uk
-
భారత్ గోలీ సోడాకు విదేశాల్లో ఫుల్ డిమాండ్..!
ఒకప్పుడు మనదేశంలో సంప్రదాయ పానీయంగా ప్రజల మన్ననలను పొందిన గోలీసోడా చూస్తుండగానే కనుమరుగైంది. పెప్సీ, మజా, కోకోలా వంటి ఆధునిక పానీయాల దెబ్బతో జనాలే వాటిని దరిచేరనివ్వలేదు. ఒకప్పుడు టప్ మని శబ్దంతో ఆకర్షణీయమైన దాని ప్యాకేజింగ్తో ప్రజల మన్నలను అందుకున్న పానీయం ఇది. 80,90లలో దీనిదే హవా. అంతలా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వేసవి దాహార్తిని తీర్చే పానీయంగానే కాకుండా కాస్త భోజనం అరగకపోయినా..కొద్దిగా సోడా తెగ్గుచుకుని తాగేవారు. అంతలా మనలో భాగమైన ఈ గోలీ సోడా మళ్లీ కొత్తగా వస్తూ ట్రెండ్గా మారింది. ముఖ్యంగా విదేశీయులు సైతం ఇష్టపడే పానీయంగా సరికొత్తగా వస్తోంది. పైగా అక్కడ దీని డిమాండ్ వెరేలెవెల్లో ఉంది. ఆ కథా కమామీషు ఏంటో చూద్దామా..!.మన భారత సంప్రదాయ పానీయమైన ఈ గోలీ సోడాకి అమెరికా, బ్రిటన్, యూరప్తో సహా గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉందని వాజిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్కడ విదేశీయులు ఎంతో ఇష్టపడుతున్నారని, కామర్స్ మంత్రి పియూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ఒకప్పటి ఐకానిక్ పానీయం గ్లోబల్ వేదికపై ప్రభంజనం సృష్టించేలా అమ్ముడుపోతోందని చెబుతున్నారు. దాని వినూత్న రీక్రీయేషనే అందుకు కారణమని, అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో దీనికి డిమాండ్ పెరిగిందని అన్నారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో దీనికి అతిపెద్ద రిటైల్ మార్కెట్ ఉందట. అంతేగాదు ఈ గోలిసోడా మార్కెట్కి సంబంధించి భారత్ సరసమైన ధరలతో వ్యూహాత్మక ఎగుమతుల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్మ్ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి డెవలప్మెంట్ అథారిటీ (APEDA) తెలిపింది. మన భారతీయులు సైతం ఈ గోలీసోడాను ఇష్టపడేది దాని వినూత్న రీతిలో ప్యాకేజ్ అయిన విధానమే. అదే విదేశీయలును కూడా ఆకర్షించడం విశేషం. అందులోనూ దాన్ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేక ఓపెనర్తో వచ్చే టప్ మనే పేలుడు శబ్దం.. మనల్ని ప్రేమగా గుర్తుంచుకునేలా చేస్తుంది. అదే ఇప్పుడు మళ్లీ ఇలా రీబ్రాండింగ్ అంర్జాతీయ మార్కెట్ని ఆకర్షించి ఆధునాత ఉత్పత్తిగా అవతరించింది. ఇది ఒకరంగా మన భారతీయ రుచులు అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పోటీపడగలవని ప్రూవ్ చేసింది. అంతేకాదండోయ్ ఈ సోడా మన దేశంలో కూడా మళ్లీ ఇదివరకటి రోజుల్లా అమ్ముడైలా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారట అధికారులు. ఇది చూస్తుంటే ఎప్పటికీ..ఓల్డ్ ఈ జ్ గోల్డ్ అన్న ఆర్యోక్తి గుర్తోస్తోంది కదూ..!.Bharat's very own GOLI POP SODA returns to wow tastebuds worldwide! 🇮🇳Kudos to @APEDADOC for promoting the revival of the traditional Indian Goli Soda.📖 https://t.co/Ask6n6YCCl pic.twitter.com/T7XZmc1xmc— Piyush Goyal (@PiyushGoyal) March 25, 2025(చదవండి: పెళ్లి సంగతి తర్వాత..కౌన్సిలింగ్ ఇప్పించండి..! ) -
మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..
కొన్ని రకాల మానసిక రుగ్మతలు చాలా భయానకంగా ఉంటాయి. ఓ పట్టాన వాటికి ఉపశమనం దొరకదు. మనిషి సంకల్పబలానికే పరీక్ష పెట్టేలా ఉంటాయి ఆ వ్యాధులు. కొందరు జయిస్తారు. మరికొందరు ఆ వ్యాధి పెట్టే బాధకు తలవొగ్గక తప్పని పరిస్థితి ఎదురవ్వుతుంది. అలాంటి దుస్థితిలోనే ఉన్నాడు ఈ 28 ఏళ్ల వ్యక్తి. ఇన్స్టాగ్రామ్ వేదిక తన వ్యథను పంచుకున్నాడు.బ్రిటన్ సంతతి ఘనా కళాకారుడు జోసెఫ్ అవువా-డార్కో మానసిక అనారోగ్యంతో జీవించడం కంటే ముగించేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాడు. అతడు మెదడుకి సంబంధించిన బైపోలార్ డిజార్డర్తో బాధపతున్నాడు. చట్టబద్ధంగా జీవితాన్ని ముగించేసేలా నెదర్లాండ్ దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్స్టా వేదికగా తెలిపాడు. అనాయస మరణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అనుమతి రావడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని అన్నాడు. ఎలాగో ఇంతటి జఠిలమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని.. 'ది లాస్ట్ సప్పర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించాడు. ఏంటంటే ఇది..తన చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతో అపరిచితులతో కనెక్ట్ అయ్యి వారితో విందులు ఆస్వాదించాలనేది అతడి కోరిక. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్త పర్యటనలకు పయనమయ్యాడు కూడా. ఇప్పటి వరకు అతడు పారిస్, మిలన్, బ్రస్సెల్స్, బెర్లిన్లలో 57 విందులను ఆస్వాదించాడు. వచ్చే ఏడాదికి 120 విందులతో కూడిన టూర్స్కి ప్లాన్ చేశాడు. దీనివల్ల తాను ఇతరులతో కనెక్ట్ అవ్వడమేగాక తనకు ఓ రుగ్మత ఉందనే విషయం మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతున్నాడట. మనల్ని ప్రేమించేవారు సంతోషంగా ఉండేలా వైద్య సహాయంతో పొందే ఈ అనాయస మరణం అహింసాయుతమైనదేనని చెబుతున్నాడు జోసఫ్. చివరగా తన బైపోలార్ సమస్య ఎంత తీవ్రతరమైనదో వివరించాడు. పొద్దుపొద్దున్నే లేవడమే ఓ నరకంలా ఉంటుందని, ప్రతి ఉదయం ఓ నరకమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగేళ్లకు పైగా బాగా ఆలోచించే ఇక ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు.. జోసఫ్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అతడి వ్యథను విన్న నెటిజన్లు అతని నిర్ణయాన్ని కొందరు గౌరవించగా, మరికొందరు నిర్ణయం మార్చుకో బ్రదర్..తమతో విందు షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకి సంబంధించిన మానిక్-డిప్రెసివ్ అనారోగ్యం. ఇది మానసిక స్థితి, శక్తి స్థాయిలలో తీవ్ర మార్పులకు కారణమవుతుంది. ఏటా చాలామంది ఈ రుగ్మత బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Joseph “Nana Kwame” Awuah-Darko 🇬🇭 (@okuntakinte) (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..! వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
చీటింగ్ యాప్ : భర్త ఫోన్లను ఎక్కువగా చెక్ చేస్తోంది ఈ నగరంలోనేనట!
భార్యాభర్తల బంధానికి పునాది నమ్మకం. పరస్పరం విశ్వాసమే ఏ బంధాన్నైనా పటిష్టంగా ఉంచుకుంది. ఆ నమ్మకం వమ్ము అయినపుడు అపోహలు, అనుమానాలకు తావిస్తుంది. పైగా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్ఫోన్లేనిదే క్షణం నడవదు. ప్రేమ మొదలు, షాపింగ్ దాకా అంతా అన్లైన్లోనే. అందుకే తమ భాగస్వాములను వ్యవహారాల్ని పసిగట్టేందుకు స్మార్ట్ఫోన్ను మించిన డిటెక్టర్ లేదు. దీనికి డేటింగ్ యాప్లుకూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే భర్త మొబైల్ ఫోన్ను చెక్ చేయాలనే కోరిక భార్యకు ఉంటుంది. భార్య ఫోన్లో ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరితో టచ్లో ఉందో అనే ఆరాటం కూడా భర్తలకు ఎక్కువగా. అన్నట్టు ఇది నేరుగా ఉండదు సుమా. గుట్టుచప్పుడు గాకుండా సాగుతుందన్నట్టు అచ్చం వాళ్లు మోసం చేస్తున్నట్టే. ఏదైనా తేడా వచ్చిందో... అంతే సంగతులు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తెలుసుకుందాం.CheatEye.ai నివేదిక ప్రకారం, మహిళలు తమ భాగస్వాములను అనుమానించే నగరంగా లండన్ నిలుస్తోంది. భార్యలు భర్తల ఫోన్లను ఎంత చెక్ చేస్తున్నారనే విషయంపై ఈ స్టడీ జరిగింది. లండన్లో జరిగిన టిండర్-సంబంధిత శోధనలలో 27.4శాతం మంది తమ భాగస్వామి గుట్టును వెలికితీయడంపై దృష్టి సారించారని ఇటీవలి విశ్లేషణలో వెల్లడైంది. ముఖ్యంగా, ఈ శోధనలలో 62.4శాతం తమ భర్తలు లేదా బాయ్ఫ్రెండ్లు డేటింగ్ యాప్ను రహస్యంగా ఉపయోగిస్తున్నారా అని నిర్ధారించుకోవడానికే ఈ యాప్లోకి వస్తున్నారట. ఇక లండన్ తరువాత మాంచెస్టర్ బర్మింగ్హామ్ తరువాతి టాప్ ప్లేస్లో నిలిచాయి. భాగస్వాములపై అనుమానంతో జరిగి టిండర్ చెకింగ్స్లో మాంచెస్టర్లో, 8.8శాతంగా బర్మింగ్హామ్లో 8.3శాతంగా ఉన్నాయి. అయితే, బర్మింగ్హామ్ లో 69 అనుమానాస్పద శోధనలు పురుష భాగస్వాములపై మహిళలే నిర్వహింనవే ఎక్కువట. గ్లాస్గో నగరం కూడా కూడా ఈ జాబితాలో కనిపించింది, 4.7శాతం టిండర్-సంబంధిత శోధనలు అవిశ్వాసం గురించి ఆందోళనలతో ముడిపడి ఉన్నాయి. ఈ స్కాటిష్ నగరంలో, 62.1శాతం మంది అనుమానాస్పద కార్యకలాపాలు పురుష భాగస్వాములను లక్ష్యంగా ఉన్నాయట. దీనికి ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా యువకులలో డేటింగ్ యాప్లకు పెరుగుతున్న ప్రజాదరణ కారణమని నిపుణురాలు సమంతా హేస్ విశ్లేషించారు."లండన్ వంటి నగరాల్లో, డేటింగ్ అనేది డైనమిక్గా ఉంటుంది. ఇది సహజంగానే భాగస్వాముల కార్యకలాపాలపై అనుమానం పరిశీలనకు దారితీస్తుంది" అని ఆమె వివరించారు. 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువకులు తమ భాగస్వాముల విశ్వసనీయత గురించి ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారని హేస్ తెలిపారు.ఇలాంటి సర్వే మన ఇండియాలో జరిగితే పరిస్థితి ఏంటి భయ్యా అంటున్నారు నెటిజన్లు. జర జాగ్రత్త భయ్యో అంటూ కమెంట్ చేస్తున్నారు వ్యంగ్యంగా. భార్యభర్తల మధ్య నమ్మకం ఉండాలి బ్రో.. మూడో వ్యక్తి రాకూడదు. అప్పుడ అది నూరేళ్ల బంధం అవుతుంది అంటున్నారు మరికొంతమంది. -
ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మెగాస్టార్ ఆగ్రహం
యూకే పర్యటనపై మెగాస్టార్ చిరంజీవి మరో ట్వీట్ చేశారు. తన పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని పోస్ట్ చేశారు. అయితే ఇదే క్రమంలో కొందరు డబ్బులు వసూలు చేశారని నాకు సమాచారం వచ్చిందన్నారు. అభిమానుల సమావేశాల పేరుతో ఇలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మెగాస్టార్ ట్విటర్లో రాసుకొచ్చారు. ఇలాంటి చర్యలకు తాను పూర్తిగా వ్యతిరేకమని చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సందేశమిచ్చారు. లండన్లో తనని కలిసేందుకు ఫ్యాన్స్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.చిరు తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన అభిమానులారా.. యూకేలో నన్ను కలవాలనుకునే మీ అందరి ప్రేమ, ఆప్యాయత నా మనస్సును తాకింది. అయితే కొంతమంది వ్యక్తులు అభిమానుల సమావేశాల కోసం డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు సమాచారం అందింది. ఇలాంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరైనా డబ్బులు వసూలు వస్తే వెంటనే వారికి తిరిగి ఇవ్వండి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్కడా కూడా ఇలాంటి చర్యలను అనుమతించను. మీ ప్రేమ, ఆప్యాయత, బంధం వెలకట్టలేనిది. దీన్ని ఎవ్వరూ ఏ విధంగానూ వ్యాపారంగా మార్చలేరు. ఇలాంటి దోపిడీకి దూరంగా ఉందాం' అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో మెగాస్టార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.(ఇది చదవండి: నా హృదయం సంతోషంతో నిండిపోయింది: మెగాస్టార్ చిరంజీవి)కాగా.. చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. My Dear Fans , I am deeply touched by all your love and affection in wanting to meet me in UK. However, I’ve been informed that some individuals are attempting to charge a fee for the fan meetings. I strongly condemned this behaviour. Any fee collected by any one will be refunded…— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025 -
ట్రంప్ ప్రతిపాదనతో ఆటలొద్దు
లండన్: ఉక్రెయిన్– రష్యా మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందంతో ఆటలాడొద్దని రష్యా అధినేత పుతిన్ను యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ హెచ్చరించారు. పుతిన్ నిజంగా శాంతిని కోరుకుంటే అది చాలా సులభంగా సాధ్యమవుతుందని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని, ఉక్రెయిన్పై వెంటనే దాడులు నిలిపివేయాలని చెప్పారు. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. 30 రోజులపాటు కాల్పుల విరమణ పాటించాలంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన చక్కటి ప్రతిపాదనకు రష్యా ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని మండిపడ్డారు. శాంతియుత పరిస్థితులు నెలకొనడం పుతిన్కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఇలాగే మొండిగా వ్యవహరిస్తే రష్యాపై ఆర్థిక ఆంక్షలు తీవ్రతరం చేస్తామని, అప్పుడు మరో గత్యంతరం లేక ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించక తప్పదని వెల్లడించారు. ఉక్రెయిన్తో చర్చలకు పుతిన్ సిద్ధమైతే, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా కొనసాగేలా తాము బాధ్యత తీసుకుంటామని స్టార్మర్ తెలిపారు.ఆయన శనివారం యూరప్తోపాటు మిత్రదేశాల అధినేతలతో వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ భేటీలో 25 దేశాల నేతలు పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై, పుతిన్ వైఖరిపై చర్చించారు. రెండు దేశాల మధ్య శాశ్వతంగా శాంతి నెలకొనాలని ఈయూ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాలన్నీ కోరుకుంటున్నట్లు స్టార్మర్ తెలిపారు. రష్యా మెడలు వంచడానికి అవసరమైతే సైన్యాన్ని సైతం రంగంలోకి దించడానికైనా సిద్ధమేనని సంకేతాలిచ్చారు. ప్రాక్టికల్ ప్లానింగ్తో ‘ఆచరణ దశ’ప్రారంభించేలా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు.వర్చువల్ సమావేశంలో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, రష్యా మొండి వైఖరితో ఆగిపోయిందని జెలెన్స్కీ విమర్శించారు. కాల్పుల విరమణను అడ్డుకోవడానికి రష్యా కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, శాంతి కోసం మరింత చొరవ తీసుకోవాలని యూరప్ దేశాలు నిర్ణయానికొచ్చాయి. కాల్పుల విరమణకు అంగీకరించేలా పుతిన్పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఏం చేయాలన్న దానిపై చర్చించడానికి యూరప్ దేశాల మిలిటరీ ప్లానింగ్ సమావేశం వచ్చేవారం జరగబోతోంది. -
కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా.. నొప్పి తెలియదట ఆమెకు..!
ఓ పట్టాన అంతుచిక్కని కొన్ని రకాల వ్యాధులు వైద్యులకు భలే గమ్మత్తైన సవాళ్లని విసురుతుంటాయి. ఒక్కోసారి అదెలా సాధ్యం అని వైద్యులకే చెమటలు పట్టించేస్తాయి. అచ్చం అలాంటి వైద్య పరిస్థితితోనే పోరాడుతోంది ఈ చిన్నారి. వైద్యపరంగా ఆమె ఓ అద్భుతంగా మారింది. ప్రతి వ్యక్తి మనుగడకు, ఆరోగ్యానికి ప్రధానమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే బతికేస్తుంది ఆమె. మరీ ఆ చిన్నారి ఎలాంటి వైద్యపరిస్థితితో బాధపడుతోందంటే..యూకేకి చెందిన ఒలివియా పార్న్స్వర్త్ అనే అమ్మాయి అరుదైన జన్యుపరమైన సమస్యతో పోరాడుతోంది. ఆ ప్రత్యేకమైన పరిస్థితి కారణంగా వైజ్ఞానికంగా అద్భతమైన అమ్మాయిగా మారిందామె. ప్రపంచంలో ప్రతి మానవుడికి కీలమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే జీవించగలదామె. సింపుల్గా చెప్పాలంటే ఆమె ఆ మూడు సవాళ్లను ఒకేసారి అధిగమించగల అసాధారణ అమ్మాయి. అంతెందుకు వైద్యులు కూడా ఆమెను ఓ ఆద్బుతంగా పరిగణించారు. ఏంటా వైద్యపరిస్థితి అంటే..ఒలివియాకి నొప్పి, ఆకలి, నిద్ర అనేవి ఉండవట. ఇది మనిషిలో ఉండే ఆరవ క్రోమోజోమ్లోని జన్యుపరమైన అసాధారణత ఫలితంగా ఆమెకు ఇలాంటి పరిస్థితని వైద్యలు భావిస్తున్నారు. ఒకరకంగా ఇది వరంలా కనిపించినా ఆమెకు ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే అనే ఒలివియా తల్లి ఆవేదనగా చెప్పారు. ఈ మూడింటి ఫీలింగ్స్ ఆమెకు తెలియదు కాబట్టి ఏ క్షణంలో తనను తాను ఎలా గాయపరుచుకుంటుందో అనే భయపడుతూ బతకాల్సి వస్తోందంటూ కన్నీటి పర్యాంతమైంది ఒలివియా తల్లి. ఇక ఆమెకు ఆకలి ఉండదు కాబట్టి ఆమె పోషకాహార లోపంతో బాధపడకుండా మంచి ఆహారాన్ని ఇచ్చేలా పర్యవేక్షించక తప్పదని చెబుతోంది. అంతేగాదు ఒలివియాకు ఏడేళ్ల వయసులో జరిగిన ప్రమాదం గుర్తించేసుకుంటూ..నాడు తామంతా ఒలివియా పరిస్థితి చూసి కంగుతిన్నామని చెప్పింది. ఆమె చిన్నతనంలో ఓ కారు ఆమెను ఢీకొట్టి చాలాదూరం ఈడ్చుకుని వెళ్లిపోయిందని నాటి ఘటనను వివరించారు. ఒళ్లంతా నెత్తురోడుతున్న...ఆ ఆకస్మిక ఘటనకు మా కుటుంబం అంతా షాక్లో ఉండిపోయింది. కొద్దిపాటి మెరుపు వేగంలో తేరుకుని ఒలివియాను రక్షిద్దాం అనుకునేలోగా ..ఒలివియా ఏమి కానట్లుగా తనంతాట తానే లేచి తమ వద్దకు రావడంతో హుతాసులైపోయాం అంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారామె. ఒంటినిండా గాయలైనా ఏం కానట్లు ఒలివియా ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేనంటోంది తల్లి. "ఒలివియాకి నిద్ర కూడా ఓ సవాలు. ఎందుకంటే మందులు లేకుండా సహజంగా నిద్రపోలేదు. మనం గనుక మందులు వేయకపోతే అలా మూడు రోజుల వరకు మేల్కొనే ఉంటుందట. ఆ నిద్రలేమిని నిర్వహించేలే కఠినమైన నిద్ర సహాయాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు". ఒలివియా తల్లి. ఆ అమ్మాయి పరిస్థితిని ఆస్పత్రి వారు బయోనిక్గా అబివర్ణించారు. ఈ అరుదైన కేసు జీవశాస్త్రం సంక్లిష్టతలు, జన్యుఉత్పరివర్తనాల ప్రభావంపై అంతర్దృష్టిని అందిస్తోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఆ అమ్మాయి కేసు తమ వైద్యానికే అంతపట్టని చిక్కుప్రశ్నలా ఉందన్నారు. ఒలివియా పరిస్థితిని ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాటిలో ఒకటిగా పేర్కొన్నారు. నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి వైద్య నిపుణులకేకాదు సాధారణ ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంది కదూ..!.(చదవండి: కిడ్నీలు పదిలమేనా..? మదుమేహం లేకపోయినా వస్తుందా..?) -
ఇన్స్టాగ్రామ్ పరిచయం.. భారత్కు రావడమే ఆమెకు శాపమైంది
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ఢిల్లీకి వచ్చిన విదేశీయురాలిపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం..భారత్కు చెందిన కైలాష్తో ఇన్స్టాగ్రామ్లో ఇంగ్లాండ్కు చెందిన మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో, ఆమెను భారత్కు రావాల్సి కైలాష్ కోరారు. దీంతో, ఆమె.. మహారాష్ట్ర, గోవాలో పర్యటించేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడ పర్యటనలో ఉండగా ఆమె.. కైలాష్కు ఫోన్ చేసి తన దగ్గరకు రావాలని కోరింది. అయితే, తాను అంత దూరం ప్రయాణించలేనని కైలాష్.. ఆమెకు చెప్పాడు. ఢిల్లీకి రావాలని ఆమెకు కైలాష్ సూచించారు.ఈ క్రమంలో బాధితురాలు మంగళవారం ఢిల్లీకి చేరుకుంది. అనంతరం, మహిపాల్పూర్లోని ఒక హోటల్లో బస చేసింది. ఆ తర్వాత ఆమె.. కైలాష్కు ఫోన్ చేసి తాను హోటల్లో ఉన్నట్టు తెలిపింది. దీంతో, కైలాష్ తన స్నేహితుడు వసీంతో కలిసి హోటల్కు వెళ్లారు. రాత్రి వారిద్దరూ అక్కడే బస చేశారు. అదే అదునుగా భావించిన వసీం.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో మరుసటి రోజు ఉదయమే బాధితురాలు.. మహిళ వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కైలాష్, వసీంను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. అలాగే, మార్గదర్శకాల ప్రకారం.. ఈ ఘటనపై బ్రిటిష్ హైకమిషన్కు సమాచారం అందించారు. ఇక, కైలాష్ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిసింది. తనకు ఇంగ్లీష్ మాట్లాడటం కష్టమని, తనతో కమ్యూనికేట్ చేయడానికి గూగుల్ ట్రాన్స్లేట్ ఉపయోగించేవాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది.British Woman Allegedly Raped In Delhi Hotel By Man She Met on Instagram @anushkagarg2000 reports pic.twitter.com/kGI9dWxwJ2— NDTV (@ndtv) March 13, 2025 -
మరణశయ్యపై తల్లి.. కూతురి దుర్మార్గంపై కోర్టు కన్నెర్ర
కన్నతల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ కూతురేమో దుర్మార్గంగా ఆలోచించింది. ఆస్తి కోసం బలవంతంగా ఆమెతో వీలునామాపై సంతకం చేయించుకుంది. అయితే సాక్ష్యంగా ఉంటుందని ఆ కూతురు తీయించుకున్న వీడియోనే.. ఈ బండారం మొత్తాన్ని బయట పెట్టింది. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది . యూకేలో ఓ వ్యక్తి మూడేళ్లపాటు చేసిన న్యాయ పోరాటం.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. సోదరుడిని మోసం చేసి ఆస్తి కొట్టేయాలని భావించిన ఓ మహిళకు పెద్ద షాకే తగిలింది. అతనికి 7 లక్షల పౌండ్ల విలువైన(మన కరెన్సీలో రూ.7 కోట్ల 86 లక్షల దాకా) విలువైన ఆస్తిపాస్తుల్లో సగం సోదరుడికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.కేసు ఇదే..మార్గరేట్ బేవర్స్టాక్(76) అనే మహిళ 2021 మార్చిలో కన్నుమూసింది. చనిపోయే టైంలో ఆమె తన ఆస్తి మొత్తం కూతురు లీసా పేరిట రాసింది. కొడుకు జాన్కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్న తన తల్లి.. సోదరికి మాత్రమే ఆస్తి ఎలా రాయగలిగిందని అతనికి అనుమానం వచ్చింది. ఆస్తిలో వాటా కోరుతూ.. సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టులో పిటిషన్ వేశాడు.తన తల్లి 2014 నుంచే మతిమరుపు వ్యాధితో బాధపడుతోందని, ఆ వీలునామాపై అనుమానాలు ఉన్నాయని వాదించాడతను. అయితే తల్లి తన పేరిట రాసిన వీలుకు సంబంధించిన వీడియోను లీసా కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి జేన్ ఇవాన్స్.. లీసాను గద్దించారు. అది బలవంతంగా చేయించుకున్నదేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టంగా మాట్లాడుతోంది. పైగా పెన్నును ఆమెతో బలవంతంగా పెట్టించుకున్నట్లు కనిపిస్తోంది. వీలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన కాపీలా ఉంది అని జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.జడ్జి కన్నెర్ర చేయడంతో లీసా నిజం ఒప్పుకుంది. అది ఆమె చనిపోతున్న సమయంలో తీసిందని తెలిపింది. తల్లికి ఉన్న ఆ జబ్బును ఆసరా చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని ప్రయత్నించినట్లు చెప్పింది. సాక్ష్యంగా ఉండాలని ఆ టైంలో వీడియో కూడా తీయించుకున్నట్లు తెలిపింది. దీంతో ఆస్తిలో సగం వాటా.. సోదరుడు జాన్కు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. జాన్కు అయిన కోర్టు ఖర్చులను కూడా లీసానే భరించాలని ఆదేశించింది. -
జైశంకర్ పర్యటనలో ఖలిస్థానీల అత్యుత్సాహం.. ఖండించిన యూకే
లండన్ : యూకే పర్యటలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ వాహనంపై ఖలిస్థానీ మద్దతుదారులు జరిపిన దాడి యత్నాన్ని యూకే ఖండించింది. ఈ సందర్భంగా బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ (FCDO) అధికారికంగా స్పందించింది."యూకే చాఠమ్ హౌస్ బయట భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కారుపై దాడి యత్నాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. యూకే శాంతియుత నిరసన హక్కును గౌరవిస్తుంది. కానీ ఇలా దాడులకు యత్నించడం, బెదిరించడం, ప్రజా కార్యక్రమాల్ని అడ్డుకోవడం సరైందని కాదని’ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.మరోవైపు లండన్ మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు సైతం జైశంకర్పై జరిగిన దాడి యత్నాన్ని ఖండించాయి. నిందితులపై చర్యలు తీసుకున్నామని పేర్కొంది. మా అతిథుల భద్రతను పర్యవేక్షించడం, వారి సంరక్షణ బాధ్యతలకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నామని మరో ప్రకటనలో స్పష్టం చేసింది. -
జైశంకర్పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నం.. ఖండించిన భారత్
ఢిల్లీ : లండన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కారుపై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. అయితే, ఈ దాడిని భారత్ ఖండించింది. భద్రతా లోపంపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.మంత్రి జై శంకర్ బుధవారం రాత్రి లండన్లోని ఛాఠమ్ హౌస్లో నిర్వహించిన అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగించుకొని బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు ఆయన కారుపై దూసుకువచ్చారు. పలువురు భారత జాతీయ జెండాలను చించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారువైపు దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేర్పాటువాదులు, తీవ్రవాదుల రెచ్చగొట్టే చర్యలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని మేం త్రీవంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం వారి దౌత్యపరమైన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది.🚨 Breaking: In London, a Khalistan protester tries to assault EAM S Jaishankar and shreds the Indian flag | Watch the video. pic.twitter.com/HRGcMAgDGt— Indian InSight (@IndianInsight_) March 6, 2025 -
మెగాస్టార్కు ఆ దేశ పౌరసత్వం.. ఆయన టీమ్ ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మువీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్లో చిరు సందడి చేశారు. అయితే తాజాగా మెగాస్టార్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరుకు యూకే గౌరవ పౌరసత్వం అందించనుందని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ టీమ్ స్పందించింది. ఇటీవల ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన చిరంజీవి తాను లండన్ వెళ్తన్నట్లు చెప్పడంతో ఈ ఈ వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందన్న వార్తలు అవాస్తవమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు రాసేముందు ముందుగా ధృవీకరించుకోవాలని తెలిపింది. విశ్వక్ సేన్ మూవీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ లండన్ వెళ్లనున్నట్లు తెలిపారు. లండన్లో ఓ ఈవెంట్లో తనకు సన్మానం జరగనుందని మెగాస్టార్ తెలిపారు. దీంతో కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో సిటిజెన్షిప్ గురించే లండన్ వెళ్తున్నారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా.. చిరంజీవి చివరిసారిగా భోలా శంకర్లో కనిపించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర్ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో చిరు జతకట్టనున్నారు. -
పిలిచి మరీ ఉద్యోగం ఇస్తానంటే ఇలా చేస్తారా?.. రిక్రూటర్కు చిర్రెత్తి..
నేను పిలిచి జాబిస్తానంటే ఇలా చేస్తారా? అంటూ ఓ ఉద్యోగిపై అప్పుడే ఇంటర్వ్యూ చేసిన రిక్రూటర్ (recruiter) అసహనానికి గురయ్యాడు.ఆ తర్వాత ఏం చేశాడంటే?లండన్కు చెందిన ఓ రిక్రూటర్ లింక్డిన్ (LinkedIn)లో ఓ పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్లో తన పగిలిపోయిన కీబోర్డును షేర్ చేస్తూ..చివరి క్షణంలో అభ్యర్థి జాబ్ ఆఫర్ను తిరస్కరించాడు. దీంతో కోపం కట్టలు తెచ్చుకుంది. వెంటనే ఈ కీబోర్డును పగులగొట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే? లింక్డిన్ పోస్ట్ ప్రకారం..రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ ఏతాన్ మూనీ (Ethan Mooney) ఇటీవల ఓ అభ్యర్థికి రెండో రౌండ్ ఇంటర్వ్యూ చేసేందుకు సిద్ధమైంది. కన్ఫామ్ అయితే జాబ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రిక్రూటర్.. అభ్యర్థికి రెండో రౌండ్ ఇంటర్వ్యూ చేసేందుకు ఉదయం 9:30 గంటలకు షెడ్యూల్ సిద్ధం చేశారు.సమయం 9:30 దాటింది. కానీ అభ్యర్థి ఇంకా ఇంటర్వ్యూకి అటెండ్ కాలేదు. అరంగంటైంది. రిక్రూటర్లో అసహనం ఎక్కువైంది. సరిగ్గా ఆ సమయంలో సదరు రిక్రూటర్కు ఓ మెసేజ్ వచ్చింది. సారీ సార్.. ‘నేను మీకు కంపెనీ ఇంటర్వ్యూకి రావడం లేదు. నాకు వేరే సంస్థలో ఉద్యోగం వచ్చింది. మీ జాబ్ ఆఫర్ను తిరస్కరిస్తున్నాను థ్యాంక్యూ’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో రిక్రూటర్కు చిర్రెత్తి పక్కనే ఉన్న కంప్యూటర్ కీబోర్డును పగుల గొట్టాడు. నిజం చెప్పాలంటే, ఆ సమయంలో నాకు ఈ కీబోర్డు కనిపించలేదు. రిక్రూటర్లు.. ఉద్యోగార్థుల గురించి పట్టించుకోరు అని ఎవరైనా అంటారు? అని కామెంట్ చేస్తూ పగిలిన కీబోర్డు ఫొటోల్ని షేర్ చేశారు. ఈ ఘటన నెట్టింట్లో చర్చకు దారి తీసింది. కొందరు ఇంటర్వ్యూ జరిగే సమయంలో అభ్యర్థి రాకపోతే హైరింగ్ ప్రాసెస్లో తలెత్తే ఇబ్బందుల్ని ప్రశ్నిస్తుంటే మరికొందరు..రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ ఏతాన్ మూనీకి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. -
గర్భిణి అని జాబ్లోంచి తీసేశారు..! కట్చేస్తే..
ఓ ప్రెగ్నెంట్ మహిళ వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతి ఇవ్వాల్సిందిగా తన బాస్ని అభ్యర్థించింది. అనుమతి మంజూరు చేయకపోగా నిర్థాక్షిణ్యంగా ఉద్యోగంలో తొలగించాడు. కేవలం ఆమె కడుపుతో ఉన్నందుకే ఉద్యోగం లోంచి తీసేశారు. దీంతో ఆమె ఉపాధి ట్రిబ్యూనల్ కోర్టుని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం సదరు కంపెనీకి దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చింది. ఇంతకీ ఏమని తీర్పు ఇచ్చిందంటే.యూకేకి చెందిన ప్రెగ్నెంట్ మహిళ పౌలా మిలుస్కా తాను ఇంటి నుంచి పనిచేస్తానంటూ బర్మింగ్హామ్లోని తన కంపెనీ రోమన్ ప్రాపర్టీ గ్రూప్ లిమిటెడ్ని అభ్యర్థించింది. తన కంపెనీ హెడ్ అమ్మర్ కబీర్కి టెక్స్మెసేజ్లో తన సమస్యలను వివరిస్తూ కోరింది. గర్భిణిగా ఉన్నప్పుడూ మహిళలకు ఉండే మార్నింగ్ సిక్నెస్(వికారం, వాంతులు) తదిరతర కారణాల దృష్ట్యా మహిళా ఉద్యోగి మిలుస్కా వర్క్ ఫ్రమ్ ఇవ్వాల్సిందిగా తన బాస్ని కోరింది. అందుకు ప్రతిగా కబీర్ నిన్ను ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తున్నాం అంటూ జార్జ్ హ్యాండ్స్తో కూడిన ఎమోజీలతో అవమానిస్తున్నట్లుగా రిప్లై ఇచ్చాడు. మిలుస్కా తన బాస్ నుంచి వచ్చిన ఈ అనుహ్యమైన ప్రతిస్పందనకి దిగ్బ్రాంతి చెందుతుంది. ఆమె ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్. అక్టోబర్ 2022లో తాను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న తర్వాత నుంచి గర్భిణి మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలనే ఫేస్ చేసింది.వీటిని తట్టుకోలేక తాను ఇంటి నుంచే పనిచేయాలని భావించి తన కంపెనీ బాస్కి తన సమస్యను వివరిస్తూ..మెసేజ్ పెట్టింది. అయితే అతడి నుంచి ఇలా ఊహించిన విధంగా సమాధానం రావడంతో జీర్ణించుకోలేకపోయింది మిలస్కౌ. దాంతో ఆమె యూకే ఉపాధి ట్రిబ్యునల్ని ఆశ్రయించింది. తాను గర్భంతో ఉన్నాన్న కారణంతోనే ఉద్యోగం నుంచి తొలగించినట్లు కోర్టుకి విన్నవించుకుంది. అయితే న్యాయస్థానం ఈ కేసుని విచారించి ఆమె తగిన పరిహారం మంజురయ్యేలా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో కోర్టు ఇరువురి మధ్య జరిగిన సంభాషణను విచారించి.. కేవలం ఆమె గర్భిణి కావడంతోనే ఉద్యోగం నుంచి నిర్థాక్షిణ్యంగా కంపెనీ రోమన్ ప్రాపర్టీ గ్రూప్ లిమిటెడ్ తొలిగించినట్లు తేల్చింది. అయితే సదరు కంపెనీ వ్యాపార ఇబ్బందులు, కార్యాలయంలో ఉద్యోగి అవసరం తదితరాల దృష్ట్యా టెక్స్ట్ మెసేజ్ ద్వారా తొలగించామే గానీ మరే ఉద్దేశ్యం లేదని వివరణ ఇచ్చింది. అయితే అదంతా కేవలం సాకు మాత్రమే అంటూ కొట్టిపారేసింది ట్రిబ్యూనల్. అంతేగాదు బాధిత మహిళ మిలుస్కాకు అన్యాయానికి పరిహారంగా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ట్రిబ్యూనల్ పేర్కొంది.(చదవండి: ఢిల్లీ తొక్కిసలాట ఘటన: ఆ ఐదుగురు మృతికి కారణం ఇదే..! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
టాటా గ్రూప్ చైర్మన్కు యూకే ప్రతిష్టాత్మక పురస్కారం
టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్కు యూకే ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. యూకే, భారత్ వ్యాపార సంబంధాల బలోపేతానికి చేసిన కృషిని గుర్తిస్తూ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (సివిల్ డివిజన్) పురస్కారంతో యూకే ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.చంద్రశేఖరన్తోపాటు భారతీ ఎంటర్ప్రైజ్ ఫౌండర్, చైర్మన్ సునిల్ భారతీ మిట్టల్కు కూడా ఈ పురస్కారం లభించింది. అలాగే మరికొందరు భారతీయ వ్యాపార ప్రముఖులకు యూకే ప్రభుత్వం ఇతర ఉన్నత అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు బ్రిటిష్ రాజు చార్లెస్ ఈ పురస్కారాలకు ఆమోదం తెలిపినట్లుగా పేర్కొంది.“ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇందుకు కింగ్ చార్లెస్కు కృతజ్ఞతలు. టెక్నాలజీ, కన్జూమర్, హాస్పిటాలిటీ, ఉక్కు, రసాయనాలు, ఆటోమోటివ్ రంగాలవ్యాప్తంగా యూకేతో పటిష్టమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం టాటా గ్రూప్నకు గర్వకారణం. జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ లాంటి మా ఐకానిక్ బ్రిటీష్ బ్రాండ్లు మాకెంతో గర్వకారణమైనవి. యూకేలో మా సంస్థల్లో 70,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు” అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
యూకేలోనూ అక్రమ వలసదారుల ఏరివేత
లండన్: అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న వేళ.. బ్రిటన్ సైతం అదే బాటలో పయనిస్తోంది. విదేశీ నేరగాళ్లను, మరీ ముఖ్యంగా దొడ్డిదారిన ఆ దేశంలోకి వచ్చిన పనులు చేసుకుంటున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లలోనే తనిఖీలు జరిపి అరెస్టులు చేస్తుండడం గమనార్హం. తాజాగా.. యూకే వైడ్ బ్లిట్జ్(UK-wide blitz) పేరుతో వలసదారులు పని చేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్టు చేసింది. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలని యూకే హోంమంత్రిత్వ కార్యదర్శి వెట్టే కూపర్ చెబుతున్నారు. హంబర్సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్లలో జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సౌత్ లండన్లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్హౌస్లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. అదుపులోకి తీసుకున్న వాళ్లను ‘ట్రంప్’ స్టైల్లోనే బంధించి వెనక్కి పంపించేస్తోంది యూకే. వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అక్కడి అధికారులు తాజాగా విడుదల చేశారు. అయితే వాళ్లలో నేరగాళ్లు ఉండడం వల్లే అలా చేస్తున్నామని వాళ్లు సమర్థించుకుంటున్నారు. The public must have confidence in the UK's immigration system.Through our Plan for Change, we have removed almost 19,000 people including failed asylum seekers, foreign criminals and immigration offenders from the UK since July 2024. pic.twitter.com/QY4tpQDqSP— Home Office (@ukhomeoffice) February 10, 2025అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఈ వ్యవహారంపై సోమవారం స్పందించిన సంగతి తెలిసిందే. ‘బ్రిటన్లో అక్రమ వలసలు పెరిగాయి. చాలామంది అక్రమంగా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తాం’ అని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో సోమవారం చర్చ జరిగింది. అలాంటి అక్రమ వలసదారుల వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడమే కాకుండా.. వలసలు వచ్చే క్రమంలో ఎందరో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని బ్రిటన్ అందోళన వ్యక్తం చేస్తోంది.గతేడాది జులైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం సరిహద్దు భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇప్పటివరకు దాదాపు 19వేల మంది అక్రమ వర్కర్లను, విదేశీ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క జనవరిలో దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి.. 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారు. అయితే, తాజాగా భారతీయ రెస్టారెంట్లను మాత్రమే టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
రాయల్ నేవీ చీర!
‘రాయల్ నేవీ’ అనేది కొత్త డిజైన్తో వచ్చిన చీర కాదు. విషయం ఏమిటంటే... సాంస్కృతిక వైవిధ్యాన్ని విస్తృతపరచడానికి శ్రీకారం చుట్టింది యూకే రాయల్ నేవీ. ఇందులో భాగంగా ‘ఫార్మల్ డ్రెస్కోడ్’ను అప్డేట్ చేసింది. అధికారిక కార్యక్రమాలలో మహిళా ఆఫీసర్లు చీరలు, సల్వార్ కమీజ్, లెహంగాలాంటి కల్చరల్ డ్రెస్లను ధరించడానికి అనుమతిస్తున్నట్లు తొలిసారిగా బ్రిటిష్ నేవీ ప్రకటించింది. అయితే వీటిపై యూనిఫాం షర్ట్, బ్లాక్ బో ధరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాకిస్థానీ నేవీ ఆఫీసర్ దుర్దాన అన్సారి ఫొటోను జత చేస్తూ రాయల్ నేవీ(ఆర్ఎన్) డైవర్సిటీ నెట్వర్క్ చైర్ పర్సన్ జాక్ కనాని లింక్డిన్లో కొత్త పాలసీ గురించి ప్రకటించారు. ఈ ఫొటోలో అన్సారి తెల్లని చీరలో మెస్ జాకెట్ ధరించి కనిపిస్తుంది. అయితే ‘ఫార్మల్ డ్రెస్కోడ్’లో మార్పు తేవడం కొందరు మాజీ బ్రిటిష్ అధికారులకు బొత్తిగా నచ్చలేదు. ‘సాంస్కృతిక గుర్తింపును యూనిఫామ్తో కలపడం సరికాదు’ అని విమర్శించారు. అయితే వారి విమర్శల సంగతి ఎలా ఉన్నా ఫార్మల్ డ్రెస్కోడ్ అప్డేట్పై ఎక్కువ మంది సానుకూలంగా, సంతోషంగా స్పందించారు.(చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
యూకేలో ఓయో పెట్టుబడులు
ఆతిథ్య రంగంలో ఉన్న ఓయో తాజాగా యూకేలో సుమారు రూ.540 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపింది. ప్రీమియం హోటల్ పోర్ట్ఫోలియో విస్తరణకు వచ్చే మూడేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. తద్వారా యూకే ఆతిథ్య రంగంలో 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించింది. విస్తరణలో భాగంగా దీర్ఘకాలిక లీజు, నిర్వహణ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. 2018లో యూకే మార్కెట్లో అడుగుపెట్టినట్టు కంపెనీ వివరించింది. 200లకుపైగా హోటళ్లు ఓయో జాబితాలో ఉన్నాయి. యూకేలో 65 నగరాల్లో ఇవి విస్తరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 ప్రీమియం హోటళ్లను అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ గతంలో ప్రకటించింది. ఇందులో ఇప్పటికే 18 తెరుచుకున్నాయి. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్లో జీఎంఆర్ ఎయిర్పోర్ట్కార్పొరేట్ల సుస్థిర అభివృద్ధి ప్రణాళికల అమలుకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్లో (యూఎన్జీసీ) చేరినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీఏఎల్) వెల్లడించింది. మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపరంగా యూఎన్జీసీ నిర్దేశించుకున్న పది సూత్రాలకు, అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (ఎస్డీజీ) అనుగుణంగా తమ వ్యూహాలు, కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వివరించింది. తమ విమానాశ్రయాలన్నింటికీ యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లేదా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేషన్ ఉన్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అక్రమ జామర్స్తోనే కాల్ డ్రాప్స్పర్యావరణహిత ఏవియేషన్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదిగే దిశగా ఇదొక కీలక అడుగని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ సీఈవో కిరణ్ కుమార్ గ్రంధి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, గోవా, మెడాన్ (ఇండొనేషియా) విమానాశ్రయాలను జీఏఎల్ నిర్వహిస్తోంది. అలాగే, విశాఖలోని భోగాపురం, గ్రీస్లోని క్రెటెలో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. ఫిలిప్పీన్స్లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సాంకేతిక సేవలు అందిస్తోంది. -
పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం
నెలకు లక్షల్లో సంపాదిస్తేనే ఔరా అనుకుంటాం కదా. కానీ బ్రిటీష్ బిలియనీర్, మహిళా వ్యాపారవేత్త, అత్యధిక వేతనం పొందే మహిళగా నిలిచింది. 2024లో జీతం , డివిడెండ్లలో 150 మిలియన్ పౌండ్లను ( రూ.1,500 కోట్లకు పైగా) వేతనం అందుకుంది. అంటే రోజురు నాలుగు కోట్ల వేతనం అన్నమాట. అదీ 45 శాతం వేతన కోత తరువాత. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎవరీ డెనిస్.. ఆమె కంపెనీ ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో.57 ఏళ్ల డెనిస్ కోట్స్(denise Coates)కన్న కల చాలా పెద్దది. అందుకే ఆమె స్థాపించిన ఒక చిన్న కంపెనీ ఇపుడు ప్రపంచాన్ని ఏలుతోంది. 2000లో ఒక మామూలు కారు పార్కింగ్ స్థలంలో "బెట్365" (Bet365)అనే ఆన్లైన్ బెట్టింగ్ సంస్థను ప్రారంభించింది. బహుశా అపుడు ఆమె ఊహించి ఉండదు..వేల కోట్ల టర్నోవర్తో, 8,500 మంది ఉద్యోగులతో దిగ్గజంగా ఎదిగుతుందని. కట్ చేస్తే...ఆమె విజయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డెనిస్ కోట్స్ బ్రిటన్లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా అవతరించారు. సంస్థలో ఆమె మెజారిటీ వాటా50 శాతానికి పైమాటే.ది గార్డియన్ నివేదిక ప్రకారం "బెట్365" కంపెనీ అంతకుముందు సంవత్సరంలో 3.4 బిలియన్ పౌండ్ల నుండి 3.7 బిలియన్ పౌండ్లకు ఆదాయ వృద్ధిని సాధించింది. ఈక్విటీ మార్కెట్ పరిస్థితుల మెరుగుదల మధ్య ఖర్చులను తగ్గింపు, పెట్టుబడి మదింపుల నుండి లాభాన్ని ఆర్జించింది. గత ఏడేళ్లలో ఆమె సంపద ఏకంగా రూ. 20 వేల కోట్లను దాటిపోగా, గత పదేళ్లలో ఆమె ఆర్జించిన మొత్తం దాదాపు రూ.24 వేల కోట్లు. మార్చి 2024తో ముగిసిన ఏడాది లో సంస్థ పన్నుకు ముందు 626 మిలియన్ పౌండ్ల లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాదితోపోలిస్తే 60 మిలియన్ పౌండ్ల ప్రీ-టాక్స్ నష్టం నుండి గణనీయమైన పెరుగుదల.ఆన్లైన్ బెట్టింగ్స్ ఊపందుకున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో (2020) ఆమె ఆదాయం అత్యధికంగా రూ.4,690 కోట్లుగా నమోదైంది. కాగా ప్రపంచంలోని ప్రముఖ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కంపెనీల్లో ఒకటి నిలిచిన Bet365 వ్యవస్థాపకురాలైన కోటస్ 1967, సెప్టెంబరు 26న ఇంగ్లాండ్లోని స్టోక్-ఆన్-ట్రెంట్లో జన్మించింది. షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామెట్రిక్స్ అభ్యసించింది. బెట్టింగ్ షాపులను నిర్వహించు కుటుంబ నేపథ్యంతో ఆమె ఈ కంపెనీని స్థాపించింది. ఆమె సోదరుడు జాన్ కోట్స్ సంస్థకు సంయుక్త సీఈఓగా(CEO), ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు. అంతేకాదు స్టోక్ సిటీ ఫుట్బాల్ క్లబ్ స్టేడియానికి బెట్365 పేరు పెట్టారంటేనే Bet365కంపెనీ ప్రాముఖ్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.విమర్శలు, వివాదాలు అయితే ఇంత ప్రాపులర్ అయిన సంస్థకు సంబంధించి మరో కోణం కూడా ఉంది. పేదప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్న కంపెనీ అంటూ సంస్థపై అనేక విమర్శలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది కష్టార్జితాన్ని ఈ సంస్థ కొల్లగొడుతోందని విమర్శకులు మండిపడుతున్నారు.మరోవైపు 2020లో డెనిస్ తండ్రి పీటర్ కోట్స్(Peter Coates) బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది . అలాగే 2023లో కస్టమర్ల భద్రతా వైఫల్యం, మనీలాండరింగ్ లాంటి ఆరోపణలతో ఈ సంస్థ రూ.5.82 కోట్ల జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. -
యూకే వెళ్లేందుకు వైఎస్ జగన్కు అనుమతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజా పాస్పోర్ట్ పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) జారీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల కాల వ్యవధితో వైఎస్ జగన్కు పాస్పోర్ట్ జారీ చేయాలని పాస్పోర్ట్ అధికారులను ఆదేశించింది. కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం నిమిత్తం ఈ నెల 16న యునైటెడ్ కింగ్డమ్ (యూకే) వెళ్లేందుకు జగన్మోహన్రెడ్డికి అనుమతి ఇచ్చింది. ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు.తాజాగా ఐదేళ్ల కాల వ్యవధితో పాస్పోర్ట్ జారీకి ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనంటూ విజయ వాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం వాదనలు విన్న జస్టిస్ శ్రీనివాసరెడ్డి మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ‘క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం అడగటంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. క్రిమినల్ ప్రొసీడింగ్స్కు దరఖాస్తు దారు అందుబాటులో ఉండేలా చూడటమే. పాస్పోర్ట్ కలిగి ఉండటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. విదేశాలకు వెళ్లేందుకు తగిన పాస్పోర్ట్ కలిగి ఉండాలి.జగన్ మోహన్రెడ్డి ఈ నెల 16న తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లాల్సి ఉంది. జగన్మోహన్రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు. నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే.. ఇదే హైకోర్టు గత నవంబర్లో ఉత్తర్వులిచ్చింది. జగన్ తరఫున ఆయన న్యాయవాది హాజరైతే సరిపోతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా పాస్పోర్ట్ పొందేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదు. ఎన్వోసీ జారీ చేయాలన్న జగన్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ప్రత్యేక కోర్టు చెప్పిన కారణాలేవీ చెల్లవు. అందువల్ల ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని శ్రీనివాసరెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. -
అలాంటిలాంటి పిల్లి కాదిది.. ఏకంగా ప్రధాని కార్యాలయంలో..!
