) నోటిఫై చేసింది.సదర్న్ రైల్వే 72 రైళ్లు (558 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (133 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్ సెంట్రల్ రైల్వే 64 రైళ్లు (2,711 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (1,060 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ సెంట్రల్ రైల్వే 54 రైళ్లు (1,163 ట్రిప్స్) ఆమోదం తెలిపి 46 రైళ్లు (688 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ ఈస్ట్రన్ రైల్వే 52 రైళ్లు (814 ట్రిప్స్) ఆమోదం తెలిపి 34 రైళ్లు (477 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్ కోస్ట్ రైల్వే 28 రైళ్లు (410 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (88 ట్రిప్స్) నోటిఫై చేసింది.వెస్ట్ సెంట్రల్ రైల్వే 28 రైళ్లు (408 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (192 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్రన్ రైల్వే 24 రైళ్లు (392 ట్రిప్స్) ఆమోదం తెలిపి 10 రైళ్లు (276 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ ఫ్రంట్ియర్ రైల్వే 24 రైళ్లు (220 ట్రిప్స్) ఆమోదం తెలిపి 20 రైళ్లు (141 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ ఈస్ట్రన్ రైల్వే 20 రైళ్లు (276 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (250 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 10 రైళ్లు (122 ట్రిప్స్) ఆమోదం తెలిపి 8 రైళ్లు (70 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (509 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (277 ట్రిప్స్) నోటిఫై చేసింది.వేసవి ప్రత్యేక రైళ్ల వల్ల పీక్ సీజన్ సమయంలో వెయిటింగ్ లిస్ట్ తగ్గే అవకాశం ఉంది. అదనపు బెర్తులు లభించడంతో ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రధాన నగరాలు, ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అధిక డిమాండ్ ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయి. -
ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!
భారతదేశంలో ట్రైన్ జర్నీ అనేది కేవలం గమ్యస్థానాలను చేరుకోవడానికి మాత్రమే కాకుండా.. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే.. దాదాపు అందరూ కూడా సాధారణ రైళ్లలో ప్రయాణం చేసి ఉంటారు. కానీ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణం చాలా అరుదు. ఈ రకమైన ట్రైన్ జర్నీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విశాలమైన కిటికీల (విండోస్) గుండా బయట ప్రపంచాన్ని చూడటం ఆ థ్రిల్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ కథనంలో మన దేశంలోని డబుల్ డెక్కర్ రైలు మార్గాలు ఏవి? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.ముంబై - అహ్మదాబాద్డబుల్ డెక్కర్ రైలు అనగానే చాలామందికి గుర్తొచ్చేది ముంబై - అహ్మదాబాద్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైన, అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. ఇది రెండు ముఖ్యమైన నగరాలను కలుపుతూ వ్యాపారవేత్తలు, తరచూ ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఒకరోజులో జర్నీ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. సౌకర్యవంతమైన చైర్ కార్ సీటింగ్, పెద్ద కిటికీలు ఉండటం వల్ల మీ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది.ఢిల్లీ - జైపూర్ఢిల్లీ-జైపూర్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ దేశ రాజధాని ఢిల్లీని రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్తో కలుపుతుంది. ఈ మార్గంలో ఏడాది పొడవునా పర్యాటకులు, రోజువారీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇందులో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు.చెన్నై - బెంగళూరుచెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ప్రయాణించే రైళ్లలో ఒకటి. ఉద్యోగులు, విద్యార్థులు, వారాంతపు ప్రయాణికులు ఎక్కువగా ఈ రైలును ఉపయోగిస్తారు. పరిమితమైన స్టాప్లు, సమర్థవంతమైన షెడ్యూలింగ్ వంటివి ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ రైలుకు అధిక డిమాండ్ ఉండటం వల్ల.. టికెట్లు త్వరగా అమ్ముడవుతాయి.విశాఖపట్నం - విజయవాడవిశాఖపట్నం - విజయవాడ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ సర్వీసు సాధారణ ప్రయాణికులకు, ఆఫీసులకు వెళ్లేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. విశాఖ పట్టణం, విజయవాడలకు ప్రయాణించాలనుకునే వారికి ఈ డబుల్ డెక్కర్ మంచి ఎంపిక.హౌరా - ధన్బాద్హౌరా-ధన్బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్.. కోల్కతాను జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలతో కలుపుతూ నడుస్తుంది. దీనిని వ్యాపారులు, ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా.. రోజువారీ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.సాధారణ రైళ్లు మాదిరిగా.. డబుల్ డెక్కర్ ట్రైన్స్ అన్ని మార్గాలలో అందుబాటులో ఉండవు. దీనికి కారణం ప్రత్యేకమైన మౌలిక వసతులు. ఉదాహరణకు.. ప్లాట్ఫారమ్ ఎత్తు, ట్రాక్ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందువల్ల భారతీయ రైల్వేలు అధిక డిమాండ్ ఉన్న కొన్ని మార్గాలలో మాత్రమే వీటిని ప్రవేశపెట్టాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
అప్పుడు మాత్రమే హర్మూజ్ను దాటండి: భారత్
హర్మూజ్ జలసంధిని దాటే క్రమంలో రెండు వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో భారత్ అప్రమత్తమైంది. మొన్నటి వరకూ హర్మూజ్ను జలసంధిని దాటే క్రమంలో భారత్కు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, రెండు రోజుల క్రితం భారత్ నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాస్త ఆందోళన కల్గించింది. ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాతే ఆ నౌకలు హర్మూజ్ను దాటుతున్నప్పటికీ ఒక్కసారిగా దాడి జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా-ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడమ హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ఇరాన్ మరింత పటిష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హర్మూజ్ను తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసిన ఇరాన్.. అందుకు అమెరికా వైఖరే కారణమని ధ్వజమెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో విసుగెత్తిపోయిన ఇరాన్.. ఇక చేసేది లేక హర్మూజ్ను దిగ్బంధనాన్ని కొనసాగించడమే కాకుండా దానిని మరింత పటిష్టంగా చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏ నౌకలకు ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదు. ఆ క్రమంలోనే భారత నౌకలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అప్పటివరకూ హర్మూజ్ను దాటకండిఈ పరిస్థితుల నడుమ భారత్ కొన్ని నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. తమ ఆదేశాలు వచ్చే వరకూ హర్మూజ్ను భారత నౌకలు దాటే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే లారక్ దీవి దగ్గరికి వెళ్లకుండా ఉండాలని తమ ఆదేశాల్లో పేర్కొంది, భారత నౌకాదళం సూచించినప్పుడు మాత్రమే హోర్ముజ్ జలసంధి దాటాలని పేర్కొంది. ఏప్రిల్ 18వ తేదీన ఐఆర్జీసీ(ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ )రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఘటన తర్వాత హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది భారత నౌకాదళం.ఇప్పటివరకు పదకొండు భారత నౌకలు జలసంధిని విజయవంతంగా దాటాయి. చివరి ట్యాంకర్ దేశ్ గరీమా ఏప్రిల్ 18న దాటింది. అదే రోజు జగ్ అర్ణవ్, సన్మార్ హెరాల్డ్ నౌకలు.. ఇరాన్ కాల్పుల కారణంగా వెనక్కి తిరగాల్సి వచ్చింది. పర్షియన్ గల్ఫ్లో తమ దేశ నౌకల భద్రతకు సంబంధించి లారక్ దీవి వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బారత నౌకాదళం. దీనిలో భాగంగానే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లారాక్ ద్వీపంఇరాన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన మార్గం. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి నియంత్రణలో భాగంగా ఇరాన్ ఈ ద్వీపాన్ని సైనికంగా ఉపయోగిస్తుంది. -
హర్మూజ్ భద్రతకై భారత్తో పనిచేస్తాం.. లీ-జే-మ్యూంగ్
సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించడం తప్పనిసరన్నారు. ఈ అంశంలో భారత్తో కలిసి పనిచేయడానికి సౌత్ కొరియా సిద్ధంగా ఉందని తెలిపారు.దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తన మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న (ఆదివారం) భారత్కు విచ్చేశారు. ఈ సందర్బంగా న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ అభివృద్ధి చెందుతున్న దేశాలైన సౌత్ కొరియా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దిగుమతుల విషయంలో ఏ ఒక్క దేశంపైనా పూర్తిస్థాయిలో ఆధారపడకూడదని అది దేశ మనుగడకే ప్రశ్నార్థకమవుతుందన్నారు.హర్ముజ్ జలసంధిపై మాట్లాడుతూ.. "రిపబ్లిక్ ఆఫ్ కొరియా, భారత్ రెండూ దేశాలు ముడి చమురు,సహజ వాయువుతో సహా తమ ఇంధన సరఫరాలలో మెజారిటీ వాటా కోసం మధ్యప్రాచ్యంపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల, మన ప్రజల భద్రతకు మరియు మన దేశాల మనుగడకే కీలకమైన సముద్ర మార్గాల భద్రతను నిర్ధారించడం అత్యవసరం. హర్ముజ్ జలసంధిలో అన్ని నౌకలు సురక్షితంగా, స్వేచ్ఛగా ప్రయాణించేలా చూసేందుకు కొరియా, భారత్తో సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఈ ఉమ్మడి నిబద్ధతను నిలబెట్టుకోవడానికి సంబంధిత అంతర్జాతీయ వేదికలలో కూడా మేమిద్దరం కలిసి పనిచేయడం కొనసాగిస్తాము". అని అన్నారుప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాలు చమురుకోసం మరో మార్గాన్ని ఎంచుకోవడం కూడా అవసరం అని ఆయన అన్నారు. ఇటీవల హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో ఈయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.కాగా ఈ రోజు (సోమవారం)ష్ట్రపతి భవన్లో లీ -జే-మ్యూంగ్కు అధికారికంగా సైనిక వందనంతో స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన రాజ్ ఘాట్ సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. -
భారత నౌకలపై ఇరాన్ దాడి.. ఆడియో టేప్ వైరల్
నిన్న (శనివారం) హర్ముజ్ జలసంధి దాటుతున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నావికా దళం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి సమయంలో ఆ నౌకకు సంబంధించిన ఆడియో టేప్ బయిటకు వచ్చింది. అందులో నౌక కెప్టెన్ ఇచ్చిన ఎమర్జెన్సీ సందేశం ఇప్పుడు వైరల్గా మారింది.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్ హర్ముజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు రవాణా సరఫరా స్తంభించిపోయింది. అయితే భారత్తో పాటు ఇతర మిత్ర దేశాలకు చెందిన కొన్ని నౌకలకు మాత్రం జలసంధి గుండా ప్రయాణానికి ఇరాన్ అనుమతించింది. అయితే నిన్న భారత్కు చెందిన వాణిజ్య నౌకపైన ఇరాన్ నావిక దళ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మేస్జ్ ఆడియో టేప్ ఇప్పుడు వైరల్గా మారింది.ఆ ఆడియోలో " సెపా నేవీ. సెపా నేవీ. ఇది సన్మార్ హెరాల్డ్ మోటార్ ట్యాంకర్. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి" అని ఆ నౌకలోని వ్యక్తి అంటున్నట్లు సందేశం ఉంది. మరోవైపు భారత్ సైతం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబారిని పిలిపింది ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ ఇది వరకూ భారత్కు చెందిన నౌకలకు హర్ముజ్ గుండా వెళ్లడానికి అనుమతులిచ్చిందని ప్రస్తుతం సైతం ఆ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం యుద్ధంపై మరోసారి ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్ చర్చలు పురోగమిస్తున్నాయనే తరుణంలో ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఒకరోజు తిరగకుండానే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే రెండోదఫా చర్చలలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది.ఏం జరిగింది?శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. ఈ కాల్పుల ఘటన ఒమాన్కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్ నుంచి స్పష్టత కోరుతున్నాయి.కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.#BREAKING Audio clip emerges from attacked Indian oil tanker!"You gave me clearance to go. My name is second on your list. You are firing now. Let me turn back!" — Audio from the Indian oil tanker fired on by the Iranian NavyClearance given. Ship fired on anyway https://t.co/FDAxliPc7Q pic.twitter.com/KH0Y4eYGCh— Nabila Jamal (@nabilajamal_) April 18, 2026 -
భారత్లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా?
న్యూఢిల్లీ: అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని అందుకే హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న నౌకలపై ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. దీంతో భారత్లో ఇంధన సరఫరా భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో 60 రోజుల వరకు చమురు, పెట్రోల్, డీజిల్,ఏటీఎఫ్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, దీర్ఘకాలిక అంతరాయం వస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో 85శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా, యూఏఈ వంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచే వస్తుంది. ఈ సరఫరా ప్రధానంగా హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. కాబట్టి ఆ మార్గం మూసుకుపోతే సరఫరా అంతరాయం, రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు అన్నీ పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల దేశీయ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.భారత్ గత కొన్నేళ్లుగా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. రెడ్ సీ–సూయజ్ కాలువ మార్గం, బాబ్ ఎల్-మండెబ్ జలసంధి వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తోంది. అదనంగా, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా సరఫరా పొందుతోంది. ప్రస్తుతం భారత్కి 60 రోజుల చమురు నిల్వలు, 50 రోజుల ఎల్ఎన్జీ నిల్వలు, 40 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం తెలిపిన ప్రకారం, మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు వరకు ఉంది.ప్రస్తుతం నిల్వలు ఉన్నప్పటికీ హర్మూజ్ జలసంధి దీర్ఘకాలం మూసుకుపోతే భారత్కి ఇంధన సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణ కష్టమవుతుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త సరఫరా ఒప్పందాలు, వ్యూహాత్మక నిల్వలు పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
721 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొత్త రికార్డులకు చేరాయి. 71.98 బిలియన్ డాలర్ల (రూ.6,69,414 కోట్లు) విలువైన బంగారం దిగుమతి అయింది. 2024–25 సంవత్సరంలో 58 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోల్చి చూస్తే 24 శాతం పెరిగాయి. పరిమాణం పరంగా చూస్తే తగ్గుదల కనిపిస్తోంది. 2024–25లో 759.09 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.76 తక్కువగా 721.03 టన్నులకు పరిమితమయ్యాయి. బంగారం ధర గణనీయంగా పెరగడంతో, విలువ అధికంగా ఉన్నప్పటికీ పరిమాణం తగ్గినట్టు వాణిజ్య శాఖ గణాంకాల ఆధారంగా స్పష్టమవుతోంది. 2023–24లో 45.54 బిలియన్ డాలర్లు, 2022–23లో 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు నమోదయ్యాయి. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగ మార్కెట్గా ఉండడం గమనార్హం. ప్రధానంగా ఆభరణాల నుంచే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. → వెండి దిగుమతుల విలువ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 150 % పెరిగి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిమాణం పరంగానూ 42 % పెరిగి 7,335 టన్నుల మేర ఉంది. → బంగారం కిలో ధర 2024–25లో 76,617 డాలర్లుగా ఉంటే, 2025–26లో 99,825 డాలర్లకు చేరడం దిగుమతుల విలువ పెరిగేందుకు దారితీసింది. → అత్యధికంగా స్విట్జర్లాండ్ నుంచి 40 శాతం మేర బంగారం దిగుమతి కాగా, యూఏఈ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% చొప్పున వచ్చింది. దేశ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 5 శాతంగా ఉంటుంది. → స్విట్జర్లాండ్ నుంచి బంగారం దిగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 11.36 శాతం పెరిగి 24.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మహిళా కోటా బిల్లు అమలును ముందుకు తీసుకెళ్లే విషయంలో కేంద్ర సర్కారుకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 18) రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీ జాతీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ప్రతిపక్షాలను “దోషులు” అని ప్రధాని మోదీ అన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రతిపక్షం వైఖరిని ఆయన తప్పు అని పేర్కొని, భవిష్యత్తులో రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.కాగా, లోక్సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిన విషయం తెలిసిందే. 352 ఓట్లు రావాల్సి ఉండగా అనుకూలంగా 298 ఓట్లే వచ్చాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేశారు 230 మంది విపక్ష సభ్యులు. మూడింట రెండొంతుల మెజారిటీ రాలేదు. దీంతో ఆ తర్వాత సవరణతో పాటు మిగతా రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.మోదీ హయాంలో ఓ బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి. మహిళా చట్టం అమలుకు కృషి చేస్తూనే ఉంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు. విపక్షాలు మాత్రం బీజేపీ డీలిమిటేషన్ కుట్రలను ఓడించామని అంటున్నారు. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ శనివారం బీజేపీ మహిళా నేతలు నిరసనలు తెలుపుతునున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అవకాశం ఉంది. -
టాప్ 3 మార్కెట్లలో భారత్
చెన్నై: రాబోయే రోజుల్లో భారత్ తమ టాప్ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో గ్లోబల్ గ్రూప్ సీఈవో ఫ్రాంకోయిస్ ప్రొవోస్ట్ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్ఫోలియోని ఏడు మోడల్స్కి విస్తరిస్తామని వివరించారు.అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్ నుంచి ఏటా 2 బిలియన్ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్ వివరించారు. కాంపాక్ట్ ఎస్యూవీ ’బ్రిడ్జర్ కాన్సెప్ట్’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్లో రెనో గ్రూప్కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్ వాహనంగా, తమ విద్యుత్ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు.తమ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్ చెప్పారు. -
దేశంలో తొలిసారి ఇంటింటి ఆదాయ సర్వే..
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జాతీయ గృహ ఆదాయ సర్వే (NHIS) నిర్వహించనున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ప్రకటించింది. 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చి వరకు ఏడాది పాటు ఈ భారీ సర్వే ప్రక్రియ కొనసాగనుంది.రుజువు-ఆధారిత విధాన రూపకల్పనే లక్ష్యంగణాంక విశ్లేషణలో ఇప్పటివరకు ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తూ, వాస్తవిక డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ‘రుజువు-ఆధారిత విధాన రూపకల్పనను బలోపేతం చేసేందుకు, ప్రజల వాస్తవ ఆదాయాలను లెక్కించేందుకు ఈ సర్వే చేపడుతున్నాం’ అని మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.సర్వే ఎలా చేస్తారంటే.. నమూనా సేకరణ శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కుటుంబాలను ఎంపిక చేసి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు, ఖర్చు చేసే విధానాలపై ఈ సర్వే ద్వారా సమగ్ర విశ్లేషణ చేస్తారు. వినియోగదారుల ధరల సూచిక (CPI) సవరణకు, జాతీయ ఖాతాల తయారీకి, పేదరిక నిర్మూలన విశ్లేషణకు ఈ డేటా వెన్నెముకగా నిలుస్తుంది. ‘గృహ ఆదాయాలను నేరుగా సర్వే చేయడం ద్వారా ఆదాయ అసమానతలు, ఉత్పత్తి వనరుల మధ్య ఉన్న వ్యత్యాసాలను లోతుగా విశ్లేషించే అవకాశం కలుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.ప్రపంచ దేశాల సరసన భారత్ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గృహ ఆదాయ డేటాను సేకరిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ విభాగంలో చేరడం ద్వారా ఆర్థిక గణాంకాలలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోనుంది.ఇప్పటికే ముగిసిన 'ప్రీ-టెస్టింగ్'ఈ ప్రతిష్టాత్మక సర్వే కోసం ఐఎంఎఫ్ (IMF) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుర్జిత్ భల్లా నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు, సర్వే ప్రశ్నావళి సామర్థ్యాన్ని పరీక్షించడానికి 2025 ఆగస్టు 4 నుండి 8 వరకు ముందస్తు పరీక్షలు (Pre-testing) నిర్వహించారు.హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు సహా 15 ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఈ ట్రయల్స్ జరిగాయి. ధనిక, పేద వర్గాలను కవర్ చేసేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ క్షేత్రస్థాయి కసరత్తులు పూర్తి చేశారు. ప్రభుత్వం చేపట్టబోయే ఈ సరికొత్త సర్వే ద్వారా సామాజిక-ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!NSO, MoSPI is undertaking India’s first National Household Income Survey (NHIS) from April 2026 to March 2027, capturing income to strengthen evidence-based policy formulation.Visit MoSPI’s official website for related updates and official information: https://t.co/V2xm331pY2… pic.twitter.com/1mmaukq88v— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) April 17, 2026 -
వంట గ్యాస్ సంక్షోభం : రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్
ఇరాన్ వార్ నేపథ్యంలో నెలకొన్న వంట గ్యాస్ సరఫరా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం వంటగ్యాస్ (LPG) రవాణాను మరింత సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు, రిఫైనరీలు, ఓడరేవులను బాట్లింగ్ ప్లాంట్లతో అను సంధానించేలా నాలుగు పైప్లైన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంధన రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) సుమారు రూ. 12,500 కోట్ల అంచనా పెట్టుబడితో, సుమారు 2500కిలో మీటర్లు నాలుగు పైప్లైన్ల బిడ్ ప్రతిపాదనలకోసం బిడ్డింగ్ ప్రక్రియను ముగించే పనిలో ఉంది. నాలుగు ప్రధాన మార్గాలు ఏవంటేచెర్లపల్లి – నాగ్పూర్ పైప్లైన్శిఖ్రాపూర్ – హుబ్లీ – గోవా పైప్లైన్పారాదీప్ – రాయ్పూర్ పైప్లైన్ఝాన్సీ – సీతార్గంజ్ పైప్లైన్ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యంప్రస్తుతం ఎల్పీజీని ట్యాంకర్ల ద్వారా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పైప్లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల ప్రమాదాల ముప్పు తగ్గుతుంది. రిఫైనరీలు మరియు ఓడరేవులను నేరుగా బాట్లింగ్ ప్లాంట్లతో అనుసంధానించడం ద్వారా గ్యాస్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడవచ్చు. అవసరమైన సమయంలో ఈ పైప్లైన్లు స్టోరేజ్ యూనిట్లుగా కూడా పనిచేస్తాయి. రోడ్డు రవాణా తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్యపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, భారత్ ఎల్పీజీ దిగుమతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా వైపు చూస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశీయంగా బలమైన పైప్లైన్ వ్యవస్థ ఉండటం వల్ల పంపిణీ ఖర్చులను కొంతవరకు నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తం 9 ఎల్పీజీ పైప్లైన్ ప్రాజెక్టులను గుర్తించగా, ప్రస్తుతం ఈ నాలుగు ప్రధాన ప్రాజెక్టులపై PNGRB దృష్టి సారించింది. ఇది భారతదేశ ఇంధన లాజిస్టిక్స్ నెట్వర్క్లో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుందని అంచనాఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
‘ఫ్యామిలీతో చూడదగ్గ కొత్త సినిమా ఏదైనా ఉందా?’
మొబైల్ డేటాతోనో లేకుంటే ఇంట్లో వైఫై నెట్తోనో చేతిలో స్మార్ట్ ఫోన్లో చేతిని పైకి కిందకు ఆడిస్తూ గడిపేస్తున్న కాలమిది. దీనికి తోడు వారాంతంలో ప్రశాంతంగా ఓ సినిమానో, వెబ్సిరీసో చూడడం కుటుంబరావులకు పెద్ద టాస్క్గా మారింది. ఇప్పటి ప్రేక్షకుల పెద్ద సమస్య ఏమిటంటే.. ఏం చూడాలి? ఏది ట్రెండింగ్లో ఉంది? ఏది సరదాగా ఉంటుంది? అనే. ఈ ప్రశ్నలతోనే ఎక్కువ సమయం వృథా అవుతోందట. ఇది ఎంతలా అంటే.. ఒక సినిమా చూసే సమయం కంటే ఎక్కువే!అవును.. ఆశ్యర్యం కలిగించినా పైన చెప్పుకున్నదే ఇదే నిజం. యూజర్టెస్టింగ్ అనే సర్వే ప్రకారం.. మన దేశంలో ఒక యూజర్ ‘ఏం చూడాలి’ అని నిర్ణయించుకోవడంలోనే ఒక ఏడాదిలో 110 గంటలు.. అంటే సుమారుగా ఐదు రోజులు వేస్ట్ చేస్తున్నారని వెల్లడైంది. అలాగే డెలాయిట్ సర్వే ప్రకారం.. ఈ గందరగోళంలోనే ఒక వ్యక్తి రోజుకు సగటున ఆరు రకాల డిజిటల్ వినోదం (సిరీస్, షార్ట్ వీడియోలు, సోషల్ ఫీడ్స్) మధ్య చక్కర్లు కొడుతున్నాడు. అయితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితి మార్చేయబోతోంది. ఈరోజుల్లో విరామం దొరికితే విశ్రాంతి కోసం కాకుండా వినోదం కోసం వెతికే పనిలోనే బిజీ అయిపోతున్నాం. చాలా ఇళ్లలో ఏం చూడాలి అని ఎంచుకోవడానికి పట్టే సమయం పెరిగిపోతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఏం చూడడం బెస్ట్ అనే అడిగేవాళ్లు.. దానికి తమ రివ్యూలతో ఆన్సర్లు ఇచ్చేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్లే నడుం బిగించాయి. ఇప్పుడు AI ఆధారిత కంటెంట్ డిస్కవరీ వైపు అడుగులు వేస్తున్నాయి. అది ఎలాగంటే.. ఏఐ సెర్చ్ బార్లోనూ సాధారణ కీవర్డ్ సెర్చ్ కాకుండా.. అంటే చేతి వేళ్లు నొప్పి పుట్టేలా, రిమోట్ బటన్లు అరిగిపోయేలా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు.. ‘నేను ఫ్యామిలీతో కొత్త సినిమా ఏదైనా చూడాలనుకుంటున్నా.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లేని సినిమా ప్లే చేయి’, ‘లేటెస్ట్ రిలీజ్లు ఏమున్నాయో చూపించు’, ‘తక్కువ రన్టైంలో పూర్తయ్యే సినిమాలు ఏమైనా ఉన్నాయా?’’ అలా వాయిస్ కమాండ్ ద్వారా కావాల్సినవి ఎంచుకోవచ్చు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. యూజర్ మూడ్ను, సందర్భాన్ని, ఉద్దేశం అర్థం చేసుకుని కూడా సరైన సజెషన్లు ఇస్తుంది. సో.. ప్రేక్షకులు ఇప్పుడు జానర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు.. ఫీలింగ్స్ చెప్పినా సరిపోతుందన్నమాట!. ‘‘రోజంతా అలసిపోయాను.. రిలాక్సేషన్ కోసం ఫన్నీగా ఏదైనా ఇవ్వు”, ‘‘ఆదివారం సాయంత్రం బయట వాతావరణం వర్షం పడేలా ఉంది.. ఈ మూడ్కు తగ్గట్లు మంచి పాటలు ప్లే చేయు’.. ఇలాగన్నమాట. అలాగే ఏఐ కాబట్టి భాషతోనూ పెద్దగా ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. జియో హాట్స్టార్ ఓపెన్ఏఐతో కలిసి ChatGPT ఆధారిత వాయిస్ డిస్కవరీని భారతీయ ప్రేక్షకులకు అందిస్తోంది. నెట్ఫ్లిక్స్ ChatGPT ఆధారిత సెర్చ్ని మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ప్రారంభించి.. ఇప్పుడు భారత్కు విస్తరించింది. Amazon Prime Video కూడా ఏఐ జానర్ క్లస్టర్లు (fantasy quest, mind‑bending sci‑fi”) చూపిస్తూ యూజర్కు ఎంపిక చేసుకోవడంలో సహాయం చేస్తోంది. సో.. ఇకపై ప్రేక్షకులు ఎంత స్క్రోల్ చేసినా ఏదో దొరకడం లేదు అనే సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. AI ఆధారిత డిస్కవరీ వల్ల ‘ఏం చూడాలి?’ అనే ప్రశ్నకు నేరుగా సమాధానం దొరుకుతుందన్నమాట. -
టాప్ 3 మార్కెట్లలో భారత్: ప్రముఖ సీఈఓ
రాబోయే రోజుల్లో భారత్ తమ టాప్ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో గ్లోబల్ గ్రూప్ సీఈవో ఫ్రాంకోయిస్ ప్రొవోస్ట్ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్ఫోలియోని ఏడు మోడల్స్కి విస్తరిస్తామని వివరించారు. అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్ నుంచి ఏటా 2 బిలియన్ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్ వివరించారు.కాంపాక్ట్ ఎస్యూవీ ’బ్రిడ్జర్ కాన్సెప్ట్’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్లో రెనో గ్రూప్కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్ వాహనంగా, తమ విద్యుత్ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు. తమ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్ చెప్పారు. -
భారత్కు అమెరికా ఎనర్జీ షాక్
అమెరికా తన మిత్రదేశం భారత్కు షాకిచ్చింది. రష్యా, ఇరాన్ చమురుపై ఇప్పటివరకు ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేసింది. ఈ ప్రభావం భారత్కు లభిస్తున్న తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడే అవకాశం కనిపిస్తోంది.ఆ రెండు దేశాల నుంచి మార్చి 11కి ముందు లోడ్ చేసిన చమురు సరఫరాకు మాత్రమే అమెరికా భారత్ సహా కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ స్టాక్ ఇప్పుడు పూర్తయింది. ఇకపై రష్యా, ఇరాన్ చమురు కొనుగోలు చేసే దేశాలు(భారత్ సహా) సెకండరీ సాంక్షన్స్(ద్వితీయ శ్రేణి ఆంక్షలు) ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది భారత్కు ఒక ఎనర్జీ షాక్ లాంటిదే. ఇప్పటివరకు రష్యా నుండి తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి భారత్ తన ఇంధన ఖర్చులను తగ్గించుకుంది. అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు చేయడంతో ఆ సరఫరా తగ్గిపోవచ్చు. దీని వల్ల దేశీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.భారత్ ప్రస్తుతం రష్యా నుండి భారీగా డిస్కౌంట్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది గణాంకాల ప్రకారం.. రోజుకు సుమారు 2.08 మిలియన్ బ్యారెల్స్ వరకు చేరింది. అయితే కొన్నినెలలపాటు రష్యా నుండి దిగుమతులు తగ్గినా.. డిస్కౌంట్ ధరలు కారణంగా మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది మార్చిలో భారత్ రష్యా నుండి 5.3 బిలియన్ యూరోల విలువైన(47,700 కోట్ల రూపాయల) క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి మాత్రం 7 సంవత్సరాల తర్వాత 2026లో మొదటిసారి సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసింది.తాజా పరిణామాల దృష్ట్యా భారత్ తన ఎనర్జీ పాలసీని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విభిన్న సరఫరా మార్గాలు (పశ్చిమాసియా.. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా) అన్వేషించుకోవాల్సి ఉంటుందని.. దీర్ఘకాలంలో పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతుందని చెబుతున్నారు.హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు రవాణా మార్గాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా "మాక్సిమమ్ ప్రెషర్" విధానాన్ని మళ్లీ అమలు చేస్తూ, ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం ప్రపంచ చమురు ధరలపై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు..అమెరికా ఇరాన్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్పై కొత్త ఆంక్షలు విధించింది. సుమారు రెండు డజన్ల కంపెనీలు, వ్యక్తులు, నౌకలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో కొందరు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారుడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని సమాచారం. -
ఏఐ వినియోగంలో భారత్ టాప్.. కానీ..
న్యూఢిల్లీ: కోడింగ్, డేటా అనాలిసిస్, సంక్లిష్టమైన రీజనింగ్లాంటి అంశాల్లో భారత్ ప్రపంచంలోనే అధునాతన ఏఐ మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఓపెన్ ఏఐ ఒక నివేదికలో తెలిపింది. సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు, అడ్వాన్స్డ్ స్థాయిలో ఏఐని తరచుగా యూజర్లు వినియోగించుకోవడంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేథ వినియోగం కొన్ని నగరాలకే పరిమితమవుతోందని, గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటోందని వివరించింది. సాటి దేశాలతో పోల్చి చూసినప్పుడు, భారత్లో మిగతా ప్రాంతాల కన్నా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు అధికంగా ఉంటోందని ఓపెన్ఏఐ తెలిపింది. రిపోర్ట్ ప్రకారం కోడింగ్, డేటా అనలిటిక్స్ వినియోగంలో కూడా భారత్కి పటిష్టమైన ర్యాంకింగ్ ఉంది. 2026 ఫిబ్రవరిలో ఓపెన్ఏఐ కోడెక్స్ (కోడింగ్ టూల్) యాప్ను ఆవిష్కరించిన రెండు వారాల్లోనే దీని యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. అయితే, ఈ వినియోగం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా, ఒకే రకంగా లేదు. అడ్వాన్స్డ్ ఏఐ వినియోగంలో భారీగా అంతరాలు ఉంటున్నాయి. మరిన్ని విశేషాలు.. → మొత్తం ఏఐ యూజర్లలో 50 శాతం మంది టాప్ 10 నగరాల్లో ఉంటున్నారు, ఢిల్లీ ఎన్సీఆర్ అగ్రస్థానంలో ఉంది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీలాంటి సాటి దేశాలతో పోలిస్తే దేశీయంగా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దేశ జనాభాలో ఈ నగరాల్లో నివసించే వారి సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది. → అడ్వాన్స్డ్ ఏఐ వినియోగం విషయానికొస్తే అంతరం మరింత ఎక్కువగా ఉంటోంది. వెనుకబడిన నగరాలతో పోలిస్తే టాప్ సిటీల్లో డేటా అనాలిసిస్ వినియోగం 30 రెట్ల వరకు, కోడింగ్ వినియోగం 4 రెట్లు, ఏఐ డెవలపర్ (కోడెక్స్) వినియోగం 9 రెట్లు అధికంగా ఉంది. → పోటీ దేశాలతో పోలిస్తే భారత్కి ఏఐ సామర్థ్యాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్, బెంగళూరు,, ఢిల్లీ, చెన్నైలాంటి కొన్ని పట్టణ ప్రాంత హబ్లలో మాత్రమే అవి కేంద్రీకృతమై ఉంటున్నాయి. → విద్య, ఆరోగ్యంలాంటి రంగాల్లో అత్యంత అర్థవంతమైన విధంగా ఏఐ వినియోగం పెరుగుతోంది. విద్య విషయంలో తూర్పు రాష్ట్రాలు ముందుంటున్నాయి. విద్యాభ్యాసానికి సంబంధించిన మొత్తం మెసేజీలు జాతీయ సగటైన 20 శాతానికి మించి అస్సాంలో 22 శాతం స్థాయిలో ఉంటున్నాయి. ఒరిస్సా, మణిపూర్, త్రిపుర, చత్తీస్గఢ్లలో కూడా దాదాపు ఇదే ధోరణి ఉంది. ఆరోగ్యం విషయంలో జమ్మూ కాశీ్మర్, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలాంటి ప్రాంతాల్లో ఏఐ వినియోగం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రతి 10 మెసేజీల్లో ఒకటి ఆరోగ్యానికి సంబంధించినది ఉంటోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. → టెక్నాలజీ వినియోగ సామర్థ్యాలు ఎంత విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయనే దానిపై భారతదేశపు తదుపరి దశ ఏఐ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. తొలినాటి వినియోగదారుల పరిధిని దాటి ఏఐ ప్రయోజనాలు ఎంత వేగంగా మరింత భారీ స్థాయిలో జనాభాకు అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంతరాలను భర్తీ చేయాలంటే నైపుణ్యాలను పెంపొందించడం, అర్థవంతమైన విధంగా ఉపయోగించుకునేందుకు తోడ్పాటు అందించడం కీలకంగా ఉండనున్నాయి. -
కొనేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు
సాక్షి, స్పెషల్ డెస్క్ : తమ కంటెంట్ ద్వారా జనం మదిలో స్థానం సంపాదించుకుంటున్న క్రియేటర్లు.. ఇప్పుడు రిటైల్ రంగంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఎంతలా అంటే.. వారు సూచించిన ఉత్పత్తులను జనం కొనుగోలు చేసేంతగా. ఇంకేముంది.. వాణిజ్యానికి ఒక ప్రధాన ఇంజన్గా క్రియేటర్లు అవతరించారు. గత ఐదేళ్లలో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందంటే ప్రజలకు ఉన్న ఆసక్తిని, పెరుగుతున్న వారి ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. క్రియేటర్లు సృజనాత్మక కంటెంట్ ద్వారా విభిన్న ఉత్పత్తులను పరిచయం చేస్తున్నారు. లైవ్ డెమోలు, సమీక్షలు, సలహాలు ఇస్తూ వినియోగదారులకు వాటిని చేరుస్తున్నారు. వస్తువు ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూపించడం వల్ల వినియోగదారులకు కొనుగోలుపై గట్టి నమ్మకం కలుగుతుంది. ఫ్యాషన్, టెక్నాలజీ, సౌందర్య ఉత్పత్తుల వంటి విభాగాల్లో నిపుణులైన క్రియేటర్లు ఇచ్చే సలహాలు కస్టమర్లకు సరైన వస్తువును ఎంచుకోవడంలో సహాయపడుతున్నాయి. డెలాయిట్–గూగుల్ నివేదిక ప్రకారం 2030 నాటికి భారత ఈ–కామర్స్ రంగానికి క్రియేటర్ల నేతృత్వంలోని వాణిజ్యం 25 బిలియన్ డాలర్లను జోడించనుంది. క్రియేటర్ల సంఖ్య.. 2020: 9–10 లక్షలు 2025: 35–45 లక్షలు48 కోట్లు – ఆన్లైన్ వీడియోలు, కంటెంట్ చూసేవారు. 33 కోట్లు – వీడియోలు చూస్తారు. కానీ ఆన్లైన్లో షాపింగ్ చేయరు. 18 కోట్లు– ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేసేవారు.భారత లైవ్ కామర్స్.. ప్రస్తుత వ్యాపారం: సుమారు 100 కోట్ల డాలర్లు2030 నాటికి అంచనాలు: తక్కువలో తక్కువగా 500 కోట్ల డాలర్లు. సాధారణంగా: 700–800 కోట్ల డాలర్లు. గరిష్టంగా: వెయ్యి–1,200 కోట్ల డాలర్లు. వినియోగదారుల ధోరణి 28% – క్రియేటర్ల ద్వారా కొత్త ఉత్పత్తులను తెలుసుకుంటున్నారు. 63% – వస్తువుల సమాచారం, సిఫార్సుల కోసం ఇన్ఫ్లుయెన్సర్లను నమ్ముతున్నారు. 68% – లైవ్ షాపింగ్ ఆస్వాదించడానికి సిద్ధపడుతున్నారు.» క్రియేటర్ల ప్రభావంతో ఐదేళ్లలో ద్వితీయశ్రేణి నగరాలు, చిన్న పట్టణాల నుంచి 5–6 కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతారని అంచనా. » సంప్రదాయ ప్రకటనల కంటే తమకు ఇష్టమైన ్రక్రియేటర్ల సిఫార్సులను వినియోగ దారులు 2.5 రెట్లు ఎక్కువగా నమ్ముతున్నారు. 2030 నాటికి ప్రతి 10 ఆన్లైన్ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్ల స్టోర్ ఫ్రంట్స్ ద్వారానే జరుగుతుంది.» 2030 నాటికి లైవ్ కామర్స్ 800 కోట్ల డాలర్ల మార్కెట్గా ఎదుగుతుంది. » కోట్లకొద్దీ ఫాలోవర్లు ఉన్నవారి కంటే తక్కువ మంది ఉన్నా పటిష్టమైన అనుబంధం ఉన్న క్రియేటర్ల ద్వారా అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. » పెద్ద కంపెనీలు మార్కెటింగ్ బడ్జెట్లో 20–30% ఇన్ఫ్లుయెన్సర్లకే కేటాయిస్తున్నాయి.టాప్ కేటగిరీలు..ఫ్యాషన్, లైఫ్స్టైల్: ‘గెట్ రెడీ విత్ మీ’వీడియోలు, ‘ఫ్యాషన్ హాల్స్’ద్వారా ప్రజలు కొత్త ట్రెండ్స్ను అనుసరిస్తున్నారు. ఈ కేటగిరీలో 25–30% ఆన్లైన్ అమ్మకాలు నేరుగా క్రియేటర్ల సిఫార్సుల వల్లే జరుగుతున్నాయి. బ్యూటీ, పర్సనల్ కేర్: మేకప్ ట్యుటోరియల్స్, స్కిన్ కేర్ రివ్యూలకు డిమాండ్ ఉంది. క్రియేటర్లు తమ ముఖంపై ఉత్పత్తులను వాడి చూపే లైవ్ డెమోలను వినియోగదారులు 3 రెట్లు ఎక్కువగా నమ్ముతున్నారు. ఎల్రక్టానిక్స్, గ్యాడ్జెట్స్: 70%పైగా భారతీయులు యూట్యూబ్లో అన్బాక్సింగ్, రివ్యూ వీడియోలను వీక్షిస్తున్నారు. టెక్ క్రియేటర్లు ఇచ్చే బడ్జెట్ గైడెన్స్ వల్ల చిన్న పట్టణాల్లో ఎల్రక్టానిక్స్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఆరోగ్యం, ఫిట్నెస్: ఇంట్లో వ్యాయామం, డైట్ ప్లాన్స్, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఫుడ్, కుకింగ్: ప్రాంతీయ భాషల్లో వంటల వీడియోలకు కోట్లకొద్దీ వ్యూస్ వస్తున్నాయి. కిచెన్ అప్లయెన్సెస్, మసాలా బ్రాండ్లు ఈ క్రియేటర్లపై భారీగా పెట్టుబడి పెడుతున్నాయి -
ఎల్పీజీ యథాస్థితికి రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
ఇరాన్ వార్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. భారతదేశంలో కూడా ఎల్పీజీ దిగుమతుల్లో కష్టాలు, నష్టాలు, అధిక ఖర్చులు, సరఫరా అంతరాయాలు లాంటి సమస్యలు తప్పడం లేదు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్యలు ఇంకా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో ప్రపంచవ్యాప్త ఎల్పీజీ సరఫరా పునరుద్ధరణకు ఎంత కాలం పట్టవచ్చు? ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయిందా లేక శాశ్వత నష్టం జరిగిందా? అసలు ఏం జరుగుతోంది? ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న ఎల్పీజీ సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి మూడు నుండి నాలుగు ఏళ్లు పట్టవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పెరుగుతున్న దిగుమతి నష్టాలు, వ్యయ ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, ప్రభావిత సరఫరాదారుల నుండి అందిన సమాచారం ప్రకారం, పునరుద్ధరణకు కనీసం మూడేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు అని ఆ అధికారి పేరు వెల్లడించకుండా తెలిపారు.మరోవైపు దేశంలో ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. దొరుకుతుందా లేదా అనే ఆందోళన ప్రజల్లో రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతోంది. నిల్వలు కేవలం 15 రోజుల డిమాండ్కు మాత్రమే సరిపోతున్నాయి. ఉత్పత్తి కేంద్రాల్లో నష్టం తాత్కాలికమా లేక శాశ్వతమా అన్నది స్పష్టంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.ఇండియా- సవాళ్లుభారతదేశం తన ఎల్పీజీ సరఫరాల కోసం పశ్చిమ ఆసియాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. తన మొత్తం వినియోగంలో 60 శాతం దిగుమతుల ద్వారానే పొందుతోంది. అయితే, అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా హోర్ముజ్ జలసంధిపై దిగ్బంధనం, ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడుల కారణంగా ఆ సరఫరాలు దెబ్బతిన్నాయి.ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటంతో ప్రస్తుత సంక్షోభంతో ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా గతంలో 90 శాతం దిగుమతులు ఈ మార్గం ద్వారానే వచ్చేవి. యుద్ధ వాతావరణం వల్ల మార్చి 24 నాటికి ఇది 55 శాతానికి పడిపోయింది. రూబిక్స్ డేటా సైన్సెస్ , వయానా ట్రేడ్ఎక్స్ఛేంజ్ ఏప్రిల్ నివేదిక ప్రకారం, దారి మళ్లించినా,ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినప్పటికీ, సరఫరాలో 40-50 శాతం వరకు ఉండవచ్చు.15 రోజులకు మాత్రమే నిల్వ సామర్థ్యందేశంలో సరిపడా ఎల్పీజీని నిల్వ చేసుకునే సామర్థ్యం కేవలం 15 రోజులకు మాత్రమే పరిమితం. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటినుంచీ 14.2 కేజీల డొమెస్టింగ్ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. అలాగే కమర్షియల్ సిలిండర్ ధర రూ. 115 పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న తరహా పరిశ్రమలపై భారం తీవ్రంగా పడుతోంది. అలాగే చమురు కంపెనీలపై సబ్సిడీ ఒత్తిడి పెరుగుతోంది.ప్రభుత్వ చర్యలుసరఫరా అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలపై దృష్టి సారిస్తోంది. కోవిడ్ సమయంలో అనుసరించిన పద్ధతుల్లో ఇతర దేశాల నుండి దిగుమతులు పెంచుకోవడంతోపాటు, స్థానిక ఉత్పత్తిపై దృష్టి సారించింది. రిఫైనరీల ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని భావిస్తోంది. తద్వారా గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సరఫరాలో ఇబ్బంది కలగకుండా ఉండాలని భావిస్తోంది. (ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు మరో షాక్!)గల్ఫ్ దేశాలపై ఆధారపడటం2025 ఆర్థిక సంవత్సరంలో 6 బిలియన్ డాలర్ల విలువైన భారతదేశ ఎల్పీజీ వినియోగానికి 92 శాతాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్ , ఒమన్ దేశాలు కలిసి సరఫరా చేశాయి. ఇరాన్ దాడుల తీవ్రతను ఎక్కువగా ఎదుర్కొన్న యూఏఈ, దిగుమతులలో 41 శాతం వాటాను కలిగి ఉండగా, ఖతార్ 22 శాతం వాటాను కలిగి ఉంది అక్కడ యుద్ధ పరిస్థితుల వల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి, చివరికి వినియోగదారునిపై భారం పడుతోంది.ఇదీ చదవండి: ఉదయాన్నే ప్లైన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్ విషయం విన్నారా? -
అదే జరిగితే.. భారత్కు ఫ్లస్, చైనాకు చుక్కలే!