బ్రిటిష్ పతాకాన్ని హోదా చిహ్నంగా మెడలో ధరించి, గంభీరంగా చూస్తున్న ఈ పిల్లి వాలకం గమనించండి. ఇది బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలో ఉన్నతోద్యోగి. దీని హోదా ‘చీఫ్ మౌసర్ టు ది కేబినెట్ ఆఫీస్’. బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలోనికి ఎలుకలు చొరబడకుండా కాపలా కాయడమే దీని పని. దీని కన్ను కప్పి పొరపాటున ఏ ఎలుకైనా సాహసించి ఈ కార్యాలయంలోకి చొరబడితే, ఇది వెంటనే పట్టి, పలారం లాగించేస్తుంది. లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్లో ఉన్న బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలోని ఉద్యోగులందరూ దీనిని అల్లారుముద్దుగానే కాదు, అత్యంత గౌరవంగా కూడా చూసుకుంటారు. బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయంలో పిల్లులను పెంచే పద్ధతి పదహారో శతాబ్ది నుంచి ఉండేది. ప్రధాని కార్యాలయంలో పెంచే పిల్లికి ‘చీఫ్ మౌసర్’ హోదాను అధికారికంగా ప్రకటించడం మాత్రం 1997లో జరిగింది. ఇప్పుడు ‘చీఫ్ మౌసర్’గా ఉన్న పిల్లి కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏటా 100 పౌండ్లు (రూ.10,597) ఖర్చు చేస్తోంది. (చదవండి: ఉద్యోగం కోల్పోతేనేం కుట్టు పనితో ఏకంగా..!) -
17ఏళ్ల యువకుడి కొత్త ఆలోచన.. నెలకు రూ.16 లక్షల సంపాదన
ఆలోచన ఉండాలే గానీ.. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు కనిపిస్తాయి. ఈ డిజిటల్ యుగంలో అయితే.. కంటెంట్ క్రియేషన్ & డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో యువకులు డబ్బు సంపాదించడానికి సిద్దమైపోతున్నారు. ఇలాంటి మార్గాలను అనుసరించే ఓ బ్రిటీష్ యువకుడు నెలకు ఏకంగా రూ.16 లక్షల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.17 ఏళ్ల బ్రిటీష్ యువకుడు కెలన్ మెక్డొనాల్డ్.. పండుగ సీజన్లో ప్రత్యేకమైన స్టిక్కర్లను విక్రయించడం ద్వారా నెలకు 19000 డాలర్లు (రూ. 16,08,748) సంపాదిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అతని తల్లి ఇచ్చిన డిజిటల్ డ్రాయింగ్, కటింగ్ & ప్రింటింగ్ మెషీన్ను ఉపయోగించే ఇంత పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నాడు.కెలన్ మెక్డొనాల్డ్ రూపొందించిన స్టిక్కర్ల ఫోటోలను తన ఫేస్బుక్లో షేర్ చేశారు. సొంతంగా రూపొందించిన స్టిక్కర్లను గాజు వస్తువులు, యాక్రిలిక్పై అంటించి.. డబ్బు సంపాదించేవారు. ప్రతి రోజూ కాలేజ్ పూర్తయిన తరువాత స్టిక్కర్ల వర్క్ మీద మూడు గంటలకు పనిచేసేవాడు.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?ఇప్పటి వరకు కెలన్ 94,410.31 డాలర్లు సంపాదించినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 79.93 లక్షల కంటే ఎక్కువే. నాకు లభించిన క్రిస్మస్ కానుక ద్వారా ఇంతలా డబ్బు సంపాదించవచ్చని నేను ఊహించనే లేదు. ప్రస్తుతం నా సమయం కూడా చాలా వేగంగా సాగిపోతోంది కెలన్ మెక్డొనాల్డ్ వెల్లడించారు. -
40 ఏళ్ల నాటి గౌనులో యువరాణి అన్నే..!
ఇటీవల అమ్మమ్మలు, అమ్మలు ధరించిన పెళ్లినాటి చీరలను సరికొత్తగా డిజైన్ చేయించుకుని ధరించడం ట్రెండ్గా మారింది. సరిగ్గా చెప్పాలంటే రెట్రో ఫ్యాషన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రముఖుల వరకు దీన్నే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ల పెళ్లి నాటి చీరలు, ఒకప్పుడు ధరించిన ఫ్యాషన్ వేర్లను కాస్త మార్పులు చేసి.. సరికొత్తగా కనిపించేలా ధరిస్తున్నారు. ప్రస్తుతం ఆ కోవలోకి ప్రిన్సెస్ అన్నే కూడా చేరిపోయారు. రాజ కుటుంబానికి చెందిన అన్నే ఈ ఫ్యాషన్కి మద్దతివ్వడం అందరిని విస్మయపరిచింది. ఇటీవల బకింగ్హామ్ ప్యాలెస్లో ఖతారీ రాజకుటుంబానికి ఇచ్చిన ఆతిథ్యంలో తన తన అన్న ప్రిన్స్ చార్లెస్ IIIతో కలిసి అన్నే కూడా భాగమయ్యారు. ఆ ఆతిథ్యంలో అన్నే 40 ఏళ్ల నాటి క్రీమ్ గౌనుతో ఆకట్టుకుంది. ఆమె ధరించి డిజైనర్వేర్ చూస్తే ఇటీవలే డిజైన్ చేసినట్లుగా చూడముచ్చటగా కనిపిస్తుంది. కానీ ఇది నలభైఏళ్ల నాటిది. ఈ గౌనులో 1985 నాటి పార్లమెంట్ ప్రారంభోత్సవంలో తొలిసారిగా కనిపించారు. అప్పుడు ఆమె వయసు 35 ఏళ్లు. మళ్లీ ఇన్నేళ్లకు ధరించినా.. ఆమె ఒంటికి చక్కగా సరిపోవడమే గాక అలనాటి అందాల అన్నేని జ్ఞప్తికి తెచ్చింది. ఆ డిజైనర్వేర్కి తగ్గట్టుగా డైమండ్తో పొదగిన ఆక్వామెరైన్ పైన్ఫ్లవర్ కిరీటం రాయల్టీని తెలియజేస్తుంది. ఈ కిరీటాని అన్నేకి దివగంత అమ్మమ్మ బహుమతిగా ఇచ్చారు. దుస్తులు కూడా వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్న తరుణంలో అందరిని ఆకర్షించే విధంగా..ఓ ఉద్యమంలా తీసుకొచ్చిన ఈ రెట్రో ఫ్యాషన్లో రాజకుటుంబికులు కూడా తమ వంతుగా భాగస్వామ్యం కావడం విశేషం. ఓ సామాన్యురాలి వలే ఏళ్ల నాటి డిజైనర్ గౌనుతో కనిపించి.. రాజదర్పానికి అసలైన అర్థం ఇచ్చి.. అందరిచేత ప్రశంసలందుకుంది.(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
యోగాంజలి – ఎందుకంటే సినిమా కంటే ధ్యానం ఇష్టం
‘ఔత్సాహికులకు 60 పౌండ్లు మాత్రమే. వెంటనే రిజిస్టర్ చేసుకోండి’ అంటున్న పూర్వ సినీనటి గీతాంజలి యోగా ప్రస్థానం ఆసక్తి కలిగిస్తోంది. ‘గీతాంజలి’ సినిమాతో ఒక వెలుగు వెలిగిన గిరిజా షెట్టార్ యు.కె.లో స్థిరపడింది. 35 ఏళ్ల తర్వాత ఇటీవలే ఒక కన్నడ సినిమాలో సింగిల్ మదర్గా నటించిన గిరిజ ‘ఆ పాత్ర స్థితి. నా స్థితి ఒకటే కనుక ఒప్పుకున్నాను’ అని చెబుతోంది. గతంలో పత్రికా రిపోర్టర్గా పని చేసిన గిరిజ ఇప్పుడు మనిషికి ఆరు వేల రూపాయల ఫీజుతో యోగా నేర్పిస్తోంది. ఆమె రాబడి ఎలా ఉన్నా యోగా అవసరం గురించి ఆమె చెప్తున్న విషయాలు అందరూ వినదగ్గవి.‘2023 సంవత్సరం మే నెలలో నాకు అనిపించింది ఇక మీదట నేను యోగా, ధ్యాన మార్గాలలో మార్గదర్శిగా నిలవాలని. ఆ నిర్ణయం తీసుకున్నాక ఎంతోమందికి సాయపడుతున్నాను’ అంటున్నారు గిరిజ. ‘గీతాంజలి’ (1989) సినిమాతో నేటికీ మరపు రాని ఈ నటి చాలా యేళ్లుగా యు.కెలో స్థిరపడినా, రకరకాల ఉద్యోగాలు చేసినా 55 ఏళ్ల వయసులో యోగా టీచర్గా నూతన ప్రస్థానం సాగిస్తున్నారు. భారతీయ సినిమాలు చూడటమే మానేసిన గిరిజ అందుకు కారణం ఏమంటారంటే ‘చూశానంటే మనసు పాడవుతుంది. ఆ సినిమాలలో నేను చాలా చేసి ఉండే అవకాశం ఉందప్పుడు. అవన్నీ వదులుకొని వచ్చినందుకు ఒక్కోసారి అది సరైన నిర్ణయం కాదని అనిపిస్తుంది’ అంటారు.2024 సెప్టెంబర్ 5న విడుదల అయిన ‘ఇబ్బని తబ్బిద ఇలెయాలి’ అనే కన్నడ సినిమా లో సింగిల్ మదర్గా నటించారు గిరిజ (ప్రైమ్టైమ్లో ఉంది). ‘నేను ఉన్న స్థితి ఆ పాత్ర స్థితి ఒక్కటే కనుక నిర్మాత రక్షిత్ శెట్టి అడిగాక అంగీకరించాను’ అంటారామె. అయితే సినిమాల మీద కంటే ఆమె ధ్యాస, ఆసక్తి కేవలం యోగా గురువుగా తాను చేయవలసిన సేవ మీదే ఉన్నట్టుగా ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.గీతాంజలి గర్ల్తెలుగు మూలాలు ఉన్న కన్నడ తండ్రికి, యు.కె.కు చెందిన క్రిస్టియన్ తల్లికి జన్మించిన గిరిజ తన 17వ ఏట వరకూ యు.కె.లోనే పెరిగారు. ఆ తర్వాత ఇండియా వచ్చి పదేళ్లపాటు ఉన్నారు. ఆ సమయంలోనే గీతాంజలిలో నాగార్జున పక్కన నటించి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందారు. ఆ తర్వాత కేవలం రెండు మూడు సినిమాలు చేసిన గిరిజ వివాహం చేసుకుని లండన్లో స్థిరపడ్డారు. కొన్నాళ్లు ఒక బిజినెస్ పత్రికకు, మరికొన్నాళ్లు మరో పత్రికకు రిపోర్టర్గా పని చేశారు. సముద్రయాన కార్మికుల మానవ హక్కుల కోసం కూడా పని చేశారు. ఆమె ముందు నుంచి యోగ సాధకురాలు. అంతేకాకుండా యోగాలో పీహెచ్డీ చేశారు. రాజయోగ ను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వివిధ దేశాలలో యోగాకోర్సులు కూడా చేశారు. వీటన్నింటి భూమికతో ఆమె తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలని ఇప్పుడు యోగా టీచర్గా మారారు.ఆమె చెప్తున్న విషయాలు→ మీలో చెడు భావాలు, నెగెటివిటీ ఉన్నాయంటే మీలోని దైవత్వం సుషుప్తి లో ఉన్నట్టే. మీలోని దివ్యత్వాన్ని మీరు మేల్కొలిపితే ఈ మలినాలు పోతాయి.→ మీలోని మంచి లక్షణాలను మీరు తరచూ గుర్తు చేసుకోవాలి. లేకపోతే మీలోని మంచి లక్షణాలను మీరు చూడటం మొదలెడితే ఇతరులలోని మంచి లక్షణాలు కూడా కనిపించడం మొదలెడతాయి.→ మొత్తం మీరే చేయాలేమో అన్న భావనతో అలసిపోవద్దు. మీరు చేయాల్సింది చేయండి మీతోపాటు విశ్వాత్మ కూడా దానికోసం పాటుపడుతుంది. అది గ్రహింపులోకి వస్తే మీరు అలసిపోరు. నేను పత్రికలో పనిచేసేటప్పుడు డెడ్లైన్ సమయంలో పేజీలు ఖాళీగా ఉంటే చాలా టెన్షన్ పడేదాన్ని. కాని సమయానికి అన్నీ ఆటోమేటిక్గా పూర్తయ్యేవి. అంటే మనతోపాటుగా మన ఆత్మ, విశ్వాత్మ కూడా పని చేస్తున్నాయన్న మాట. → ధ్యానం మీ స్వభావానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆత్మకు రక్షణ కల్పిస్తుంది. మిమ్మల్ని అనుక్షణం చూసుకునే ఆప్తుని తోడు ఉంటే ఎలా ఉంటుందో యోగ, ధ్యానాలు మీకు తోడైతే అలాంటి భావన కలుగుతుంది.→ చెడు చాలా పరిమితం. మంచి అనంతం. ఆ అనంతమైన మంచిని మనలో నిత్యం జాగృతం చేసుకుంటూ ఉంటే మంచి జీవనం తప్పకుండా మనకు చేరువ అవుతుంది.యోగా ఒక రక్షణ‘నేను కోవిడ్ సమయంలో తీవ్రంగా అనారోగ్యం బారిన పడ్డాను. వైరస్ నా బ్రెయిన్ వరకూ వెళ్లనుందని అర్థమైంది. అయినా, నేను భయపడలేదు. నా యోగతో, ధ్యానంతో కోవిడ్ నుంచి బయటపడ్డాను. శరీరం, మనసు ప్రశాంతతను కోల్పోకుండా ఉంటే చాలా విజయాలు సాధించవచ్చు. యోగా శరీరాన్ని, ధ్యానం మనసును అలజడుల నుంచి కాపాడుతాయి. అంతేకాదు, అంతర్గత శత్రువులను నెమ్మదింప చేస్తాయి. నేను రోజుకు మూడుగంటలు ధ్యానం చేస్తాను. మీరు కనీసం అరగంట అయినా చేయండి. లేదంటే నిద్ర లేవగానే కనీసం పది నిమిషాలు చేయండి. ‘ఓ విశ్వాత్మా... ఈ జగత్తులో నన్ను ఒక సంపదగా గ్రహించు’ అని వేడుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఓపిక పట్టాలి... కాలం చాలా గాయాలను మాన్పుతుంది... మీరు దానికి అనుమతిస్తే’ అంటారు గిరిజ. -
సెల్ఫోన్ ఫ్రాడ్ కేసులో బ్రిటన్ మంత్రి రాజీనామా
లండన్: సెల్ఫోన్ చోరీకి గురైందంటూ దశాబ్దం క్రితం తప్పుడు ఫిర్యాదు చేసిన కేసులో యూకే రవాణా శాఖ మంత్రి లూయీజ్ హే(37) శుక్రవారం పదవికి రాజీనామా చేశారు. 2013లో లూయాజ్ను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. తను పోగొట్టుకున్న వాటిలో సెల్ఫోన్ కూడా ఉందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె సెల్ఫోన్ దొరికింది. దీనిపై పోలీసుల విచారణలో ఆమె..దోపిడీకి గురైనవాటిలో మొబైల్ ఉందంటూ పొరపాటున ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కోర్టులో కూడా ఆమె తన తప్పిదాన్ని అంగీకరించారు. మొదటి తప్పుగా భావించి కోర్టు ఆమెను విడుదల చేసింది. రవాణా మంత్రి లూయీజ్ ఫ్రాడ్ చేసినట్లుగా మీడియాలో వార్తలు రావడంతో లాయర్ సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితుల్లో రాజీనామా చేయడమే ఉత్తమమని భావిస్తున్నానని, ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు కొనసాగిస్తానని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎంపీగా షెఫీల్డ్ నుంచి లూయీజ్ హే ఎన్నికయ్యారు. -
ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా? యువతి పోస్ట్ వైరల్
ఉద్యోగం కావాలంటే అనేక ఇంటర్వ్యూలను ఎదుర్కోక తప్పదు. సంబంధిత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే టీం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగ అర్హతలు, సామర్థ్యం, అనుభవం, ఫైనల్గా జీతం లాంటి ప్రశ్నలు సాధారణంగా ఉంటాయి. కానీ ఒక మహిళా అభ్యర్థి తన అనుభవాన్ని సోషల్మీడియాలో షేర్ చేసింది. ఈ వింత ప్రశ్న ఎదురు కావడంతో షాక్ అ అయ్యానంటూపేర్కొంది. దీంతో ఇది వైరల్గా మారింది.యూకేకు చెందిన భారత సంతతికి చెందిన జాన్హవి జైన్ తన అనుభవాన్ని ఎక్స్లో షేర్ చేసింది. దీని ప్రకారం ఓ జాబ్ ఇంటర్వ్యూలో సదరు కంపెనీ హెచ్ఆర్ ఉద్యోగి వయసు ఎంత అని అడిగారు. పాతికేళ్లు అని తను జవాబు చెప్పింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందాఅని అడగడంతో అవాక్కయ్యానంటూ చెప్పుకొచ్చింది జాన్హవి. తాను విన్నది నిజమేనా? లేక పొరబడ్డానా? అని ఒక్క క్షణం గందరగోళంలో పడిపోయానని తెలిపింది. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా? అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు లక్ష 20వేల వ్యూస్, వందల కమెంట్లు వెల్లువెత్తాయి. భారత దేశంలో తమకూ ఇలాంటి అనుభవం ఎదురయ్యాయని చాలామంది సమాధానం ఇచ్చారు. కొంతమంది అయితే పెళ్లి, పిల్లల ప్లానింగ్ గురించి కూడా అడుగుతారు కొన్ని మారవు అంతే కొందరు, ‘‘ఏం చేస్తాం మనం, గర్భసంచులతో పుట్టాం కదా, మనకి కొన్నితప్పవు’’ అని ఒక మహిళ వ్యాఖ్యానించారు. ‘‘నాకు ఇందులో తప్పు ఏమీ కనిపించడం లేదు. ఇది వారి ప్రాజెక్ట్ , టైమ్లైన్ కోసం. ఎక్కువ పనిచసేవాళ్లు కావాలి. వారి పనిని ప్రభావితం చేసేలా కుటుంబ బాధ్యతలు వద్దనుకుంటారు" అని మరో వినియోగదారు మద్దతివ్వడం గమనార్హం.This HR of an Indian company asked me how old I am and when I said 25, they asked me if I am looking to marry soon??? Is this still happening??— Janhavi Jain (@janwhyy) November 19, 2024 -
తియ్యగా మాట్లాడి, దుమ్ము దులిపే ‘బామ్మ: స్కామర్లకు దబిడి దిబిడే
అదిగో గిప్ట్, ఇదిగో లక్షల రూపాయలు అంటూ ఫేక్ కాల్స్తో జరుగుతున్న సైబర్నేరాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది చాలదన్నట్టు, డ్రగ్స్, టాక్స్ అంటూ డిజిటల్ అరెస్ట్ల పేరుతో ఆన్లైన్ ద్వారా సెలబ్రిటీలను కూడా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి కేటుగాళ్ల దుమ్ము దులిపేందుకు ఏఐ బామ్మ వచ్చేసింది. యూకే టెలికం కంపెనీ ‘ఓ2’ డైసీ అనే ఏఐ బామ్మను సృష్టించింది. డైసీ అనేది సాధారణ చాట్బాట్ కాదు, లైఫ్లైక్, మనుషుల తరహా సంభాషణలను నిర్వహించడానికి రూపొందించబడిన అత్యంత అధునాతన ఏఐ అని కంపెనీ ప్రకటించింది.బ్రిటన్లోనూ ఇలాంటి మోసాలు, ఆన్లైన్ స్కామర్ల స్కాంలు తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో డైసీ సృష్టి ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ 10 మందిలో 7 మంది సైబర్ కేటుగాళ్ల మోసాలకు బలవుతున్నారట. వారి ఆటకట్టించి వినియోగదారులను రక్షించాలన్న ఉద్దేశంతోనే త్యాధునిక సాంకేతికతతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బామ్మ ఆన్లైన్ స్కామర్ల భరతం పడుతుందని కంపెనీ వెల్లడించింది. స్కామర్లతో తియ్యగా మాట్లాడుతూ వారిని మాటల్లో పెడుతుంది. వారిని సమయాన్ని వృథా చేస్తూ అసహనానికి గురిచేస్తుంది. దాదాపు 40 నిమిషాల పాటు ఎడతెగకుండా మాట్లాడి, అవతలి వారికి పిచెక్కిస్తుంది. దెబ్బకి ఆన్లైన్ నేరగాళ్లు చివరికి ఫోన్ పెట్టేస్తారనీ, దీంతో వారి మోసానికి చెక్ పడుతుందని కంపెనీ తెలిపింది. తద్వారా బాధితుల సంఖ్య తగ్గుతుందని భావిస్తోంది.మరో విధంగా చెప్పాలంటే మోసంతో ఫోన్ చేసేవారికి ఏఐ గ్రాండ్మదర్ డైసీ చుక్కలు చూపిస్తుంది. తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలియనంత తీయగా మాట్లాడుతూ వారి అసలు సంగతిని తెలుసుకుంటుంది. అంతేకాదు డైసీ కేవలం స్కామర్ల సమయాన్ని వృధా చేయడం మాత్రమే కాదు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా ఆమె సహాయపడుతుంది. ఇందుకోసం స్కామ్లో 5వేల పౌండ్లను కోల్పోయిన రియాలిటీ టీవీ స్టార్ అమీ హార్ట్ డైసీతో జతకట్టడం విశేషం.మరోవైపు ఓ2 కంపెనీ ప్రతి నెల మిలియన్ల కొద్దీ స్కామర్ల కాల్స్ను, టెక్స్ట్ మెసేజ్లను బ్లాక్ చేస్తోంది. అలాగే ఉచిత సేవ అయిన 7726కి సందేశాలను ఫార్వార్డ్ చేయడం ద్వారా అనుమానాస్పద కేసులను తమకు నివేదించమని ప్రజలను కోరుతుంది. స్కామ్లను అడ్డుకునేందుకు జాతీయ టాస్క్ఫోర్స్ , ప్రత్యేకమైనమంత్రిత్వ విభాగం కావాలని కూడా కోరుతోంది. -
యూకే కంపెనీ కొనుగోలు చేసిన హైదరాబాద్ సంస్థ
హైదరాబాద్కు చెందిన రఘు వంశీ గ్రూప్.. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమకు విడిభాగాలను అందించే యూకేకు చెందిన ప్రముఖ ప్రెసిషన్ మెషినింగ్ కంపెనీ 'పీఎంసీ గ్రూపు'ను కొనుగోలు చేసింది.పీఎంసీ గ్రూపు కొనుగోలుతో.. రఘు వంశీ గ్రూపు కీలకమైన పరిశ్రమలకు ఉత్పత్తులు సరఫరా చేయనుంది. కాబట్టి కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని నిరూపించుకోగలుగుతుంది. అంతే కాకుండా ఆయిల్ & గ్యాస్ రంగంలో లేటెస్ట్ ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తుంది.పీఎంసీ గ్రూపు.. తన ప్రిసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలలో 35 సంవత్సరాలకు పైగా ఉన్న గొప్ప అనుభవం కలిగి ఉంది. ఈ కంపెనీ ఎస్ఎల్బీ, బేకర్ హ్యూస్, హాలీబర్టన్, ఎక్స్ప్రో, టెక్ ఎఫ్ఎంసీ, వన్ సబ్ సీ వంటి గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ ఓఈఎంలకు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీలో సుమారు 100 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు.. ఆదాయం రూ. 180 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.పీఎంసీ గ్రూపును.. రఘు వంశీ గ్రూప్ కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ, మిధాని సీఎండీ డాక్టర్ ఎస్ కే ఝా, ఏఆర్సీఐ సైంటిస్ట్ డాక్టర్ ఎల్.రామకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఘువంశీ గ్రూప్ ఎండీ వంశీ వికాస్ మాట్లాడుతూ.. రఘువంశీ కుటుంబంలోకి పీఎంసీ గ్రూపును స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కొనుగోలు ఇప్పుడు మా ఉత్పత్తి బలాలను, సునిశిత మెషీనింగ్లో పీఎంసీ గ్రూపువారి నైపుణ్యంతో మిళితం చేస్తుంది. దీనివల్ల మా అంతర్జాతీయ ఉనికిని విస్తరించడానికి, అత్యంత సునిశిత ఉత్పత్తుల విస్తృత విభాగాన్ని రూపొందించడానికి సాయపడుతుందని మేము సంతోషిస్తున్నామన్నారు. -
వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా?
లండన్ : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ప్రధాని కీర్ స్టార్మర్ తన నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులకు ఇచ్చిన ఆతిథ్యం వివాదంగా మారింది. యూకే ప్రధాని అధికారిక నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన దీపాలు వెలిగించడం, కూచిపూడి నృత్య ప్రదర్శన, కీర్ స్టార్మర్ ప్రసంగం జరిగింది. అంనతరం, అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు.అయితే, అతిథులుగా వచ్చిన తమ మనోవభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్ స్టార్మర్ తమకు నాన్వెజ్, లిక్కర్లను అందించారని బ్రిటన్ హిందువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీష్ కే శర్మ.. ప్రధాని కార్యాలయం ఇచ్చిన ఆతిథ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత 14 సంవత్సరాలుగా10-డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ నాన్ వెజ్ ఐటమ్స్, వైన్స్, బీర్ వంటి వాటికి జోలికి వెళ్లలేదు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ సంవత్సరం దీపావళి వేడుకల్లో మాంసాహారంతో చేసిన వంటకాలు పెట్టారు. వైన్,బీర్లను అందించి మూర్ఖం, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.దీపావళి వేడుకల్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సలహాదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ అంశంపై కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం బ్రిటన్,భారత్లలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మారర్ స్పందించాల్సి ఉంది.కాగా, బ్రిటన్ లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. 650 స్థానాలకు గాను నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకొని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. -
‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’
యూకేలో ఉండడానికి ఉచితంగా పని చేయాడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఓ భారతీయ విద్యార్థిని తెలిపింది. గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వెళ్లిన ఆమె అక్కడే ఉండేందుకు ఉచితంగా పని చేస్తానని లింక్డ్ఇన్ పోస్ట్లో తెలియజేశారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు శ్వేత చెప్పారు. తాను రోజు 12 గంటలపాటు వారంలో ఏడు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈపోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.‘నా పేరు శ్వేత. నేను గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వచ్చాను. నా గ్రాడ్యుయేట్ వీసా మూడు నెలల్లో ముగియనుంది. నేను యూకేలో వీసా అందించే కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి 300 కంటే ఎక్కువగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో ఎంఎస్సీ పట్టా పొందాను. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నాను. మీరు యూకేలో కంపెనీ నిర్వహిస్తూ డిజైన్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నట్లయితే నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. వారంలో ఏడు రోజులపాటు రోజువారీ 12 గంటలు పని చేస్తాను. ఒక నెలపాటు నాకు ఎలాంటి జీతం అవసరం లేదు. నా పనితీరు గమనించండి. నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ ఇవ్వకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి. ఈ పోస్ట్ను అంతర్జాతీయ విద్యార్థులు చదువుతుంటే దీన్ని రీపోస్ట్ చేయండి’ అని తెలుపుతూ దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా శ్వేత షేర్ చేశారు.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!మిమ్మల్ని మీరు నమ్మండిఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు వెళ్లిన దేశంలో ఉండటానికి ఉచితంగా పని చేయడం లేదా అన్నేసి గంటలు పనిచేయడం అసంబద్ధం. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘యూకేలో ఉండడం కోసం ఇలా చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు తెలివైనవారు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు పొందుతారు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. -
కొత్త హోదాలతోనే ఉద్యోగాలు.. ఇదే సరికొత్త ట్రెండ్
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని లింక్డ్ఇన్ విభాగం ‘వర్క్ చేంజ్ స్నాప్షాట్’ తెలిపింది.‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట. ఇక ఏఐతో సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్ఇన్ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది. అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్ఆర్ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని చేస్తున్నారని వెల్లడించింది.‘‘ప్రస్తుతం సమయంలో వర్క్ ప్లేస్లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో కొన్ని బిజినెస్లు పరిశీలన చేస్తున్నాయి’ అని లింక్డ్ఇన్ (యూకే) మేనేజర్ జానైన్ చాంబర్లిన్ అభిప్రాయడ్డారు. -
కింగ్ చార్లెస్3కి షాక్.. ‘నువ్వు మా రాజువి కావంటూ’ నినాదాలు
కాన్ బెర్రా : బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్ట్రేలియా పార్లమెంట్లో అవమానం జరిగింది. పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తుండగా ఆస్ట్రేలియా మహిళా సేనేటర్ లిడియా థోర్ప్ ఆయనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నువ్వు మా రాజు కాదు అంటూ వలసవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘నువ్వు మా రాజు కాదు. నువ్వు మారణ హోమానికి పాల్పడ్డావు. మా భూమిని, మా నుండి దోచుకున్న వాటిని మాకు ఇవ్వండి’ అని ఆరోపించారుఆస్ట్రేలియా రాజుగా ఈ ఏడాది తొలిసారి కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియాలో ఐదురోజుల పాటు పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా పార్లమెంట్లో ప్రసంగించారు. కింగ్ చార్లెస్ ప్రసంగ సమయంలో పక్కనే ఉన్న థోర్ప్ విమర్శలు గుప్పించారు. థోర్ప్ తీరుపై ఆస్ట్రేలియా ప్రజాప్రతినిధులు ఖండించారు. మాజీ ప్రధాన మంత్రి టోనీ అబాట్ సైతం థోర్ప్ ఇలా వ్యవహరించడం దురదృష్టకరం అని అన్నారు. కాగా, రాచరికానికి వ్యతిరేకంగా సేనేటర్ లిడియా థోర్ప్ గతంలో పలు మార్లు ఇలాగే వ్యవహరించారు. -
వేదాంత రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న వేదాంత గ్రూప్ రాజస్తాన్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. యూకేలో జరిగిన రైజింగ్ రాజస్తాన్ రోడ్షోలో రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మతో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ భేటీ అయి తాజాగా పెట్టుబడి ప్రతిపాదనలు చేశారు. వేదాంత కంపెనీ అయిన హిందుస్తాన్ జింక్ రూ.30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. జింక్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 1.2 మిలియన్ టన్నుల నుంచి 2 మిలియన్ టన్నులకు, వెండి ఉత్పత్తిని 800 నుంచి 2,000 టన్నులకు చేరుస్తారు. ఒక మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఫెర్టిలైజర్ ప్లాంటు నెలకొల్పుతారు. రోజుకు 3 లక్షల బ్యారెల్స్కు సామర్థ్యం పెంచేందుకు కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ రూ.35,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. 10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేసేందుకు సెరెంటికా రెన్యూవబుల్స్ రూ.50,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఉదయ్పూర్ సమీపంలో లాభాపేక్ష లేకుండా ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పనున్నట్టు వేదాంత గ్రూప్ ప్రకటించింది. తాజా పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే కొత్తగా రెండు లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఇప్పటికే రాజస్తాన్లో వేదాంత గ్రూప్ కంపెనీలు రూ.1.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు చేయడం విశేషం. దేశంలో ఉత్పత్తి అవుతున్న ముడి చమురులో కెయిర్న్ వాటా 25% ఉంది. హిందుస్తాన్ జింక్, కెయిర్న్ ప్రధాన కార్యకలాపాలకు రాజస్తాన్ కేంద్రంగా ఉంది. కాగా ఒడిశాలో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ శుక్రవారం తెలిపింది. -
యూకేలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
యూకేలోని రీడింగ్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రీడింగ్ జాతర బృందం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వేడుకలకు సుమారు వెయ్యి మంది హాజరైనట్లు అధ్యక్షులు విశ్వేశ్వర మంథని, ఉపాధ్యక్షులు ప్రసాద్ అవధానుల తెలిపారు. ఈ వేడుకను రంజిత్, రమేష్, రఘు, చైతన్య, నటరాజ్, చందు, ప్రవీణ్, రామ్రెడ్డి, శ్రీనివాస్ నేతృత్వంలోని కోర్ టీమ్ ఎంతో శ్రద్ధగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించి ఆడిన బతుకమ్మ, దాండియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అందరూ భక్తిశ్రద్ధలతో అష్టలక్ష్మీ పూజలు చేసుకున్నారు. ఈ వేడుకలో ప్రముఖ గాయని కారుణ్య సంప్రదాయ బతుకమ్మ పాటలతో మరింత ఉత్సాహాన్ని నింపి అలరించారు ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి వలంటీర్లు తెలంగాణ ప్రత్యేక వంటకాలు వడ్డించారు, విందులో మామిడి లస్సీ కూడా అందజేయడం అందరినీ ఆకట్టుకుంది.ఈ వేడుకలు ప్రవాసులకు వారి జన్మస్థలంలోని సంప్రదాయాలను గుర్తుచేయడమే గాక సాంస్కృతిక ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు అన్నారు. ఈ వేడుకలో పాల్గొన్నవారు 360 ఫోటో బూత్ను ఉపయోగించి బతుకమ్మతో ఫోటోలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు. తర్వాత దుర్గా దేవికి ఆరతితో కార్యక్రమం ముగుస్తుంది. సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలో ఉన్నతమైన సాంస్కృతిక వైభవం, భక్తి మరియు ఆనందాన్ని ప్రతిబింబించింది.(చదవండి: కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు) -
అంటార్కిటికా హరితమయం!
న్యూఢిల్లీ: మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ద్వీపకల్పం క్రమంగా హరితమయం అవుతోంది. ఇక్కడ పచ్చదనం పెరుగుతోంది. పచి్చక పరిధి విస్తృతమవుతోంది. గత మూడు దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ పరిణామం ఇటీవల 30 శాతానికిపైగా వేగం పుంజుకున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అంటార్కిటికా పరిణామాలపై యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సిటర్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఇందుకోసం శాటిలైట్ డేటాను ఉపయోగించారు. అంటార్కిటికాలో 1986లో చదరపు కిలోమీటర్ కంటే తక్కువ వైశాల్యంలో పచ్చదనం ఉండగా, 2021 నాటికి అది 12 చదరపు కిలోమీటర్లకు చేరుకున్నట్లు తేల్చారు. ఇక్కడ పచ్చదనం పెరిగిపోతుండానికి కారణంగా భూతాపం, వాతావరణ మార్పులేనని చెబుతున్నారు. ఒకవైపు మంచు పరిమాణం తగ్గిపోతుండగా, అదే సమయంలో పచ్చదనం పెరుగుతోంది. ఈ రెండింటికీ సంబంధం ఉందని అంటున్నారు. ఆధునిక కాలంలో ప్రపంచ సగటుతో పోలిస్తే అంటార్కిటికా ద్వీపకల్పం వేగంగా వేడెక్కుతోంది. ఇక్కడ వడగాల్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. మంచి కరిగిపోయి, ఆ ప్రాంతంలో పచి్చక కనిపిస్తోంది. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పచి్చక అని సైంటిస్టులు చెప్పారు. వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే అంటార్కిటికాలో మంచు పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. -
UNSC: భారత్కు బూస్ట్.. మద్దతు ప్రకటించిన యూకే
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. భారత్కు మద్దతుగా ఉన్నట్టు పలు దేశాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ మద్దతు ఇవ్వగా.. తాజాగా ఈ జాబితాలో యూకే కూడా చేరింది.న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ సాధారణ చర్చను ఉద్దేశించి యూకే ప్రధాని కైర్ స్టార్మర్ మాట్లాడుతూ..యూఎన్సీసీ మరింత ప్రాతినిధ్య సంస్థగా మారాలి. ఇందులో భాగంగానే యూకే పలు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుకుంటోంది. బ్రెజిల్, భారత్, జపాన్, జర్మనీలు శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలనుకుంటున్నాం. అలాగే, ఆఫ్రికన్ దేశాల ప్రాతినిధ్యం కూడా చూడాలనుకుంటున్నాం’ అని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అంతకుముందు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిందేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ స్పష్టం చేశారు. బుధవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భద్రతా మండలిని విస్తరించి, బలోపేతం చేద్దాం. ఇందుకు ఫ్రాన్స్ అనుకూలంగా ఉంది. ఆఫ్రికాలోని రెండు దేశాలతో పాటు జర్మనీ, జపాన్, ఇండియా, బ్రెజిల్ కు చోటు ఇవ్వాలి. ఆ రెండు దేశాలు ఏవన్నది నిర్ణయించుకునే అధికారం ఆఫ్రికాకే ఇవ్వాలి’ అని కామెంట్స్ చేశారు.ఇక, గత వారంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్.. భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన మూడు దేశాల నుంచి భారత్ మద్దతు దక్కించుకుంది.ప్రస్తుతం, యూఎస్సీపీలో ఐదు శాశ్వత సభ్యులు, పది తాతాల్కిక సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతాయి. రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఐదు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటికి ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఉంది.ఇది కూడా చదవండి: అమెరికాలో గన్ కల్చర్పై బైడెన్ కొత్త చట్టం -
కాబోయే అమ్మలకే కాదు తండ్రులకు కావాలి సెలవు..!
‘కనేది ఆమె అయినా అతడికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టంగా మారింది. కాబట్టి ఈ రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాల్సిన పరిస్థితి. ఇలాంటి సరికొత్త ఆలోచనకు నాంది పలకక తప్పని పరిస్థితి. అందువల్ల మహిళలకు ఇచ్చినట్లే కాబోయే తండ్రులకు కూడా సెలవులు ఇవ్వాల్సిందే. అయితే ఈ పెటర్నటీ సెలవులు ఉండి ఉన్నట్లుగా ఉన్నాయంతే. చాలా కంపెనీలు సరిగా ఇవ్వనే ఇవ్వడం లేదు. ఈ విషయమై లండన్లో పెద్ద ఎత్తున అసంతృప్తి నిరసనల రూపంలో వ్యక్తమవుతోంది. యూకే అంతటా పురుషుల విగ్రహాలు బేబీ క్యారియర్ల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఓ చిన్న శిశువు బొమ్మ పురుషుడి మెడకు చుట్టి ఉంచినట్లు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలు ప్రపంచమంతటా హాట్టాపిక్గా నిలిచాయి. అందుకు కారణం పెటర్నటీ సెలవులు. కాబోయే తండ్రులకు సెలవులు ఇవ్వాలని చెప్పేందుకు ఇలా వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ది డాడ్ షిఫ్ట్ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అంతేగాదు కుటుంబంలో తండ్రి పాత్ర అత్యంత కీలకం అనే విషయంపై అంతా దృష్టి సారించేలా ఈ విధంగా చేస్తున్నారు అక్కడ. పితృత్వ సెలవులు ఎందుకు అత్యంత ముఖ్యమైనవి?, వారి పాత్ర కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేయగలదు? అని నొక్కి చెప్పేలా అడుగడుగున ఇలాంటి పురుష విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ప్రజలు. అంతేగాదు నిరసనకారులు తమ అభ్యర్థనలతో యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్కు బహిరంగ లేఖను కూడా అందించారు. నిజానికి యూకే రెండు వారాల పితృత్వ సెలవును అందిస్తుంది. అంతేగాక వారానికి సుమారు రూ. 20,300 చెల్లిస్తోంది కూడా. అయితే బెల్జియం వంటి యూరోపియన్ దేశాలు మాత్రం ఈ పెటర్నటీ సెలవల్ని 20 రోజులకు పెంచింది. అంటే..యూరోపియన్ పార్లమెంట్ ఆదేశాల ప్రకారం ఫిన్లాండ్లో తల్లిదండ్రులిద్దరికీ 160 రోజులు వేతనంతో కూడిన సెలవులందిస్తోంది. అయితే మన భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకు పితృత్వ సెలవులపై తప్పనిసరి చట్టం లేదు. కానీ 1972 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) నిబంధనల ప్రకారం, పురుష ప్రభుత్వ ఉద్యోగులు 15 రోజుల పితృత్వ సెలవులకు అర్హులు. ఈ విషయంపై ఇదివరకటి రోజల్లో అంతగా ప్రామఖ్యత లేదు. కానీ నేటి పరిస్థితుల్లో ఈ సెలవులు తప్పనిసరి అని చెప్పొచ్చు. కాన్పు సమయంలో అమ్మ కాబోతున్న మహిళల్లో సైతం ఒక విధమైన ఆందోళన ఉంటుంది. ఇప్పుడూ ఎవరికీ వారే అనే యమునా తీరే అన్నట్లుగా న్యూక్లియర్ ఫ్యామిలీలే ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటప్పుడూ భర్త తోడు ఉండాలి. దీనివల్ల తండ్రిగా తన బాధ్యతలను ఎలా పంచుకోవాలో తెలియడమే గాక ఓ కొత్త బాధ్యతను ఎలా నిర్వర్తించాలనేది తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.(చదవండి: మరోసారి హాట్టాపిక్గా మార్లిన్ మన్రో జీవితం..!) -
పరువు కాదు ముఖ్యం: ఆటిజం పిల్లలకు మాటివ్వండి!