పశ్చిమాసియా యుద్ధంలో హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లో ఉండాలని.. టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే హర్ముజ్లో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో హర్ముజ్ను ఇరాన్ మూసివేయగా.. దిగ్బంధనంతో వచ్చిపోయే నౌకలకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఇదిలా ఉండగానే.. మరో జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్లు చర్చ మొదలైంది.దక్షిణాసియా వర్తకానికి కీలకమైన మలక్కా జలసంధిపై అమెరికా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల ఇండోనేషియాతో అగ్రరాజ్యం చేసుకున్న రక్షణ ఒప్పందం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభించనుంది. దీని ద్వారా మలకా జలసంధిపై కూడా అమెరికా పర్యవేక్షణ, ఆపరేషనల్ సామర్థ్యం పెరగనుంది..మలక్కా జలసంధి (Strait of Malacca) అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతూ.. ఇండోనేషియా సుమత్రా దీవి పశ్చిమ భాగం, మలేషియా ద్వీపకల్పం తూర్పు భాగం మధ్య సుమారు 930 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది ఆసియా–పసిఫిక్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం.చైనాకు..మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 నుంచి 40 శాతం దాకా సరుకు రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ నుంచి తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే చమురు, గ్యాస్లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా చేరుతుంది. చమురు, గ్యాస్తో పాటు ఎలక్ట్రానిక్స్, పరిశ్రమ ఉత్పత్తులు, తయారీ సరుకులు ఈ మార్గం ద్వారా తరలించబడతాయి. ముఖ్యంగా చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు ఈ మార్గంపై అధికంగా ఆధారపడుతున్నాయి.మలక్కా డైలమాచైనా తన చమురు, గ్యాస్, ముడి పదార్థాల దిగుమతులలో ఎక్కువ భాగాన్ని మలక్కా జలసంధి ద్వారా పొందుతుంది. ఈ మార్గం ఆగిపోతే లేదంటే అడ్డంకులు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం మలక్కా జలసంధిపై అధికంగా ఆధారపడటం.. తద్వారా ఏర్పడిన బలహీనత వల్ల మలక్కా డైలమా అనే పేరు ముద్రపడింది. 2003లో అప్పటి చైనా అధ్యక్షుడు హు జింటావో నోటి నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.చైనాకు చుక్కలేఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు సరఫరాలో సుమారు 80 శాతం మలకా జలసంధి ద్వారా చైనాకు చేరుతుంది. కాబట్టి ఈ జల సంధిపై అమెరికా తన ఆధిపత్యం పెంచుకుంటే మాత్రం చైనాకు చుక్కలు గ్యారెంటీ. అలాగే.. మలక్కా జలసంధి కొన్ని ప్రాంతాల్లో వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఈ చోక్ పాయింట్లను గనుక ఏదైనా దేశం నియంత్రించినా.. చైనాకు కష్టమే. ఈ మార్గం ఆగిపోతే చైనాకు ఇంధన సంక్షోభం తలెత్తుతుంది.భారత్కు ఫ్లస్భారతదేశ వాణిజ్యంలో మలక్కా జల సంధి కీలక పాత్రే పోషిస్తోంది. మలక్కా జలసంధి పశ్చిమ ప్రవేశద్వారం దగ్గరే భారత అండమాన్–నికోబార్ దీవులు ఉన్నాయి. క్యాంప్బెల్ బేలోని భారత వాయుసేన స్థావరం, నౌకాదళ గస్తీ సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేస్తోంది. కాబట్టి ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ఇది ఇండో–పసిఫిక్ రీజియన్లో భారత్ ప్రాధాన్యాన్ని పెంచడంతో పాటు చైనా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు భారత్కు ఓ మంచి అవకాశం కల్పిస్తుంది. అంత వీజీ కాదుమలక్కా జలసంధిపై అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడం అంత సలువేం కాదు. నిజానికి ఈ ప్రయత్నం కొత్త కూడా కాదు. గతంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అమెరికా చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం.. ఇరాన్కు చైనా మద్దతు.. ఇరాన్కు చైనా ఆయుధాల సరఫరా.. ఇవన్నీ ట్రంప్కు కోపం తెప్పించాయి. అయితే.. మలక్కాపై ఆధిపత్యానికి అమెరికాకు ప్రాంతీయ సవాళ్లు ఎదురు కావొచ్చు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కలిసి మలక్కా జలసంధిని నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సింగపూర్ పోర్టు మౌలిక సదుపాయాలు, గ్లోబల్ షిప్పింగ్ సేవలలో ఆధిపత్యం కారణంగా ఈ మార్గం స్థిరత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. పలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్నందున అమెరికా విస్తృత పాత్రకు ఆటంకాలు ఏర్పడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా చైనాను భవిష్యత్తులోనైనా ఇరకాటంలో పడేసే అంశమే. -
పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే
ఒకప్పుడు ఒక ఇంటికి పిల్లను పంపించాలంటే అత్తగారు ఎలా ఉంటారో.. ఎలాంటి వారో అని తల్లిదండ్రులు అనుకునేవారు. అనేక మందిని విచారించి గాని పెళ్లి చేసేవారు కాదు. అత్త గయ్యాలి అయితే ఆ ఇంటిలోని మగ పిల్లలకు అస్సలు పెళ్లిళ్లు అయ్యేవి కావు. కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఎక్కువగా మాట్లాడినా, మాట్లాడకున్నా తప్పు పట్టేవారు. దీన్ని ఆధారంగా తీసుకునే సినిమాలు కూడా వచ్చాయి. ఆ సమయంలో అత్త అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సూర్యకాంతం. కాలం మారింది. కోడళ్లపై అత్తల పెత్తనం తగ్గింది. అత్తలు కోడళ్ల మాట విని మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అత్తామామలతో కలిసి ఉండలేమని, పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలని యువతులు పెళ్లి చూపుల్లోనే తెగేసి చెబుతున్నారు. పలమనేరు : గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అత్తామామలు, అన్నదమ్ములు, కోడళ్లు, తోడి కోడళ్లు, ఆడ పడుచులు వారి మధ్య జరిగే గొడవ లు, ప్రేమాభిమానాలు సాధారణంగా అన్ని కుటుంబాల్లో కనిపించేవి. ఈ నేపథ్యంలో అత్త ఆధిపత్యం ప్రదర్శించడం ఎప్పటి నుంచో ఉంది. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో సైతం ఉమ్మడి కుటుంబాలు వెతికినా కనిపించడం లేదు. పదేళ్ల క్రితం వరకు గ్రామంలో నాలుగైదు కుటుంబాలు ఉమ్మడిగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడోగాని ఒకటి రెండు కూడా లేవు. వేరు కాపురాలు సర్వసాధరణంగా మారాయి. వారి వారి కుటుంబమే ముఖ్యమనే స్వార్థం పెరిగింది.పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే పెళ్లి కాగానే కొత్త కాపురం పెట్టడం నేడు ట్రెండ్గా మారింది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుడడం, లేదా భర్త ఉద్యోగం చేసే చోటుకు భార్య వెళ్లి వస్తుండడంతో వేరు కాపురాలు తప్పడంలేదు. కొందరు అమ్మాయిలు పెళ్లి అయినా అత్తామామలతో కలిసి ఉండబోమని, పెళ్లి అయ్యాక తమ ఇంటికి అత్తమామలు పెద్దగా రాకూడదంటూ ముందే చెబుతున్నారు. కాదు కూడదంటే పెళ్లి వయసు దాటుతుందనే భయంతో అబ్బాయిల తల్లిదండ్రులు అన్ని షరతులకు ఓకే చెప్పాల్సి వస్తోంది. ముఖ్యంగా నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే యువతులు తమ పెళ్లికి సంబంధించిన ప్రొఫైల్లోనే అనేక షరతులు పెడుతున్నారు. పెళ్లి అయిన తర్వాత అత్తామామలు ఉండకూడదని, తప్పనిసరిగా వేరుకాపురం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వేరు కాపురాలు పెట్టాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం, గొడవలు పడిన సందర్భాల్లో కనీసం వీరికి నచ్చజెప్పే పెద్దలు లేక కొందరి జీవితాలు తెగతెంపులకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా మనల్ని సక్రమ మార్గంలో నడిపించే పెద్దలు, నాటి బంధాలు, బాంధవ్యాలకు నేటి తరం యూత్ దూరం చేసుకుంటోందనే మాట పెద్దతరం వారిలో వినిపిస్తోంది. -
అమెరికా-ఇరాన్ యుద్ధం.. భారత్ మధ్యవర్తిత్వం?
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం మరో కీలక దశకు చేరుకుంది. ఏప్రిల్ 16 రేపు ( గురువారం) ఇరాన్-అమెరికా మధ్య రెండో దఫా చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి భారత్ సైతం మధ్యవర్తిత్వం వహించచ్చన్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది భారత్ మాత్రమేన్ననారు.సెర్గియా గోర్ ఇటీవలే వాషింగ్టన్ పర్యటన ముగించుకొని భారత్ వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు ప్రస్థావించారు. ఇరాన్- అమెరికా యుద్ధం విషయంలో భారత్ మధ్యవర్తిత్వం వహించవచ్చా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఇలా మాట్లాడారు"పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడంలో భారత్ మధ్యవర్తిత్వాన్ని అమెరికా స్వాగతిస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపడంలో ఏదేశాలైనా మధ్యవర్తిత్వం వహించవచ్చు. ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆ అవకాశం ఉంది. ఈ విషయంలో ట్రంప్ ఏ ఒక్క దేశాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. ట్రంప్ మధ్యవర్తిత్వం కోసం ఎవరొచ్చినా స్వాగతిస్తారు". అని అన్నారు.అమెరికాలో డొనాల్డ్ ట్రంప్తో సహా పలు కీలక నేతలతో సమావేశం నిర్వహించానని వారు పలు కీలక విషయాలను ప్రస్థావించారని పేర్కొన్నారు. వాణిజ్యం, ద్వైపాక్షిక అంశాలపై మరో కొద్ది రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు. అయితే అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత గల హర్ముజ్ జలసంధిని కేవలం ఒక్క దేశం దిగ్భందించిందని ఇది చాలా ప్రమాదకరమని ఇరాన్ పేరు ప్రస్థావించకుండా మాట్లాడారు.కాగా నిన్న (మంగళవారం) నరేంద్ర మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగింది. " నా స్నేహితుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. యుద్ధ ఉద్రిక్తతల వేళ ఇరు దేశాధినేతల చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. -
భారత్ విద్యార్థిని.. ఆమె కోసం ఆరేళ్లుగా అమెరికా ఎందుకు వెతుకుతోంది?
వాషింగ్టన్: అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) . ఇప్పుడీ ఎఫ్బీఐకి భారతీయ విద్యార్థిని మయూషీ భగత్ కోసం ఆరేళ్లుగా అన్వేషిస్తుంది. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రజల సాయం కోరుతూ ట్వీట్ చేసింది. మయూషీ భగత్ ఆచూకీ తెలపాలని, అందుకు బహుమానంగా 10వేల డాలర్లు బహుమతి ఇస్తామని ట్వీట్ చేసింది.అంతేకాదు, ఆమె ఆచూకీ ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతున్న వారిని గుర్తించి కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. గుజారాత్ వడోదరాకు చెందిన ఆయూషీ ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 స్టూడెంట్ వీసా ద్వారా 2016లో అమెరికాకు వెళ్లింది. న్యూ హాంప్షైర్ యూనివర్సిటీలో చేరింది. ఆ తర్వాత న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆ సమయంలో నూజెర్సీలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.ఈ క్రమంలో ఏప్రిల్ 29,2019న ఆమె ఆచూకీ గల్లంతయ్యింది. ఆ తర్వాత ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలో మయూషీ తండ్రి వాట్సప్ నెంబర్కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో మే 3వరకు ఇంటికి రాదని,ఆమె సురక్షితంగా ఉన్నారనేది ఆ మెసేజ్ సారాంశం. నాటి నుంచి మయూషి భగత్ ఆచూకీ కోసం ఎఫ్బీఐ గాలింపు చర్యలు చేపడుతూనే ఉంది. ఇప్పటికీ మయూషీ జాడ కోసం జల్లెడ పడుతూనే ఉంది. The #FBI offers a reward of up to $10,000 for info leading to the location or recovery of Mayushi Bhagat, and the identification, arrest, and conviction of those responsible. She was last seen in the evening hours of April 29, 2019, leaving her Jersey City, NJ apartment:… pic.twitter.com/CDt1WJjLhM— FBI (@FBI) April 13, 2026 -
హర్ముజ్ బ్లాకేడ్తో భారత్పై తీవ్ర ప్రభావం!
హర్ముజ్ జలసంధిని అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రిక్వెస్ట్లు చేస్తున్నాయి. చైనా సహా ఇంకొన్ని దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అదే సమయంలో.. ఈ బ్లాకేడ్ ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిణామం భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కనిపిస్తోంది.గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం 99 డాలర్ల వద్ద ఉంది. హర్ముజ్ బ్లాకేడ్ కొనసాగితే అది 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు పెరిగే అవకాశం లేకపోలేదు. పైగా జలసంధి ద్వారా రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఈ మార్గం మూసుకుపోతే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్ర తరం కావొచ్చు. అలాగే పెరిగిన ఇంధన ధరలు నేరుగా రవాణా, విద్యుత్, ఆహార ధరలపై ప్రభావం చూపెట్టొచ్చు. హర్ముజ్ బ్లాకేడ్పై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.అదంతా ఉత్త ప్రచారమే!భారత నౌకలకు హర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసేసిందని ఒక ప్రచారం నడుస్తోంది. అయితే అది ఉత్తదేనని ఇరాన్ అంటోంది. న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం మా స్నేహపూర్వక దేశం. హర్ముజ్ మార్గం భారత నౌకలకు తెరిచే ఉంటుంది. అమెరికా ఈ బ్లాకేడ్తో తప్పు లెక్కలు వేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ధ్వంసం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది’’ అని హెచ్చరించారు.మొత్తంగా, హోర్ముజ్ బ్లాకేడ్ భారత్కు ఇంధన భద్రతా సంక్షోభం తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరాన్ ఇచ్చిన హామీ కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం వంటి సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం లేకపోలేదు. -
ఫార్మా వృద్ధికి పరిశోధనలు కీలకం
న్యూఢిల్లీ: బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్పై మరింతగా దృష్టి పెడుతూ అంతర్జాతీయంగా ఫార్మా రంగానికి సారథ్యం వహించేలా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఇందుకోసం పరిశోధనలు–అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలను బలోపేతం చేయడం, పెట్టుబడులు పెరగడం మొదలైన అంశాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఫార్మా 2026 కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు చెప్పారు. నాయకత్వ సామర్థ్యాలు, అందుబాటు ధరలో జనరిక్ ఔషధాలతో అనేక సంవత్సరాలుగా ప్రపంచానికి ఫార్మసీగా భారత్ గుర్తింపు పొందిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం గ్లోబల్ ఫార్మా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్పై ఫోకస్ పెరుగుతోందన్నారు. దీనికి అనువుగా భారత్ తనను తాను మల్చుకోవడంతో పాటు సారథ్యం కూడా వహించేందుకు స్థితిలో ఉందని నడ్డా వివరించారు. దేశీ ఫార్మా పరిశ్రమను గ్లోబల్ లీడరుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అయిదేళ్ల వ్యవధి కోసం రూ. 10,000 కోట్లతో బయోఫార్మా శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించినట్లు చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి, బల్క్ డ్రగ్స్ స్కీము, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ)లాంటి కార్యక్రమాలతో దేశీయంగా తయారీ కార్యకలాపాలకు ఊతమిస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని (సీడీఎస్సీవో) పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు, 1,500 మంది నిపుణులతో సైంటిఫిక్ సమీక్ష కోసం బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. -
భారత్లో మళ్లీ ఫార్ములావన్ రేసుకు ప్రయత్నాలు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్లో ఫార్ములావన్ రేసు నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గ్రేటర్ నోయిడాలో2011, 2012, 2013లలో ఇండియన్ గ్రాండ్ప్రి పేరుతో ఎఫ్1 రేసులు జరిగాయి. అనంతరం ట్యాక్స్ చెల్లింపు రాయితీలు ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో 2014 నుంచి ఎఫ్1 రేసులు భారత్లో కొనసాగించేందుకు ఫార్ములావన్ నిర్వాహకులు ఆసక్తి చూపలేదు. ‘వచ్చే ఏడాది భారత్లో ఎఫ్1 రేసు నిర్వహించేందుకు మూడుసంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. విధివిధానాలు ఖరారు చేయడానికి ఆరు నెలలు పడుతుంది. భారత్లో ఎఫ్1 పునరాగమనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పన్ను రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మాండవీయ తెలిపారు. -
భారత్కు ఇరాన్ చమురు.. ఏడేళ్లలో తొలిసారి!
అమెరికా ఇటీవల ఇచ్చిన తాత్కాలిక అనుమతిని ఉపయోగించుకొని, ఇరాన్ నుంచి చమురు భారత్ పోర్టులకు మళ్లీ చేరడం ప్రారంభమైంది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఇరాన్ చమురు భారతదేశానికి వస్తుండటం గమనార్హం. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ (LSEG) షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. రెండు భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు భారత పోర్టులకు చేరుకున్నాయి.భారత పోర్టులకు చేరుకున్న రెండు ట్యాంకర్లలో.. ఒకటి ఇరాన్ జెండా ఉన్న 'ఫెలిసిటీ' అనే VLCC నౌక పశ్చిమ భారతదేశంలోని సిక్కా పోర్టుకు చేరింది. మరొకటి కురాకావో జెండా ఉన్న 'జయా' అనే నౌక ఒడిశా తూర్పు తీర పోర్టుకు చేరుకుంది. VLCC అనేది సుమారు రెండు మిలియన్ బ్యారెల్స్ చమురు రవాణా చేయగల భారీ నౌక.భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. అయితే.. అమెరికా ఒత్తిడితో 2019 మే నుంచి ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడు అమెరికా ఇచ్చిన తాత్కాలిక మినహాయింపు కారణంగా భారత రిఫైనరీలు మళ్లీ ఇరాన్ చమురు కొనుగోలు చేయగలిగాయి. ఈ మినహాయింపు ఏప్రిల్ 19న ముగియనుంది. -
‘హార్మూజ్ వద్ద భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించలేదు’
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించాయని వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ ఖండించింది. భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించలేదని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ఈ కష్టకాలంలో భారత్-ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాలు ఒకే రకమైన ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా, ఇరాన్కు టోల్ చెల్లింపులు చేసే నౌకలను అడ్డుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.“ఇప్పటి వరకు ఇరాన్ ఏమైనా వసూలు చేసిందా? అని మీరు భారత ప్రభుత్వాన్ని అడగవచ్చు” అని మహమ్మద్ ఫతాలి ఇరాన్ దౌత్య కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.ఎల్పీజీ తీసుకెళ్తున్న 9 నౌకలు బయలుదేరేందుకు ఎలాంటి టోల్ చెల్లించలేదని భారత్ ఇప్పటికే పలుసార్లు తెలిపింది. మరోవైపు, పర్షియన్ గల్ఫ్లో 15 భారత జెండా ఉన్న నౌకలు ఇంకా ఇరుక్కుపోయే ఉన్నాయని భారత్ చెబుతోంది. భారత్ ముడి చమురు, ఎల్పీజీ సరఫరాల్లో సుమారు సగం హార్మూజ్ జలసంధి గుండా వెళ్తుంది.కాగా, అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా హార్మూజ్ జలసంధి మీదుగా నౌకలను అనుమతించలేదు. తమ మిత్రదేశాలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చింది.నౌకలు వెళ్లాలంటే తమ అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటిని నాశనం చేస్తామని ఇరాన్ చెప్పింది. వాటి సురక్షిత ప్రయాణం కోసం ఫీజులు వసూలు చేస్తామని కూడా తెలిపింది. అయితే, టోల్ చెల్లించడం సరైన మార్గం కాదని ట్యాంకర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఇంటర్టాంకో సంస్థకు చెందిన ఫిలిప్ బెల్చర్ చెప్పారు. -
ఇరాన్పై అమెరికా యుద్ధం.. భారత్లో వీటి ధరలు పెరగనున్నాయా?
న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో హర్మూజ్ జలసంధిలో చమురు, ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్లో వినియోగదారులు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి త్వరలో సల్ఫర్ దిగుమతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా సల్ఫర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరిగి, వాటి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే సల్ఫర్ రవాణాలో దాదాపు సగం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. సల్ఫర్ అనేది ఎరువుల తయారీ, రసాయన పరిశ్రమలు, లోహ శుద్ధి, బ్యాటరీలు, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన ప్రధాన ముడి పదార్థం. హర్మూజ్ జలసంధి మార్గంలో అంతరాయం కొనసాగితే ఈ కీలక పదార్థం కొరత మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇరాన్పై అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడుల ప్రభావంతో 44 వేలకుపైగా కంపెనీల ఉత్పత్తుల రవాణా అంతరాయం ఎదుర్కొన్నట్లు డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ మరో నివేదికలో పేర్కొంది.దీని ప్రభావం భారత్లోని తయారీ రంగాలపై తీవ్రంగా పడనుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో పాటు వాటి ధరలను కూడా పెంచాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే కరీఫ్ సీజన్ కోసం ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంచింది. అయినప్పటికీ యుద్ధం కొనసాగితే ప్రభుత్వ ఆర్థిక భారమూ మరింత పెరుగుతుంది. చైనా మే నెల నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులను నిలిపివేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చైనాలో సల్ఫర్ ధరలు 15 శాతం పెరిగాయి.భారత్ మాత్రం ద్వంద్వ సమస్యను ఎదుర్కొంటోంది. రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయంపై భారీ ఒత్తిడి పడుతుంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి, ఇరాన్–అమెరికా యుద్ధం ప్రభావం కేవలం చమురు, ఎల్పీజీ సరఫరాలకే పరిమితం కాదు. సల్ఫర్ సరఫరా అంతరాయం దేశ ఆహార భద్రత, రైతుల ఖర్చులు, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపనుందని నివేదికలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. -
అరుణాచల్ ప్రాంతాలకు కల్పిత పేర్లా: భారత్ ఫైర్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్యను దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.ఇదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీసే చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికింది. ‘‘తప్పుడు వాదనలు, నిరాధార కథనాల సృష్టిని చైనా మానుకోవాలి. అరుణాచల్ సహా ఈ ప్రాంతాలు ఎప్పటికీ భారత్లో భాగంగానే ఉంటాయి. చైనా చర్యలు ఈ వాస్తవాన్ని ఎప్పటికీ, ఏమాత్రమూ మార్చలేవు’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. -
తక్కువ ధరకే లభించే వంట గ్యాస్ ఏది?.. ఎల్పీజీనా, ఎలక్ట్రిక్నా, హైడ్రోజన్నా?
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచ దేశాలకు దిగుమతయ్యే సింహభాగం గ్యాస్ సరఫరా దెబ్బతింది. ఇతర సహజ వనరులు కూడా ప్రభావితమయ్యాయి.ఫలితంగా వంటింట్లో విరివిగా వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు అందరికీ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్టవ్లు, హైడ్రోజన్ స్టవ్లను వినియోగించడం ప్రారంభించారు. అదే సమయంలో తక్కువ ధరలో లభించే వంట గ్యాస్ను ఎంచుకుంటూ, తమ బడ్జెట్కు అనుగుణంగా వినియోగంలో మార్పులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో లభించే వంట గ్యాస్ ధరలు, అనుకూల,ప్రతి కూలతలు గురించి ఆరా తీస్తున్నారు.ఎల్పీజీ వంట గ్యాస్ఎల్పీజీ కోట్లాది మంది భారతీయ కుటుంబాలకు ప్రధాన వంట గ్యాస్గా కొనసాగుతోంది. ఇది విస్తృతంగా లభిస్తుంది. విద్యుత్ అవసరం లేదు. విద్యుత్ అంతరాయం ఏర్పడినా వంట చేసుకోవచ్చు. అయితే, ధరలు సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. చాలా నగరాల్లో ఒక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.900–రూ.1100 మధ్య ఉంటుంది. ఒక సిలిండర్ సాధారణంగా 25–30 రోజుల వరకు వస్తుంది. అంచనా నెలవారీ ఖర్చు: రూ.900 నుంచి రూ.1,200ప్రయోజనాలు:దేశంలో సులభంగా అందుబాటులో ఉంటుందివిద్యుత్ అవసరం లేదుఅందరికీ తెలిసిన గ్యాస్, వినియోగం సులభంప్రతికూలతలు:ధరలు మారుతూ ఉంటాయితరచుగా రీఫిల్ చేయాలిజాగ్రత్తగా వాడకపోతే భద్రతా సమస్యలుఎలక్ట్రిక్ వంట గ్యాస్నగరాల్లో ఎలక్ట్రిక్ వంట, ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్ల వినియోగం పెరుగుతోంది. ఇది శుభ్రంగా ఉంటుంది. నిర్వహణ సులభం, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ అవసరం ఉండదు. ఇండక్షన్ స్టవ్లలో శక్తి సామర్థ్యం ఎక్కువ. ఎందుకంటే అవి నేరుగా పాత్రలను వేడెక్కిస్తాయి.అయితే మొత్తం ఖర్చు రాష్ట్రాల వారీగా మారే విద్యుత్ చార్జీలపై ఆధారపడి ఉంటుంది.అంచనా నెలవారీ ఖర్చు: రూ.700–రూ.1100ప్రయోజనాలు:కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ కంటే చవకగా ఉంటుందిరీఫిల్ అవసరం లేదుగ్యాస్ లీక్ సమస్యలు లేక భద్రత ఎక్కువప్రతికూలతలు:విద్యుత్ సరఫరాపై ఆధారపడుతుందిపవర్ కట్ సమయంలో ఉపయోగించలేముప్రత్యేక పాత్రలు అవసరంహైడ్రోజన్ వంట గ్యాస్ హైడ్రోజన్ స్టవ్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. గృహ వినియోగానికి విస్తృతంగా అందుబాటులో లేవు. హైడ్రోజన్ గ్యాస్ నీటి నుంచి తయారు చేస్తారు. కొన్ని కంపెనీలు, శాస్త్రవేత్తలు హైడ్రోజన్ ఆధారిత వంట గ్యాస్ సిస్టమ్లను పరీక్షిస్తున్నారు. ఇవి ఇంకా విస్తృత వినియోగానికి సిద్ధంగా లేవు.అంచనా నెలవారీ ఖర్చు: ఇంకా అందుబాటులో లేదుప్రయోజనాలు శుభ్రమైనది, పర్యావరణానికి అనుకూలంఫాసిల్ ఫ్యూయల్స్పై ఆధారాన్ని తగ్గిస్తుందిప్రతికూలతలు:వాణిజ్యపరంగా అందుబాటులో లేదుఎక్కువ ఖర్చు, మౌలిక వసతుల అవసరంఖర్చు ఇంకా స్పష్టంగా లేదుప్రస్తుత ధోరణులువిద్యుత్ సరఫరా స్థిరంగా, చవకగా ఉన్న నగరాల్లో ఎలక్ట్రిక్ వంట ఎల్పీజీ కంటే కొంత చవకగా ఉంటుంది.విద్యుత్ అస్థిరంగా ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ ఇప్పటికీ అత్యంత ప్రాక్టికల్, నమ్మదగిన ఎంపిక.హైడ్రోజన్ ఇంకా రోజువారీ వినియోగానికి సరైన సమయం కాదు.వినియోగదారుల నిర్ణయంనగరాల్లో స్థిరమైన విద్యుత్ సరఫరా ఉంటే, ఎలక్ట్రిక్ వంట ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. తరచుగా పవర్ కట్లు ఎదుర్కొనే ప్రాంతాల్లో ఎల్పీజీ ఇప్పటికీ భద్రతా పరంగా వినియోగంలో ఉంది. హైడ్రోజన్ భవిష్యత్తులో ఆశాజనకమైనది. కానీ ప్రస్తుతానికి వినియోగం సులభం కాదు. ఎల్పీజీ ఇప్పటికీ ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ, ఎలక్ట్రిక్.. హైడ్రోజన్ వంట ప్రత్యామ్నాయాలపై దృష్టి పెరుగుతోంది. చాలా కుటుంబాలకు ఎల్పీజీ ఇప్పటికీ ప్రాధాన్యం కలిగినదే. కానీ ఎలక్ట్రిక్ వంట వైపు మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. భవిష్యత్తు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. -
ఉద్రిక్తతల నడుమ యూఏఈకి జై శంకర్
యూఏఈ భారత్కు ఎల్లప్పుడూ ప్రధాన భాగస్వామి అని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. యూఏఈ విదేశాంగ శాఖ మంత్రితో జైశంకర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు జరిపిన నేపథ్యంలో ఆ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా జైశంకర్ మట్లాడుతూ భారత్కు యూఏఈ ఒక అత్యంత ముఖ్యమైన మరియు నమ్మకమైన భాగస్వామన్నారు. రక్షణ, వాణిజ్యం మరియు ఇంధన రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత దృఢంగా ఉన్నాయని తెలిపారు. యూఏఈ అభివృద్ధిలో మరియు ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేయడంలో అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు.టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ మరియు పెట్టుబడుల రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమించేలా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. అనంతరం యూఏఈ ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం మరియు అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారు. కాగా ఇటీవల ఇరాన్ గల్ఫ్ దేశాలలలోని అెమెరికా స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నడుమ జైశంకర్ యూఏఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. -
నెట్ఫ్లిక్స్, అమెజాన్.. సబ్స్క్రైబర్ల నంబర్ ఎంతో తెలుసా?
ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారత మార్కెట్లో జోరు పెంచింది. సుమారు మూడేళ్ల క్రితం సబ్స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించి వినియోగదారులను తనవైపు తిప్పుకుంది. భారత్లో అమలు చేసిన ఈ ప్లాన్ విజయవంతం కావడంతో పలు దేశాల్లో దీనిని అమలు చేస్తుంది. ఎక్కువ కంటెంట్తో భారత ప్రజలను అలరించిన అమెజాన్ ప్రైమ్ వీడియోను దాటి నెట్ఫ్లిక్స్ ముందుకు వచ్చేసింది.నివేదికల ప్రకారం, భారత్లో నెట్ఫ్లిక్స్ సంస్థకు 92 మిలియన్ల (9.2 కోట్లు) నెలవారీ వినియోగదారులు ఉన్నారు. ప్రైమ్ వీడియోకు 67 (6.7కోట్లు) మిలియన్ల నెలవారీ వినియోగదారులతో వెనుకపడింది. దీంతో ఇప్పుడు భారతదేశంలో ప్రైమ్ వీడియోపై నెట్ఫ్లిక్స్ పైచేయి సాధించింది. నెట్ఫ్లిక్స్ రోజురోజుకు కొత్తవారిని తనవైపు తిప్పుకుంటూ వృద్ధిని సాధిస్తుండగా, ప్రైమ్ వీడియో మాత్రం నిరంతర క్షీణతను చవిచూస్తుంది. నెట్ఫ్లిక్స్ ఇప్పుడు చిత్రనిర్మాతలకు ప్రధాన వేదికగా మారింది. భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన కథలతో కూడిన ఒరిజినల్స్పై దృష్టి సారించడం ద్వారా ఈ ప్లాట్ఫామ్ తన స్థాయిని కూడా పెంచుకుంది. ధరలు కొద్దిగా తగ్గించడం కూడా బాగా కలిసొచ్చింది. అయితే, ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టడం మేలు కంటే కీడే ఎక్కువ చేసింది, ఆపై సబ్స్క్రిప్షన్ ఖర్చు కూడా పెరిగింది. అయితే, భారత్లో జియోహాట్స్టార్ టాప్లో ఉంది. ఏకంగా 500 మిలియన్ల ( 50 కోట్ల) నెలవారి వినియోగదారులు ఈ సంస్థకు ఉన్నారు. -
అనూహ్య మార్పు.. జూనియర్ హాకీ జట్టుకు కొత్త కోచ్
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు టిమ్ వైట్ కొత్త కోచ్గా ఎంపికయ్యాడు. 2023 నుంచి మన అమ్మాయిల జట్టుకు తుషార్ ఖండేకర్ కోచ్గా వ్యవహరిస్తుండగా... అతడి స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన వైట్ను హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్గా నియమించింది. కోచ్ మార్పునకు కారణం వెల్లడించని హాకీ ఇండియా... వైట్ ఎప్పటి వరకు ఆ పదవిలో ఉంటాడనే అంశంలోనూ స్పష్టతనివ్వలేదు. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వైట్ తమిళనాడు డ్రాగన్స్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. గతంలో బెల్జియం, ఆ్రస్టేలియా జూనియర్ జట్లకు కూడా వైట్ కోచ్గా పనిచేశాడు. వైట్ శిక్షణలో బెల్జియం అండర్ –21 మహిళల జట్టు జూనియర్ ప్రపంచకప్ కప్లో కాంస్య పతకం నెగ్గింది. 2021 నుంచి 2024 వరకు బెల్జియం సీనియర్ జట్టుతోనూ వైట్ కలిసి పనిచేశాడు. ఆ సమయంలో విశేషంగా రాణించిన బెల్జియం జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్లో 12వ స్థానం నుంచి మూడో ‘ప్లేస్’కు చేరింది. ఆస్ట్రేలియాకు కోచ్గా వ్యవహరించిన సయమంలో జూనియర్ ప్రపంచకప్లో ఆ జట్టు కాంస్యం గెలిచింది. ‘తమిళనాడు డ్రాగన్స్ జట్టుకు కోచ్గా భారత్లో చాలా సమయం గడిపా. అక్కడి హాకీ ఘన సంస్కృతి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జూనియర్ వరల్డ్కప్లో భాగంగా... భారత్తో జరిగిన మ్యాచ్ల సమయంలో యువ నైపుణ్యం నన్ను కట్టిపడేసింది. అలాంటి అత్యుత్తమ అథ్లెట్లతో పూర్తిస్థాయిలో కలిసి పనిచేయనుండటం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. సీనియర్ జట్టులో స్థానం కోసం పోటీపడగల సామర్థ్యం ఉన్న పటిష్టమైన ప్లేయర్లను తయారు చేయడమే నా లక్ష్యం. అటాకింగ్ గేమ్కు పదును పెడుతూనే... డిఫెన్స్లోనూ మరింత క్రమశిక్షణ పెంచాలని భావిస్తున్నా. మైదానంలో అడుగు పెట్టిన తర్వాత 60 నిమిషాల పాటు అత్యున్నత స్థాయిలో రాణించేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధం కావడం చాలా ముఖ్యం. ఒత్తిడిలోనూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగడంపై దృష్టి పెట్టి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాం. సీనియర్ స్థాయి ప్లేయర్లను సైతం ఓడించగల ఆత్మస్థైర్యం ఉన్న ప్లేయర్లను తీర్చిదిద్దుతా’ అని వైట్ అన్నాడు. కొత్త కోచ్ రాకతో మన హాకీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు. ‘ఆస్ట్రేలియా, బెల్జియం జూనియర్ జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉన్న వైట్... భారత జట్టుతో చేరడంతో మన ప్లేయర్ల నైపుణ్యాలు కూడా మరింత పెరుగుతాయి. అతడి అనుభవం మనజట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని టిర్కీ పేర్కొన్నాడు. చదవండి: ‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’ -
ఇది... మన దేశంలో మొట్ట మొదటి పెట్రోల్ పంపు
ముంబైలోని హ్యూస్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్ట మొదటి పెట్రోల్ పంపుకు సంబంధించి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు తప్ప వీడియోలు చూసే అవకాశం చా....లా తక్కువ. అయితే ఏ.ఐ. తలచుకుంటే వీడియోలకు కొరతా! మన మొట్టమొదటి పెట్రోల్ పంప్కు సంబంధించిన ఏఐ–జనరేటెడ్ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. చేతితో నడిపే డిస్పెన్సర్ల నుండి నేటీ హై–స్పీడ్ ఫ్యుయలింగ్ స్టేషన్ల వరకు మారుతున్న కాలం, పెట్రోల్కు పెరుగుతున్న డిమాండ్, రాకెట్ వేగంతో పట్టణ వృద్ధి... ఈ అంశాలను ప్రతిబింబిస్తూ, భారతదేశపు ఆటోమోటివ్ పరిణామంలో నగరం ఎలా కేంద్రంగా నిలిచిందో చూపే వీడియో క్లిప్ ఇది. చరిత్ర, సాంకేతిక అద్భుతంతో రూపొందించిన ఈ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహా’ అంటున్నారు. ఆరోజుల్లో రోడ్లపై పెద్దగా వాహనాలు కనిపించేవి కావు. అందుకే పెట్రోల్కు డిమాండ్ అంతగా ఉండేది కాదు. ఈ వీడియో క్లిప్ ఆ కాలాన్ని కళ్లకు కడుతుంది. సూట్, టోపీ ధరించిన ఇద్దరు వ్యక్తులు కారులో రాగా, ధోతీ, ధరించిన భారతీయుడు చేతితో పనిచేసే డిస్పెన్సర్ను ఉపయోగించి కారులో పెట్రోల్ నింపుతూ కనిపిస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆనాటి ప్రశాంతమైన ముంబైని ఆవిష్కరించే వీడియో క్లిప్ ఇది. -
భారత్ వృద్ధి అంచనాలు అప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థికంగా, భౌగోళిక–రాజకీయాంశాలపరంగా పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) భారత్ వృద్ధి రేటు పటిష్టంగా 6.9 శాతం స్థాయిలో ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. డిసెంబర్లో వెలువరించిన 6.5 శాతం స్థాయి కన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ పటిష్టంగా ఉండటం, సులభతరంగా రుణాల లభ్యత, భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్ల తగ్గుదలలాంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఒక నివేదికలో పేర్కొంది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరల పెరుగుదల, వాణిజ్య నిర్వహణకు ఆటంకాలు, రెమిటెన్సులు తగ్గుదల తదితర అంశాలు వృద్ధిపై ప్రభావం చూపవచ్చని ఏడీబీ తెలిపింది. ఇక సానుకూల పాలసీలు, అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడటం వల్ల దేశీయంగా వినియోగం, పెట్టుబడులకు ప్రయోజనం చేకూరుతుందని, ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2026–27 అంచనాలను ఏడీబీ సవరించినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరపు 7.6 శాతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.9 శాతానికి తగ్గనుండటం గమనార్హం. -
భారత్కు విశ్వసనీయ సరఫరాదారుగా ఉంటాం
న్యూఢిల్లీ: భారత్కు ఇక ముందు విశ్వసనీయమైన ఇంధన సరఫరాదారుగా ఉంటామని ఖతార్ హామీ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి రెండు రోజుల దోహా పర్యటన (9, 10 తేదీలు) సందర్భంగా, అక్కడి ఇంధన మంత్రి సాద్ షెరీదా ఆల్కాబితో చర్చలు నిర్వహించారు. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వానికి ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. ఖతార్ నాయకత్వానికి భారత ప్రధాని సంఘీభావాన్ని ఈ సందర్భంగా మంత్రి పురి తెలియచేశారు. ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణను భారత్, ఖతార్ స్వాగతించాయి. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలు ఏర్పడిన దృష్ట్యా ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని పేర్కొన్నాయి. భారత్ అవసరాల్లో 45 శాతం ఎల్ఎన్జీ, 20 శాతం ఎల్పీజీని ఖతార్ సరఫరా చేస్తుండడం గమనార్హం. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రత అవసరాల దృష్ట్యా మంత్రి పురి ఖతార్ పర్యటనకు వెళ్లడం గమనార్హం. -
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్నారై జంట.. తాము పనిచేసే కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని ప్లాన్ వేసుకున్నారు. 2025 అక్టోబర్లో మహిళ ఉద్యోగం కోల్పోగా, ఇటీవల ఒరాకిల్ లేఆఫ్స్ సమయంలో ఆమె భర్తకు కూడా ఉద్యోగం పోయింది. 60 రోజుల గడువులో.. ఇండియాకు రావాలనుకుంటున్న సమయంలో జాబ్ కోసం నెటిజన్ల సలహాలు అడిగారు. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తరువాత నుంచి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, H4 వీసా కోసం ఎదురుచూశానని ఆమె పోస్టులో వెల్లడించారు. అయితే సరైన అవకాశాలు లేకపోవడంతో పరిస్థితి కష్టంగా మారింది. ఇదే సమయంలో తన భర్త కూడా ఉద్యోగం కోల్పోయారు. అతని H1B వీసాకు సంబంధించి PERM, I-140 ప్రాసెస్ లేకపోవడంతో, వీసా రిన్యూవల్ లేదా దీర్ఘకాలికంగా అమెరికాలో ఉండే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతనికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే మిగిలింది.ఈ పరిస్థితుల్లో.. ఆ దంపతులు అమెరికాలో కొనసాగడం సాధ్యం కాదని భావించి, భారతదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూలై నాటికి ఇండియాకు వెళ్లి అక్కడ కొత్తగా జీవితం ప్రారంభించాలని వారు ఆలోచిస్తున్నారు. “ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం ఎలా దొరుకుతుంది? ఎంత సమయం పడుతుంది? కెరీర్ను ఎలా మళ్లీ ప్రారంభించాలి?” వంటి ప్రశ్నలు అడిగారు. దీనికి నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.ఇదీ చదవండి: 'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓకొంతమంది ''భారతదేశంలో స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి'' అని ప్రోత్సహించారు. మరికొందరు ''ఇక్కడ కూడా ఉద్యోగ మార్కెట్ కఠినంగానే ఉంది, కానీ అమెరికాతో పోలిస్తే స్థిరత్వం మెరుగ్గా ఉండొచ్చు'' అని చెప్పారు. ఇంకొందరు మాత్రం ''ముందు మానసికంగా స్థిరపడండి, తర్వాత ప్లానింగ్ చేసుకోండి'' అని సలహా ఇచ్చారు. -
రష్యా యుద్ధంలో భారతీయులు..?