యుకేలో ముప్పై ఏళ్లుగా పిల్లలు, టీనేజర్లు, వారి కుటుంబాలతో కలిసి పనిచేయడంలో నైపుణ్యం కలిగిన పీడియాట్రిక్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ సియాన్ విల్సన్. ఆటిజంలో క్లినికల్ స్పెషలిస్ట్గా స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. సోషల్ కోచ్గా సేవలు అందిస్తున్నారు.భారతదేశం పిల్లల్లో డిజేబిలిటీ ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయంపై సమీక్ష జరపడానికి ఇండియాకు వచ్చారు. పాతికేళ్లుగా చిల్డ్రన్ డిజేబిలిటీస్ పై వర్క్ చేస్తున్న మాధవి ఆదిమూలం, సియాన్ విల్సన్ లు యుకెలోనూ, ఇండియాలోనూ ఉన్న పరిస్థితులు, అమలు చేయాల్సిన విధానాల గురించి హైదరాబాద్లోని మాదాపూర్లో జరిగిన ఈవెంట్లో డిజేబిలిటీ చిల్డ్రన్ తల్లిదండ్రులతో కలిసి చర్చించారు.నాటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక థెరపిస్ట్గా పిల్లల వృద్ధికి దోహదపడేవారు. ఇప్పుడు తల్లితండ్రీ మాత్రమే కాదు ఒంటరి తల్లుల సంఖ్య పెరుగుతున్న ఈరోజుల్లో పిల్లల పెంపకం సమస్యగానే మారుతోంది అంటున్నారు నిపుణులు.స్పెషలిస్ట్లు ఎక్కువ‘‘యుకేలో స్పెషల్ చిల్డ్రన్ డెవలప్మెంట్కి సంబంధించిన విధానం, ఖర్చు అంతా అక్కడి కౌన్సిల్ చూసుకుంటుంది. కొన్నాళ్లుగా ఇండియాలోని ప్రముఖ చైల్డ్ డెవలప్మెంట్ క్లినిక్స్తో సంప్రదింపులు చేస్తున్నాను. ఇక్కడితో పోల్చితే యుకేలో స్పెషల్ చిల్డ్రన్ని చాలా చిన్నవయసులోనే గుర్తించడంలో అవగాహన అక్కడి పేరెంట్స్కు ఎక్కువ ఉంది. ఆటిజం చైల్డ్లో స్పీచ్ థెరపీ ద్వారా సరైన మెరుగుదలను తీసుకురావడానికి వారి స్థితిని బట్టి నార్మల్ స్కూల్ స్టూడెంట్స్తో కలుపుతారు. అయితే, అలాంటి ఒక చైల్డ్కి ఒక టీచర్ చొప్పున లెర్నింగ్ స΄ోర్ట్ అసిస్టెంట్ను కేటాయిస్తారు. అంటే, తన వయసు పిల్లలతో కలిసి ఉండే దోరణి వల్ల ఆ స్పెషల్ చైల్డ్లో మానసిక ఆరోగ్యం బాగవుతుంటుంది. ఎవరూ కూడా ఈ విధానానికి అడ్డు చెప్పరు’ అంటూ దేశంలో స్పెషల్ చైల్డ్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలియజేశారు సియాన్ విల్సన్.పరువు కాదు ముఖ్యం‘చాలా మంది తల్లులు తమ పిల్లల్లో ఉన్న ఆటిజం సమస్యను గుర్తించడమే లేదు. ఒక వేళ ఏదైనా డిజేబిలిటీ ఉన్నా బయటకు తెలిస్తే పరువు ΄ోతుంది అనుకుంటున్నారు. ‘మా అమ్మాయి/అబ్బాయిని ట్యూషన్కో లేదో మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్కో తీసుకెళుతున్నామని చెప్పి, తీసుకువస్తున్నామ’ని చెబుతున్నారు. టీనేజర్ స్థాయిలో ఉన్న పిల్లలను కూడా ఇంట్లోనే ఉంచుతున్నారు. వారికి ఎలాంటి థెరపీ ఇవ్వక΄ోవడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. దీంతో అప్పుడు నిపుణులను కలుస్తున్నారు. సమస్యను మొదట్లోనే గుర్తిస్తే, పరిష్కారం కూడా త్వరగా లభిస్తుంది’ అని వివరించారు థెరపిస్ట్ లక్ష్మీ ప్రసన్న.పరువుతో వెనకడుగు వేయద్దు‘‘అనన్య చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పేరుతో 19 ఏళ్లుగా ఆటిజం పిల్లలకు సేవలు అందిస్తున్నాను. మా బాబు స్పెషల్ కిడ్ అవడంతో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన నేను స్పెషలైజేషన్ చేసి, ఈ తరహా పిల్లల కోసమే పనిచేస్తున్నాను. ఇప్పుడు మా బాబు వయసు 24 ఏళ్లు. వాడు సంగీతంలో నైపుణ్యం సాధించడంతోపాటు ప్రదర్శనలు కూడా ఇస్తున్నాడు. మా బాబును ఇక్కడ సాధారణ స్కూల్లో చేర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. ఎడీహెచ్డీ ఆటిజం ఉన్న పిల్లల్లో మెరుగుదల కనిపిస్తున్నప్పుడు వారిని, మిగతా అందరిలాగే స్కూళ్లో చేర్చగలిగే శక్తిని కూడా అందించాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్లు సాధారణంగా ఎదుగుతారు. అంతేకాదు ఆటిజం పిల్లల పెంపకంలో వారిలో కొన్ని నైపుణ్యాలు కనిపిస్తుంటాయి. ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తమకు తాముగా పనులు చేసుకోవడమే కాదు నైపుణ్యాలను కూడా చూపుతారు. అందుకే ఈ విషయాల్లో గ్రామీణ స్థాయిలోనూ అవగాహన క్యాంపులను నిర్వహిస్తున్నాం. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. అక్యుపేషనల్ థెరపిస్ట్ల కొరత మన దగ్గర చాలా ఉంది. థెరపిస్ట్ల సంఖ్య, తల్లిదండ్రులలో అవగాహన పెరిగితే ఈ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది’ అని వివరించారు మాధవి ఆదిమూలం.– నిర్మలారెడ్డిఫొటోలు: బాలస్వామి, సాక్షి -
4 రోజుల నిరసనకు 4ఏళ్ల శిక్ష
భూమిపై వాతావరణ మార్పులు, కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల తవ్వకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలిపిన నలుగురు సామాజిక కార్యకర్తలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. మరో కార్యకర్తకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పురాతన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొనే యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కోర్టు తీర్పును ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. యూకేలోని ఉత్తర సముద్రంలో చమురు తవ్వకాలకు 2022లో అప్పటి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. లైసెన్స్లు ఇచ్చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2022 నవంబర్లో ‘జస్ట్ స్టాప్ ఆయిల్’అనే నినాదంతో సామాజిక కార్యకర్తలు నిరసన బాటపట్టారు. అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలను 22 ఏళ్ల గ్రెస్సీ గెథిన్ అనే యువతి ముందుండి నడిపించింది. ఈ ఉద్యమం పలువురిని ఆకర్శించడంతో వారు ఇందులో భాగస్వాములయ్యారు. భూగోళాన్ని కలుషితం చేసే చమురు తవ్వకాలు వద్దంటూ నినదించారు. లండన్ చుట్టూ ఉన్న మేజర్ రింగ్ రోడ్డుపై నాలుగు రోజులపాటు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చెట్లు, భవనాలపైకి ఎక్కి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇదంతా పూర్తిగా శాంతియుతంగానే సాగింది. హింస అనే మాటే లేదు. ఆస్తులకు గానీ, ప్రజలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు.లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందట! రింగ్ రోడ్డుపై బైఠాయింపులు, నిరసనలతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపిస్తూ గ్రెస్సీ గెథిన్తోపాటు పలువురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు అభియోగాలు మోపారు. దాదాపు రెండేళ్లపాటు లండన్ కోర్టులో విచారణ జరిగింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’నిరసనల వల్ల నాలుగు రోజులపాటు రింగ్ రోడ్డుపై 7 లక్షలకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని పోలీసుల తరఫున ప్రాసిక్యూటర్లు వాదించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 9.80 లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రోడ్డుపై పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు 1.3 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచి్చందని తెలిపారు. నిరసనకారులు కుట్రపూరితంగానే ప్రజలకు ఇక్కట్లు కలుగజేశారని ఆరోపించారు. ప్రాసిక్యూటర్ల వాదనతో లండన్ కోర్టు ఏకీభవించింది. గ్రెస్సీ గెథిన్తోపాటు లూయిసీ లాంకాస్టర్, డేనియల్ షా, లూసియాకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ ఈ ఏడాది జూలైలో తీర్పు వెలువరించింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’సహా వ్యవస్థాపకుడు రోజర్ హల్లామ్ ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం దోషులంతా జైలులో ఉన్నారు. వారి విడుదల కోసం సామాజిక కార్యకర్తలు పోరాడుతున్నారు. న్యాయం పోరాటం కొనసాగిస్తున్నారు. అహింసాయుతంగా జరిగిన నిరసనలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధించడం యూకే చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. శాంతియుత నిరసనలకు సైతం జైలుశిక్ష విధించేలా యూకేలో రెండు వివాదాస్పద చట్టాలు అమల్లో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మానవ వనరులను ఆకర్షించడంలో విఫలం
విదేశాల్లోని నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో యూకే ప్రభుత్వం విఫలమవుతోంది. దానివల్ల రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్షీణిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వెళ్లే వలసదారులు యూరప్లో పనిచేసేందుకు యూకేకు బదులుగా ఎక్కువ ఫ్రాన్స్, నెదర్లాండ్స్ను ఎంచుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.యూకే ప్రభుత్వం నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతుంది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ వెబ్సైట్ ఇండీడ్ ఆరు నెలలపాటు సర్వే చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం..యూరప్లో ఉద్యోగం చేయాలని భావించేవారిలో ఎక్కువగా అత్యధిక ప్యాకేజీ ఆశిస్తున్నవారే ఉన్నారు. యూకే ఉద్యోగం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ విధానాలు, తక్కువ వేతనాలు ఆఫర్ చేయడంతో ఆసక్తి చూపించడంలేదు. యూకే కంటే మెరుగైన వేతనాలు అందించే ఫ్రాన్స్, నెదర్గాండ్స్ను ఎంచుకుంటున్నారు. యూకేలో స్థానికులకు నైపుణ్యాలు పెంపొందిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశీయుల అవసరాన్ని తగ్గిస్తామని ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ గతంలో తెలిపారు. దాంతో అధిక నైపుణ్యాలు కలిగిన వారు ఆ దేశానికి వెళ్లకపోవడానికి ఇదో కారణంగా ఉంది. ఐటీ, ఇంజినీరింగ్ వంటి అత్యంత ఉత్పాదక రంగాల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. చాలా కంపెనీలు లేఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నవారిపైనే ఎక్కువ పని ఒత్తిడి ఉంటోంది.ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’2021లో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసిందనే వాదనలున్నాయి. దీనివల్ల అధిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో వెనకబడుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కంటే ముందు యూకేలో ఉద్యోగం చేయడానికి 54 శాతం విదేశీయులు ఇష్టపడేవారని కొన్ని సర్వేలు నివేదించాయి. ఇదిలాఉండగా, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొస్తే నైపుణ్యాలు కలిగిన విదేశీయులు యూకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతోపాటు స్థానికంగా మెరుగైన జీవిన విధానానికి సరిపడే వేతనాలు అందించినా పరిస్థితిలో మార్పులు వస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
సెంచరీ వయసులో స్కైడైవింగ్ చేసిన బామ్మ! ఏకంగా..!
సెంచరీ వయసులో సైడైవింగ్ చేసి చరిత్ర సృష్టించింది. అది కూడా ఓ స్వచ్ఛంద సంస్థ కోనం నిధులు సమకూర్చేందుకు చేయడం విశేషం. ఆ బామ్మ ఎవరంటే..?సఫోల్క్కు చెందిన మానెట్ బైల్లీ అనే బామ్మ 102 ఏళ్ల వయసులో ఈ సాహసం చేసి ఆశ్చర్యచకితులను చేసింది. ఆమె ఉమెన్స్ రాయల్ నావెల్ సర్వీస్కు మాజీ సభ్యురాలు. తన పుట్టిన రోజును స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరించే పనితో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. బైల్లీ ఒక ఛారిటీ ఈవెంట్లో భాగంగా యూకే పారాచూటింగ్ సర్వీసెస్ లిమిటెడ్తో కలిసి ఈ సాహసం చేసింది. ఆమె బెన్హాల్ విలేజ్ హాల్, మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్, ఈస్ట్ ఆంగ్లియన్ ఎయిర్ అంబులెన్స్ అనే మూడు ఛారిటీ సంస్థల కోసం ఈ నిధులను సేకరిస్తోంది. ఇప్పటి వరకు దగ్గర దగ్గర రూ. 11 లక్షలు సేకరించింది. అయితే రూ. 33 లక్షల వరకు నిధులు సేకరించాలనేది ఆ బామ్మ లక్ష్యం. ఈ బామ్మ ఈస్ట్ ఆంగ్లియాలోని బెక్లెస్ ఎయిర్ఫీల్డ్ నుంచి ఏకంగా ఏడు వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసింది. ఈ మేరకు స్థానికి మీడియాతో మాట్లాడుతూ.."నాకు చేసేటప్పుడూ కొంచెం భయంగా అనిపించింది. గట్టిగా కళ్లు మూసుకున్నానని ఒపుకోవాల్సిందే. ఆ తర్వత ధైర్యంగానే ఉన్నట్లు తెలిపింది. అంతేగాదు తన ఆరోగ్యకరమైన వృధాప్యం గురించి కూడా మాట్లాడారు. ఎనిమిది లేదా తొమ్మిది పదుల వయసులో దేన్ని వదులుకోకూడదు. ఈ వయసులో కూడా తాను ఫిట్గా ఉండటం అనేది అదృష్టం అనే చెప్పాలి. తన వయసులోనే ఉన్న ఇతర వ్యక్తులు ఆర్థరైటిస్తో వికలాంగులుగా మారారు. అయితే తాను అలా ఉండేందుకు ఇష్టపడనని అంటోంది." ఈ బామ్మ. కాగా, ఆమె ఇలాంటి సాహసాలు చేయడం మొదటిసారి కాదు. తన వందో పుట్టిన రోజు సందర్భంగా కూడా ఇలాంటి సాహస కృత్యమే చేసింది. సిల్వర్స్టోన్ చుట్టూ 130 మీటర్ పర్ అవర్ వేగంతో ఫెరారీ కారుని నడిపి మరో రికార్డుని నెలకొల్పింది. తన స్నేహితుడి తండ్రి 85 ఏళ్ల వయసులో ఇలాంటి సాహసకృత్యాలు చేయడం చూసి స్ఫూర్తి పొందానని అన్నారు. బామ్మ బైల్లీ ధైర్యం, సమాజం కోసం నిస్వార్థంగా చేస్తున్న కృషి బ్రిటన్ రాజ కుంటుంబాన్ని ఆకర్షించింది. అంతేగాదు ప్రిన్స్ విలియం ఆ వయసులో ఆ బామ్మ చలాకీగా చేస్తున్న సాహసాలను మెచ్చుకున్నారు. వందవ పుట్టిన రోజునే ఫెరారీ రేసింగ్తో చరిత్ర సృష్టించిన మీరు ఈ స్కైడైవింగ్ని అవలీలగా చేయగలరు. ఆశ్చర్యపోనవసరం లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ బామ్మ ఆరోగ్య రహస్యం..ఎప్పుడూస్నేహితులు, ప్రజల మధ్య ఉంటుంది. బిజీగా ఉంటుంది. ప్రతిదానిపై ఆసక్తిని కలిగి ఉంటుంది. తన చుట్టూ ఉన్నవారి పట్ల దయతో ప్రేమగా మెలుగుతుందట. అవే ఆమె దీర్ఘాయువుకి కారణం అని ఆనందంగా చెబుతోంది బైల్లీ.The incredible Manette Baillie skydiving this morning at Beccles airfield for her 102nd birthday sponsored by Goldster!! #manettebaillie #102yearoldskydiver pic.twitter.com/q1FOZtqzyU— Goldster (@GoldsterClub) August 25, 2024 (చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!) -
26 ఏళ్ల పాటు కారవాన్లో బానిసగా..ఏకంగా రూ. 3.75 కోట్లు..!
సంపన్న కుటుంబాలు బలహీనులను బానిసలుగా చేసుకుని ఇష్టరాజ్యంగా వారిచేత వెట్టిచాకిరీ చేయించుకునేదని కథకథలుగా విన్నాం. అలా బానిసలుగా బంధీలై కొందరూ ప్రాణాలు కూడా కోల్పోయేవారు. అచ్చం అలాంటి దారుణమైన క్రూరత్వానికి ఓ సంపన్న కుటుంబం ఒడిగట్టింది. అందుకుగానే ఏళ్ల పాటు శిక్షలు కూడా అనుభవించింది. చాలామంది న్యాయం పొందేలోపు మరణించగా ఓ వ్యక్తి పరిహారంగా కోట్లు పొందాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే..రెండు దశాబ్దాలుగా రూనీస్ అనే సంపన్న కుటుంబ బలహీన వ్యక్తులను తమ బానిసలుగా బంధీలను చూసి ఇష్టారాజ్యంగా వారి జీవితాలతో ఆడుకున్నారు. వారి అవసరాల కోసం వీళ్లని పనివాళ్లగా నియమించుకుని తక్కువ వేతనాలు ఇవ్వడమే గాక క్రూరంగా హింసించేవారు. కొంతమందిని అయితే వారి డిమాండ్లను నెరవేర్చకపోతే చంపేస్తామని బెదిరించేవారు కూడా. అలా వారి చేతిలో బానిసగా బంధీ అయ్యి ఏకంగా 26 ఏళ్లుపాటు మురికి కారావాన్లో చిత్రహింసలకు గురైన వ్యక్తికి ఇప్పటకీ న్యాయం లభించింది. ఆ సంపన్న కుటుంబం దాష్టికానికి 15 మంది వ్యక్తులు న్యాయం పొందక ముందే మరణించారు. అందుకు గాను 2017లో ఆ రూనీ కుటుంబ సభ్యులు 11 మంది ఏకంగా 79 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. కానీ ఆ బాధితుల్లో ఒకే ఒక్క వ్యక్తి ఎట్టకేలకు న్యాయం జరిగి ఏకంగా రూ. 3.75 కోట్లు నష్టపరిహారం అందుకోనున్నాడు. వారి హేయమైన చర్యలు ఆ బాధితుల జీవితాల్లో నీలి నీడల్లా వెంటాడుతూనే ఉండటం బాధకరం. అంతేగాదు సదరు బాధితుడు ఆ ఆర్థిక భద్రతకు తగిన సంరక్షణను పొందే అవకాశం కూడా యూకే ప్రభుత్వం అందించింది. అయితే చాలామంది ఆ బాధితుడు అపరిశుభ్రమైన కార్వాన్లో అనుభవించిన దారుణమైన నరకానికి ఈ నగదు ఏ మాత్రం సరితూగదని అనడం గమనార్హం. (చదవండి: మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!) -
షేక్ హసీనాకు బ్రిటన్ షాక్ ఇవ్వనుందా?
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అయితే ఆమె తన సోదరితో కలిసి బ్రిటన్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అనుమతులను ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం షేక్ హసీనా బ్రిటన్కు వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ దేశ హోంశాఖ కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇతర దేశాల చెందిన వ్యక్తులు బిట్రన్లో ఆశ్రయం లేదా తాత్కాలిక ఆశ్రయం పొందడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అనుమతించవు. కానీ, అత్యవసరమైన సమయంలో ఆశ్రయం కావాలనుకునేవారికి గతంలో భారీగా కల్పించిన రికార్డు బ్రిటన్ సొంతం. అంతర్జాతీయ రక్షణ అవసరం కావాలనుకునేవారికి.. వారు చేరుకునే దేశం సురక్షితమైనదై ఉండాలి. అప్పుడే వారు సురక్షితమైన భద్రతను పొందగలరు’ అని పేర్కొంది. బ్రిటన్ హోంమంత్రి శాఖ ఈ ప్రకటన చేసినప్పటికీ షేక్ హాసీనా అధికారిక ఆశ్రయానికి సంబంధించిన అభ్యర్థనపై అనుమతి ప్రక్రియ కొనసాగుతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. షేక్ హసీనా అసలు భారత్ను వదిలి బ్రిటన్కు వెళ్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది.మరోవైపు.. గత నెలలో బ్రిటన్లో లేబర్ అధికారంలోకి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో ఆశ్రయం కోరే వ్యక్తులకు బ్రిటన్ మొదటి సరక్షితమైన దేశమని ఎన్నికల సమయంలో ప్రకటించటం గమనార్హం. మరోవైపు.. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది’అని విదేశాంగ శాఖ మంత్రి జైశంక పేర్కొన్నారు. -
యూకే వైపు షేక్ హసీనా.. అప్పటి వరకు భారత్లోనే
ఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్కు చేరుకున్నారు షేక్ హసీనా.ఘజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్బేస్కు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి హసీనా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదేశం నుంచి అనుమతి రాగానే లండన్ బయలు దేరి వెళ్లే అవకాశం ఉంది.దేశం విడిచి పెట్టిన షేక్ హసీనా కుమారుడు సజీవ్ వాజెద్ జాయ్ ప్రకటించారు. వెనకబడిన దేశాన్ని అభివృద్ధి పదం వైపు దూసుకెళ్లేలా చేసిన హసీనా దేశంలో చెలరేగిన అల్లర్లపై అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. -
శస్త్రచికిత్స చేస్తుండగా 25 నిమిషాల పాటు ఆగిన గుండె..కట్చేస్తే..!
అత్యవసర శస్త్ర చికిత్స చేస్తుండగా ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. అయినా మత్యుంజయుడై బయటపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ భయానక ఘటన యూఎస్లో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..యూకేకి విశ్వవిద్యాలయ విద్యార్థి చార్లీ విన్సెంట్ యూఎస్లో న్యూ హాంప్షైర్లోని వేసవి శిబిరంలో కానోయింగ్ బోధకుడిగా పనిచేస్తున్నాడు. ఆరోజు అధిక సూర్యరశ్మీ అతని కాళపై పడటంతో కాలిన గాయాల బారిన పడ్డాడు. అయితే అతడు దీన్నేం పట్టించుకోకుండా పనిచేస్తూనే ఉన్నాడు. చివరికి వడదెబ్బకు ురై ఆస్పత్రిపాలయ్యాడు. అక్కడ వైద్య పరీక్షలో అతడికి న్యూమోనియా ఉన్నట్లు నిర్థారించారు. దీంతో అతడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ క్రమంలో అతడికి స్ట్రోక్ రావడం ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం జరిగింది. వైద్యులు సైతం పరిస్థితి చేయి దాటిందనే అనుకున్నారు. ఆశ్చర్యకరంగా అతడి గుండె యథాస్థితికి వచ్చిన పనిచేయడం ప్రారంభమయ్యింది. ఈ రికవరీని వైద్యులు అద్భుతంగా అభివర్ణించారు. దీనిని కార్డియోమొగలీ అని పిలుస్తారని వైద్యులు అన్నారు. అంటే ఇక్కడ గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ 20 ఏళ్ల యువకుడిని దాదాపు ఏడు రోజుల పాటు ప్రేరేపిత కోమాలో ఉంచి చికిత్స అందించారు. మొదట్లో వైద్యులు భయపడిపోయారు. ఎందుకంటే.. ఇక్కడ ఆ వ్యక్తి గుండె, మూత్రపిండాల మార్పిడి అవసరమవ్వడంతో బతికే అవకాశాలు తక్కువని భావించారు వైద్యులు. అలాంటిది అనూహ్యంగా అన్ని అవయవాలు అద్భుతంగా కోలుకుని పనిచేయడం ప్రారంభించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు వైద్యులు. ఈ మేరకు అతడి చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ..ఒకానొక సమయంలో చార్లీ బతికే అవకాశాలు లేవని అనిపించేలా ఉత్కంఠగా ఉంది పరిస్థితి. అతడు అద్భుతంగా తిరిగి కోలుకోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించిదని అన్నారు. సదరు బాధితుడు చార్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించాడు.(చదవండి: బిడ్డకు తల్లయినా ఎంతో ఫిట్గా ఆలియా.. సీక్రెట్ ఏంటంటే?) -
బాప్రే.. పార్కింగ్ జరిమానా రూ.11 లక్షలా?
లండన్: మూడేళ్ల నుంచి నిత్యం తాను పార్కింగ్ చోటే కదా అనుకుంది. ఎప్పటిలాగే ఆరోజూ తన వాహనాన్ని నిలిపింది. తీరా చూస్తే అధికారులు.. కొత్త రూల్ పేరుతో ఆమెకు పెద్ద షాకిచ్చారు. వాళ్లు పంపిన జరిమానా చూసి ఆమె కళ్లు బయర్లు కమ్మాయి. యూకేలోని కౌంటీ దుర్హంలో హెన్నా రాబిన్సన్కు చేదు అనుభవం ఎదురైంది. ఫీథమ్స్ లీజర్ సెంటర్లో ఐదు నిమిషాల పార్కింగ్ రూల్ కారణంగా.. ఆమె 11 వేల పౌండ్లు(మన కరెన్సీలో రూ.11 లక్షలు) చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే పర్మిట్ కోసం తాను డబ్బులు చెల్లించినప్పటికీ.. ఈ జరిమానాను అందుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోతున్నారు. 2021 నుంచి ఆమె ఆ పార్కింగ్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే కొత్త రూల్ అమలయ్యాక.. అప్పటి నుంచి ఆమె కారు కదలికలను అధికారులు లెక్కేశారు. అలా మొత్తం 67 చలాన్లకు.. ఒక్కో చలాన్కు 170 పౌండ్లు(1,800రూ.) చొప్పున ఇప్పుడు జరిమానా విధించారు. యూకేలో ఎక్సెల్ పార్కింగ్ సర్వీసెస్(EPS) తాజాగా ఈ ఐదు నిమిషాల నిబంధనను అమల్లోకి తెచ్చింది. కొందరు డ్రైవర్లు పార్కింగ్ ఏరియాల దగ్గర ఉత్తపుణ్యానికి వెయిట్ చేయడం, డబ్బులు చెల్లించకుండా కార్ పార్కింగ్లను పికప్ ఏరియాలుగా ఉపయోగించుకుంటుండడంతోనే ఈ రూల్ను తేవాల్సి వచ్చిందని ఈపీఎస్ చెబుతోంది. ఐదు నిమిషాల రూల్ ప్రకారం.. కార్క్ పార్కింగ్ దగ్గర ఏర్పాటు చేసే ఏఎన్పీఆర్ కెమెరాలు ఎంట్రీని, ఎగ్జిట్ను రికార్డు చేసి.. ఛలానాను జనరేట్ చేస్తాయి. అయితే.. కస్టమర్స్ అక్కడికి చేరుకున్న ఐదు నిమిషాల్లోపే టికెట్ కొనాల్సి ఉంటుంది. కానీ, కార్ పార్క్ వద్ద ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో ట్రాన్జాక్షన్స్ తాను చేయలేకపోయానని హెన్నా రాబిన్సన్ చెబుతోంది. ఆమె మాత్రమే కాదు.. ఇలా పార్కింగ్ వద్ద ఐదు నిమిషాల నిబంధన కారణంగా తామూ చలాన్లు అందుకున్నామంటూ పలువురు వాపోతున్నారు ఇప్పుడు. -
నిద్రలో తేడాలొచ్చినా టైప్-2 డయాబెటిస్ ముప్పు
టైప్ 2 డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతున్న సమస్య. దాదాపు 90 నుండి 95శాతం ఈ తరహా డయాబెటిస్తో బాధపడుతున్నారు. 2021లో ప్రపంచంలో 540 మిలియన్ల మధుమేహ కేసులు (ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్, 2021) ఉన్నట్లు అంచనా. ఒత్తిడి, నిశ్చల జీవనశైలి , నాణ్యత లేని, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వంటి కారణాలతో మధుమేహం విస్తరిస్తోంది. అయితే తాజా అధ్యయనం ప్రకారం అతిగా నిద్రపోవడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట.మనిషి ఆరోగ్యంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సమయా పాలన పాటించని నిద్రకూడా ప్రమాదమే అంటున్నారు. హెచ్చు తగ్గుల నిద్రకు మన ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. నిద్ర వ్యవధిని తరచూ మార్చుకునే వారికి డయాబెటిస్ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని తాజా పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఈ పరిశోధన ప్రకారం తమ నిద్ర వ్యవధిని 31 నుంచి 45 నిముషాల పాటు మార్చుకోవడం (నిద్ర వ్యవధి ఎక్కువ/తక్కువ చేయడం) వల్ల 15 శాతం డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. ఈ వ్యవధి గంటకు మించి ఉంటే ఆ ప్రమాదం 59 శాతం పెరుగుతుంది. అతి నిద్ర కారణంగా కారణంగా డయాబెటిస్ సోకే అవకాశాలు 34 శాతం అధికంగా ఉంటుంది.జూలై 2024 అధ్యయనం మరియు డయాబెటిస్ కేర్లో దీన్ని ప్రచురించారు. యూకే బయో బ్యాంక్ ద్వారా పరిశోధకులు యాక్సిలోమీటర్లు (స్మార్ట్ వాచ్) ద్వారా 84 వేల మంది నిద్ర నమూనాలను పరిశీలించారు. అతి నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా డయాబెటిస్కు దారితీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. నిద్రలేమి కారణంగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావడమే కాక, తీవ్ర రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, హృద్రోగ సంబంధ వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధన పేర్కొంది. క్రమరహిత నిద్ర అనేది ఆధునిక జీవనశైలితో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్య. వృత్తి, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, కుటుంబ కట్టుబాట్ల కారణంగా ప్రజలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు, ఇది వారి నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రకు ముందు మొబైల్ ఫోన్ల వంటి డిజిటల్ పరికరాల వినియోగం పెరగడం మరో ప్రధాన అంశం. మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పేలవమైన నిద్ర భవిష్యత్తులో మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
సంచలన నిర్ణయం.. ఆ స్టేడియంలో సిక్స్ కొడితే ఔట్! ఎక్కడంటే?
ప్రస్తుతంక్రికెట్లో ఫార్మాట్తో సంబంధం లేకుండా ఆటగాళ్లు బౌండరీలు బాదడానికి పోటీ పడుతున్నారు. ఆటగాళ్లు సిక్స్లు, ఫోర్లు కొడితేనే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందుతోంది. కానీ ఓ చోట మాత్రం ఇకపై సిక్స్లు కొట్టడం నిషేధం. అవును మీరు విన్నది నిజమే. రూల్స్ను అతిక్రమించి సిక్స్ కొడితే ఔటై పెవిలియన్కు వెళ్లాల్సిందే. ఈ రూల్స్ వింటుంటే గల్లీ క్రికెట్ గుర్తుస్తోంది కదా? అస్సలు విషయం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.ఇంగ్లండ్లోని సౌత్విక్ అండ్ షోర్హామ్ క్రికెట్ క్లబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్టేడియంలో ఆటగాళ్లు ఇకపై సిక్స్లు కొట్టడాన్ని ఈ క్లబ్ నిషేధించింది. క్రికెటర్లు కొట్టే సిక్స్ల వల్ల తమకు ఆస్తి నష్టం, భద్రతా సమస్యలు తలెత్తున్నాయని స్టేడియం సమీపంలోని నివాసితులు క్లబ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.సౌత్విక్ అండ్ షోర్హామ్ స్టేడియం వద్ద వలలను ఏర్పాటు చేసినప్పటికీ కారుల అద్దాలు దెబ్బ తినడంతో పాటు చాలా మందికి గాయాలు కూడా తరుచుగా అవుతన్నాయి. ఈ క్రమంలోనే సౌత్విక్ అండ్ షోర్హామ్ క్రికెట్ క్లబ్ ఈ విచిత్ర నిర్ణయాన్ని తీసుకున్నాయి.కాగా సిక్స్లు కొట్టడాన్ని నిషేధించడంతో పాటు మరో కొత్త రూల్ను కూడా అమలు లోకి తీసుకు వచ్చింది. ఇకపై ఏ ఆటగాడైనా సిక్స్ కొడితే మొదటి తప్పుగా పరిగణించి పరుగులను లెక్కలోకి తీసుకోరు. అనంతరం రెండో సారి సిక్స్ కొడితే అంపైర్లు ఔట్గా ప్రకటిస్తారు.ఇదే విషయంపై క్లబ్ కోశాధికారి మార్క్ బ్రోక్సప్ మాట్లాడుతూ.. "గతంలో క్రికెట్ అంటే చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ట్వంటీ-ట్వంటీ క్రికెట్ పుట్టుకరావడంతో ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. దాంతో మా స్టేడియంలో జరిగే మ్యాచ్ల వల్ల సమీపంలోని నివాసితులకు ఇబ్బందులు తలెత్తున్నాయి. అందుకే ఇకపై సిక్స్లు కొట్టడాన్ని నిషేధించామని" పేర్కొన్నారు. -
యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్ ..బడ్జెట్ బాధ్యత ఆమెదే..!
గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కైర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మెజారిటీ ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా 45 ఏళ్ల రాచెల్ రీవ్స్ నియమితులయ్యారు. ఆమె ఇప్పుడు బడ్జెట్కు బాధ్యత వహిస్తున్నారు. ఆమె ఈ అత్యన్నత పదవిని దక్కించుకుని..తన కెరీర్లోనూ,యూకే చరిత్రలోనూ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. యూకే కొత్త ప్రధాని కైర్ స్టార్మర్ ద్వారా ఈ అత్యున్నత పదవీలో నిమితులయ్యారు రీవ్స్. ఈ మేరకు రీవ్స్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా..ఖజానకు ఛాన్సలర్గా నియమించడబడటం తన జీవితంలోని గొప్ప గౌరవంగా భావిస్తున్నా అన్నారు. ఎవరీ రాచెల్ రీవ్స్..?లండన్ బోరో లెవిషామ్లోని విద్యావేత్తలకు ఫిబ్రవరి 13, 1979న జన్మించిన రీవ్స్ ఎల్లప్పుడూ సమగ్ర విద్యను నేర్చుకోవడం పట్ల అత్యంత ఆసక్తి కనబర్చేది. ఆమె న్యూ కాలేజీ ఆక్స్ఫర్డ్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం రీవ్స్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లో దాదాపు ఒక దశాబ్దం పాటు ఆర్థికవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ రంగానికి మారారు. రీవ్స్ 2021లో లేబర్ ఫైనాన్స్ పాలసీ చీఫ్గా పనిచేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న స్టార్మర్ వద్ద షాడో ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్గా పని చేశారు. అంతేగాదు ఆమె అనేక చెస్ ఛాంపియన్షిప్ టైటిళ్లను కూడా గెలుచుకుంది. తన తండ్రి ప్రభావంతో రాజకీయాలవైపు మొగ్గు చూపారు రీవ్స్. అలా 2010లో లిబరల్ డెమోక్రాట్లతో సంకీర్ణంలో కన్జర్వేటివ్లు అధికారంలోకి వచ్చినప్పుడు, రీవ్స్ ఉత్తర ఇంగ్లాండ్లోని లీడ్స్ వెస్ట్కు లేబర్ ఎంపీగా ఎన్నికయ్యారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత స్టార్మర్ ఆమెను లేబర్ ఆర్థిక ప్రతినిధిగా నియమించారు. అలాగే ఆమె సోదరి ఎల్లీ రీవ్స్ కూడా లేబర్ పార్టీ ఎంపీ.ప్రస్తుతం రీవ్స్ యూకే తొలి మహిళా ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్గా మందగమన వృద్ధి, అధిక రుణాలు, అత్యధిక పన్ను భారం వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంది. ఆమె వీటన్నింటిని అధిగమించేలా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన ఆర్థిక విధానాల పట్ల నిబద్ధత వ్యవహరించి ఆర్థిక పాలనా ప్రపంచంలో మంచి విజయం సాధించాలనే సంకల్పంతో ఉంది రాచెల్ రీవ్స్.(చదవండి: సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం చేసిన ఆ పర్యటనే..) -
యూకే ఎన్నికల్లో గెలిచిన కైర్ స్టార్మర్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖతాలో ఒక పోస్ట్ పెట్టారు.‘యూకే సార్వత్రిక ఎన్నికలలో అపూర్వ విజయం సాధించిన కీర్ స్టార్మర్కు హృదయపూర్వక అభినందనలు. భారత్-యూకే మధ్య పరస్పర వృద్ధి, శ్రేయస్సును పెంపొందిస్తూ అన్ని రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీ సానుకూల, నిర్మాణాత్మక సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను.’ అని పేర్కొన్నారు.అదేవిధంగా ఎన్నికల్లో ఓటమి పాలైన కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు సైతం మోదీ తన సందేశాన్ని అదించారు. సునాక్ అద్బుతమైన నాయకత్వం, భారత్-యూకే సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.కాగా యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. Heartiest congratulations and best wishes to @Keir_Starmer on the remarkable victory in the UK general elections. I look forward to our positive and constructive collaboration to further strengthen the India-UK Comprehensive Strategic Partnership in all areas, fostering mutual…— Narendra Modi (@narendramodi) July 5, 2024 -
బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఆసక్తికర నేపథ్యం
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. 650 సీట్లున్న పార్లమెంట్లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెల్చుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.కీర్ స్టార్మర్ మాజీ మానవ హక్కుల న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మ్యూజీషియన్ కూడా. ఆయన వయసు ప్రస్తుతం 61 ఏళ్లు. గత 50 ఏళ్లలో ఈ వయసులో బ్రిటన్ ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. అంతేగాక పార్లమెంట్కు ఎన్నికైన తొమ్మిదేళ్లలోనే ప్రధానమంత్రి పదవి చేపడుతుండటం మరో విశేషం.సెప్టెంబరు 2, 1962న జన్మించిన కీర్.. రోడ్నీ స్టార్మర్, లండన్ శివార్లలో ఒక ఇరుకైన ఇంట్లో బాల్యాన్ని గడిపాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు. లీడ్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో న్యాయ విద్యను అభ్యసించాడు. అనంతరం వామపక్ష కారణాలు, డిఫెండింగ్ ట్రేడ్ యూనియన్లు, మెక్డొనాల్డ్స్ వ్యతిరేక కార్యకర్తలు, విదేశాల్లోని ఖైదీల మరణ శిక్షలు వంటి వాటిపై దృష్టి సారించాడు. అనంతరం మానవ హక్కుల న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడుతొలుత 2003లో ఉత్తర ఐర్లాండ్లోని పోలీసులు మానవ హక్కుల చట్టంలో చిన్న ఉద్యోగంలో చేరాడు. అయిదేళ్ల తర్వాత లేబర్ పార్టీకి చెందిన గోర్డాన్ బ్రౌన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్గా నియమితుడయ్యాడు.2008 నుంచి 2013 మధ్య వరకు ఎంపీలు తమ ఖర్చులను దుర్వినియోగం చేయడం, జర్నలిస్టుల ఫోన్ హ్యాకింగ్, గ్లండ్లో యువత అల్లర్ల వంటి విచారణలను ఆయన పర్యవేక్షించాడు. తన పనితనంతో క్వీన్ ఎలిజబెత్ 2 చేత నైట్ ర్యాంక్ బిరుదు పొందారు. 50 ఏళ్ల వయసులో కీర్ స్టామర్ రాజకీయాల్లోకి రావడం గమనార్హం. 2015 నార్త్ లండన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.స్టార్మర్కు వివాహం కాగా భార్య పేరు విక్టోరియా. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లల ఉన్నారు. శుక్రవారం వరకు పనిలో నిమగ్నమయ్యే కీర్.. శని, ఆదివారాలు మాత్రం పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తాడు.రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో సుధీర్ఘకాలం కొనసాగారు. ఆయన ఆధునిక రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటారనే పేరు ఉంది. ఈ ఎన్నికల్లో బ్రిటన్లో రాజకీయాలను తిరిగి సేవలోకి తీసుకురావాలి.. పార్టీ కంటే దేశం ముందు అనే ప్రధాన నినాదాలతో ప్రచారంలో ముందుకు సాగారు. గత 14 ఏళ్లలో కన్జర్వేటివ్ పార్టీ అయిదుగురు ప్రధానులను మార్చిన ఉద్దేశంలో ఆయన ఈ నినాదాలను నడిపించారు.ప్రజలు మార్పును కోరుకుంటే వారు లేబర్ పార్టీకి ఓటు వేయాలని ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పారు. దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి మా పార్టీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలి.2019 తర్వాత లేబర్ పార్టీ ప్రధాన నాయకుడిగా అవతరించిన కీర్.. తమ ప్రభుత్వం మొత్తం దృష్టి దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆరోగ్య సేవపైనే ఉంటుందని చెప్పారు.కాగా యూకే పార్లమెంట్లో మొత్తం 650 సీట్లు ఉండగా 400కు పైగా మెజార్టీ స్థానాల్లో లేబర్ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. ఆపార్టీ చీఫ్ కీర్ స్టార్మర్ తన నియోజకవర్గం లండన్లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్క్రాస్లో 18,884 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాను గెలిపించినందుకు నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ ఈ సందర్భంగా స్టార్మర్ ప్రకటించారు.ఇక రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కేవలం 112 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీంతో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతుంది. భారత్- బ్రిటన్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్-యూకే సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. యూకే- భారత్ సంబంధాలను బలోపేత చేయడం తన విదేశాంగ విధానం ఎజెండాలో కీలక అంశమని గతంలో స్టార్మర్ పేర్కొన్నాడు. కశ్మీర్ వంటి సమస్యలపై లేబర్ పార్టీ వైఖరిని కూడా తెలియజేస్తూ.. భారత్తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), సాంకేతికత, భద్రత, విద్య, వాతావరణ మార్పులలో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్తో సంబంధాలను పెంచుకోవాలనే ఆశయంతో ఉన్నట్లు నొక్కిచెప్పారు. ఇక భారత్తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్ధతతో ఉన్నట్లు అతని మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. కాగా గత రెండు ఏళ్లుగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై భారతదేశం, బ్రిటన్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
నేరస్తుడా? నిరపరాధుల పాలిట దైవమా.. ! ఏకంగా 50 ఏళ్లు జైల్లోనే..
ఓ వ్యక్తి కరుడుగట్టిన నేరస్తుడి మాదిరిగా దారుణమైన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అంటరానివాడిలా ఒక ప్రత్యేక భద్రతతో కూడిన సెల్లో ఉన్నారు. అతడికి ఆహారం సైతం ఓ రంధ్రం గుండా పంపిస్తారు జైలు అధికారులు. కానీ అతడి నేరాల చరిత్ర వింటే..నేరస్తుడా లేదా నిరపరాధిల పాలిట రక్షకుడా అన్న ఫీలింగ్ వస్తుంది. లేక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో చట్టాన్ని చేతిల్లోకి తీసుకుని దుర్మార్గులని దునుమాడిన మహోన్నత వ్యక్తి ఏమో..! అనే భావన కలుగుతుంది. పైగా బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం ఒంటిరిగా నిర్భంధంలో ఉన్న ఖైదీగా నిలిచిపోయాడు. అతడెవరంటే..బ్రిటన్లో అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నాడు రాబర్ట్ మాడ్స్లీ. ప్రస్తుతం అతడు వేక్ఫీల్డ్ జైలులో ఉన్నాడు.అతని జైలు గది 18 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండి, 17 ఉక్కు తలుపుల వెనుక ఉంటుంది.ఈ గది కాల్పులు తట్టుకునేంత దృఢంగా ఉంటుంది.“ఇన్సైడ్ వేక్ఫీల్డ్ ప్రిజన్” అనే పుస్తకంలో జోనాథన్ లెవి, ఎమ్మా ఫ్రెంచ్లు రాసినట్లుగా, మాడ్స్లీ జైలు గదిలోని టేబుల్, కుర్చీలు కార్డ్బోర్డ్తో తయారు చేశారు.టాయిలెట్, సింక్ నేలకు బిగించబడి ఉంటుంది. అతనికి అందించే భోజనం కూడా ఒక చిన్న రంధ్రం గుండా పంపిస్తారు. నిజానికి మాడ్సీ 21 ఏళ్ల వయసు నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు. అతడి నేరాలు గురించి తెలుసుకుని విస్తుపోతారు. ఎందుకంటే అతడు ఖైదీనా నిరపరాధుల పాలిట దైవమా..!అనిపిస్తుంది. చేసిన నేరాలు..1974లో, చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసిన 30 సంవత్సరాల వ్యక్తి జాన్ ఫారెల్ని అతను చంపేశాడు.ఆ తర్వాత 1977లో, అతను మరో ఖైదీతో కలిసి, చిన్నపిల్లలపై లైంగిక దాడి నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ ఫ్రాన్సిస్( David Francis )ని చంపేశాడు.వేక్ఫీల్డ్ జైలులో కూడా మాడ్స్లీ నేరాలు కొనసాగాయి.1978 జులై 29న, తన భార్యను హత్య చేసిన ఖైదీ సల్నీ డార్వడ్ని హతమార్చాడు.అంతేకాకుండా, ఏడేళ్ల బాలికపై అత్యాచార చేసిన బిల్ రాబర్ట్స్ను కూడా చంపేశాడు.ఈ హత్యల కారణంగా, అధికారులు మాడ్స్లీని ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం చాలా ప్రమాదకరమని భావించారు.ఫలితంగా, 1983లో అతని కోసం ప్రత్యేక అద్దాల గదిని నిర్మించారు. అప్పటి నుంచి, అతను అదే గదిలో ఉన్నాడు. తన జైలు జీవితాన్ని మాడ్స్లీ ఒకసారి నరకంలో బంధించడం లాగా ఉందని వర్ణించాడు. ప్రస్తుతం అతని వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ అదే జైలులో ఉండడం వల్ల, అతన్ని నేరస్తుడిగా చూడాలా లేక నిరపరాధుల రక్షకుడిగా భావించాలా అనే సందేహం బ్రిటన్ ప్రజల్లో కలుగుతుంటుంది. కనీసం ఇప్పుడైనా మాడ్స్లీ క్షమాభిక్ష పెట్టి స్వేచ్ఛగా జీవించేలా చేస్తే బాగుండనని కొందరూ భావిస్తుండటం విశేషం. (చదవండి: ఆ ఫోబియాకు పుస్తకాలతో చెక్పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్విమెన్!) -
యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!