ఉక్రెయిన్తో జరిగే యుద్ధంలో రష్యా భారతీయులను బలవంతంగా వాడుకుంటుందని నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ దీనిని తీవ్ర ఆందోళన విషయంగా పేర్కొన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్దం మెుదలై దాదాపు నాలుగేళ్లు పూర్తైంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోగా ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. కాగా ఈ యుద్ధంలోకి బలవంతంగా భారతీయులను లాగారనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ మేరకు బాధితులకు సంబంధించిన 26 కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.ఈ తరహా కేసులు రష్యాలో వందల సంఖ్యలో జరుగుతున్నాయని కేంద్రం వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల నుంచి మోసపోయిన భారతీయులు బలవంతంగా యుద్ధంలోకి నెట్టివేయబడ్డారని ఆరోపించారు. 2025 సెప్టెంబర్- అక్టోబర్ కాలంలో వ్యక్తులు కుప్యాన్స్క్, సెలిడోవ్, మాకివ్కా మరియు చెలియాబిన్స్క్ వంటి సున్నిత ప్రదేశాలలో వారిని మోహరించారని తెలిపారు. వారి క్షేమ సమాచారంపై ఇప్పటి వరకూ ఏలాంటి సమాచారం లేదని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే వారి సమాచారంపై మాస్కోలోని రాయభార కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఏలాంటి స్పందన లేదని తెలిపారు.ఈ కేసు పూర్వాపరాలను పరీశీలించిన సుప్రీంకోర్టు దీనిని అత్యంత ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంది. ఈ మేరకు ఈ పిటిషన్లకు వెంటనే వివరణ ఇవ్వాలని విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తరపున హాజరైన తుషార్ మోహతా ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఆదేశాలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు.కాగా రష్యాకు భారత్కు ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. ఇరు దేశాలు మంచి స్నేహ సంబంధం గలవి. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ భారతీయులలో కొంత ఆందోళన రేకేత్తిస్తుంది. -
భారత్లో బ్యాన్ చేస్తే మళ్లీ వైరల్ అవుతున్న ఫోటోలు
గత ఏడాదిలో జరిగిన పుల్వామా దాడి తర్వాత పాకిస్తానీ నటీమణులు హానియా అమీర్, మహిరా ఖాన్ తదితరుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారతదేశంలో నిషేధించారు. దీంతో వారి అకౌంట్లు ఇక్కడ కనిపించవు. అయితే, సడెన్గా వారి ఇన్స్టాలోని పోస్టులతో పాటు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు అందుబాటులో లేవు. అవి మళ్ళీ చూపించలేదని గుర్తించారు.పాక్ సెలబ్రిటీల సోషల్మీడియా ఖాతాలు మళ్లీ భారతదేశంలో కనిపించడంతో నిషేధాన్ని ఎత్తివేశారా..? అనే అంశంపై నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు మళ్లీ కనిపించకపోవడంతో, ఇది సాంకేతిక లోపం కావచ్చునని కూడా చాలామంది పోస్ట్ చేశారు.పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ కేంద్రంగా కొనసాగుతున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు భారత్లో నిలిపివేస్తూ కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రక్షణ మంత్రి ఖాతాతో పాటు స్టార్ క్రికెటర్స్ సోషల్మీడియా ఖాతాలను కూడా బ్యాన్ చేశారు. -
ఇది భారత్ పవర్.. కల్పకంలో వెయ్యేళ్లు సరిపడే విద్యుత్
-
సవాళ్లున్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలను తట్టుకునేలా భారత్ పటిష్టమైన స్థితిలోనే ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారీ స్థాయిలో విదేశీ మారక నిల్వలు, తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం, మరింతగా వ్యయం చేయగలిగే సామర్థ్యాల వల్ల గ్లోబల్ ఇంధన షాక్లను ఎదుర్కొనగలదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) వృద్ధి అంచనాలను 6.6 శాతానికి పెంచినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్, ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభంలోకి పటిష్టమైన స్థితిలోనే అడుగుపెట్టిందని వరల్డ్ బ్యాంక్ రీజనల్ ప్రాక్టీస్ డైరెక్టర్ (దక్షిణాసియా) సెబాస్టియన్ ఎకార్ట్ తెలిపారు. యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకోవడంతో పాటు సానుకూల పాలసీలు మొదలైన అంశాలు భారత్ అధిక వృద్ధి సాధించేందుకు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, మిగతా వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్తో పాటు ప్రాంతీయంగా మిగతా దేశాలు పటిష్టమైన వృద్ధి సాధించగలవని భావిస్తున్నాం‘ అని వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా ఉన్న భారత్ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతానికి చేరింది. దేశీయంగా డిమాండ్ పటిష్టంగా ఉండటం, ఎగుమతులు మెరుగ్గా నమోదు కావడం ఇందుకు తోడ్పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరపు అంచనాలు అంతకన్నా తక్కువగా 6.6 శాతంగానే ఉన్నప్పటికీ, జనవరిలో వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న 6.5 శాతం కన్నా కొంత ఎక్కువే కావడం గమనార్హం. వేగవంతమైన వృద్ధి..: ఎగుమతులపై అత్యధిక టారిఫ్లను ఎదుర్కొన్నప్పటికీ గతేడాది భారత్ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందిన ఎకానమీగా నిల్చిందని ఇండియాకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ లీడ్ ఎకానమిస్ట్ ఆరిలియెన్ క్రూస్ తెలిపారు. ఆదాయ పన్ను కోతలు, జీఎస్టీ రేట్ల తగ్గింపులాంటివి దేశీ వినియోగం పెంచడానికి దోహదపడ్డాయన్నారు. ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొందని, అయితే రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో రిస్క్ లు తలెత్తే అవకాశం ఉన్నందున వృద్ధిపై ప్రభావం పడొచ్చని క్రూస్ పేర్కొన్నారు. -
సరైన విజన్తో విశ్వగురువుగా అవతరిస్తాం
న్యూఢిల్లీ: భారత్ విశ్వగురువుగా, సూపర్ ఎకానమీగా అవతరించాలంటే అందుకు భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి దార్శనికత అవసరమని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 11వ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. టెక్నాలజీ, ఆర్థికంగా లాభసాటి, ముడి సరకుల లభ్యత, తుది ఉత్పత్తుల మార్కెట్కు ఆధారంగా నిలిచే పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. ఎగుమతుల మార్కెట్ సామర్థ్యాలను అర్థం చేసుకోవాలంటూ.. వ్యవసాయం, అనుబంధ రంగాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. బ్లూ ఎకానమీలో (సముద్ర, తీర ప్రాంత వనరుల ఆధారిత)ఒక్క మత్స్యరంగమే రూ.7 లక్షల కోట్ల మార్కెట్గా అవతరించగలదన్నారు. ఇందులో సగం మేర ఎగుమతులు చేయొచ్చన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలని మంత్రి సూచించారు. సవాళ్లను ఎదుర్కోగలం ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాన్ని భారత్ ఎదుర్కోగలదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పరిపూర్ణత కలిగిన ప్రజాస్వామ్యం, దౌత్యం, వైవిధ్యం, నిర్ణయాత్మక చర్యలతో దీన్ని అధిగమిస్తామని చెప్పారు. ఏఐఎంఏ సదస్సులో భాగంగా మంత్రి సింధియా మాట్లాడారు. ‘‘భారత్ నేడు పలు దేశాలతో సంప్రదింపులు నిర్వహించగలదు. హర్మూజ్ జలసంధి ద్వారా భారత్ ఓడలు నేడు తీరాలకు చేరుకుంటున్నాయి’’అని మంత్రి సింధియా వివరించారు. ప్రతీ గ్రామాన్ని బ్రాడ్బ్యాండ్తో అనుసంధానించేందుకు ప్రభుత్వం రూ.1.39 లక్షల కోట్లను ఖర్చు చేస్తోందని చెప్పారు. దీంతో బ్రాడ్బ్యాండ్ వృద్ధి 10 శాతం పెరుగుతుందన్నారు. వచ్చే ఐదు, పదేళ్లలో భారత్ జీడీపీ పరిమాణం మరో 1.5–2 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందన్నారు. కీలక ఖనిజాలు ఎంతో అవసరం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంధన వనరుల్లో వైవిధ్యం, కీలక ఖనిజాల లభ్యత ఎంతో అవసరమని టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సవాళ్లు సహజమేనన్నారు. వైవిధ్యంలోనూ సమస్యలు ఉన్నాయంటూ.. దిగుమతులపై ఆధారపడడం కాకుండా, అవి నిరాటంకంగా సాగేలా రాజకీయ సమ్మతి కూడా అవసరమేనన్నారు. ప్రపంచం విశ్వసనీయమైన భాగస్వాముల కోసం చూస్తోందంటూ.. భారత్ ఎగుమతుల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలదన్నారు. ఏఐతో కలసి నడవాల్సిందే.. వచ్చే దశాబ్ద కాలాన్ని కృత్రిమ (ఏఐ) మేధ శాసించనుందని.. ఏఐని సది్వనియోగం చేసుకునేందుకు, ఏఐ ఆధారిత టెక్నాలజీలకు మారేందుకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు విద్యా సంస్కరణలు అవసరమని వెటరన్ బ్యాంకర్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ కేవీ కామత్ అభిప్రాయపడ్డారు. ఖరీదైన ఫౌండేషన్ మోడళ్ల కంటే వాస్తవ పరిష్కారాలపై భారత్ దృష్టి సారించాలని సూచించారు. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను సృష్టించడం కాకుండా, వాటి అవసరం ఎక్కడో ఉందో చూడాలన్నారు. ఏఐ సామర్థ్యాల పెంపునకు, వ్యయాల తగ్గింపునకు, కస్టమర్లకు మెరుగైన అనుభవానికి సాయపడుతుందని చెప్పారు. స్కూళ్లు, కాలేజీల నుంచి వచ్చే విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వాలని, పాఠ్యాంశాల్లో సమగ్రమైన మార్పు కూడా అవసరమేనన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. భారత్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు నియంత్రిత పరిధిలో ఉన్నట్టు చెప్పారు. సంక్షోభాలతో అవకాశాలు: శక్తికాంతదాస్ అంతర్జాతీయ సంక్షోభా ల్లో భారత్ స్థిరంగా నిలబడడమే కాకుండా, వాటిని అవకాశాలుగా మలుచుకుని మరింత బలంగా అవతరించినట్టు ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రియల్ జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతంగా (అంచనా) ఉన్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు గత ఐదేళ్లలో సగటు వృద్ధి 7.8 శాతంగా ఉండడాన్ని గుర్తు చేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో నిలకడ, మౌలిక వసతుల ఆధారిత వృద్ధి, బలమైన దేశీ వినియోగ డిమాండ్ను దాస్ ఏఐఎంఏ సదస్సులో భాగంగా ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అస్థిరతలు, సరఫ రా వ్యవస్థలో అవరోధాలు, వృద్ధిలో అసమానతలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోందని.. ఈ రిస్క్లు ప్రతికూలంగా ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ.. ఆర్థిక స్థిరత్వానికి ఇది ఎంతో ముఖ్యమన్నారు. వేగవంతమైన డిజిటలైజేషన్, తయారీ రంగ వృద్ధిని గుర్తు చేశారు. కరోనా విపత్తు సమయంలో ఆర్బీఐ గవర్నర్గా (2018 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్) దాస్ పాలసీ చర్యలతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవడం తెలిసిందే. -
కాంస్యాలు గెలిచిన హన్సిక, నేహా
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో గురువారం భారత్కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మరో పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గగా... మీనాక్షి (53 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాంస్య పతక బౌట్లలో హన్సిక 6–1తో అరుకె కదిర్బెక్ (కిర్గిస్తాన్)పై, నేహా 10–4తో బొలోర్తుయా (మంగోలియా)పై గెలిచారు. మీనాక్షి క్వార్టర్ ఫైనల్లో 15–4తో ఎస్బోసినోవా (ఉజ్బెకిస్తాన్)పై, సెమీఫైనల్లో 4–2తో సెయంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో చైనా రెజ్లర్ జిన్ జాంగ్తో మీనాక్షి తలపడుతుంది. 72 కేజీల విభాగంలో హర్షిత కాంస్యం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో హర్షిత 2–7తో మహిరో యోషిటాకె (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
‘పోడియంపై ఇక ఒంటరిని కాను’
కోల్కతా: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో స్వర్ణ, రజతాలు భారత్కే దక్కడం సంతోషంగా ఉందని... భారత స్టార్ పారా ఆర్చర్ శీతల్ దేవి పేర్కొంది. పారా ఆర్చరీలో లెక్కకు మిక్కిలి అవార్డులు, రికార్డులు తన పేరిట లిఖించుకున్న శీతల్ దేవి... సహచర పారా ఆర్చర్ పాయల్ నాగ్ ప్రదర్శనను కొనియాడింది. గతంలో పోడియంపై నిలిచినప్పుడు దేశం తరఫున తాను మాత్రమే గెలుస్తున్నట్లు ఒంటరి తనంగా ఉండేదని... ఇప్పుడు తనకు తోడు దొరికినట్లు అనిపిస్తోందని చెప్పింది. ఇటీవల బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ కాంపౌండ్ మహిళల ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆర్చర్ శీతల్పై భారత్కే చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్ విజయం సాధించింది. దీంతో పసిడితో పాటు రజత పతకం భారత్కే దక్కింది. ఈ నేపథ్యంలో గురువారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో శీతల్ మాట్లాడుతూ...‘గతంలో నేను ఒక్క దాన్నే గెలుస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు పాయల్ వచ్చింది. చాలా సంతోషం. తను చక్కటి ప్రదర్శనతో విజయం సాధించింది. ఇద్దరం కలిసి దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం. ఆటలో గెలుపోటములు సహజం. ఆ రోజు నాకన్నా పాయల్ చాలా బాగా బాణాలు సంధించింది. దీంతో రెండు పతకాలు మనకే దక్కాయి. ఆసియా క్రీడలు, పారాలింపిక్స్లో దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం’ అని వెల్లడించింది. ఒడిశాలోని బాలాంగిర్కు చెందిన పాయల్ నాగ్... చిన్నప్పుడే విద్యుదాఘాతానికి గురైంది. మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి పనిచేస్తున్న భవనం వద్ద కరెంట్ షాక్కు గురైంది. దీంతో రెండు చేతులతో పాటు... రెండు కాళ్లు మోకాలి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అనంతరం ఆర్చరీని కెరీర్గా ఎంచుకున్న పాయల్... అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. శీతల్పై గెలవడం పాయల్కు ఇది రెండోసారి. గతంలో నేషనల్ చాంపియన్షిప్లోనూ శీతల్పై పాయల్ పైచేయి సాధించింది. -
యుద్ధ కొరతలకు కిం కర్తవ్యం?
ఇరాన్ యుద్ధం భారత్ శక్తి, ఆహార భద్రతలలో డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది. ఆర్థిక కోణంలోనే కాకుండా సైనిక భద్రతా కోణంలో కూడా ఇరాన్ యుద్ధం భారత్కు గుణపాఠాలు నేర్పుతున్నది. సాధారణంగా యుద్ధంలో పాల్గొంటున్న దేశాలపై యుద్ధ ప్రభావం ఉంటుంది. కానీ, ప్రపంచీకరణ నేపథ్యంలో అది ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తున్నది. మన దేశ ముడి చమురు దిగుమతులలో సుమారు 40 శాతం, ఎల్ఎన్జీ దిగుమతులలో 50 శాతం, ఎల్పీజీ దిగుమతులలో సుమారుగా 80–90 శాతం హార్మూజ్ జల సంధి నుండే రావాలి. ముడిచమురును మనం రష్యా, యూఎస్ఏ, బ్రెజిల్, మెక్సికో మొదలగు దేశాల నుండి అదనంగా కొనటం ద్వారా పూరించుకోగలుగుతున్నాము. సుమారుగా 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాము. కానీ ఎల్పీజీ (వంటగ్యాస్) దిగుమతులు ప్రధానంగా ఖతర్ నుండి హార్మూజ్ జలసంధి ద్వారానే రావాలి. యుద్ధం ప్రారంభం కావడా నికి ముందు బ్యారెల్కి 72 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర ఒక దశలో 120 డాలర్లకు చేరుకొంది. కాల్పుల విరమణ వార్తలు చమురు ధరలకు కాస్త ఉపశమనం కలుగజేస్తున్నాయి. బ్యారెల్కు ప్రతి 10 డాలర్ల పెరుగుదల వలన సుమారుగా 15–16 బిలియన్ డాలర్లు చమురు దిగుమతికి అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. సౌదీ, యూఏఈ, ఖతర్ దేశాల చమురు క్షేత్రాలు, చమురుశుద్ధి కేంద్రాలకు నష్టం వాటిల్లటంతో, యుద్ధం ముగిసిన తరువాత కూడా చమురు ధరలు తగ్గకపోవచ్చు. చమురు, తత్సంబంధ ఉత్పత్తుల లభ్యతలో సమస్యలు ఉండవచ్చు.ఎరువుల ఉత్పత్తికి దెబ్బఇరాన్ యుద్ధం నేపథ్యంలో చర్చ ఎక్కువగా ముడిచమురు, ఎల్పీజీ మీదనే కేంద్రీకృతమయింది. ఇంతకంటే పెనుముప్పు దాగున్నది. ఎరువుల తయారీకి కావలసిన సహజ వాయువు, ఎల్ఎన్జీ, అమోనియా, ఫాస్పారిక్ ఆమ్లం, గంధకం, పొటాష్ వంటి ముడిసరుకుల కొరకు మనం గల్ఫ్ దేశాల మీద ఆధారపడు తున్నాము. బొగ్గు ఆధారిత ఎరువుల ఉత్పత్తిని గత రెండు దశా బ్దాలుగా సహజవాయువు/ఎల్ఎన్జీ ఆధారంగా మార్చివేశాం. ఎల్ఎన్జీ విషయంలో సుమారుగా 50 శాతం దిగుమతులపై ఆధార పడుతున్నాము. ఖతర్ నుండి ఎల్ఎన్జీ; యూఏఈ, ఒమన్ల నుండి ఎల్ఎన్జీ/సహజవాయువు దిగుమతి చేసుకుంటున్నాము. యూరియా, డీఏపీ, ఎన్పీకే ఎరువుల తయారీకి వాడే అమో నియాను సౌదీ, ఖతర్, ఒమన్, యూఏఈ నుండి దిగుమతి చేసు కుంటున్నాము. సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్ఎస్పీ) తయారీకి వాడే గంధకం ప్రధానంగా సౌదీ, యూఏఈ, ఖతర్, కువైట్ల నుండి దిగుమతి అవుతున్నది. ఎమ్ఓపీ (మ్యురేట్ ఆఫ్ పొటాష్)లో వాడే పొటాష్ దిగుమతిలో 42 శాతం సౌదీ నుండి వస్తున్నది. ఒమన్ నుండి సుమారుగా 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. యుద్ధం వలన ఎరువుల ముడిసర కుల దిగుమతికి ఇబ్బంది ఏర్పడటమే కాకుండా ధరలు కూడా పెద్ద మొత్తంలో పెరిగాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే దేశీయంగా ఎరువుల కొరత ఏర్పడ వచ్చును. రానున్న ఎల్నినో వాతావరణ నేపథ్యంలో, ఎరువుల సమస్య అగ్నికి ఆజ్యంలా తోడయితే మన ఆహార భద్రత ప్రమాదంలో పడవచ్చు.ఆర్థిక మాంద్యం తప్పదా?పరోక్షంగాయుద్ధ ప్రభావం, ఫార్మాస్యూటికల్, ప్యాకేజింగ్, నిర్మాణ సామగ్రి, అల్యూమినియం, సెమికండక్టర్ తయారీ రంగా లపై కూడా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీమా ఖర్చులు పెరగటంతో అంతర్జాతీయ షిప్పింగ్ వ్యయం పెరిగి అన్ని వస్తువుల దిగుమతులు మరింత ప్రియమవుతాయి. కోవిడ్ దెబ్బ నుండి కోలు కొని అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ తన సత్తా చూపింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక ఆర్థిక వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. గత దశాబ్దంలో భారతదేశం ద్రవ్యోల్బణాన్ని మంచి నియంత్రణలో ఉంచగలిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్పణం 4 శాతం కిందకు పడిపోయింది. అయితే, దిగుమతుల వ్యయం, ధరల పెరుగుదల వలన బడ్జెట్ లోటు పెరిగిపోతుంది. ఈ పరిస్థితి క్రమంగా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశాలున్నాయి. గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా సంవత్సర కాలంగా రూపాయి విలువ వేగంగా పతనమవుతున్నది. పెట్టుబడులు భారత దేశం నుండి తరలిపోతున్నాయి. యుద్ధ అనిశ్చితి నేపథ్యంలో మొదటగా బంగారం, తరువాత డాలర్ (అమెరికన్ మార్కెట్) వైపు పెట్టుబ డులు తరలిపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించటంతో దిగుమ తులు ఖరీదవుతున్నాయి. పెరిగిన చమురు ధరల ప్రభావం నుండి సామాన్య పౌరుడిని కాపాడటానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. చమురు కంపెనీలపై భారాన్ని తగ్గించ టానికి చమురు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. వాణిజ్య వంట గ్యాస్, విమాన ఇంధనాల ధరలను మాత్రం పెంచారు. యుద్ధం మరో నెల పైన కొనసాగితే చమురు ధరలు బ్యారెల్ 150 డాలర్లకు చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. అప్పుడిక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచక తప్పదు. బహుశా ప్రభుత్వం ఐదు రాష్ట్రాలలో ఎన్ని కలు పూర్తయ్యేవరకు వేచి చూస్తుంది. ఆస్ట్రేలియా, ద.కొరియా, నేపాల్, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, యూఎస్ఏ మొదలగు దేశాలలో ఇంధన ధరలు పెరిగాయి. ఇంధన పొదుపుపై ఆ దేశాలు దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. మన దేశంలో కూడా ఇంధన పొదుపు దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించటం; పనివేళలు, పని దినా లను తగ్గించటం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువులను ఎదుర్కోవాలంటే...మన వంటిల్లు హార్మూజ్ జలసంధికి బందీ అవటం, మన ఎరువుల ఉత్పత్తికి గల్ఫ్ దేశాలపై ఆధారపడటం దేశ శక్తి భద్రత, ఆహార భద్రతలో డొల్లతనాన్ని తెలియజేస్తుంది. ఇంధన శక్తి, ఆహార ఉత్పత్తి దేశ మనుగడను శాసిస్తాయి. ఇలాంటి కీలక రంగాలలో స్వయం సమృద్ధి దిశగా కార్యాచరణ రూపొందించాలి. చమురు, సహజ వాయువుల మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడటాన్ని తగ్గించాలి. బొగ్గు, జల విద్యుచ్ఛక్తి, సౌర శక్తి, పవన శక్తి వంటి శక్తి వనరుల అభివృద్ధి మీద దృష్టిని మరింతగా కేంద్రీకరించాలి. సౌర శక్తి, పవన విద్యుచ్ఛక్తి ప్లాంట్ల నిర్మాణానికి కావలసిన పరికరాలకు చైనామీద ఆధారపడుతున్నాము. కీలక రంగాలలో దిగు మతులపై ఆధారపడకూడదు. ముఖ్యంగా అస్థిర (గల్ఫ్) దేశాల మీద, శత్రు దేశాల (చైనా) మీద అసలు ఆధారపడకూడదన్నది యుద్ధం మనకు నేర్పుతున్న గుణపాఠం. ఇరాన్ యుద్ధంలో విద్యుచ్ఛక్తి కేంద్రాలు, శుద్ధి కేంద్రాలు, పారిశ్రామిక వాడలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కేంద్రాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమవటం శత్రువుకు కలిసివస్తుంది. భారతదేశం కూడా చైనా, పాకిస్తాన్లతో ఏకకాలంలో యుద్ధం చేయటానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరు శత్రువులు మూకుమ్మడిగా దాడి చేస్తే, మొదటి దెబ్బ మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్పైన, క్షిపణి కేంద్రాలపైన, యుద్ధయాన స్థావరాలపైన ఉంటుంది. డ్రోన్ల దండులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండవ దశలో మన విద్యుచ్ఛక్తి కేంద్రాలు, చమురుశుద్ధి కర్మాగారాలు దాడికి గురవుతాయి. ప్రాంతీయంగా వీటిని వికేంద్రీ కరించాల్సి ఉంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
సౌండ్ లేకుండా యుద్ధాలు గెలిచిన స్పైమాస్టర్..!
దేశాన్ని కాపాడేది కనబడే సైనికులు, సైనిక వ్యవస్థ. అలాగే కనిపించని కొన్ని వ్యవస్థలు, వ్యక్తులు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేసి తమ ఉనికి కూడా చరిత్రలో లేకుండా పోరాడిన యోధులు ఎంతో మంది ఉన్నారు. హెడ్లైన్స్లో కనిపించని లెజెండ్ RAW పుట్టుక వెనుక, సౌండ్ లేకుండా యుద్ధాలు గెలిచిన భారత స్పైమాస్టర్ కథ ఇది. ఇవాళ సినిమాల్లో దూరందర్ లాంటి హీరోలను చూస్తున్నాం. శత్రు దేశాల్లోకి దూసుకెళ్లి, కనిపించకుండా తిరిగి, తెలివితోనే దెబ్బ తీసి, దేశాన్ని కాపాడుతున్నట్టు... ఆ థ్రిల్, ఆ సస్పెన్స్, ఆ తెలియని ధైర్యం మనల్ని ఆకట్టుకుంటుంది. కానీ ఆ సినిమా హీరోలకు పునాది వేసిన అసలు గొప్ప మనిషి ఎవరో తెలుసా? ఆయనే రమేశ్వర్ నాథ్ కౌ (R.N. Kao).భారతదేశ గూఢచారి వ్యవస్థకు పునాది వేసిన గొప్ప వ్యక్తి. ఆయన రాజకీయ నాయకుడు కాదు… యుద్ధరంగంలో తుపాకీ పట్టిన సైనికుడు కూడా కాదు…కానీ ఆయన తెలివి, ఆయన ప్లాన్లు దేశ భవిష్యత్తును మార్చేశాయి.రీసెర్చ అండ్ ఎనాలిసిస్ వింగ్ (R&AW) అనే భారత విదేశీ గూఢచారి సంస్థను నిర్మించిన అసలైన శిల్పి ఆయనే. అసలు ‘రా’ ఎలా పుట్టిందో ఓసారి చూద్దాం. 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్థాన్ యుద్ధం ఈ రెండు సంఘటనలు భారతదేశానికి ఒక చేదు నిజం నేర్పాయి: బలమైన గూఢచార వ్యవస్థ లేకపోతే దేశం ఎదురు దెబ్బలు తినాల్సిందే. అప్పుడు అప్పటి ప్రభుత్వం, అధికారులు గట్టిగా ఆలోచించి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు దేశానికి ప్రపంచ స్థాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కావాలి. ఆ బాధ్యత ఒక్కరికి అప్పగించారు… అతనే ఆర్ ఎన్ కౌ 1968లో ఆయన స్థాపించిన సంస్థేనే ‘రా’ ఇది కేవలం ఒక సంస్థ కాదు… భారతదేశం ప్రపంచ వేదికపై కనిపించని బలంగా మారిన క్షణం. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో R&AW పాత్ర చరిత్రలో ప్రత్యేకం. ఆర్. ఎన్. కౌ నాయకత్వంలో ఈస్ట్ పాకిస్థాన్లో రహస్య గూఢచారి నెట్వర్క్ నిర్మించారు. ముక్తి బాహిని యోధులకు శిక్షణ ఇచ్చి పాకిస్థాన్ సైన్యం కదలికలపై ఖచ్చితమైన సమాచారం అందించారు. ఫలితంగా ప్రపంచ చరిత్రలో అతి వేగంగా ముగిసిన యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 93,000 వేలమంది పాకిస్తాన్ సైనికులు లొంగుబాటు.దాంతోపాటు బంగ్లాదేశ్ అనే కొత్త దేశం జన్మించింది. యుద్ధంలో సైన్యం కనిపించింది… కానీ విజయానికి పునాది వేసింది మాత్రం కౌ ఇంటెలిజెన్స్. ఈయన స్పైమాస్టర్ స్టైల్ ఏంటంటే శబ్దం లేకుండా ప్రభావం చూపించడం ఆర్ ఎన్ కౌ గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఆయన ఫోటోలు చాలా అరుదు, ఇక ఇంటర్వ్యూలు దాదాపుగా లేవు, అలా అని ఆయన పబ్లిక్ స్పీచ్లు కూడా చేయలేదు. ఆయన నమ్మకం ఒక్కటే “Real intelligence works in silence.” ఆయన ఎప్పుడూ హెడ్లైన్స్లో లేరు కాని ఆ హెడ్ లైన్స్ రావడానికి కారణం ఆయనే. అయితే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉండేది. సీఐఏ, ఎమ్ 16 వంటి ప్రపంచ గూఢచారి సంస్థలు కూడా కౌ వ్యూహాలను గౌరవించేవి. అణు కార్యక్రమ రహస్యాలను రక్షించడం, విదేశీ రాజకీయ పరిణామాలను ముందే అంచనా వేయడం, శత్రు దేశాల వ్యూహాలను పసిగట్టడం...ఇవన్నీ ఆయన నిర్మించిన వ్యవస్థ వల్లే సాధ్యమయ్యాయి.దేశం కోసం పని చేసిన రాజకీయ నాయకులు చరిత్ర పుస్తకాల్లో ఉంటారు. సైనికులు యుద్ధ గాథల్లో ఉంటారు. కానీ… దేశాన్ని కనిపించకుండా కాపాడిన గూఢచారులు మాత్రం కనిపించకుండా కదిలే కాలంలో కలిసిపోతారు. ఆ గూఢచారుల్లో అత్యున్నత స్థానం ఆర్ ఎన్ కౌది.ఆయన ఎప్పుడూ పేరు కోసం పని చేయలేదు. పతకాలు కోసం జీవించలేదు. దేశం సురక్షితంగా ఉండాలనే ఒకే ఒక్క లక్ష్యంతో జీవించారు. ఆ లక్ష్యాన్ని మరింత బలంగా చేసి, ముందుకు తీసుకెళ్తున్న మరో గొప్ప మనిషి ప్రస్తుత భారత ఇంటెలిజెన్స్ అధినేత అజిత్ దోవల్ గారు. దాదాపు దోవల్ గారు కూడా కౌ సాబ్ బాటలోనే నడిచారు... కానీ తన స్టైల్లో మార్చేశారు. ఐపీఎస్ అధికారిగా 1968లో జాయిన్ అయిన ఆయన, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా ఏళ్లు పని చేసి, రహస్య ఆపరేషన్లలో లెజెండ్ అయ్యారు. గోల్డెన్ టెంపుల్లోకి ISI ఏజెంట్గా దూసుకెళ్లి, మిలిటెంట్ల మధ్య నెలల తరబడి జీవించి, ముఖ్యమైన సమాచారం సేకరించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్స్ (Operation Black Thunder)కు పునాది వేశారు. పాకిస్థాన్లో సంవత్సరాల తరబడి రహస్యంగా ఉండి (కొన్ని కథనాల ప్రకారం 7+ ఏళ్లు), శత్రు భూమిలో భారత్ కోసం పని చేశారు. మిజోరం, పంజాబ్, కాశ్మీర్లో తిరుగుబాట్లను అడ్డుకున్న ఆపరేషన్లు... అన్నీ ఆయన ప్లాన్ల వల్లే సాధ్యమయ్యాయి. ఇవాళ NSAగా దోవల్ గారు కౌ సాబ్ వారసత్వాన్ని “రక్షణ + దాడి” స్ట్రాటజీగా మలిచారు. సర్జికల్ స్ట్రైక్స్ (2016), బాలకోట్ ఎయిర్స్ట్రైక్ (2019), డోక్లాం స్టాండ్-ఆఫ్, కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దు — ఇవన్నీ ఆయన తంత్రాల వల్లే జరిగాయి. సినిమాల్లో చూసే “దూరందర్” లాంటి థ్రిల్... దోవల్ గారి జీవితంలో నిజంగా జరిగింది, కానీ ఆయన ఎప్పుడూ లైమ్లైట్లోకి రాలేదు.అటు కౌ సాబ్ కి ఇటు దోవల్కి కావలసింది ఒక్కటే — దేశం సురక్షితంగా ఉండాలి. అయితే కౌ సాబ్ రహస్యంగా పునాది వేశారు. దోవల్ ఆ పునాదిని భారత బలంగా మార్చేశారు. ఇలాంటి తెలియని హీరోలు ఉన్నంత కాలం... భారతదేశం ఎప్పుడూ అజేయమే! -
భారత్లో యువతను రెచ్చగొడుతున్న ఆకిబ్కు ఏటీఎస్ షాక్
లక్నో: దుబాయ్లో ఉన్న ఐసిస్ మాస్టర్మైండ్ ఆకిబ్పై ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గ్లోబల్ అలర్ట్ జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గాలింపు చర్యలను ప్రారంభించింది. భారత్లో ఇటీవల బహిర్గతమైన ఐసిస్ టెర్రర్ మాడ్యూల్ వెనుక ప్రధాన సూత్రధారి అతడేనన్న అనుమానాలు ఉన్నాయి.ఉగ్రవాద కార్యకలాపాల కోసం స్థానికంగా నియమితులైన వ్యక్తులు, పాకిస్థాన్ హ్యాండ్లర్ల మధ్య ఆకిబ్ కీలక పాత్ర పోషించాడు. సఖిబ్ అలియాస్ “డెవిల్”, అర్బాబ్, లోకేష్, వికాస్ అనే నలుగురిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ విచారణ కొనసాగుతోంది. వీరు ఢిల్లీ, ముంబై, హరియాణాలో దాడులకు ప్రణాళిక వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆకిబ్పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. సఖిబ్ అలియాస్ “డెవిల్” నేతృత్వంలోని మాడ్యూల్ను ఈ నెల ప్రారంభంలో ఏటీఎస్ బహిర్గతం చేసింది. సఖిబ్తో పాటు అర్బాబ్, లోకేష్, వికాస్ విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాలతో దేశ వ్యతిరేక చర్యలకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఉన్నాయి.విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సఖిబ్ను పాకిస్థాన్ హ్యాండ్లర్లతో కలపడంలో ఆకిబ్ కీలక పాత్ర పోషించాడు. తర్వాత సఖిబ్ స్థానిక స్థాయిలో నెట్వర్క్ ప్రారంభించి, యువకులను చేర్చుతూ ఉగ్రవాద ప్రచారాన్ని వ్యాప్తి చేశాడు.సఖిబ్ టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్ఫాంలో పదికి పైగా గ్రూపులు సృష్టించాడు. ఈ గ్రూపుల్లో రెచ్చగొట్టే, దేశ వ్యతిరేక వీడియోలు, పోస్టులు చేస్తూ సభ్యులను హింసాత్మక సిద్ధాంతాలను నమ్మే దృక్పథం వైపుగా లాగే ప్రయత్నం చేశాడు.సఖిబ్తో పాటు అర్బాబ్, లోకేష్, వికాస్కు ఉగ్రవాదులు పద్ధతిగా శిక్షణ ఇచ్చారు. డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా సూచనలు చేశారు. ఈ గ్రూపులతో వందలాది మందికి సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు. వారి గుర్తింపు, పాత్రపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. -
ఈ సారి వర్షాలు తక్కువ.. కష్టాలు ఎక్కువ.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. స్కైమెట్ అధికారిక అంచనాను విడుదల చేసి వివరాలు తెలిపింది. గత అనేక సంవత్సరాల సగటు వర్షపాతాన్ని (దీర్ఘకాల సగటు వర్షపాతం)ఎల్పీఏ అంటారు. ఇది సాధారణంగా 868.6 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా.. ఈ సారి అందులో సుమారు 94 శాతం మాత్రమే ఉండొచ్చని స్కైమెట్ అంచనా వేసింది. దీనికి 5 శాతం ఎక్కువ లేదా తక్కువగానూ వర్షాలు పడవచ్చని చెప్పింది. స్కైమెట్ అంచనాలో ముఖ్యాంశాలుమొత్తం వర్షపాతం: ఎల్పీఏలో 90-95%గా ఉండనుంది, అంటే సగటుతో పోలిస్తే తక్కువ వర్షాలు పడతాయి.ఈఎన్ఎస్ఓ ప్రభావం (ఈఎన్ఎస్ఓ అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత మార్పులు ప్రపంచ వాతావరణంపై ప్రభావం చూపే వ్యవస్థ): దీర్ఘకాల లా నినా తర్వాత పసిఫిక్ సముద్రం ఈఎన్ఎస్ఓ-న్యూట్రల్ దశకు మారింది. వర్షాకాలం సమయంలో ఎల్ నినో బలపడుతుంది. ఇది ముఖ్యంగా జులై-సెప్టెంబర్లో వర్షాలు తక్కువ పడేలా చేసే అవకాశం ఉంది.భారత మహాసముద్ర ద్విధ్రువం (ఐఓడీ): న్యూట్రల్ లేదా కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. జూన్లో వర్షాలు బాగా పడడానికి సాయం చేస్తుంది. కానీ, ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తగ్గించలేదు.ప్రాంతాల వారీగామధ్య, వాయవ్య భారత్ (పంజాబ్, హరియాణా, రాజస్థాన్) ప్రాంతాల్లో ముఖ్యంగా ఆగస్టు-సెప్టెంబర్లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చు. తూర్పు, ఈశాన్య భారత్లో సాధారణ వర్షాలు ఉండే అవకాశం ఉంది.నెలవారీగా అంచనాజూన్: ఎల్పీఏలో సుమారు 101% (మంచి ప్రారంభం)జూలై: సుమారు 95%ఆగస్టు: సుమారు 92%సెప్టెంబర్: సుమారు 89% (అత్యల్ప వర్షాలు)ఇలా జరిగే అవకాశాలూ ఉన్నాయ్..అధిక వర్షపాతం (>110% ఎల్పీఏ) అవకాశం 0% (అంటే ఈ సారి అధిక వర్షపాతం పడే ఛాన్స్ లేదు)సాధారణం కంటే ఎక్కువ 10%సాధారణం 20%సాధారణం కంటే తక్కువ 40%వర్షాభావం (<90% ఎల్పీఏ) 30%తక్కువ వర్షపాత ప్రభావాలుమధ్య, పశ్చిమ భారత వర్షాధార ప్రాంతాల్లో రైతులు నీటి కొరతను ఎదుర్కోవచ్చు.ప్రభుత్వ అధికారులు తూర్పు, ఈశాన్యంలో అనుకూల వాతావరణ పరిస్థితులు, వాయవ్యంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయని అంచనా వేసుకోవాలి.సీజన్ రెండో భాగంలో అస్థిరంగా పడే వర్షాలు పంటల దిగుబడి, నీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
నితేశ్కు రజతం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో బుధవారం భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్లో భారత రెజ్లర్లు నితేశ్ (97 కేజీలు) రజత పతకం దక్కించుకోగా... ప్రిన్స్ (82 కేజీలు), సచిన్ సెహ్రావత్ (67 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్ మొహమ్మధాది సరావి (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో నితేశ్ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. దిదార్ అమన్జరోవ్ (తుర్క్మెనిస్తాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో ప్రిన్స్ 10–1తో విజయం సాధించాడు. అబ్దుమలిక్ అమినోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో సచిన్ 6–5 పాయింట్ల తేడాతో గెలిచాడు. ఓవరాల్గా గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ 115 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 195 పాయింట్లతో ఇరాన్ గ్రీకో రోమన్ విభాగంలో అగ్రస్థానాన్ని సంపాదించింది. 154 పాయింట్లతో కిర్గిస్తాన్ రెండో స్థానంలో, 136 పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ మూడో స్థానంలో నిలిచాయి. బుధవారమే మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో భారత రెజ్లర్లు హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) నేడు కాంస్య పతకాల కోసం పోటీపడతారు. సెమీఫైనల్లో హన్సిక 1–11తో యుజువాన్ లీ (చైనా) చేతిలో, నేహా 5–12తో మెంగ్యు జి (చైనా) చేతిలో ఓడిపోయారు. భారత్కే చెందిన కాజల్ (76 కేజీలు), నీలమ్ (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశారు. -
ఇరాన్లోని భారతీయులకు అత్యవసర హెచ్చరికలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్లోని భారతీయుల కోసం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఇరాన్ను వీడాలంటూ బుధవారం మరో ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా భారతీయులు ఇరాన్ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి రాయబార కార్యాలయం ద్వారా స్పష్టం చేసింది. అయితే ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారానే బయటపడాలని.. ఎలాంటి సమాచారం లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదంటూ అందులో కీలక సూచన చేసింది. మరిన్ని వివరాల కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని చెబుతూ.. +989128109115; +989128109109; +989128109102; +989932179359 హెల్ప్లైన్ నెంబర్లతో పాటు cons.tehran@mea.gov.in మెయిల్ ఐడీని సంప్రదించాలని తెలిపింది. రెండు వారాల యుద్ధ విరమణ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్లు స్పష్టమవుతోంది. ఇంతకు ముందు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఇరాన్లోని భారతీయుల క్షేమసమాచారాలను కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి విదేశాంగ శాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటోంది. -
ఈ–కామర్స్ @ 250 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుత 90 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 250 బిలియన్ డాలర్లకు చేరనుంది. జెన్ జెడ్ షాపర్స్, క్విక్ కామర్స్ వేగంగా విస్తరిస్తుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గూగుల్, డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దశాబ్దం ఆఖరు నాటికి భారత డిజిటల్ ఎకానమీలోకి 15 కోట్ల మంది కొత్త షాపర్స్ ప్రవేశించనున్నారు. మొత్తం ఆన్లైన్ వ్యయాల్లో 22 కోట్ల పైగా ఉన్న జెన్ జెడ్ వినియోగదారుల వాటా 45%కి చేరనుంది.దేశీయంగా ప్రజల షాపింగ్ చేసే తీరుతెన్నులు మారుతున్న నేపథ్యంలో ఈ–కామర్స్ కీలక దశలో ఉందని గూగుల్ ఇండియా ఎండీ (కనెక్టెడ్ కన్జూమర్ కామర్స్) రోమా దత్త చౌబే తెలిపారు. ఏఐ, ఇతరత్రా సాంకేతికతలతో వినియోగదారులు కొత్త కొనుగోలు ధోరణులను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆల్గోరిథమ్ శకం వైపు మార్కెట్ మళ్లుతోందని డెలాయిట్ దక్షిణాసియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ పేర్కొన్నారు. డిజిటల్ జనులైన జెన్ జెడ్ వినియోగదారులు ఈ మార్పులకు కారణమవుతున్నారని వివరించారు. వినియోగదారులు తమ అవసరాన్ని వివరిస్తే, ఏఐ దాన్ని విశ్లేషించుకుని, సత్వరమే సొల్యూషన్స్ కూడా అందించే జనరేటివ్ కామర్స్ వేగవంతంగా అమల్లోకి వచ్చేందుకు ఇది దోహదపడుతోందన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ⇒ ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉంటున్న క్విక్ కామర్స్ మార్కెట్ రాబోయే రోజుల్లో 50 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. ఈ విభాగంలో కొనుగోలుదారుల సంఖ్య రెట్టింపై 7 కోట్లకు చేరనుంది. ఈ మార్కెట్లో ద్వితీయ శ్రేణి నగరాలు, అంతకన్నా చిన్న పట్టణాల వినియోగదారుల వాటా 30 శాతం స్థాయిలో ఉండనుంది. ⇒ 2030 నాటికి మొత్తం క్విక్ కామర్స్ వ్యయాల్లో సౌందర్య సాధనాలు, ఫ్యాషన్, ఎల్రక్టానిక్స్లాంటి ఆహారయేతర కేటగిరీల వాటా 45 శాతానికి చేరుతుంది. తద్వారా ఆయా విభాగాల్లో స్పెషలిస్టులకు 10 బిలియన్ డాలర్ల వ్యాపారావకాశాలు లభిస్తాయి. ⇒ క్రియేటర్ ఎకానమీ కూడా కీలకంగా మారనుంది. కంటెంట్ క్రియేటర్లు 2030 నాటికి మొత్తం రిటైల్ వ్యయాల్లో 30 శాతం భాగాన్ని ప్రభావితం చేస్తారు. ప్రతి 10 ఆన్లైన్ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్ స్టోర్ఫ్రంట్ ద్వారా జరుగుతుంది. లైవ్ కామర్స్ 8 బిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుంది. ⇒ పరిశ్రమ వృద్ధిలో కృత్రిమ మేధ ముఖ్య పాత్ర పోషించనుంది. హైపర్ పర్సనలైజేషన్, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం ద్వారా రిటైల్ లాభదాయకత 30–35% మేర పెరిగేందుకు దోహదపడనుంది. -
పాకిస్థాన్ మరిన్ని ముక్కలవ్వడం ఖాయం : రాజ్నాథ్ సింగ్
ఢిల్లీ: పాకిస్థాన్కు భారత రక్షణశాఖ రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ ‘కోల్కతాపై దాడి’ వ్యాఖ్యల్ని ఖండించారు. పశ్చిమ బెంగాల్పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్థాన్ మరిన్ని ముక్కలవుతుందని హెచ్చరించారు.మంగళవారం ఖ్వాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ స్పందించారు. అసిఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో భారత్పై నోరు పారేసుకున్నారు. భవిష్యత్తులో భారత్ తమ దేశాన్ని దోషిగా నిలబెట్టి దాడులు చేస్తే ప్రతిస్పందనగా.. కోల్కతాపై దాడులు చేస్తామని అని అన్నారు. దీనిపై రాజ్నాథ్ సింగ్ పాక్ చరిత్రను గుర్తుచేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్పై రెండు ముక్కలైంది. ఇప్పుడు బెంగాల్పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్నిముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అని హెచ్చరించారు.1971లో పాక్ రెండు ముక్కలుగా విడిపోయింది. అందులో బంగ్లాదేశ్ విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్ సైన్యం అండగా నిలిచింది. నాటి చరిత్రను తాజాగా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. మరోసారి అదే తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్ ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నాటి నుంచి పాకిస్థాన్.. భారత్పై కవ్వింపు చర్యలకు దిగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఖవాజా మరోసారి ప్రగల్భాలు పలికారు. ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ కూడా స్పందించింది. కోల్కతాపై దాడి చేస్తే పాక్లోని వారి ఇళ్లలోకి దూరి మరి చంపుతామని అధికార టీఎంసీ నేతలు వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరికలు మాత్రం భారతదేశం తన భూభాగాన్ని రక్షించేందుకు ఎలాంటి రాజీపడదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బెంగాల్పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్కు మరింత విభజన తప్పదని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. -
పెట్టుబడులకు బూస్ట్.. వడ్డీరేట్ల కట్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ అటు పెట్టుబడులకు ఊతమిస్తూనే ఇటు పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేలా వడ్డీ రేట్లను కూడా తగ్గించగలిగే సామర్థ్యాలు భారత్కి ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దశాబ్దకాలంగా పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ ప్రతిఫలం ఇదని ఆమె పేర్కొన్నారు. కఠినతరమైన పరిస్థితులను అధిగమించాలంటే మేలైన ఆర్థిక విధానాలు పాటించడం అవసరమని ఆమె పేర్కొన్నారు. భారీ రుణ భారాలు, ద్రవ్య లోటుతో సతమతమవుతున్న కొన్ని దేశాల్లో భారత్లో ఉన్నటువంటి వెసులుబాటు లేదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ముందుంది గడ్డుకాలం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలనేవి ప్రాంతీయ భద్రతా సవాళ్ల స్థాయి నుంచి వ్యవస్థాగతంగా ప్రకంపనలు సృష్టించే స్థాయికి విస్తరించాయని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు కీలకమైన మార్గాలకు పెను ముప్పుగా మారాయని మంత్రి చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత కఠినతరంగా ఉండబోతోందని తెలిపారు. గతేడాది వాణిజ్యపరమైన ఉద్రిక్తతలతో గ్లోబల్ సరఫరా వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొని, గ్లోబల్ వృద్ధి అంచనాలను దిగువముఖంగా తిరగరాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయినప్పటికీ భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. జీడీపీలో ప్రభుత్వ రుణభారం సుమారు 81 శాతమేనని, జర్మనీ మినహాఅతి పెద్ద ఎకానమీల్లో ఇదే తక్కువ స్థాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
‘పసిడి’ రేసులో లలిత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఒక పతకం ఖరారైంది. మరో రెండు పతకాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ లలిత్ (55 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నేడు జరిగే స్వర్ణ–రజత పతక బౌట్లో ఇఖ్తియోర్ బొతిరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో తలపడతాడు. అంతకుముందు లలిత్ క్వార్టర్ ఫైనల్లో 9–8తో మిజుకి అరాకి (జపాన్)పై, సెమీఫైనల్లో 11–3తో హువోయింగ్ షి (చైనా)పై గెలుపొందాడు. మరోవైపు భారత్కే చెందిన అమన్ (77 కేజీలు), సునీల్కుమార్ (87 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి నేడు కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. జోగిందర్ రాఠి (130 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, సన్నీ కుమార్ (63 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లో నిష్క్రమించారు. జోగిందర్, సన్నీ కుమార్లను ఓడించిన రెజ్లర్లు ఫైనల్కు చేరుకోవడంలో విఫలం కావడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం కూడా చేజారింది. నేడు జరిగే ఐదు వెయిట్ కేటగిరీల్లో సాహిన్ (60 కేజీలు), సచిన్ (67 కేజీలు), అనిల్ (72 కేజీలు), ప్రిన్స్ (82 కేజీలు), నితేశ్ (87 కేజీలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ పతకావకాశాలపై దెబ్బ పడింది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ నుంచి భారత రెండు డబుల్స్ స్టార్స్ జోడీలు వైదొలిగాయి. గాయం కారణంగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ఈ టోర్నీకి దూరమయ్యారు. సాత్విక్ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీలో ఆడటంలేదని భారత డబుల్స్ కోచ్ టాన్ కిమ్ హెర్ తెలిపాడు. డబుల్స్లో పతకం ఆశలు ఆవిరి కావడంతో ఇక అందరి దృష్టి సింగిల్స్ స్టార్స్ లక్ష్య సేన్, పీవీ సింధులపై ఉంది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ప్రణయ్, ఆయుశ్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్... మహిళల సింగిల్స్లో సింధు, మాళవిక, ఉన్నతి హుడా, తన్వీ శర్మ బరిలో ఉన్నారు. 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్లో పసిడి పతకం గెలిచిన తర్వాత భారత్కు సింగిల్స్లో మరో స్వర్ణ పతకం లభించలేదు. -
ఇరాన్ మాస్టర్ మైండ్.. పశ్చిమాసియా యుద్ధంలోకి భారత్?