మన దేశంలో సమ్మర్ సీజన్లో జూన్ నుంచి జూలైలో కాస్త కూరగాయల ధరలు మండిపోతుంటాయి. సామాన్యుడికి కొనాలంటేనే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో అకాల వర్షాలు లేదా వర్షాలు పడక తగు మోతాదులు కూరగాయలు పండపోవడం తదితర కారణాల రీత్యా ధరలు ఆకాశన్నంటేలా పలుకుతాయి. అయితే మరీ విదేశాల్లో ఉండే భారతీయ కిరాణ స్టోర్లో సరకులు ధరలు మాములుగానే ఓ రేంజ్లో ధర పలుకుతాయి. కానీ ఇప్పుడూ మాత్రం ఆ ధరలు అలా ఇలా లేవు. కనీసం ఆ స్టోర్ వైపు చూపు పోయే సాహసమే చేయలేనంతగా ఘోరంగా ధరలు పలుకుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన చావీ అగర్వాల్ ప్రస్తుతం లండన్లో నివశిస్తున్నట్లు తెలిపారు. తాను లండన్లోని భారతీయ కిరణా స్టోర్ వద్దకు వచ్చానని ఇక్కడ ఒక్కో ఐటెం ధర వింటే విస్తుపోతారంటూ వాటి ధరలు వివరాలు చెబుతున్నారు. అక్కడ సరుకులు ధరలు వరుసగా.. రూ. 20లు ఖరీదు చేసే లేస్ మ్యాజిక్ మసాలా ప్యాకెట్ను లండన్లో ఏకంగా రూ.95కి విక్రయిస్తున్నారు. అలాగే మ్యాగీ ప్యాకెట్ రూ. 300లు, పనీర్ ధర రూ. 700, అల్ఫోన్సో మామిడి కాయలు ఆరు రూ. 2400, బెండకాయలు కేజీ రూ. 650, పొట్టకాయం రూ. 1000 అంటూ వరుసగా వాటి ధరలు వివరంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోని చేసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరూ రెండు దేశాల మధ్య ఆదాయ అసమానతలు, కొనుగోలు శక్తి, సమానత్వం వంటి అంశాలను లేవనెత్తగా, ఇంకొందరూ అయితే ఇప్పుడే లండన్లో కిరాణ దుకాణం ప్రారంభిస్తే బెటర్ ఏమో అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Chavi Agarwal | Honest London Life (@nine2fivelife) (చదవండి: చల్లని వర్సెస్ వేడి నీళ్లు: బరువు తగ్గేందుకు ఏది బెటర్?) -
మహిళా సాధికారత థీమ్తో యోగా డే
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతియేటా జూన్ 21న నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా యునైటెడ్ కింగ్డమ్ (యుకె)లోని భారత హైకమిషన్ ట్రఫాల్గర్ స్క్వేర్లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ ఈ ఏడాది మహిళా సాధికారత థీమ్తో యోగా డేను నిర్వహించనున్నామని తెలిపారు. గత ఏడాది జరిగిన యోగా కార్యక్రమంలో 700 మందికి పైగా జనం పాల్గొన్నారని, వివిధ సంఘాల సభ్యులు కూడా హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఈసారి కూడా అధిక సంఖ్యలో జనం యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు.యోగా అన్ని వర్గాల వారినీ కలుపుతుందని, అందరికీ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఈ ఏడాది జరిగే యోగా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొననున్నారన్నారు. బ్రిటిష్ పౌరుడు ఇందర్పాల్ ఓహ్రీ చందేల్ మాట్లాడుతూ యోగా అనేది మన వారసత్వంలో భాగమని, దానితో మనం కనెక్ట్ కావడం అందరికీ ముఖ్యమన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవంలో భారత బధిర క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొనబోతున్నారని అన్నారు. 2015 నుండి ప్రతీయేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. -
ఇంగ్లండ్లో ఐటీ ఉద్యోగులను మించిపోయిన చెఫ్ లు.. కారణం అదే..
-
Nissie Leone: అనుకుంది... సాధించింది
కుటుంబంలో ఆడపిల్లను ఒక మైనస్గా భావించిన సమాజం నుంచి ఆడ, మగ అనే తేడా లేకుండా ఉన్నంతలో తమ పిల్లల్ని గొప్పగా చదివించాలనే సంకల్పం దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ మొదలైంది. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే నిస్సీ లియోన్. ఆడపిల్లను చదువుకోసం పొరుగూరుకు కూడా ఒంటరిగా పంపడానికి ఇప్పటికీ భయపడుతున్న రోజుల్లో విదేశాల్లో కొలువుకి ఎంపిక అయ్యేలా ప్రొత్సహించారు నిస్సీ తల్లిదండ్రులు, చదివింది డిగ్రీ అయినా యూకేలో ఉద్యోగంలో చేరుతోంది. వార్షిక వేతనం అక్షరాలా రూ.37 లక్షలు అందుకోబోతోంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన నిస్సీ లియోన్ తన విజయావకాశం గురించి ఆనందంగా తెలియజేస్తోంది.‘‘బీఎస్సీ కార్డియాలజీలో డిగ్రీ పూర్తిచేశాను. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్కు చెందిన ఎన్హెచ్ఎస్ నార్తెర్న్ కేర్ అలియన్స్ నన్ను ఉద్యోగానికి ఎంపికచేసింది. ప్రపంచవ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఈ సంస్థ ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఇండియా నుంచి ఇద్దరు ఎంపిక కాగా వారిలో నేనూ ఒకరిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.ఈ రోజుల్లో... మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న జార్జ్, అమ్మ సునీతలు స్థానిక చర్చ్లో పాస్టర్స్గా పని చేస్తున్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడు. సేవా తత్పరతతో కూడిన ఉద్యోగం చేయాలనేది నా ఆలోచన. మా అమ్మనాన్నల సేవాగుణం నాలోనూ అలాంటి ఆలోచనలు కలగడానికి కారణం అయింది. మొదట వైద్యురాలిగా స్థిరపడాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వైద్య సహాయకురాలిగా స్థిరపడాలనుకున్నాను. శ్రీకాకుళంలోని బొల్లినేని మెడీ స్కిల్స్ పారా మెడికల్ డిగ్రీ కళాశాలలో కార్డియాలజీ విభాగంలో చేరాను. పిల్లల ఉన్నతోద్యాగాల గురించి పెద్దలు తరచూ ‘వాళ్లబ్బాయి సాఫ్ట్వేర్ అంట, వీళ్లమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుందంట’ అనే మాటలను వింటూనే ఉంటాం. అయితే దేశంలో కొన్ని రంగాలలో ఉన్నవారు మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. వారి విద్యార్హత, నాలెడ్జ్, చదివిన కాలేజీ, అభ్యర్థి నడవడిక, బృందంలో పనిచేసే వైఖరి.. వంటి వాటి ఆధారంగా జీతాలను నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసే వారికి సైతం మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. విదేశీ సంస్థలు అందుకు స్వాగతం పలుకుతున్నాయి అని జెమ్స్ మెడికల్ కాలేజ్ ఛీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు, బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. నాగేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ పద్మజల ద్వారా తెలిసింది. అంతకుముందు నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన లేదు. కానీ, వారిప్రొత్సాహంతోనే ఈ ఘనత సాధించాను.దశల వారీగా...నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన ఎన్హెచ్ఎస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేస్తోంది. ఇందులో ప్రవేశం అంత సులువేమీ కాదని కొద్దిరోజుల్లోనే అర్ధమైంది. హైదరాబాద్ కు చెందిన ప్రకార స్వచ్ఛంద సంస్థ ద్వారా మా కాలేజీకి సమాచారం వచ్చింది. నైపుణ్యం కలిగిన బీఎస్సీ కార్డియాలజీ ఎకో గ్రాఫర్ కావాలని, అందుకు వెంటనే అప్లై చేసుకోవాలనీ మా కాలేజీ వాళ్లు చె΄్పారు. దీంతో అప్లై చేసి, సికింద్రాబాద్ కిమ్స్లో శిక్షణ తీసుకున్నాను. కిందటేడాది జరిగిన బ్రిటిష్ సొసైటీ అఫ్ ఎకోకార్డియోగ్రాఫీ (బిఎస్ఇ) వారు నిర్వహించిన ట్రాన్స్ థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (టీటీఇ) పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యాను. నిపుణులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ చేసింది. అంతకుముందు జరిగిన థియరీ పరీక్షలోనూ మంచి మార్కులు వచ్చాయి. రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించడంతో ఉద్యోగానికి ఎంపియ్యాను. వార్షిక వేతనం ఇండియా కరెన్సీలో రూ.37 లక్షలు అని తెలిసింది. అమ్మానాన్నలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను. ఒక డిగ్రీ విద్యార్థిని ఈ స్థాయిలో ΄్యాకేజీకి ఎంపిక కావడం చిన్న విషయం కాదని అందరూ అంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతోంది. వీసాకు అయ్యే మొత్తాన్ని, విమాన యాన ఖర్చులు కూడా ఆ సంస్థనే అందిస్తోంది’’ అంటూ ఆనందంగా తెలియజేసింది నిస్సీ. అనస్తీషియా, కార్డియాలజీ రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్టులుగా ఉండేవి. కార్డియాలజీలో పని పట్ల మరింత సంతృప్తి లభిస్తుందనిపించి ఈ సబ్జెక్ట్ను ఎంచుకున్నాను. మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యవృత్తిలో రాణించాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి, ఈ డిగ్రీ తీసుకున్నాను. నా కాలేజీ ఫీజు విద్యా దీవెనలో కవర్ అయ్యింది. ఇప్పుడు మంచి సంస్థలో ఉద్యోగం లభించింది. – నిస్సీ లియోన్మా చుట్టుపక్కల వాళ్లందరూ మా అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంది. నిస్సీ తల్లిదండ్రులుగా మాకూ గుర్తింపు వచ్చింది. ఈ రోజే మా అమ్మాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి బయల్దేరింది. – తల్లిదండ్రులు– నిర్మలారెడ్డి -
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
కొందరికీ షాపింగ్ అంటే మహా ఇష్టం. చూసిందల్లా కొంటుంటారు. పాపం బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని కొందామన్నా సాధ్యం కాదు కొందరికీ. ఎంతలా కంట్రోల్గా ఉందామన్న ఆ వస్తువు కొనేదాక నిద్రపట్టని వాళ్ల గురించిn కూడా విన్నాం. కానీ నిద్రలో షాపింగ్ చేసే వ్యాధి గురించి విన్నారా? ఔను..! ఈ వ్యక్తులు నిద్రలోనే తెలియకుండానే షాపింగ్ చేస్తుంటారు. మెలుకవ వచ్చాక గానీ అసలు విషయం తెలియదంట. వామ్మో.. ఇదేం వ్యాది!. ఇలాంటివి కూడా ఉంటాయా అనుకోకండి. అలాంటి అరుదైన వ్యాధితోనే బాధపడుతోంది ఓ మహిళ.యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్ పారాసోమ్నియా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీన్ని అరుదైన పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్గా పిలుస్తారు. ఈ డిజార్డర్ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్లైన్ షాపింగ్ చేసేస్తుందట. ఏకంగా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు దగ్గర నుంచి ఫ్రిడ్జ్ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసేస్తుంది. వాటి బిల్లను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించేస్తుందట. మేలుకువ వచ్చాక మొబైల్ చూసుకుంటే గానీ తెలియదంట. తన అకౌంట్లో డబ్బు కట్ అయ్యాక గానీ అసలు విషయం తెలుసుకులేకతున్నాని చెబుతుంది. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్ చేసి లక్షల్లో డబ్బుల పోగొట్టుకున్నానని చెబుతోంది. దీంతో ఆమెకు ప్రతి రాత్రి భయానకంగా మారిపోయింది. "తన జీవితంలో ప్రతి రాత్రి ఓ పీడకల మాదిరిగా అయిపోతోందని బాధపడుతోంది. తన క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలన్నీఫోన్లోనే సేవ్ అయ్యి ఉంటాయట. ఐతే ఈ మాయదారి జబ్బు కారణంగా తన బ్యాంక్ వివరాన్ని సైబర్ నేరాగాళ్లకు చెప్పేయడం కూడా జరిగిందంట. దీంతో వాళ్లు ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 20 వేలకు పైగా తస్కరించారట కూడా. అయితే ఈలోగా తాను తన బ్యాంక్ లావాదేవీలను లాక్ చేసేయడంతో కొద్ది మొత్తంలోనే డబ్బును కోల్పోయానని అంటోంది." కెల్లీ. ఇక సమస్య నుంచి బయటపడేందుకు ముక్కుకి శ్వాస సంబధ సమస్యల నిమిత్తం అమర్చుకునే పరికరాన్ని ధరించి పడుకుంటుంది. ఈ డివైజ్ ముక్కు నుంచి హెడ్ వరకు కదలకుండా అటాచ్ అయ్యేలా డివైజ్ ఉంటుంది. కాబట్టి నిద్రలోనే తనకు తెలయకుండా చేసే విచిత్రమైన పనుల నుంచి ఉపశమనం పొందొచ్చనేది కెల్లీ ఆశ. అయితే కెల్లీ సమస్య నుంచి బయటపడలేదు సరికదా..!ఈ పరికరాన్ని కూడా నిద్రలో తనకు తెలియకుండానే తీసేస్తుందంట. ఈ సమస్య కారణంగా తాను అప్పులు పాలవ్వుతున్నానని కెల్లీ ఆవేదనగా చెప్పుకొచ్చింది. అయితే దీనికి చికిత్స లేదు. తనకు తానుగా బయటపడాలని సంకల్పించుకుంటేనే సాధ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు.పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్ అంటే..ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలోనే నడవడం /మాట్లాడటం / తినడం/ ఏమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి ఏ మాత్రం పూర్తి అవగాహనతో చేయరు. ఆ టైంలో వారికి మెదడు పాక్షికంగా మేల్కొని ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులను గమనించి గట్టిగా అదిలిస్తే తిరిగి స్ప్రుహలోకి వస్తారు. ఇలాంటివన్నీ రాత్రి మొదటి జామునే జరుగుతాయట. చిన్నారుల్లోనూ, కొందరూ పెద్దల్లోనూ నిద్రలోనే నడవడం/మాట్లాడటం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అయితే ఈ డిజార్డర్ తీవ్రంగా ఉంటేనే ఇలా సమస్యలు ఫేస్ చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: అనారోగ్యంలోనూ... నీట్ టాపర్గా!) -
టాటా స్టీల్ కీలక నిర్ణయం.. 2500 ఉద్యోగాల కోత
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో యూకేలోని టాటా స్టీల్ తన సిబ్బందిలో 2500 మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్ తెలిపారు.యూకే టాటా స్టీల్ సంస్థలో ఉద్యోగాలు పోతాయనే భయంతో కార్మికుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేఖిస్తూ.. నిరసనలు కూడా తెలియజేస్తున్నాయి. యూకే ప్రభుత్వం సాయంతో డీకార్బనైజేషన్ ప్లాన్లో భాగంగా.. కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ప్రక్రియకు మారుతోంది. కాబట్టి రాబోయే మూడేళ్ళలో కర్బన ఆధారిత తయారీ పూర్తిగా నిలిపిఈవేస్తున్నట్లు సమాచారం.టాటా స్టీల్ సంస్థ యూకేలో ఎలక్ట్రిక్ ఉత్పత్తులను పెంచనుంది. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించనుంది. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్ యూకేలో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థగా కీర్తి గడించింది. ఇక్కడ సుమారు 8000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూకే కంపెనీ ఏడాదికి 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సుమారు 2500 మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.సెప్టెంబర్ 2023లో టాటా స్టీల్ అండ్ యూకే ప్రభుత్వం బ్రిటన్లోని పోర్ట్ టాల్బోట్ స్టీల్ తయారీ సదుపాయంలో డీకార్బనైజేషన్ ప్లాన్లను అమలు చేయడానికి 1.25 బిలియన్ పౌండ్ల ఉమ్మడి పెట్టుబడి ప్రణాళికపై అంగీకరించాయి. ఇందులో 500 మిలియన్ పౌండ్లు యూకే ప్రభుత్వం అందించింది. -
బ్రిటీష్ కాలేజ్లో.. భారతీయ ఆయుర్వేదం
సనాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం నేర్చుకునేందుకు ఇటు ఆధునిక భారతీయులు మాత్రమే కాదు, పాశ్చాత్యులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో యూకేలోని అతి పురాతన కళాశాలతో మన దేశానికి చెందిన ఆయుర్వేద ఆధునిక సమ్మిళిత వైద్యాన్ని ప్రోత్సహించే పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద (పీఎస్ఏ) చేతులు కలిపింది.సాంప్రదాయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో యూకేలోని బ్రిటిష్ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద (బీఎస్ఏ)లో మెజారిటీ వాటాను స్వంతం చేసుకునేందుకు వీలుగా అవగాహన ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకం చేశారు.ఇందులో భాగంగా.. డాక్టర్ పోలిశెట్టి సాయి గంగా పనాకియా ప్రైవేట్ లిమిటెడ్ విభాగం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలీసైంటిఫిక్ ఆయుర్వేద (ఐపీఎస్ఎ)లు.. యూకేలోని పురాతన ఆయుర్వేద కళాశాలలో పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంలో వినూత్న కోర్సులను పరిచయం చేయనుంది. లేటెస్ట్ టెక్నాలజీ, ఆధునిక ఔషధాలను పురాతన భారతీయ ఆయుర్వేద జ్ఞానంతో అనుసంధానించే జీవనశైలి వేరియబుల్ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదం. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలలో ఇదీ ఒకటి.ఈ కొత్త భాగస్వామ్యం యూకే, భారత్ల ప్రముఖ ఆయుర్వేద నిపుణులను ఏకతాటిపైకి తెస్తుంది. తద్వారా దాని విస్త్రుతి పెరుగుతుందని డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయుర్వేదం, అల్లోపతి సమ్మేళనం మెరుగైన చికిత్స అవకాశాలు అందిస్తుందని అన్నారు. ముఖ్యంగా చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది బాగా తోడ్పడుతుందన్నారు.మా భాగస్వామ్యం ఆయుర్వేద విద్యా కార్యక్రమాలను బలోపేతం చేస్తుంది. ఆధునిక, ప్రత్యామ్నాయ వైద్య అభ్యాసకులకు విస్త్రుత నైపుణ్యాలను అందిస్తుంది. చివరి దశ వ్యాధులకు మరింత ప్రభావవంతంగా చికిత్స చేసే వైద్యులను తయారు చేస్తుందని డాక్టర్ పోలిసెట్టి వెల్లడించారు.యూకే పార్లమెంట్లోని ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఫర్ ట్రెడిషనల్ సైన్సెస్ సెక్రటేరియట్ అమర్జిత్ భమ్రా సమక్షంలో డాక్టర్ పోలిశెట్టి, డాక్టర్ మౌరూఫ్ అథిక్, డాక్టర్ శాంత గొడగామా ఎమ్ఒయూపై సంతకం చేశారు. -
ఫస్ట్టైమ్.. 100 టన్నుల బంగారం తరలింపు
యూకే నుంచి టన్నులకొద్దీ బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారత్కు తీసుకొచ్చింది. 1991 తరువాత మొదటిసారిగా యూకే నుంచి 100 టన్నుల బంగారాన్ని దేశంలోని తన వాల్ట్లకు తరలించింది.ఆర్బీఐ బంగారు నిల్వలలో సగానికి పైగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద సురక్షితమైన కస్టడీలో ఉన్నాయి. మూడింట ఒక వంతు బంగారాన్ని మాత్రం దేశీయంగా నిల్వ చేస్తారు. బంగారం తరలింపునకు ఆర్బీఐ తీసుకున్న ఈ చర్యతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెల్లించే నిల్వ ఖర్చులు ఆదా కానున్నాయి.ఆర్బీఐ వార్షిక గణాంకాల ప్రకారం.. 2024 మార్చి 31 నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా 822.10 టన్నుల బంగారం కేంద్ర బ్యాంక్ వద్ద ఉంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన 794.63 టన్నులతో పోలిస్తే ఇది అధికం.బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి 1991 జూలైలో ఆర్బీఐ 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ వద్ద తాకట్టు పెట్టి 400 మిలియన్ డాలర్లను సమీకరించింది. 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆర్బీఐ 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.2009లో ప్రభుత్వం తన ఆస్తులను వైవిధ్యపరచడానికి 6.7 బిలియన్ డాలర్ల విలువైన 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా, ఆర్బీఐ కొనుగోళ్ల ద్వారా బంగారం నిల్వలను స్థిరంగా పెంచుకుంటూ వస్తోంది.దేశ మొత్తం విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా 2023 డిసెంబర్ చివరి నాటికి 7.75 శాతం నుంచి 2024 ఏప్రిల్ చివరి నాటికి 8.7 శాతానికి పెరిగింది. ముంబైలోని మింట్ రోడ్, నాగపూర్లోని ఆర్బీఐ భవనం వాల్ట్లలో బంగారం నిల్వలు ఉన్నాయి. -
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక.. బ్రిటన్లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు
పార్లమెంటరీ ప్రాజాస్వామ్యానికి మాతృకగా పరిగణించే ఇంగ్లండ్లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన (జూన్ 4) నెల రోజులకు అంటే వచ్చే జులై 4న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లోని మొత్తం 650 సీట్లకు పోలింగ్ నిర్వహించడానికి ఇంగ్లండ్ రాజు నుంచి చార్లెస్ 3 నుంచి అనుమతి తీసుకున్నారు.భారత సంతతికి చెందిన యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధాని రిషి సునాక్.. దాదాపు రెండు పార్టీల వ్యవస్థ స్థిరపడిన ఇంగ్లండ్లో 2010 నుంచీ కన్సర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే ఇంగ్లండ్లో సుదీర్ఘ చరిత్ర (190 ఏళ్లు) ఉన్న పార్టీ కన్సర్వేటివ్ పార్టీ. ఈ పార్టీకి తన పూర్వ రూపమైన టోరీ పార్టీ అని కూడా పేరుంది.ప్రస్తుత బ్రిటిష్ పార్లమెంటు పదవీకాలం 2025 జనవరి వరకూ ఉన్నా దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడడానికి ప్రజల మద్దతు కోసం ముందస్తు ఎన్నికలు జరిపించడానికి ప్రధాని సునాక్ నిర్ణయించడం విశేషం. బుధవారం యూకే రాజు మూడో చార్లెస్ తో మాట్లాడి పార్లమెంటును రద్దుచేయించి, ఎన్నికలు జరిపించడానికి ప్రధాని అనుమతి తీసుకున్నారు.124 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రస్తుత ప్రతిపక్షం లేబర్ పార్టీ చివరి ప్రధాని గోర్డన్ బ్రౌన్ నుంచి కన్సర్వేటివ్ పార్టీ ఇంగ్లండ్లో అధికారం హస్తగతం చేసుకున్నపటి నుంచి ఇప్పటి వరకూ ఈ 14 సంవత్సరాల్లో సునాక్ సహా ఐదుగురు ప్రధానులు మారారు. 2010 మేలో డేవిడ్ కేమరూన్ తో మొదలైన కన్సర్వేటివ్ పార్టీ హయాంలో ఆయన తర్వాత వరుసగా థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టారు. ఈ ఐదుగురులో డేవిడ్ కేమరూన్ ఎక్కువ కాలం (2010–2016 మధ్య 6 ఏళ్ల 64 రోజులు) అధికారంలో ఉన్నారు. ఆయన తర్వాత కన్సర్వేటివ్ పార్టీకే చెందిన థెరిసా మే, బోరిస్ జాన్సన్ చెరో మూడు సంవత్సరాలు ప్రధాన మంత్రి పదవిలో కొనసాగారు. హౌస్ ఆఫ్ కామన్స్ పదవీకాలం గరిష్ఠంగా 5 ఏళ్ల వరకూ ఉంటుంది.వివాదాస్పద ప్రధాని బోరిస్ జాన్సన్ హయాంలో టోరీ పార్టీకి భారీ మెజారిటీ!ఒక తాత వైపు నుంచి టర్కీ కుటుంబ నేపథ్యం ఉన్న బోరిస్ జాన్సన్ హయాంలో కిందటిసారి 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి మెజారిటీ (365 సీట్లు) లభించింది. అయితే, కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి విందులో పాల్గొన్నారనే కారణంగా 2022 సెప్టెంబర్ మొదటి వారం జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన తర్వాత ప్రధాని అయిన మూడో మహిళా నేత లిజ్ ట్రస్ ఒక ప్రభుత్వ సంక్షోభం వల్ల 50 రోజులకే రాజీనామా చేశారు. ఇలా ఆమె బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేతగా రికార్డుకెక్కారు.అనుకోని పరిస్థితుల్లో 2022 అక్టోబర్ 25న ఇంగ్లండ్ ప్రధాని పదవి చేపట్టిన తొలి హిందువుగా చరిత్ర సృష్టించిన 'రిషి సునాక్'ది పంజాబీ కుటుంబ నేపథ్యం. ఆయన భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి, సుధా మూర్తిల అల్లుడనే విషయం తెలిసిందే. తన సంపదకు తోడు భార్య అక్షత ఆస్తి తోడవడంతో యూకేలో రాజు మూడో చార్లెస్ కన్నా ఎక్కువ సంపద ఉన్న వ్యక్తిగా ఇటీవల సునాక్ వార్తల్లో నిలిచారు.గతంలో ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థికవ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ గతేడాది ఆ హోదాను కోల్పోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. సునాక్ ప్రధాని పదవి చేపట్టిన 2022 అక్టోబర్ నెలలో దేశంలో 11 శాతం దాటిన ద్రవ్యోల్బణాన్ని కన్సర్వేటివ్ సర్కారు సగానికి తగ్గించగలిగింది. అయితే, 2023 చివర్లో సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి ఇంగ్లండ్ ప్రవేశించడంతో కన్సర్వేటివ్ పార్టీ విధానాలపై ఇంగ్లిష్ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీకి ఇప్పుడు మెజారిటీ ప్రజల సానుకూలత ఉన్నట్టు సర్వేలు సూచిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత కియర్ స్టార్మర్ (61) 2020 నుంచీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కుటుంబ సంబంధ ఆర్థికపరమైన వివాదాలతోపాటు, దేశంలో ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడిన 44 ఏళ్ల రిషి సునాక్ జులై 4 ఎన్నికల్లో తన పార్టీని మెజారిటీ దిశగా (650 సీట్లలో కనీసం 326) నడిపించి రెండోసారి ప్రధాని అవుతారా? అనేది మిలియన్ పౌండ్ల ప్రశ్నగా మారింది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
బ్రిటన్లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపీచంద్ హిందూజా యూకేలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ యూకేలోని 1,000 మంది సంపన్నులు లేదా కుటుంబాలతో వారి మొత్తం నెట్వర్త్ ప్రకారం జాబితా రూపొందించింది. ఈ జాబితాలో హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందూజాను అగ్రస్థానంలో నిలిచారు.‘ది మిర్రర్’ ప్రకారం.. హిందుజా కుటుంబం ఆరు సంవత్సరాలుగా బ్రిటన్లో అత్యంత సంపన్నులుగా నిలుస్తూ వస్తోంది. ర్యాంకింగ్ ఆధారంగా హిందూజా నెట్వర్త్ అంతకు ముందు సంవత్సరంలోని 35 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్ (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) నుంచి సుమారు 37.196 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్కు (సుమారు రూ. 3.9 లక్షల కోట్లు) పెరిగింది.జీపీగా పిలిచే గోపీచంద్ హిందూజా భారత్లో 1940లో జన్మించారు. హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ ఛైర్మన్ అయిన ఆయన గత సంవత్సరం తన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తరువాత తమ వ్యాపార సమూహానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్ 1959లో ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. వెస్ట్మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దీంతోపాటు లండన్లోని రిచ్మండ్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో గౌరవ డాక్టరేట్ను పొందారు. గోపీచంద్ తండ్రి, పరమానంద్ హిందూజా 1914లో హిందూజా ఫ్యామిలీ కంపెనీని స్థాపించారు. -
యూకే పోస్టు–స్టడీ వీసాలు రద్దు!
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోకి వలసలను అరికట్టడానికి ప్రధానమంత్రి రిషి సునాక్ కొత్తరకం ఆలోచనలు చేస్తున్నారు. యూకేలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కల్పించే పోస్టు–స్టడీ వీసాను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై సొంత మంత్రివర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. యూకే పోస్టు–స్టడీ వీసా పథకం 2021లో ప్రారంభమైంది. దీనితో భారతీయ విద్యార్థులు అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. యూకేలో యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ అభ్యసించిన తర్వాత రెండేళ్లదాకా ఇక్కడే ఉంటూ ఉద్యోగాలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. ఒకవేళ ఈ వీసాను రద్దుచేస్తే భారతీయ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యూకేలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా పోస్టు–స్టడీ వీసాలపై ఆంక్షలు విధించడమా లేక శాశ్వతంగా రద్దు చేయడమా అనే దానిపై ప్రధాని రిషి సునాక్ తర్జనబర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనను పలువురు యూకే మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్, విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. -
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్లిస్ట్లో రిషి సునాక్ దంపతులు
ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్ యూరోలకు పెరిగింది. ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.ఇన్ఫోసిస్లో2023లో రిషి సునాక్ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. కింగ్ చార్లెస్ సంపదఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని, 600 మిలియన్ యూరోల నుండి 610 మిలియన్ యూరోలకు పెరిగినట్లు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్ చేసింది. తగ్గిపోతున్న బిలియనీర్లు2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .యూకేలోనూ భారతీయుల హవాబ్రిటన్లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్ యూరోల నుండి 37.2 బిలియన్ యూరోలకు పెరిగింది. -
హాట్టాపిక్గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
బ్రిటన్ రాజు చార్లెస్ III చిన కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మర్క్లే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ జంట 2020లో రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుంటున్నట్లు ప్రకటించి ఈ జంట వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత అడపాదడపా కార్యక్రమాల్లో కెమెరా కంట చిక్కుతూ వార్తల్లో నిలవడం జరిగింది. ఈ సారి ఏకంగా రాజ కుటుంబానికి రాయల్టీ లుక్ని ఇచ్చే గౌనుని ధరించడం హాట్టాపిక్గా మారింది. రీజన్ ఏంటంటే..డచెస్ ఆఫ్ సస్సెక్స్గా పేరుగాంచిన మేఘన్ ఈ లేత గోధుమ రంగు గౌనుని డిజైనర్ హెడీ మెరిక్ చేత డిజైన్ చేయించుకుంది. డిజైనర్ ప్రకారం ఈ గౌను పేరు విండ్సర్ గౌన్ బ్లష్. విండర్స్ అనేది రాజ కుటుంబం చివరి పేరు. మేఘన్ మార్క్లే ప్రిన్స్ హ్యారీ శుక్రవారం నైజీరియా చేరుకున్నారు. దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆహ్వానం నేపథ్యంలో అక్కడ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఆ దేశంలోని తమ మొదటి పర్యటన నిమిత్తం ఇలా మేఘన్ మార్క్లే ఈ గౌనులో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రాజరికం హోదాను వదులుకున్నప్పుడూ మళ్లీ రాజరకిపు దుస్తులు ధరించడం ఏంటని సర్వత చర్చలు మొదలయ్యాయి. కాగా, ఈ జంట 2018లో హ్యారీ అమ్మమ్మ దివంగత క్వీన్ ఎలిజబెత్II వివాహ కానుకగా ఇచ్చిన బకింగ్హామ్ ప్యాలెస్లోని విండ్సర్ ఎస్టేట్లో నివశించేవారు. గతేడాది జూన్లోనే ఈ ఇంటిని ఖాళీ చేశారు. అయితే కింగ్ చార్లెస్ మేఘన్కి అత్యున్నత గౌరవం ఇద్దా అనుకుంటున్న కొద్ది క్షణాల ముందే ఈ దంపతులు రాజకుటుంబ విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.(చదవండి: 101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!) -
అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తాము సరఫ రా చేసిన కోవిడ్ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యూకేకు చెందిన ఫార్మా కంపెనీ అ్రస్టాజెనెకా వెల్లడించింది. కోవిడ్ అప్డేటెడ్ వ్యాక్సిన్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని, అందుకే వాణిజ్య కారణాలతో తమ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేసింది. అ్రస్టాజెనెకా కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో కోవిడ్ వ్యాక్సిన్ను అభివృద్ధి చే సింది. అస్ట్రాజెనెకా టీకాతో దు్రష్పభావాలు తలెత్తుతున్నట్లు కోర్టుల్లో కేసులు నమోదవడంతో న్యాయ విచారణ జరుగుతోంది. -
ఒబెసిటీ ఇంత ప్రమాదకరమైనదా? పాపం ఆ వ్యక్తి..!
ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్తమైన జీవన విధానం, కల్తీ ఫుడ్ల కారణంగా టీనేజీ యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తోంది. కనీసం పెళ్లీడు రాకమునుపే పెద్దవాళ్లలా కనిపించేంత భారీకాయంతో సతమతమవ్వుతున్నారు. అచ్చం అలాంటి సమస్యతోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి మరణించాడు. జస్ట్ 33 ఏళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒబెసిటీ ఇంత ప్రమాకమైనదే? లావుగా ఉంటే అంతే సంగతులా..!లావుగా ఉంటే లైఫ్ లాసే అని ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. బ్రిటన్ నివాసి జాసన్ హోల్డన్ యూకేలోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి. అతడి బరువు ఏకంగా 317 కిలోలు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకోవాలట. ఇక అతడు పడుకోవాలన్నా.. ప్రత్యేకంగా రూపొందించిన ఫర్నిచర్పై బెడ్పై నిద్రిస్తాడు. అతడికి అతిగా తినే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎంతలా ఉందంటే రోజువారీగా ఏకంగా పదివేలకు పైగా కేలరీలు తీసుకునేంత స్థాయిలో ఉంది. అతడి బ్రేక్ఫాస్ట్లో డోనార్ కబాబ్లు తీసుకుంటాడంటే..అతడు ఎంతలా తింటాడో చెప్పాల్సిన పనిలేదు. దీని కారణంగానే ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది. దీంతో అతను కొన్నాళ్లుగా గదికే పరితం కాగా, క్రమేణ మంచానికే పరిమతమయ్యాడు. ఆ తర్వాత చలనశీలత దెబ్బతింది. మొదట అతడి శరీరంలో కిడ్నీ పనిచేయడం మానేసింది. అలా నెమ్మదిగా మిగతా అవయవాలు వైఫల్యం చెందడం ప్రారంభించడంతో 34వ ఏటాలోకి అడుగుపెట్టడానికి కొన్ని రోజుల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు గతేడాది ఒక ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని, తాను ఎన్నాళ్లో బతకనని చెప్పేశాడు కూడా. పైగా అలా కాకుండా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి 2020లో ప్రమాదవశాత్తు హోల్టన్ మూడవ అంతస్తు నుంచి పడిపోయాడు. పాపం అతడిని రక్షించటానికి ఏకంగా 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, క్రేన్ రంగంలోకి దిగి కాపాడారు. ఆ ఘటనను తలచుకుంటూ అది తన జీవితంలో అత్యంత బాధకరమైన ఘటనగా పేర్కొన్నాడు హోల్డన్. ఆ టైంలో తనను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి చాలా బాధపడడ్డానని అన్నాడు. హోల్డన్ మానసిక స్థితి ఎంతలా మారిపోయిందంటే.. లావుగా ఉండే వ్యక్తులను ఆధారం చేసుకుని తీసిన సినిమాలు సైతం అతడికి భయానక చిత్రాలుగా అనిపించాయి. కనీసం తన అమ్మను కూడా చూడొద్దని కన్నీటి పర్యంతమయ్యాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ అధిక బరువు కారణంగా ఎంతగా ఇబ్బంది పడ్డానేది నేరుగానే తెలుస్తోంది. అతను తరుచుగా ఈ బ్రిటన్ దేశంలో తానే అత్యంత లావుగా ఉన్నవ్యక్తిని అని బాధపడేవాడు. అతడి పోస్ట్మార్టం రిపోర్టులో కూడా అధిక బరువు కారణంగా అవయవాల వైఫల్యం చెంది మరణించినట్లు ఉంది. హోల్టన్ ఈ అధిక బరువు కారణంగా స్ట్రోక్లు, రక్త గడ్డకట్టడం వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అధిక బరువు అనేది ప్రాణాంతకమైన సమస్యే. నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తగ్గించుకునే యత్నం చేయకపోతే అంతే సంగతులని ఈ ఉదంతమే చెబుతోంది. అందువల్ల కొద్దిపాటి శారీరక శ్రమ, క్యాలరీల తక్కువ ఉన్న ప్రత్యామ్నాయ ఆహారంతో బరువుని అదుపులో ఉంచుకునే యత్నం చేయండి. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించండి.(చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?) -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకేలో ఉగాది సంబరాలు!
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (తెలుగు సంఘం) వార్షిక ఉగాది సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇది తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలకు ఒక చిరస్మరణీయ వేడుక. ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో, ఈ కార్యక్రమం సంస్థకు ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అంతేకాకుండా 2024-26 కాలానికి కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించారు.ఎడిన్బర్గ్ కాలేజ్-గ్రాంటన్ క్యాంపస్లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది తెలుగువారు హాజరయ్యారు. స్కాట్లాండ్లో నివశిస్తున్న తెలుగు సమాజంలో ఉన్నటువంటి బలమైన బంధం, ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది.ముఖ్య అతిథులుగా భారత కాన్సుల్ జనరల్ బిజయ్ సెల్వరాజ్, లోథియన్ ప్రాంతానికి చెందిన ఎంఎస్పిలు సారా బోయాక్, ఫోయ్సోల్ చౌదరి, కొల్లిన్టన్ కౌన్సిలర్ స్కాట్ ఆర్థర్ సహా ప్రముఖులు గౌరవ అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి ఉనికి ఈ కార్యక్రమం వైభవాన్ని పెంచింది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం ఉన్న ఎడిన్బర్గ్ లాంటి నగరంలో ఉగాదిని జరుపుకోవడం గురించి, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.“టాస్-యుకె ఉగాది సంబరాలు 2024” లో తెలుగు సమాజం ప్రతిభ, సంప్రదాయాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అధికారులు.సిలికానాంధ్రా వారి ‘మనబడి’ ద్వారా తెలుగు నేర్చుకునే పిల్లలు “మా తెలుగు తల్లికి” ప్రార్థనాగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.2022-24 కాలానికి గాను సాంస్కృతిక కార్యదర్శిగా వ్యవహరించిన విజయ్ కుమార్ పర్రి తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతిథులు, ముఖ్య అతిథులు మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ క్రార్యక్రమాన్ని ప్రారభించారు. సమూహ నృత్యాలు, సోలో గానం, తెలుగు కవితల పారాయణ, అనంత్ రామానంద్ గార్లపాటి చేసిన ముఖ్యమైన ఉగాది పంచాంగంతో సహా మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలతో వేదిక ఆకర్షణీయంగా మారింది. ఐదుగురు గాయకులు, బ్యాండ్ ప్లేయర్లతో కూడిన స్థానిక భారతీయ బ్యాండ్ "వాయిస్ ఆఫ్ ఎకో" ప్రదర్శన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచింది. వారి ఆకర్షణీయమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, ఉత్సవాలకు అదనపు ఉత్సాహాన్ని జోడించాయి.హోస్ట్స్ సత్య శ్యామ్ జయంతి, రంజిత్ నాగుబండి, శ్రుతి పల్లెమోని, స్రవంతి పొట్లూరి, హిమజా మాచిరాజు రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు నైపుణ్యంగా మార్గనిర్దేశం చేసి, శక్తిని, ఉత్సాహాన్ని నింపారు. వారి చమత్కారమైన పరిహాసం, ఆకర్షణీయమైన సంభాషణలు హాజరైనవారిని రోజంతా వినోదభరితంగా ఉంచాయి.సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, ఈ కార్యక్రమంలో సాంప్రదాయ సమకాలీన దుస్తులలో వివిధ ఋతువుల పోకడలను ప్రదర్శించే ఫ్యాషన్ షో ప్రదర్శన కూడా జరగడం విశేషం.ఎడిన్బర్గ్ దీపావళి, కన్నడ అసోషియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ - ఎడిన్బర్గ్, ఎడిన్బర్గ్ హిందు మందిర్ అండ్ కల్చరల్ సెంటర్, ఇండియన్ ఆర్ట్స్ కనెక్షన్, 3 గుడ్ డీడ్స్, స్కాటిష్ ఇండియన్ ఆర్ట్స్ ఫోరం, ఒడిశా సొసైటి ఆఫ్ స్కాట్లాండ్, బీహార్ కమ్యూనిటీ మరియు స్కాటిష్ ఇండియన్ ముస్లిం అసోషియేషన్ వంటి ఇతర భారతీయ సంఘాల అతిథులు చేరడం ఔత్సాహికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.వేడుకను విజయవంతం చేయడంలో ఈవెంట్ స్పాన్సర్లు ప్రధాన స్పాన్సర్లు బ్రైటర్ మోర్టగేజెస్, బెల్లి ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్, సహ-స్పాన్సర్ అల్లి భవన్లు కీలక పాత్ర పోషించారు, .ఇక 2024-26 సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన టాస్-యూకే ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గడ్డం, సంయుక్త కార్యదర్శి నిరంజన్ నూక, కోశాధికారి విజయ్ కుమార్ పర్రి, మహిళా మరియు ప్రాజెక్టుల కార్యదర్శి మాధవిలత దండూరి, కల్చరల్ సెక్రెటరీ పండరి జైన్ కుమార్ పోలిశెట్టి, క్రీడా కార్యదర్శి బాలాజీ కర్నాటి, యువజన శాఖా కార్యదర్శి రాజశేఖర్ సాంబ, ఐటి కార్యదర్శి జాకీర్ షేక్, పిఆర్ కార్యదర్శి నరేష్ దీకొండలను సభ్యులకు పరిచయం చేశారు.చివరిగా మాజీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా, గౌరవనీయ చైర్పర్సన్గా సత్కరించారు.జన గణ మన, కొత్తగా నియమితులైన జనరల్, జాయింట్ సెక్రటరీల ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది. ఇక ఈ కార్యక్రమంలో హాజరైన తెలుగువారు సంస్కృతి, స్నేహం, వేడుకలతో నిండిన రోజుగా మధురమైన జ్ఞాపకాలతో బయలుదేరారు.“టాస్-UK ఉగాది సంబరాలు 2024” ఒక తెలుగు వారసత్వ వేడుక మాత్రమే కాదు. తెలుగు సమాజం ఐక్యత, స్థితిస్థాపకతకు నిదర్శనం. టాస్-యుకె అభివృద్ధి చెందడమేగాక ఉగాది స్ఫూర్తిని తెలుగు వారిలో నింపుతూ.. రాబోయే సంవత్సరాల్లో మరింత మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా తెలుగు వారి శ్రేయస్సుకు చేదోడుగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. (చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!) -
Sanda Island లగ్జరీ దీవి అమ్మకానికి, ధర రూ. 26 కోట్లే
సాధారణంగా సొంతంగా ఒక ఇల్లు, ఓ చిన్న కారు ఇదీ ఓ మధ్య తరగతి జీవి కల. కానీ యూకేలోని స్కాట్లాండ్లో ఒక బంపర్ ఆఫర్ సామాన్యుడ్ని సైతం ఊరిస్తోంది. పశ్చిమ తీరంలో 453-ఎకరాల ప్రైవేట్ లగ్జరీ ఐలాండ్ ఒకటి అతి తక్కువ ధరకే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఏడు బెడ్ రూంలు, బీచ్లు, పబ్,హెలిప్యాడ్ అబ్బో.. ఇలాంటి సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ప్రముఖ నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ దీన్ని అమ్మకానికి పెట్టింది. అయితే ఈ దీవిని సొంతం చేసుకోవాలంటే మీ దగ్గర 26 కోట్లు ఉంటే చాలు. వివరాలు ఇలా ఉన్నాయి..స్కాట్లాండ్ , ఉత్తర ఐర్లాండ్ మధ్య 453 ఎకరాల మేర విస్తరించి ఉందీ సాండా ద్వీపం. పాల్ మాక్కార్ట్నీ , వింగ్స్చే 1977 పాట "ముల్ ఆఫ్ కింటైర్’’ ద్వారా ఇది పాపులర్ అయింది. గత కొన్నేళ్లుగా సన్యాసులు, సాధువులు, రాజులతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంది. దీనిని స్కాటిష్ రాజు రాబర్ట్ ది బ్రూస్ , నార్వే రాజు హకోన్ సందర్శించారట. 1946లో ద్వీపం నుండి ధ్వంసమైన ఓడ సాండా పేరునే ఈ దీవికి పెట్టారు. ఈ ద్వీపం అనేక సంవత్సరాల్లో అనేక మంది యజమానుల చేతుల్లో ఉంది. వీరిలో స్కాటిష్ గాయకుడు, రాక్ బ్యాండ్ క్రీమ్కు చెందిన జాక్ బ్రూస్ ప్రముఖుడు. ప్రాపర్టీస్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సమాచారం ప్రకారం ఈ దీవిలో ఏడు ఇళ్లు, బీచ్, పబ్తోపాటు హెలికాప్టర్ దిగడానికి వీలుగా హెలిప్యాడ్ కూడా ఉంది. పక్కనే రెండు మరింత చిన్న దీవులు కూడా ఉన్నాయి. సాండా కొనుగోలు చేసినవారు ఈరెండు దీవులను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్ హౌజ్ కూడా ఉందని సంస్థకు చెందిన స్టీవర్ట్-మూర్ ప్రకటించారు.ఇంకో విశేషంగా ఏమిటంటే ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్ కూడా ఉంది. అందులో బ్లాక్ ఫేస్ 55 గొర్రెలు కూడా ఉన్నాయట. వన్యప్రాణులతో పాటు పశువులకు కూడా ఈ దీవి ఆవాసం. పఫిన్లు, కిట్టివాక్లు, కార్మోరెంట్లు, షాగ్లు, రేజర్బిల్స్, మరెన్నో పక్షులను ఇక్కడ వీక్షించవచ్చు.ఉత్తర ఐర్లాండ్ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చు. ఉత్తర ఐర్లాండ్ లోని క్యాంపెల్ టౌన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. దీని 31 మిలియన్ పౌండ్లు అంటే 26 కోట్ల రూపాయలు మాత్రమే.దీంతో కొనుగోలు ఇప్పటికే క్యూకట్టినట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. -
కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం 'ఆస్ట్రాజెనెకా' (AstraZeneca) కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆస్ట్రాజెనెకా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్లెట్ కౌంట్కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. TTS (థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువవుతుందని అంగీకరించింది. -
అలెర్ట్ : యూకే వీసా నిబంధనలు కఠినతరం.. తక్షణమే అమల్లోకి
లండన్ : 2025 జనవరిలో జరగనున్న యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్తో ఓడిపోనున్నారా? ఆ ఓటమి నుంచి గట్టెక్కేందుకు వీసా మంజూరులో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారా? అంటే అవుననే అంటున్నాయి యూకేలోని తాజా పరిణామాలు. వీసా మంజూరులో యూకే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. యూకేకు వలసదారుల్ని తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూకేలో విధులు నిర్వహిస్తూ వారికి కుటుంబ సభ్యులకు వీసా స్పాన్సర్ చేయాలంటే అవసరమైన కనీస ఆదాయ పరిమితిని పెంచినట్లు యూకే ప్రకటించింది. కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసాస్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీస ఆదాయ పరిమితిని 55 శాతం పెంచింది. అంటే స్పాన్సర్డ్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీసం 18,600 నుంచి 29,000 పౌండ్స్ ఆదాయం ఉండాలి. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 38,700 పౌండ్స్కు పెంచుతున్నట్లు యూకే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తేపలు నివేదికల ప్రకారం.. యూకేలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని నిర్ధేశించడంలో ఇమ్రిగ్రేషన్ అంశం కీలకం.ఈ నేపథ్యంలో ఆయా పొలికల్ ఏజెన్సీలు,మీడియా సంస్థలు సర్వేలు చేయగా అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చిన అధికార కన్జర్వేటీవ్ పార్టీలో సగానికిపైగా ఎంపీలో ఓటమి పాలవుతారని సర్వేలు హైలెట్ చేశారు. ఇంతకంటే సులభమైన మార్గం లేదా?అందుకే వలస దారుల్ని కట్టడి చేయడంతో పాటు యూకేలోని పన్ను చెల్లింపు దారులపై భారం పడకుండా ఉండేలా యూకే ప్రధాని రిషి సునాక్ ప్రణాళికల్లో ఓ భాగమని చెబుతున్నాయి.వీసా మంజూరులో కొత్త నిబంధనలపై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ మాట్లాడుతూ.. యూకే ప్రజలకు ఆమోదయోగ్యం పరిపాలన అందిస్తూ..దేశంలోకి వలసలు విపరీతంగా పెరగుతున్న తరుణంలో వాటికి కట్టడి చేసేందుకు మాకు ఇంతకంటే సులభమైన మార్గం కన్పించలేదని తెలిపారు. -
YS Jagan మేమంతా సిద్ధం యాత్ర: స్కాట్లాండ్ యూకేలో సంఘీభావం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం యాత్రకు APలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వేల UK Scotland లోని ఎడిన్బర్గ్లో వైయస్సార్సీపీ UK కన్వీనర్లు డా ప్రదీప్ చింతా , ఓబులేరెడ్డి పాతకోట ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం సంఘీబావ సభ నిర్వహించారుపేద ప్రజల అభ్యిన్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 59 నెలలుగా కష్టపడుతున్నారు , మనమంతా ఈ ఒక్క నెలా జగనన్నకోసం కష్టపడి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనిడా ప్రదీప్ చింతా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు జగనన్నకు బ్రహ్మరథం పడుతున్నారు, 175 సీట్లు తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం నినాదంతో సభాప్రాంగణం మారుమ్రోగిందిఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ UK కమిటీ సభ్యులు అనిల్ బెంజిమెన్, ప్రభాకర్ రెడ్డి అవుతాల, విజయ్ పెండేకంటి, శ్రీకాంత్ పసుపుల, రఘు, దుష్యంత్ రెడ్డి, జోయెల్, రామిరెడ్డి పుచ్చకాయల, సాయి, కార్తీక్ భూమిరెడ్డి, క్రాంతి పాలెం, త్రినాథ్, గురు, శ్రీనివాస్ వరిగొండ, వాసూ విడుదల, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. యూకే నలుమూలలనుండి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.Read this article in English : Solidarity rally for YSRCP's Memantha Siddham yatra in Scotland -
Neelima Penumarthy: కథలకో గంట 1/24.. నీలిమ చెప్పే కథ చదవండి!