వాష్టింగన్: హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లేదంటే ఇరాన్లో విధ్వంసం తప్పదని హూంకరిస్తున్నారు. అయితే, ట్రంప్ బెదరింపుల్ని ఇరాన్ ఖాతరు చేయడం లేదు. హర్మూజ్ జలసంధిని తెరిచేది లేదని తేల్చి చెబుతోంది. అమెరికాను ఏకాకిని చేస్తూ.. పశ్చిమాసియా యుద్ధంలో తమకు భారత్, చైనాతో పాటు ఇతర దేశాలు తమకు అండగా ఉన్నాయని తెలిసేలా సెటైరికల్ ట్వీట్లు వేస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయాలు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా ట్వీట్లు వేస్తున్నాయి. ఆ ట్వీట్లలో దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ట్రంప్:హర్మూజ్ జలసంధిని తెరవండి అని ఇరాన్ అడుగుతుంటే మిగిలిన దేశాలు ఇలా అభిప్రాయం వ్యక్తం చేశాయని అర్ధం వచ్చేలా ట్వీట్లలో హైలెట్ చేశాయి. భారత్: హర్మూజ్ జలసంధిని మూసేశారా?పాకిస్థాన్: హర్మూజ్ జలసంధిని మూసేసింది. రష్యా: విచిత్రంగా ఉంది…దక్షిణాఫ్రికా: లేదు హర్మూజ్ జలసంధి తెరిచే ఉందిఫ్రాన్స్: అబ్బే అలా ఏం లేదే. హర్మూజ్ జలసంధిని చూస్తుంటే మాకు అలా అనిపించడం లేదేచైనా: హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది. మేం ఇప్పుడే అక్కడి నుంచి వచ్చేశాం’అని ట్వీట్లలో పేర్కొంది. బల్గేరియా ఎంబసీ: ‘టేక్ ఇట్ ఈజీ టైగర్, కీప్ యువర్ కూల్’ అంటూ ట్రంప్ను ఎగతాళి చేసింది జింబాబ్వే ఎంబసీ: “ట్రంప్, నాతో మాట్లాడు. మాకు చాలా బోర్గా ఉంది” అని సరదాగా వ్యాఖ్యానించింది మరికొన్ని ఎంబసీలు ‘తాళాలు పోయాయి’ అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాయి.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇరాన్ ట్వీట్లలో భారత్, చైనా వంటి దేశాల పేర్లు ప్రస్తావించడం వెనుక వ్యూహం ఉంది. తాను ఒంటరిగా లేనని, తనకు మిత్రదేశాలు అండగా ఉన్నాయని ప్రపంచానికి సంకేతం ఇవ్వడమే. అమెరికాను ఏకాకిగా చూపించడమే కాకుండా, హోర్ముజ్ జలసంధి సురక్షితంగా ఉందని అంతర్జాతీయ సమాజానికి ధైర్యం చెప్పడమేనని వారు విశ్లేషిస్తున్నారు.హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన ఎనర్జీ కారిడార్. ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇక్కడి ఉద్రిక్తతలు చమురు ధరలను వెంటనే ప్రభావితం చేస్తాయి. తాజా పరిణామాల వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగాయి.ఇటీవలి అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్లో 25 మందికి పైగా మరణించారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ నగరం హైఫాపై దాడి చేశాయి. సౌదీ అరేబియా, కువైట్, యుఎఈ తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. టెహ్రాన్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రివల్యూషనరీ గార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదెమీ మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.ఇరాన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఒకవైపు అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తే, మరోవైపు ప్రపంచానికి “మా వెనుక ఇతర దేశాలు ఉన్నాయి, పరిస్థితి నియంత్రణలో ఉంది” అనే సందేశాన్ని పంపుతున్నాయి. అయితే, హర్మూజ్ వివాదం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు కుదిపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Trump: "Open the Strait of Hormuz!"India: "Is it closed?"Pakistan: "Closed?"Russia: "Strange…"South Africa: "but it's Open, of course"France: "Doesn't look like it…"China: "Open… we just passed through! 🚢😏"Trump: 🙁 https://t.co/vnNc1EQy54— Iran Embassy SA (@IraninSA) April 5, 2026 -
యుద్ధం టెన్షన్.. ఇరాన్, గల్ఫ్తో భారత్ చర్చలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ట్రంప్ విధించిన 48 గంటల డెడ్లైన్ సమీపిస్తుండంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై పెద్దఎత్తున దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో చర్చలు జరిపారు.చమురు సరఫరాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉండడంతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గల్ప్ దేశాలలో దౌత్య చర్చలు జరిపారు.ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్ థానీతో పాటు యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఫోన్లో సంభాషించారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో వివిధ అంశాలపై ఈ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఈ సంక్షోభం వల్ల భారత్పై పడే ప్రభావం గురించి జైశంకర్ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.మరోవైపు ట్రంప్ 48 గంటల డెడ్లైన్ సమీపిస్తుండడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతోనూ సమకాలిన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భారత్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలను హర్మూజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతిస్తోంది. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా జైశంకర్ దౌత్య పరంగా ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. -
పాక్ మధ్యవర్తిత్వం? ఇరాన్ ఏమందంటే?
పట్నా: పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ భారత ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి తిరస్కరించారు. బిహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఇలాహి ఓ ఇంటరర్వ్యూలో మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు పాకిస్థాన్ ద్వారా జరుగుతున్నాయనే వాదనలు నిజం కాదని తెలిపారు."ఈ విషయంలో పాక్కు ఎలాంటి పాత్ర లేదు. పాకిస్థాన్ ద్వారా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయన్న వాదనల్లో నిజం లేదు. ఇటువంటి మాటలను అమెరికా కేవలం చమురు ధరలను తగ్గించడానికే చెబుతోంది. వారు నిజంగా చర్చలకు సిద్ధంగా లేరు. కొన్ని దేశాలను ఉపయోగించాలనుకున్నారు. చర్చలు జరపాలనుకుంటున్నామని చెప్పారు.. కానీ, అది నిజం కాదు" అని ఆయన తెలిపారు.శాంతి ప్రయత్నాల్లో భారతదేశం పాత్ర పోషించగలదా? అనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. భారతదేశం సహా ఇతర అన్ని దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆపడానికి సహకరించవచ్చని అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మంచి పాత్రను పోషించవచ్చని పేర్కొన్నారు.యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. యుద్ధం ముగింపు అనేది అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఫిబ్రవరి 28న వారు యుద్ధాన్ని ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అన్నారు."ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలపైనే యుద్ధం ముగింపు అంశం ఆధారపడి ఉంది. వారు ఇరాన్పై దాడులు ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మానవ వనరుల కేంద్రాలు, గనులపై దాడులు చేశారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది పౌరులు మరణించారు. వారు ఆపితే యుద్ధం ముగుస్తుంది" అని చెప్పారు.ఇరాన్ యుద్ధాన్ని కోరుకోలేదని.. ఈ ఘర్షణ వల్ల అనేక దేశాల పౌరులు బాధపడుతున్నారని ఇలాహి చెప్పారు. ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు."దురదృష్టవశాత్తు ఇది అధర్మ యుద్ధం. ప్రపంచంలోని అనేక మంది బాధపడుతున్నారు. ప్రపంచ నాయకులు కలిసి ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలను ఆపాలని కోరాలి" అని తెలిపారు. -
ఎప్స్టిన్ ఫైల్స్లో అనిల్ అంబానీ.. లైంగిక నేరాల్లో ప్రమేయం ఉందా?
వాష్టింగన్: అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఆ పత్రాల్లో భారత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా ప్రస్తావనకు రావడం ఆసక్తి కలిగించింది. దీంతో ఎప్స్టీన్ లైంగిక నేరాల్లో అంబానీ ప్రమేయం ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ ఫైల్స్ను పరిశీలిస్తే, అంబానీకి ఎప్స్టీన్తో ఉన్నది వ్యాపార సంబంధాలే తప్ప లైంగిక సంబంధాలు లేవని స్పష్టమైంది.ఎప్స్టీన్ ఫైల్స్లో అంబానీ పేరు ప్రస్తావన రావడం ఆయన వ్యాపార సమస్యల సమయంలో ఎప్స్టీన్ ఇచ్చిన సలహాలు, అమెరికా రాజకీయ పరిణామాలపై సమాచారం, పరిచయాలకే పరిమితమైంది. లైంగిక నేరాల విషయంలో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని స్పష్టంగా తేలింది. అంటే, ఎప్స్టీన్ వ్యవహారంలో అంబానీ పేరు వినిపించడం ఆయన వ్యాపార సంబంధాల కోణంలో మాత్రమేనని, లైంగిక నేరాలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఈ పత్రాలు నిర్ధారించాయి.అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ ప్రకారం.. అనిల్ అంబానీ–జెఫ్రీ ఎప్స్టీన్ మధ్య 2017 నుండి 2019 వరకు సంభాషణలు జరిగాయి. ఈ చర్చలు ప్రధానంగా అమెరికా–భారత్ సంబంధాలు, ట్రంప్ ప్రభుత్వ విధానాలు, అలాగే అంబానీ ఎదుర్కొంటున్న వ్యాపార సమస్యలపై స్నేహపూర్వక సలహాల చుట్టూ తిరిగాయి. అంబానీతో పరిచయం పెంచుకోవడానికి, తాను వైట్ హౌస్లో లోపలి వ్యక్తి అని చూపించుకోవడానికి ఎప్స్టీన్ ప్రయత్నించినట్లు పత్రాలు సూచిస్తున్నాయి.ట్రంప్ ప్రభుత్వ జాతీయ భద్రతా వ్యూహంలో భారత్ స్థానం ఏమిటో తెలుసుకోవాలని అంబానీ ఎప్స్టీన్ను సంప్రదించగా.. ‘వైట్ హౌస్లోని అంతర్గత సమాచారం అందిస్తాను’ అంటూ ఎప్స్టీన్ స్పందించాడు. అలాగే ట్రంప్ నియామకాలపై ముందుగానే సమాచారం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఉదాహరణకు, 2017లో అంబానీ, డేవిడ్ పేట్రేయస్ను భారత్కు అమెరికా రాయబారిగా నియమిస్తారా అని అడిగితే, ఎప్స్టీన్ లేదని అని చెప్పాడు. అన్నట్లుగా ఆ పదవి కెన్నెత్ జస్టర్కు దక్కింది.తనకి ట్రంప్ సన్నిహితులు స్టీఫెన్ బానన్, థామస్ బారాక్లను పరిచయం చేయాలని ఎప్స్టీన్ సూచించాడు. వ్యాపార సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ‘మానసికంగా బలంగా ఉండాలి’ అని సలహా ఇచ్చాడు. నీతో పరిచయం .. డబ్బు కోసం కాదు, స్నేహితుడిగా మాత్రమే’అని పలుమార్లు చెప్పాడు. 2019 ఏప్రిల్లో అంబానీ ‘ట్రాన్సాక్షన్ పూర్తయింది.. కాఫీకి వస్తాను’ అని మెయిల్ పంపించారు. మే 23న న్యూయార్క్లోని ఎప్స్టీన్ ఇంట్లో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా వారు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫారమ్లలో మాట్లాడుకున్నారు. అంబానీ ‘ఆర్మనీఏ’ అనే హ్యాండిల్తో కనెక్ట్ అయ్యారు.ఎప్స్టీన్ అరెస్టుకు మూడు రోజుల ముందు వరకు ఈ సంభాషణలు కొనసాగాయి. ముఖ్యంగా, అనిల్ అంబానీపై ఎటువంటి లైంగిక దుర్వినియోగ ఆరోపణలు లేవని న్యూయార్క్ టైమ్స్ స్పష్టంచేసింది. ఈ సంబంధం వ్యాపార సమస్యల సమయంలో ఎప్స్టీన్ ఇచ్చిన సలహాలు, అమెరికా రాజకీయ పరిణామాలపై సమాచారం అనే కోణంలో మాత్రమే నిలిచింది. -
నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ శాంపిల్ కోచ్ అదరహో
న్యూఢిల్లీ: నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ కోచ్ల అంతర్గత భాగాల అప్గ్రేడేషన్ జరుగుతోంది. శాంపిల్ కోచ్ సిద్ధమైంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా న్యూఢిల్లీ స్టేషన్లో ప్రతిపాదిత అంతర్గత డిజైన్, రంగులతో అభివృద్ధి చేసిన నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ కోచ్ల శాంపిల్ కోచ్ను పరిశీలించారు. ప్రయాణికులకు మంచి సౌకర్యం, ఆకట్టుకునే రూపం, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ మోడల్ కోచ్ను రూపకల్పన చేశారు.పీవీసీ ఫ్లోరింగ్, సీటు, బెర్త్ రెక్సిన్, స్నాక్ టేబుళ్లు, కర్టెన్లు, లావేటరీ ప్రాంతాలు వంటి ముఖ్య భాగాల్లో వాటికి తగ్గ రంగులతో ప్రత్యేక అంతర్గత రంగుల థీమ్లు ఏర్పాటు చేశారు. ఈ కోచ్లలో వాడిన అన్ని పదార్థాలు హెచ్ఎల్ 3 అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. హెచ్ఎల్3 (హజార్డ్ లెవల్ 3) యూరోపియన్ రైల్వే స్టాండర్డ్ ఈఎన్ 45545-2కి అనుగుణంగా వీటి రూపకల్పన చేస్తున్నారు. హజార్డ్ లెవల్ 3 అంటే అగ్ని ప్రమాదంలో పదార్థాల భద్రత స్థాయి కొలిచే అత్యున్నత ప్రమాణం. ఈఎన్ 45545-2 అంటే యూరోపియన్ రైల్వే అగ్ని భద్రత ప్రమాణాల నియమావళి.ఈ రైళ్లకు వాడుతున్న ఈ కలర్ స్కీమ్ ఆధునిక రూపాన్ని ఇస్తూ దీర్ఘకాలికంగా మన్నికగా ఉండేలా చేస్తుంది. నిర్వహణ కూడా సులభతరంగా ఉంటుంది. రైల్వేలో ఉపయోగించే అన్ని రకాల బోగీలు, లోకోమోటివ్లను ఆధునికీకరించారు. ఈ సూపర్ఫాస్ట్ ప్రయాణికుల రైలులో పీవీసీ ఫ్లోరింగ్ నుంచి రెక్సిన్ సీటు బెర్త్లు, స్నాక్ టేబుళ్లు, కర్టెన్లు, మరుగుదొడ్డి వరకు వాటికి తగ్గ రంగుల ప్యాలెట్లు వేయడంతో ఈ రైలు చూడగానే ఆకట్టుకుంటోందది.ప్రయాణికుల భద్రత, మెరుగైన సౌకర్యాల కోసం కొత్త డిజైన్లు, మెరుగైన మరుగుదొడ్డి సౌకర్యాలతో కోచ్ల శాంపిల్స్ సిద్ధం చేశామని, ఉన్న కోచ్ను మెరుగుపరచి నమూనా కోచ్గా తయారు చేశామని అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పేర్కొన్నారు. 🚆 Passengers की सुरक्षा और सुविधा बढ़ाने के लिए रेलवे ने नए डिज़ाइन के coach और बेहतर टॉयलेट्स के मॉडल तैयार किए हैं। मौजूदा coach को अपग्रेड कर एक सैंपल coach तैयार किया गया है। pic.twitter.com/nIXwplAI5A— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 4, 2026 -
గ్లోబల్గా పోటీకి సెజ్ల దన్ను
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత్ మరింతగా పోటీపడేందుకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్) తోడ్పడుతున్నాయి. దీనితో వీటిని బలోపేతం చేసే దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్లో సమగ్ర సంస్కరణలు ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్య మార్పులు, సరఫరా గొలుసు సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సెజ్లను తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు కీలకమని పేర్కొన్నారు. వీటిలో తయారైన ఉత్పత్తులను పరిమితంగా దేశీయ మార్కెట్లో తక్కువ సుంకంతో విక్రయించుకునే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో సెజ్ల పురోగతిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి దేశీయంగా నోటిఫై అయిన సెజ్ల సంఖ్య 368గా ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్ వరకు) రూ.11.70 లక్షల కోట్ల ఎగుమతులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 32.02 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం పెట్టుబడులు రూ.7.86 లక్షల కోట్లకు చేరగా, 31.73 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది. ఈ గణాంకాలు భారత ఆర్థిక వృద్ధికి ఎస్ఈజెడ్ల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయని పీఐబీ పేర్కొంది. సెజ్ల పరిణామక్రమం ఇలా: 1965లో కాండ్లాలో ఆసియాలోనే తొలి ఎగుమతి ప్రాసెసింగ్ జోన్ (ఈపీజెడ్)ని ఏర్పాటు చేసిన అనుభవంతో 2000లో సెజ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చట్టం–2005 అమల్లోకి తెచ్చి, 2006 నుంచి అమలు ప్రారంభించారు. దీని కింద సింగిల్ విండో క్లియరెన్స్, సరళతరంగా నియంత్రణ, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించారు. వాణిజ్య, పెట్టుబడి వ్యవస్థకు మూల స్తంభాలైన సెజ్లు దేశీయంగా ప్రత్యేక డ్యూటీ–ఫ్రీ ప్రాంతాలుగా, కస్టమ్స్ పరిధి వెలుపల పని చేస్తున్నాయి. ఇక్కడి యూనిట్లలో ఉత్పత్తుల తయారీ, సేవలు, గిడ్డంగుల తదితర కార్యకలాపాలు ఉంటున్నాయి. 2026–27 బడ్జెట్లో కీలక నిర్ణయం సాధారణంగా సెజ్ల నుంచి దేశీ టారిఫ్ ప్రాంతానికి (డీటీఏ) సరఫరాను దిగుమతులుగా పరిగణించి పూర్తి సుంకాలు విధిస్తారు. అయితే తాజా పరి స్థితుల నేపథ్యంలో ఉత్పత్తిలో కొంత భాగాన్ని త క్కువ సుంకాలతో డీటీఏలో విక్రయించునేందుకు సర్కార్ వెసులుబాటు కల్పించింది. ఖర్చులు తగ్గి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, సెజ్లు బలోపేతం అయ్యేందుకు ఈ చర్యలు తోడ్పడనున్నాయి. మరో వైపు, టెక్నాలజీ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని సెజ్లలోని డేటా సెంటర్లకు పన్ను రాయితీలు, గ్లోబల్ టెక్ కంపెనీలను ఆకర్షించేలా విధానాల్లో మార్పు లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ప్రత్యేక సెజ్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించింది. 2025 జూన్లో సాణంద్, ధార్వాడ్ ప్రాంతాల్లో కొత్త సెజ్లను నొటిఫై చేసింది. పెట్టుబడులకు ఊతమిచ్చేలా డ్యూటీ ఫ్రీ దిగుమతులు, రాష్ట్ర పన్ను రాయితీలు, సింగిల్ విండో అనుమతులు మొదలైన చర్యలు ఉంటున్నాయి. -
వీసీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రైవేట్ క్యాపిటల్ మార్కెట్లు నెమ్మదించినప్పటికీ, భారత్లో వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు మాత్రం గతేడాది జోరుగానే వచ్చాయి. 2025లో 16 బిలియన్ డాలర్ల మేర వీసీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అధికం. వివిధ స్థాయుల్లో 1,300 పైగా లావాదేవీలు జరిగాయి. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ, ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) సంయుక్తంగా రూపొందించిన ఇండియా వెంచర్ క్యాపిటల్ రిపోర్ట్ 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, లిక్విడిటీ కఠినతరం కావడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులు వృద్ధి చెందడం గమనార్హం. 2023లో రీసెట్ అయిన తర్వాత దేశీ వెంచర్ క్యాపిటల్ వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టిందని బెయిన్ అండ్ కంపెనీ అసోసియేట్ పార్ట్నర్ ఆదిత్య మురళీధర్ తెలిపారు. మెరుగైన గవర్నెన్స్, సమర్ధవంతంగా పెట్టుబడుల వినియోగం, నిష్క్రమించేందుకు అవకాశాల పునాదులతో ఈ వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలకడగా వృద్ధి చెందే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → 50 మిలియన్ డాలర్ల లోపు డీల్స్ గణనీయంగా నమోదయ్యాయి. → భారీ డీల్స్ కూడా పుంజుకున్నాయి. 250 మిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే ఒప్పందాల సంఖ్య నాలుగు నుంచి రెట్టింపై ఎనిమిదికి చేరింది. యూనిట్ ఎకనామిక్స్ పటిష్టంగా ఉండి, మానిటైజేషన్పై స్పష్టత ఉన్న కంపెనీల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. తీరుతెన్నూ లేని విస్తరణ కన్నా వ్యాపార నాణ్యతకే ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → కన్జూమర్ టెక్ సంస్థలకు నిధులు నెమ్మదించాయి. అయితే దీర్ఘకాలిక సత్తాను ప్రదర్శిస్తూ, ఈ విభాగంలోకి పెట్టుబడులు 2023 నుంచి వార్షికంగా 25 శాతం స్థాయిలో పెరిగాయి. → అన్ని ఉత్పత్తులు కాకుండా నిర్దిష్ట ప్రోడక్టులను మాత్రమే సత్వరం డెలివరీ చేసే క్విక్ కామర్స్ సంస్థల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చాయి. → టెక్నాలజీ ఆధారిత రంగాలు ఫండింగ్ రికవరీలో కీలక పాత్ర పోషించాయి. ఇందులో ఫిన్టెక్ రంగం ప్రత్యేకంగా నిల్చింది. ఈ విభాగంలో డీల్స్ విలువ వార్షికంగా సుమారు 2.2 రెట్లు పెరిగింది. పెట్టుబడుల్లో పేమెంట్స్ కేటగిరీ అత్యధిక వాటా దక్కించుకోగా, డిజిటల్ వినియోగం, కుటుంబాల పొదుపు మొత్తాల పెరుగుదలతో వెల్త్టెక్ డీల్స్ విలువ అయిదు రెట్లు పెరిగింది. → సాఫ్ట్వేర్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) ఫండింగ్ 1.5 రెట్లు పెరిగింది. ఓ స్థాయికి చేరుకున్న ప్రస్తుత సంస్థలు కూడా మళ్లీ నిధుల బాట పట్టాయి. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జనరేటివ్ ఏఐ–నేటివ్ బీ2బీ కంపెనీలకు, ప్రధానంగా బ్యాంకింగ్, హెల్త్కేర్ రంగాల్లో వాటికి ఆదరణ లభిస్తోంది. → దీర్ఘకాలిక ఇన్వెస్టర్లలో ధీమాని ప్రతిఫలిస్తూ, భారత్పై ఫోకస్ చేసే వీసీలు, గ్రోత్ ఈక్విటీ ఫండ్స్ సమీకరించిన నిధులు వార్షికంగా రెట్టింపై 5.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించుకుని వైదొలిగేందుకు కూడా గత ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. మొత్తం ఎగ్జిట్ విలువలో పబ్లిక్ మార్కెట్ల మార్గంలో జరిగినది 65 శాతంగా నమోదైంది. -
పెళ్లికి ముందు సూది మందు
సాక్షి, హైదరాబాద్: పెళ్లికి ముందు బరువు తగ్గే సులభమైన మార్గాల వెతుకులాటలో యువతీ యువకులు నిమగ్నమవుతున్నారు. వెయిట్లాస్కు సంబంధించిన ప్రత్యేక ఇంజెక్షన్లు, మందులపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో భారత్లో వీటి వినియోగం వేలంవెర్రిగా పెరిగిపోతోంది. పెళ్లికి ముందు వ్యాయామం, ఆహార నియమాలతో ఆశించిన ఫలితాలు రాలేదంటూ సడన్గా బరు వు తగ్గేందుకు ‘మౌంజారో’(టిర్జెపాటైడ్) ఇంజెక్షన్ తీసుకోవడం ఇటీవల పెళ్లీడు యువతలో బాగా పెరిగింది. పెళ్లి రోజు న నాజూగ్గా, అందంగా కనిపించాలనే తాపత్రయం కారణంగా భారత్లో ఇదొక కొత్త ట్రెండ్గా మారింది. ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే... ఢిల్లీలోని ఓ క్లినిక్ ఏకంగా ‘మౌంజారో బ్రైడ్’పేరిట ఓ ప్రత్యే క ప్యాకేజీని ప్రకటించింది. మరికొన్ని క్లినిక్లు.. చర్మ, కేశాలంకరణతోపాటు ఈ ఇంజెక్షన్లను ప్రీ–వెడ్డింగ్ ప్యాకేజీల్లో చేర్చే వరకు పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో మధుమేహం, బరువు తగ్గుదల కోసం అను మతి పొందిన తొలి జీఎల్పీ–1 మందు ‘మౌంజారో. దీన్ని ఎలి లిల్లీ సంస్థ ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. దీని పోటీ దారు నోవో నార్డిస్క్ తయారుచేసిన ‘వెగోవీ’కూడా అందుబాటులోకి వచ్చింది. శారీరక రూపానికి ప్రాధాన్యంతో... భారత్లో సంప్రదాయ వివాహాల్లో వధువు, వరుడి శారీరక రూపం, ఆర్థిక స్థితికి సంబంధించి అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటున్నాయి. పెళ్లిలో ఒక నిర్దిష్ట పద్ధతిలో కనిపించాలనే సామాజిక ఒత్తిడి దీనికి కారణం. గతేడాది భారత్లో ఈ రెండు సంస్థలు తమ ఊబకాయ నివారణ మందులను విడుదల చేయగా, కొన్ని నెలల్లోనే మౌంజారో అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఈ మందులోని క్రియాశీల పదార్ధమైన సెమాగ్లుటైడ్ పేటెంట్ గడువు ముగియడంతో, భారతీయ ఔషధ తయారీదారులు ఇటీవల నోవో మందు చౌక వెర్షన్ల విక్రయాలు ప్రారంభించి, దాని లభ్యతను విస్తృతం చేశారు. ఈ మందులు ఊబకాయం ఉన్నవారిగా వర్గీకరించిన పెద్దలు లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా స్లీప్ అప్నియా వంటి బరువు సంబంధిత వైద్య పరిస్థితితో అధిక బరువు ఉన్నవారి కోసం ఉద్దేశించినవిగా ఉన్నాయి. భారత్లో మౌంజారో ఇంజెక్షన్ పెన్ అత్యల్ప డోస్ ధర నెలకు రూ.13,125, గరిష్ట డోస్ ధర రూ. 25,781గా ఉంది. వెగోవీ అత్యల్ప డోస్ను నెలకు రూ.5,660, గరిష్ట డోస్ను రూ.16,400కి విక్రయిస్తున్నారు. ఇమ్యునో డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఎలాంటి వెయిట్లాస్ చికిత్స అయినా మెటబాలిక్ సిండ్రోమ్తో సడన్గా బరువు తగ్గితే రోగ నిర్ధారణ శక్తికి నష్టం జరుగుతుంది. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా ‘ఓవర్ ద కౌంటర్’గా ఈ మందులు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఈ ఇంజెక్షన్లను మెడిసిన్గా వాడాలే తప్ప జ్వరం, ఒళ్లు నొప్పులకు క్రోసిన్ టాబ్లెట్గా వాడకూడదు. ఈ మందులతో సడన్గా బరువు తగ్గితే తీవ్రమైన ఇమ్యునో డిప్రెషన్తో క్షయ, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముంది. సడన్ వెయిట్లాస్తో యాంగ్జయిటీ ట్రమెర్స్, తీవ్రమైన వెన్నునొప్పుల బారిన కూడా పడే అవకాశాలున్నాయి. ఈ బరువు తగ్గుదల మందులు కూడా శాశ్వత పరిష్కారంకాదు. ఈ ఇంజెక్షన్లను తీసుకోవడం ఆపేస్తే వెంటనే బరువు పెరుగుతారు. సాధారణంగా అయితే 6 నెలల నుంచి ఏడాది వరకు ఈ మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చి ఏడాదే అవుతోంది. అందువల్ల వీటి దీర్ఘకాల ప్రభావాలు, దు్రష్పభావాలు ఏమిటనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియడం లేదు. తగిన డైట్, వ్యాయామానికి ఇది ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. –డా. బూర నర్సయ్యగౌడ్, బేరియాట్రిక్ సర్జన్ -
హార్మూజ్ను దాటిన గ్రీన్ శాన్వీ
న్యూఢిల్లీ: భారత్ దిశగా ఎల్పీజీ నౌకల ప్రయాణపరంపర కొనసాగుతోంది. తాజాగా ఉద్రిక్తమయ హార్మూజ్ జలసంధిని ఎల్పీజీ రవాణా నౌక ‘గ్రీన్ శాన్వి’విజయవంతంగా దాటింది. మరోవైపు మరో ఎల్పీజీ నౌక ఇరాన్ నుంచి బయల్దేరి క్షేమంగా భారత్కు చేరుకుంది. ఇది మంగళూరుకు చేరుకుని ఎల్పీజీని దిగుమతిచేస్తోంది. తాజాగా హార్మూజ్ను దాటిన గ్రీన్ శాన్వీ నౌక 46,650 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. ఇదే నౌకలో 25 మంది నావికులు సైతం ఉన్నారు. భారతీయ జెండాతో బయల్దేరి విజయవంతంగా హార్మూజ్ను దాటిన ఎల్పీజీ నౌకల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. వీటిలో ఏడు శివాలిక్, నందాదేవి, జగ్ లడ్కీ, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎం ఇప్పటికే భారత్కు చేరుకున్నాయి. గ్రీన్ శాన్వీ మార్గమధ్యంలో ఉంది. ఇరాన్ ప్రభుత్వం తరఫున ఎల్పీజీ నౌక ‘సీ బర్డ్’రాకతో గత ఏడేళ్లలో ఆ దేశం నుంచి భారత్కు చేరుకున్న తొలి నౌకగా ఇది గుర్తింపు పొందింది. ఈ నౌకలో 44,000 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇన్నాళ్లూ ఇరాన్ దేశ చమురు ఉత్పత్తులపై అమెరికా అంతర్జాతీయ నిషేధం విధించగా అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరగడంతో తప్పని పరిస్థితుల్లో ఆ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. చైనా దిశగా ఇరాన్ నౌకపై భారత్ స్పష్టీకరణ ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ దిశగా వస్తున్న ఇరాన్ చమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశ మార్చుకోవడంలో చెల్లింపుల అంశం అస్సలే లేదని, చెల్లింపుల ఆలస్యం కారణంగానే అది భారత్కు రావట్లేదనే వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టింది. ‘‘అంతర్జాతీయంగా మార్గమధ్యంలో ఇంధన నౌకలు తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడం సాధారణం. గిట్టుబాటు, వాణిజ్య వెసులుబాట్లు, నిర్వహణ సౌకర్యాలకు అనుగుణంగా నౌకలు తమ దిశలను మార్చుకుంటాయి. తాజాగా భారత్కు ఏడేళ్ల తర్వాత గుజరాత్లోని వడినార్కు వస్తున్న ముడిచమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశమార్చుకోవడంలో చెల్లింపుల అంశం ఇమిడిలేదు. ఇరాన్తో భారత్కు ఎలాంటి చెల్లింపుల వివాదాలు లేవు. నౌకల సంబంధ నగదు చెల్లింపులు సవ్యంగా జరుగుతున్నాయి’’అని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
భారత్తో మాది వేల ఏళ్ల అనుబంధం: ఇరాన్
ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. అయితే భారత్ నౌకలు మాత్రం జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ ఎల్పీజీ ట్యాంకర్ జలసంధి గుండా భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా భారత్ ధన్యవాదాలు తెలుపగా ఇరాన్ దానికి స్పందించింది.చమురు నౌక గుజరాత్ చేరుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఈ ట్యాంకర్ ప్రయాణాన్ని భారతీయ దౌత్య విజయంగా అభివర్ణించారు. దీనిపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. "భారతదేశం, ముఖ్యంగా గుజరాత్, మా ఉమ్మడి చరిత్రలో ఒక మధురమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. శతాబ్దాల క్రితం మా దేశం నుండి వచ్చిన వారిని మీరు సాదరంగా ఆహ్వానించారు. ఈ నాగరికత సంబంధాల ఆధారంగా, మన మధ్య స్నేహం మరియు సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము." అని తెలిపింది.కాగా ఇరాన్ కాన్సులేట్ తన సందేశంలో సింధూ నాగరికతకు చెందిన లోథల్ ఓడరేవును ఉద్దేశించి మాట్లాడింది. సుమారు 4,000 ఏళ్ల క్రితమే సింధు లోయ నాగరికతకు మరియు పర్షియా తీరానికి మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను ఇది గుర్తుచేస్తుంది. కాగా గ్రీన్ సాన్వీ అనే నౌక 46,650 మెట్రిక్ టన్నుల గ్యాస్తో హర్ముాజ్ జలసంధిని దాటింది.అయితే హర్మూజ్ జలసంధి విషయమై ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దానిని ఎట్టిపరిస్థితుల్లో తెరవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేస్తుండగా ఇరాన్ ససేమిరా అంటుంది. దీంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ కేవలం 5 మిత్ర దేశాలకు భారతదేశం,రష్యా, చైనా, ఇరాక్,పాకిస్థాన్ అనుమతినిచ్చింది. -
ఆ చమురు నౌక చైనాకు మళ్లింది!
న్యూఢిల్లీ: 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురుతో భారత్కేసి బయల్దేరిన పింగ్ షున్ అనే నౌక తన ప్రయాణ దిశను ఉన్నట్టుండి చైనా వైపు మార్చుకుంది! ముందుగా నిర్దేశించిన మేరకు ఈ చమురు నౌక గుజరాత్లోని వదినార్ రేవుకు చేరాల్సి ఉంది. మూడు రోజులుగా నౌక ప్రయాణం వదినార్ వైపే సాగింది. అక్కడికి కొద్ది దూరంలో ఉండగా శుక్రవారం ఉన్నట్టుండి చైనాలోని డోంగ్యింగ్ కేసి మళ్లినట్టు నౌకల ప్రయాణాన్ని గమనించే ‘కోలా డేటా’పేర్కొంది. పింగ్ షున్ తాజాగా తన గమ్యస్థానాన్ని డోంగ్యింగ్గానే చూపుతున్నట్టు తెలిపింది. ఈ నౌక గనక భారత్ చేరితే ఏడేళ్ల అనంతరం ఇరాన్ నుంచి మన దేశానికి తొలిసారి చమురు దిగుమతి జరిగేది. ఈ నౌకలోని చమురు తాలూకు క్రయ, విక్రయదార్ల వివరాలు వెల్లడి కాలేదు. ఎస్వాతిని దేశపు జెండాతో కూడిన ఈ చమురు నౌక ఈ వారం మొదట్లో భారత్కు బయల్దేరింది. ఇప్పుడిలా సముద్ర మధ్యంలో ఉన్నట్టుండి చైనా వైపు ఎందుకు మళ్లిందన్నది తెలియాల్సి ఉంది. బహుశా చెల్లింపుల అంశమే దీనికి ప్రధాన కారణమై ఉంటుందని కోలా అభిప్రాయపడింది. ‘‘చమురు చెల్లింపులకు సరఫరా కంపెనీలు గతంలో కనీసం 30 నుంచి 60 రోజుల గడువిచ్చేవి. కానీ పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు సరఫరా పూర్తిగా అడుగంటి డిమాండ్ చుక్కలనంటింది. దాంతో కంపెనీలు తక్షణ చెల్లింపులను డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ముందుకొచ్చే దేశాలకే పెద్దపీట వేస్తున్నాయి’’అని పేర్కొంది. ఇరాన్ చము రును సరఫరా చేస్తోందంటూ పింగ్ షున్ నౌకపై 2025లో అమెరికా నిషేధం విధించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తేయడం తెలిసిందే. దాంతో ఇప్పటికే సముద్రంలో ఉన్న ఇరాన్ చమురు నౌకలపై మన చమురు కంపెనీలన్నీ జల్లెడ పడుతున్నాయి. ఆ క్రమంలోనే పింగ్ షున్ ఇరాన్ చమురుతో భారత్కేసి బయల్దేరి తాజాగా ఉన్నట్టుండి చైనా బాట పట్టింది. అయితే, చెల్లింపు సంబంధిత అంశాలు కొలిక్కి వచ్చే పక్షంలో ఈ నౌక భారత్కే వచ్చే అవకాశాలూ లేకపోలేదని ‘కోలా’లో ప్రధాన పరిశోధకునిగా పని చేస్తున్న సుమిత్ రిటోలియా చెప్పుకొచ్చారు. చమురు కొనుగోళ్ల కోసం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ముమ్మర పోటీకి ఈ ఉదంతం తాజా నిదర్శనమన్నారు. 2018 వరకు భారత్కు అతి పెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఇరాన్ కూడా ఉండేది. మన చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా 11.5 శాతం దాకా ఉండేది. 2019లో ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేసింది. దాంతో ఇరాన్ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేసింది. -
భారత్కు అండగా రష్యా.. చమురు సంక్షోభానికి తెర?
భారత్కు రష్యా గుడ్న్యూస్ చెప్పింది. పశ్చిమాసియా యుద్ధ తీవ్రత దృష్ట్యా చమురు సంక్షోభం నేపథ్యంలో తాను అండగా ఉన్నానంటూ భరోసా ఇచ్చింది. ఈ మేరకు ముడి చమురు సరఫరా పెంపుకు ఆ దేశ ఉప ప్రధాని భారత్కు హామీ ఇచ్చినట్లు సమాచారం.చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. భారత్తో సహా ఎన్నో దేశాలు ఈ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత పర్యటనలో ఉన్న రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.భారతవిదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ సలహాదారు అజిత్ ధోబల్తో ఇంధన అంశమై రష్యా ఉపప్రధాని భేటీ జరిగినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో భారత్కు కావాల్సిన ముడి చమురు,లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG),సరఫరాను మరింత పెంచుతామని ఆయన హామీ ఇచినట్లు తెలుస్తోంది.అనంతరం ఆయన ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే కేవలం చమురు మాత్రమే కాకుండా.. అణుశక్తి , సాంకేతికత, మరియు కీలక ఖనిజాల రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. -
దేశంలో యాపిల్ నగరంగా పేరొందిన సిటీ ఎక్కడ ఉంది?
భారతదేశం అనేక హిల్ స్టేషన్స్కు ప్రశాంతమైన పర్వత గ్రామాలకు నిలయం, అందులోనూ విశేషం ఏమిటంటే.. ప్రతిదానికీ దాని కంటూ ఒక స్వంత కథ ఉంటుంది. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్లో దాగి ఉన్న అటువంటి ఒక చిన్న పట్టణం, భారతదేశపు యాపిల్ సాగులో కీలక పాత్ర పోషించింది. దట్టమైన కొండలు, స్వచ్ఛమైన పర్వత గాలి నలువైపులా యాపిల్ తోటలతో నిండి ఉండే ఈ పట్టణం ప్రశాంతంగా సహజమైన సౌందర్యంతో కనిపిస్తుంది. సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కనిపించే రద్దీకి భిన్నంగా ఈ గ్రామంలో జీవనం స్లోగా ప్రశాంతంగా సాగుతుంది. సందర్శకులు దాని సహజ సౌందర్యానికి సరళమైన, ప్రశాంతమైన జీవనశైలికి ఆకర్షితులవుతారు. అయితే, ఈ చిన్న పట్టణానికి యాపిల్ పండ్ల వల్లే గొప్ప ప్రాచుర్యం వచ్చింది.హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా సమీపంలో ఉన్న చిన్న పట్టణమైన కోట్గఢ్, దేశానికి యాపిల్ సాగును పరిచయం చేయడంలో చారిత్రక పాత్ర పోషించింది. తద్వారా భారతదేశపు యాపిల్ సిటీగా గుర్తింపు పొందింది. దీనికి 20వ శతాబ్దం ప్రారంభంలో తొలి బీజం పడింది , అమెరికన్ మిషనరీ కి చెందిన శామ్యూల్ ఎవా న్స్ స్టోక్స్ వాణిజ్యపరంగా మొదటి యాపిల్ తోటలను నాటారు. కోట్గఢ్లోని సారవంతమైన నేల, చల్లని వాతావరణం అనువైన ఎత్తులో యాపిల్ సాగుకు చాలా అనుకూలంగా ఉండడంతో ఈ అభివృద్ధి చెందుతున్న ఉద్యానవన పరిశ్రమకు పునాది వేశాయి. కాలక్రమేణా, యాపిల్ సాగు కోట్గఢ్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి, హిమాచల్ ప్రదేశ్ను దేశంలోని ప్రముఖ యాపిల్ ఉత్పత్తిదారుగా నిలిపింది.సందర్శనీయ ప్రాంతం..ముఖ్యంగా ఆగస్టు నుంచి∙అక్టోబర్ వరకు పంట కోత కాలంలో, కోట్గఢ్లోని విస్తారమైన యాపిల్ తోటలు, ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పండ్లతో నిండిన ఆపిల్ చెట్ల వరుసల మధ్య నడవడం ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది. అనేక స్థానిక కుటుంబాలు యాపిల్ సాగు తమ తోటల నడుమ జీవితం గురించిన కథలను సంతోషంగా మనతో పంచుకుంటాయి. కోట్గఢ్కు కొద్ది దూరంలో ఉన్న తాని జుబ్బర్ సరస్సు, దేవదారు అడవులు చుట్టుముట్టిన ఒక ప్రశాంతమైన ప్రదేశం. ప్రశాంతమైన జలాలు స్వచ్ఛమైన పర్వతపు గాలి ఆహ్లాదపరుస్తాయి. ఏకాగ్రతతో ఆలోచించుకోవడానికి, ఫోటోగ్రఫీకి లేదా విశ్రాంతిని అందించే పిక్నిక్కు అనువుగా అనిపిస్తాయి. కోట్గఢ్తో తరచుగా ముడిపడి ఉండే థానేదార్ గ్రామీణ ప్రాంతంలో మొట్టమొదటి యాపిల్ మొక్కలు నాటిన ప్రదేశం ఉంటుంది. సాంప్రదాయ గృహాలు, మెట్ల పొలాలు హిమాలయాల విశాల దృశ్యాలతో ఈ గ్రామం ఆకట్టుకుంటుంది. కోట్గఢ్లో స్థానిక దేవతలకు చెందిన పురాతన ఆలయాలు అనేకం ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రాంతీయ నమ్మకాల గురించి తెలియజెబుతాయి. ఇక్కడి హోమ్స్టేలో బస చేయడం ద్వారా సందర్శకులు కోట్గఢ్లోని రోజువారీ జీవితాన్ని అనుభవించవచ్చు. సాధారణ, ఇంట్లో వండిన భోజనం నుంచి పండ్ల తోటల యజమానులతో సంభాషణల వరకు, ఇది ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలతో మమేకయే అవకాశాన్ని అందిస్తుంది.కోట్గఢ్ను సందర్శించడానికి మార్చి నుంచి జూన్ నెల మధ్య అనువైనది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కొండల అంతటా పువ్వులు వికసించడం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉండే శరదృతువు మరో విధంగా ప్రత్యేకం. ఎందుకంటే యాపిల్ పంట కోత కాలం ఈ పట్టణాన్ని చైతన్యవంతమైన కార్యకలాపాల కేంద్రంగా మారుస్తుంది. అయితే శీతాకాలాలు చల్లగా ఉంటూ మంచు కురుస్తుంది, ఇది ఈ ప్రాంతం మీదుగా ప్రయాణాన్ని సవాలుగా మారుస్తుంది,ఎలా వెళ్లొచ్చు?విమాన మార్గంలో వెళ్లాలంటే..ఈ పట్టణానికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం జుబ్బర్హట్టిలో ఉన్న సిమ్లా విమానాశ్రయం, ఇది కోట్గఢ్కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చండీగఢ్ విమానాశ్రయం కూడా మరో ఎంపిక, రైలు మార్గంలో అయితే సమీపంలోని రైల్వే స్టేషన్ సిమ్లా, ఇది వారసత్వ నారో–గేజ్ రైల్వే ద్వారా కల్కాతో అనుసంధానితమై ఉంది. సిమ్లా నుంచి కోట్గఢ్కు రోడ్డు మార్గం ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది. సాధారణ బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి. -
అజిత్ దోవల్ రెడ్ ఫైల్ లో ఏముంది? యుద్ధానికి సిద్ధమవుతున్న ఇండియా!
-
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
ఢిల్లీలోని సౌత్ బ్లాక్.. రాత్రి సమయం. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా కనిపించే మీటింగ్లు కావు ఇవి. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్రనేతలతో పాటు, ఒక వ్యక్తి అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయనే భారత జేమ్స్ బాండ్ – అజిత్ దోవల్! అసలు ఏం జరుగుతోంది? భారత్ మరో మహా యుద్ధానికి సిద్ధమవుతోందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. NSA అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ కవచం. రా (RAW) , ఎన్ఐఏ (NIA) ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి, ఆయన ఒక 'రిస్క్ అసెస్మెంట్ ఫైల్' రూపొందించారు. దీనినే 'రెడ్ ఫైల్' అని పిలుస్తారు. సాధారణంగా ప్రపంచ నేతలెవరైనా 30 నుండి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. కానీ మోదీ, దోవల్తో ఏకంగా మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చించారంటే, అది చమురు ధరల గురించో, ఆర్థిక స్థితిగతుల గురించో కాదని ఇక్కడ స్పష్టమవుతోంది. అమెరికా , పాకిస్థాన్లు కలిసి భారత్ను ఇబ్బంది పెట్టడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కింది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్ తోపాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) గంటల తరబడి గడుపుతున్నారు. మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరీ జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహాకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే, భారత్ ఏదో భారీ "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్థాన్ తన గాలి సరిహద్దులను (Air Space) అప్పగించబోతోంది. ఒకవేళ పాకిస్థాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకెళ్తే, ఇరాన్ ఖచ్చితంగా పాకిస్థాన్పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! పాకిస్థాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ను యుద్ధంలోకి లాగాలని చూస్తోంది. భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో 'నోటామ్' (NOTAM) జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏం జరగొచ్చనేదానికి ఇది సంకేతం.మరోవైపు, పీఓకే (PoK) సరిహద్దుల్లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ ,పాకిస్థాన్ కలిసి భారత్ను "టూ ఫ్రంట్ వార్" (రెండు వైపుల నుండి యుద్ధం) లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే ఈ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, ఎస్-400, రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్థాన్ను ఎలా దెబ్బకొట్టాలి? ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి? అనే వ్యూహంలో ఉంది. శతృవు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత వార్-రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహా-సంగ్రామంలో భారత్ పైచేయి సాధిస్తుందా? మోదీ, దోవల్ వ్యూహం పాకిస్థాన్ను కోలుకోలేని దెబ్బ తీయబోతోందా? అనే చర్చ అంతర్జాతీయ మీడియాలో మొదలైంది. -
భక్తిలో భారతావని: రాష్ట్రానికో రీతిలో హనుమజ్జయంతి
న్యూఢిల్లీ: అమోఘమైన బలం, అచంచల భక్తి, అకుంఠిత ధైర్యం, అలవికాని స్వామి భక్తికి నిలువుటద్దం.. హనుమంతుడు. నేడు (గురువారం) హనుమజ్జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మన దేశ సంస్కృతిలో ఉన్న వైవిధ్యం హనుమాన్ జయంతి వేడుకల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాదిలో ఒకలా, దక్షిణాదిలో మరోలా.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్తర భారతం: ఉపవాసాలు, సుందరకాండ పఠనం ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, బిహార్ తదితర రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భక్తులు తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించి, ఆలయాలకు వెళతారు. రోజంతా కఠిన ఉపవాసం ఉండి, సాయంత్రం హనుమంతుడికి పూజలు నిర్వహించిన తర్వాతే ఆహారం తీసుకుంటారు. ఆలయాల్లో హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. భక్తులకు బూందీ, లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేయడం ఉత్తరాది ప్రత్యేకత.మహారాష్ట్ర: వీధుల్లో శోభా యాత్రల సందడిమహారాష్ట్రలో హనుమాన్ జయంతి అంటే భారీ ఉత్సవం. ఇక్కడ జరిగే ‘శోభా యాత్రలు’ అత్యంత ప్రధానమైనవి. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించిన రథాలపై హనుమంతుని విగ్రహాలను ఉంచి ఊరేగిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని భజనలు, కీర్తనలతో వీధులను హోరెత్తిస్తారు. అనేక చోట్ల ‘భండారా’ పేరుతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక: సింధూరార్చన, తమలపాకు పూజలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు చైత్ర పూర్ణిమ రోజున నిర్వహిస్తారు. స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం, సింధూరాన్ని సమర్పించడం ఈ ప్రాంతాల్లో ప్రధాన ఆచారం. ఇక కర్ణాటకలో ఈ పండుగను మార్గశిర మాసంలో (డిసెంబర్ - జనవరి) జరుపుకోవడం విశేషం. భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.తమిళనాడు, కేరళ: వడమాల, వెన్న పూతతో అభిషేకాలుదక్షిణాదిలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఉత్సాహంగా సాగుతాయి. భక్తులు స్వామివారికి ‘వడమాల’ సమర్పించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. అలాగే స్వామి విగ్రహానికి వెన్న పూయడం , తులసి దళాలతో పూజించడం, అభిషేకాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి.గుజరాత్, రాజస్థాన్: దానధర్మాలు, సత్సంగాలుపశ్చిమ భారత దేశంలోని గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భక్తులు హనుమాన్ చాలీసాను 108 సార్లు పఠించడం ఆచారంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక సత్సంగాలు అధికంగా జరుగుతాయి. కేవలం పూజలకే పరిమితం కాకుండా, పేదలకు అన్నదానం చేయడం, దుస్తులు పంపిణీ చేయడం వంటి దానధర్మాలకు ఈ రోజున అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రాంతాలు వేరైనా, సంప్రదాయాలు వేరైనా.. హనుమంతుడిపై ఉన్న భక్తి భారతీయులందరినీ ఒక్కటి చేస్తోంది. ‘అష్టసిద్ధి నవనిధి దాత’ అయిన ఆ ఆంజనేయుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం.ఇది కూడా చదవండి: సురేష్ గోపి నిజంగా గెలవలేదా? -
సాధారణ రైతు.. జీవితాలను మార్చేలా అసాధారణ విజయం
చింతల వెంకట రెడ్డి.. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) ద్వారా అంతర్జాతీయ పేటెంట్లు పొందిన భారత మొట్టమొదటి స్వతంత్ర రైతు. ఆయన రైతుల సంక్షేమమే లక్ష్యంగా చురుకుగా పనిచేస్తూ, వ్యవసాయంలో ఉత్తమ విధానాలను వేలాది మంది అన్నదాతలకు ఉచితంగా బోధిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా అధిక దిగుబడి రాబట్టవచ్చని నిరూపిస్తున్నారు. రైతుల కోసం నిలబడిన ఆయన స్ఫూర్తిదాయక గాథను తెలుసుకుందాం..హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ఆర్గానిక్ రైతు చింతల వెంకట రెడ్డి భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ‘మట్టి-కేంద్రీకృత విధానం’తో పేరు తెచ్చుకున్నారు. ఆయన సికింద్రాబాద్ అల్వాల్లో 1950 డిసెంబరు 22న సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్న వయసు నుంచే తండ్రికి పనుల్లో సాయం చేస్తుండేవారు. 12వ తరగతి తర్వాత కుటుంబానికి చెందిన 40 ఎకరాల పొలాన్ని చూసుకోవడానికి చదువు ఆపేశారు.జీవితాన్ని మలుపుతిప్పిన ఘటనచింతల వెంకట రెడ్డి 1970 దశాబ్దం చివరలో రసాయన ఎరువులు మట్టి సహజ శక్తిని తగ్గిస్తున్నాయని గుర్తించారు. దీంతో మట్టి ఆరోగ్యం (పోషకాలతో, సమతుల్యంగా ఉండి పంటలకు అవసరమైన అన్ని సహజ లక్షణాలు కలిగి ఉండడం) పునరుద్ధరణపై ప్రయోగాలు ప్రారంభించారు. చివరకు విజయం సాధించారు. మట్టి పునరుద్ధరణకు జెనీవాలోని ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూఐపీఓ నుంచి అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఆయన ఆవిష్కరణల్లో ప్రధానమైనది “సోయిల్ స్వాపింగ్”.టెక్నిక్ ఇదేభూమిలోని రెండో పొర (4-5 అడుగుల లోతు) నుంచి తీసిన మట్టిలో ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ మట్టిని పైపొరపైకి తీసుకురావడం ద్వారా ఎలాంటి రసాయన ఎరువు లేకుండా భూసార పునరుద్ధరణను సాధించారు చింతల వెంకట రెడ్డి.మట్టి ద్రావణం.. ఎలా పనిచేస్తుంది?రసాయన స్ప్రేలకు బదులుగా మట్టి ద్రావణ పద్ధతిని చింతల వెంకట రెడ్డి అభివృద్ధి చేశారు. భూమిలోని రెండో పొర నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి, వడకట్టి, నీటిలో కలిపి ద్రావణంగా తయారు చేస్తారు. దీన్ని పంటలపై పిచికారీ చేస్తే పలుచని మట్టి పొర ఏర్పడుతుంది. ఈ మట్టిని తినే పురుగులు జీర్ణించుకోలేక చనిపోతాయి. అదే సమయంలో ఖనిజాలు మొక్కకు ఆహారంగా పనిచేస్తాయి.బియ్యం, గోధుమలో సమృద్ధిగా విటమిన్-డీ వెంకట రెడ్డి 2021లో సహజ పద్ధతిలో ప్రధాన ఆహార పంటల్లో విటమిన్-డీ ఎక్కువ ఉండేలా చేయడంలో విజయం సాధించారు. సాధారణంగా బియ్యంలో 0 శాతం విటమిన్ డీ ఉంటుంది. ఆయన పంటల్లో 100 గ్రాములకు 102 నుంచి 141 ఐయూ వరకు నమోదైంది. గోధుమలో 100 గ్రాములకు 1832 ఐయూ ఉంటోంది. పోషకాహార లోప సమస్యకు తక్కువ ఖర్చుతో పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా వీటిపై పనిచేశారు.అంతర్జాతీయ గుర్తింపుతెలంగాణలోని చింతల వెంకట రెడ్డి వ్యవసాయ క్షేత్రం ప్రపంచ నాయకులకు సందర్శన కేంద్రంగా మారింది.బిల్ క్లింటన్ (2001): ద్రాక్ష సాగు విధానాన్ని ప్రశంసించారు.జార్జ్ డబ్ల్యూ బుష్ (2006): హైదరాబాద్ వచ్చిన సమయంలో చింతల వెంకట రెడ్డిని కలిసి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పద్ధతులపై వివరాలు తెలుసుకున్నారు.పురస్కారాలుపద్మశ్రీ (2020): వ్యవసాయ ఆవిష్కరణల్లో ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అందజేసింది.డబ్ల్యూఐపీఓ పేటెంట్లుమట్టి పోషక నిర్వహణ, బయో-ఫోర్టిఫికేషన్ పద్ధతులకు అనేక అంతర్జాతీయ పేటెంట్లు వచ్చాయి. బయో-ఫోర్టిఫికేషన్ అంటే పంటల్లో పోషక విలువలను సహజంగా పెంచే ప్రక్రియ.ప్రపంచ రికార్డు: అనాబ్-ఎ-షాహీ ద్రాక్ష రకంలో హెక్టారుకు 105 టన్నుల దిగుబడి సాధించారు.వెంకట రెడ్డి సిద్ధాంతం“మట్టి అంటే మొక్క కడుపు. మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఆ మొక్కను తినే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు” అనేది ఆయన సిద్ధాంతం. -
‘డాడీ’ అని పిలుస్తున్న పిల్లలు… కానీ చట్టం ఒప్పుకోదా..?
ఆమె తన మొదటి భర్తతో హిందూ వివాహ చట్టం ద్వారా 2015లో విడాకులు పొందిన తర్వాత నేను ఆమెను 2016లో వివాహం చేసుకున్నాను. ఆమెకు మొదటి వివాహం ద్వారా ఒక అబ్బాయి, ఇద్దరు కవల అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిని తండ్రి తన సంరక్షణలోకి తీసుకున్నాడు కానీ అమ్మాయిల బాధ్యత ఏనాడూ పట్టించుకోలేదు. ఇద్దరు అమ్మాయిలు 2015 నుండి నా భార్యతోనే ఉంటున్నారు. ప్రస్తుతం వారికి 12 సంవత్సరాలు. నేను వారిని నా పిల్లల్లాగే చూసుకుంటున్నాను. నన్ను వాళ్ళు ‘డాడీ’ అని పిలుస్తారు. అందువల్ల ఇంక నాకు మళ్ళీ పిల్లలు వద్దు అని నిర్ణయించుకున్నాను. నా భార్య గతంలో తన మాజీ భర్త నుండి తీవ్రమైన గృహహింసకు గురైంది, ముఖ్యంగా కవల పిల్లలకు (అమ్మాయిలకు) జన్మనిచ్చిన కారణంగా. ఇద్దరు అమ్మాయిలను నేను చట్టపరంగా దత్తత తీసుకుని, నా ఇంటిపేరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతని నుంచి దత్తతకు అనుమతి పొందడం అసాధ్యం. నా మీద కూడా కక్షధోరణి ఉంటుంది. తండ్రి అనుమతి లేకుండా దత్తత తీసుకోవడం సాధ్యమా? సాధ్యం కాకపోతే, ఏ చట్టపరమైన మార్గాలు ఉన్నాయి?– మచ్చా అనికేత్, విశాఖపట్నం ముందుగా మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కంటేనే సంతానం కాదు – ప్రేమానురాగాలకు పేగుబంధమే అవసరం లేదు అని నిరూపించారు. మీరు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం.మీ సమస్యలోని సున్నితత్వాన్ని , భావోద్వేగాలను అర్థం చేసుకోగలను. భారతదేశంలో, పైగా హిందూ చట్టాలలో పిల్లల తల్లి/తండ్రి బతికే ఉంటే, సాధారణంగా ఏ ఒక్కరి అనుమతి లేకుండా దత్తత సాధ్యం కాదు. మీ కేసులో కూడా తండ్రి అనుమతి కావాలి.ఎందుకంటే...1. దత్తత తీసుకున్న తర్వాత జన్మనిచ్చిన తండ్రి హక్కులు పూర్తిగా ముగుస్తాయి.2. మీరు చట్టపరంగా తండ్రిగా మారతారు.3. ఆస్తి, వారసత్వ హక్కులు మారతాయి.ఈ పరిస్థితుల్లో తండ్రి అనుమతి లేకుండా కోర్టు దత్తతకు అనుమతించాలి అంటే ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.1. తండ్రి పిల్లలను ఉద్దేశపూర్వకంగా వదిలేశారా?2. పిల్లలను ఇన్ని సంవత్సరాలుగా చూసుకున్నారా లేదా – కనీసం వారి బాగోగులు పట్టించుకున్నారా లేదా?3. తండ్రి హింసాత్మకంగా లేదా పిల్లల పోషణకు అనర్హుడిగా ఉన్నారా?4. పిల్లలకు అతని వల్ల హానికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా?ఈ అంశాలను కోర్టు మాత్రమే నిర్ణయించగలదు – మీ సొంత నిర్ణయాలు చెల్లవు. ముందుగా కస్టడీ/గార్డియన్షిప్ పొందడం కోసం మీ భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి. పిల్లలు 2015 నుండి తనతోనే ఉన్నారని. తండ్రి బాధ్యతలు నిర్వర్తించలేదని / హింస (ఆర్థిక, మానసిక, శారీరక) చేశాడని, పైన తెలిపిన అంశాలకు ΄ాల్పడ్డాడు అని నిరూపించాలి.ఆ తర్వాత మీరు దత్తత కోసం కోర్టులో పిటిషన్ వేయవచ్చు. అందులోనే తండ్రి అనుమతి అవసరం లేదని కూడా కోర్టును అభ్యర్థించవచ్చు. పిల్లలు 12 సంవత్సరాలు ఉన్నందున కోర్టు వారి అభి్ర΄ాయం అడగవచ్చు. వారు మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు, జన్మనిచ్చిన తండ్రిపై వారికి ఎటువంటి ప్రేమ లేదు అంటే అది మీకు బలమైన అంశంగా మారుతుంది. చట్టపరంగా దత్తత తీసుకోకుండా సర్టిఫికెట్లలో ఎటువంటి మార్పులు చేయకండి. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తల ఎత్తవచ్చు. మీ దగ్గరలోని మంచి లాయర్ గారిని కలవండి. మీ భార్యకు తన మాజీ భర్తకు జరిగిన కోర్టు వివాదాలు, పత్రాలు, ఒప్పందాలు ఏవైనా ఉంటే తీసుకుని వెళ్ళండి. మాజీ భర్త తన పిల్లలను ఏనాడు పట్టించుకోలేదు అని చెప్పడానికి ఆధారాలు సేకరిస్తే మరీ మంచిది. -
మొబైల్స్, ఏసీ రేట్లకు రెక్కలు
ముడి వస్తువుల వ్యయాల పెరుగుదల, రూపాయి విలువ క్షీణిస్తుండటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్లాంటి ప్రతికూల పరిస్థితులతో మొబైల్స్, టీవీల నుంచి ఎయిర్ కండీషనర్ల వరకు అన్నింటి రేట్లకు రెక్కలొస్తున్నాయి. గత నవంబర్–డిసెంబర్ నుంచి స్మార్ట్ఫోన్లు, టీవీల రేట్లు ప్రతి 30–60 రోజులకోసారి పెరుగుతూనే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఉత్పత్తి పరిమాణం పెరిగే కొద్దీ, ముడి వస్తువుల వ్యయాలు తగ్గి కంపెనీలు చౌకగా ఉత్పత్తులను అందించేందుకు ప్రయత్నిస్తాయి.ఒకవేళ కొన్నాళ్లు పరిస్థితి అటూ ఇటూ అయినా అమ్మకాలను పోగొట్టుకోవడానికి ఇష్టపడక, అదనపు భారమేదైనా పడితే తామే భరించి, రేట్లను పెంచకుండా జాగ్రత్త పడుతుంటాయి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో భారాన్ని వినియోగదారులకి బదలాయిస్తున్నాయి. దీనితో ఎంట్రీ లెవెల్ టీవీలు, స్మార్ట్ఫోన్ల ధరలు తిరిగి 6–8 ఏళ్ల క్రితం నాటి స్థాయికి చేరుకుంటున్నాయి.వేసవి వడగాలి..: ఏసీల్లో పెద్ద ఎత్తున అమ్ముడయ్యే కేటగిరీ ఉత్పత్తులు, ఫ్రిజ్లు,, వాషింగ్ మెషిన్ల ధరలు కూడా ఈ నెల నుంచి భారీగా పెరుగుతున్నాయి. తొలిసారిగా కొనుక్కునే వారు ఎక్కువగా మొగ్గు చూపే 3 స్టార్ 1.5 టన్ను ఏసీల రేట్లు గతేడాది వేసవిలో సుమారు రూ. 32,000–34,000గా ఉండగా ఈ ఏప్రిల్లో రూ. 37,000–40,000కు పెరగనున్నాయి. కమోడిటీల ధరలు పెరగడం, కొత్త ప్రమాణాల అమలు కారణంగా ఏసీల రేట్లు 12 శాతం వరకు పెరగనున్నట్లు బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ ఇటీవలే వెల్లడించారు. ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు వివరించారు.మరోవైపు, ఎంట్రీ లెవెల్ 5జీ స్మార్ట్ఫోన్ల రేట్లు దీపావళి సమయంలో రూ. 10,000 లోపు ఉండగా, ప్రస్తుతం 13,000–14,000కి చేరాయి. కొన్ని బ్రాండ్స్ అయితే రాబోయే 2–3 నెలల్లో ఈ ఫోన్ల రేట్లు రూ. 20,000కి కూడా చేరొచ్చని చెబుతున్నాయి. 32 అంగుళాల స్మార్ట్ టీవీ రేటు గతేడాది రూ. 6,500 స్థాయిలో ఉంటే, ఇప్పుడు రూ. 8,500గా ఉందని, మే నాటికి రూ. 10,000కు చేరొచ్చనేది పరిశ్రమ వర్గాలు మాట. వివో, ఒప్పో, శాంసంగ్, షావోమీలాంటి బ్రాండ్లు కొన్ని స్మార్ట్ఫోన్ల రేట్లను 10 శాతం వరకు పెంచనున్నట్లు సంకేతాలిచి్చనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మెమొరీ చిప్ల రేట్లు గత 5–6 నెలలుగా పెరగడం, గల్ఫ్ యుద్ధంతో పాటు రూపాయి బలహీనపడటమనేది కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించాయి. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ వైపు చూపు..సాధారణంగా త్రైమాసికాలవారీగా రేట్లను తగ్గించడం, డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు ప్రకటించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించేందుకు, తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకపోగా రేట్లు మరో పది శాతం వరకు పెరగనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనితో డిమాండ్పైనా ప్రభావం పడుతోంది. కొత్త ఫోన్లకు బదులు సెకండ్ హ్యాండ్, రీఫర్బి‹Ù్డ ఫోన్ల వైపు కొందరు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండగా, మరికొందరు పూర్తిగా కొనుగోలు నిర్ణయాన్నే వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూ. 20,000 వరకు ఖరీదు చేసే ఫోన్లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలంటూ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసేందుకు మొబైల్ రిటైలర్ల సంఘం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది 18 శాతంగా ఉంది. -
భారత్లో ఒరాకిల్ 12,000 మందికి ఉద్వాసన
న్యూఢిల్లీ: యూఎస్ ఐటీ దిగ్గజం ఒరాకిల్ తాజాగా దేశీయంగా విధులు నిర్వహిస్తున్న 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ బాటలో ప్రపంచవ్యాప్తంగా 30,000 ఉద్యోగాలకు కోత పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెలలో మరింత మందిని ఉద్యోగాల నుంచి తప్పించనున్నట్లు సమాచారం. దేశీయంగా కంపెనీలో సుమారు 30,000 మంది పనిచేస్తున్నారు.అయితే ఈ అంశాలపై స్పందించేందుకు ఒరాకిల్ నిరాకరించడం గమనార్హం! సిబ్బందికి ఈమెయిల్ ద్వారా ఉద్యోగ కోత వివరాలను ఒరాకిల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కనీసం ఏడాదిపాటు సేవలందించిన ఉద్యోగులకు 15 రోజుల వేతనంసహా.. లీవ్ ఎన్క్యా‹Ùమెంట్, అర్హతగలవారికి గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు ఆఫర్ చేస్తోంది. -
అమెరికాలో భారతీయులకు అవమానం
-
పాతికేళ్లకే కుంగుబాటు!!
ఆమె శరీరానికి జ్వరం వస్తేనే ఇంట్లో సరిగా పట్టించుకోరు. ఇక మనసుకు జ్వరం వస్తే? మన దేశంలో స్త్రీల మానసిక సమస్యలను గుర్తించడం, వైద్యం చేయించడం చాలా తక్కువ. తల్లి, భార్య, చెల్లెలు, అక్క, కుమార్తె... వీరి మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలుసుకునేలోపు మానసిక సమస్యలు ముదిరిపోయి ఉంటాయి. అనేక వొత్తిళ్లు, పరిమితులు స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వాటి పట్ల అవగాహనే సగం వైద్యం. ఇంటిల్లిపాది తెలుసుకోవాల్సిన వరుస కథనాలు నేటి నుంచి...హాస్పిటల్స్లో సైకియాట్రీ, సైకాలజీ విభాగాల్లోని వెయిటింగ్ రూమ్స్లోకి చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ మానసిక సమస్యలతో కనిపిస్తున్నవారు 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. 84 దేశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ రిపోర్ట్ చేసిన మైండ్ హెల్త్ కోషెంట్ స్కోర్లో భారతీయ యువత 60వ స్థానంలో ఉండి, తక్కువ పనితీరును కనబరిచినట్టు వెల్లడైంది. ఈ విషయంలో ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. అంటే, మన దేశ యువత మానసిక ఆరోగ్య సమస్యల ముఖచిత్రం ఇప్పుడు చిన్నవయసుకే చేరిపోయిందన్నమాట.వరల్డ్ మెంటల్ హెల్త్ పరిశోధనలో భారతదేశంలోని యువత ఎం.హెచ్.క్యూ స్కోరు సుమారు 33గా ఉంది. ఇది ‘బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న’ వర్గం కిందకు వస్తుంది. దీని వల్ల 18–34 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో దాదాపు 64 శాతం మంది ఇంకా కుటుంబాలపై ఆధారపడుతున్నట్టుగానే తెలిసింది. సాధారణంగానే ఇటీవలి కాలంలో పదమూడు, పద్నాలుగేళ్ల లోపు వయసు నుంచే మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. ఇక 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ సమస్యలు 62 శాతానికి పెరుగుతున్నాయి. వీరిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మత్తు పదార్థాలపై ఆధారపడటం.. వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని త్వరగా గుర్తించకపోతే తాత్కాలిక సమస్యలుగా ఉండాల్సినవి, జీవితాంతం వెంటాడే పెను భారంగా మారిపోతాయి.మానసిక ఒత్తిడిఈ రోజుల్లో యువత డబ్బును సంపాదించడంలోనూ, విచ్చలవిడిగా ఖర్చు చేయడంలోనూ ఇండిపెండెంట్గా ఉంటున్నారని అనుకుంటారు. కానీ, మానసికంగా, భావోద్వేగ పరంగా ఇతరులపై ఆధారపడుతున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ ప్రపంచం, గ్లోబల్ పోటీ వల్ల విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కానీ అదే సమయంలో అవన్నీ మనసుపై ఒత్తిడిని కూడా పెంచుతున్నాయి. దీని వల్ల 20–25 ఏళ్ల వయస్సులోనే బర్నౌట్, క్లినికల్ డిప్రెషన్ కేసులు కనిపిస్తున్నాయి అంటున్నారు సైకియాట్రిస్టులు.సామాజిక ఒత్తిడిఈ రోజులు ఎలా ఉంటున్నాయంటే చిన్న వయస్సులోనే ‘పనితీరును అద్భుతంగా ప్రదర్శించాలి’ అనే ఒత్తిడి మొదలవుతోంది. పిల్లల్లో వారి మైండ్ పూర్తిగా ఎదగకముందే ‘కంపారిజన్’ అనే భారం పడుతోంది. ఒక దశలో చదువుల ఒత్తిడి, మరొక దశలో ఉద్యోగ అనిశ్చితి, వివిధ రకాల ప్రతిభ, డిజిటల్ స్మార్ట్.. రోజువారీ స్ట్రెస్గా మారిపోయాయి. అన్నీ సాధించేయాలనే తపన కూడా మైండ్ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు. డిజిటల్ అడిక్షన్ – కంపారిజన్ ట్రాప్సోషల్ మీడియాలో అందరి జీవితాలు ‘పర్ఫెక్ట్’గా కనిపిస్తాయి. అవి నిజం కాకపోయినా మనలో మనకే తక్కువవాళ్లమనే భావనను పెంచుతాయి. తెలిసినవారి, పరిచయస్తుల సోషల్మీడియా పర్ఫెక్ట్ ఫొటోలు చూసి పోల్చుకోవడం పెరిగింది. ‘నేను అంతగా బాగోలేను, నేనేమీ చేయలేను’ అనే భావనలో సెల్ఫ్–ఎస్టీమ్, సోషల్ ఐసోలేషన్... వంటివి పెరుగుతున్నాయి.ఒంటరితనం సృష్టించిన వలయంఇప్పటి జనరేషన్ సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంది. కానీ, గాఢమైన, వాస్తవ సంబంధాలు మాత్రం తగ్గిపోయాయి. అదే ఒంటరితనానికి, డిప్రెషన్ కు ప్రధాన కారణంగా మారుతోంది. యువత ఈ విధంగా ఉండటం వల్ల దేశ భవిష్యత్తు ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. యువత ఆరోగ్యంగా, ఉత్పాదకంగా ఉంటేనే దేశం సర్వ సంపన్నంగా ఎదుగుతుంది. కానీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో 70–80 శాతం మందికి సరైన సమయంలో చికిత్స అందడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఒక తరం యువత తమ సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.నియంత్రణ తప్పనిసరి→ చాలా మానసిక సమస్యలు ముందే గుర్తించి, నిపుణులను సంప్రదించి, తగిన సూచనలు పాటిస్తే నియంత్రణలో ఉంటాయి.→ ఆలస్యమైతే సులభంగా నయం అయ్యే సమస్య జీవితాంతం ఉండే డిసేబిలిటీగా మారిపోతుంది.→ స్కూళ్లు, కాలేజీల్లో మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ తప్పనిసరి ఏర్పాటు చేయాలి. → నేటి తరాన్ని మన ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందుతాం.చర్చించే స్వేచ్ఛ ఉండాలిమానసిక కుంగుబాటు, సమస్యలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మన దేశంలో ఇప్పటికీ కొన్నిచోట్ల మానసిక సమస్య అంటే ‘సంకోచం’తో ఆగిపోతారు. ఇతరులతో పోటీ, పోలిక అనేవి ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే బాగా పెరిగాయి. అలా కాకుండా స్వీయ సమర్థతను వెలికి తీయగలగాలి. ఏ పని ఎంతవరకో హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. సమయ పాలన, పోషకాహారం, ఉత్సాహభరితమైన జీవనశైలి.. మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఎలాంటి సంకోచం లేకుండా మానసిక సమస్యలపై కుటుంబంలోనూ, సమాజంలోనూ చర్చించే స్వేచ్ఛ ఉండాలి. మానసిక ఆరోగ్యానికి సంబంధించి యువతకు అనుకూలమైన హెల్త్కేర్ సిస్టమ్ అవసరం.– డాక్టర్ మంజులారావు, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
భారత్కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
న్యూఢిల్లీ: ఇరాన్ అనుమతితో హార్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’, ‘బీడబ్ల్యూ టీవైఆర్’వేగంగా భారత్ దిశగా కదులుతున్నాయి. భారతీయ జెండాతో వస్తున్న ఈ నౌకలు శనివారం హార్మూజ్ను దాటేసి ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’దిశగా ముందుకెళ్తున్నాయని నౌకల ట్రాకింగ్ సంస్థ శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే. ‘బీడబ్ల్యూ టీవైఆర్’నౌక మార్చి 31వ తేదీకల్లా ముంబైకి చేరుకునే అవకాశముంది. ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’నౌక ఏప్రిల్ ఒకటో తేదీన న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకునే ఆస్కారముందని భారత ప్రభుత్వ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.ఈ రెండు నౌకలు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నాయి. ఈ నిల్వలు దేశ ఒక రోజు ఎల్పీజీ అవసరాలను తీరుస్తాయి. ఇప్పటికే నాలుగు భారత ఎల్పీజీ నౌకలు హార్మూజ్ను దాటి సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాయి. మార్చి 16–17 తేదీల మధ్య ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు ఉమ్మడిగా 92,712 టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చాయి. మార్చి 26–28 తేదీల మధ్య పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు 92,612 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చాయి.భారత 60 శాతం వంటగ్యాస్ అవసరాలను గల్ఫ్ దేశాలు తీరుస్తున్నాయి. గత ఏడాది భారత్లో 3.315 కోట్ల టన్నుల ఎల్పీజీని ప్రజలు వినియోగించారు. హార్మూజ్ గుండా ఇప్పుడు సరకు రవాణా నౌకల రాకపోకలు దాదాపు తగ్గిపోవడంతో భారత అవసరాలను కొంతమేరకు అమెరికా, అర్జెంటీనాలు తీరుస్తున్నాయి. 485 మంది నావికులతో భారతీయ జెండాతో 18 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నాయని భారత అధికారులు వెల్లడించారు. -
భారత్ నుంచి భారీగా ఇంధనం వచ్చింది: శ్రీలంక అధ్యక్షుడు
న్యూఢిల్లీ: ‘పశ్చిమాసియా’ సంక్షోభం వేళ భారత్ నుంచి 38,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని అందుకుంది శ్రీలంక. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు కలిగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ తన ‘పొరుగు దేశాల పాలసీ’లో భాగంగా శ్రీలంకకు ఇంధనాన్ని పంపింది. దీంతో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే ఆదివారం (మార్చి 29) భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.“పశ్చిమాసియా ఘర్షణ కారణంగా ఇంధన సరఫరాల విషయంలో శ్రీలంక ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కొన్ని రోజుల క్రితం మాట్లాడాను. భారత్ త్వరితగతిన సాయం చేసింది.. కృతజ్ఞతలు. నిన్న 38,000 ఎంటీ ఇంధనం కొలంబోకు చేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కోఆర్డినేషన్కు కూడా ధన్యవాదాలు” అని దిస్సానాయకే ఎక్స్లో పేర్కొన్నారు.ఈ వారం ప్రారంభంలో, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంపై దిస్సానాయకేతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. “భారత్-శ్రీలంక ఇంధన సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతను పెంచే కీలక కార్యక్రమాల పురోగతిని సమీక్షించాం. సన్నిహిత, విశ్వసనీయ భాగస్వాములుగా ఇరుదేశాలు సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయాలన్న స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని నిర్ణయించాం” అని మోదీ ఎక్స్లో తెలిపారు. కాగా, ఈ 38,000 మెట్రిక్ టన్నుల్లో 20,000 ఎంటీ డీజిల్.. 18,000 ఎంటీ పెట్రోల్ ఉన్నాయి.మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లో పాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రుల భేటీ అయ్యారు. ఇరాన్ యుద్ధంపై వారు చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్యవర్తులుగా ఈ నాలుగు దేశాలు ఉన్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఆపడం ప్రధాన లక్ష్యం. Spoke with PM @narendramodi a few days ago about the fuel supply disruptions Sri Lanka is facing due to the Middle East conflict. Grateful for India’s swift support. 38,000 MT of fuel arrived in Colombo yesterday. My thanks also to EAM @DrSJaishankar for his close coordination.— Anura Kumara Dissanayake (@anuradisanayake) March 29, 2026 -
ఎగుమతులు షురూ.. 75 దేశాలకు సెమాగ్లూటైడ్!