స్కూల్లో మ్యాథ్స్ అవర్... సైన్స్ అవర్ అంటుంటాం. చట్టసభలో జీరో అవర్ అనే మాట వింటుంటాం. స్టోరీ అవర్... ఈ గంట ఎక్కడ నుంచి వచ్చింది?నీలిమ పెనుమర్తి ఆలోచన నుంచి వచ్చింది. రోజుకో గంట కథలు వినమని చెప్తున్నారీమె. యూకేలో ఆచరణలో పెట్టి... ఇండియాకి తెచ్చారు. విశ్వవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆడియో బుక్స్తో స్వచ్ఛమైన భాష నేర్పిస్తున్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన నీలిమ ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. పిల్లల పెంపకంలో కథలు కూడా ఒక భాగం అయి తీరాలని నమ్ముతారామె. మనదేశంలో స్కూల్ కరికులమ్లో పిల్లలకు కథలు లేక΄ోవడం విచారకరం అంటారామె. కథ ్రపాధాన్యం తెలిసిన అభివృద్ధి చెందిన దేశాలు పిల్లల రోజువారీ క్రమంలో ఓ గంట కథల కోసం కేటాయిస్తున్నాయని, మన దగ్గర అది లోపించడంతో ఎంత పెద్ద చదువులు చదివినప్పటికీ ఒక విషయాన్ని చక్కగా కళ్లకు కట్టినట్లు వివరించగలిగిన నైపుణ్యం కొరవడుతోందన్నారు నీలిమ. భాష ఏదైనా ఆ భాషలో పదాలను స్పష్టంగా ఉచ్ఛరించడం అలవాటు చేయాలంటే ఇంట్లో తల్లిదండ్రులు అంత స్వచ్ఛంగా మాట్లాడే నేపథ్యం ఉండాలి. ఆ వెసులుబాటు లేని పిల్లలకు తన ప్రయత్నం మంచి భాషను, చక్కటి భావ వ్యక్తీకరణను నేర్పిస్తుందన్నారు నీలిమ. ఏడేళ్ల కిందట ‘స్టోరీ అవర్‘ ఆలోచనకు బీజం పడిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నా రామె.ఓ గంట నిడివిలోనే కథ ‘‘నాకు లండన్ ఇంపీరియల్ కాలేజ్లో కెమిస్ట్రీలో ఎంఎస్ చేయడానికి స్కాలర్షిప్ వచ్చింది. మా వారు కూడా స్కాలర్షిప్ మీద లండన్లోనే వచ్చారు. అలా 30 ఏళ్ల కిందట యూకేకి వెళ్లడం, చదువు, ఉద్యోగం, ఇద్దరు పిల్లలతో అక్కడే సెటిలయ్యాం. రెండవసారి గర్భిణిగా ఉన్నప్పుడు పీహెచ్డీలో విరామం తీసుకున్నాను. ఆ విరామం నా ఆలోచనలను కథల మీదకు మళ్లించింది. పెద్ద బాబుకి కథలు చెప్పడం మొదలుపెట్టాను. అమరచిత్ర కథ చదవడం అలవాటు చేశాను. అదే చిన్నబాబుకి కూడా అలవడింది. మా అబ్బాయిలిద్దరూ గ్రీక్ ΄ûరాణిక గ్రంథాలను కూడా చదివారు. వాళ్లిద్దరి మాటల్లో ఆ పాత్రల గురించిన చర్చ వస్తుండేది.అప్పుడు మన రామాయణాన్ని పరిచయం చేశాను. అదే సమయంలో మా పెద్దబ్బాయి స్కూల్ వాళ్లిచ్చిన ్రపాజెక్ట్ కోసం ఒక స్టోరీ బోర్డ్ చేయాల్సి వచ్చినప్పుడు రామాయణం ఇతివృత్తంగా చేశాడు. ఆ తర్వాత పిల్లలకు సెలవుల్లో రామాయణం మీద వాళ్ల వెర్షన్ రాయమని చె΄్పాను. ఆ టాస్క్లో మరో చాలెంజ్... కథనం గంటకు మించరాదు. తమకు తోచినట్లు ఎడిట్ చేసుకుంటూ సీతారామలక్ష్మణులు యుద్ధం తర్వాత విజేతలై అయోధ్యకు రావడం దీపావళి వేడుక చేసుకోవడంతో ముగింపు ఇవ్వాలన్నమాట. ఆ సాధన ఆడియో బుక్ ఆలోచనకు రూపమిచ్చింది.పిల్లలే పాట రాశారు!మాల్గుడి డేస్ వీడియోలకు సిగ్నేచర్ ట్యూన్ ఉన్నట్లే మా ఆడియో బుక్స్కి కూడా ట్యూన్ ఉండాలని పాట కోసం ప్రయత్నించాను. పిల్లలకు ఇస్తే ఎలా రాస్తారో చూద్దామని యూకేలో శచి అనే అమ్మాయికిచ్చాను. తాను రామాయణం కథను ఒక్క వాక్యంలో ‘వారధి నిర్మాణం సీత మీద రాముడికి ఉన్న ప్రేమకు ప్రతిబింబింబం’ అనే భావంతో రాసింది. అలాగే భారతీయ మూలాలు ఏ మాత్రం లేని ‘ఎవీ సిమన్స్’ అనే అమ్మాయి ‘లైట్ ద ల్యాంప్స్’ పేరుతో సీతారాములు విజేతలుగా అయోధ్యకు వచ్చి దీపావళి వేడుక చేసుకోవడాన్ని రాసింది. మంథర విషపూరిత వచనాలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో వివరించింది.క్రియేటివ్గా సైన్స్ పాఠాలు బాల్యంలో మేము బాలానందం వినేవాళ్లం. సరళంగా సాగే కథనాలు పిల్లల్ని అలరించేవి. నా ఆడియోబుక్స్ కూడా సులువుగా ఉంటాయి. ఇవన్నీ ‘స్టోరీ అవర్ డాట్ కో డాట్ యూకే’ వెబ్సైట్లో ఉచితంగా ఉన్నాయి. భాష శుద్ధంగా ఉంటే ఆలోచనలు కూడా అంతే శుద్ధంగా ఉంటాయని నా అభి్రపాయం. మంచి భాష మాట్లాడితే వ్యక్తి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల కోసం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సరే... మంచి భాష ద్వారా చక్కటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మంచి ఉచ్చారణ వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. అందుకే సైన్స్ సబ్జెక్ట్ని కూడా ఈ క్రియేటివ్ మీడియం ద్వారా వివరించాలనేది నా ఆకాంక్ష’’ అని తన ప్రయత్నం వెనుక ఉన్న పరమార్థాన్ని వివరించారు నీలిమ పెనుమర్తి. సమయం లేని తల్లిదండ్రుల కోసం...ఇప్పుడు ఉద్యోగాలు దాదాపుగా అందరి జీవితాలనూ సంక్లిష్టంగా మార్చేస్తున్నాయి. ఇలాంటప్పుడు పిల్లలకు కథ చె΄్పాలని ఉన్నప్పటికీ కొంతమందికి అందుకోసం ఓ గంట సమయం కేటాయించలేని పరిస్థితి ఉంటోంది. వాళ్లకు ఉపయోగపడేటట్లు కథలకు ఆడియో బుక్ రూపమిచ్చాను. దానిని ఇంగ్లిష్, హిందీ, తెలుగులో తెచ్చాను. మా పిల్లలు శ్రేయాస్, ఆయుర్ ఇద్దరూ హిస్టరీ చదివారు. అక్కడ హిస్టరీ అంటే రష్యన్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, ప్రపంచ యుద్ధాలు ప్రధానంగా ఉంటాయి.మా పిల్లలు అలాగే యూకేలో ఉన్న భారతీయమూలాలున్న పిల్లలకు మన చరిత్ర తెలియచేయాలనే ఉద్దేశంతో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద మొఘల్స్ టు ద మహాత్మా’ పేరుతో మరో ఆడియో బుక్ చేశాను. ఆ స్టోరీ ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశంలో అడుగు పెట్టడం నుంచి మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సముపార్జన వరకు సాగింది. అలాగే మన సామెతలను పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నమే ‘తాతమ్మ కథలు’. మా అమ్మ, నాన్న, అత్త, మామగారితో ఒక్కో సామెతకు ఒక్కో కథ రాయించి వాటిని ఐదు నిమిషాలకు మించకుండా ఎడిట్ చేసి రికార్డ్ చేశాను. మొత్తం పన్నెండు కథలు, గంట ఆడియో.ఈ కథలకు నాకు మాల్గుడి డేస్ స్ఫూర్తి. యూకేలోని తెలుగు కుటుంబాల పిల్లలు ఈ కథలను వినడం మొదలు పెట్టిన తర్వాత తొలి రోజుకి పన్నెండవ రోజుకీ వారి ఉచ్చారణ మారి΄ోయింది. కథకు అంతటి శక్తి ఉంటుందనే నా నమ్మకం నిజమేనని నిరూపితమైంది. తోలుబొమ్మలతో చేసిన ప్రయోగానికి చాలా ఖర్చయింది, కానీ అది కూడా సంతృప్తినిచ్చింది. ఆరు పాత్రలతో కథను అల్లుకుంటూ రాసుకున్నాం. ఆడియో బుక్ అనువాదాలకు హైదరాబాద్లోని కేంద్రీయ విద్యాలయ (ఉప్పల్) విద్యార్థులు, బేగంపేటలోని దేవనార్ (అంధ విద్యార్థుల పాఠశాల) స్కూల్ విద్యార్థులు గళమిచ్చారు.– నీలిమ పెనుమర్తి, స్టోరీ అవర్ రూపకర్త– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
చోరీ డెబిట్ కార్డుతో లాటరీ.. రూ. 41 కోట్లు గెలిచి..
యూకేలో ఓ వింత ఉదంతం వెలుగు చూసింది. ఈ దేశానికి చెందిన ఇద్దరు దొంగలు లాటరీలో నాలుగు మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీతో పోల్చిచూస్తే ఈ మొత్తం రూ.41 కోట్ల 66 లక్షలు. ఇంత భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్నాక కూడా వారు చిక్కుల్లో పడ్డాడు. బోల్టన్కు చెందిన జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్రామ్లు తాము చోరీ చేసిన డెబిట్ కార్డుతో లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. ఆ లాటరీ ఫలితాలు రాగానే వారు ఆనందంతో గెంతేశారు. తాము నాలుగు మిలియన్ పౌండ్లు అందుకోబోతున్నామంటూ ఉబ్బితబ్బిబయ్యారు. అయితే వారి ఆనందం కొద్దిసేపటికే ఆవిరయ్యింది. లాటరీలో వచ్చిన మొత్తాన్ని అందుకునేందుకు వారు లాటరీ నిర్వాహకులను సంప్రదించారు. వారు బ్యాంకు ఖాతా గురించి అడగగా, గుడ్రామ్ తనకు బ్యాంకు ఖాతా లేదని తెలిపాడు. దీంతోవారు అనుమానంతో అతనిని పలు విధాలుగా విచారించారు. ఈ నేపధ్యంలో గుడ్రామ్ ఆ కార్డు తన స్నేహితుడు జాన్దని తెలిపాడు. దీంతో వారు జాన్ను కూడా విచారించారు. అది అతనిది కూడా కాదని తేలింది. లాటరీ నిర్వాహకుల విచారణలో ఆ డెబిట్ కార్డు జోషువా అనే వ్యక్తికి చెందినదని తేలింది. దీంతో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్రామ్లు ఆ కార్డును దొంగిలించారని వారు గుర్తించారు. విషయం పోలీసుల వరకూ చేరింది. కోర్టు విచారణలో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్రామ్లకు 18 నెలల చొప్పున జైలు శిక్ష పడింది. డెబిట్ కార్డు యజమాని జోషువా ఆ లాటరీ మొత్తాన్ని అందుకునేందుకు అర్హుడయ్యాడు. ఈ విషయం తెలిసినవారంతా అదృష్టమంటే ఇదేనేమో అని అంటున్నారు. -
కాలేజ్కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!
ఓ వ్యక్తి కాలేజ్ చదువు కూడా చదవకుండా కోట్లు గడిస్తున్నాడంటే నమ్ముతారా..!. ఏ వ్యాపారం చేసో అనుకుంటే పొరబడ్డట్లే. ఎందుకంటే..అతడు చక్కగా పెద్ద కార్పోరేట్ కంపెనీలో అప్రెంటీస్గా మొదలు పెట్టి..ఏకంగా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్థాయికి చేరకున్నాడు. ఎలాంటి గ్రాడ్యుయేషన్ చదువులు చదవకుండా.. ఎలా అతడికి సాధ్యం అయ్యింది? అతడి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే.. యూకేకి చెందిన న్యూటన్(30) యూవివర్సిటి విద్య కూడా చదవలేదు. కానీ డెలాయిట్ కంపెనీలో పార్టనర్గా పనిచేస్తున్నాడు. అతడి వార్షిక వేతనం సుమారుగా రూ. 10 కోట్లు పైనే ఉంటుందట. ఇదంతా ఎలా సాధ్యం అనే కదా..!. అతడి కెరీర్ జర్నీ 12 ఏళ్ల క్రితం డెలాయిట్ కంపెనీలో బ్రైట్స్టార్ట్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్లో చేరడంతో మొదలయ్యింది. అలా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్తాయికి ఎదిగిపోయాడు. అది కాలేజ్డ్రాపౌట్స్ కోసం ఏర్పాటు చేసిన డెలాయిట్ బ్రైట్ స్టార్ అప్రెంటీస్ ప్రోగ్రామ్ అతడి తలరాతనే మార్చిందని చెప్పొచ్చు. నూటన్ పెరిగిందంతా డోరెట్స్లోనే. తన తండ్రి 16 ఏళ్ల వయసులో పాఠశాల చదువును విడిచిపెట్టి ఆర్మీలో చేరిపోయాడు. తన అమ్మ పబ్లోనూ, ట్రావెలింగ్ ఏజెన్సీలోనూ పనిచేసేది. దీంతో తల్లిదండ్రుల ప్రంపంచానికి దూరంగా పెరిగాడు న్యూటన్. ఆర్థిక పరిస్థితి వల్లే కదా తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది అని భావించి సంపాదన మార్గాల గురించి తీవ్రంగా అన్వేషించడం ప్రారంభించేవాడు. తీరిక దొరికితే అందుకోసమే వెతికేవాడు. ఐతే అనుకోకుండా విశ్వవిధ్యాలయంలో గణితం అధ్యయనం చేసేందుకు సీటు లభించింది. ఇలా అతడి కుటుంబంలో విశ్వవిద్యాలయంలో సీటు పొందిన ఏకైక వ్యక్తి కూడా న్యూటనే. కానీ అందులో చేరలేదు. సంపాదన మార్గాల మీదే అతడి ధ్యాసంతా. అందుకోసం రెండు మూడు చిన్నా చితకా ఉద్యోగాలు కూడా చేసేవాడు. అంతేగాదు స్కూల్ చదువుతో డబ్బులు వచ్చే స్కీములు ఏం ఉన్నాయా అని చూసేవాడు. ఆ కారణాల రీత్యా అతడు చదువాలనే దానిపై దృష్టి కేంద్రీకరించ లేదు. ఆ అన్వేషణలో భాగంగానే న్యూటన్ డెలాయిట్ బ్రైట్స్టార్ట్ అప్రెంటిస్ ప్రోగ్రామ్లో చేరాడు. ఐతే ఇది విద్యార్థులు కళాశాలలో చేరి చదువుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన ఉపాది మార్గం ఇది. దీన్ని కాలేజ్ యూనివర్సిటీలే ఏర్పాటు చేశాయి. అయితే ఇదంతా న్యూటన్కి నచ్చక ఒకింత అసహనం అనిపించినా, డబ్బు సంపాదించే మార్గం దొరికిందన్న ఉద్దేశ్యంతో అందులో జాయిన్ అయ్యాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీ పార్ట్నర్గా క్వాలిఫైడ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్గా విధులు నిర్వర్తించే రేంజ్కి చేరాడు. నిజానికి డెలాయిట్ కంపెనీ రిక్రూట్మెంట్ కోసం ఈ బ్రైట్స్టార్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా విద్యార్థుల ఉపాది పొందుతూ కాలేజ్ చదువును చదువుకునేలా ప్రోత్సహిస్తుంది. అంతేగాక ఈ ప్రోగ్రాం ద్వారా వారిలో దాగున్న టాంటెంట్ బయటకి వెలికితీస్తుంది. పైగా సామాజికంగా ఆర్థిక నేపథ్యం సరిగా లేని వ్యక్తులకు ఈ ప్రోగ్రాం ఒక గొప్ప వరం. అంతేగాదు కెరీర్లో మంచిగా సెటిల్ అవడానికి ఉపకరించే గొప్ప ఉపాధి మార్గం ఇది. ఇక్కడ న్యూటన్ సంపాదన ధ్యాస కళాశాలకు వెళ్లనీయకుండా చేసినా..ఉద్యోగంలో ఉన్నతంగా ఎదిగేలా చేసి ఈ స్థాయికి తీసుకురావడం విశేషం. ఇక్కడ డిగ్రీలు, పీహెచ్డీలు కాదు ముఖ్యం. సంపాదించాలనే కసి పట్టుదల అన్ని నేర్చుకునేలా, ఎదిగిలే చేస్తుందనడానికి న్యూటనే స్ఫూర్తి కదూ..!. (చదవండి: ఆర్బీఐ మాజీ గవర్నర్కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!) -
సీఎం జగన్పై హత్యాయత్నాన్ని ఖండిస్తూ యూకేలో ప్రవాసాంధ్రులు నిరసన
సాక్షి,అమరావతి: చంద్రబాబుకు ఏ దురుద్దేశమూ లేకపోతే ఇటీవల అమరావతి పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ సీఎం జగన్ను రాళ్లతో కొట్టండి అని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తీక్ టీడీపీని డిమాండ్ చేశారు. బాబు అన్న కొద్ది గంటల్లోనే సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిందని గుర్తు చేశారు. దీనిని వైఎస్సార్సీపీ యూకే విభాగం తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం యూకేలో సీఎం జగన్పై హత్యాయత్నం ఘటనను ఖండిస్తూ నిరసన చేపట్టారు. కార్తీక్ మాట్లాడుతూ.. విజయవాడలో సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని, దాన్ని చంద్రబాబు ఓర్చుకోలేక పోయారని అన్నారు. యాత్ర ఇలాగే సాగితే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించే సీఎం జగన్పై ఘాతుకానికి తెగబడ్డారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ కచి్చతంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పాలెం క్రాంతి కుమార్ రెడ్డి, మలిరెడ్డి కిషోర్, వడ్డూరి అప్పాజీ, వీర పులిపాకల, వజ్రాల రాజశేఖర్, భీమిరెడ్డి ప్రతాప్, మాదిరెడ్డి శ్రీకాంత్, వెంకట్ రమణ మామిడిశెట్టి, వంశీ కృష్ణా రెడ్డి కూకటి, గుండం సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. -
అలెర్ట్ : యూకే వీసా నిబంధనలు కఠినతరం.. తక్షణమే అమల్లోకి
లండన్ : 2025 జనవరిలో జరగనున్న యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్తో ఓడిపోనున్నారా? ఆ ఓటమి నుంచి గట్టెక్కేందుకు వీసా మంజూరులో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారా? అంటే అవుననే అంటున్నాయి యూకేలోని తాజా పరిణామాలు. వీసా మంజూరులో యూకే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. యూకేకు వలసదారుల్ని తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూకేలో విధులు నిర్వహిస్తూ వారికి కుటుంబ సభ్యులకు వీసా స్పాన్సర్ చేయాలంటే అవసరమైన కనీస ఆదాయ పరిమితిని పెంచినట్లు యూకే ప్రకటించింది. కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీస ఆదాయ పరిమితిని 55 శాతం పెంచింది. అంటే స్పాన్సర్డ్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీసం 18,600 నుంచి 29,000 పౌండ్స్ ఆదాయం ఉండాలి. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 38,700 పౌండ్స్కు పెంచుతున్నట్లు యూకే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే పలు నివేదికల ప్రకారం.. యూకేలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని నిర్ధేశించడంలో ఇమ్రిగ్రేషన్ అంశం కీలకం.ఈ నేపథ్యంలో ఆయా పొలికల్ ఏజెన్సీలు,మీడియా సంస్థలు సర్వేలు చేయగా అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చిన అధికార కన్జర్వేటీవ్ పార్టీలో సగానికిపైగా ఎంపీలో ఓటమి పాలవుతారని సర్వేలు హైలెట్ చేశారు. ఇంతకంటే సులభమైన మార్గం లేదా? అందుకే వలస దారుల్ని కట్టడి చేయడంతో పాటు యూకేలోని పన్ను చెల్లింపు దారులపై భారం పడకుండా ఉండేలా యూకే ప్రధాని రిషి సునాక్ ప్రణాళికల్లో ఓ భాగమని చెబుతున్నాయి.వీసా మంజూరులో కొత్త నిబంధనలపై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ మాట్లాడుతూ.. యూకే ప్రజలకు ఆమోదయోగ్యం పరిపాలన అందిస్తూ..దేశంలోకి వలసలు విపరీతంగా పెరగుతున్న తరుణంలో వాటికి కట్టడి చేసేందుకు మాకు ఇంతకంటే సులభమైన మార్గం కన్పించలేదని తెలిపారు. -
లాఫింగ్ గ్యాస్ ఇంత డేంజరా..! దీన్ని డ్రగ్లా..!
లాఫింగ్ గ్యాస్ గురించి వినే ఉంటారు. సై మూవీలో హీరో నితిన్ జెనీలియాని ఆటపట్టిస్తుండటంతో కోపంతో అతడిపైకి వస్తుంది. దీంతో నితిన్ ఈ గ్యాస్ని వదలడం జరుగుతుంది. దీంతో ఆమె తెగ నవ్వుతూనే ఉంటుంది. ఇదేంటీ కోపం రావడం లేదేంటీ నాకు నవ్వు వస్తోందంటూ కింద పడిపోతుంది. దీన్ని పీలిస్తే నవ్వు వస్తుందా? అంటే.. రాదుగాని ఉల్లాసభరితంగా అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మాదకద్రవ్యాల మాదిరి మత్తుని కలిగిస్తుంది. అలాంటి ఈ లాఫింగ్ గ్యాస్ని డబ్బాల కొద్ది పీల్చింది ఓ విద్యార్థి. దీంతో ఆమె.. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. 24 ఏళ్ల ఎల్లెన్ మెర్సస్ గతేడాది ఫిబ్రవరి 9న తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి హుటాహుటినా తీసుకువెళ్లారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు ఆమె చనిపోవడానకి గల కారణాలను దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యులు ఆమె నైట్రస్ ఆక్సైడ్(లాఫింగ్ గ్యాస) పీల్చడం వల్లే చనిపోయిందన్నారు. దీంతో ఆమె ఆస్పత్రికి వచ్చేటప్పుడూ.. పరిస్థితి ఎలా ఉందనే దిశగా విచారణ చేయగా..అబులెన్స్లో ఉన్న మెడికల్ టెక్నీషియన్ మైకేలా కిర్ట్లీ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను ఎమర్జెన్సీ అని పిలుపు రావడంతో మెర్సర్ ఇంటికి వెళ్లామని అక్కడ ఆమె బెడ్ రూంలో స్ప్రుహలోనే ఉందని, కాకపోతే గుండె స్పందనలు అసాధారణంగా ఉన్నాయన్నారు. ఆమె బాయ్ఫ్రెండ్ కాల్ చేయడంతో తాము వచ్చామని చెప్పారు. ఆమె నైట్రస్ఆ క్సైడ్ పీల్చుతోందని ఆ బాటిల్స్ తనకు చూపించడాని అన్నారు. ఈ తాగే క్రమంలోనే నైట్రస్ ఆక్సైడ్ ఆమె కాళ్లపై పడటంతో గాయలయ్యాయని, దీంతో రెండు వారాల నుంచి బాత్రూంకి వెళ్లడానికి ఇబ్బందిపడి మానేసిందని చెప్పుకొచ్చినట్లు తెలిపారు. ఇక విచారణలో మెర్సర్ బాయ్ఫ్రెండ్ ఆమె 600 గ్రాములు ఉండే నెట్రస్ ఆక్సైడ్ని రోజుకి మూడు బాటిల్స్ చొప్పున తాగేదని, ఇటీవల తగ్గించడం ప్రారంభించిందని చెప్పుకొచ్చాడు. నిజానికి ఇలా నైట్రస్గ్యాస్ని వినియోగించడం చట్ట విరుద్ధం. కానీ పోలీసు ఆ వేలో కేసు నమోదు చేయపోవడం గమనార్హం. ఈ ఘటన అనంతరం యూకే ప్రభుత్వం నవంబర్ 2023లో దీని వినియోగాన్ని పూర్తిగా నిషేధించడమే గాక క్లాస్ సీ డ్రగ్గా వర్గీకరించింది. దీన్ని మత్తురాయళ్లు మంచి కిక్ ఇచ్చే డ్రగ్ మాదిరిగా వాడి ప్రాణాలపైకి తెచ్చకుంటున్నారని పేర్కొంది. నిజానికి ఇది అంత ప్రమాదకరమైంది కాదు. వైద్యపరమైన విధానంలో నొప్పి తగ్గించేందుకు, దంత శస్త్ర చికిత్సలోనూ మత్తు ఇవ్వడం కోసం వాడటం జరుగుతుంది. దీన్ని అదే పనిగా పీల్చడం మొదలు పెడితే మాత్రం నాడి సంబంధ సమస్యలు ఉత్ఫన్నమయ్యి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!) -
యూకేలో మేమంతా సిద్ధం
-
London : యూకేలో మేమంతా సిద్ధం
లండన్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు యునైటెడ్ కింగ్డమ్ (UK) నుంచి వైఎస్సార్సిపి నేతలు సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్సిపికి మద్ధతుగా యూకేలోని వేర్వేరు ప్రాంతాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మేమంతా సిద్ధం #memanthasiddham ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్రకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు YSRCP UK కన్వీనర్లు Dr ప్రదీప్ చింతా , ఓబుల్ రెడ్డి పాతకోట. UKలోని లెస్టర్లో మేమంతా సిద్ధం సంఘీభావ సభ నిర్వహించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి 59 నెలలుగా కష్టపడుతున్నారని, ఈ ఒక్క నెలా విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులంతా జగనన్నకోసం కష్టపడి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని Dr ప్రదీప్ చింతా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో YSRCP UK కమిటీ సభ్యులు జనార్దన్ చింతపంటి, నారాయణరెడ్డి, కార్తీక్ భూమిరెడ్డి, చాళుక్య , ఆదిత్య, క్రాంతి పాలెం, కూమార్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి యనుముల, సతీష్ నర్రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సతీష్ ఉగ్గుముడి, పునీత్ తదితరులు పాల్గొన్నారు. UK నలుమూలలనుండి పలువురు వైఎస్సార్సిపి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యుద్ధానికి సిద్ధం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా ‘మేమంతా’ సిద్ధం బస్సు యాత్ర జరుగుతోందన్నారు ప్రదీప్ చింతా. ఐదేళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్కు ఊరూరా.. అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారని, జననేతను చూసేందుకు.. కరచాలనం.. మాట కలిపేందుకు.. ఫొటోల కోసం ఆరాటం చూస్తుంటే.. ప్రజల గుండెల్లో సీఎం జగన్కు ఎంత అభిమానం, అప్యాయత ఉందో తెలిసిపోతోందన్నారు. మండుటెండల్లోనూ గంటల తరబడి రోడ్డుపై జననేత కోసం ఓపిగ్గా నిరీక్షిస్తున్నారని, చంటి బిడ్డలను చంకనేసుకుని బస్సు వెంట తల్లులు పరుగులు తీస్తున్నారన్నారు. టీవీల్లో మేమంతా సిద్ధం యాత్ర చూస్తుంటే ప్రతీ వైఎస్సార్సిపి కార్యకర్త గుండె ఉప్పొంగిపోతోందని, ఇన్నాళ్లు పడ్డ కష్టం ప్రజల కళ్లలో కనిపిస్తోందన్నారు. మేమంతా సిద్ధం యాత్ర ఒరవడికి కూటమి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. జూన్ 4న విడుదలయ్యే ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని చెప్పారు ప్రదీప్. -
20 ఏళ్లలో ఏ దేశం ఎంత వృద్ధి చెందిందో తెలుసా.. (ఫొటోలు)
-
Election 2024: ప్రధాని మోదీ బిగ్ ప్లాన్!
దేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు వంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అధికార బీజేపీ ఎన్నికల్లో ప్రచారం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలు, ప్రచార సరళిని క్షేత్రస్థాయిలో చూపించేందుకు ప్రపంచంలోని పలు దేశాలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపింది. సుమారుగా 25 విదేశాలకు చెందిన పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలను పంపిచినట్లు తెలుస్తోంది. అయితే అందులో 13 పార్టీల ప్రతినిధులు భారత్కు రావడానికి ఆసక్తి చూపినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే 13 పార్టీల ప్రతినిధులు ఏయే దేశాలకు చెందినవారనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. బీజేపీ ఆహ్వానించిన విదేశీ పార్టీలు.. అమెరికాలోని అధికార డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి బీజేపీ ఆహ్వానం పంపింది. ‘‘అమెరికాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అధ్యక్ష ఎన్నికలు కోసం తలమునకలై ఉంది. అయితే యూఎస్ పార్టీ ఇండియా, యూరప్లోని ఎన్నికల విధానానికి భిన్నంగా ఉంటుంది. యూఎస్ పార్టీ కార్యకర్తకు ఆ పార్టీ చీఫ్ తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అధ్యక్ష కార్యాలయం, యూఎస్ కాంగ్రెస్ (చట్ట సభ)కు అక్కడ చాలా ప్రాముఖ్యం ఉంటుంది’’అని ఓ బీజేపీ నేత తెలిపపారు. యూఎస్తో పాటు యూకేలోని కన్జర్వేటివ్, లేబర్ పార్టీల ప్రతినిధులను ఆహానం పంపారు. జర్మనిలో క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఆహ్వానించారు. అయితే పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఒక్కపార్టీని కూడా పిలువకపోవటం గమనార్హం. భారత్తో పాక్కు సరైన సంబంధాలు సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే. అదేవిధంగా సరిహద్దు వివాదంతో తరుచు కవ్వించే చైనా పార్టీలకు కూడా బీజేపీ ఆహ్వానం పంపించలేదు. మరోవైపు పొరుదేశమైన బంగ్లాదేశ్లో కేవలం అధికార అవామీ లీగ్ను మాత్రమే ఆహ్వానించింది. ఇటీవల అక్కడి ప్రతిపక్ష పార్టీ బీఎన్బీ.. ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో భారతీయ ఉత్పత్తులను బాయ్కాట్ చేసిన విషయం తెలిసిందే. నేపాల్, శ్రీలంకకు చెందిన అన్ని ప్రముఖ పార్టీలను బీజేపీ ఆహ్వానించింది. ఇక.. తాము ఆహ్వానించిన విదేశీ పార్టీల ప్రతినిధులు లోక్సభ ఎన్నికల మూడో లేదా నాలుగో దశ పోలిగ్ సమయం(మే రెండో వారం)లో భారత్ను సందర్శిస్తారని బీజేపీ భావిస్తోంది. విదేశి పార్టీకు చెందిన ప్రతినిధులు, పరిశీలకులు ముందుగా ఢిల్లీ చేరుకొని భారత్ రాజీకీయ వ్యవస్థ, ఎన్నికల విధానం గురించి తెలుసుకుంటారు. 5-6 మంది ప్రతినిధుల బృందం నేరుగా క్షేత్రస్థాయిలో 4-5 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ నేతలను కలుస్తారు. ప్రధాని మోదీ, హోం మంత్రి వంటి నేతల ర్యాలీల్లో విదేశీ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. బీజేపీ ప్రాముఖ్యత తెలపటమే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా బీజేపీ పార్టీ ప్రాముఖ్యత తెలియచేయటంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆయన విదేశీ పార్టీలకు చెందిన సుమారు 70 మంది ప్రతినిధులను కలువనున్నారు. ఇప్పటికే.. నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండను బీజేపీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సైతం విదేశీ పార్టీలకు చెందిన 4-5 మంది ప్రముఖుల బృందం పలు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇక.. ప్రపంచం దేశాల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చేరువకావటమే లక్ష్యంగా బీజేపీ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రజాస్వామ్యానికి ఇండియా తల్లి వంటిది. ప్రపంచంలోనే అతి పెద్దపార్టీ బీజేపీ. బీజేపీ ఎన్నికల విధానం, ఎన్నికల ప్రచారం, అమలు చేసే వ్యూహాలను ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి’’అని బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం నేత విజయ్ చౌతైవాలే తెలిపారు. -
భారత వ్యతిరేక కథనంపై స్పందించిన అమెరికా
న్యూయార్క్: పాకిస్తాన్లో వరుస ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని ఇటీవల యూకేకు చెందిన ఓ వీడియా సంస్థ ఆరోపణలు చేస్తూ కథనం వెల్లడించింది. అయతే తాజాగా ఆ కథనంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇటువంటి ఆరోపణలను తీవ్రతరం చేసుకోకుండా ఇరు దేశాలు.. చర్చల ద్వార సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది. భారత్పై వచ్చిన ఆరోపణలపై ఆమెరికా వైఖరి ఏంటని అడిగిన ప్రశ్నకు యూఎస్ విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. ‘పాకిస్తాన్లోని వరుస ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వేనుక భారత్ హస్తం ఉందని వెలువడిన కథనం మా దృష్టికి వచ్చింది. అటువంటి ఆరోపణలపై మేము ఎటువంటి వ్యాఖ్యలు చేయిలేం. మేము ఇరు దేశాలకు సంబంధించి సున్నితమైన విషయంలో జోక్యం చేసుకోలేం. అదే విధంగా ఇటువంటి ఆరోపణలను ఇరు దేశాలు సైతం తీవ్రతరం చేసుకోకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని యూకేకు చెందిన ‘దీ గార్డియన్’ న్యూస్పేపర్ ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం. అయితే ‘దీ గార్డియన్’ పేపర్ ఆరోపణలను భారత్ విదేశాంగ శాఖ.. తీవ్రంగా ఖండించింది. ఆ నివేదికలో ఉన్నది తప్పుడు సమాచారమని, ఇదంతా భారత్ వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో టార్గెట్గా హత్యలు చేయటం భారత ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేసింది. -
లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!
సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ యువతీ యువకులు వరకు అందరూ అందం వెంట పరుగులు పెడుతున్నారు. అందుకోసం ఎలాంటి సర్జరీలైన చేయించుకునేందుకు అయినా వెనుకాడటం లేదు. తీరా అవి శరీరానికి పడక ఫైయిలై ప్రాణాల మీదకు తెచ్చకున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అచ్చం అలాంటి ఘటనే యూకేలో ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. యూకేకి చెందిన 24 ఏళ్ల షౌన్నా హారిస్ అనే మహిళ తన పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ ట్రీట్మెంట్ని మొదటగా 18 ఏళ్ల వయసులో 0.51ఎంఎల్ లిప్ ఫిల్లర్ పొందింది. ఆ తర్వాత హారిస్ 24 ఏళ్ల వయసులో మరోక 1ఎంఎల్ ట్రీట్మెంట్ అందుకుంది. మొదటగా చేయించుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ రెండోసారి అది తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీసింది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ ఫెయిలైతే పెదాలు ఉబ్బడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమెకు పెదాలు ఒక విధమైన మంటతో లావుగా అయ్యిపోవడమేగాక శ్వాస సంబంధ సమస్యలు, ముఖమంతా మంట, దద్దర్లు వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి.ఆ బాధ తాళ్లలేక చనిపోతానేమో అనేంత భయానక నరకాన్ని అనుభవించింది. ఓ మూడు రోజుల వరకు బయటకు రాలేకపోయింది. వైద్యులు వెంటనే ఆమె పరిస్థితిని గమనించి చికిత్స చేయగా శ్వాస పీల్చుకోగలిగింది. ఆ సమస్యలు తగ్గుతాయా లేదా అనేది వైద్యలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఏదీ ఏమైనా దేవుడిచ్చిన అందం చాలు అనుకుంటే సమస్యలు ఉండవు. ఇలా అందం కోసం ఆర్రులు చాచి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని పడరాని పాట్లు పడుతుంటారు చాలామంది. అందం మాట దేవుడెరుగు అస్సలు బతుకుతామా అనే సందేహాలు తెప్పించే ఈ కాస్మోటిక్ సర్జరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది.ఎందుకు చేస్తారంటే..పెదాలు బొద్దుగా కనిపించేందుకు ఈ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మొదటగా 0.5ఎంఎల్ డెర్మల్ ఫిల్లర్ (సగం సిరంజి) తో ప్రారంభిస్తారు. రెండువారాల తర్వాత ఇంకాస్త లావుగా కావాలనుకుంటే మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత పెదాల ఆకృతి శాశ్వతం ఉండిపోదు. ఆ లిప్ ఫిల్లర్లు సాధారణంగా 12 నుండి 18 నెలల వరకు ఉంటాయి. మన శరీరం శక్తి ఎంత వేగంగా బర్న్ చేసే దాన్న బట్టి వాటి సైజు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ట్రీటెమెంట్కు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే పెదాలు లావు తగ్గిపోయాక మళ్లీ వైద్యుడిని సంప్రదించి చేయించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో పెదాలకు ఇంజెక్షన్లు పడకపోతే శరీరంపై తీవ్ర దుష్పరిణామాలు చూపించే ప్రమాదం కూడా ఉంది. ఈ కాస్మోటిక్ సర్జరీలు ఎంత లగ్జరీయస్తో కూడికున్నవైనా.. తేడా కొడితే ప్రాణం మీదకు వస్తుందనే విషయం మరువద్దు. ఇక ఇక్కడ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్లో ఇచ్చే హైలురోనిడేస్ అనే ప్రోటీన్ ఎంజైమ్ ప్రతిచర్య ఫలితంగానే ఒక్కోసారి ఫెయిలై శరీరంపై పలు దుష్పరిణామాలు చూపిస్తుంది. ఇది పెదవుల్లో సాధారణంగా ఉండే హైలురోనిక్ యాసిడ్ను విచ్ఛిన్నం చేసి కావల్సినంత ఆకృతిలో పెదవులు ఉండేలా చేసుకునేందుకు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.గతంలో ఇలానే యూఎస్కి చెందిన మహిళ ఇలాంటి శస్త్ర చికిత్స చేయించుకుని కార్టూన్ క్యారెక్టర్ మాదిరిగా ఫేస్ మారిపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ బాధను వెల్లబోసుకుంది. ఈ లిప్ ఇంజెక్షన్ పడకపోతే మనిషి కోలుకోలేనివిధంగా ఆరోగ్యం దెబ్బతినడం, ముఖం వికృతంగా మారిపోవడం వంటివి జరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు అవి పడతాయని నిర్థారించక గానీ ఆ ట్రీట్మెంట్ని చేయకూడదని చెబుతున్నారు. -
పేదలపై ఇంత కక్ష ఎందుకు బాబూ?
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏపీ సీఎం జగన్ ఆచరణలో అమలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం పేదలపై కక్ష పెంచుకుంటున్నారని యూకేలోని పలువురు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ‘గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వారు ఇంటింటికీ వెళ్లి పేదలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, అలాంటి వారిపై ఇంతగా కక్షకడతారా?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో లండన్ ఇల్ఫోర్డ్ లోని శ్రేయాస్ హోటల్లో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాతణ్ కలిసి సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా కోర్టుల్లో పిటిషన్లు వేసి పేదలకు వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారన్న విషయం మీడియా ద్వారా తెలుసుకొని, లండన్ పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీలో సమూల మార్పులు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ యూకే కనీ్వనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబులరెడ్డి పాటకోట మాట్లాడుతూ గ్రామాల్లో సీఎం జగన్ సమూల మార్పులు తెచ్చారన్నారు. అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి వారి అకౌంట్లలోకి జమ చేశారని, ఒక్క పైసా లంచం లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా అర్హులందరికీ పథకాలు అందించారని గుర్తుచేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పెన్షన్ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు కల్యాణమస్తు, షాదీ తోఫా సైతం ఇలా అనేక పథకాలు పేదలకు అందించారని వివరించారు. అందుకే సిద్ధం బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. ఏపీలో కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గాం«దీకి విన్నవించామన్నారు. తొలుత వారు సిద్ధం పోస్టర్లు పట్టుకొని సీఎం జగన్ బస్సు యాత్రకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు జై జగన్, జోహర్ వైఎస్సార్, ఎన్నికలకు మేం అంతా సిద్ధం, వైనాట్ 175 అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అక్కడి వైఎస్సార్సీపీ నాయకులు సురేంద్ర రెడ్డి అలవల, నారాయణరెడ్డి బూర్ల, మలిరెడ్డి కిషోర్, భూమిరెడ్డి కార్తీక్, పాలెం క్రాంతి, శ్రీనివాస్ తాళ్ల, శ్రీనివాస్రెడ్డి దొంతిబోయిన, ప్రతాప్ భీమిరెడ్డి, వజ్రాల రాజశేఖర్, పూర్ణచంద్ర దుగ్గెంపూడి, శ్రీకాంత్ ముక్కు, ఆవుల వంశీకృష్ణ, కంభంపాటి వినయ్, కిరణ్ కొరికాన, వీర పులిపాకల, శ్యామ్, చాగంటి మణికంఠేశ్వర పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. -
పార్కింగ్ స్థలంలో 1800 ఏళ్ల నాటి పురాతన విగ్రహం!
కొన్ని పురాతన వస్తువులు చాలా విచిత్రంగా బయటపడతాయి. పురావస్తు శాస్త్రవేత్తలకు చిక్కని కొన్ని మిస్టీరియస వస్తువులు సాధారన కూలీలకు లేదా భవన నిర్మాణ కార్మికులకు కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పాపం వారు అదేదో సాధారణ వస్తువుగా పరిగణిస్తారు. అదికారులకు చెంతకు చేరే వరకు అదేంటన్నది తెలియదు. అలాంటి విచిత్ర ఘటన యూకేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఇంగ్లండ్లోని లింకన్ షైర్ కౌంటీలో ఉన్న 16వ శతాబ్దపు పురాతన భవనం బర్గ్లీ హౌస్ పార్కింగ్ స్థలంలో నిర్మాణ పనులు చేస్తుండగా పాలారాతి శిల్పం కనిపించింది. అదేదో రాయిగా భావించానని గ్రెగ్ క్రాలే అనే కార్మికుడు చెబుతున్నాడు. దాన్ని ఒక బకెట్లో పెడుతుండగా తిరగబడటంతో అది విగ్రహం తల అని అర్థమయ్యింది. దాన్ని అధికారుల వద్దకు తీసుకెళ్లి చూపగా అది పురాతన రోమన్ విగ్రహమని చెప్పడంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యానని అన్నాడు క్రాలే. చాలా ప్రత్యేకమైనది, పురాతనమైనదని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు క్రాలే. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ విగ్రహం మెండెం భాగం కూడా లభించింది. ఆ తర్వాత తలను, మెండెంను దగ్గరకు చేర్చి అసలు రూపంలోకి మార్చారు నిపుణులు. ఇది మొదటి లేదా రెండో శతాబ్దానికి చెందిన పురాతన విగ్రహ అవశేషాలుగా చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్ధే ప్రక్రియలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇలాంటి పురాతన ప్రతిమలను ఇటలీలో గ్రాండ్ టూర్ అని పిలిచే కులీనులే తయారు చేస్తారని, ఆ ప్రతిమ చెక్కిన తీరులో అది కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు దీన్ని 9వ ఎర్ల్ తన గ్రాండ్ టూర్ ఆఫ్ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఈ శిల్పాన్ని బర్గ్లీకి తీసుకువచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: వందేళ్ల క్రితం కరెంట్ లేకుండా పనిచేసిన ఫ్రిడ్జ్) -
London: మహిళలు ఇల్లే కాదు.. సమాజ అభివృద్ధికి కూడా ఎంత కీలకం!