మధుమేహం, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ జనరిక్ వెర్షన్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హెటిరో వెల్లడించింది. ట్రూగ్లిక్స్, రోల్మోడల్, మోటో జీ బ్రాండ్ల పేరుతో వీటిని విక్రయించనున్నట్లు వివరించింది. ఇవి డిస్పోజబుల్ పెన్ డివైజ్ల రూపంలో 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు వివిధ డోసేజీల్లో లభిస్తాయి.75 పైగా దేశాలకు దశలవారీగా వీటిని ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ముందుగా ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. నియంత్రణ సంస్థ సీడీఎస్సీవో అనుమతులు వచ్చాక దేశీయంగా కూడా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో అందుబాటు ధరలో నాణ్యమైన జనరిక్ సెమాగ్లూటైడ్ని అందించాలనేది తమ లక్ష్యమని హెటిరో ఎండీ వంశీకృష్ణ బండి తెలిపారు. -
బిగ్ షాక్.. భారత్లో ఆ బ్యాంక్ పూర్తిగా క్లోజ్!
భారతదేశంలో పదేళ్లకు పైగా తన కార్యకలాపాలను సాగించిన దోహా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. కటార్లోని దోహా బ్యాంక్ తన భారత్లోని రెండు శాఖలను మూసివేయాలని నిర్ణయించింది. కాగా ఇకపై కేవలం ఒక ప్రతినిధి కార్యాలయాన్ని మాత్రమే కొనసాగించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.దోహా బ్యాంక్ భారతదేశంలో తన కార్యకలాపాలను జూన్ 2014 లో ప్రారంభించింది. మొదటి శాఖ ముంబైలో, తరువాత కొచ్చిలో రెండవ శాఖ ప్రారంభించింది. ఆ తరువాత 2016లో ఈ బ్యాంక్ భారతీయ మార్కెట్లో వృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితులను ఉపయోగించుకుని, గల్ఫ్ దేశం, భారతదేశం మధ్య రిమిటెన్స్ (ప్యారమిటెన్స్) అవకాశాలను లబ్ధిపరచడానికి ఇండియాలో సబ్సిడియరీ స్థాపించేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తుందని వార్తలు వచ్చాయి.ఇప్పుడు దోహా బ్యాంక్ వ్యూహం మార్పుతో.. భారతదేశంలో ప్రత్యక్ష కార్యకలాపాలను తగ్గిస్తూ, ప్రతినిధి కార్యాలయం ద్వారా మాత్రమే తన ఉనికిని కొనసాగించనున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బులు జమ చేసుకోవడం విత్డ్రా చేయడం వంటివి ఇకపై ఉండదు. అయితే ఇది ఖతార్లోని ప్రధాన బ్యాంకుకు, భారతీయ కస్టమర్లకు మధ్య ఒక వారధిలా మాత్రమే పనిచేస్తుంది. అంటే వ్యాపార అవకాశాలను వెతకడం, దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం వంటి పనులకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు' -
సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..
-
భారత ఆర్మీ చేతికి ప్రహార్
గ్వాలియర్: రక్షణరంగ ప్రైవేట్ సంస్థ ‘అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్’తయారుచేసిన తేలికపాటి మెషీన్ గన్(ఎల్ఎంజీ) ‘ప్రహార్’తొలిసారిగా భారత సైన్యం చేతికొచ్చింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయంగా ఈ గన్లను తయారుచేశారు. గ్వాలియర్లోని ఆయుధ కర్మాగారంలో తొలి దఫాలో తయారుచేసిన 2,000 మెషీన్ గన్లను ఆర్మీకి అందజేశారు. శనివారం గ్వాలియర్లో జరిగిన ఈ ఆయుధాల బదిలీ కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖలో ఆయుధాల సమీకరణ విభాగ డైరెక్టర్ జనరల్ ఏ అన్బరసు, అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్వంశీ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.7.62 ఎంఎం కాలిబర్(బుల్లెట్) సామర్థ్యంతో ఈ తేలికపాటి మెషీన్గన్లను తయారుచేశారు. దీని బ్యారెల్ పొడవు 508 మిల్లీమీటర్లు. బరువు 8 కేజీలు. గన్ మొత్తం పొడవు 1.1 మీటర్. ‘‘గరిష్టంగా ఒక కిలోమీటర్ దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో గురిపెట్టి కాల్చవచ్చు. ఈ గన్ల తయారీకి బిడ్డింగ్, అమనుతులు, ఫ్యాక్టరీ నిర్మాణం ఇలా మొత్తంగా ఆరేళ్ల ప్రయాణం పూర్తయింది. గడువు కన్నా 11 నెలల ముందుగానే తొలి బ్యాచ్ గన్లను తయారుచేసి ఇస్తున్నాం. మొత్తంగా 40,000 గన్లను షెడ్యూల్లోపు ఇచ్చేస్తాం’’అని అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్వంశీ చెప్పారు. -
బయోఎకానమీ బూమ్...!
న్యూఢిల్లీ: భారతీయ బయోఎకానమీ విలువ గణనీయంగా పెరుగుతోంది. బయోటెక్నాలజీ ఆధారిత రంగాల్లో వేగవంతమైన అభివృద్ధితో దేశీయ ‘బయోఎకానమీ విలువ 2025లో 195 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది (2024) విలువ 166 బిలియన్ డాలర్లతో పోలిస్తే 18 శాతం వృద్ధి చెందింది. బయోటెక్ రంగాన్ని బలోపేతం చేయడానికి పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ‘బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్’ (బీఐఆర్ఏసీ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విస్తరిస్తున్న బయోఎకానమీ పరిధి: ఒకప్పుడు ‘బయోఎకానమీ’ అనేది బయోఫార్మా, బయోఇండ్రస్టియల్ వంటి రంగాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. ప్రస్తుతం దీని పరిధి పెరిగింది. బయోఫ్యూయల్స్, ఎంజైమ్ సొల్యూషన్స్, డిజిటల్ బయాలజీ ప్లాట్ఫారŠమ్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్, బయోలాజిక్స్ తయారీ, వ్యవసాయ బయో ఇన్పుట్స్ వంటి విభాగాలకు విస్తరించింది. దీంతో బయోఎకానమీ విస్తృత పారిశ్రామిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తోంది. వృద్ధికి ప్రధాన కారణాలు: బయోఎకానమీ వృద్ధికి నాలుగు ప్రధాన కారణాలున్నాయి. ⇒ పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం అమలు వల్ల ఇంధన దిగుమతులు తగ్గడం ⇒ జీఎల్పీ–1 ఔషధాల వినియోగం పెరగడం ⇒ పరిశ్రమల్లో ఎంజైమ్స్, సూక్ష్మజీవాల ఆధారిత బయోసొల్యూషన్స్ వినియోగం పెరగడం... ⇒ మూడు లక్షలకు పైగా భారతీయ నిపుణులకు ఉపాధి కల్పిస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణ ఈ అంశాలన్నీ బయోఎకానమీ విస్తరించేందుకు ప్రధాన కారకాలుగా నిలిచాయి. ఈ పరిణామాల వల్ల 2025లో బయోఎకానమీకి అదనంగా 29.6 బిలియన్ డాలర్ల విలువ చేకూరింది. గడిచిన కొన్నేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా నిలిచింది. కీలకంగా బీఐఆర్ఏసీ పాత్ర బీఐఆర్ఏసీ గ్రాంట్ ఫండింగ్, ఈక్విటీ సపోర్ట్, మెంటరింగ్, భాగస్వామ్యాల ద్వారా బయోఫార్మా, మెడ్టెక్, అగ్రి బయోటెక్, హెల్త్టెక్, ఇండ్రస్టియల్ బయోటెక్, క్లీన్టెక్ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.7,000 కోట్ల పెట్టుబడులను ప్రోత్సహించింది. 900కిపైగా ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడింది. దాదాపు 35,000కు పైగా నైపుణ్య ఉద్యోగాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది.2030 నాటికి బయోఎకానమీని 300 బిలియన్ డాలర్లకు, 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ‘‘గత 14 ఏళ్లలో బీఐఆర్ఏసీ భారత బయోటెక్నాలజీ రంగాన్ని ఆవిష్కరణల ఆధారిత శక్తివంతమైన వ్యవస్థగా మార్చింది. స్టార్టప్స్, సంస్థలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వందలాది ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడింది,’’ అని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రాజేష్ ఎస్ గోఖలే తెలిపారు. -
సవాల్కు ప్రజ్ఞానంద సిద్ధం
పఫోస్ (సైప్రస్): ప్రపంచ చాంపియన్ను ఢీకొట్టే అర్హత కోసం భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ‘ఫిడే’ క్యాండిడేట్స్ టోర్నమెంట్లో బరిలోకి దిగుతున్నాడు. ఎనిమిది మంది ఎలైట్ గ్రాండ్మాస్టర్లు తలపడే ఓపెన్ కేటగిరీలో అతను సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. భారత్ తరఫున తమిళనాడు గ్రాండ్మాస్టర్ మాత్రమే బరిలో ఉండగా... 8 మంది డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు సై అంటున్నారు. ప్రతి ఆటగాడు మిగతా ఏడు మంది ప్రత్యర్థులను రెండేసి సార్లు ఢీకొంటాడు. ఇందులో అగ్ర స్థానంలో నిలిచిన ఆటగాడే చివరకు ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్తో టైటిల్ కోసం పోటీపడతాడు. ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్షిప్ సమరం జరుగుతుంది. ప్రస్తుత క్యాండిడేట్స్ టోర్నమెంట్లో అమెరికన్ స్టార్లు ఫేబియానో కరువాన, హికరు నకముర, డచ్ గ్రాండ్మాస్టర్ అనిశ్ గిరి, వే యి (చైనా), జావొఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), అండ్రీ ఎసిపెంకో (రష్యా), మథియస్ బ్లూబామ్ (జర్మనీ)లు చాంపియన్ గుకేశ్ను ఢీకొట్టే వేటలో ఉన్నారు. ఇటీవలి టోర్నీల ఫలితాలు, ఫామ్ దృష్ట్యా అమెరికన్ గ్రాండ్మాస్టర్ ఫేబియానో కరువాన క్యాండిడేట్స్లో ఫేవరెట్గా కనిపిస్తున్నాడు. దీంతో భారత ఆటగాడు ప్రజ్ఞానందకు కఠిన సవాళ్లు తప్పవు. బరిలోకి ప్రపంచ శ్రేణి గ్రాండ్మాస్టర్లు ఉండటంతో దీనికి తగినట్లుగానే తమిళ గ్రాండ్మాస్టర్ సన్నద్ధమయ్యాడు. ప్రత్యేకించి క్యాండిడేట్స్ ఈవెంట్ కోసం మరే ఇతర టోర్నీలవైపు కన్నెత్తి చూడలేదు. తన కోచింగ్ బృందం, సాంకేతిక నిపుణులతో కలిసి క్యాండిడేట్స్లో ఎదురయ్యే ప్రత్యర్థుల ఎత్తుగడ్డలపైనే దృష్టిసారించాడు. కరువాన ఫేవరెట్ అయితే ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ సిందరోవ్ డార్క్హార్స్గా బరిలోకి దిగుతున్నాడు. గతేడాది గోవాలో జరిగే చెస్ వరల్డ్ కప్లో విజేతగా నిలిచి అందరి కంటా పడిన ఈ యువ సంచలనం ఇదే జోరును ఇక్కడా కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాడు. మహిళల విభాగంలో రెండు సార్లు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ అయిన తెలుగుతేజం, వెటరన్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ఫేవరెట్గా దిగాల్సివున్నా... చివరి నిమిషంలో ఆమె టోర్నీ నుంచి తప్పుకుంది. పశ్చిమాసియా పరిస్థితులే తను వైదొలగడానికి కారణమని, భయంతో ఆడలేనని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆమె స్థానాన్ని నార్వే చెస్ టోర్నీ విజేత అన్న ముజిచుక్ (ఉక్రెయిన్)కు కేటాయించారు. హంపి లేకపోయినా భారత ఆశల పల్లకిని మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్ముఖ్, ఆర్. వైశాలి మోస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి టోర్నీ ఆరం¿ోత్సవ వేడుక జరిగింది. ఇందులో ప్లేయర్ల పరిచయ కార్యక్రమం, ర్యాంకింగ్ (ఎలో రేటింగ్), క్యాండిడేట్స్కు అర్హత సాధించిన వైనం వివరించారు. ఆదివారం నుంచి తొలిరౌండ్ పోటీలు జరుగుతాయి.‘క్యాండిడేట్స్’ కహానీ... టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 1 మిలియన్ డాలర్లు (రూ. 9.49 కోట్లు) ఓపెన్ కేటగిరీ: 7,00,000 డాలర్లు (రూ. 6.65 కోట్లు) మహిళల విభాగం: 3,00,000 డాలర్లు (రూ. 2.85 కోట్లు) -
సూపర్ ‘పవర్గేమ్’లో భారత్ డైలమా!
డామిట్, కథ అడ్డం తిరిగింది. ట్రంపూ, నెతన్యాహూ కలిసి రాసుకున్న స్క్రిప్టులో లేని సన్నివేశం ఎదురైంది. ఈ యాంటీ క్లైమాక్స్ వాళ్లు ఊహించింది కాకపోవచ్చు. వ్యూహం ప్రకారమే దాడులు జరిగిన తొలిరోజున ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అలీ ఖమేనీని హతం చేశారు. ఈ దెబ్బకు ఇరాన్ జావకారిపోయి ఉండాలి. మత పాలనను వ్యతిరేకించే ఇరాన్ ప్రజలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ట్రంపు మహాశయునికి జైకొట్టి ఉండాలి. మహా అయితే నాలుగు రోజుల్లో ఇరాన్ సర్కార్ను పీక పట్టుకొని మోకాళ్ల మీద కూర్చోబెట్టి అవమానకరమైన షరతుల మీద సంతకం పెట్టించి ఉండాలి. ఇదీ వ్యూహం. నాలుగు రోజులు కాదు. నాలుగు వారాలు గడిచిపోయాయి. ఏమైంది?హార్మూజ్ అనే ఒక సముద్రపు ఇరుకు సందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పీకను దొరకబుచ్చుకొని దాని కణత మీద తుపాకీ గురిపెట్టి కూర్చున్న ఇరాన్ దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపి స్తున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆర్థిక ఆంక్ష లను అమెరికా అమలు చేస్తున్నది. దాని చమురు అమ్మకాలను నిషేధించింది. తాజా పరిణామాలతో, చమురు నౌకల రవా ణాకు ఆటంకాలను తొలగించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ఇరాన్ కూడా అమ్ముకోవచ్చంటూ తాత్కాలిక ‘అనుమతి’ని ప్రసాదించింది. ఇదేమీ ట్రంప్ ‘కరుణ’ కాదు, కాళ్ల బేరమని అర్థమవుతూనే ఉన్నది. ఇరాన్పై యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై ప్రపంచ దేశాలు తనను వేలెత్తి చూపకుండా ఓ నెలరోజుల సడలింపును ఆయన ప్రకటించారు. గతంలో చాటుమాటుగా చైనాకు చమురు సరఫరా చేసి, దాన్నుంచి వస్తు–సేవలను పొందుతున్న ఇరాన్ ఇప్పుడు రైట్ రాయల్గా రోజుకు 140 మిలియన్ డాలర్ల విలువైన చమురు అమ్మకాలను ప్రారంభించింది. దాడుల్లో ఇరాన్కు జరిగిన ఆస్తి నష్టంపై స్పష్టమైన అంచనాలు ఇంకా రాలేదు గానీ, చమురు విక్రయం ద్వారా బహిరంగంగా రోజుకు సుమారు 1400 కోట్ల రూపాయలను (ఇండియన్ కరెన్సీలో) ఇరాన్ ఆర్జిస్తున్నది. అమె రికా మాత్రం చేతి చమురును బాగానే వదిలించుకుంటున్నదని ఆ దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు సగటున ఒకటిన్నర బిలియన్ డాలర్ల చొప్పున యుద్ధ జ్వాలలకు అమెరికా ఆహుతిస్తున్నదని లెక్కలు తేలుతున్నాయి. మొదటి మూడు వారాల్లో 30 బిలియన్ డాలర్లను అర్పించు కోవలసి వచ్చింది. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమె రికా సైనిక స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటి పున రుద్ధరణ పేరుతో ఇంకో 200 బిలియన్ డాలర్లను కేటాయించాలని అమెరికా కాంగ్రెస్ను పెంటగన్ (రక్షణ శాఖ కేంద్రం) కోరుతున్నది.పెంటగన్ అభ్యర్థనపై ప్రతిపక్ష డెమోక్రాట్లే కాదు, కొందరు పాలక రిపబ్లికన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా ప్రజల జీవన ప్రమాణాలను ఫణంగా పెట్టి ఏం సాధించాలని ఇరాన్ యుద్ధంలో ఇంత పెద్దమొత్తంలో తగలేస్తున్నారని వారు ట్రంప్ సర్కార్ను నిగ్గదీస్తున్నారు. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల అప్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ నిరర్థక యుద్ధ ఖర్చు మోయలేని భారాన్ని మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై హఠాత్తుగా ఇజ్రాయె ల్తో కలిసి దాడులకు తెగబడటానికి స్పష్టమైన కారణాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అణ్వస్త్ర బూచీ అనే అరిగిపోయిన రికార్డునే అది ఇప్పటికీ ప్లే చేస్తున్నది.ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం ఆరోపణలపై ఇప్పటికే అంత ర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఏఐఈఏ) అక్కడ తనిఖీలు చేసింది. అణ్వాయుధాలను తయారుచేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్న దనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసీ స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ అమెరికాకు, ఇజ్రాయెల్కు మాత్రం ఇరాన్ అణుబూచీ కనిపి స్తూనే ఉన్నది. ఇరాన్ను నిర్వీర్యం చేస్తే పశ్చిమాసియాలో పెత్తనం చేసే అవకాశం ఇజ్రాయెల్కు లభిస్తుంది. ఇరాన్ దన్నుతో ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా తయారైన టెర్రరిస్టు గ్రూపులు హెజ్బుల్లా (లెబనాన్), హూతీ (యెమెన్), హమాస్ (పాలస్తీనా)లు కూడా తోక ముడుస్తాయి. ఇదీ ఇజ్రాయెల్ ఆలోచన. మరి అమెరికాకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?1979లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్లో పదవీ చ్యుతుడైన రాజు రెజా పహ్లవీ. ఆయన అమెరికా కీలుబొమ్మ. ఆ కాలంలో ఇరాన్ నుంచి కారుచౌకగా అమెరికా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడింకో కీలుబొమ్మను కూర్చోబెడితే మళ్లీ ఆ అవకాశం ఉండొచ్చు. కానీ, యుద్ధానికి అదేమంత పెద్ద కారణం కాదు. అమెరికా ఇంధన భద్రతకు అంత ప్రమాదమేమీ లేదు. పైగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెను జువేలా దేశం అమెరికాకు కూతవేటు దూరంలోనే ఉన్నది. దాని అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని అమెరికా తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నది. వెనుజువేలా కూడా ఇరాన్లాగే చైనాకు మిత్రదేశం కావడం ఇక్కడ గమనార్హం.భారత్ లాగే చైనా కూడా ఇంధన భద్రత గల దేశం కాదు. పైగా దాని ఇంధనావసరాలు చాలా ఎక్కువ. వెనుజువేలా, ఇరాన్ దేశాలు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మలేసియా, రష్యా వంటి దేశాల ద్వారా క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేసి చైనాకు పంపి స్తాయి. చైనాకు ప్రధాన చమురు సరఫరాదారైన రష్యా కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నదే కావడం విశేషం. ప్రపంచ చమురు రవాణాలో ఇరవై శాతానికి పైగా సాగే హార్మూజ్ జలసంధిని యుద్ధ నేపథ్యంలో ఇరాన్ తన పూర్తి నియంత్రణలోకి తీసుకున్నది. అక్కడి నుంచి చమురు రవాణా చేసే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఒక లీక్ను ఇరాన్ వదిలింది. అంతేకాదు, ఆ ఫీజు అమెరికా డాలర్లలో కాకుండా చైనా యువాన్లలో వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రంప్ ఐదు రోజుల దాడుల విరామాన్ని ప్రకటించాడు. దాన్ని తర్వాత ఏప్రిల్ 6 దాకా పొడిగించాడు. ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగలేదు.డాలర్కు సవాల్ ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. అందు లోనూ డాలర్ ఆధిపత్యానికి ఊపిరిపోసిన చమురు రంగంలో పోటీ ఎదురైతే చేటుకాలం దాపురించినట్టే. యాభయ్యేళ్ల కింద చమురు ఎగుమతి చేసే గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యతను అమెరికా తీసుకున్నది. ప్రతిగా చమురు కొనుగోలు చేసే దేశాలు అందుకు చెల్లించాల్సిన సొమ్మును అమెరికా డాలర్లలో చెల్లించాలి. ఇంధన అవసరాలు అన్ని దేశాలకూ ఉంటాయి కనుక డాలర్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గి అమె రికా తోక ముడిస్తే, ఇరాన్ దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న అరబ్ దేశాల రక్షణ బాధ్యత నుంచి అమెరికా వైదొలగి నట్టవుతుంది. అప్పుడు చమురు అమ్మకాన్ని డాలర్లలోనే కొనసాగించవలసిన అవసరం ఈ దేశాలకు ఉండదు. యువాన్, రూబుల్, యెన్ దేన్నయినా వాళ్లు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామం సంభవిస్తే అమెరికా శిరస్సు మీద నుంచి అగ్రరాజ్యం అనే కిరీటం ఊడి కిందపడ్డట్టే!విరామం తాత్కాలికమే. ఇరాన్ పూర్తిగా లొంగిపోయి, తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించే దాకా దాడులు చేయాలని అమెరికా తొలుత భావించింది. అలా జరగాలంటే ఇరాన్ గడ్డమీద తన సేనలను దించాల్సి ఉంటుంది. ఇరాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా దాంతో భూతల యుద్ధం సాధ్యం కాదని రక్షణ నిపుణులు చెబుతారు. ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో సహజమైన కోట గోడగా ఉన్న పర్వత శ్రేణులే ఇందుకు కారణం. మధ్యేమార్గంగా ఇరాన్ చమురు నిల్వచేసే ఖార్గ్ దీవినో, పర్షియన్ గల్ఫ్లో ఉన్న దీవుల్లో మరోదాన్నో ఆక్రమించాలని అమెరికా భావిస్తున్నది. ఆ దీవి ద్వారా హార్మూజ్ నుంచి చమురు కంటెయినర్లు సజావుగా వెళ్లేలా పర్యవేక్షించి యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించుకోవాలని భావిస్తున్నది.పర్షియన్ గల్ఫ్ దీవుల ఆక్రమణ కూడా అమెరికా – ఇజ్రాయెల్ ఊహిస్తున్నంత సులభం కాదు. ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటననే ఎదుర్కోవలసి ఉంటుంది. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా దీవులపైకే క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని దీవుల్లో అమెరికా సైన్యం దిగితే మిన్నకుంటుందా? పర్షియల్ గల్ఫ్లో పెనుమంటలు చెలరేగవచ్చు. దుబాయ్, అబుధాబీ, దోహా, రియాద్ నగరాల వైభవోజ్వల కాంతులు మసక బారవచ్చు. అన్నిటినీ మించి ప్రపంచ ఆర్థిక గమనం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనుకావచ్చు. మన దేశం సంగతి సరేసరి. ఇరాన్ మన దేశం పట్ల కొంత ఉదారంగా ఉన్నప్పటికీ నాలుగు వారాల ఘర్షణే దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతున్నది. ఈ ఘర్షణ వారాల్లోంచి నెలల్లోకి మారితే తీవ్ర సంక్షో భాన్ని చవిచూడవలసి రావచ్చు. మన రాజకీయ నాయకత్వ దీక్షా దక్షతలకు, ప్రజా సమూహాల సమైక్యతకు ఇది పరీక్షా కాలం.ప్రపంచాన్ని ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఈ అంతర్జాతీయ పరిణామాల్లో ఒక ప్రముఖ దేశంగా, అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న భారత్ పోషించవలసిన పాత్ర ఏమిటన్నది కూడా చర్చించుకోవలసిన సందర్భం. తన సూపర్ పవర్ హోదాను, తన ఆధిపత్యంలోని ఏకధ్రువ ప్రపంచ గమనాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా – సాంకేతిక పరంగా అనూహ్యమైన ప్రగతిని సాధించిన చైనా ఈ తరహా ప్రపంచ గమనపు దిశను మార్చాలని సహజంగానే భావిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తొలిరోజు నుంచీ నేటి దాకా దాదాపు ఎనభయ్యేళ్ల శత్రుత్వం అమెరికా – రష్యాలది. నలభయ్యేళ్లుగా ఇరాన్ పట్ల అమెరికా అసహనంగా ఉన్నది. ఇజ్రాయెల్ అమెరికాకు అనుబంధ సంస్థ. పశ్చిమాసియాలో దాని బ్రాంచి ఆఫీసు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ తదితర చమురు ఎగుమతి దేశాలన్నీ అమెరికాకు మిత్రులుగానే మనుగడ సాగిస్తున్నాయి.ప్రస్తుత సంక్షోభంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ దేశాలన్నీ పాత్రధారులు. ఇరాన్తో సరిహద్దును పంచుకునే మరో ఇస్లామిక్ దేశం పాకిస్తాన్. అమెరికా తరఫున బ్రోకరేజి చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశానికి సౌదీ అరేబియాతో ఈమధ్యనే ఒక రక్షణ ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా తన మీద దాడి జరిగినట్టే రెండో దేశం భావించి స్పందించాలి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఎక్కుపెట్టిన దాడులు సౌదీ అరేబియాను కూడా వదల్లేదు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రాన్ని టార్గెట్ చేసి డ్రోన్ దాడులు చేసింది. అయినా పాకిస్తాన్ కిమ్మనలేదు. దీంతో పాక్ ప్రతాపమేమిటో తేలి పోయింది.రెండు శిబిరాలుగానో, మూడు శిబిరాలుగానో ప్రపంచ దేశాలు చీలిపోయి ఆ శిబిరాల తరఫున వకాల్తా పుచ్చుకునే రోజులు ఎప్పుడో గతించాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో జాతీయ ప్రయోజనాలే గీటురాయి. మన ప్రయో జనాలను కాపాడుకోవడానికి ఏకకాలంలో రెండు శత్రు దేశా లతో రెండు రకాల ఒడంబడికల్లో భాగస్వామిగా ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. గల్ఫ్ సంక్షోభంలో భాగస్తులుగా ఉన్న అమెరికా, ఇజ్రా యెల్, యూఏఈ దేశాలతోపాటు ఇండియా కూడా ఐ2యూ2 ఒప్పందంలో భాగస్వామి. ఇండియా మినహా మిగిలిన మూడు దేశాల మీద దాడులు చేస్తున్న ఇరాన్తో మనకు వేల సంవ త్సరాల సాంస్కృతిక బంధం ఉన్నది. భారత ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా, భారత సంస్కృతిపై అభిమానపూర్వకంగా పర్షియన్లు ఉంటారనేది కూడా వాస్తవమే. ఇరాన్కు మిత్ర దేశంగా ఉండే రష్యాతో మనది కాలపరీక్షలో నిలబడి నిగ్గుదేలిన స్నేహం.ఈ పరిస్థితిలో మనం ఎవరి పక్షం వహించాలి? అమెరికా, గల్ఫ్ దేశాలు భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. కోటిమంది భారతీయులు గల్ఫ్లో, 50 లక్షలమంది అమెరికాలో జీవిస్తున్నారు. ఎన్నారైలు సాలీనా మాతృభూమికి పంపిస్తున్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో గల్ఫ్, అమెరికాలదే సింహ భాగం. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్కు ఈ విషయంలో నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. రక్షణ, సాంకే తిక, వ్యవసాయ రంగాల్లో మనకు సహకరిస్తున్నది. కనుక భారత్ ఎవర్నీ దూరం చేసుకోలేదు. ఆచితూచి వ్యవహరించడంతోపాటు ఉద్రిక్తతల ఉపశమనానికి శక్తి మేరకు ప్రయత్నించడమే భారత్ ముందున్న మార్గం. మోదీ ప్రభుత్వం ఇదే దిశలో పయనిస్తున్నది. కనుకనే ఇప్పటిదాకా చమురు సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలిగింది.కాకపోతే తన స్థాయికి తగ్గట్టుగా కొన్ని విషయల్లోనైనా గొంతు విప్పాల్సిందనే అభిప్రాయం కూడా బలపడుతున్నది. అప్పుడే ప్రపంచ వేదికపై మనం నాయకత్వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి కవ్వింపు లేకుండా అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సూత్ర ప్రాయంగానైనా భారత్ ఖండించి ఉండవలసింది. దాడుల్లో చనిపోయిన ఖమేనీకి సంతాపం ప్రకటించడంలో మీనమేషాలు లెక్కించకుండా ఉండవలసింది. ఇరాన్ పాఠశాల మీద దాడి చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమైన అమెరికా చర్యను ఖండించి ఉండవలసింది. భారత్ ఆహ్వానం మేరకు వైజాగ్కు వచ్చి నౌకా విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకపై దాడి చేసి 150 మందిని హతం చేసిన అమెరికా చర్యను ఖండించి ఉండ వలసింది. అంతర్జాతీయ సంబంధాల్లో జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేయవలసిందే. దాంతోపాటు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా కూడా వ్యవహరించాలి. అప్పుడే విశ్వగురు హోదాకు అర్హత పొందగలం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎక్సైజ్ తగ్గినా ధరలు యథాతథం..!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడిపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ నగరంలో మాత్రం రిటైల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్ రూ.107.46, డీజిల్ రూ. 95.70 వద్ద స్థిరంగా కొనసాగాయి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించింది. తాజా తగ్గింపుతో పెట్రోల్పై కేంద్ర ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.13 నుంచి రూ. 3కి పడిపోయింది. డీజిల్పై రూ.10 సుంకాన్ని పూర్తిగా (సున్నాకు) తొలగించడం గమనార్హం. సాధారణంగా ఎక్సైజ్ సుంకం తగ్గితే వెంటనే పెట్రోల్ బంకుల్లో ధరలు తగ్గాలి. కానీ.. ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులు అంటున్నాయి ఆయిల్ కంపెనీలు. సామాన్యుడిపై భారం పడకుండా కేంద్రం నిర్ణయం ఉపశమనం కలిగించింది. 2021 నవంబర్లో పెట్రోల్పై రూ. 5, డీజిల్పై రూ. 10., 2022 మేలో పెట్రోల్పై రూ. 8, డీజిల్పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. -
‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. ఇజ్రాయెల్పైకి..
టెహ్రాన్: ‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. వాటిని ఇజ్రాయెల్పైకి వదిలింది ఇరాన్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా ప్రెస్ టీవీతో పాటు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ పోస్ట్ చేశాయి. ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్ సిబ్బంది క్షిపణులపై బ్లూ మార్కర్లతో “భారత ప్రజలకు ధన్యవాదాలు” వంటి వాక్యాలు రాస్తున్నట్లు కనిపించింది. స్పెయిన్, పాకిస్థాన్, జర్మనీ ప్రజలకు కూడా థ్యాంక్స్ చెబుతూ ఇలాంటి సందేశాలే రాసినట్లు సమాచారం. ఇరాన్కు అనుకూలంగా ఉన్న దేశాలకు కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.దీన్ని “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4”లో భాగంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జరిపిన చర్యగా ఇరాన్ నెట్వర్క్ ప్రెస్ టీవీ తెలిపింది. పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలపై దాడులు చేశామని ఐఆర్జీసీ తెలిపింది. ఇందులో అష్డోడ్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలు, మోడీన్ సమీపంలోని సైనిక స్థావరాలు, అమెరికా సైనిక సమాచార మార్పిడి కేంద్రం ఉన్నట్లు ప్రెస్ టీవీ తెలిపింది.అల్-ధఫ్రా, అల్-ఉదైరి ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలు, అలాగే అలీ అల్-సలేం ఎయిర్ బేస్, షేఖ్ ఈసా బేస్లపై దాడులు జరిగాయని పేర్కొంది. ఇరాన్, దీర్ఘ శ్రేణి, మధ్య శ్రేణి క్షిపణులు, డ్రోన్లను వినియోగించిందని, ఆపరేషన్ విజయవంతమైందని తెలిపింది.భారత్కు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు?భారత్-ఇరాన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇరాన్ తాజాగా, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధి ద్వారా భారత నౌకలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో, అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భారత్ను స్నేహపూర్వక దేశంగా పేర్కొని, యుద్ధ పరిస్థితుల్లో కూడా భారత నౌకలను అడ్డుకోబోమని చెప్పారు.మరొక కారణం ఏంటంటే, భారత ప్రజల నుంచి ఇరాన్కు మానవతా సాయం అందింది. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతం నుంచి. జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోని ప్రజలు ఇరాన్కు సాయం అందించేందుకు విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. నగదు, ఆభరణాలు, గృహ సంబంధిత వస్తువులు వంటి సాయం అందించారు. ఒక కశ్మీరీ మహిళ తన భర్త జ్ఞాపకంగా దాదాపు 3 దశాబ్దాలుగా దాచుకున్న బంగారాన్ని ఇచ్చేసింది. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ చర్యలను గుర్తించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సాయం ఎప్పటికీ మర్చిపోమని పేర్కొంది. Iran launches WAVE 83 missile AND drone attack on ‘Zionist soldiers’ — IRIBTHANK YOUS written on missiles in English to people across globe pic.twitter.com/wjjVietkAo— RT (@RT_com) March 26, 2026 -
సీఎంలతో ముగిసిన మోదీ సమావేశం
ఢిల్లీ: దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. సుమారు రెండున్నరగంటల పాటు చర్చలు కొనసాగాయి. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇంధన సంక్షోభం, తదితర అంశాలపై చర్చించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఫర్టిలైజర్స్ సప్లైకి ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. దీనిలో భాగంగా పీఎం మోదీ మాట్లాడుతూ.. కలిసికట్టుగా పని చేస్తేనే పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రాధాన్యమని, ప్రజాప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా అంతా పని చేయాలన్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేశామని, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించాలని సీఎంలకు సూచించారు. ఎరువుల నిల్వ, పంపిణీపై ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎంలకు మోదీ ఆదేశించారు. PM Narendra Modi is chairing the meeting with CMs through video conferencing on the West Asia conflict to review preparedness and plans of states. pic.twitter.com/pqJS3iCgro— ANI (@ANI) March 27, 2026 -
రెండు నెలల దాకా నో ఫికర్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య ఎల్పీజీ సరఫరా తగ్గింది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఇంధనం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో గందరగోళం మరింత పెరిగిపోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా వదంతులు మాత్రం ఆగడం లేదు. అందుకే ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరో రెండు నెలల దాకా మనకు ఢోకా లేదని భరోసా ఇచ్చింది. అలాగే 8 లక్షల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, దీంతో దేశమంతటా ఒక నెల మొత్తం గ్యాస్ అవసరాలు తీరుతాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఎంతమాత్రం లేదని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల జనం ఆందోళనకు గురై ఇంధనం కోసం ఎగబడ్డారని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వం మన దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వల వివరాలను బయటపెట్టడం ఇదే మొదటిసారి. ‘క్యాష్ అండ్ క్యారీ’వల్ల అంతరాయం నిజమే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టంచేసింది. అవి సాధారణంగానే పని చేస్తున్నాయని, చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ వివరణ ఇచ్చింది. కొన్నిచోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. చమురు కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న ‘క్యాష్ అండ్ క్యారీ’విధానం వల్ల చిన్న పట్టణాల్లో కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించింది. నిధుల సమస్య కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పంపుల యజమాన్యాలకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. ఇంధనం, ఎల్పీజీ సరఫరా ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని రిటైల్ ఇంధన కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని పునరుద్ఘాటించింది. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. 150కిపైగా దేశాల నుంచి దిగుమతి ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన నాలుగో దేశం భారత్. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ముడి చమురు, గ్యాస్ దిగుమతులు సగానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా 150కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. మనదేశంలో అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని, రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాల ఒప్పందాలను భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఖరారు చేసుకున్నాయని స్పష్టంచేసింది. మన దగ్గర మొత్తం 74 రోజులకు సరిపడా ముడి చమురును, ఇంధనాన్ని నిల్వ చేసకొనే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.ఇంధన ఎమర్జెన్సీకి ఆస్కారం లేదు ప్రపంచంలో ఎక్కడం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సరే మన దగ్గర ప్రతి పౌరుడికి రెండు నెలలపాటు స్థిరంగా ఇంధనం సరఫరా చేయగలమని కేంద్రం తెలిపింది. రాబోయే కొన్ని నెలలపాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఎల్పీజీ విషయంలో దేశీయంగానే ఉత్పత్తిని పెంచుతున్నామని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నామని కేంద్రం స్పష్టంచేసింది. ఇంధనం, గ్యాస్పై తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్ని దేశాల్లో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ విధించారని, సరఫరా తగ్గించారని, ధరలు పెంచారని.. మన దేశంలో అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. -
భారత్ సహా 5 దేశాలకు హార్మూజ్లో గ్రీన్సిగ్నల్
టెహ్రాన్/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్ అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ‘మేం స్నేహపూర్వక దేశాలుగా భావించే కొన్ని దేశాలను హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించాం. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్లను అనుమతించాం’అని అరాగ్చీ తెలిపారు. ఇరాన్ శత్రు నౌకలను మాత్రం ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘మనం యుద్ధంలో ఉన్నాం. ఈ ప్రాంతం కూడా ఒక యుద్ధ క్షేత్రం. మన శత్రువులు, వారి మిత్రుల నౌకలను దీని గుండా వెళ్ళడానికి అనుమతించాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకోసం ఇది తెరిచే ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఇరుకైన నౌకా మార్గం హార్మూజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు)లో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది. ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దాదాపు మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దేశ ఇంధన కొనుగోళ్లకు పశ్చిమ ఆసియా ఒక ప్రధాన వనరుగా ఉంది. ఈ నౌకాయాన మార్గంపై దిగ్బంధనం కొనసాగితే, దేశంతో సహా అనేక దేశాల ఇంధన, ఎరువుల భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని భావించింది. దీంతో జలసంధి గుండా ఇంధన ప్రవాహం నిరాటంకంగా సాగేలా చూడటంపై దృష్టి సారించిన భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేసింది. -
అమెరికా-ఇరాన్ యుద్ధం.. థరూర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల వేళ భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం పాకిస్తాన్ నాయకత్వం వహించడం భారత్కు ‘అవమానకరం’ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.భారత్కు దక్కిందేమిటి?ఫిబ్రవరి 28న ఇరాన్పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఆపై సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్య ప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన సంక్షోభం ముంచుకొస్తోంది. ఇలాంటి కీలక సమయంలో పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు దేశాలు శాంతి చర్చలకు చొరవ చూపుతుంటే, భారత్ వెనుకబడిపోవడంపై థరూర్ అసహనం వ్యక్తం చేశారు.‘ప్రధాని మోదీ ఎప్పుడూ చెప్పేవిధంగా.. భారత్ శాంతి దూతగా నిలుస్తుందని ఆశించి, ప్రభుత్వం వహిస్తున్న మౌనాన్ని సమర్థించాను. కానీ ఇప్పుడు క్రెడిట్ అంతా పాకిస్తాన్కు వెళ్తుంటే చూడటం బాధాకరం. ఇది మనందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ తనకున్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకోవడంలో విఫలమైందని విమర్శించారు.‘దళారీ దేశం కాదు’: జైశంకర్ కౌంటర్విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విపక్షాల విమర్శలకు అత్యంత ఘాటుగా స్పందించారు. ‘భారత్ ఏమీ దళారీ దేశం కాదు" అంటూ విపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. 1981 నుండి అమెరికా పాకిస్తాన్ను ఒక సాధనంగా వాడుకుంటూనే ఉందని, ఇందులో కొత్తేమీ లేదని ఎద్దేవా చేశారు. యుద్ధం వల్ల అన్ని పక్షాలు నష్టపోతున్నాయని, దీనిని త్వరగా ముగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్పష్టం చేశారని కేంద్రం వెల్లడించింది. ఇది కూడా చదవండి: పెట్రోల్కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం! -
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ .. భారత్లో వీటి ధరలు పెరగనున్నాయా?
ఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత ఔషధ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ (ఇండియా) వెల్ఫేర్ అసోసియేషన్ (DCOIWA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఔషధ ఉత్పత్తి, ఎగుమతి దేశాలలో ఒకటిగా ఉన్నందున అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో ముడిపడి ఉందని, గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా మెడిసిన్ అ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతం కీలక రవాణా కేంద్రంగా ఉండటంతో, నౌకాయాన మార్గాల అంతరాయం, మధ్యవర్తి రసాయనాల సరఫరాను దెబ్బతీస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం, సరుకు రాకలో ఆలస్యం తయారీదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అల్యూమినియం ఫాయిల్స్, ప్లాస్టిక్ పాలిమర్స్, గ్లాస్ వైల్స్, రబ్బర్ స్టాపర్స్ వంటి ప్యాకేజింగ్ పదార్థాల కొరత, ధరల పెరుగుదల తయారీ ఖర్చులను పెంచుతున్నాయి.గల్ఫ్ దేశాలకు ఔషధ ఎగుమతులు రవాణా సమస్యలు, పోర్ట్ ట్రాఫిక్, బీమా సమస్యల కారణంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక ఔషధాల దిగుమతులు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఎగుమతిదారులు డిమాండ్ మార్పులు, చెల్లింపుల సమస్యలు, రవాణా ఆలస్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిగుమతిదారులు అధిక ఖర్చులు, అస్థిర సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశీయ వ్యాపారులు స్టాక్ కొరత, ధరల మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది వినియోగదారులకు ఔషధాల లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యాంటీబయోటిక్స్, గుండె సంబంధిత ఔషధాలు, మధుమేహ ఔషధాలలో మెడిసిన్ పని చేసేందుకు వినియోగించే రసాయనాలు (APIs) కొరత ఏర్పడే అవకాశం ఉందని, ప్యాకేజింగ్ పదార్థాల కొరత వల్ల ఉత్పత్తి తగ్గుదల, ప్రాణ రక్షక ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీఐ, కీలక ముడి పదార్థాల స్వదేశీ తయారీని ప్రోత్సహించాలి. అవసరమైన ఔషధాలు, ముడి పదార్థాల భద్రతా నిల్వలను ప్రభుత్వ స్థాయిలో నిర్వహించాలి. గల్ఫ్ ప్రాంతానికి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అభివృద్ధి చేయాలి. పోర్ట్ క్లియరెన్స్ వేగవంతం చేయడం, రవాణా, బీమా ఖర్చులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. ఔషధ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు నియంత్రణ సంస్థలు పర్యవేక్షణ చేయాలి. నియంత్రణ సంస్థలు, తయారీదారులు, పంపిణీదారుల మధ్య సమన్వయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితి మారుతూ ఉన్నప్పటికీ, ప్రభుత్వం, ఔషధ రంగానికి చెందిన అన్ని భాగస్వాములు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు అవసరమైన ఔషధాల సరఫరాను నిరంతరంగా కొనసాగించగలమని జి. కోటేశ్వరరావు స్పష్టం చేశారు. -
భారత్కు అండగా మరో దేశం.. పెద్ద కష్టం తీరినట్టే?
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అనేక దేశాలు ఇంధన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధి మూత పడటంతో పెను సంక్షోభం ఏర్పడింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంధన రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. దీంతో, చమురు సరఫరా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం భారత్పై కూడా తీవ్రంగా పడింది.కాగా, భారత్ తన అవసరాల కోసం దాదాపు 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా భారత్కు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి మూత పడటంతో సమస్య తలెత్తింది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ మిత్రదేశమైన అర్జెంటీనా భారత్కు భారీ ఆఫర్ ఇచ్చింది. 2024 కంటే ముందు అర్జెంటీనా నుంచి భారత్కు గ్యాస్ సరఫరా అస్సలు ఉండేది కాదు. కానీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2025లో 22,000 టన్నుల దిగుమతులు జరగగా, 2026 తొలి మూడు నెలల్లోనే అది ఏకంగా 50,000 టన్నులకు చేరడం గమనార్హం. మార్చి 5న అదనంగా 11,000 టన్నులు గ్యాస్తో భారత్ చేరుకుంది.అయితే, అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండం చివరిలో ఉంది. భారత్, అర్జెంటీనా మధ్య దూరం సుమారు 20,000 కిలోమీటర్లు. అక్కడి నుంచి భారత్కు రవాణా చేయడం పెను సవాలుతో కూడుకుంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత పొడవైన నౌకా మార్గం ఇది. రవాణా ఖర్చులు భారమైనప్పటికీ, దేశంలో గ్యాస్ కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కౌసినో ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ దేశంలో అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, భారత్కు దీర్ఘకాలం పాటు సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ అర్జెంటీనాకు 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గ్యాస్తో పాటు సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, పప్పుధాన్యాలను కూడా మనం అక్కడి నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. -
విశ్వ వేదికపై మన విద్యాసంస్థలు
సాక్షి, అమరావతి: భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు అందించే కోర్సులకు ప్రపంచంలో టాప్ కోర్సులుగా గుర్తింపు లభించింది. బుధవారం ప్రకటించిన తాజా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ), బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) వివిధ సబ్జెక్టుల్లో ప్రపంచంలోని టాప్ –50 సంస్థల్లో స్థానం సంపాదించుకున్నాయి. యూనివర్సిటీ ర్యాంకింగ్స్కు పేరుగాంచిన లండన్కు చెందిన క్యూఎస్ క్వాక్వారెల్లి సైమండ్స్, సబ్జెక్ట్ వారీగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 16వ వార్షిక ఎడిషన్ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలలో 1,900 విశ్వవిద్యాలయాలు అందిస్తున్న 21 వేలకు పైగా అకడమిక్ ప్రోగ్రామ్స్, 55 విభాగాలు ఐదు విస్తృత అధ్యాపక ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటించారు. ఇందులో భారతదేశం నుంచి 27 సబ్జెక్టులు టాప్–50లో నిలిచాయి. ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ యూనివర్సిటీ మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్లో ప్రపంచ వ్యాప్తంగా 21వ స్థానంలో నిలిచింది. ఐఐఎం అహ్మదాబాద్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, మార్కెటింగ్ రెండు కోర్సుల్లోనూ 21వ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని ఓ విద్యా సంస్థ మార్కెటింగ్ సబ్జెక్టులో గ్లోబల్ ర్యాంకింగ్ సాధించడం ఇదే తొలిసారి. టాప్–50లో ఐఐటీ ఢిల్లీ, బోంబే ఈ సంవత్సరం దేశంలోని విద్యా సంస్థలు టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా మన నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రపంచానికి చాటాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఘనతను చాటాయి. దేశంలోని టాప్ కోర్సులు అందించే సంస్థల్లో ఢిల్లీ–ఐఐటీ అత్యధికంగా 6 కోర్సులతో టాప్–50లో ముందుంది. ఇందులో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్ ఇంజినీరింగ్లో 36వ స్థానం, మెకానికల్, ఏరోనాటికల్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్లో 44వ స్థానం, సైన్స్ అండ్ టెక్నాలజీలో 45, కెమికల్ ఇంజినీరింగ్లో 48 స్థానంలో నిలిచాయి. మద్రాస్ ఐఐటీ పెట్రోలియం ఇంజినీరింగ్లో 29 ర్యాంకు సాధించగా, మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్లో ఐఐటీ ఖరగ్పూర్ 22వ ర్యాంకు, ఐఐటీ బోంబే 36వ ర్యాంకులు సాధించాయి. -
ఇరాన్ యుద్ధంలో ఇండియా వైఖరి
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్–యూఎస్ శిబిరంలో భారత్ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.బహుళ అలీన విధానంప్రస్తుత ఇరాన్ యుద్ధంలో భారత్ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్ ఫ్యాక్టర్ 3. ఇరాన్, యూఎస్ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్లో భారత్ స్థానం 5. భారత్ బలాలు – బలహీనతలు.21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత యూఎస్ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్ఏ, యూరోపి యన్ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?ఇరాన్ యుద్ధంలో భారత్ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్ సిందూర్’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్కు ఇజ్రాయెల్ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్ భారత్కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. అందుకే రష్యా, ఇజ్రాయెల్కు సంబంధించినంత వరకు భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రా యెల్ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్ తలదూర్చి తన జియో పొలిటికల్ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.కిం కర్తవ్యం?జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే భారత్ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.ఇరాన్ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్లో చైనా–తైవాన్ విషయంలో యూఎస్ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు -
భయపడాల్సిన పనిలేదు: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలలోనూ తాము అండగా నిలుస్తామని ప్రతిపక్ష పార్టీలన్నీ తమకు హామీ ఇచ్చాయని తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన సమావేశం జరిగిందని కిరణ్ రిజిజు అన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించిదని తెలిపారు. ‘దేశీయంగా 60% ఎల్పీజీని ఉత్పత్తిని పెంచాం. ఇంధన సరఫరా పెంచేందుకు అన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నాం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్ని అఖిలపక్ష పార్టీలకు వివరించాము. సవాళ్లు ఎదురవుతున్న ఈ సమయంలో, అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించాము. దేశంలో ఇంధన భద్రతకు ఢోకా లేదు ఇంధన భద్రత విషయంలో భయపడాల్సిన పనిలేదు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతిస్తామని అన్ని పార్టీలు వెల్లడించాయి. హార్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా వస్తున్నాయి’ అని అన్నారు.కాగా, ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశం పార్లమెంటులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తరఫున సమావేశానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. -
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటన
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్, వంటగ్యాస సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ధరలలో కూడా ఎటువంటి పెరుగుదల లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయనీ, వదంతులను నమ్మవద్దు అని బుధవారం (మార్చి 25, 2026) పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ధరలు పెంచంఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉందనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అన్నారు. గత రెండు రోజులుగా, అనేక ప్రాంతాల్లోని రిటైల్ అవుట్లెట్లు మరియు పెట్రోల్ పంపుల బయట క్యూలు కనిపించాయి. భయాందోళనలతో కొనుగోళ్లు కూడా జరిగాయి. కానీ మన వద్ద తగినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయి. ఏ పెట్రోల్ పంపు వద్ద కూడా కొరత లేదు. పెట్రోల్ పంపులకు సరఫరా టెర్మినళ్లలో కూడా తగినంత పరిమాణంలో ఇంధన నిల్వలున్నాయి. అందువల్ల, వదంతులను నమ్మవద్దు , భయాందోళనలతో కొనుగోళ్లు మానుకోండి అని ఆమె చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని కూడా ఆమె స్పష్టం చేశారు. LPG విషయానికి వస్తే, ఏ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఎలాంటి కొరత లేదని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల వాణిజ్య ఎల్పిజిని కేటాయించారని, గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. సుమారు 30,005 కిలోల సిలిండర్లు పంపిణీ చేశామని ఆమె చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన కిరోసిన్ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనపు కేటాయింపులు చేసిందన్నారు. సుమారు 16 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే నల్లబజారు, అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వివిధ రాష్ట్రాల్లో సుమారు 2700 దాడులు నిర్వహించి, సుమారు 2000 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు సుజాత శర్మ వెల్లడించారు.ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు #WATCH | Delhi: Sujata Sharma, Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, says, "In the last 25 days, 2.5 lakh new connections (PNG) have been given. Additionally, approximately 2.20 lakh consumers have shifted from LPG to PNG. Additionally,… pic.twitter.com/o3pDx5KbMs— ANI (@ANI) March 25, 2026 -
కోట్లాది మందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు
మధ్యప్రాచ్య (Middle East) యుద్దంతో నెలకొన్న చమురు సరఫరా సంక్షోభం పెట్రోల్, డీజిల్పై ఆందోళనల నేపథ్యంలో భారతీయులకు భారీ ఊరటనిచ్చే అంశమిది. భారత రిఫైనరీలు వచ్చే నెల డెలివరీ కోసం సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా చమురు కొనుగోలులో అమెరికా ఇచ్చిన వెసులు బాటు భారత్ సమర్ధవంతంగా వినియోగించుకున్నట్టు అవుతోంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో సౌదీ అరేబియా, ఇరాక్ నుండి రావాల్సిన చమురు నిలిచి పోవడంతో, భారత్ తన ఇంధన అవసరాల కోసం మళ్ళీ రష్యా వైపు మొగ్గు చూపింది. మనీ కంట్రోల్ కథనం ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారతీయ రిఫైనరీలు మే నెల డెలివరీ కోసం దాదాపు 6 కోట్ల (60 Million) బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ కంటే బ్యారెల్కు 5 డాలర్ల నుండి 15 డాలర్ల ప్రీమియం ధరలకు బుక్ అయ్యాయి. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ ప్రకారం, ఈ పరిమాణం ఈ నెల కొనుగోళ్లకు సమానంగా ఉన్నప్పటికీ, ఫిబ్రవరి నెల కొనుగోళ్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ.(ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు)గత డిసెంబర్ నుండి రష్యా చమురుకు దూరంగా ఉన్న మంగళూరు రిఫైనరీ (MRPL), హిందుస్థాన్ మిట్టల్ ఎనర్జీ వంటి సంస్థలు ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రధానంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో ఏర్పడిన చమురు కొరతను అధిగమించేందుకు, మార్చి 12 లోపు సముద్రంలో లోడ్ అయిన రష్యన్ చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.2022 ప్రారంభంలో ఉక్రెయిన్పై దాడి జరిగిన తర్వాత, భారత్కు తక్కువ ధరకు లభించే రష్యన్ ముడి చమురుకు ఇది ఒక ప్రధాన కొనుగోలుదారుగా మారింది. అయితే, అమెరికా ఒత్తిడితో గత ఏడాది చివరి నుంచి భారత్ కొనుగోళ్లను తీవ్రంగా తగ్గించుకుంది. దానికి బదులుగా సౌదీ అరేబియా, ఇరాక్ల నుంచి బ్యారెళ్ల వైపు మళ్లింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత, అందులో అధిక భాగం పర్షియన్ గల్ఫ్లోనే చిక్కుకుపోయింది. అమెరికా మినహాంపుతోపాటు, కేవలం రష్యా పైనే ఆధార పడకుండా, భారత్ తన చమురు వనరులను పెంచుకుంటోంది. అక్టోబర్ 2020 తర్వాత అత్యధికంగా వెనిజులా నుండి కూడా ఏప్రిల్ నెలలో 80 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోనుంది.ఇదీ చదవండి: కోటక్ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలంరష్యాకు భారీ లాభాలుభారత్ , ఇతర దేశాలనుంచి వస్తున్న భారీ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల రష్యా భారీ లాభాలను ఆర్జిస్తోంది. మార్చి 2022 తర్వాత రష్యా చమురు ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న సమయం ఇదేనని నివేదికలు చెబుతున్నాయి. -
వీలునామా రిజిస్టర్ చేయించడం అత్యుత్తమం
నేను గతంలో ఒక వీలునామా రాసి, ఆ విషయాన్ని నా కుటుంబ సభ్యులకు – స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామా తిరగరాయాలనుకుంటున్నాను. వీలవుతుందా?– వి.ఆర్.ఎన్. శాస్త్రి, హైదరాబాద్మీరు సంపాదించిన లేదా మీకు సంక్రమించిన ఆస్తులను మీ తదనంతరం ఎవరికి పంచాలో నిర్ణయిస్తూ వీలునామా రాయడమనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మార్చుకోవచ్చు. అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలో చేసిన వీలునామా తాలూకు అంశాన్ని, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ వీలునామాలో మీరు ‘ఇదే చివరిది కాదు, నాకు మార్చుకోవాలనిపిస్తే మరోసారి కూడా వీలునామా మార్చుకునే అవకాశం ఉంది’ అని, అలా మార్చకపోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుందని కూడా రాయించవచ్చు.మీరు వీలునామా రాయించి, ఆ విషయాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా పోందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచూ చూస్తుంటాము. అలాంటి వీలునామాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవు. వీలునామా లో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి సంరక్షకులను (గార్డియన్)ను నియమించటం, శానిటీ ఓత్(చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చు తప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం. అలా లీగల్ గా మెరుగైన వీలునామా మీ దగ్గరలోని లాయర్ గారితో రాయించుకుని, వీలునామాలో మీరు పోందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. వీలునామా రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే అన్ని విధాల మీ తదనంతరం కూడా అందరికీ మేలు చేస్తుంది. తక్షణ అమలుకూ నోచుకుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
అత్యంత కాలుష్య దేశంగా పాక్.. నగరాల్లో మాత్రం?
2025 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరాల జాబితాను ఐక్యూ ఎయిర్ విడుదల చేసింది. ఇందులో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అదే విధంగా అత్యంత కాలుష్య నగరంగా భారత్లోని లోనీ నగరం ఉన్నట్లు నివేదిక తెలిపింది.ప్రపంచంలోని వాయి నాణ్యతపై స్విట్జర్లాండ్కు లోని ఐక్యూఎయిర్ సంస్థ నివేదిక విడుదల చేసింది. అందులో అత్యంత కాలుష్యం దేశంగా పాకిస్థాన్ నిలువగా, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో కజకిస్థాన్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. మెుత్తంగా 143 దేశాల్లో వాయు నాణ్యత పరీక్షలు నిర్వహించగా వాటిలో 130 దేశాలు WHO వాయు నాణ్యత ప్రమాణాలు చేరుకోలేక పోయాయి.ఈ నేపథ్యంలోనే భారత్లోని లోనీ నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన నగరంగా నిలిచింది. ఘజియాబాద్కు సమీపంలో, ఢిల్లీ సరిహద్దులో ఉండే ఈ పట్టణంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇక్కడ పీఎం2.5 కణాల సాంద్రత 112.5 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే 22 రెట్లు ఎక్కువ. అదే విధంగా రెండవ స్థానంలో చైనా హోటన్ ,3. బర్నీహత్ (మేఘాలయ) - 4. న్యూఢిల్లీ (భారత్) నిలిచాయి. మెుత్తంగా ప్రపంచంలోని టాఫ్ 10 కాలుష్య నగరాల్లో ఐదు భారతీయ నగరాలే ఉండడం ఆందోళన కలిగించే విషయం -
హర్మూజ్ ప్రయాణంపై భారత్ కీలక వ్యాఖ్యలు: భారత్
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అది అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని తెలిపారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే ఈ అంశాలపై భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు.హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. భద్రత, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే షిప్పింగ్ కంపెనీలు, వాటి కాంట్రాక్టు సంస్థలు ఈ జలసంధి గుండా ప్రయాణం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుంది. దీని గుండా నౌకాయానానికి స్వేచ్ఛ ఉంది. ఆ జలసంధి ఇరుకుగా ఉన్నందున, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మాత్రమే గుర్తించారు, వాటిని నౌకా రవాణా సంస్థలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా జలసంధి గుండా ప్రయాణించాలనే నిర్ణయం షిప్పింగ్ కంపెనీకి, ఓడను అద్దెకు తీసుకున్న కంపెనీకి మధ్య ఉంటుంది. ఎప్పుడు ప్రయాణించాలి, ఎప్పుడు ప్రయాణించకూడదు అనేది వారి నిర్ణయం అని తెలిపారు. అయితే ప్రస్తుతం యుద్ధం నడుస్తున్నందున వారు నిర్ణయం తీసుకునే ముందు భద్రత మొదలైన వాటికి సంబంధించి పరిస్థితిని అంచనా వేస్తారు. అంతేగాని హార్మూజ్ గుండా ప్రయాణానికి ఎటువంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు అని ఆయన తెలిపారు. కాగా నిన్న (సోమవారం) మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇవి ఈ నెల 26 లేదా 27 తేదీలలో భారత్ను చేరుకుంటాయి. వీటివల్ల దేశానికి దాదాపు ఒక రోజు వంటగ్యాస్ సరఫరా చేయవచ్చు. -
మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం: రష్యా
భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం రష్యా ఎదురు చూస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. ఢిల్లీతో ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలు నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.2025 చివరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా కుదిరిన కీలక ఒప్పందాలు, వ్యూహాత్మక లక్ష్యాలను మోదీ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. 2025లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లకు చేరుకుందని దీనిని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.భారత్, రష్యాది కాల పరీక్షను ఎదుర్కొని నిలబడ్డ నిలిచిన స్నేహ బంధమని, సమానత్వం, విశ్వాసం, గౌరవం, ప్రయోజనాలను ఇరుదేశాలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా భారత్, రష్యాల మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం భారత్-రష్యా మధ్య జరుగుతున్న వాణిజ్యంలో 96 శాతం జాతీయ కరెన్సీలలోనే (రూపాయి-రూబుల్) జరుగుతుండటం విశేషమని ఆయన గుర్తుచేశారు.వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం పట్ల రష్యాకు ఎంతో గౌరవం ఉందని లావ్రోవ్ కొనియాడారు. 21వ శతాబ్దంలో భారత్ ఒక గొప్ప శక్తిగా, ప్రపంచ రాజకీయ మరియు ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు -
భారత్ చేరిన మరో ఎల్పీజీ నౌక
మంగళూరు(కర్ణాటక): పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో భారత్లో ఎల్పీజీ కష్టాలు పెరగడంతో ఆ సమస్యను తీర్చేందుకు అమెరికా ముందుకొచి్చంది. అమెరికా నుంచి 16,714 మెట్రిక్ టన్నుల ఎలీ్పజీతో బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘పైక్సిస్ పయనీర్’ ఆదివారం భారత్కు చేరుకుంది. ఫిబ్రవరి 14వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని పోర్ట్ ఆఫ్ నెదర్లాండ్ నుంచి బయల్దేరి పయనీర్ నౌక ఆదివారం న్యూ మంగళూరులోని నౌకాశ్రయానికి చేరుకుంది. మంగళూరు రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ప్లాంట్ సమీపంలో భారత్ అతిపెద్ద భూగర్భ ఎల్పీజీ నిల్వ కేంద్రాన్ని నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక్కడ 80 వేల మెట్రిక్ టన్నుల ద్రవరూప పెట్రోలియంగ్యాస్(ఎల్పీజీ)ను భద్రపరచవచ్చు. వ్యూహాత్మక అవసరాలకు ఈ నిల్వలు అక్కరకొస్తాయి. రష్యా చమురు నౌక ఆగమనం మంగళూరు: చైనాకు వెళ్లాల్సిన రష్యా నౌక ఆక్వా టైటాన్ దిశమార్చుకుని మంగళూరుకు చేరుకుంది. చైనాకు బదులుగా భారత్ దిశగా బయల్దేరిన ఏడు నౌకల్లో ఇండియాకు చేరుకున్న తొలి నౌక ఇదే కావడం విశేషం. పశి్చమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సముద్రమార్గంలో చమురు రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నంకావడంతో తాత్కాలికంగా రష్యా నుంచి భారత్ చమురుకొనేందుకు అమెరికా అనుమతి మంజూరుచేసింది. దీంతో చైనాకు వెళ్లే ముడిచమురు నౌకలను సైతం భారత్ ఆగమేఘాల మీద కొనేసింది. దీంతో చైనాలోని రిజావూ పోర్ట్కు వెళ్లాల్సిన ఆ నౌకలు మార్చి నెల భారత్ వైపు దిశమార్చుకున్నాయి. జనవరి చివర్లో బాల్టిక్ సముద్రంలో సరుకు నింపుకున్న ఆక్వా టైటాన్ చివరకు భారత్కు చేరుకుంది. మార్చి 25వ తేదీన మరో రష్యా చమురునౌక సూయిజ్మ్యాక్స్ జౌజౌ సైతం త్వరలో భారత్కు చేరుకోనుంది -
ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆదివారం మరో అరుదైన మైలురాయికి చేరుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా రికార్డుకెక్కారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా నిరాటంకంగా 8,931 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఈ విషయంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు. చామ్లింగ్ సీఎంగా 8,930 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఆదివారంతో మోదీ 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. కేంద్ర మంత్రుల అభినందనలు ప్రభుత్వాధినేతగా 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న కేంద్ర మంత్రులు తదితరులు అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాని గత 24 ఏళ్లకుపైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తున్నారు. ఇది ఆయన అంకితభావానికి నిదర్శనం. ‘మోదీ యుగం’ దేశ రూపురేఖలనే మార్చివేసింది. ఈ 8,931 రోజుల ప్రస్థానం దేశం పట్ల ఆయన నిబద్ధత, ప్రతి పౌరుడి పట్ల ఆయన చూపే అసమాన సేవానిరతికి ప్రతీక’’ అని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మంత్రులు రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు కూడా మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంపట్ల, ప్రజల పట్ల ఉన్న అచంచలమైన అంకితభావం కలిగిన గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. ‘‘మోదీ జీవితమంతా నిరంతర సేవా ప్రయాణం. ప్రధానిగా ఆయన సేవా దృక్పథం దేశాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉంది. మోదీ నాయకత్వంలో పేదలు, యువత, రైతులు, అన్నదాతల సాధికారతకు పెద్దపీట వేస్తూ దేశం ‘వికసిత్ భారత్’ దిశగా సాగుతోంది’’ అన్నారు.ఎన్నెన్ని రికార్డులో! → మోదీ తొలిసారి 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రధానిగా ఎన్నికయ్యే దాకా సీఎంగా కొనసాగారు. గుజరాత్కు ఎక్కువ కాలం సీఎంగా చేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 21 దాకా 13 ఏళ్లకు పైగా సీఎంగా సేవలందించారు. 2001, 2002, 2007, 2012ల్లో నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసి, ప్రధానమంత్రిగా ఎన్ని కైన అరుదైన నాయకుడు కూడా మోదీయే. → స్వతంత్ర భారతదేశంలో జని్మంచిన తొలి ప్రధానిగా మోదీ మరో రికార్డు నెలకొల్పారు. మోదీకి ముందు ప్రధానులుగా చేసిన వారంతా స్వాతంత్య్రానికి ముందు పుట్టిన వారే. → ప్రధానిగా రెండు పర్యాయాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏకైక కాంగ్రెసేతర నేత మోదీ. ప్రస్తుతం వరుసగా మూడో టర్మ్లో పదవిలో కొనసాగుతున్నారు. → వరుసగా 3 సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా మోదీ మరో ఘనత సాధించారు. ఆయన సారథ్యంలో 2014, 2019, 2024ల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. → వరుసగా ఎక్కువకాలం పదవిలో రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును మోదీ గతేడాది బద్ధలు కొట్టారు. ఇందిర 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 దాకా 4,077 రోజులపాటు వరుసగా పదవిలో ఉన్నారు. మోదీ 2025 జూలై 25న ఆ రికార్డును దాటేశారు. → అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రికార్డు నెహ్రూదే. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27న మరణించేదాకా 16 ఏళ్ల 286 రోజులపాటు పదవిలో ఉన్నారు. మోదీ నాలుగోసారి ప్రధానిగా ఎన్నికైతే ఆ రికార్డును తిరగరాసే అవకాశముంది. → నెహ్రూ మూడు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించారు. ఈ రికార్డును మోదీ ఇప్పటికే సమం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపిస్తే ఆ రికార్డునూ అధిగమిస్తారు. → ఆరు వరుస ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నాయకుడు కూడా మోదీయే. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ పక్షనేతగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2014, 2019, 2024లో లోక్సభ ఎన్నికల్లో నెగ్గి బీజేపీపక్ష నేతగా, ప్రధానిగా ఎన్నికయ్యారు. -
అనాహత్, అభయ్లకు టైటిల్స్
ముంబై: ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లే టైటిల్స్ సాధించారు. టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన అనాహత్ సింగ్ మహిళల టైటిల్ చేజిక్కించుకుంది. పురుషుల ఈవెంట్లో అభయ్ సింగ్ నిలకడైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన అమ్మాయిల ఫైనల్లో యువ సంచలనం అనాహత్ 3–1 (11–5, 11–6, 9–11, 11–6)తో ఈజిప్టు క్రీడాకారిణి హనా మొతాజ్ను ఓడించింది. భారత ప్లేయర్ తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకోగా... మూడో సెట్ను ఈజిప్టు అమ్మాయి దక్కించుకుంది. వెంటనే పుంజుకున్న అనాహత్ నాలుగో సెట్ నెగ్గి మ్యాచ్ను ముగించింది. గత నెలలో ఈ భారత ప్లేయర్ కెరీర్ బెస్ట్ ప్రపంచ 19వ ర్యాంకుకు ఎగబాకింది. ఇపుడు తాజా టైటిల్ విజయంతో టాప్–20 ర్యాంకింగ్స్లో నిలకడగా కొనసాగనుంది. 2022 ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన అనాహత్... గతేడాది ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్లో కాంస్యంతో భారత్ 15 ఏళ్ల పతక నిరీక్షిణకు తెరదించింది. చెన్నైలో జరిగిన స్క్వాష్ ప్రపంచకప్లోనూ ఆమె బంగారు పతకంతో సత్తాచాటింది. భారత ఆటగాళ్ల మధ్యే జరిగిన పురుషుల ఫైనల్లో అభయ్ సింగ్ తన సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస సెట్లలో గెలుపొందాడు. అతను 11–9, 11–8, 11–4 వీర్ చొత్రానిపై విజయం సాధించాడు. -
2047 నాటికి సంపన్న దేశంగా భారత్: అమెరికన్ మ్యాగజైన్ సంచలన రిపోర్ట్!
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2047 నాటికి.. సంపన్న దేశంగా మారుతుందని అమెరికా మ్యాగజైన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' నివేదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వాషింగ్టన్ ఎగ్జామినర్ ప్రకారం.. గత రెండు దశాబ్దాలుగా దేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2003 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. సగటు వార్షిక వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 20 ఏళ్లపాటు ఇదే ఊపు కొనసాగితే తలసరి జీడీపీ 15,000 డాలర్లు దాటేస్తుంది. ఇంతటి స్థిరమైన వృద్ధి సాధించడం వల్ల భారత్.. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసిన మధ్య ఆదాయ ట్రాప్ను (మిడిల్ ఇన్కమ్ ట్రాప్) దాటేయగలదు.భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన విధానాలు, జనాభా, పెరుగుతున్న టెక్నాలజీ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది. ఇండియాలో 28 సంవత్సరాలు మధ్య వయసున్న వారు.. యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాల కంటే ఎక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశంలో యువకులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ జనాభా ధోరణి బలమైన దేశీయ మార్కెట్కు మద్దతునిస్తుందని, తద్వారా వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదించింది.ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి.. విధాన రూపకర్తలు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు వేగవంతమవుతున్నాయి. మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసులను బలోపేతం చేసి, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది.నిరంతర పెట్టుబడులు, కార్మిక శక్తిని విస్తరించడం, సాంకేతికతను స్వీకరించడం ద్వారా దేశాలు అధిక - ఆదాయ హోదాకు మారగలవని చారిత్రక ధోరణులు చూపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు భారతదేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది.వికసిత భారత్ - మోదీ కలభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల. ఈ లక్ష్యం ద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో శక్తివంతంగా మార్చడం ప్రధాన ఉద్దేశ్యం.వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చేయడం. గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాలి. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం.మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడం వంటివి కూడా ఇందులో ప్రధాన లక్ష్యాలు.ఇదీ చదవండి: బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా.. -
అమెరికా మాపై దాడి చేస్తే మేము భారత్ పై దాడి చేస్తాం: పాక్ మాజీ హై కమీషనర్
-
‘మన గ్యాస్ని ఎవర్రా ఆపేది?’.. భారత్కు అమెరికా గ్యాస్!
మంగళూరు: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల కారణంగా మన దేశంలో ఏర్పడుతున్న ఎల్పీజీ (ఎల్పీజీ) కొరతకు పరష్కారం దొరికింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి భారీ గ్యాస్ నిల్వలతో కూడిన ‘పిక్సిస్ పయనీర్’ (Pyxis Pioneer) నౌక ఎట్టకేలకు భారత్ చేరుకుంది. ఆదివారం ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు ఈ నౌక సురక్షితంగా వచ్చి చేరింది.టెక్సాస్ టు మంగళూరు ..సింగపూర్ ఫ్లాగ్తో ప్రయాణించిన ఈ భారీ ట్యాంకర్ ఫిబ్రవరి 14న టెక్సాస్లోని నెదర్లాండ్ పోర్టు నుంచి బయల్దేరింది. న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ వివరాల ప్రకారం.. 47,236 టన్నుల గ్రాస్ టన్ను సామర్థ్యం ఉన్న ఈ నౌక, ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 13వ నంబర్ బెర్త్కు చేరుకుంది. ఇది ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం సుమారు 16,714 టన్నుల ఎల్పీజీని ఇక్కడ అన్లోడ్ చేయనుంది. సోమవారం ఉదయం ఈ నౌక తిరిగి ప్రయాణం కానుంది.భారత్కు ఊరటగత మూడు వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల భారత్కు ఇంధన సరఫరాలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. సరఫరా తగ్గడంతో గృహ అవసరాలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు, హోటళ్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ కోత విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో అమెరికా నుంచి గ్యాస్ నిల్వలు రావడం దేశానికి పెద్ద ఊరట లభించింది.ఇరాన్ హామీతో..ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారతీయ నౌకలకు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. దీంతో పాటు ఇటీవల ‘జగ్ లాడ్కీ’ ముడి చమురును, ‘నందాదేవి’, ‘శివాలిక్’ నౌకలు గ్యాస్ నిల్వలను విజయవంతంగా భారత తీరానికి చేరవేసాయి. కాగా భారత్ తన ఇంధన అవసరాల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దేశానికి కావాల్సిన ముడి చమురులో 88 శాతం, సహజ వాయువులో 50 శాతం, ఎల్పీజీలో దాదాపు 60 శాతం దిగుమతుల ద్వారానే అందుతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇంధన సరఫరా వ్యవస్థ కొంత అస్తవ్యస్తమయ్యింది. అయితే తాజా షిప్మెంట్లతో పరిస్థితులు దారికి వస్తున్నాయి.ఇది కూడా చదవండి: ట్రంప్ షాకింగ్ పోస్ట్.. ‘అతని చావుతో సంతోషం’ -
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ‘‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ ’గా పేరొందిన భారత్ ఔషధ పరిశ్రమ... దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానిస్తూ, ఆరోగ్య రంగంలోనే కాక ఆర్థిక అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తక్కువ ధరలతో నాణ్యమైన మందులు, భారీ ఎగుమతులు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలతో ప్రపంచ ఫార్మా రంగంలో భారత్కి ప్రత్యేక స్థానమని హర్షం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో ఫార్మా రంగం అభివృద్ధి చెందుతున్న విధానంపై ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’(పీఐబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య రంగానికి, ఆర్థికాభివృద్ధికి అనుసంధానకర్త ‘ఫార్మాస్యూటికల్’ రంగం కీలక స్థానాన్ని ఆక్రమించినట్లు తెలిపింది. అవసరమైన మందులు, టీకాలను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలు, సప్లై చైన్ బలోపేతం, సామాజికాభివృద్ధికి ఈ రంగం తోడ్పడుతున్నట్లు వివరించింది. ప్రపంచ ఫార్మా మార్కెట్లో భారత్ది ప్రత్యేక స్థానం: భారత ఔషధ పరిశ్రమ ప్రపంచంలో వాల్యూమ్(పరిమాణం) పరంగా మూడవ స్థానం, విలువ పరంగా 11వ స్థానంలో ఉందని పీఐబీ తెలిపింది. దేశంలో 3 వేలకు పైగా కంపెనీలు, 10,500 తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 60 బిలియన్ డాలర్ల విలువ కలిగిన దేశీయ మార్కెట్ 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరనుంది. భారత్ ప్రపంచంలో జనరిక్ మందుల అతిపెద్ద సరఫరాదారుగా నిలవనుంది. ప్రపంచ సరఫరాలో దాదాపు 20శాతం వాటా భారత్దే కావడం గమనార్హం. సుమారు 60వేల జనరిక్ బ్రాండ్లు 60 చికిత్స విభాగాల్లో ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ నమ్మకం, నాణ్యతకు గుర్తింపు: అమెరికా వెలుపల అత్యధికంగా యూఎస్ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ యూనిట్లు భారత్లోనే ఉన్నాయని తెలిపింది. సుమారు 500 ఏపీఐ(యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్)తయారీ సంస్థలు ఉండటం ద్వారా ప్రపంచ ఏపీఐ మార్కెట్లో భారత్కు ఎనిమిది శాతం వాటా ఉంది. ఇక ఎగుమతుల్లోనూ భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. భారత్ డిప్తీరియా, టెటనస్, పెర్టుసిస్ (డీపీటీ), బీసీజీ మీజిల్స్ టీకాల సరఫరాలో ప్రథమ స్థానంలో ఉంది. యూనిసెఫ్కు 60% టీకాలను భారత్ సరఫరా చేస్తుండటం గరి్వందచదగ్గ విషయంగా పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ మీజిల్స్ టీకా అవసరాల్లో 90% భారత్ నుంచే సరఫరా అవుతోంది. ఇక 2024–25లో ఔషధ ఎగుమతులు 30.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుతం భారత్ 191 దేశాలకు ఔషధాలు ఎగుమతి చేస్తున్నట్లు వివరించింది.ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలుఫార్మా రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక పథకాలను అమలు చేస్తున్నట్లు పీఐబీ తెలిపింది. ఇందులో భాగంగా ప్రధానంగా.. ‘పీఎల్ఐ పథకం’. ఈ పథకం ప్రభావం రూ.3.16 లక్షల కోట్ల అమ్మకాలు, రూ.2.03 లక్షల కోట్ల ఎగుమతులు, సుమారు 97వేల ఉద్యోగాలు, బల్క్ డ్రగ్ – మెడికల్ డివైస్ పార్కులు అని వివరించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్కులు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో మెడికల్ డివైస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ‘ప్రధాన్ మంత్రి భారతీయ జనఔషధి పరియోజన’ కింద దేశవ్యాప్తంగా 18,600కి పైగా కేంద్రాలు పనిచేస్తున్నాయి. తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందిస్తూ ప్రజల ఖర్చులను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇక ‘ఇన్నోవేషన్, పరిశోధన’కు కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపింది. ఈపథకం కింద పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. 111 పరిశోధన ప్రాజెక్టులు, పేటెంట్లు నమోదు కావడం ఈ రంగం పురోగతిని సూచిస్తుందన్నారు. 2026–27 బడ్జెట్లో ‘‘బయోఫార్మా శక్తి’’ పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించారు. బయోలాజిక్స్, బయోసిమిలర్స్ ఉత్పత్తిలో భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ వంటి సంస్థలు ఔషధాల నాణ్యత, ధరలు, భద్రతపై కట్టుదిట్టమైన నియంత్రణ నిర్వహిస్తున్నట్లు పీఐబీ వివరించింది.కొత్త మార్కెట్లలో విస్తరణ: నైజీరియా, మెక్సికో, బ్రెజిల్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతులు పెంచుతూ భారత్ తన మార్కెట్ను విస్తరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తుందని పీఐబీ పేర్కొంది. ఇక విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఫార్మా రంగం విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రధాన రంగాల్లో ఒకటిగా నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సెపె్టంబర్ వరకు రూ.13,193 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇక వాణిజ్య ఒప్పందాలతో భారత్ గ్లోబల్గా విస్తరిస్తోంది. యూరోపియన్ యూనియన్, యూనైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్తో కుదిరిన వాణిజ్య ఒప్పందాలు భారత ఔషధ రంగానికి కొత్త అవకాశాలు తెరిచాయి. టారిఫ్ తగ్గింపులతో ఎగుమతులు పెరగనున్నాయి. ముఖ్యంగా యూకే మార్కెట్లో భారత జనరిక్ మందులకు మరింత పోటీ సామర్థ్యం లభించనున్నట్లు పీఐబీ పేర్కొంది. -
అమెరికా మాపై దాడిచేస్తే మేం భారత్పై బాంబులేస్తాం
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఛాందసవాదం, వితండవాదానికి పాకిస్తాన్ చిరునామా అని ఆ దేశ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మారోమారు నిరూపించారు. భారత్ మీద తమ అంతులేని విద్వేషాన్ని తన వాచాలత్వం ద్వారా బాసిత్ మరోమారు రుజువుచేసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం దక్షిణాసియాకు విస్తరించి అమెరికాగనక పాకిస్తాన్పై దాడి చేస్తే ప్రతిగా అమెరికాపై దాడిచేయాల్సిందిపోయి భారత్పై బాంబులేస్తామని బాసిత్ అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో పాకిస్తాన్ దౌత్యవర్గాల్లోనూ జిహాదీవాదం ఒంటబట్టించుకున్న వితండవాదులకు కొదవలేదని భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సీఎన్ఎన్–న్యూస్18తో జరిగిన ఒక చర్చావేదికలో బాసిత్ మాట్లాడారు. ‘‘యుద్ధంలో ఇరాన్పై ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్న పాకిస్తానే ఇజ్రాయెల్కు తదుపరి లక్ష్యంకావొచ్చు. ఇజ్రాయెల్ చెప్పుడుమాటలు వినే అమెరికాకు అప్పుడు పాకిస్తాన్ అణుకార్యక్రమాలు రుచించకపోవచ్చు. అప్పుడు పాకిస్తాన్పై అమెరికా దాడులు చేయొచ్చు. ఇలా జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ దాడి చేస్తే ప్రతిదాడి చేసే సత్తా పాకిస్తాన్కు ఉంది. అయితే ప్రతిదాడి కోసం అమెరికా ప్రధాన భూభాగం లేదా గల్ఫ్ లేదా ఇజ్రాయెల్పై మేం దాడిచేయడం కష్టమవుతుంది. అవన్నీ మాకు సుదూరంగా ఉన్నాయి. సమీప లక్ష్యం మీదే మేం దాడిచేయగలం. అలాంటి సమీప లక్ష్యం ఒక్క భారత్ మాత్రమే. ఏమాత్రం ఆలస్యంచేయకుండా ముంబై, న్యూఢిల్లీలపై దాడులుచేస్తాం. తర్వాత ఏం జరుగుతుందనే దానితో మాకు సంబంధంలేదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం’’అని అన్నారు. ‘‘మాపై దాడులు జరుగుతున్నప్పుడు మాకు కనిపించే ఏకైక మార్గం ఇండియానే. భారత్లోని మెట్రోపాలిటన్ నగరాలపై దాడులు చేస్తాం’’అని అన్నారు. దీంతో భవిష్యత్లో అమెరికాతో సంబంధాలు చెడిపోతే దాని విపరిణామాలను భారతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్లు బాసిత్ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శత్రుదేశం(అమెరికా)పై ఎదురుదాడి చేసే దమ్ములేక పొరుగుదేశంపై బాంబులేసే నిస్సహాయ పాకిస్తాన్ వైఖరి బాసిత్ మాటలతో బహిర్గతమైందని అంతర్జాతీయ రాజకీయవిశ్లేషకులు తప్పుబడుతున్నారు. ‘‘బాసిత్ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టేయడానికి వీల్లేదు. సైన్యం కనుసన్నల్లో నడిచే పాక్ ప్రభుత్వాల కుటిలనీతిలో నిర్లజ్జ నియమాలు ఎలా ఉంటాయో బాసిత్ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. యుద్ధం దక్షిణాసియాకు విస్తరిస్తే పాకిస్తాన్ పట్ల మనం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని బాసిత్ మాటలు హెచ్చరిస్తున్నాయి’’అని భారత నిఘా వర్గాలు సూచించాయి. -
అమెరికా తర్వాత మనమే..