'ఒకటి ఒకటి కలిపితే రెండు కాదు, తోడుగా నిలబడితే 11 అని చాటుతూ, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవాస మహిళలు 'తెలుగు లేడీస్ ఇన్ యూకే' అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఉమెన్స్ డే వేడుకలు జరుపుకున్నారు'. ఈ ‘తెలుగు లేడీస్ యూకే (UK)’ గ్రూపును శ్రీమతి శ్రీదేవి మీనావల్లి డిసెంబర్ 2011న ప్రారంభించారు. ఈ టీఎల్యూకే (TLUK) గ్రూపులో సుమారు 5,000 మంది పైగా తెలుగు మహిళలు ఉన్నారు. బ్రిటన్కు వలస వచ్చే తెలుగు ఆడపడుచుల అందరికీ నూతన పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా, వైద్య, ఆర్థిక సందేహాలు, సలహాల ద్వారా చేయూతను అందించడమే ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం అని శ్రీదేవి గారు తెలిపారు. ప్రతి సంవత్సరంలా కాకుండా వినూత్నంగా ఈ ఏటా సెంట్రల్ లండన్ లోని థేమ్స్ నదిపై ఒక ప్రైవేట్ క్రూయిజ్ లో ఈ వేడుకలు జరుపుకున్నారు. థేమ్స్ నదిపై నాలుగు గంటల పాటు ప్రయాణం చేస్తూ విందు వినోదాలతో ,ఆటపాటలతో, లైవ్ ఎంటర్టైన్మెంట్ అందరూ ఉల్లాసంగా గడిపారు. ఆట పాటలతో పాటు రాఫెల్ ద్వారా ఈ గ్రూపు నిర్వహించే విద్యా వైద్య సేవా కార్యక్రమాల్లో తోడ్పడి మహిళలందరూ తమ చేయూతను అందించారు. మహిళలు ఇల్లే కాదు సమాజ అభివృద్ధికి కూడా ఎంత కీలకమో చాటిచెప్పారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, జ్యోతి సిరపు, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వాయర్ని వేలానికి పెట్టడం గురించి విన్నారా?
రిజర్వాయర్లు అమ్మాకానికి వెళ్లడం ఏంటీ అని అనుకుంటున్నురా? ఔను ఇది నిజం అక్కడ స్థానిక ప్రజలకు ఆ రిజర్వాయర్ తలనొప్పిగా మారిందట. అందుకని దాన్ని వేలానికి వేయాలని నిర్ణయించారు దాని యజమాని. ఏంటా రిజర్వాయర్ ? ఎందువల్ల ఇలా అమ్మకానికి పెట్టారంటే.. యూకేలోని 200 ఏళ్ల నాటి రిజర్వాయర్ దాదాపు మూడు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఈ రిజర్వాయర్ పడమటి వైపు దాదాపు 900 మీటర్లు కలిగిన ఫుట్పాత్ ఉంది. ఇది అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రాంతం కావడంతో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో చెత్త సమస్య ఎక్కువయ్యింది. వీటన్నింటితో విసిగిపోయిన అక్కడ స్థానిక ప్రజలు రిజర్వాయర్ తమకు తలనొప్పిగా మారిందని స్తానిక నీత్ పోర్ట్ టాల్బోట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు. చెప్పాలంటే ఈ రిజర్యాయర్ మంచి బ్యూటిఫుల్ స్పాట్ కావడంతో ఇక్కడకు టూరిస్ట్లు తాకిడి బాగా ఎక్కువ, పైగా ఈ ప్రాంతం సరదాగా గడిపేందుకు, వాకింగ్కి మంచి ప్రసిద్ధి. దీంతో ఈ ప్రదేశం అంతా అత్యంత రద్దీగా మారిపోయింది. దీన్ని తట్టుకోలేక స్థానిక ప్రజలు తమ గోడుని కౌన్సిల్ వద్ద మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా టూరిస్ట్లు ఆ రిజర్యావయర్ సమీపంలోనే స్టే చేయడం స్థానికులకు మరింత సమస్యాత్మకంగా మారింది దీంతో ఈ రిజర్వాయర్ని గతేడాది నుంచి సమంత ప్రైస్ అనే వేలం సంస్థ వేలానికి ఉంచింది. గతేడాది దాదాపు రూ. 80 లక్షల వరకు పలకగా ఈ ఏడాది మాత్రం అత్యంత తక్కువ ధర రూ. 16 లక్షలు పలకడం గమనార్హం. దీనిపేరు బ్రోంబిల్ రిజర్వాయర్. ఇది స్థానిక ఉక్కు పరిశ్రమకు నీటిని సరఫరా చేయడం కోసం నిర్మించిన రిజర్వాయర్. ఇప్పటికీ ఇది పనిచేస్తుంది. సైక్లిస్టులకు, చేపలు పట్టేవాళ్లకు మంచి ప్రసిద్ధ ప్రదేశం. అయితే ఈ రిజర్వాయర్ని తొలగించడం అనేది అత్యంత రిస్క్తో కూడుకున్నది కూడా. ముఖ్యంగా చుట్టు పక్కల స్థానికులు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, పర్యావరణానికి ఇబ్బందిక కలగకుండా నిర్ణిత ప్రమాణాలకు లోబడి చేయాల్సి ఉంటుంది. అంతేగాదు ఇలా రిజర్వాయర్లు వేలానికి వెళ్లడం అత్యంత అరుదు అని స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: స్ట్రీట్ కేప్లో సర్వ్ చేస్తున్న రోబో వెయిటర్! నెటిజన్లు ఫిదా!) -
ఆ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్కి టూరిస్ట్ ఫిదా!
విదేశీ టూరిస్టలు మన దేశంలోని చారిత్రక ప్రదేశాలకు వచ్చినప్పుడూ ఇబ్బంది పడుతుంటారు. మనతో కమ్యూనికేషన్ చేయలేక నానాపాట్లు పడుతుంటారు వాళ్లు. అందులోనూ మన దేశంలో చాలామందికి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోవడం లేదా వాళ్లు చెప్పింది అర్థం చేసుకోలేక ఇబ్బంది పడతుండటం జరుగుతుంది. కానీ ఈ ఆటో డ్రైవర్ మాత్రం అర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి యూకే టూరిస్ట్ని ఆకట్టుకున్నాడు. అతడు ఇంగ్లీష్ మాట్లాడుతున్న తీరుకి ఇంప్రెస్ అయ్యి అతడితో జరిగిన సంభాషణను వివరిస్తూ.. అందుకు సంబధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవ్వుతోంది. బ్రిటిష్ వాగ్లర్ జాకీ ఇటీవల కేరళ పర్యటనలో ఉన్నప్పుడూ జరిగింది ఈ ఘటన. అతను అక్కడ ఓ హోటల్లో స్టే చేశాడు. అయితే ఆ హోటల్ని ఖాళీ చేద్దామంటే.. సడెన్గా ఏటీఎం వర్క్ చేయడం మానేసింది. దీంతో ఫోర్ట్ కొచ్చికి వెళ్లే ప్రధాన రహదారి గుండా ఏటీఎం సెంటర్ ఎక్కడుందా? అని సర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఆష్రఫ్ ఏంటీ సార్ అంటూ ఆంగ్లంలో ఆ టూరిస్ట్ని పలకరించాడు. మొహమాటంగా టూరిస్ట్ పొడిపొడిగా సమాధానం ఇచ్చి వెళ్లేందుకు యత్నిస్తుంటే..ఎక్కడికైనా వెళ్తారా? ఆటో కావాలా అంటూ ఫ్రెండ్లీగా అర్థవంతమైన ఆంగ్లంలో మాట్లాడుతుండటంతో.. ధైర్యంగా టూరిస్ట్ తన సమస్య వివరిస్తాడు. దాని గురించి తెలియజేయడమే కాకుండా ఆటోలో రావాల్సిందిగా కోరతాడు డ్రైవర్. అందుకు టూరిస్ట్ నిరాకరిస్తాడు. అయితే ఏటీఎం కోసం కాంప్లిమెంటరీ రైడ్ చేయమంటూ తన ఆటోలోకి ఆహ్వానిస్తాడు. ఆ ఆటోడ్రైవర్ మర్యాదపూర్వకమైన తీరుని చూసి టూరిస్ట్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాతా ఆ టూరిస్ట్ని ఏటీఎం సెంటర్ వద్ద డ్రాప్ చేసి వెళ్లిపోతాడు ఆటో డ్రైవర్. చక్కగా మంచి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడాని ఆ ఆటో డ్రైవర్ని మెచ్చుకుంటూ అతనితో జరిగిన సంభాషణ గురించి పోస్ట్లో రాసుకొచ్చాడు ఆ యూకే టూరిస్ట్. గతంలో ఇలా పర్యాటనకు వెళ్లినప్పుడూ పలు భాషా సమస్యలు ఎదుర్కొన్నాని ఆ పోస్ట్లో తెలిపాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి మిలియన్లలో వ్యూస్, లైక్లు వచ్చాయి. View this post on Instagram A post shared by Zakky (@zakkyzuu) (చదవండి: 1200 ఏళ్ల నాటి పురాతన సమాధి..అందులో ఏకంగా కోట్లు..!) -
Sidham : లండన్ లో YSRCP భారీ కార్ ర్యాలీ
#why not 175 వైనాట్ 175 అంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుపై లండన్ లోని ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. YSRCP UK కమిటీ ఆధ్వర్యంలో లండన్లోని ఈస్ట్ హామ్ లో ఘనంగా YSRCP సిద్ధం సభను నిర్వహించారు. అనంతరం భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో YSRCP ఘన విజయం సాధిస్తుందని, రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. YSRCP లండన్ కన్వీనర్లు Dr ప్రదీప్ చింతా, ఓబుల్రెడ్డి పాతకోట అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అద్దంకి సిద్ధం సభను పురస్కరించుకుని UKలోని వైఎస్సార్ సిపి అభిమానులు, నాయకులు గత కొన్ని నెలలుగా పార్టీ నాయకులను సమాయత్తం చేస్తున్నారు. గత ఎనిమిది నెలల్లో UKలో నిర్వహించిన 5వ YSRCP సభ ఇది. ఈ కార్యక్రమంలో UK నలుమూలల నుండి YSRCP కార్యకర్తలు, జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి కిషోర్ మలిరెడ్డి, కిరణ్ పప్పు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సిద్ధం స్మరణతో సభా ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలోనే ఎన్నికలు జరగనున్నాయని, ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజలకు మరింత వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉందని YSRCP NRI ఛైర్మన్ వెంకట్ మేడపాటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. NRIలు ఏవిధంగా ఎన్నికలకు సన్నద్దమవాలో వివరించారు. Dr ప్రదీప్ చింతా తన ప్రసంగంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. సీఎం జగన్ జనరంజక పాలన చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమం రెండింటిలోనూ దేశంలోనే బెస్ట్ గా నిలిచారని కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు వచ్చే పాతికేళ్లు కొనసాగాలని ఆశించారు. ఈ సభలో YSRCP నూతన కార్యవర్గాన్ని కన్వీనర్లు సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో UK కమిటీ సభ్యులు శ్రీకాంత్ పసుపుల, మన్మోహన్ యమ్మసాని , PC రావు కోడె, అనంత్ రాజ్ పరదేశి, శ్రీనివాస్ తాల్ల, సుబ్బారెడ్డి ఆకేపాటి, శ్రీనివాస్ దొంతిబోయున, సురేందర్ అలవల, రవి మోచర్ల, రాజేష్ యాదవ్, వంశీ కృష్ణ మద్దూరి, విజయ్ పెండేకంటి, కార్తీక్ కొలిశెట్టి ,జయంతి రెడ్డి, కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, NR నందివెలుగు, మధు గట్టా, వజ్రాల రాజశేఖర్ , సుధాకర్ ఏరువ, భస్కర్ మాలపాటి , శ్యామ్ తొమ్మండ్రు , నరసింహారెడ్డి వేములపాటి పాల్గొన్నారు -
నథింగ్ ఫోన్ 2ఏ వచ్చేసింది.. ధర ఎంతంటే?
లండన్కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. భారత్లో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరిగాయి. నథింగ్ ఫోన్1 ప్రీమియం మార్కెట్ను టార్గెట్ చేసుకొని వస్తే.. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. బ్లాక్, వైట్ వేరియంట్లో నథింగ్ ఫోన్ 2ఏ మార్చి 5న ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఓఎస్లో ఆసక్తికరమైన టేకింగ్కు పేరుగాంచిన నథింగ్ గతంలో ఒరిజినల్ నథింగ్ ఫోన్ (2022), నథింగ్ ఫోన్ 2 (2023)లను ప్రారంభించింది. రూ.23,999 నుండి ప్రారంభమయ్యే ఈ ఫోన్లో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్, వెనుకవైపు డ్యూయల్ 50 ఎంపీ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. -
ఇదేమీ అలెర్జీ రా బాబు..! స్నానం చేసిందా ఇక అంతే..!
స్నానం చేస్తే.. నరకయాతన అనుభవించే వాళ్లు ఉన్నారంటే నమ్ముతారా!. అసలు ఇలాంటి సమస్య కూడా ఉంటుందా? అని అనిపిస్తుంది.కానీ ఇలాంటి చిత్ర విచిత్రమైన అనారోగ్య సమస్యలు ఫేస్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. వాటికి సరైన చికిత్స విధానం, తగ్గించే మందులు లేకపోవడంతో వాళ్లు చెప్పుకోవడానికి కూడా వీల్లేనంత యాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి భాదనే చవిచూస్తోంది యూకేకి చెందిన ఓ మహిళ. వివరాల్లోకెళ్తే..యునైటెడ్ స్టేట్స్లోని సౌత్ కరోలినాకు చెందిన 22 ఏళ్ల మహిళ తీవ్రమైన నీటి అలెర్జీతో బాధపడుతోంది. అందువల్ల ఆమె స్నానం చేయలేని స్థితిని ఎదుర్కొంటుంది. అలాగని స్నానం చేయకుండా ఉండటం అనేది కుదరని పని. తప్పక స్నానం చేసినా.. వెనుటవెంటనే టవల్తో తుడిచేసుకోవాల్సిందే. ఒక చుక్క నీరు కూడా శరీరంపై ఉండటానికి వీల్లేదు. ఇది ఎంత దారుణమైన బాధంటే..ఆయా వ్యక్తులు పొరపాటున కూడా నీటిని తాకలేరు, కనీసం వారి స్వేద జలం కూడా వారికి ఇబ్బందే. ఆమె శరీరం పొరపాటున తడికి గురయ్యిన లేదా నీళ్లను తాకినప్పుడు వెంటనే దద్దుర్లు, దురద రావడం జరుగుతుంది. ఎంతలా అంటే అదేపనిగా దురద వస్తూ ఉండటంతో గోకకుండా ఉండలేనంత విధంగా ఒకటే దురదగా ఉంటుందని వేదనగా చెబుతోందామె. తనకు ఈ పరిస్థితి సుమారు 12 ఏళ్ల వయసు నుంచి మొదలయ్యిందని, ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితి మరింత దిగజారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక భరించేలేక డాక్టర్ వద్దకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే వైద్యులు కూడా ఈ అలెర్జీకి చికిత్స లేనందున వీలైయినంతగా స్నానం చేయకపోవడం లేదా స్నానం చేయడానికి దూరంగా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని సూచించినట్లు తెలిపింది. అయితే ఇలా స్నానం చేయకుండా తడిగుడ్డతో లేదా వైప్స్తో తుడుచుకోవడం ఎంత నరకమో తెలుసా? అంటూ కన్నీటి పర్యంతమవుతోంది ఆ మహిళ. తాను ఇలా స్నానం చేయకుండ ఉండలేను స్నానం చేస్తే తట్టుకోలేను అంటూ బాధగా తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. అయితే తనలాంటి వాళ్లు ఎవరైన ఉన్నారా? అని సోషల్ మీడియా ద్వారా సర్చ్ చేసి మరీ తెలుసుకున్నానని, తామంత ఒక కమ్యూనిటిగా ఉండి, తమ సమస్యలను ఒకరికొకరం షేర్ చేసుకుంటామని చెప్పింది. నిజానికి ఇదొక అరుదైన సమస్య. వైద్య చరిత్రలో నీటికి సంబంధించిన అలెర్జీలు 37 రకాలు ఉన్నాయని, ఇప్పటివరకు వాటికి సరైన చికిత్స విధానం లేదని వైద్యులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: చేప చర్మం కాలిన గాయాలకే కాదు, డయాబెటిక్, అల్సర్లకు కూడా!) -
ఫోన్ కెమెరా ఫ్లాష్తో కొడుకుని కాపాడుకున్న తల్లి!
ఓ మహిళ ముక్కు పచ్చలారని మూడు నెలల శిశువుని ఫోన్ కెమెరా ఫ్లాష్తో ఫోటో తీసింది. ఏమైందో ఏమో ఏదో అర్థం కానిమెరుపు శిశువు కంటిలో కనపించింది. ఏంటిదీ అని ఆశ్చర్యపోయింది. లాభం లేదనుకుని పలు రకాలుగా ఫోటోలు తీసి ప్రయత్నించింది. అయితే ఏదో తెల్లటి వెలుగులా కనిపిస్తుంది ఫోటోలా. చెప్పాలంటే పిల్లి కన్ను మాదిరిగా ఉంది. ఏం చేయాలో తోచక గూగుల్లో సర్చ్ చేసింది. ఏదో తెలియన ఆందోళనతో వైద్యులను కూడా కలిసింది. అప్పుడే పిడుగలాంటి ఈ విషయం విని హుతాశురాలయ్యింది ఆ తల్లి. ఏమయ్యిందంటే.. లండన్లోని ఓ మహిళ తన ఫోన్లోని కెమెరాలోని ఫ్లాష్ని ఉపయోగించి తన మూడు నెలల బిడ్డను పోటోలు తీసింది. ఆ ఫోటోల్లో బిడ్డ కంటిలో ఏదో మెరుపు కనిపించేది. ఏంటిదీ అని ఆమె వేర్వేరు వెలుగుల్లో ఉంచి పలు రకాలుగా పోటోలు తీసిన అలాంటి వెలుగు కనిపించేది. అది పిల్లి కన్నులా ప్రతిబింబించేది.ఇదేంటన్నది అర్థం గాక గూగుల్ సెర్చ్లో వెదికింది. తీరా అక్కడ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చన్న సంకేతాలు చూపింది. దీంతో ఆందోళనకు గురయ్యిన ఆమె వెంటనే మెడ్వే ఆస్పత్రిని సంప్రదించింది. అక్కడ వైద్యులు ఆ శిశువు పలు వైద్య పరీక్షల చేసి..ఆ చిన్నారి అరుదైన కంటి కేన్సర్తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీంతో హుతాశురాలైన ఆమె తన బిడ్డ థామస్ను రాయల్ లండన్ ఆసుపత్రికి తరలించి తక్షణమే చికిత్స అందించింది. అతను నవంబర్ 2022 నుంచి ఆరు రౌండ్ల కీమోథెరపీని చేయించుకున్నాడు. చివరికి సెప్సిస్తో పోరాడిన తదనంతరం మరో చివరి రౌండ్ కీమోథెరపీని ఏప్రిల్ 2023లో ముగించాడు. మేలో క్యాన్సర్ రహితంమని ప్రకటించడంతో ఆ తల్లి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. కంటి కేన్సర్ అంటే.. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం, రెటినోబ్లాస్టోమా అనేది అరుదైన కంటి క్యాన్సర్. ఇది చిన్న పిల్లలను ప్రభావితం చేసే వ్యాధి. ఎక్కువగా మూడేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఒకటి లేదా రెండు కళ్లలో ఉండొచ్చు లేదా కంటి వెనుక భాగాన్ని (రెటీనా) ప్రభావితం చేస్తుంది. రెటినోబ్లాస్టోమా సాధారణ సంకేతమే ఈ తెల్లటి మెరుపు. ఇది కొన్ని లైట్లలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఇది మెల్లకన్ను, కంటి రూపాన్ని మార్చడం లేదా వాపు వంటి లక్షణాలను కూడా చూపిస్తుంది. వీటిలో ఏదో ఒక లక్షణం మాత్రం కచ్చితంగా ఉంటుంది. దాన్ని గమనించి త్వరితగతిన వైద్యులను సంప్రదిస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉండదు. (చదవండి: 50 నిమిషాల పాటు చనిపోయాడు..ఏకంగా 17 సార్లు షాక్, అంతా అయిపోయిందనేలోపు..) -
గంట ఆగిన గుండె... మళ్లీ కొట్టుకుంది!
ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం అపేసింది.. ఇంకేముంది చనిపోయాడని అనుకున్నారందరూ. ఎలక్ట్రిక్ షాకిస్తే (డిఫిబ్రిలేషన్) గుండె మళ్లీ కొట్టుకుంటుందేమో అని ఆశించారు. వైద్యుల సాయంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 షాకులిచ్చారు. అయినా... ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్న వైద్యులు.. అంతా అయిపోయిందని బంధువులకు చెప్పాలని అనుకుంటున్న సమయంలో జరిగిందో అద్భుతం! పదిహేడు వరుస షాకులకూ స్పందించని ఆ గుండె మళ్లీ లబ్ డబ్ అనడం ప్రారంభించింది! ఏమా అద్భుతం.. ఎక్కడ జరిగింది? కారణాలేమిటో తెలిశాయా? ఇవేనా మీ అనుమానాలు. తీర్చుకోవాలంటే చదివేయండి మరి!!! గత ఏడాది జూన్లో యూకేలో జరిగిందీ ఘటన. ముప్ఫై ఒక్క ఏళ్ల పిన్న వయసులో బెన్ విల్సన్ రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయకుండా ఉండే పరిస్థితిని అనుభవించాడు. మొదటిసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వైద్యులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. వరుసగా 11 షాకులిచ్చారు. ఇందుకు దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. హమ్మయ్యా బతికిపోయాడులే అనుకునేంతలోపే... విల్సన్కు రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. వైద్యులు మళ్లీ డీఫిబ్రిలేటర్తో షాకులివ్వడం మొదలుపెట్టారు. పదంటే పది నిమిషాల్లో ఏకంగా ఆరు షాకులిచ్చారు. అప్పటిగానీ విల్సన్ గుండె సాధారణ స్థితికి రాలేదు.!! అంతేనా.. విల్సన్కు బాగైందా? అంటే అక్కడే ఇంకో ట్విస్టు ఉంది. పదిహేడు షాకులు తిన్న గుండె బాగా బలహీనంగా ఉండింది. పైగా గుండె పనిచేస్తోంది కానీ... మెదడుకు రక్తప్రసరణ జరగడం లేదు. పోనీ చికిత్స చేద్దామా అంటే తట్టుకునేంత శక్తి గుండెకు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ దశలో వైద్యులు ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. విల్సన్ను కోమాలోనే ఉంచేద్దామని తీర్మానించారు. కోమాలోనే మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చేశారు. ఇలా ఐదు వారాలపాటు చికిత్స అందించిన తరువాత కానీ విల్సన్ మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ తర్వాత నెమ్మమదిగా నడవడం, మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందాడు. ప్రస్తుతం అతను కొద్దిపాటి జ్ఞాపకశక్తి సమస్యలను తప్పించి చాలావరకు అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఈ మేరకు అతడి భార్య రెబెక్కా హోమ్స్ మాట్లాడుతూ .. ఆ సమయంలో తాను విల్సన్ పక్కనే ఉండిపోయానని, "డ్రీమ్ ఎ లిటిల్ డ్రీమ్ ఆఫ్ మి" అనే మా పాటను పాడుతూ ఉన్నానని నాటి విషాదకర ఘటనను గుర్తు చేసుకుంది. తన దిండుపై తాను ఉపయోగించే స్ప్రేని కొట్టి..అతడు తన కోసం కొన్న టెడ్డీని అతడి పక్కనే ఉంచి వెనక్కి వచ్చేయి విల్సన్ అంటూ అతడివైపే చూస్తూ ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తన ప్రేమే అతడిని ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడేలా చేపిందని ఆనందంగా చెబుతోంది. అతను తనను ఎంతగానో ప్రేమించేవాడిని, ఈ కష్టకాలంలో అతడి పక్కనే ఉండి ఆ ప్రేమనంత తాను తిరిగి అతడికి అందించానని ఉద్వేగంగా చెప్పింది రెబెక్కా. ఏదీఏమైన ఈ ఘటన మెడికల్ మిరాకిల్ అని చెప్పొచ్చు. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్లో ఏది ఇష్టపడతారంటే..) -
క్రియేటివిటీతో లక్షల్లో సంపాదన: ఓ ‘అమ్మ’ సక్సెస్ స్టోరీ
మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం చాలా ముఖ్యం. నిజానికి గృహిణులుగా ఉంటూ గ్రామీణ మహిళలు కుటుంబానికి చాలా అండగా ఉంటారు. పశు పోషణ అంతా వారి మీదే ఆధారపడి ఉంటుంది. పాలమ్మి, పిడకలమ్మి, విస్తరాకులు కుట్టి, లేసులు అల్లి మిషన్ కుట్టి ఇలా ఒకటి కాదు.. ఏదో రకంగా తమకంటూ కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. కానీ వారి సంపాదన, శ్రమ లెక్కలోకి రాదు అంతే. విద్యావంతులైన మహిళలు కూడా తమ చదివిన చదువుకు సార్థకత సాధించాలనే ఆలోచిస్తారు. ఆలా యూకేకు చెందిన మహిళ తనకు నచ్చిన విద్యతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. లక్షలు వెనకేసింది. పూర్తి వివరాల కోసం కథనాన్ని చదవండి. రాచెల్ పెళ్లి, పిల్లల తరువాతఇంట్లోనే ఉంటూ కుటుంబ జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా నిలబడింది. రాచెల్ తన కసృజనాత్మకతకు పదును పెట్టి, ఒక పనిని ఎంచుకుంది. సరికొత్తగా కెరీర్ బాటలు వేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించింది. ఆకర్షణీయంగా చెవిపోగులను తయారు చేస్తూ పేరు తెచ్చుకుంది. క్రమంగా అది విస్తరించి వ్యాపారంగా మారిపోయింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే దాదాపు 13 లక్షల రూపాయలను ఆర్జించింది. రాచెల్కు ఇద్దరు పిల్లల తల్లిగా వారి ఆలనా పాలనా చేసుకుంటూనే డబ్బులు సంపాదించే మార్గాన్ని అన్వేషించింది. ఈ క్రమంలోనే పిల్లలు నిద్రపోతున్న సమయంలో స్కల్పే పాలిమర్ క్లేతో అందమైన డిజైన్లతో చెవిపోగులు తయారు చేయడం ప్రారంభించింది. సిరా, వైట్, యాక్రిలిక్ పెయింట్తో తయారు చేసిన ఇయర్ రింగ్స్ డిజైన్స్కు మంచి ఆదరణ లభించింది. ఆన్లైన్ వెంచర్ (Etsy) ద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంది. ఒక్కో జతను ఎట్సీలో దాదాపు 30 పౌండ్ల (రూ.3,000) చొప్పున విక్రయించేది. తన వెంచర్ను లాభదాయకంగా మార్చుకుంది. హ్యాండ్మేడ్ ఒరిజినల్ ఆభరణాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. 2021 నుంచి దాదాపు 435 జతల చెవిపోగులను విక్రయించి, రూ. 13 లక్షలకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. నేర్చుకోవాలనే ఆసక్తివున్న ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తుంది. -
నిటాషా వివాదం: ‘అందుకే భారత్లోకి రానివ్వలేదు’
భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్ను భారత్లోకి అడుగుపెట్టకుండా అడుకున్న ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఓ సెమినార్కు రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై భారత్కు వచ్చారు. అయితే అనూహ్యంగా నిటాషాను బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమెకు భారత్లోకి అనుమతి లేదని వెనక్కి పంపించారు. దీంతో ఈ ఘటన బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదంగా మారింది. తమ రాష్ట్రంలోకి వచ్చే విదేశియురాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందోని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తాజాగా నిటాషాను భారత్లోకి రాకుండా నిరాకరించినందుకు భారత విదేశి వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. ‘ఆమె యూకే దేశానికి చెందిన పౌరురాలు. ఒక విదేశి పౌరుడు/పౌరురాలును దేశంలోకి ప్రవేశం కల్పించటమనేది.. పూర్తిగా భారత దేశ సార్వభౌమాధికారిక నిర్ణయం’ అని విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. తనను భారత్లోకి రానివ్వలేదని..ఎయిర్పోర్టులో కూడా తనను 24 గంటల పాటు ఎయిర్పోర్టులోనే ఉంచారని తెలిపారు. గతంలో తాను ఎన్నొసార్లు భారత్కి ఇలా జరగలేదని అన్నారు. అయితే ఆమె గతంలో ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పలు ఆర్టికల్స్ రాశారు. దీంతో ఆమె ఉగ్రవాద సానుభూతిపరురాలు అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. భారత వ్యతిరేకతను నిటాషా ప్రచారం చేస్తుందని కూడా మండిపడ్డారు. -
ఎయిటెల్ బాస్ సునీల్ మిట్టల్కు నైట్ హుడ్ అవార్డ్!
భారతీ ఎంటర్ ప్రైజెస్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అరుదైన ఘనతను సాధించారు. భారత్-యూకేల మధ్య స్నేహపూర్వక వ్యాపార సంబంధాలను కొనసాగిస్తున్నందుకు గాను కింగ్ చార్లెస్ 3 నుంచి అత్యంత ప్రతిష్మాత్మక నైట్ హుడ్ అవార్డ్ను పొందారు. కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (KBE) పేరుతో బ్రిటన్ ప్రభుత్వం అందించే అవార్డ్లలో ఇది ఒకటి. ఈ అవార్డ్ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా మిట్టల్ పేరు సంపాదించారు. ఈ సందర్భంగా మిట్టల్ మాట్లాడుతూ “కింగ్ చార్లెస్ నుండి అరుదైన పురస్కారం పొందడంపై సంతోషంగా ఉంది. యూకే-భారత్లు చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి. భారత్-యూకేల మధ్య ఆర్థిక ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను’ అని మిట్టల్ అన్నారు. -
ప్రాణాంతక కేన్సర్తో పోరాడుతూ భావోద్వేగ పోస్ట్..'భర్తకు ప్రేమతో'..
ఓ మహిళ చోలాంగియోకార్సినోమా అనే అరుదైన కేన్సర్తో భాధపడుతూ మరణం అంచుల వద్ద ఉంది. ఆ టైంలో ఆమె చివరి మాటలుగా రాసుకొచ్చిన పోస్ట్ ఎంత భావోద్వేగంగా ఉందంటే..చదువుతుంటే కంటతడి పెట్టకుండ ఉండలేం. కళ్ల ముందు మరణం చేరువలో ఉన్నా.. ఆమె తనలాంటి వాళ్లు ఎలా ఉండాలో వివరించింది. జీవిత సాఫల్యం అంటే ఏంటో వివరించింది. ప్రాణాలను పొట్టనబెట్టుకునే క్యాన్సర్ల విషయంలో అవగాహన పెంచుకుని చికిత్సలు తీసుకోవాలని కూడా చెప్పింది. ప్రాణం ఉండదు అనే టైంలో ఇంత బరువైన మాటలు రావాలంటే ఎంత ధైర్యం ఉండాలో కదా!. ఆ పోస్ట్లో ఆమె ఏం రాసిందంటే.. యూకేకి చెందిన డేనియోల్లా మరణించడానికి కొన్ని రోజుల ముందు భావోద్వేగానికి గురిచేసే పోస్టు పెట్టింది. ఆ పోస్టు ప్రతి ఒక్కరి మనుసును కదిలిస్తుంది. ఆ పోస్టులో..తాను నయంకానీ చోలాంగియోకార్సినోమా అనే అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఎలా వచ్చిందనేది కూడా తెలియదు. నా చేతుల్లో జీవితం లేదని తెలిసిపోయింది. తన పిత్త వాహికలో క్యాన్సర్ మొదలవ్వడంతో ఇదివరకటిలా హాయిగా జీవితం సాగలేదు. వచ్చే సంవత్సరాల్లో అయినా ఈ భయానక వ్యాధిపై పరిశోధనలు జరుగుతాయని ఆశిస్తున్నా. తద్వారా నాలాంటి చాలామందిని మృత్యువు ఒడిలోకి వెళ్లకుండా కాపాడొచ్చు. మనం ఈ వ్యాధిని అదుపు చేయలేకపోయినా స్పందించే విధానంలో దమ్ముంటే ఏ వ్యాధి అయినా తోకముడవాల్సిందే. జీవితాన్ని కోల్పోతున్నామని నిరాశ చెందకూడదు. బతికే ప్రతీ క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించే సమయం అని గుర్తు పెట్టుకోవాలి. ఇక నీకు ప్రతి నిమిషం అమూల్యం అనే విషయం తెలుస్తుంది. చావు చివరి నిమిషంలో నీలో ఉన్న అచంచలమైన ధైర్యం, శక్తి తన్నుకుంటూ బయటకు రావాలి . ఆ చావే నిన్ను కబళిస్తున్నందుకు కంటతడి పెట్టేలా చావుదెబ్బ తీయాలి. తాను ఆ మార్గాన్నే ఎంచుకున్నానని చెప్పింది. అందుకోసం తానుబాధకు బదులుగా ప్రతీ క్షణం ఆస్వాదించేందుకు యత్నించా. రోమాంటిక్ ఉండేలా జీవితాన్ని మార్చుకున్నా. ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని వెతికాను. సంతోషాన్నిచ్చే ప్రతి పని చేశా. చివరి వరకు ఆనందంగా ఉన్నా. అలాగే నాలా ఇలాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడే వాళ్లు మీ ఆనందాన్ని దూరం చేసుకునేలా ఆఖరి నిమిషాలు బాధగ అస్సలు గడపొద్దు. ఇక తన జీవిత భాగస్వామిని ఉద్దేశిస్తూ.." తాను ఆనందంగా జీవించానని, అలాగే మీరు కూడా మీ ఆనందాన్ని దూరం చేసుకోవద్దు. మీకు ఇష్టమైనవి చేయండి. మనం విడిపోయినప్పటికీ నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. ఇప్పటి వరకు అన్ని విధాలుగానాకు మద్దుతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు అన్ని విధాలు ఆనందంగా జీవించేందుకు అర్హులు. అందువల్ల హాయిగా జీవితాన్ని గడపండి అంటూ తన భాగస్వామికి దైర్యాన్ని నూరుపోస్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది" డేనియోల్లా. దీంతో నెటిజన్లు "చాలా శక్తిమంతమైన పోస్ట్ ఇది, చివిరి నిమిషంలో కూడా స్పూర్తిని నింపేలా పోస్టు పెట్టారు ఎందరో క్యాన్సర్ రోగులకు ప్రేరణనిచ్చే పోస్టు ఇది. ఆమె మరణించినప్పటికీ ఈ పోస్ట్లోని అక్షరాల రూపంలో మన ముందే ఉంటుందామె". అంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. (చదవండి: షమీకి మడమ సర్జరీ: అసలేంటీ సర్జరీ? రికవరీకి ఎందుకంత టైం?) -
'సింప్లిసిటీకి కేరాఫ్ సింబల్ వాళ్లు'!దటీజ్ అక్షత మూర్తి!
అక్షతా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక దేశ ప్రధాని భార్య అయినా చాలా సాదాసీదాగానే ఉంటారు. ఇక ఆమె తల్లిదండ్రులు నారాయణ మూర్తి దంపతులు గురించి అస్సలు చెప్పాల్సిన పనిలేదు. అంత పెద్ద టెక్ కంపెనీ వ్యవస్థాపకులై కూడా నారాయణ మూర్తి దంపతులిద్దరూ ఎంత సింపుల్గా ఉంటారో అందరికి తెలిసిందే. ఇక వాళ్ల పెంపకంలో పెరిగిన కూతురు అక్షతా వారిలానే కదా! ఉండేది. ఆ కుటుంబం అంతా రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చారు. అక్కడ ఎలాంటి సెక్యూరిటీ గార్డులు లేకుండా సాధారణ వ్యక్తుల్లా మెలిగారు. పైగా ఎవ్వరూ వారిని గుర్తుపట్ట లేనంతగా చాలా సాధార వ్యక్తుల్లా వ్యవహరించడమ గ్రేట్ కదా!. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కొంతమంది బిలియనర్లు, పలుకు బడిన వ్యక్తులు అలాంటి దేవాలయాలకు వస్తే హడావిడి ఓ రేంజ్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సాధారణ భక్తులకు కూడా వీళ్ల హడావిడి కారణంగా దర్శనం కూడా దొరకపోగా గంటల తరబడి వెయింట్ చేస్తు ఉండాపోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతుంది. కానీ ఇక్కడ యూకే ప్రధాని భార్య అక్షతామూర్తి, తన ఇద్దరు కూతుళ్లు అనౌష్క, కృష్ణ, తల్లిదండ్రులు నారాయణమూర్తి, సుధా మూర్తిలతో కలిసి రాఘవేంద్ర స్వామి ఆలయంలో సందడి చేశారు. అక్కడ మఠంలోని పుస్తకాలను వెతుకుతూ కనిపించారు. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా సాధారణ భక్తుల్లా వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకర్షించడమే గాక వాళ్ల సింపుల్ సిటీకి ఫిదా అవ్వుతూ గ్రేట్ అంటూ నెట్టింట ప్రశంసల జల్లు కురిపించారు కాగా, ఈ నెలలోనే అక్షత తల్లిదండ్రులతో కలిసి రచయిత్రి చిత్ర బెనర్జీ దివాకరుణి తాజా పుస్తకం 'యాన్ అన్కామన్ లవ్': ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి' ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక అక్షతామూర్తి ఆమె భర్త రిషి సునాక్ గతేడాది సెప్టెంబర్లో జీ20 సదస్సు కోసం భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. అప్పుడు ఈ దంపతులిద్దరూ అక్షరధామ్ మందిర్ దర్శనం చేసుకుని పూజలు చేశారు. UK PM Rishi Sunak's wife and kids spotted at Raghavendra Mutt in Bengaluru, accompanied by Infosys Founder Narayanamurthy. Their simplicity shines through, with no security in sight. pic.twitter.com/WxIAvHh40w — M.R. Guru Prasad (@GuruPra18160849) February 26, 2024 (చదవండి: వింత పెళ్లి!.. వధూవరులెవరో తెలిస్తే కంగుతింటారు!) -
కేంద్రంపై యూకే రచయిత నిటాషా సంచలన ఆరోపణలు
లండన్: భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్కు భారత ప్రభుత్వం ఎంట్రీ నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు బెంగళూరు ఎయిర్పోర్టులో దిగిన తనను ఇమిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారని ఆమె తెలిపారు. అనంతరం తిరిగి తనను లండన్ పంపేశారని, అడిగితే నీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారన్నారు. ఈ విషయాలన్నింటిని ఆమె తాజాగా ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు’ అనే అంశంపై మాట్లాడేందుకు కర్ణాటక ప్రభత్వం నన్ను ఆహ్వానించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నన్ను ఎయిర్పోర్టులోనే ఆపేసి తిరిగి లండన్ పంపించివేసింది. నా వద్ద అవసరమైన డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. గతంలో ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేసినందుకే నన్ను వెనక్కిపంపుతున్నట్లు అధికారులు అనధికారికంగా నాతో చెప్పారు. లండన్ నుంచి 24 గంటల పాటు ప్రయాణించి బెంగళూరు వస్తే మళ్లీ 24 గంటలు అటు ఇటు తిప్పి నన్ను ఎయిర్పోర్టులోనే ఉంచారు. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పడుకోవడానికి కొద్దిగా స్థలం చూపించారు. అక్కడ కూడా కనీసం దిండు ఇవ్వలేదు. సీసీ కెమరా పర్యవేక్షణలో ఉంచారు. నేను ఎన్నోసార్లు భారత్ వచ్చాను. నాకు దేశంలోకి అనుమతి లేనట్లు కనీసం ముందుగా కూడా చెప్పలేదు. కర్ణాటక ప్రభుత్వమే నాకు టికెట్లు ఇచ్చింది’అని కౌల్ ఎక్స్లో తెలిపారు. ఇదీ చదవండి.. భారత సంతతి కంప్యూటర్ ఇంజినీర్కు ప్రతిష్టాత్మక అవార్డు -
'శబ్దమే శాపం' ఆమెకు! అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి..
కొన్ని వ్యాధులు ఓ పట్టాన అర్థం కావు. ఎందుకొస్తాయో కూడా తెలియదు. అవి మొత్తం కుటుంబాన్నే అతలాకుతలం చేసేస్తాయి. ఆ వ్యాధులకు చికిత్స లేకపోవడంతో ఇంటిల్లపాది పడే యాతన అంతా ఇంతకాదు. ఇటు బాధితులకి, వారి కుటుంబానికి ఓ ప్రత్యక్ష నరకం లాంటిది ఆ సమస్య అని చెప్పొచ్చు. ఇక్కడొక మహిళ ఎంత దయనీయమైన వ్యాధితో బాధపడుతుందో వింటే కంగుతింటారు. ఇదేం వ్యాధిని రా బాబు! అని నోరెళ్లబెడతారు. ఏం జరిగిందంటే..బ్రిటన్కి చెందిన 49 ఏళ్ల కరెన్ కుక్ 'హైపరాక్యుసిస్' అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా చిన్న శబ్ధాన్ని కూడా భరించలేదు. ఎంతలా అంటే గాలి వీచినా..చెట్ల ఆకుల శబ్దం వరకు ఏ చిన్న శబ్దం విన్నా.. తట్టుకోలేక అల్లాడిపోతుంది. ఈ వ్యాధి కారణంగా భర్త, పిల్లలకు దూరంగా ఒంటరిగా బతుకుతోంది. చెప్పాలంటే తన ఇంట్లోనే ఆమె ఓ ఖైదీలా జైలు శిక్ష అనుభవించేలా చేసింది ఆ వ్యాధి. ఎందుకంటే? భర్త మాట్లాడినా.. ఆఖరికి తన పిల్లలు నవ్వినా తట్టుకోలేదు. కనీసం క్రిస్మస్ పండుగ రోజు కూడా ఆమె వేరే గది కిటికి నుంచి తన కుంటుంబం ఆనందంగా సెలబ్రేట్ చేసుకువడాన్ని చూడాల్సిందే తప్ప వారితో కలిసి ఎంజాయ చేయలేదు. ఆమెకు ఈ వ్యాధి 2022లో అకస్మాత్తుగా వచ్చింది. తర్వాత క్రమక్రమంగా పరిస్థితి దిగజారి తన ఇంట్లోనే తాను వేరుగా ఉండే స్థితికి వచ్చేసింది. ఇంతకీ హైపరాక్యుసిస్ అంటే ఏమిటంటే .. హైపరాక్యుసిస్ అంటే.. హైపరాక్యుసిస్ అనేది ఆ వ్యాధి తీవ్రత బట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధి బారినపడ్డ వారికి నిత్యం వినిపించే శబ్దాలే వాళ్లకి బిగ్గరగా వినిపిస్తున్నట్లు ఉంటుంది. ఇది చాలా బాధకరంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తలకు నాణేలు శబ్దం నుంచి.. కుక్క అరవడం, కారు ఇంజిన్ శబ్దం, ఎవరైనా చూయింగ్ గమ్ నమలడం, వాక్యూమ్ క్లీనర్ శబ్దం ఇలా దేన్ని భరించలేరు. ప్రతీ శబ్దం వారిపై ప్రభావం చూపిస్తుంటుంది. తల పగిలిపోయేంత నొప్పి.. ఇక కరెన్ ఈ వ్యాధి కారణంగా ఇయర్ ప్లగ్స్, ఇయర్ డిఫెండర్స్ వంటివి పెట్టుకుంటూ ఉంటుంది. కేవలం సైగలు, రాతలతోనే కుటుంబంతో సంభాషిస్తారామె. ఇది తనకు ఎగజిమ్ముతున్న లావా లాంటి పదార్థాన్ని చెవిలో పోసినట్లు అనిపిస్తుందని వేదనగా చెబుతోంది కరెన్. అంతేగాదు తల పగిలిపోయేలా, తలంతా నొప్పిగా అనిపిస్తుందట. ఒకరకమైన మైగ్రెన్ నొప్పిలా ఉంటుందని అంటోంది. ఒక్కోసారి ఇది భరించలేకు తలను రెండు ముక్కలు చేయాలనిపిస్తుందని ఆవేదనగా చెబుతోంది. ఈ వ్యాధి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యింది. తన ఏడేళ్ల, పదుకొండేళ్ల పిల్లలకు దూరమయ్యానని వేదనగా చెప్పుకొచ్చింది. చివరికి తన భర్తతో కలిసి ఆనందంగా బయటకు వెళ్లలేను, అస్సలు ఏం చేయలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒకరకంగా తన జీవితాన్ని మొత్తం కోల్పోయానని బాధగా చెప్పారామె. ఇక కరెన్ విమాన సిబ్బందిగా పనిచేసేది. దాన్నేమె ఉద్యోగం గాక గుర్తింపుగా భావించేదని కరెన్ భర్త నిక్ అన్నారు. తాము ఎప్పుడూ ఎలాంటి ప్లాన్లు లేకుండా హాయిగా ట్రిప్స్కి వెళ్లిపోయి ఎంజాయ్ చేసేవాళ్లం ఇప్పుడూ పరిస్థితి అర్థంకానీ విధంగా భారంగా మారిపోయిందన్నారు. అయితే ఈ వ్యాధికి చికిత్స మాత్రం లేదట. ఇలాంటి సమస్యతో బాధపడే కొందరు రోగులకు వైట్ నాయిస్ వంటి శబ్దాలను వినేలా చేసి ఆ శబ్దాలను భరించే స్థాయిలను అభివృద్ధి చేస్తున్నట్లు యూకే జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. ఇక్కడ వైట్ నాయిస్ అంటే నిరంతరం బ్యాక్గ్రౌండ్లో వినిపించే చిన్న శబ్దాలు. అయితే ఈ వినసొంపైన చిన్న శబ్దాలు ప్రకృతికి సంబంధించివైనా ఉండొచ్చు. కానీ కరెన్ విషయంలో ఇది కూడా పనిచేయలేదు. ఆఖరికి పలురకాల థెరఫీలను ప్రయత్నించారు. అవి కూడా పనిచేయలేదు. తన పిల్లల గురించే తాను ఈ వ్యాధి చికిత్స కోసం 18 నెలలుగా అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కరెన్ ఏదో ఒక రోజు తన వ్యాధి నయమయ్యే చికిత్స లభిస్తుందని ఆశగా ఎదురచూస్తుంది. నిజంగా ఇది మాటల్లో చెప్పలేనంత దయనీయమైన స్థితి కదూ.! (చదవండి: రెడ్లైట్ థెరఫీతో షుగర్ వ్యాధిని తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
భారత్లో యూకే, కెనడా సీఏల ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత్లో విదేశీ సీఏలను ప్రాక్టీస్కు అనుమతించే అంశం భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. యూకే, కెనడా దేశాలు తమ దగ్గర భారత సీఏలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిస్తేనే ఆయా దేశాల సీఏలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు (రెసిప్రొకల్) అనుమతించవచ్చని పేర్కొంది. యునైటెడ్ కింగ్డం (యూకే), కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్టీఏ) జరుగుతున్న చర్చల్లో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇది సాకారమైతే తొలిసారిగా భారత్లో విదేశీ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ప్రాక్టీసు చేసేందుకు వీలవుతుంది. ఆస్ట్రేలియాతో కూడా ఈ తరహా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రెసిప్రోకల్ సిస్టమ్ అమల్లోకి వచ్చాక విదేశీ సీఏలు భారత్లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఐసీఏఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, కెనడా, ఆ్రస్టేలియా మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాలని, అక్కడి వారిని ఇక్కడ అనుమతిస్తే, ఇక్కడి సీఏలు కూడా అక్కడికి వెళ్లడానికి వీలుంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. వర్ధమాన దేశమైన భారత్ సీఏలు అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే అవకాశం లభించడం వల్ల మనవారికి ప్రయోజనకరంగా ఉండగలదని చెప్పా రు. సామర్థ్యాలు, అనుభవం కారణంగా భారతీయ సీఏలకు విదేశాల్లో గణనీయంగా డిమాండ్ ఉందన్నారు. మరోవైపు, స్థూల దేశీయోత్పత్తిలో పన్ను వాటాల నిష్పత్తిని మెరుగుపర్చేందుకు కేంద్రానికి సిఫార్సులు చేయనున్నట్లు అగర్వాల్ తెలిపారు. అటు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సీఏలకు గణనీయంగా సమయం ఆదా కాగలదని చెప్పారు. ప్రస్తుతం 42,000 మంది పైచిలుకు భారతీయ సీఏలు విదేశాల్లో పని చేస్తున్నారు. ఐసీఏఐ అంచనా ప్రకారం వచ్చే 20–25 ఏళ్లలో 30 లక్షల మంది పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. ఐసీఏఐలో ప్రస్తుతం 4 లక్షల మంది సభ్యులు, 8.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. -
ప్రపంచ వ్యాప్తం గా వ్యూహం శపథానికి సిద్ధం! అవ్వుతున్న అభిమానులు
-
UK : లండన్లో YSRCP సిద్ధం
లండన్లో కేక పుట్టించారు వైఎస్సార్సిపి అభిమానులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ అత్యంత ఘనంగా జరగడం, జనసంద్రమై సముద్రాన్ని మరిపించడం లండన్లోని వైఎస్సార్సిపి అభిమానులను ఎంతో సంతోషపెట్టింది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘన విజయం సాధిస్తుంది అనడానికి రాప్తాడు సభ ఒక్కటి చాలని అన్నారు ప్రవాసాంధ్రులు. ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ తీసిన రెండు సినిమాలు వ్యూహం, అలాగే శపథం సినిమాలు ఘన విజయం సాధించాలంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. లండన్లోని ఈస్ట్హామ్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో YSRCP అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి YSRCP యూకే కన్వీనర్ Dr ప్రదీప్ చింతా వర్చువల్గా మాట్లాడారు. 2024 ఏప్రిల్ నెలలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని, యూకేలో, అమెరికాలో ఉంటోన్న ప్రతీ ఏపీ వ్యక్తి, వైఎస్సార్ అభిమాని కొంత సమయం వెచ్చించి నిజాలను తమ వాళ్లకు తెలపాలని ప్రదీప్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రతీ ఒక్కరు విశ్రమించకుండా.. కష్టపడాలని డాక్టర్ ప్రదీప్ దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంగా ఏపీ రాజకీయాల్లో నిజాలకు అద్దం పట్టేలా రాంగోపాల్వర్మ తీసిన వ్యూహం, అలాగే శపథం సినిమాల సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించారు. వ్యూహం సినిమా ఘనవిజయాలు సాధించాలని దర్శకుడు రాంగోపాల్వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. YSRCP UK కమిటీ సభ్యులు కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, కిషోర్ మలిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన అమెరికాలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కడప రత్నాకర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా..
డాక్టర్: నీ టెడ్డీబేర్కు ఏమైంది? చిన్నారి: కాలు నొప్పి డాక్టర్: ఎక్కడ? చిన్నారి: ఇక్కడ డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది... ఇలాంటి క్లినిక్లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్కు తీసుకెళితే డాక్టర్కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి? టెడ్డీ బేర్ క్లినిక్స్ యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్కు టీమ్గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్లో ఎంత చక్కగా టెడ్డీ బేర్లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. మంగుళూరులో ట్రెండ్ గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్గా ఈ క్లినిక్స్ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి. తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్మెంట్ను స్కూల్ సాయంతో పేరెంట్స్కు పంపుతారు. కంటి, పంటి పరీక్ష చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి. -
ఐన్స్టీన్ను మించిన తెలివున్నా.. ఆమెకు తీరని ఆవేదన?
ఆ అమ్మాయి.. ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్కు మించిన తెలివితేటలు కలిగినది. ఆమె ఐక్యూ 161 పాయింట్లు. ఇంతటి ప్రతిభావంతురాలైన ఆమెకు చదువు చెప్పలేక ఉపాధ్యాయులే సతమతమవుతున్నారట. ఇంగ్లండ్లోని స్లోఫ్కు చెందిన మహ్నూర్ చీమా(17)తన తొమ్మిదేళ్ల వయసులో పాకిస్తాన్ నుంచి కుటుంబంతోపాటు బ్రిటన్కు వచ్చింది. ఈ సమయంలో ఆ చిన్నారి తన ప్రతిభను చూపినప్పటికీ ఉపాధ్యాయులు పైతరగతికి ప్రమోట్ చేయలేదు. బెర్క్షైర్లోని కోల్న్బ్రూక్ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు తాను క్లాస్ వర్క్ను అందరికన్నా త్వరగా పూర్తి చేసినప్పటికీ, పై క్లాస్కు వెళ్లేందుకు అనుమతించలేదని, పైగా అదనంగా గణితాన్ని అభ్యసించాలని ఆదేశించారని చీమా తెలిపింది. ఆమె లాంగ్లీ గ్రామర్ స్కూల్కి మారినప్పుడు, జీసీఎస్ఈ పరీక్షలకు కూర్చోకుండా నిరుత్సాహపరిచారని చీమా ఆరోపించింది. అయితే చీమాపై ఒత్తిడి అధికంగా ఉందని, దానికి గుర్తుగా ఆమె కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడ్డాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు తమ చిన్నారి తెలివితేటలకు తగిన విద్యను అందించేందుకే యూకే వచ్చామని తెలిపారు. మహ్నూర్ చీమా మీడియాతో మాట్లాడుతూ తన మాదిరిగా ప్రతిభ కలిగిన చాలామంది విద్యార్థులు ఉన్నారని, అయితే వారి సామర్థ్యాన్ని ఎవరూ గుర్తించడం లేదని, ఫలితంగా వారి ప్రతిభ వృథా అవుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రతిభావంతులైన పలువురు విద్యార్థులతో మాట్లాడానని, వారు కూడా తనలానే నిరాశతో ఉన్నారని అమె పేర్కొంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని, బ్రిటీష్ విద్యావ్యవస్థలో గణిత బోధన చాలా నెమ్మదిగా సాగుతున్నదని, బ్రిటన్లోని 11 ఏళ్ల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను పాకిస్తాన్లో మూడవ సంవత్సరం పిల్లలు పూర్తి చేయగలరని చీమా వ్యాఖ్యానించింది. చీమా తన జీసీఎస్ఈలో 33 నైన్లు సాధించింది. ఇది అత్యధిక స్కోర్. అలాగే తాను ఉంటున్న ప్రాంత పరిధిలోని పలు పాఠశాలల ప్రవేశ పరీక్షలకు హాజరై, మూడు కౌంటీలలో అగ్రస్థానంలో నిలిచింది. చీమా కుటుంబం పాకిస్తాన్లోని లాహోర్ నుండి 2006లో యూకేకి తరలివచ్చింది - ఆమె తండ్రి, ప్రముఖ న్యాయవాది. తల్లి ఆర్థికశాస్త్రంలో రెండు డిగ్రీలు సాధించారు. జాతీయ గణిత ఛాంపియన్గా నిలిచిన 14 ఏళ్ల సోదరి కూడా ఆమెకు ఉంది. ప్రస్తుతం చీమా..హెన్రిట్టా బార్నెట్ స్కూల్లో విద్యనభ్యసిస్తోంది. చీమాకు స్విమ్మింగ్తో పాటు గుర్రపు స్వారీ చేయడమంటే కూడా ఎంతో ఇష్టం. -
'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్!
మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్అవే డెలివరీ డ్రైవర్లు సమ్మె (స్ట్రైక్) చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే డెలివరూ, ఉబెర్ ఈట్స్తో సహా నాలుగు ఫుడ్ యాప్ల డ్రైవర్లు, రైడర్లు ఈ స్ట్రైక్లో పాల్గొంటారని సమాచారం. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్-ఆర్డరింగ్ యాప్లలో పనిచేసే వేలమంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి 'డెలివరీజాబ్ యూకే' ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓకే పోస్ట్ చేశారు. ఇందులో చాలీచాలని వేతనాలకు నిరంతరాయంగా పని చేయడం కంటే మా హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు. స్ట్రైక్ చేయడానికి కారణం, 'ప్రతి రోజూ దోపిడీకి గురవుతూ, మా జీవితాలను పణంగా పెట్టి అలసిపోయాము. ఇది మా గొంతులను వినిపించాల్సిన సమయం వచ్చింది. మేము చేసే పనికి మాకు న్యాయమైన పరిహారం కావాలి' అని చెప్పడమే. డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీకి 2.80 పౌండ్స్ నుంచి 3.15 పౌండ్స్ మధ్య సంపాదిస్తారు. ఈ చెల్లింపు కనీసం 5 పౌండ్స్కు పెరగాలని కోరుకుంటున్నారు. యూకేలో మాత్రమే కాకుండా యూఎస్లో దాదాపు 1,30,000 మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలియజేయనున్నట్లు జస్టిస్ ఫర్ యాప్ వర్కర్స్ తెలిపింది. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! View this post on Instagram A post shared by Delivery Job UK (@deliveryjobuk) -
Yatra 2 @ London : లండన్లో యాత్ర 2 సక్సెస్ మీట్
యాత్ర 2 సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తోంది. విదేశాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులను, ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. యూకే & యూరప్ YSRCP వింగ్ ఆధ్వర్యంలో లండన్ మహానగరంలోని హౌన్సలో ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. మనం చూసే ప్రతి సినిమా మనలో ఒకరి జీవన ప్రతిబింబం. కొందరి జీవితాలు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని అటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని వినోదాత్మకంగా మరియు సందేశాత్మకంగా సినిమాని మలచడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు లండన్లోని YSRCP వింగ్ నాయకులు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. యాత్ర2 సినిమా చూసిన తరువాత ఇది అద్భుతం అని అనకుండా వుండలేమన్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని హృద్యంగా చిత్రీకరించిన సన్నివేశాలతో మహీ రాఘవ ప్రేక్షకులను కట్టిపడేశాడని కొనియాడారు. అలాగే నిజజీవితంతో పెనవేసుకున్న ఎమోషనల్ డ్రామాను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆఖర్లో రియల్ సీన్లను కలిపి చేసిన జగన్ గారి ప్రమాణస్వీకార సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా తీశారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని పేజీగా యాత్ర 2 నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తులో యాత్ర 3 సినిమా కూడా వస్తే మరింత బాగుంటుందన్నారు. నటులు మమ్ముట్టి, జీవా పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. -
ప్రేమికుల రోజుని జైల్లో సెలబ్రేట్ చేసుకోవడం గురించి విన్నారా?
వాలెంటైన్స్ డేని కేవలం ప్రేమికులే గాక పెద్దల అంగీకారంతో చేసుకున్న జంటలు కూడా హ్యాపీగా చేసుకుంటారు. అంతేగాదు మనల్ని ఎంతగానో ప్రేమించే మన ఆత్మీయులు, స్నేహితులు కూడా ఆ రోజుని ఎంతగానో సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఆ రోజు కచ్చితంగా చాలమంది బయటే డిన్నర్ చేసేందుకు ప్లాన్లు చేస్తుంటారు. ఇది కామన్. అయితే విలక్షణతను ఇష్టపడే వాళ్లు మర్చిపోలేని గుర్తులా ఉండేలా వెరైటీగా చేసుకునేందుకు ఆరాటపడుతుంటారు. అలాంటి వాళ్లు ఈ జైల్లోని ఖైదీల సెల్లో చేసుకోండి. అంతేగాదండోయ్! ప్రేమికుల రోజు సందర్భంగా విభిన్న రుచులతో కూడిన మెనూని కూడా ఆ జైలు అందిస్తోంది. ఖైదీలు ఉంచే సెల్లో డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది? అనే అనుభూతి కూడా పొందొచ్చు. ఎక్కడ? ఏ జైలు ఈ ఆఫర్ అందిస్తోందంటే..? వివరాల్లోకెళ్తే..బ్రిటన్ ఆక్స్ఫర్డ్ జైలు ప్రేమికులకు గొప్ప ఆఫర్ అందిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సరదాగా సెల్లో డిన్నర్ చెసేలా వసతులు ఏర్పాటు చేసింది. పైగా అందుకోసం ప్రత్యేకమైన మూడు విధాన మెనూని కూడా ఏర్పాటుచేసింది. అంతేగాదు ఆ జైలులో ఖైదీలు ఉండే సెల్లో తినాలనుకుంటే సుమారు 17 వేల రూపాయాలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఘోరమైన హత్యానేరాలకు పాల్పడ్డ ఖైదీలసెల్లో తినాలనుకుంటే ఏకంగా 19 వేలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జైల్లో భోజనం చేయడానికి వచ్చే అతిథుల కోసం క్యాండిల్స్, పువ్వులతో అలంకరించిన డైనింగ్ టేబుల్ ఆహ్వానం పలుకుతుంది. మాంసాహారు కోసం బ్రైజ్డ్ బీఫ్ బ్లెడ్, షార్ట్ రిబ్ పిరోగి, వైన్ తదితర పానీయాలను అందిస్తారు. అలాగే శాకాహరలు కోసం టొమాటో టార్టేర్, కాల్చిన చీజ్ సౌఫిల్, బ్రైజ్డ్ క్యాబేజీ, చాక్లెట్, రాస్బెర్రీస్, పిస్తాతో డెకరేట్ సిన కేక్, కాక్టైల్ వంటి పానీయాలు కూడా ప్యాకేజ్లో ఉన్నాయి. ఇక్కడకు వచ్చే అతిథులు తమకు నచ్చిన ప్యాకేజ్ని ఎంపిక చేసుకోవచ్చని అని ఆక్స్ఫర్డ్ జైలు తన వెబ్సైట్లో పేర్కొంది. నిజానికి ఈ జైలు సుమారు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రాత్మక కోట. 1073లో ఈ కోటని వైద్యశాలగా నిర్మించారు. అయితే 1642 నుంచి 1651ల మధ్య బ్రిటీషర్ల అంతర్యుద్ధం కారణంగా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొని 1786లో జైలుగా మార్చబడింది. అలా జైలుగా 1996 వరకు పనిచేసింది. ఆ తర్వాత ఆ ఆక్స్ఫర్డ్ జైలుని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చేశారు. (చదవండి: ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్గా 'పిచాయా పామ్') -
‘అక్కడ ఫ్యాక్టరీ పెట్టనే పెట్టం.. వాళ్లు పనిచేయకుండా పబ్కు పోతారు’
యూకేలో ఫ్యాక్టరీల ఏర్పాటుపై అపోలో టైర్స్ అధిపతి నీరజ్ కన్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టనే పెట్టబోమని, అక్కడి వర్కర్లు పనిచేయకుండా పబ్లకు వెళ్తారని ఆరోపించారు. అందులోనూ అక్కడి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించినట్లు ‘డైలీ మెయిల్’ కథనం పేర్కొంది. ఇదే సమయంలో ఇతర దేశాలు ఇచ్చిన ప్రోత్సాహకాలను హైలైట్ చేస్తూ "హంగేరీ మాకు ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఇక్కడ కార్మికుల ఖర్చు చాలా అందుబాటులోనే ఉంది. దీంతో ఉత్పత్తి ఖర్చు తక్కువే అవుతుంది. ఇక యూకేలో శ్రామిక శక్తి ఎలా ఉందో మీకు తెలుసు. వీళ్లు పెద్దగా పనిచేయకుండా పబ్లకు వెళ్తుంటారు" అని అపోలో టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించారు. ఇది అక్కడ విధానపరమైన సమస్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ విధానాల వల్ల అక్కడి ప్రజలు పనులు చేయకుండా ఇంట్లో కూర్చొని పెన్షన్లు తీసుకుంటున్నారని నిందించారు. లండన్లో ఇటాలియన్ రెస్టారెంట్ కూడా ఉన్న కన్వర్కు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ యూకేలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అపోలో టైర్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే యూకేలో కార్పొరేట్ వ్యవహారాలను నిర్వహించడానికి 30 మంది సభ్యుల టీమ్ ఉంది. ఇక్కడే ఈ కంపెనీకి ఇన్నోవేషన్ హబ్ ఉండటం గమనార్హం. కాగా మరో ఇన్నోవేషన్ హబ్ భారత్లోని హైదరాబాద్లో ఉంది. మాంచెస్టర్ యునైటెడ్కు ఈ కంపెనీ దీర్ఘకాలిక స్పాన్సర్గా కొనసాగుతోంది. -
టెక్ దిగ్గజం టీసీఎస్కు జాక్ పాట్..మరో 15ఏళ్ల వరకు ఢోకాలేదు!
భారత్ టెక్ దిగ్గజం టీసీఎస్ జాక్ పాట్ కొట్టింది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ అవివా ఇప్పటికే టీసీఎస్తో కుదర్చుకున్న ఒప్పందాన్ని మరో 15ఏళ్ల పొడిగింది. 15 ఏళ్ల పాటు బీమా చట్టాల నిర్వాహణ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి కార్యకాలాపాలు నిర్వహించేలా టీసీఎస్కు అప్పగించిన ప్రాజెక్ట్ను పొడిగిస్తున్నట్లు అవివా అధికారిక ప్రకటన చేసింది. అయితే ఇరు కంపెనీల మధ్య ఒప్పందం అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉండగా పలు నివేదికల ప్రకారం..ఈ డీల్ విలువ 500 మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. యూకేలో అవివా సంస్థ గత 20 ఏళ్లుగా టీసీఎస్తో కలిసి పనిచేస్తుంది. ఇక ఈ కొత్త ఒప్పందంలో భారత్ కంపెనీ అవివా ఎండ్ టు ఎండ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్, 5.5 మిలియన్లకు పైగా పాలసీలను సేవల్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా అవివా సీఈఓ డౌగ్ బ్రౌన్ మాట్లాడుతూ..‘ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం ద్వారా మేము మా కస్టమర్లకు అందించే సేవలతో పాటు, కార్యకలాపాల్ని మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. మా ఆశయాలకు అనుగుణంగా సంస్థ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తూ అటు కస్టమర్లకు, ఇటు వ్యాపారంలో గణనీయమైన ప్రయోజనాల్ని అందిస్తుందని’ అన్నారు. -
కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..
కుకీస్ అంటే ఇష్టంగా తినేవారు ఈ ఘటన వింటే మాత్రం తినేందుకు ఆలోచిస్తారు. ఎందుకంటే ఓ ప్రోఫెషనల్ డ్యాన్సర్ ఈ కుకీస్ తిని నిండు జీవితాన్ని కోల్పోయింది. ఈ ఘటన ఒకరకంగా అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. కుకీస్ ఎంతవరకు తినొచ్చు మంచిదేని అన్నంత అనుమానాలకు దారితీసింది. అస్సలు కుకీస్ తినడం వల్ల ప్రాణం పోవడం ఏమిటీ? అసలేం ఏం జరిగింది.. వివరాల్లోకెళ్తే..ఓర్లా బాక్సెండేల్ అనే 25 ఏళ్ల ప్రోఫెషనల్ డ్యాన్సర్ కుకీస్ తిన్న తర్వాత జనవరి 11న అనాఫిలాక్టిక్ షాక్కి సంబంధించిన తీవ్ర అలెర్జీకి గురై మరణించింది. అయితే కుకీస్ వేరుశెనగతో చేసినవి. తమ బిడ్డ చనిపోవడానికి కారణం సదరు కకీస్ తయారు చేసే కంపెనీయే అంటూ కోర్టుని ఆశ్రయించారు ఆమె బంధువులు. ఇక బాధితరుఫు న్యాయవాది ఆ కుకీస్ ప్యాకెట్పై వేరుశెనగకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలో విఫలమైందని, ఆహార పదార్థాల్లో కంపెనీ చూపిన నిర్లక్ష్యంధోరణి కారణంగానే తన క్లయింట్ మరణించిందని వాదించారు. తప్పుగా లేబుల్ చేసిన కుకీస్ వల్ల బాధితురాలు ప్రాణాలు పొగొట్టుకుందని అన్నారు. ఈ ఘటనతో యూకే నగరంలోని స్టీవ్ లియోనార్డ్ స్టోర్ల నుంచి వెనిలా ఫ్టోరెంటైన్ కుకీలను కొనేందు జనాలు జంకుతున్నారు. నిజానికి ఓర్లా 2018లో డ్యాన్స్ చేసేందుకు న్యూయార్క్ నగరానికి వెళ్లారు. అప్పుడే ఆమె ఒక సూపర్ మార్కెట్ నుంచి ఈ కుకీస్లను కొని, తినడం జరిగింది. చివరికి డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనకుండానే ఆస్పత్రి పాలై చనిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనపై సూపర్ మార్కెట్ స్పందించి.. ఈ కుకీలను తయారు చేసి, తమ మార్కెట్కి సరఫరా చేసే లాంట్ ఐలాండ్ బేకీరీయే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. పైగా ఈ దిగ్బ్రాంతికర ఘటనకు సదరు సూపర్ మార్కెట్ సీఈవో ఓ వీడియోలో సానుభూతి వ్యక్తం చేశారు కూడా. బాధితురాలు కూడా దర్యాప్తులో నిర్లక్ష్యపూరితంగా తయారు చేసిన కుకీస్ వల్లే చనిపోయినట్లు పేర్కొంది. అయితే బాధితురాలి తరుఫు న్యాయవాది తయారీ దారులు లేదా అమ్మకందారుల నిర్లక్యానికి ఓ ప్రాణం బలవ్వడమే గాక ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చిందంటూ వాదన వినిపించారు. అయితే కుకీస్ తయారీదారు కుకీస్ యునైటెడ్ కంపెనీ మాత్రం అందుకు తాము బాధ్యులం కాదని తెగేసి చెప్పింది. అమ్మకందారులు తప్పుగా లేబుల్ చేయండంతో తలెత్తిన తప్పిందంగా పేర్కొంది. తాము మార్కెట్కి ఉత్పత్తిని సరఫరా చేయడానికి ముందే ఎలాంటి ఇన్గ్రేడియంట్స్ వాడతామన్నది కూడా ముందుగానే సదరు సూపర్ మార్కెట్తో మాట్లడటం జరుగుతందని అందువల్ల ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ తమ తప్పిదం కాదని వాదించింది. అందువల్ల దయచేసి వినియోగుదారులందరూ కుకీస్ కొనే ముందు దేనితో తయారు చేశారు, తయారీ తేదీ వివరాలు చూసుకుని కొనుగోలు చేయండి. ఇక్కడ ఎవరీ వ్యాపారం వారిదే మనుషల జీవితాలకు గానీ, వారి ఆరోగ్యానికి గానీ ప్రాముఖ్యం ఇవ్వవు, తప్పిదానికి బాధ్యత కూడా వహించవు అన్నది గుర్తు ఎరగాలి. ఎంత సేల్స్ చేశాం ఎంత ఆదాయం వచ్చింది అన్నదానికే ప్రాధాన్యత ఇస్తున్నంత సేపు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త!. మన సంరక్షణ మనమే చూసుకోవాలి తప్పదు. (చదవండి: ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..) -
పాకిస్తాన్ క్రికెట్కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!?
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు తన మకాం మార్చాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో పాక్ వికెట్ కీపర్గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్కు.. మహ్మద్ రిజ్వాన్తో పాటు యువ వికెట్ కీపర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది. దీంతో అతడిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వేళ సెలక్టర్లు ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు అంతంతమాత్రమే. తన క్రికెట్ భవిష్యత్తు సందిగ్ధంలో పడడంతో పాకిస్తాన్ను విడిచిపెట్టి లండన్ వెళ్లాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. యూకేలో ఉంటూ కౌంటీలు, ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడాలని సర్ఫరాజ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే అహ్మద్ తన సొంత దేశాన్ని వదిలి యూకేకు వెళ్లినా త్వరలో పాకిస్తాన్లో జరగనున్న పీఎస్ఎల్ లో మాత్రం ఆడతానని సర్ఫరాజ్ సృష్టం చేసినట్లు వినికిడి. ఇప్పటికే తన ప్రాతినిథ్యం వహిస్తున్న క్వెట్టా గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీకి సర్ఫరాజ్ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే దేశం విడిచి వెళ్లడంపై సర్ఫరాజ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో పాకిస్తాన్ తరపున సర్ఫరాజ్ ఆడాడు. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్న అహ్మద్.. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని రెండో టెస్టుకు జట్టు మేనెజ్మెంట్ పక్కన పెట్టేసింది. రెండో టెస్టుకు సర్ఫరాజ్ స్ధానంలో మహ్మద్ రిజ్వాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్గా సర్ఫరాజ్ తన కెరీర్లో ఇప్పటివరకు 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20ల్లో పాకిస్తాన్కు ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 పరుగులు చేశాడు. కాగా 2017లో అతడి సారథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్! -
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
చెట్లకు పండ్లను పండించడం విన్నాం. కానీ ఇలా చెట్లకే కుర్చీలను పండించడం గురించి వినలేదు కదా!ఎక్కడైనా చెట్లను పెంచి వాటిని కట్ చేసి కుర్చీల ఆకృతిలో తయారు చేస్తారు. కానీ ఏకంగా ఓ పండు మాదిరిగా కుర్చీలను చెట్లకు పెంచడం ఏమిటీ? అసలు అదెలా సాధ్యం? అనిపిస్తుంది కదా!. అయితే ఇక్కడో రైతు ఈ వినూత్న ఆలోచనతో పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు. లక్షల్లో లాభలు కూడా ఆర్జిస్తున్నాడు. ఎలా చేస్తాడంటే..యూకేకి చెందిన గావిన్, ఆలిస్ మున్రో జంట ఈ వినూత్న వ్యవసాయాన్ని మొదటు పెట్టారు. ఇద్దరు ఫర్నీచర్ ఫామ్ని చేస్తారు. వారు తమ పొలంలో కుర్చీల్లా ఎదిగేలా చెట్లను పెంచుతారు. ఫర్నీచర్ కోసం పరిపక్వానికి వచ్చిన చెట్లను నరికేసి భారీగా కార్బన్ ఉద్గారాలు పెరిగే ప్రమాదానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక చెట్టును 50 ఏళ్లపాట్లు పెంచి ,నరికి కుర్చీగా తయారు చేసే బదులు చెట్లకే నేరుగా కావాల్సిన ఆకృతిలో కుర్చీలను పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది గావిన్ అనే రైతుకి. అనుకున్నదే తడువుగా ఆ భార్యభర్తలిద్దరూ ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా కుర్చీలను పండిస్తున్నారు. దీన్ని గావిన్ ఒక రకమైన జెన్ త్రీడీ ప్రింటింగ్ అంటారని చెబుతున్నారు. ఆయనకు ఈ ఆలోచన తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడూ కుర్చీలా ఉండే బోన్సాయ్ చెట్లను చూసి ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు. అదీగాక గావిన్ చిన్నతనంలో వంగిన వెన్నుపూసతో జన్మించాడు. దీంతో చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అక్కడ వైద్యులు వెన్నుని సరిచేసే నిమిత్తం మెటల్ ఫ్రేమ్ని అమర్చారు. దాంతోనే చాలా ఏళ్లు గడిపాడు. అప్పుడే గావిన్కి తెలిసింది..ఏదైన సరైన ఆకృతిలో రావాలంటే పెరుగుతున్న క్రమంలోనే ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సెట్రైట్ అవుతుందని. ఆ తర్వాత గావిన్ తన ఆలోచనకు(చెట్లకు కుర్చీలు పెంచడ) రూపమిచ్చే పనిలో నిమగ్నమయ్యాడు. అందుకోసం విల్లో అనే ప్రత్యేకమైన చెట్లును ఉపయోగించాడు. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్, సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ పెంచడానికి ఉపయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్లను ఉపయోగిస్తాడు. ఈ ఫ్రేమ్ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచుతారు. కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడట. అయితే ఒక్కో కుర్చి ఖరీదు మాత్రం రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలో వారు చెట్ల పెరుగుదలను అడ్డురాకుండా మంచి ఆకృతిలో పెంచేందుకు ఒక మార్గాన్ని కూడా కనుగొనవల్సి వచ్చింది. ఈ సేంద్రీయ మొక్కలను పెంచడానికి చాలా శ్రమ, సమయంల ఖర్చు అవుతుందని చెబుతున్నాడు గావిన్. ఈ మొక్కల పెంపకంలో అతడి భార్య ఆలిస్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇలా ఈ దంపతులు 2012లో ఫుల్ గ్రోన్ అనే కంపెనీని స్థాపించారు. అంతేగాదు సగటున ఒక కుర్చీ పెరగడానికి ఆరు నుంచి 9 సంవత్సరాలు పట్టగా ఎండడానికి ఒక ఏడాది పడుతుంది. అంటే ఒక కుర్చీ తయారవ్వడానకి ఇంచుమించు ఏడు నుంచి పదేళ్లు పట్టొచ్చు. పైగా ధర కూడా లక్షల్లో ఉంటుంది. చెట్లకు కుర్చీలనే పెంచడమే ఒక వింత అనుకుంటే వాటిని ఇన్ని లక్షలు పోసి కొనడం మరింత విడ్డూరంగా ఉంది కదా!.అంతేగాదు గావిస్ ఆలిన్ ఇంత సమయం పట్టకుండా ఉండేలా ఏటా పండించేలా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2024 కల్లా ఆ లక్ష్యం నెరవేరగా దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆ గావిన్ ఆలిస్ దంపతులు. (చదవండి: 30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..! 11 ఏళ్ల చిన్నారి..) -
30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..!
కొందరికి వస్తువులు పోతే మళ్లీ వాళ్లకు దొరికే సీన్ లేదు. ఇంకొందరూ ఎంద అదృష్టవంతులంటే పోయిన వస్తువు కనీసం జీవిత చరమాంకలో అయిన కంటపడి సర్ప్రైజ్ చేస్తుంది. చూసిన వాళ్లకు కూడా ఇలాంటి అదృష్టం మాకు ఉంటే బావుండనని అనిపిస్తుంది. అలాంటి ఘటనే యూకేకి చెందిన మహిల విషయంలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే?..యూకేకి చెందిన మహిళ ఆడ్రీ హే 30 ఏళ్ల క్రితం హ్యాండ్ బ్యాగ్ని పోగొట్టుకుంది. అప్పుడు ఆమె బ్యాగ్ని ఓ దుండగడు ఎత్తుకుపోయాడు. బహుశా అతను పోతుపోతూ..పక్కనే ఉన్న డోన్ నదిలోకి విసిరేశాడు కాబోలు . అది అనుకోకుండా కొట్టుకుంటు ఒడ్డుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అయితే అనుకోకుండా చాలా ఏళ్ల తర్వాత 11 ఏళ్ల మైసీ కౌట్స్ అన చిన్నారి తన తల్లిదండ్రులతో ఆ డాన్ నది వద్దకు వచ్చినప్పుడూ ఆ బ్యాగ్ కంటపడింది. ఆ చిన్నారి పొరపాటున ఆ పాత బ్యాగ్పై పొరపాటున పడుతుంది. వెంటనే అమ్మ నీకు ఈ కొత్త బ్యాగ్ కావాలా అంటూ కౌట్స్ ఆ బ్యాగ్ని అందుకుంది. అంతేగాదు అందులో ఏమున్నాయా? అని ఆసక్తిగా చూసేసింది కూడా. అందులో కొన్ని పెన్నులు, నాణేలు, లిప్స్టిక్, చెవిపోగులు, కీ, ట్యాబ్లెట్లు ఉన్నాయి. దీంతో ఆమె అమ్మ నాన్నా ఆ బ్యాగ్ ఎవరో పోగొట్టకున్నారో? అని సదరు యజమాని గురించి ఏదైనా ఆధారం దొరకుతుందని ప్రతి ఇంచు గాలించి వెతికారు. ఆ చిన్నారి తల్లి కిమ్కు అందులో కొన్ని కార్డులు కనిపించాయి. వాటిపై 1993 అని ఉంది. అంటే ఇది చాలా ఏళ్లుగా నీటిలో ఉందన్నమాట. అంటే ఆ వ్యక్తి చనిపోయారా? బతికే ఉన్నారా? అన్ని కాస్త గాభర పడింది. ఆ తర్వాత ఆ బ్యాగ్ గురించి వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వెంటనే ఆడ్రీ అనే వృద్ధ మహిళ స్పందించి అది తన బ్యాగే అని 30 ఏళ్ల క్రితం పోయిందని తెలిపింది. ఆ రోజు బ్యాగ్ని తన ఆఫీస్ డెస్క్ కింద పెట్టి బయటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికీ పోయిందని చెప్పుకొచ్చింది. తాను పోలీస్ కంప్లైయింట్ కూడా ఇచ్చానని నాటి సంఘటనను వివరించింది. అందులో 240 పౌండ్లు(రూ. 20,000) ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఆ దొంగ ఆ డబ్బులు తీసుకుని ఈ బ్యాగ్ని నీటిలోకి విసిరేసినట్లున్నాడు కాబోలు అని ఆండ్రి అంది. ఎట్టకేలకు ఆండ్రీకి తాli పోగొట్టుకున్న బ్యాగ్ ఆమె చెంతకే చేరింది. ఇప్పుడు ఆమె వయసు 81 ఏళ్లు. బహుశా రాసి పెట్టి ఉంటే ఎంతకాలనికైనా తిరిగి రావడం అంటే ఇదే కదా!. కానీ ఆ బ్యాగ్ని యజమానికి అందించిన కిమ్ సోషల్ మీడియా శక్తిని చూసి తెగ మెచ్చుకుంటుంది. ఇవాళ ఇదే లేకపోతే ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరిగేవా? చూడగలమా? అంటోంది ఆ చిన్నారి తల్లి కిమ్. (చదవండి: మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా? ఇది సాధ్యమా?) -
బయోనిక్ 'హీరో ఆర్మ్'ని పొందిన అతిపిన్న వయస్కురాలు!
ఏ తల్లిదండ్రులైన పిల్లకు ది బెస్ట్ గిఫ్ట్లు ఇవ్వాలనే చూస్తారు. తమ పిల్లలు వాటిని చూసి ఎంతో సంతోపడటమే గాక ఎప్పటికీ మర్చిపోకూడదని కోరుకుంటారు. ఓ తల్లిగా లేదా తండ్రిగా వారి మనుసులను గెలుచుకోవాలనే ఆరాట పడతారు. ఇక్కడ కూడా అలానే ఓ తల్లి పుట్టుకతో ఒక చేయి లేకుండా జన్మించిన తన కూతురుకి అత్యంత విలువైన కానుక ఇవ్వాలనుకుంది. ఆమె పెదాలపై ఎప్పటికీ చిరునవ్వు తొణికిసలాడే విలువనే బహుమతి ఇవ్వాలనుకుంది. అందుకోసం ఎంతలా తప్పించిందో వింటే ఆ తల్లికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. యూకేలో థాలియా కౌల్టాస్ అనే ఎనిమిదేళ్ల చిన్నారి పుట్టుకతో ఒక చేయితో జన్మించింది. తన కూతురు అలా ఉండటం చూసి కెర్రీ కౌల్టాస్ చాలా బాధపడేది. ఆమె తన పనులు చేసుకోవడం ఎంత ఇబ్బంది పడుతుందో గమనించి తల్లడిల్లింది. ఎలా తనకు సాయం చేయాలని ఆరాటపడింది. సాంకేతికతో కూడిన చేతిని అమరిస్తే తన సమస్యలకు కాస్త ఉపశమనం దొరుకుతుందేమో అన్ని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏ ఒక్క రోబిటిక్ చేయి ఆమెకు సూటవ్వలేదు. అప్పుడే ఈ ఓపెన్ బయోనిక్స్ అవయాల గురించి తెలుసుకుని అన్వేషించింది. సాంకేతికతో కూడిన ఈ బయోనిక్ అవయవాలను ఎనిమిదేళ్ల పిల్లలకు అమర్చరు. సదరు కంపెనీలకు అందుకు అనుమతించవు. అయితే థాలియా తల్లి శతవిధాల చేసిన ప్రయత్నాల ఫలితంగా ఆ కంపెనీ దిగొచ్చి ఆ చిన్నారికి మినహాయింపు ఇచ్చి మరీ ఈ బయోనిక్ చేతిని అందించింది. దీంతో సాంకేతికతో కూడిన బయోనిక్ 'హీరో ఆర్మ్'ని పొందిన అతి పిన్నవయస్కురాలిగా థాలియా నిలిచింది. ఈ క్రిస్మస్కి తన కూతురుకి తాను ఇచ్చే అతి విలువైన కానుక అని ఆ తల్లి ఎంతో సంబరపడిపోయింది. ఆ తల్లి దాదాపు రూ. 13 లక్షలు ఖర్చుపెట్టి మరీ ఈ క్రిస్మస్కి కూతురుకి అపురూపమైన కానుకను ఇచ్చింది. ఇప్పుడూ తన కూతురు కత్తి, ఫోర్క్ పట్టుకుని కేక్ని సులభంగా కట్ చేయగలదు, తన గదిని చక్కబెట్టుగోగలదు అని సంతోషంగా చెబుతోంది. ఏ తల్లి అయినా అంతేకదా! పిల్లలకు ఎదురైన కష్టాన్ని తొలగించి వారి మోములు సంతోషంతో వెలిగిపోవాలని కోరుకుంటారు. నిజానికి అలాంటి చిన్నారులకు అన్ని విధాల వెన్నుదన్నుగా ఉండే తల్లిదండ్రులు ఉండటమే అతిపెద్ద గిఫ్ట్ కదా!. దెబ్బకి ఏ కష్టమైన పరార్ అవ్వాల్సిందే. (చదవండి: రొయ్యలకు నిలయం ఆ సరస్సు! చేపలు పీతలు అస్సలు ఉండవ్!) -
యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!
లండన్: గత వారం యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి తూర్పు లండన్లోని కానరీ వార్ఫ్ సరస్సులో శవమై కనిపించాడు. డిసెంబర్ 14న అదృశ్యమైన గురష్మాన్ సింగ్ భాటియా(23 ) మృతదేహాన్ని కానరీ వార్ఫ్ సరస్సులో డైవర్లు బుధవారం గుర్తించారు. లాఫ్బరో యూనివర్శిటీకి చెందిన విద్యార్థి గురష్మాన్ సింగ్ భాటియా డిసెంబర్ 14న రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ క్రమంలో కానరీ వార్ఫ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చివరిసారిగా సౌత్ క్వే ప్రాంతంలోని సీసీటీవీలో డిసెంబర్ 15న కనిపించాడు. కానీ ఆ తర్వాత ఆయన జాడ తెలియలేదు. చివరగా బుధవారం కానరీ వార్ఫ్ ప్రాంతంలోని సరస్సులో డైవర్లకు గురష్మాన్ సింగ్ మృతదేహం కనిపించింది. గురష్మాన్ సింగ్ మరణవార్త సమాచారాన్ని పంజాబ్లోని ఆయన కుటుంబానికి అందించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేపడుతామని డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ జేమ్స్ కాన్వే చెప్పారు. గురష్మాన్ సింగ్ అదృశ్యంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పందించారు. గత నెలలో కూడా యూకేలో భారతీయ విద్యార్థి థేమ్స్ నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇదీ చదవండి: కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు? -
Microsoft-OpenAI: రెండూ కలిస్తే ఏమవుతుంది?
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ భాగస్వామ్యాన్ని, దానికి సంబంధించిన ఇటీవల పరిణామాల్ని యూకే నియంత్రణ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దిగ్గజ కంపెనీల కలయిక యూకేలోని కంపెనీ మధ్య పోటీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాన్ని గమనిస్తోంది. ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ అనుబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్ను ప్రభావితం చేయగలదా అని యూకేకి చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) పరిశీలిస్తోంది. ఈమేరకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అభిప్రాయ సేకరణ (ITC) అనేది సమాచార సేకరణ ప్రక్రియలో మొదటి భాగమని, అధికారికంగా మొదటిదశ విచారణకు ముందు చేపట్టే ప్రక్రియ అని సీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ఏఐలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రవేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ భాగస్వామ్యం, ఇటీవల పరిణామాలు కంపెనీల పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. ఓపెన్ఏఐలో నాటకీయ పరిణామాలు గత నెలలో ఓపెన్ఏఐ బోర్డు నాటకీయ చర్యలో సీఈవో సామ్ ఆల్ట్మన్ను తొలగించింది. తరువాత, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తమ అధునాతన ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించాలని ఆయను ఆహ్వానించారు. అయితే ఓపెన్ఏఐ పూర్తిగా కొత్త బోర్డ్తో ఆల్ట్మన్ను సీఈవోగా పునరుద్ధరించడంతో ఈ నాటకీయ పరిణామానికి ముగింపు పడింది. ‘ఏఐ డెవలపర్ల మధ్య నిరంతర పోటీ అవసరం. ఇది ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, వృద్ధి, బాధ్యతాయుతమైన అభ్యాసాలను అందించడంలో సహాయపడుతుంది’ సీఎంఏ అభిప్రాయపడింది. మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఈ రంగంలో కంపెనీల మధ్య పోటీని దెబ్బతీసే ప్రమాదం ఉందా అని సీఎంఏ సమీక్షిస్తోంది. -
యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్..
స్వదేశీయులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి.. ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి "రాడికల్ యాక్షన్" ప్రకటించింది. ఇందులో భాగంగానే నైపుణ్యం కలిగిన విదేశీయుడు యూకేలో పనిచేయడానికి వీసా కావాలనుకుంటే.. కనీస వేతనాన్ని కూడా భారీగా పెంచింది. 2022లో ప్రభుత్వం జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య 745000. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికంగా కావడం గమనార్హం. పెరిగిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్యను మూడు లక్షల కంటే తక్కువకు తీసుకురావాలనుకునే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ హోమ్ మినిష్టర్ 'జేమ్స్ క్లెవెర్లీ' (James Cleverly) తెలిపారు. అంతే కాకుండా కొత్త రాకపోకలను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై ఒత్తిడి పెరగటం కూడా ఇందుకు ఒక కారణం అని తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడించాయి, దానిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ఇవన్నీ యూకే ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని.. రిషి సునాక్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ విదేశీ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్కు తీసుకుని రావడంపై కూడా నిషేధం ఉంది. అయితే రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇందులో నుంచి మినహాయింపు ఉంటుంది. విదేశీ ఉద్యోగుల జీతం కూడా 38,000 పౌండ్లకు (రూ.40,01,932) పెంచింది. గతంలో యూరోపియన్ యూనియన్ దేశాల వారు ఎక్కువగా బ్రిటన్ దేశానికీ వలసలు వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఇండియా, నైజీరియా, చైనా నుంచి బ్రిటన్ వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని సమాచారం. Immigration is too high. Today we’re taking radical action to bring it down. These steps will make sure that immigration always benefits the UK. pic.twitter.com/osz7AmcRgY — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 We've just announced the biggest ever cut in net migration. No Prime Minister has done this before in history. But the level of net migration is too high and it has to change. I am determined to do it. — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 -
ఓ వృద్ధ మహిళ కోసం యూకేలో పోరాటం!
ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆనైలైన్లో సైతం ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు వెల్లవలా వచ్చింది. ఆమె బ్రిటన్లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరుఫున పోరాడుతున్నాడు. ఇంతకీ ఎవరీ మహిళ? ఎందుకంతా క్రేజ్ అంటే.. అసలేం జరిగిందంటే..78 ఏళ్ల గుర్మిత్ కౌర్ 2009లో యూకేకి వచ్చారు. అప్పటి నుంచి స్మెత్విక్లోనే ఆమె నివాసం ఉంటోంది. బ్రిటన్ ఆమెను బహిష్కరించడంతో వందలాది మంది బిట్రన్ సిక్కు కమ్యూనిటీలు ఆమె కోసం గట్టిగా పోరాడుతున్నారు. జూలై 2020 నుంచి ప్రారంభమైన ఈ పోరాటానికి ఆన్లైన్లో సుమారు 65 వేల మందిదాక ఆ వృద్ధ మహిళకే మద్దతు తెలపడం విశేషం. యూకే ఆ మహాళను బహిష్కరించడానికి కారణం.. గుర్మిత్ కౌర్ తొలిసారిగా 2009లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు యూకే వెళ్లింది. మొదట్లో తన కొడుకుతో కలిసి ఉండేది. క్రమంగా ఆమె తన కొడుకు కుటుంబం నుంచి దూరమయ్యాక అపరిచిత వ్యక్తుల దయపై ఆధారపడి జీవించేది. ఆ తర్వాత స్థానిక సిక్కు కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ స్మెత్విక్లో పనిచేస్తూ అక్కడే ఆశ్రయం పొందింది. క్రమంగా ఆ స్వచ్ఛంద సంస్థ ఆమె నివాసంగా మారిపోయింది. ఆ మహిళకు ఎలాగో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ భారతలోని పంజాబ్లో కూడా కుటుంబం లేదని ఆ స్వచ్ఛంద సంస్థ ఆమెను దత్తత తీసుకుంది. దీంతో గుర్మిత్ కౌర్ తాను ఇక్కడే ఉండేలా యూకే హోం కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకు యూకే హోం కార్యాలయం తిరస్కరించింది. ఆమెకు ఇక్కడ యూకేలో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ పంజాబ్లోనూ కుటుంబం లేదు కానీ అక్కడ ఆమె ఇల్లు ఉంది. అక్కడ స్థానికులతో ఆఎ ఇంకా టచ్లోనే ఉన్నారు కాబట్టి ఆమె మళ్లీ అక్కడే తన జీవితాన్ని మొదలు పెట్టగలదు కావున ఇక్కడే తన మిగతా జీవితం గడపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కనివినీ ఎరుగని రీతిలో గుర్మిత్ కౌర్ని ఇక్కడ ఉండేలా అనుమతివ్వాలంటూ పలువురు స్థానికులు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు ఇస్తూ పోరాడారు. "ఆమె చాలా మంచి వ్యక్తిత్వం గలది. దయార్థహృదయం గలది ఇలా సడెన్గా ఆమెను ఇండియాకు పంపించేస్తే ఎలా బతుకుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉండటంతో పంజాబ్లోని ఆమె ఇల్లు పాడుబడిపోయి ఉంటుంది. పైగా ఆమె వృద్ధరాలు ఈ వయసులో పనిచేయలేదు. వండుకుని తినడం కూడా కష్టం కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థలోనే ఆశ్రయం పొంది తన శేష జీవితాన్ని గడుపుతుందని ఇమ్మిగ్రేషన్ సలహాదారు సల్మాన్ మీర్జా పిటిషన్ వేసి ఆమె తరుఫున పోరాడుతున్నారు. ఆమెకు వీసా లభించేలా సాయం చేస్తున్న వారిలో అతను ఒకరు అంతేగాదు ఆమెకు అనూహ్యంగా ఆన్లైన్లో కూడా విశేషమైన మద్దతు లభించింది. వారంతా ఆమె బ్రిటన్లోనే ఉండేలా వీసా జారీ చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక సాధారణ వితంతు సిక్కు మహిళకు విశేషమైన ప్రజాధరణ లభించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారి తెగ వైరల్ అవుతోంది. అంతేగాదు వెస్ట్మిడ్లాండ్స్లోని కొందరూ మద్దతుదారులు ఆమె బహిష్కరణపై యూకే హోం కార్యాలయంపై గట్టిగా పోరాడుతున్నారు. (చదవండి: అమ్మ ఎక్కడైనా అమ్మే) -
కొత్త రూపంలో కోవిడ్-19.. భారత్కూ తప్పని ముప్పు?
కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను తీసుకుంటోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఉత్పరివర్తనమై బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూకేలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. రుచి లేదా వాసన కోల్పోవడం కోవిడ్-19 ప్రధాన లక్షణం అయితే, పిరోలా లేదా బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి. పిరోలా సోకినప్పుడు ముందుగా దాని ప్రభావం ముఖంపైనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయని, ఈ వ్యాధి శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్ఎస్ఏ) తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త వైరస్కు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కాగా ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు టీకాల ప్రచారాన్ని యూకేహెచ్ఎస్ఏ ముమ్మరం చేసింది. వృద్ధులు, పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగినవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే ఈ డోస్ తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలో ఉండేటప్పుడు కూడా మాస్క్ ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు. కాగా బీఏ.2.86 కేసులు తొలిసారి గత జూలైలో కనిపించాయి. ఇది కూడా చూడండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు! -
బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్కు ఉద్వాసన
లండన్: బ్రిటిష్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్కు ఉద్వాసన పలికింది రిషి సునాక్ ప్రభుత్వం. పాలస్తీనా అనుకూల ఆందోళనలను అణిచివేయడంలో లండన్ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. బ్రేవర్మన్ వ్యాఖ్యలపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో సునాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయాల్సిందిగా బ్రేవర్మన్ను సునాక్ అడిగినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సునాక్ ఆదేశాలకు ఆమె అంగీకరించినట్లు రాయిటర్స్లో కథనం వెలువడింది. గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేపట్టాలని బ్రిటన్ వేదికగా ఆందోళనకారులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమైతున్నారని ప్రధాని సునాక్ అంతరంగిక మంత్రి బ్రేవర్మన్ మండిపడ్డారు. ఆందోళనల పట్ల అధికారులు కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని సునాక్ అనుమతి లేకుండానే ఈ అంశంపై ఓ కథనం కూడా ప్రచురించారు. ఈ అంశం గత కొద్ది రోజులుగా బ్రిటన్లో వివాదానికి దారి తీసింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆమెను పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. బ్రేవర్మన్ను తొలగించాల్సిందిగా సునాక్పై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇలా ఉంటే.. బ్రిటన్ కేబినెట్లో సుయెల్లా బ్రేవర్మన్ సీనియర్ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్ ట్రస్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. అదే సమయంలో మైగ్రేషన్ అంశంపై అధికారిక పత్రాలను వ్యక్తిగత మెయిల్ ద్వారా షేర్ చేసినందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంటీరియర్ మినిస్టర్గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె ప్రచురించిన కథనం వివాదాస్పదం కావడంతో మరోసారి పదవి కోల్పోయారు. గతంలో ఆమె వలసదారులపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్కు చోటు బ్రేవర్మన్ స్థానంలో విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీని బ్రిటన్ కొత్త హోం మంత్రిగా సునాక్ ప్రభుత్వం నియమించింది. మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ను బ్రిటన్ తదుపరి విదేశాంగ మంత్రిగా ఎంపిక చేసింది. త్వరలో వారు అధికారికంగా పదవులు చేపట్టనున్నారు. కామెరూన్ 2010 నుంచి 2016 వరకు ప్రధానిగా పనిచేశారు. ఇదీ చదవండి: Jaishankar Gift To Rishi Sunak: బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక -
సంచలన నిర్ణయం.. 600 మంది ఉద్యోగుల తొలగింపులో దిగ్గజ కంపెనీ
ప్రముఖ అడిటింగ్ సంస్థ ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) కష్టాల్లో చిక్కుకుంది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 600 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆప్షన్ ఇచ్చాం.. అందుకు అనుగుణంగా సిబ్బంది వీఆర్ఎస్ ఆప్షన్ ఎంచుకోకుంటే వారి తొలగింపు తప్పదని పీడబ్ల్యూసీ ప్రతినిధులు చెబుతున్నారు. పీడబ్ల్యూసీలో 25 వేల మంది పని చేస్తుండగా..అడ్వైజరీ బిజినెస్, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ‘బిగ్ ఫోర్’లో లేఆఫ్స్ అలజడి ప్రపంచ వ్యాప్తంగా అకౌంటింగ్, ప్రొఫెషనల్ సర్వీసులు అందించే అతిపెద్ద ‘బిగ్ ఫోర్’ సంస్థలుగా డెలాయిట్ ఎలోయిట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ey), ప్రైస్వాటర్హౌస్కూపర్స్ (PwC), క్లిన్వెల్డ్ పీట్ మార్విక్ గోర్డెలర్ (KPMG)లు ప్రసిద్ధి చెందాయి. ఆ నాలుగు సంస్థల్లో ఒకటైన పీడబ్ల్యూసీ 600 మంది వర్క్ ఫోర్స్ను తగ్గించే పనిలో ఉండగా.. గత నెలలో మరో సంస్థ కేపీఎంజీ యూకే విభాగంలోని డీల్ అడ్వైజరీ విభాగంలో పనిచేస్తున్న 100 మందిని ఇంటికి సాగనంపాలని భావిస్తుండగా.. యూకే 800 కంటే ఎక్కువ మందిని తగ్గించాలని డెలాయిట్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
మాంద్యంలో బ్రిటన్! పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం.. అసలేం జరుగుతోంది?
పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం బ్రిటన్ను కలవరపెడుతున్నాయి. దేశం మాంద్యంలోకి వెళ్లిపోతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ బహుశా ఇప్పటికే మాంద్యంలో ఉన్నట్లు బ్లూమ్బర్గ్ ఎకనామిక్స్ విశ్లేషణ పేర్కొంటోంది. వరుసగా తిరోగమనం వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి మందగించిన క్రమంలో ఈ సంవత్సరం ద్వితీయార్థంలో తేలికపాటి మాంద్యం ఏర్పడే అవకాశం 52 శాతం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. త్వరలో బ్రిటన్ జీడీపీ గణాంకాలు అధికారికంగా వెలువడనున్న నేపథ్యంలో ఈ విశ్లేషణ ప్రచురితమైంది. వృద్ధి సంకోచం తేలికపాటిగానే కనిపిస్తున్నప్పటికీ ఈ అసమానతలు మాంద్యానికి దారితీసినట్లు బ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ అనలిస్ట్ డాన్ హాన్సన్ ప్రచురణ నోట్లో పేర్కొన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 0.1 శాతం పడిపోయిందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం, 4.3 శాతం ఉండగా 2026 నాటికి ఇది 5.1 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది. రిషి సునక్కు తలనొప్పిగా మాంద్యం! బ్రిటన్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక మాంద్యం ప్రధానమంత్రి రిషి సునక్కు తలనొప్పిగా మారనుంది. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు అనివార్యం కానున్నాయి. తన అంచనాల్లో ఇప్పటికే తేలికపాటి మాంద్యాన్ని సూచించిన బ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ మూడో త్రైమాసికంలో జీడీపీ తిరోగమన అవకాశం 70 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. జులైలో 0.6 శాతం జీడీపీ క్షీణించగా ఆగస్టులో పెద్దగా పుంజుకోలేదు. కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మాత్రం మాంద్యానికి 50 శాతం అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. -
లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం
లండన్: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలపై ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యూదులతో పాటు ప్రజాస్వామ్య విలువలకు ముప్పులా పరిణమిస్తుందని అన్నారు. లండన్లో ఇలాంటి నినాదాలను సహించబోమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా లండన్, బర్మింగ్హామ్, కార్డిఫ్, బెల్ఫాస్ట్ సహా ఇతర నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో కొందరు ఆందోళనకారులు జిహాద్ నినాదాలు కూడా చేశారు. 'ఈ శనివారం జరిపిన నిరసనల్లో వీధుల్లో ద్వేషాన్ని చూశాము. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు. మన దేశంలో యూదు వ్యతిరేకతను ఎప్పటికీ సహించము. తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం.' అని రిషి సునాక్ అన్నారు. గ్రేటర్ లండన్ ప్రాంతంలో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనలు చేలరేగగా.. ద్వేషపూరిత నినాదాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఆందోళనలు అదుపుతప్పాయని చెప్పారు. ఈ ఘటనల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారని వెల్లడించారు. జిహాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రిషి సునాక్ ఇజ్రాయెల్ పట్ల నిలబడిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలను నిలిపివేయాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా?
చాలామందికి రాత్రిళ్లు అకస్మాత్తుగా ఉన్నటుండి చెమటుల పడుతుంటాయి. చాలమంది వేడి చేసిందనో మరేదో సాకుతో కొట్టిపడేస్తారు. సీరియస్గా తీసుకోను కూడా తీసుకోరు. ఒక్కొసారి నలతగా ఉన్న ఇలా ఉంటుంది కదా అని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఆ నిర్లక్ష్యమే మన ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందుకు ఉదహారణే యూకేకు చెందిన వ్యక్తి యూకేలోని బార్న్స్లీలో క్లర్క్గా పనిచేస్తున్న 48 ఏళ్ల ఫిర్త్కి రాత్రిళ్లు ఉన్నటుండి చెమటలు పట్టేసేవి. ఒళ్లునొప్పులు వల్ల అయ్యి ఉండొచ్చని, పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇలానే తరుచుగా అనిపించడంతో చివరికి ఓ రోజు డాక్టర్ని సంప్రదించాడు. ఫిజియోథెరపీ తీసుకుంటే తగ్గిపోతుందనే అనుకున్నాడు. అదే విషయాన్ని వైద్యుడితో కూడా చెప్పాడు. కానీ వైద్యులు అనుమానంతో ఫిర్త్కి కొన్ని వైద్య పరీక్షయలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు మైలోయిడ్ లుకేమియా అనే క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రాత్రిళ్లు ఇలా చెమటు పట్టడానికి ఈ క్యాన్సర్ కారణంగాననే తేలింది. కానీ ఫిర్త్ తేలిగ్గా తీసుకోవడం కారణంగా ఆ క్యాన్సర్ స్టేజ్ కూడా దాటింది. ఈ వ్యాధి నిర్ధారణతో ఫిర్త్ కుటుంబ విలవిలలాడింది. అతడి భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటని తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఏదో రకంగా బతకాలని ధైర్యం తెచ్చుకుని మరీ కీమోథెరఫీ చికిత్సలు తీసుకున్నాడు. అయితే ఈ క్యాన్సర్కి స్టెమ్ సెల్స్ మార్పిడి చికిత్స ఒక్కటే మార్గం. కానీ ఫిర్త్కి స్టెమ్సెల్ మార్పిడి చేయాలంటే కనీసం శరీరంలో 5%కి కంటే తక్కువ క్యాన్సర్ కణాలు ఉండాలి. ఫిర్త్ రెండు రౌండ్లు కీమో థెరపీ చికిత్స తీసుకున్నప్పటికీ శరీరంలో 40%కి పైగా క్యాన్సర్ కణాలు ఉన్నాయి. అందువల్ల స్టెమ్స్ మార్పిడి అనేది ఫిర్త్కి అత్యంత ప్రమాదం అవుతుంది. దీంతో అతడు జీవించే అవకాశాలు మెల్లిమెల్లిగా తగ్గిపోవడం మొదలైంది. చివరికి ఫిర్త్ జూలై 9, 2020న విషాదకర రీతిలో మరణించాడు. ఇలా ఫిర్త్లా చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇలా చెమటలు ఉన్నట్టుండి పడుతున్నా లేదా వాతావరణం చల్లగా ఉన్నా మీకు మాత్రం ఎడతెగని చెమటు పడుతున్నా.. అస్సలు అలక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలు క్యాన్సర్ సంకేతాలు కూడా కావొచ్చనని, సాధ్యమైనంత వరకు బీ కేర్ఫుల్గా ఉండాలని నొక్కి చెబుతున్నారు వైద్యులు. (చదవండి: మాంసం తినే పరాన్నజీవి ఓ మహిళను శాశ్వతంగా అంధురాలిని చేసింది!) -
దౌత్యాధికారుల తగ్గింపు వ్యవహారం.. కెనడాకు అమెరికా, యూకేల మద్దతు
లండన్/వాషింగ్టన్: కెనడాకు చెందిన 41 మంది దౌత్యాధికారుల హోదాను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో తాము విభేదిస్తున్నట్లు అమెరికా, యూకేలు ప్రకటించాయి. సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని భారత్ తీసుకున్నట్లు భావిస్తున్నామని తెలిపాయి. వియన్నా ఒప్పంద సూత్రాలకు భారత్ ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకమని యూకే పేర్కొనగా, విభేదాల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో దౌత్యాధికారుల అవసరం ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ నొక్కి చెప్పింది. ‘దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు తమ బాధ్యతలను గుర్తిస్తాయని మేం ఆశిస్తున్నాం. దౌత్యవేత్తల భద్రత కోసం కల్పించాల్సిన అధికారాలు, ఇతర హక్కులను ఏకపక్షంగా తొలగించడం వియన్నా సూత్రాల విరుద్ధం. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై స్వతంత్ర దర్యాప్తులో కెనడాతో పాలుపంచుకోవాలని భారత్ను కోరుతూనే ఉన్నాం’అని యూకే విదేశాంగశాఖ పేర్కొంది.‘భారత్లో దౌత్యాధి కారులను గణనీయంగా తగ్గించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేయడం, కెనడా తన దౌత్యవేత్తలను వెనక్కి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విభేదాలను పరిష్కరించడానికి క్షేత్ర స్థాయిలో దౌత్యవేత్తలు అవసరం. దౌత్యా ధికారులను తగ్గించాలంటూ కెనడాపై ఒత్తిడి తేవద్దని, నిజ్జర్ హత్యపై కెనడా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరాం’అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. -
క్యాన్సర్ థర్డ్ స్టేజ్! కానీ ఎలాంటి సర్జరీ లేకుండానే..
క్యాన్సర్ స్టేజ్లను బట్టి రోగులకు చికిత్స అందించడం అనేది సర్వసాధారణం. కానీ కొన్ని క్యాన్సర్లు మొదటి స్టేజ్ల్లో చికిత్స తీసుకుంటేనే సులభంగా బయటపడగలుగుతారు. కొన్ని క్యాన్సర్లు మాత్రం ఏ స్టేజ్ అయినా పరిస్థితి సీరియస్ తప్ప క్యూర్ అవ్వడం అనేది ఉండదు. కానీ ఇక్కడొక మహిళ విషయంలో ఓ డ్రగ్ మిరాకిల్ చేసింది. ప్రాణాంత క్యాన్సర్ వ్యాధి నుంచి ఎలాంటి కీమో థెరఫీ, సర్జరీ వంటివి చేయంచుకోకుండానే సులభంగా నయం కావడమే కాదు పూర్తి స్థాయిలో క్యాన్సర్ సమస్య నుంచి బయటపడింది. వైద్యులను సైతం నివ్వెరపరిచింది ఈ డ్రగ్. ఇంతకీ ఏంటా మెడిసన్? ఆమెకు క్యాన్సర్ ఎలా క్యూర్ అయ్యిందంటే.. వివరాల్లోకెళ్తే..యూకేలోని వేల్స్కు చెందిన క్యారీ డౌనీ అనే మహిళకి ప్రేగు క్యాన్సర్ వచ్చింది. అది కూడా థర్డ్ స్టేజ్. ఆమెకు వైద్యులు వండర్ మెడిసిన్ని ఇచ్చారు అంతే జస్ట్ ఆరు నెలల్లో పూర్తిగా నయం అయిపోయింది. వైద్యుల కూడా ఇది మిరాకిల్ అంటూ ఆశ్చర్యపోయారు. ఆమెకు దోస్టార్లిమాబ్ అనే డ్రగ్ని ఇంజక్షన్ రూపంలో ఇచ్చారు. ఇది యాంటీబాడీస్కి సంబంధించిన ఔషధం. ఇది క్యాన్సర్ కణాలలో నిర్దిష్ట ప్రోటీన్ చర్యను నిరోధిస్తుంది. అంతేగాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను క్యాన్సర్కణాలకు వ్యతిరేకంగా పోరాడేల క్యాన్సర్ కణితి పెరుగుదలను నియంత్రిస్తుంది. ఈ డ్రగ్ కారణంగా పెద్దగా ఎలాంటి దుష్పరిణామాలను సదరు మహిళ ఎదుర్కొనలేదు. కొద్దిగా శరీరంపై అక్కడక్కడ దద్దుర్లు వచ్చినా.. అవి కూడా త్వరితగతిన తగ్గిపోయాయి. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఇది క్లినికల్ ట్రయల్ డ్రగ్ అయినప్పటికీ సానుకూల ఫతితాలని ఇచ్చింది. ఒకరకంగా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు పేషెంట్స్ చాలా రకాల దుష్పరిణామాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది అవేమీ చేయించుకోనక్కర్లేకుండా నయం కావడం నిజంగా అద్భుతం అని వైద్యులు అంటున్నారు. పైగా ప్రేగ్లుల్లో క్యాన్సర్ కణితి థర్డ్ స్టేజ్(మూడో దశ)లో ఉంది. ఈ స్టేజ్లో ఉండగా నయం కావడం కాస్త రిస్క్తో కూడినదే. కానీ ఈ వండర్ డ్రగ్ అద్భుతంగా పనిచేయడమే కాక భవిష్యత్తులో రోగులు ఎలాంటి సర్జరీల జోలికి వెళ్లాల్సిన పనిలేదనే కొత్త ఆశని రేకెత్తించింది. సదరు మహిళకు కేవలం ఆరు నెలల్లోనే క్యాన్సర్ కణితి తగ్గిపోయిందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ప్రేగు క్యాన్సర్ ఉన్న రోగులకు వారానికి మూడుసార్లు చొప్పున ఇంట్రావీనస్గా ఇవ్వడం జరగుతుందన్నారు. ప్రతిసారి ఇంజక్షన్ ఇచ్చేటప్పుడూ కనీసం అరగంట సమయం పడుతుంది. పైగా పేషెంట్ని పూర్తి వైద్యుల అబ్జర్వేషన్లో ఉంచి స్కాన్లు నిర్వహిస్తూ.. ఆ డ్రగ్ పనితీరుని అంచనా వేయాల్సి ఉంటుందని డాక్టర్ బారిటన్ తెలిపారు. సదరు మహిళ తనకు జీవించేలా మరో అవకాశాన్ని ఇచ్చినందుకు డాక్టర్ బారిటన్ వైద్య బృందానికి ఎంతగానో రుణపడి ఉంటానని ఉద్వేగంగా చెప్పింది. గతేడాది బారిటన్ వైద్య బృందం ఇదే డ్రగ్ని మల క్యాన్సర్తో బాధపడుతున్న 18 రోగులపై క్లినికల్ ట్రయల్ నిర్వహించి పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యారు. నిజంగా క్యాన్సుర్ రోగుల పాలిట ఈ మెడిసిన్ ఓ గొప్ప అద్భుత వరం!. (చదవండి: ఫైబ్రాయిడ్స్ వల్ల హిస్టరెక్టమీ వస్తుందా?) -
యూకేలో గాన గంధర్వునికి ఘనంగా సంగీత నివాళి!
గాన గంధర్వులు, దివగంత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి తృతీయ వర్ధంతి పురస్కరించుకుని భగవాన్ బోయినపల్లి గారి ఆధ్వర్యంలో Bhagavan’s Soulful presents 'SPB Lives On' పేరుతో అక్టోబర్ 7, 2023 తేదీన సంస్మరణ సంగీత కార్యకమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యూకేలోని లండన్లో నోవర్ హిల్ హైస్కూల్లో నిర్వహించారు. ఇదే కార్యక్రమం 2022లో భగవాన్ 'సోల్ఫుల్ ప్రెజెంట్' పేరుతో నిర్వహించిన ‘ట్రిబ్యూట్ టు ది లెజెండ్' కార్యక్రమం ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో ఎస్పీబీ గారి స్మృతికి చిహ్నంగా ఇలా ప్రతి యేటా నివాళులర్పించాలనే ఉద్యేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా విచ్చేశారు. ఈ సంగీత కార్యక్రమం భగవాన్ బోయినపల్లి గారీ ఉపన్యాసంతో మొదలైంది. తొలుత భగవాన్ గారు గాన గంధర్వని కీర్తిని ప్రశంసిస్తూ సంగీతాన్ని ప్రారంభించగా, చిన్నారులు భరతనాట్యంతో ఆ కార్యక్రమానికి మరింత శోభ తెచ్చారు. ఈ కార్యక్రమంలో బహుముఖ గాయనీ గాయకులు నాలుగు గంటలకు పైగా బాలు గారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాడిన సూపర్ హిట్ సాంగ్స్తో ప్రేక్షకులను అలరించారు. ఈ సంగీత కార్యక్రమాన్ని ఇంతలా జయప్రదం చేసిన గాయనీగాయకులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. దసరా పంగుడ ముందే వచ్చిందా అన్నంత రీతీలో వైభవంగా జరగడమే గాక అతిథుల విందు భోజనాలతో కుటుంబ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భగవాన్ బోయన్పల్లి గారిని అభినందించగా, మరికొందరూ ఇలా ప్రతి ఏటా నిర్వహించాలన్నా ఆయన సంకల్పాన్ని వేన్నోళ్ల కొనియాడారు. (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్పాలన స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్నిరంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని అసోసియేషన్ –యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు. మహిళారిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సకలజనుల సర్వే నిర్వహించి, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించడం ద్వారా, వారి జీవితాల్లో మార్పు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకు కృషి చేసిన వివరాలు వెల్లడించారు. మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొల్పడంతో వారిలో విద్య పట్ల ఆసక్తి పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా పాఠశాలలకు హాజరుశాతం పెరిగిందన్నారు. సీఎం కృషి వల్ల తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీలిమిటేషన్కు ముడిపెట్టడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని.. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55–57 శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నా, సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే రాజకీయాల్లోకి.. తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ పోటీ చేసినప్పుడు మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని కవిత గుర్తు చేశారు. ఓ గ్రామీణ మహిళ తనకు రూ. వెయ్యి ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. -
సూపర్డ్రైతో రిలయన్స్ జత
న్యూఢిల్లీ: దక్షిణాసియా మేధో హక్కుల(ఐపీ ఆస్తులు) విక్రయానికి రిలయన్స్ రిటైల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ఫ్యాషన్ రిటైలర్ సూపర్డ్రై తాజాగా పేర్కొంది. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ) ద్వారా రిలయన్స్ రిటైల్ 4 కోట్ల పౌండ్లు(రూ. 402 కోట్లు) వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా స్వెట్షర్టులు, హుడీస్, జాకెట్స్ తదితర ఫ్యాషన్ ప్రొడక్టులను రూపొందిస్తున్న సూపర్డ్రై.. జేవీలో 24 శాతం వాటాను పొందనుంది. మిగిలిన 76 శాతం వాటా రిలయన్స్ రిటైల్ చేతిలో ఉంటుంది. ఒప్పందం ప్రకారం సూపర్డ్రై బ్రాండ్ ఐపీ ఆస్తులు కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీకి శాశ్వతంగా బదిలీకానున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ హోల్డింగ్ యూకేతో ఐపీ జేవీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సూపర్డ్రై పీఎల్సీ.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది. తద్వారా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లలో సూపర్డ్రై బ్రాండుసహా.. సంబంధిత ట్రేడ్మార్క్లను జేవీకి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధుల ఆవశ్యకత: సూపర్డ్రై ఇటీవల హోల్సేల్ కస్టమర్ల నుంచి బలహీన ఆర్డర్ల కారణంగా స్టాక్ నిల్వలు, లిక్విడిటీ తదితర అంశాలలో సవాళ్లు ఎదుర్కొంటోంది. దీంతో జేవీకి తెరతీసింది. దీంతో స్థూలంగా 3.04 కోట్ల పౌండ్ల నగదు లభించనుందని అంచనా వేస్తోంది. కాగా.. తాజా ఒప్పందంతో రిలయన్స్ దక్షిణాసియాలోని మూడు దేశాలలో కార్యకలాపాలు చేపట్టనున్నట్లు సూపర్డ్రై తెలియజేసింది. జేవీలో సూపర్డ్రై వాటాను కొనసాగించడంతోపాటు.. తమ నైపుణ్యం ద్వారా బ్రాండ్ డెవలప్మెంట్, డిజైన్, మార్కెటింగ్లలో మద్దతిస్తుందని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీ దర్శన్ మెహతా చెప్పారు. భారత్ భారీ అవకాశాల మార్కెట్కాగా.. రిలయన్స్తో పటిష్ట బంధమున్నట్లు సూపర్డ్రై వ్యవస్థాపకుడు, సీఈవో జూలియన్ డంకెర్టన్ పేర్కొన్నారు. -
యూకే గురుద్వారాలో భారత హైకమిషనర్ అడ్డగింత
లండన్: ఖలిస్తాన్ సానుభూతిపరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కెనడాతో ఖలిస్తాన్ అంశంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే అవి యూకేకు కూడా పాకాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఒక గురుద్వారాలోకి వెళ్లకుండా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అతివాదులు అడ్డుకున్నారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ (టీఎఫ్సీ) హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్లో ఖలిస్తానీ సిక్కు యువత రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో ఉన్న దొరైస్వామి అల్బర్ట్ డ్రైవ్లోని గ్లాస్గోలో గురుద్వారా గురు గ్రంథ సాహిబ్ కమిటీ సభ్యులతో సమావేశమవడానికి శుక్రవారం వచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఖలిస్తానీ యువత ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురుద్వార సిబ్బందిని కూడా వారు బెదిరించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకే భారత హైకమిషనర్ అక్కడికి వచ్చినా సిక్కు యువకులు వారిని అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు విక్రమ్ దొరైస్వామి కూర్చున్న కారు తలుపుని తీయడానికి ప్రయత్నించారు. దీంతో మరింత ఘర్షణని నివారించడానికి దొరైస్వామి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అడ్డుకోవడం అవమానకరం దొరైస్వామి కాన్వాయ్ని ఖలిస్తానీ సానుభూతిపరు లు అడ్డుకోవడాన్ని భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి దీనిని తీసుకువెళ్లింది. మరోవైపు లండన్లో భారత హైకమిషన్ ఈ చర్యను ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ మండిపడింది. బ్రిటన్ ప్రభుత్వానికి, పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. -
300 ఏళ్ల నాటి మహావృక్షం..హఠాత్తుగా..
కొన్ని వృక్షాలకు ఎంతో చరిత్ర, నేపథ్యం జ్ఞాపకాలు ముడివేసి ఉంటాయి. అవి కొన్ని గాథాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంటాయి. అలాంటివి కనుమరుగైతే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది. అంతా నేపథ్యం కలిగిన వాటిని మనం ఏవిధంగానూ రీ క్రియేట్ చేయలేం. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చెట్టు హఠాత్తుగా కనుమరుగైపోయింది. యూకేలోని నార్తంబర్ ల్యాండ్లో ఈ ప్రసిద్ధ చెట్టు ఉంది. ఏమైందో ఏమో సెప్టెంబర్ 28న తెల్లవారుజామున ఎవరో నరికేశారు. ఏం బుద్ది పుట్టి ఇలా చేశారో గానీ ఒక్కసారిగా ఈ విషయం యూకే అంతటా దావానంలా వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న యూకే అధికారులు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దర్వాప్తులో 60 ఏళ్ల వ్యక్తి ప్రమేయం ఉందని తేలడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫోరెన్సిక్ అధికారులు ఆ చెట్టు అవశేషాలు, కొలతలు, నమునాలు తీసుకున్నారు. ఆ విచారణలో ఈ చెట్టు 300 ఏళ్ల నాటిదని తేలింది. ప్రకృతిలో చాలా సహజంగా పెరిగిందని చెబుతున్నారు అధికారులు. హాలివుడ్లో కెవిన్ కాస్ట్నర్, ప్రిన్స్ ఆప్ థీవ్స్ నటించిన 1991నాటి ప్రముఖ చిత్రం రాబిన్ హుడ్లో ఈ చెట్టు అందర్నీ ఆకర్షించింది. ఈ చెట్టు ఎంతోమంది కళాకారులకు, రచయితలకు, ఫోటోగ్రాఫర్లకు గొప్ప ప్రేరణ ఇచ్చిన మొక్కగా పేరుగాంచింది. ఈ చెట్టుతో చాలామందికి ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మేరకు వుడ్ల్యాండ్ ట్రస్ట్లోని ఎస్టేట్ మేనేజర్ మార్క్ ఫెదర్ మాట్లాడుతూ..మిగిలిన కాండం నుంచి ఒక చిన్న చెట్టుగా అభివృద్ధి చెందడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. అంటే.. మనం కోల్పోయిన చెట్టులా అవ్వడానికి దాదాపు 150 నుంచి 200 ఏళ్లు పడుతుంది. ఈ చెట్టుని సైకామోర్ గ్యాప్ ట్రీ లేదా రాబిన్ హుడ్ ట్రీగా పిలుస్తారు. ఇది ఇంగ్లండ్లోని నార్తంబర్ల్యాండ్లోని క్రాగ్ లాఫ్ సమీపంలో హాడ్రియన్ వద్ద ఉంది. అంతేగాదు ఈ చెట్టు 2016 ఇంగ్లండ్ ట్రీ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైతం గెలుచుకుంది. ఇది యూకే ఐకానిక్ చెట్టుగా కూడా ప్రసిద్ది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..ఏకంగా రూ. 914 కోట్లు!ముఖేశ్అంబానీ కూతురు మాత్రం కాదు!) -
భారత హైకమిషనర్ను అడ్డుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు
లండన్: ఖలిస్థాన్ మద్దతుదారుల సెగ ఇప్పుడు ఇంగ్లాండ్ను కూడా తాకింది. ఇంగ్లాండ్లోని భారత దౌత్యాధికారి దొరైస్వామి యూకేలోని గురుద్వారాకు రాగా ఆయన లోపలికి ప్రవేశించకుండా అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. శనివారం భారత హైకమిషనర్ దొరైస్వామి ఆల్బర్ట్ డ్రైవ్లోని గ్లాస్గో సిక్కు గురుద్వారాకు వచ్చారు. వెంటనే అక్కడి ఖలిస్థాన్ మద్దతుదారులు ఆయనను కారులో నుంచి దిగకుండానే ఆయనతో వాగ్వాదానికి దిగారు. తిరిగి వెళ్ళిపోమంటూ కోపంగా వారించారు. దీంతో దొరైస్వామి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి 'సిక్కు యూత్ యూకే' ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఖలిస్థాన్ మద్దతుదారుల్లో ఒకరు కెనడాలోనూ ఇతర దేశాల్లోనూ భారత దౌత్యాధికారులపైన కూడా మాలాగే తిరగబడాలని పిలుపునిచ్చారు. మరో మద్దతుదారుడు మాట్లాడుతూ.. భారత్ దౌత్యాధికారులైన ఇతర అధికారులైనా ఎక్కడ గురుద్వారాకు వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. కెనడాలో ఏం జరుగుతుందో మాక్ తెలుసు. కెనడా ప్రధాని ఏవిధంగా అయితే భారత చర్యలను తప్పుబట్టి భారత దౌత్యాధికారిపై చర్యలు తీసుకున్నారు. భారత దౌత్యాధికారులకు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఇంగ్లాండ్లో ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యపై బీజీపీ ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి గురుద్వారాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ మతం వారైనా గురుద్వారాలోనికి ప్రవేశించవచ్చన్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ జనరల్ సెక్రెటరీ గ్రేవాల్ కూడా ఖలిస్తానీ వేర్పాటువాదుల చర్యను తప్పుబట్టారు. గురుద్వారాలోనికి ప్రవేశించే వారిని ఎవ్వరూ అడ్డుకోకూడదని అన్నారు. Heightened activity by Khalistanis outside of India. This is not Canada, this is Glasgow. Should the UK government not take serious note of this? How would’ve the UK responded if something like this would’ve happen with a British diplomat in India? An Indian diplomat is… pic.twitter.com/zIt6JM6hxg — Sneha Mordani (@snehamordani) September 30, 2023 ఇది కూడా చదవండి: పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్? -
కూతుర్ని చంపిన హంతకుల కోసం హీరోలా వేటాడాడు ఓ తండ్రి..ఏకంగా రూ. 16 కోట్లు..
ఓ తండ్రి అంతులేని ప్రేమకు నిదర్శనమే ఈ గాథ. కూతురు ఆకస్మిక మరణం ఆ తండ్రిని నిలువనీయలేదు. ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయిందన్న ప్రశ్నలు అతడ్ని కుదురుగా ఉండనివ్వలేదు. తానే ఓ డిటెక్టివ్లా దర్యాప్తు చేసేలా పురిగొల్పాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 37 ఏళ్లు తన కూతురికి న్యాయం జరగాలని తపించి నిరీక్షించాడు. దేశం కానీ దేశంలో వందసార్లుకు పైగా పర్యటించాడు. డబ్బును కూడా లెక్కచేయకుండా నీళ్లలా ఖర్చుపెట్టాడు. కానీ ఇప్పటికి అతడి కూతురు హత్య చిక్కుముడి వీడని మిస్టరీలో ఉండిపోయింది. ఐతే ఆ తండ్రి తపన, ఆశ, అలుపెరగని ప్రయత్నం చివరికి ఫలించాయా అంటే... అసలేం జరిగిందంటే..తన కూతురుని చంపిన హంతకుల కోసం హీరోలా అన్వేషించిన వ్యక్తి ఇంగ్లాండ్కు చెందిన జాన్ వార్డ్ మరణించిన అతడి కూతురు పేరు జూలీ వార్డ్. ఆమె వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్. జూలీ మరణించేనాటికి ఆమె వయసు 28 ఏళ్లు. ఆమె బరీ సెయింట్ ఎడ్మండ్స్లోని పబ్లిషింగ్ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే జూలీ మాసాయి మారా గేమ్ రిజర్వ్లో జంతువుల ఫోటోలు తీసి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆరు నెలలు కెన్యా పర్యటనలోనే ఉండిపోయింది. అయితే ఆమె చిరిసారిగా సెప్టెంబర్ కనిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకి కనిపించడంలేదని తెలిసిన కొద్ది క్షణాల్లోనే ఆమె మరణించిందనే వార్త వచ్చింది. దీంతో ఏం అర్థకాని జూలీ తండ్రి ఆఘమేఘాలపై కెన్యా వెళ్లిపోయాడు. నా కూతురు ఎందుకని చనిపోయిందని అని ఆ తండ్రి ఒకటే ఆత్రుతో వెళ్లగా..అక్కడ అధికారులు ఆమెపై క్రూరమృగాలు దాడి చేసి చంపేశాయని చెప్పారు. ఐతే జూలీ తండ్రికి అధికారులు చెబుతున్నవన్నీ కట్టుకథల్లా తోచాయి. కనీసం కూతురి చివరి చూపు దక్కలేదు, పైగా ఆమె మృతదేహం కూడా కనిపించకపోవడం ఇవన్నీ జాన్ని కుదురుగా ఉండనివ్వలేదు. అధికారుల మాటలను నమ్ముతూ కూర్చొంటే.. ఏం లాభం లేదని నిర్ణయించుకుని జాన్ వార్డ్ స్వయంగా డిటెక్టివ్లా రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాడు. జూన్వార్డ్ దంపతులు, జూలీ(కుడివైపు), ఇన్సెట్లో ఇద్దరు సోదరులతో దిగిన చిన్ననాటి చిత్రం అందులో భాగంగా ఫోరెన్సిక్ గురించి తనకు తానుగా నేర్చుకుని మరీ కూతురి మృతదేహం కోసం అన్వేషించాడు. జూలీని చివరిగా కనిపించిన ప్రాంతంలో ఏకంగా ఐదు విమానాలతో జల్లెడ పట్టించాడు. చివరికి ఆమె మృతదేహం ఆ రిజర్వ్కి దాదాపు 10 మైళ్ల దూరంలో కనిపించింది. జాన్ తన కుమార్తె దవడ, ఎడమ కాలు తదితర భాగాలను గుర్తించాడు. అయితే అవి రెండు కాలిపోయి పోదల్లో ఉన్నాయి. ఎలా చనిపోయిందనే దాని గురించి అలుపెరగకుండా దర్యాప్తు చేస్తూనే ఉన్నాడు. జూలీ అవశేషాలను ఫ్రిజర్లో భద్రపరిచి ఎలాగైనా హంతకులను పట్టుకోవాలని తన కూతరుకి న్యాయం చేయాలని ఎంతగానో తపించాడు. జాన్ దర్యాప్తు ఓ కొలిక్కి రాడమే కాకుండా ఆమె ఎలా చనిపోయిందో కనుకున్నాడు. దర్యాప్తులో కెన్యా అప్పటి అధ్యక్షుడు కుమారుడు జోనాథన్ మోయి జూలీపై క్రూరంగా అత్యాచారం చేసి చంపేశాడని కనుగొన్నాడు. ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి జంతువుల దాడిలో చనిపోయిందని నమ్మించాడని తెలుసుకున్నాడు. అయితే దాన్ని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాధారాలు జాన్ వద్ద లేవు. ఎంతాగనో అధికారులను ప్రాధేయపడి చర్యలు తీసుకోమని చెప్పినా..కానీ వారు అధ్యక్షుడి కొడుకు కావడం వల్ల ఈ ఘటనను మభ్యపెట్టి తారుమారు చేసే కుట్రకే తెరతీశారు. ఐతే జాన్ తగ్గేదేలా అంటూ.. చేసిన దర్యాప్తు కారణంగా అధికారులు సైతం జూలీది హత్యేనని ఒప్పుకోక తప్పుకోలేదు. దీని కోసం కెనడా కోర్టులో ఏకంగా 22 సార్లు క్రాస్ ఎగ్జామిన్ని జాన్ ఎదుర్కొన్నాడంటేనే వాస్తవం ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఇద్దరు సోదరులో జూలీ వార్డ్(ఫైల్ఫోటో) ప్రభుత్వమే తమే చేతిలో ఉన్నవాళ్లతో పోరాడటం ఎంత కష్టం అనేదానికి ఈ జూలీ కేసు ఓ ఉదాహరణ. ఆ తండ్రి కూతురు కేసు దర్యాప్తు కోసం ఏకంగా తన సొంత డబ్బు రూ. 16 కోట్ల దాక నీళ్లలా ఖర్చుపెట్టాడు. చివరి శ్వాస వరకు కూతురుకి న్యాయం జరగాలని పోరాడాడు. జూన్ వయసు ఇప్పుడూ 79 ఏళ్లు ఇటీవలే అతన మరణించాడు. అతడు మరణించడానికి రెండు వారాల ముందే అతడి భార్య జేన్ కూడా చనిపోయారు. తమ తండ్రి జాన్ ఆశ అడియాశగానే మిగిలిపోయిందని అతడి కొడుకులు బాబ్, టిమ్ చాలా ఆవేదనగా చెప్పుకొచ్చారు. తమ సోదరి కేసును తాము క్లోజ్ చేయనివ్వమని తమ తండ్రి ఎలా కెన్యా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడో అలానే తాము పోరాడతామని, ఆ బాధ్యతను తాము తీసుకుంటామని చెబుతున్నారు జాన్ కొడుకులు. జాన్ వార్డ్ కొడుకు బాబ్ వార్డ్ న్యాయం కోసం తన తండ్రి చూపిన పట్టుదల, తెగువ నమ్మశక్యం కానివని అన్నారు. జాన్ మరణించడానికి ఆరునెలల ముందు వరకు కెన్యా వెళ్లోచ్చారని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన తండ్రి ఈ కేసుపై ఓ పుస్తకం కూడా రాశారని, అందుకు తాను సహకరించినట్లు బాబ్ చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు టిమ్ దీనిపై డాక్యుమెంటరీ కూడా తీస్తామన్నారు. ఇక ఈ జూలీ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 1992లో ఆమె హత్య కేసులో అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న ఇద్దరు గేమ్ రేంజర్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. కెన్యా పోలీసు అధికారుల్లో కొత్త బృందం 1997లో ఈ కేసును మళ్లీ పరిశీలించింది. 1999లో ఒక గేమ్కీపర్ని ఈ కేసులో విచారించారు. కానీ, ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. 2004లో ఈ హత్యకు సంబంధించిన తీర్పును రికార్డ్ చేశారు. మళ్లీ 2010లో లండన్ డిటెక్టివ్ల సాయంతో కెన్యా స్థానికుల పోలీసుల ఈ కేసులో కొంత పురోగతి సాధించారు. జూలీ అవశేషాలు కనిపించిన ప్రదేశంలో జరిగిన క్రైమ్ గురించి ఓ అవగాహనకు వచ్చారు. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా కొంత వరకు పురోగతి సాధించనట్లు తెలిపారు బాబ్. అలసు నిందితులను కనిపెట్టి ఈ కేసును చేధిస్తామని జాను కుమారుడు బాబ్ నమ్మకంగా చెబుతున్నారు. కాగా, పాపం ఆ తండ్రి కూతురుకి న్యాయం జరగాలని తపించి, తపించి అలిసిపోయి మత్యుఒడిలోకి వెళ్లిపోయాడు. కనీసం ఇప్పటికైన జూలీ కేసులో నిందులెవరనేది తెలుస్తుందా? అంతుపట్టిని మిస్టరీలా మిగిలి.., ఆ తండ్రి ప్రయత్నం వృధాగాపోతుందా? అనేది వేచి చూడాల్సిందే...! --ఆర్ లక్ష్మీ లావణ్య (చదవండి: ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతాం! సైన్సుకే అంతుచిక్కని మిస్టరీ ప్రదేశం..) -
కొడుకు హఠాన్మరణం ఆ తండ్రిని..ఏకంగా..
ఒక్కో ఘటన లేదా పరిస్థితులు మనిషిని తనకే తెలియని తనలోని ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అవి కొందర్నీ మహనీయుడిని చేస్తే మరికొంర్ని వక్రమార్గంలో పయనించేలా చేస్తాయి. ఇక్కడొక తండ్రి కొడుకుని కోల్పోడమే జీర్ణించుకోలేని సతతమవుతున్న స్థితిలో తన కొడుకులా మరెవరూ అలా చనిపోకూడదనే గొప్ప ఆలోచనకు తెరతీసింది. ఇంకొన్నాళ్లు ఉండాల్సిన కొడుకు ఎలా అకాల మరణం చెందాడన్న ఆ సందేహమే అతడిని ఓ సరికొత్త చైతన్యం వైపుకి తీసుకెళ్లింది. అసలేం జరిగిందంటే..బ్రిటన్లోని భారత సంతతి చెందిన జే పటేల్కి 30 ఏళ్ల బలరామ్ అనే కొడుకు ఉన్నాడు. అతను లండన్లో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో అనూహ్యంగా మరణించాడు. దీంతో జీర్జించుకోలేని బలరామ్ తండ్రి తన కొడుకు ఎలా చనిపోయాడన్న సందేహంతో విచారించడం ప్రారంభించాడు. తన కొడుకు సరైన చికిత్స సకాలంలో అందలేదని, సరైన సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్లే చనిపోయినట్లు వెల్లడైంది. దీంతో అతను ఆస్పత్రిలోని పేషెంట్స్ సమస్యల పూర్వాపరాలు, జీవన వ్యవధిని నమోదు చేయడం ప్రారంభించాడు. అంతేగాదు చికిత్సలో తలెత్తుతున్న వైద్యుల తప్పుల తడకల గురించి కొత్త ఛారిటీ ఫౌండేషన్ని కూడా ప్రారంభించి రోగుల హక్కుల కోసం ప్రచారం చేస్తున్నాడు. తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్లో తన కొడుకు ఆస్పత్రి కన్సల్టెంట్, మిగతా సిబ్బంది చికిత్స సంరక్షణ వైఫల్యం కారణంగానే తీవ్ర నొప్పి, అసౌకర్యంతో ముందుగానే చనిపోయినట్లు అందరికీ తెలియజేశాడు. తాను చేసే ఈ కార్యక్రమాల ద్వారా అయిన తన కొడుకు బలరాం ట్రీట్మెంట్లో ఎలాంటి తప్పులు జరిగాయి అనే దానిపై ప్రభుత్వం స్పందించి..సత్వరమే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాని అన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్ బంధువు, స్నేహితుడు, మరెవరైనా.. వారి ఆత్రతను ఆవేదనను ఆస్పత్రి యాజమాన్యం అస్సలు పట్టించుకోదని, అక్కడ తతెత్తుతున్న లోపాలను సరిదిద్దే యత్నం కూడా చేయదని ఆవేదనగా చెబున్నారు పటేల్. బ్రిటన్ పార్లమెంటు ఈ విషయంపై మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. చివరి నిమిషంలో తన కొడుకు ఆరు ప్రాణాపాయ సంకట పరిస్థితులతో పోరాడడని చెప్పారు. తన కొడుకు చిన్నతనంలో కూడా ఎనిమిది నుంచి 10 ఏళ్ల వరకు మానసికి వయసు సంబంధించిన పెరుగదల సమస్యతో ఇబ్బంది పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. అలా.. అలా నెమ్మదిగా మానసిక వికాసం కలుగుతుందనేలోపు ఇలాంటి ఘోరంగా జరిగిందని అన్నారు. అతను అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడు, ప్రేమగా ఉండేవాడంటూ కొడుకుని గుర్తుచేసుకున్నారు. ఇది పీడకలలా తనను వెంటాడుతూనే ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు పటేల్. తన కొడుకు ఇంకొన్నాళ్లు జీవించాల్సిన వాడని, తగిన చికిత్స అందించడంలో జాప్యం, మంచి వైద్యం లేకపోవడం తదితర కారణాల వల్లే మరణించాడన్నారు. అందుకే తాను ఈ ఛారిటీ ద్వారా రోగులకు చికిత్సకు సంబంధించిన వివరాలు సేకరించి అకాల మరణాలను నివారించేలా చేయడమే గాక వారికి మంచి వైద్యం అందేలా ప్రత్యామ్నాయం మార్గాన్ని(వైద్యానికి సంబంధించిన సెకండ్ ఓపినియన్) ఎలా ఎంచుకువాలో అనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. దీనికి యూకే ప్రభుత్వం, యూకే ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లే మద్దతు ఇవ్వడంతోనే ఈ ప్రచారానికి పిలుపు ఇచ్చినట్లు పటేల్ తెలిపారు. ఇక 2021లో సెప్సితో మరణించి 13 ఏళ్ల మార్తా తల్లి కూడా ఇలానే "మార్తాస్ రూల్