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందంటే ముప్పు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ నిలిచింది. భారత్లో ఆంగ్లం మాట్లాడే డిజిటల్ వినియోగదారులు అధికంగా ఉండటం, ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు వేగంగా విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటా పేర్కొంది. ప్రస్తుతం ఈ ముఠాలు ఒక ప్రొఫెషనల్ వ్యాపార సంస్థల తరహాలో అత్యంత వ్యవస్థీకృతమై పనిచేస్తున్నాయని తెలిపింది.వీరు తమ లక్ష్యిత వ్యక్తులను గుర్తించడానికి, భారీ స్థాయిలో మోసాలకు పాల్పడటానికి సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారని 2026 ప్రథమార్థానికి సంబంధించిన అడ్వర్సరియల్ థ్రెట్ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కోట్లాది ఖాతాలకు చెక్.. కంపెనీ విధానాలను ఉల్లంఘించిన, అలాగే మోసాలు, మోసపూరిత పద్ధతులు అవలంబించిన వ్యక్తులు, ప్రమాదకరమైన సంస్థలకు చెందిన 15.9 కోట్ల పైచిలుకు అడ్వరై్టజింగ్ ఖాతాలను, 1.09 కోట్ల కంటే ఎక్కువ ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ ఖాతాలను, 6,00,000 ఫేస్బుక్ పేజీలను 2025లో తొలగించినట్టు మెటా ప్రకటించింది. గత ఏడాది మోసపూరిత అడ్వరై్టజింగ్ ఖాతాల్లో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే 92% తొలగించినట్టు తెలిపింది. కొత్త తరహా మోసాలు.. ప్రజల బలహీనమైన పరిస్థితులను, మానసిక ఆందోళనను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని మెటా తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తక్కువ ధరలో అద్దె ఇళ్ల కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ అద్దె ఇళ్ల ప్రకటనలను పోస్ట్ చేసే నెట్వర్క్లను పరిశోధకులు కనుగొన్నారు. మరో కలవరపరిచే ధోరణి ఏమంటే నకిలీ అంత్యక్రియల లైవ్స్ట్రీమ్ మోసాలు. ఇందులో అంత్యక్రియల సేవా నిర్వాహకులుగా నటిస్తూ ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారు. లేని స్మారక సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పి అందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని మెటా తెలిపింది.సులభంగా నేరాలు.. భారత్లో సైబర్ నేరాలకు సంబంధించిన ఆర్థిక నష్టాలు భారీగా పెరిగాయి. 2024లోనే అంచనా వేసిన నష్టాలు రూ.22 వేల కోట్లు దాటాయి. ఇది సైబర్ దాడుల తీవ్రతను నొక్కిచెబుతోంది. ప్రస్తుతం అనేక ఫిషింగ్ మోసాలు ఏఐ ద్వారా రూపొందించిన సందేశాలతో జరుగుతున్నాయి. దీనివల్ల వాటిని గుర్తించడం మరింత కష్టతరంగా మారుతోంది. జెనరేటివ్ ఏఐ వల్ల మోసగాళ్లకు నేరం చేయడం సులభతరమైంది.ఏఐ ఆధారిత యాప్స్తో.. వాస్తవికమైనవిగా భ్రమించేలా సందేశాలను, నకిలీ ప్రొఫైల్స్ను, అత్యంత క్లిష్టమైన ఫిషింగ్ వెబ్సైట్స్ను సృష్టించడానికి నేరగాళ్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. డీప్ఫేక్ సాంకేతికత అసలైన కంటెంట్కు, మార్చిన కంటెంట్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుగొనడం మరింత క్లిష్టతరం చేసింది. అశ్లీల చిత్రాలను రూపొందించే ఏఐ ఆధారిత యాప్స్ వెల్లువెత్తడం కూడా ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ సాధనాలతో వ్యక్తుల సమ్మతి లేకుండా నకిలీ నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా వ్యక్తుల గోప్యతకు, వ్యక్తిగత భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగి స్తున్నారు. వీటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరించి వేధింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి యాప్స్ను అరికట్టడానికి, వీటిని ప్రచారం చేసే లక్షలాది ప్రకటనలను తొలగించామని, ఆ సేవలను ప్రోత్స హించే అనేక ఖాతాలు, నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకున్నామని మెటా నివేదించింది.ఆగ్నేయాసియా నుంచి.. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న అనేక నెట్వర్క్లు ఆగ్నేయాసియాలోని మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత స్కామ్ కేంద్రాల నుంచి పనిచేస్తున్నాయి. మోసగాళ్ల ముఠాలు ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. వీరు నిరంతరం తమ ప్రాంతాలను మారుస్తూనే మోసపూరిత విధానాలను మరింత మెరుగుపరుస్తున్నారని మెటా వెల్లడించింది. -
టైటిల్ పోరుకు అనాహత్ సింగ్
ముంబై: జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్కే టైటిల్ లభించనుంది. ఎందుకంటే భారత్కే చెందిన ఇద్దరు ప్లేయర్లు అభయ్ సింగ్, వీర్ చోత్రాని ఫైనల్లోకి దూసుకొచ్చారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్, టాప్ సీడ్ అనాహత్ సింగ్ కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంకర్ అనాహత్ 11–6, 9–11, 11–8, 11–2తో భారత్కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్ హనా మొతాజ్ (ఈజిప్్ట)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో వీర్ చోత్రాని 11–7, 11–5, 5–11, 11–6తో సంజయ్ జీవా (మలేసియా)పై, అభయ్ సింగ్ 11–9, 9–11, 11–3, 11–8తో అమీòÙన్రాజ్ చందారన్ (మలేసియా)పై విజయం సాధించారు. -
యుద్ధం ఆగాలంటే.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నారంటే?
టెహ్రాన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ శనివారం ఫోనులో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పేజెష్కియన్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం రావాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలను నిలిపివేయాలని చెప్పారు. అలాగే ప్రాంత స్థిరత్వం కోసం బ్రిక్స్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు.ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు పేజెష్కియన్ పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన ప్రస్తావించారు.ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులను నిలిపివేయడం, ప్రాంతీయ, గ్లోబల్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం బ్రిక్స్ స్వతంత్ర పాత్ర పోషించాలని పేజెష్కియన్ కోరారు. భారతదేశం ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తావనకు తెచ్చారు.పశ్చిమాసియా దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటును కూడా పేజెష్కియన్ ప్రతిపాదించారు. విదేశీ జోక్యం లేకుండా శాంతి, స్థిరత్వం సాధించాలని సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రకటనలో బ్రిక్స్ గురించి ప్రస్తావించలేదు. అయితే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం ఇరాన్తో జరిగిన సంభాషణల్లో బ్రిక్స్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు.ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో తాను ఇటీవల ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. “ఇరాన్ విదేశాంగ మంత్రితో మరోసారి మాట్లాడాను. ద్వైపాక్షిక అంశాలు, బ్రిక్స్ సంబంధిత విషయాలపై చర్చించాం” అని తెలిపారు.హామీలు అవసరం: పేజెష్కియన్ ఘర్షణ తగ్గాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగాలని, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీలు అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఆయన అమానుషం, అనైతికం అని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదని, అన్యాయంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభించాయని మోదీకి పేజెష్కియన్ తెలిపారు. అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడుల్లో ఉన్నత స్థాయి నాయకులు, సైనికాధికారులు, పౌరులు మరణించారని, పాఠశాల పిల్లలు కూడా బలయ్యారని తెలిపారు. ప్రజా మౌలిక వసతులపై కూడా దాడులు జరిగినట్టు చెప్పారు. మినాబ్ ప్రాంతంలో ఒక పాఠశాలపై దాడి జరిగి 168 మంది పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడి సమీప దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచి జరిగినట్టు ఆరోపించారు. -
గుడ్న్యూస్.. రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొన్న వేళ రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాష్ట్రాలకు అదనంగా మరో 20 శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు తెలిపారు.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల 10 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను పెంచింది కేంద్రం. తాజాగా మరోసారి 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్/పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో నడిపే రాయితీ క్యాంటీన్లు/అవుట్లెట్లు, కమ్యూనిటీ కిచెన్లకు సరఫరా చూడాలని లేఖలో పేర్కొంది.మరోవైపు.. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నౌకల కదలికలు, పోర్టు కార్యకలాపాలు, భారతీయ సముద్ర కార్మికుల భద్రత, సముద్ర వాణిజ్య కొనసాగింపును నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ సముద్ర కార్మికులు అందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది. మొత్తం 22 భారత నౌకలు, 611 భారతీయ సముద్ర కార్మికులు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నారని, డీజీ షిప్పింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. -
Fact Check: ఇరాన్పై దాడికి భారత్లో యుఎస్ మిలటరీ బేస్?
ఇరాన్పై దాడులకు అమెరికా భారత భూభాగాన్ని వాడుకుంటుందన్న వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదని అవి పూర్తిగా అవాస్తవాలని తెలిపింది. ప్రస్తుతం మధ్యప్రాచ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్, అమెరికాలు పరస్పర దాడులతో తీవ్రకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు జరుపుతుంది. ఇదిలా ఉండగా టెహ్రాన్పై దాడులకు భారత భూభాగాన్ని యుఎస్ఏ వాడుకోనుందని LEMOA ఒప్పందాన్ని అనుసరించి కొంకణ్ తీరంలో అమెరికా తన స్థావరాలను ఏర్పాటు చేయనుందని కథనాలు ప్రచురితమయ్యాయి.దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదు. అవన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి ప్రకటనలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ అధికారిక ఖాతాలో పేర్కొందిLEMOA నేపథ్యంలాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (LEMOA) అనేది 2016లో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య కుదిరిన ఒక ద్వైపాక్షిక లాజిస్టిక్స్ ఒప్పందం. ఇది ఇరు దేశాల సాయుధ దళాలు ఒకరి సైనిక సౌకర్యాలను మరొకరు ఇంధనం నింపుకోవడానికి, మరమ్మతులకు, సరఫరాలకు విశ్రాంతికి తదితర సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తుంది. అయితే ఈ ఒప్పందం ఒకరి భూభాగంపై మరొకరు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు దానికి ప్రత్యేక ఆమోదం అవసరం. కానీ ఈ ఒప్పందం కింద అమెరికా మిలటరీ స్థావరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగగా భారత్ దానిని ఖండించింది. -
నయా ట్రెండ్.. లివింగ్ రిలేషన్ వైపు యువత..
-
యుద్ధ విరమణ మార్గాలేమిటి?
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం నాలుగవ వారంలోకి ప్రవేశించింది. అయినా ముగింపు సూచనలు కన బడటం లేదు సరికదా మరింత తీవ్రతర మవుతున్నది. యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల పైన, చమురు మార్కెట్ల పైన స్పష్టంగా కనపడుతున్నది. భారత దేశం కూడా ఈ జియో పొలిటికల్ చరంగంలో చిక్కుకున్నది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్ఫైన్స్, సింగపూర్, పాకిస్తాన్ వంటి దేశాలలోని సగటు పౌరులకు యుద్ధ సెగ తగులు తున్నది. సుమారుగా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది.యుద్ధాలను ప్రారంభించటం దేశాధినేతల చేతిలో ఉంటుంది కానీ ముగింపు మాత్రం వాళ్ల చేతుల్లో ఉండదని ప్రస్తుత సంక్షోభం సూచిస్తున్నది. ప్రారంభం నుండి కూడా యుద్ధ ‘అంతిమ లక్ష్యం’ ఏమిటనే దానిపై యూఎస్–ఇజ్రాయెల్ విధానంలో గందరగోళం కన్పడుతున్నది. ఇరాక్, అఫ్గాన్ యుద్ధాల్లో అగ్రశ్రేణి నాయకత్వాన్ని అంతమొందించి యూఎస్ఏ సులువుగా అక్కడి ప్రభుత్వాలను పడ గొట్టింది. ఇరాక్ అనుభవాల నేపథ్యంలో ఇరాన్ తన నాయకత్వాన్ని పూర్తిగా వికేంద్రీకరించినట్లు స్పష్టమవుతున్నది.ఇరాన్ వ్యూహంఅమెరికా–ఇజ్రాయెల్లు ఇరాన్ను తమ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నాయి. ఈ ముప్పు తప్పాలంటే మూడు లక్ష్యాలను నిర్దే శించుకున్నాయి: 1. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం. 2. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం. 3. ఇరాన్లో అధికారం మతతత్వ శక్తుల నుండి బాధ్యతా యుతమైన వర్గాలకు బదలాయింపు. ఈ మూడు లక్ష్యాలు కేవలం గగనతల యుద్ధం ద్వారా సాధించాలనుకోవటం అత్యాశ. వెని జులాలో మాదిరిగా అధ్యక్షుడిని తప్పించటంతో ప్రభుత్వం మారు తుందని ట్రంప్ భావించినట్లయితే అది హాస్యాస్పదం. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ఒక బలమైన రాజకీయ శక్తి. రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ బలమైన సాయుధ సంపత్తిని ఏర్పరచుకున్నది. రష్యా–చైనాలతో వ్యూహాత్మక సంబంధాలనుపెంపొందించుకున్నది. 2025 జూన్లో జరిగిన పన్నెండు రోజుల యుద్ధం తర్వాత ఒక సుదీర్ఘ పోరాటానికి సమగ్ర ప్రణాళికతో సున్నద్ధంగా ఉన్నట్లుగా కన్పిస్తున్నది. అందుకే ప్రస్తుత యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్ నేరుగా గల్ఫ్ దేశాలను ఈ యుద్ధం లోనికి లాగింది. ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. మధ్యప్రాచ్యంలో సంక్షోభానికి, పాలస్తీనా సంక్షోభానికి ముఖ్య కారణం యూఏఈ, సౌదీ, ఖతర్ వంటి దేశాలు యూఎస్ఏ కొమ్ముకాయటమేనని ఇరాన్ మొదటినుండీ వాదిస్తున్నది. యూఎస్ఏ మధ్యవర్తిత్వంతో అరబ్ దేశాలు 2020లో ఇజ్రా యెల్తో సంబంధాలు మెరుగు పరచుకోవటానికి ఒప్పందాలు (అబ్రహాం ఒప్పందాలు) చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా యూఏఈ, బహ్రెయిన్లు ఇజ్రాయెల్తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతర్ గత దశాబ్ద కాలంగా తమ ఆర్థిక వ్యవస్థలను కేవలం చమురు ఎగుమతులపై ఆధారపడకుండా పారిశ్రామికాభివృద్ధి, ఐటీ, పర్యాటక రంగం, బ్యాంకింగ్–ఫైనాన్స్ రంగాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తు న్నాయి. యూఎస్ఏ – ఐరోపా ఆర్థిక వ్యవస్థలతో తమ ఆర్థిక వ్యవ స్థలను అనుసంధానిస్తున్నాయి. ఇందులో భాగంగానే పాలస్తీనా (గాజా), ఇజ్రాయెల్ విషయాలలో కొంత మెతక లేదా పాశ్చాత్య సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ హమాస్ (గాజా), హెజ్బొల్లా (లెబనాన్), హౌతీ (యెమెన్) వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థలను పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో బాటుగా, లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో సౌదీ యువరాజు యూఎస్ఏ ఒత్తిడిని తట్టుకుని అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికీ నిరాకరించాడు.పోరాడితే పోయేదేమీ లేదు!ఇరాన్ – ఖతర్లలో విస్తరించిన దక్షిణ పార్స్ సహజ వాయువు నిల్వల క్షేత్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్దది. ఈ క్షేత్రం మీద దాడి ద్వారా ఇజ్రాయెల్ యుద్ధాన్ని క్లిష్ట దశలోనికి నెట్టివేసినట్లే. ఇప్పటి వరకూ యుద్ధంలో ఇరాన్ కొత్తగా ఆర్థికంగా నష్టపోయిందేమీ లేదు. ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా లక్ష్యాలను దెబ్బతీస్తున్నది. అమెరికా – ఇజ్రా యెల్ ఈ చౌక డ్రోన్లను, క్షిపణులను పేల్చి వేయటానికి అత్యంత ఖరీ దైన పేట్రియాట్, థాడ్ క్షిపణులను వాడాల్సి వస్తున్నది. ఈ రకంగా యూఎస్–ఇజ్రాయెల్లకు ఇది ఖరీదైన యుద్ధంగా పరిణమించింది.అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగటం ఇరాన్కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలోనే యూఎస్ మొదటగా ఇరాన్ చమురు ఎగుమతి కూడలి అయిన ఖర్గ్ దీవిపైనా, ఇజ్రాయెల్... ఇరాన్ ప్రధాన సహజ వాయువు క్షేత్రమైన దక్షిణ పార్స్ నిల్వలపైనా దాడి చేశాయి. ఆర్థికంగా ఇరాన్ను దిగ్బంధించటానికి ఈ ఎత్తుగడ. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయువుపట్టులపై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఖతార్ ప్రధాన ఎల్ఎన్జీ కేంద్రం ‘రస్ లఫాన్’పై దాడికి దిగింది. దీనివల్ల ఐరోపా దేశాలకు గ్యాస్ ఎగుమతికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అమెరికా– ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. అమెరికాలో కూడా ఇంధన ధరలు పెరిగిక్రమంగా ప్రజాభిప్రాయం యుద్ధానికి వ్యతిరేకంగా మారుతున్నది. రష్యాకు ఉపయుక్తంనిశితంగా పరిశీలిస్తే, యూఎస్–ఇజ్రాయెల్లకు ఈ యుద్ధాన్ని ముగించటానికి మార్గాలు చాలా తక్కువ. అవి కూడా క్లిష్టమైనవి. ఇరాన్ తనంత తానుగా బేషరతుగా లొంగిపోయి యుద్ధాన్ని విర మించే అవకాశాలు మృగ్యం. అమెరికా ప్రత్యేక దళాలను రంగంలోకి దించి, ఇరాన్ పాక్షికంగా శుద్ధి చేసిన యురేనియంను మెరుపు దాడిలో చేజిక్కించుకొని, ఆ సాకుతో యుద్ధ విరమణ చేయటం ఒక ప్రత్యామ్నాయం. కుర్ద్ తిరుగుబాటు దారులను ప్రోత్సహించి వారి ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయటం మరొక మార్గం. టర్కీ లేదా ఇరాక్ భూతల మార్గాల ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సైనిక బలగాలు ఇరాన్లో ప్రవేశించి ప్రభుత్వాన్ని కూలదోయటం అతిసంక్లిష్టమయిన ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయాలన్నింటిలో పెద్ద సంఖ్యలో యూఎస్/ఇజ్రాయెల్ సైనికులు చనిపోయే అవకాశా లున్నాయి. ఇవి వాటికి రాజకీయంగా ఆత్మహత్యా సదృశం. ఈ యుద్ధం ఒక రకంగా రష్యాకు ఉపయుక్తంగా మారినట్లుగా కన్పిస్తున్నది. రష్యా చమురు గ్యాస్కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. తప్పనిసరి పరిస్థితులలో రష్యా నుండి చమురు కొనుగోళ్ల ఆంక్షలను అమెరికా సడలించాల్సి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధంనుండి యూఎస్ఏ–ఐరోపా దృష్టి మరలటం కూడా రష్యాకు కలి సొస్తుంది. మధ్య ప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో రష్యా ప్రాపకం మరింతగా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే, అమెరికా ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో ఈ యుద్ధాన్ని ఒక భాగంగా పరిగణించవచ్చు. మధ్య ఆసియాలో ఇరాన్–ఇరాక్ సహజప్రాంతీయ శక్తులు. వీటిని బలహీనపరచటానికి యూఎస్ఏ మొదటి నుండి సౌదీ అరేబియా, యూఏఈలను బలోపేతం చేస్తున్నది. ఇదివరకు గల్ఫ్ యుద్ధంలో భాగంగా ఇరాక్ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ సందర్భంగా కూడా ఇరాక్లో అణ్వాయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్) ఉన్నాయని నింద మోపింది. ఏ రకమైన అణ్వా యుధాలు లేవని చివరకు ఒప్పుకొన్నది. ప్రభుత్వాల మార్పిడి, ముందస్తు దాడులు వంటి సిద్ధాంతాలను యూఎస్ఏ తన జియో పొలిటికల్ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్నది. ఇరాన్పై యుద్ధాన్ని కూడా ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు-గురజాల శ్రీనివాసరావు -
ఇంధన వనరులపై దాడులా?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కీలక ఇంధన వనరులపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘ప్రపంచమంతటినీ ఎంతగానో కలతకు గురి చేసే అంశమిది. ఇప్పటికే ఒడిదొడుకుల్లో ఉన్న అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను ఈ దాడులు మరింతగా దెబ్బ తీస్తాయి’’అంటూ ఆందోళన వెలిబుచ్చింది. ఇరాన్లోని సౌత్ పార్స్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడి, ప్రతీకారంగా ఖతర్లోని ఎల్ఎన్జీ క్షేత్రం రస్ లఫాన్తో పాటు సౌదీ అరేబియాలో అతి పెద్ద చమురు క్షేత్రమైన ఆరాంకోపైనా ఇరాన్ దాడులు కలకలం రేపడం తెలిసిందే. ఇవి భారత్ను తీవ్రంగా కలచివేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. పౌర సదుపాయాలు, ఇంధన వనరులపై దాడులు కూడదని భారత్ ముందునుంచీ చెబుతూనే వస్తోందని గుర్తు చేశారు. వాటికి తక్షణం తెర దించాలని గురువారం మీడియా సమావేశంలో ఆయన సూచించారు. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో 40 శాతానికి పైగా ఖతర్ నుంచి వస్తుండటం తెలిసిందే. దాడులు గర్హనీయం: మోదీ పశ్చిమాసియా తాజా పరిణామా లపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చా రు. ఈ విషయమై పలువురు దేశాధినేతలతో ఆయన వేర్వేరుగా సంభాషించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులను గురించి వారితో లోతుగా చర్చించారు. ఇంధన వ్యవస్థలపై దాడులు తీవ్రంగా గర్హనీయమన్నారు. ఉద్రిక్తతలకు తక్షణం తెర దించి శాంతి, సుస్థిరత పాదుగొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హార్మూజ్ జలసంధి గుండా సురక్షిత నౌకాయాన్ని తక్షణం పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వీటన్నింటికీ దౌత్యం, మధ్యవర్తిత్వమే మార్గాలని స్పష్టం చేశారు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు భారత్ అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. అధినేతలతో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టుల్లో ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా విషయమై ఆందోళనలతో వారంతా ఏకీభవించినట్టు తెలిపారు. ‘‘అబ్దుల్లా–2, తారిఖ్తో చర్చల సందర్భంగా జోర్డాన్, ఒమన్ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపా. ఇంధన వనరులపై దాడులను ఖండించా’’అని తెలిపారు. గత ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒమన్, జోర్డాన్ అధినేతలతో మోదీ సంభాషించడం ఇది రెండోసారి.పాక్ నైజమే అంత: భారత్న్యూఢిల్లీ: అణ్వాయుధాల వ్యాప్తికి, అధునాతన క్షిపణి వ్యవస్థల విస్తరణకు పాకిస్తాన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందంటూ ఒక నివేదికలో అమెరికా నిఘా వర్గాలు వెలిబుచ్చిన ఆందోళనతో భారత్ ఏకీభవించింది. ‘‘ఇలాంటి వేషాలు పాక్కు కొత్త కాదు. ఆ దేశం నైజమే అంత’’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ గురువారం ఎద్దేవా చేశారు. ‘‘ప్రపంచానికి పాక్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అమెరికా నివేదిక ఆ వాస్తవాన్ని మరోసారి అందరి ముందూ ఉంచంది’’ అని అభిప్రాయపడ్డారు. -
రస్ లఫాన్.. ఇండియాకు కీలకం
ఖతర్ పాలకుల దార్శనికతకు ప్రత్యక్ష రూపమే రస్ లఫాన్ సహజవాయు క్షేత్రం. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యంత అధునాతన సాంకేతికతతో సృష్టించిన అతిపెద్ద సహజవాయు ప్రాసెసింగ్ కర్మాగారంగా ‘రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీ’ ప్రఖ్యాతిగాంచింది. ఖతార్, ఇరాన్ మధ్యలోని పర్షియన్ గల్ఫ్ సముద్రగర్భంలో సహజవాయు నిక్షేపాలను కనుగొనేందుకు 1996లో రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీని నిర్మించారు. వీళ్ల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 1970 దశకంలో అపార సహజవాయు నిక్షేపాలను ఇక్కడి సముద్రగర్భంలో కనుగొన్నారు. ఇరాన్తో కలిసి గ్యాస్క్షేత్రాన్ని అభివృద్ధిచేసి ఖతర్ తన వాటాగా నార్త్ ఫీల్డ్ను తీసుకుంది. దీనినే నార్త్ డోమ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ 20 శాతం ద్రవరూప సహజవాయు అవసరాలను రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. తమ అ«దీనంలోని 900 ట్రిలియన్ల ఘనపు చదరపు అడుగుల (టీసీఎస్ఎఫ్) మేర సహజవాయువును రస్ లఫాన్ కాంప్లెక్స్ ద్వారా ఖతార్ ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇక్కడే భారీ నౌకలను నిలిపేందుకు వీలుగా ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నౌకాశ్రయాన్ని నిర్మించారు. దీంతో సీఎన్జీ కంటైనర్ షిప్లు నేరుగా ప్రాసెసింగ్ ప్లాంట్ల దాకా వచ్చి సరుకు నింపుకుని పయనమవుతాయి. ఇక్కడి నుంచి డజన్లకొద్దీ దేశాలకు ఎల్ఎన్జీ ఎగుమతి అవుతోంది. ఖతర్కు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ ప్రత్యక్షంగా భారత ద్రవరూప సహజవాయువు అవసరాలను తీరుస్తోంది. దోహా నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోని ఈ పారిశ్రామిక నగరమే భారత 45 శాతం లిక్విడ్ నేచురల్ గ్యాస్ అవసరాలను తీరుస్తోంది. ఖతర్ ఆర్థికవ్యవస్థ పునాదులను పెకళించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు పరోక్షంగా భారత్కు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఎరువులు, సీఎన్జీ, పీఎన్జీ అంతా ఇక్కడే.. భారత్లో దాదాపు 45 శాతం ఎరువుల తయారీ, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) అవసరాలు తీరాలంటే రస్ లఫాన్ క్షేత్రం నుంచి ద్రవరూప సహజవాయువు రావాల్సిందే. భారత్లో 34 శాతం ఎరువుల తయారీతోపాటు వాహనాల్లో సీఎన్జీకి, గృహావసరాలు తీర్చే పీఎన్జీకి రస్ లఫాన్ నుంచి దిగుమతి చేసుకునే ద్రవరూప సహజవాయవునే ఉపయోగిస్తున్నారు. పరిశ్రమల్లో పెట్రోరసాయనాల తయారీకి సైతం ఇదే ఎల్ఎన్జీ అవసరం. కొంతమేర భారత విద్యుత్ అవసరాలనూ ఇదే గ్యాస్ తీరుస్తోంది. అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి పోలిస్తే భారత్ రస్ లఫాన్ క్షేత్రం నుంచి ఎల్ఎన్జీ దిగుమతి చేసుకోవడమే అత్యంత చవకైన వ్యవహారం. అందుకే భారత్ దీనిపైనే అధికంగా ఆధారపడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2028లో భారత్లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న భారత్కు 2028లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహించే అవకాశం దక్కింది. నేటినుంచి పోలాండ్ వేదికగా ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026 ప్రారంభం కానుండగా... అంతకంటే ఒక్క రోజు ముందు గురువారం 2028 ఆతిథ్య హక్కులు భారత్కు దక్కినట్లు వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వెల్లడించింది. భువనేశ్వర్లో ఈ పోటీలు జరుగుతాయి. అయితే శుక్రవారం నుంచి జరిగే పోటీల్లో మన దేశం నుంచి ఒక్క అథ్లెట్ కూడా పాల్గొనడం లేదు! ఈ ఏడాది ఆరంభంలో ఈ ఆతిథ్య హక్కుల కోసం న్యూజిలాండ్తో పాటు భారత్ బిడ్ వేయగా... మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం సంతృప్తి చెందిన కౌన్సిల్ భువనేశ్వర్ను వేదికగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో జపాన్ (1999), ఖతర్ (2010), చైనా (2025) మాత్రమే ఈ చాంపియన్షిప్నకు ఆతిథ్యమివ్వగా... ఇప్పుడు భారత్ నాలుగో దేశంగా నిలవనుంది. -
హ్యాపినెస్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?
వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026 మార్చి 19న విడుదలైంది. ఈ నివేదికలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదో ఏడాది ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ రూపొందించిన ఈ నివేదికలో జీవన సంతృప్తి, సామాజిక మద్దతు, అవినీతి తక్కువ స్థాయిలు వంటి అంశాలు ప్రధానంగా పరిగణించబడ్డాయి.ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో ఐస్లాండ్ రెండో స్థానంలో, డెన్మార్క్ మూడో స్థానంలో నిలిచాయి. లాటిన్ అమెరికా దేశమైన కోస్టా రికా నాలుగో స్థానాన్ని సాధించడం విశేషం. ఇది ఆ దేశానికి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ర్యాంక్. స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వరుసగా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. భారత్ ఎక్కడ..?ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన 147 దేశాల జాబితాలో భారత్ 116 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రెండు స్థానాలు మెరుగుపడింది. 2025లో ఈ జాబితాలో భారత్ 118 స్థానంలో ఉండింది.చిట్టచివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్అతి తక్కువ సంతోషకరమైన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ దేశం 147వ స్థానానికి పరిమితం కాగా.. దానికి ముందు స్థానాల్లో నియెర్రా లియోన్, మాలావీ, జింబాబ్వే, బోట్స్వానా వంటి దేశాలు ఉన్నాయి.అమెరికాలో సంతోషం క్రమంగా తగ్గిపోతుంది..!వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026లో అమెరికా 23వ స్థానంలో నిలిచింది. గత కొద్ది రోజులుగా ఈ జాబితాలో అమెరికా ర్యాంక్ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. 2022లో 15వ స్థానంలో ఉండిన ఆ దేశం.. నాలుగేళ్లు తిరిగేసరికి 8 స్థానాలు దిగజారి 23వ స్థానానికి పడిపోయింది.ఈ జాబితాలో అమెరికా సహా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు ఒక్కటి కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. నార్డిక్ దేశాలు మళ్లీ అగ్రస్థానాలను ఆక్రమించాయి. ఈ దేశాల్లో సామాజిక మద్దతు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, తక్కువ అవినీతి వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని పెంచుతున్నాయని నిర్ధారించబడింది. కోస్టా రికా లాంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంస్కృతిక విలువలతో సంతోష సూచీలో గణనీయమైన పురోగతి సాధించాయి. అమెరికా, భారత్ వంటి పెద్ద దేశాలు సంతోష సూచీలో వెనుకబడటానికి ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక విభజన, రాజకీయ అస్థిరత వంటి అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ నివేదికలో సోషల్ మీడియా, టెక్నాలజీ ప్రభావం వెల్బీయింగ్పై ఎలా ఉందో ప్రత్యేకంగా విశ్లేషించారు. -
ఏఐలో భారత్కి ప్రత్యేక స్థానం: కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో భారత్కి విశిష్ట స్థానం ఉందని టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్ బాబక్ హోద్జాత్ తెలిపారు. డిజిటల్ సిస్టమ్లు, ప్రక్రియల గురించి అపార అవగాహన ఉన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం ఇందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.ఏఐ సిస్టమ్లను రూపొందించడంలో, వివిధ పరిశ్రమలవ్యాప్తంగా వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఈ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఏఐ సాధనాలతో కోడింగ్ సులభతరమవుతున్నప్పటికీ, ఔట్పుట్ నాణ్యతను మదింపు చేయడానికి డెవలపర్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన చెప్పారు.వివిధ రంగాలవ్యాప్తంగా మరింత మంది ప్రొఫెషనల్స్కి ఏఐ సాధికారత కల్పిస్తోందని వివరించారు. కంపెనీలు కృత్రిమ మేథ టెక్నాలజీలను వినియోగించుకోవడంలో సహకరించే దిశగా కాగ్నిజెంట్ ఇప్పుడు ఏఐ బిల్డర్ కంపెనీగా రూపాంతరం చెందిందని బాబక్ చెప్పారు.ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కంపెనీలో అంతర్గతంగా కోడ్ జనరేషన్లో ఏఐ వాటా సుమారు 30 శాతంగా ఉండగా, ఇది గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. -
ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. ఖతార్లోని అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ రాస్ లాఫ్ఫాన్పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ తమపై చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ దాడి చేసింది. అలాగే, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తుండడంతో భారత్ వంటి దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరులు ఉన్న దేశాలు ఇరాన్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఫ్యాక్టరీపై దాడి జరిగిన వెంటనే అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా ఎల్ఎన్జీ ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఖతార్పై ఇరాన్ దాడి మొదటి సారికాదు. మార్చి మొదటి వారంలో ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపింది. ఖతార్ గ్యాస్ క్షేత్రాలు, రాస్ లాఫ్ఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు.. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిగా జరిగినవని సమాచారం.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ నాయకత్వంపై వరుస దాడులు చేశాయి. తాజా దాడిలో గూఢచారి విభాగం అధిపతి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యాడు. ఇరాన్లో వేల సంఖ్యలో మరణాలు జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలను తగ్గిస్తోంది.భారత్పై ప్రభావం ఈ పరిస్థితులు భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో సుమారు 50 శాతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం ఖతార్ నుంచే వస్తుంది.“భారత్ తన సహజ వాయువు అవసరాల్లో 50% విదేశీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంది. అందులో సుమారు 40% ఎల్ఎన్జీ ఖతార్ నుంచి వస్తుంది. అంటే మొత్తం దిగుమతుల్లో దాదాపు 20 శాతం కతార్ నుంచే. భారత్ గ్యాస్ వినియోగాన్ని తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ రంగంలో వినియోగం తగ్గించాలి” అని ఇంధన ఆర్థిక నిపుణుడు కిరిట్ పారిఖ్ తెలిపారు.ప్రస్తుతం భారత్ రోజువారీ సహజ వాయువు వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 97.5 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు దేశీయంగా ఉత్పత్తి అవుతుంది.గత వారం నాటికి 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇది దిగుమతుల్లో భాగం. ఫోర్స్ మజ్యూర్ పరిస్థితుల వల్ల ఈ అంతరాయం జరిగింది. దీంతో ప్రభుత్వ గ్యాస్ సంస్థలు ఇతర సోర్సుల నుంచి ఎల్ఎన్జీ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. -
ముంబై నిద్రపోదు.. ఢిల్లీ త్వరగా లేవదు.. మన భాగ్యనగరం?
ఉరుకుల పరుగుల నగర జీవితంలో భారతీయులు ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఒక కీలక విషయాన్ని విస్మరిస్తున్నారు.. అదే ‘కంటినిండా నిద్ర’. తాజాగా వెలువడిన ఒక జాతీయ సర్వే నివేదిక ప్రకారం.. భారతీయ నగరాల్లో నిద్ర నాణ్యత ఆందోళనకరంగా పడిపోతోంది. ముఖ్యంగా ముంబై నగరం దేశంలోనే అత్యధికంగా నిద్రలేమితో సతమతమవుతుండగా, ఢిల్లీ వాసులు ఆలస్యంగా నిద్రలేవడంలో రికార్డు సృష్టించారు. మరి మన హెదరాబాద్ పరిస్థితి ఏమిటి?ఆరోగ్యానికి నిద్రే ప్రాణాధారంశారీరక ఆరోగ్యానికే కాకుండా, మెదడు పనితీరుకు, మానసిక స్థిరత్వానికి తగినంత నిద్ర అత్యవసరం. నిద్ర తక్కువైతే ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలంలో గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, ఆందోళన (Anxiety) వంటి సమస్యలకు దారితీస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా భారతీయులు నిద్రకు దూరమవుతున్నారు.నగరాల వారీగా నిద్ర తీరు తెన్నులుWakefit.co నిర్వహించిన తాజా సర్వే (జనవరి 2025 - మార్చి 2026 మధ్య) భారతీయ మెట్రో నగరాల్లో నిద్ర అలవాట్లపై ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.ముంబై (అత్యంత నిద్రలేమి నగరం): ముంబై వాసుల్లో 76.5 శాతం మంది అర్ధరాత్రి దాటాక నిద్రపోతున్నారు. దాదాపు 60 శాతం మంది పనివేళల్లో కూడా నిద్రతో తూగుతున్నట్లు సర్వే పేర్కొంది.హైదరాబాద్ (సమతుల్య నగరం): మన భాగ్యనగరం ఇతర మెట్రోలతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉంది. ఇక్కడ 42 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతుండగా, 31 శాతం మంది మాత్రమే నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్ని సర్వే 'బ్యాలెన్స్డ్ స్లీపర్ సిటీ'గా అభివర్ణించింది. ఢిల్లీ (ఆలస్యంగా మేల్కొనే నగరం): దేశ రాజధానిలో 45 శాతం మంది ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం.చెన్నై (క్రమశిక్షణ కలిగిన నగరం): నిద్ర వేళల విషయంలో చెన్నై వాసులు కొంత క్రమశిక్షణ పాటిస్తున్నారు. కేవలం 23.8 శాతం మంది మాత్రమే ఆలస్యంగా నిద్రలేస్తున్నారు.కోల్కతా (లేట్ నైట్ సిటీ): ఇక్కడ 75.5 శాతం మందికి రాత్రిపూట చాలా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంది.బెంగళూరు (నిద్ర వైరుధ్యం): ఐటీ హబ్లో 36.3 శాతం మంది అర్ధరాత్రి దాటాక పడుకుంటున్నారు. అయితే నిద్రలేచిన తర్వాత కూడా 54 శాతం మంది తాము విశ్రాంతి పొందినట్లు భావించడం లేదని వెల్లడయ్యింది.విలన్లుగా మారిన స్మార్ట్ఫోన్లుభారతీయులు నిద్రకు దూరం కావడానికి ప్రధాన కారణం డిజిటల్ వ్యసనమేనని సర్వే స్పష్టం చేసింది. దాదాపు 87.6 శాతం మంది పడుకునే ముందు మొబైల్ ఫోన్లు చూస్తున్నట్లు అంగీకరించారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, ఓటీటీలో బింజ్ వాచింగ్ వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్పాదకతపై పడుతోంది. సుమారు 57.8 శాతం మంది ఆఫీసు పనివేళల్లో నిద్ర వస్తోందని వాపోతున్నారు.ఆందోళనకర గణాంకాలుమరో జాతీయ స్థాయి సర్వే (89,000 మంది స్పందనలు) ప్రకారం 46 శాతం మంది భారతీయులు రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారు. రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోయే వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం.నిపుణుల సూచనలుమంచి నిద్ర కోసం రాత్రిపూట స్క్రీన్ టైమ్ తగ్గించాలని, సరైన సమయానికి భోజనం చేసి, బెడ్రూమ్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రను సమతుల ఆరోగ్యానికి ప్రాథమిక అవసరంగా గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు -
పురుషుల జట్టుకు సులువు మహిళల జట్టుకు క్లిష్టం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లకు భిన్నమైన ‘డ్రా’లు ఎదురయ్యాయి. 2022లో తొలిసారి థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత పురుషుల జట్టు ఈసారి స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం ఖాయం. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, కెనడా, ఆ్రస్టేలియా జట్లతో భారత్కు చోటు కల్పించారు. చైనాను మినహాయిస్తే కెనడా, ఆ్రస్టేలియా జట్లపై భారత్ విజయాన్ని ఊహించవచ్చు. రెండు విజయాలు సాధిస్తే భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది. మరోవైపు ఉబెర్ కప్లో భారత మహిళల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఆతిథ్య దేశం డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంటుంది. ఉక్రెయిన్పై టీమిండియా సులువుగా గెలవచ్చు. కానీ చైనా, డెన్మార్క్ జట్లపై భారత్ విజయావకాశాలు స్వల్పమే. ఈ నేపథ్యంలో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరాలంటే చైనా లేదా డెన్మార్క్ జట్లలో ఒకదానిపై ఖచ్చితంగా నెగ్గాలి. భారత మహిళల జట్టు 2014, 2016లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. రెండు విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొనే థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్లోని హోర్సెన్స్ నగరంలో జరుగుతుంది. 2024 థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీలో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో చైనా చేతిలో... భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో ఓడిపోయాయి. -
భారీ ఊరట : చైనాకు వెళ్లాల్సిన 7 రష్యా ట్యాంకర్లు భారత్వైపు
చైనాకు వెళ్లాల్సిన 7 చమురు ట్యాంకర్లు దక్షిణ చైనా సముద్రంలో యూ-టర్న్ తీసుకుని భారత్వైపు మళ్లడం అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కీలకంగా మారింది. రష్యా చమురు నౌకలు చైనా వైపు కాకుండా భారత్ వైపు మళ్లడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు. మాస్కో నుండి దిగుమతులను న్యూఢిల్లీ రెట్టింపు చేయడం ప్రారంభించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.దక్షిణ చైనా సముద్రం గుండా ప్రయాణిస్తూ, మొదట చైనాకు వెళ్లాల్సిన ఏడు రష్యన్ చమురు ట్యాంకర్లు అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకున్నాయి షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, 'ఆక్వా టైటాన్' అనే ఈ నౌక, జనవరి చివరలో బాల్టిక్ సముద్ర ఓడరేవు నుండి లోడ్ చేసుకున్న యురల్స్ కార్గో మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనుంది. సూయజ్మాక్స్ జౌజౌ ఎన్. భారతదేశంలోని సిక్కాకు మార్చి 25న చేరుకుంటుందని అంచనా.రష్యా నుండి కొనుగోళ్లను తాత్కాలికంగా పెంచుకోవడానికి భారతదేశానికి అమెరికా అనుమతి ఇచ్చిన కొద్ది రోజులకే, ఈ అఫ్రామాక్స్ నౌక మార్చి మధ్యలో చైనాలోని రిజావో ఓడరేవుకు చేరాల్సి ఉంది. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!ఎందుకిలా?రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా భారతదేశానికి 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల భారత్ ఎటువంటి ఆంక్షల భయం లేకుండా రష్యా చమురును దిగుమతి చేసుకునే అవకాశం కలిగింది. అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై యుద్ధం ప్రారంభించడంతో, ఇరాన్ ప్రతిచర్యగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేసింది. దీనివల్ల మధ్యప్రాచ్యం నుండి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ వ్యాప్తం చమురు సంక్షోభం ఏర్పడింది. ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగి, ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు 120 డాలర్లకు చేరుకుంది.ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఇంధన భద్రత కోసం భారత్ రష్యాపై మరింతగా ఆధారపడుతోంది.ఈ ఏడు ట్యాంకర్ల రాకతో దేశీయంగా పెరుగుతున్న చమురు ధరల నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని చైనాకు వెళ్లాల్సిన వనరులు ఇప్పుడు భారత అవసరాలకు ఉపయోగపడనున్నాయని అంచనా ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు


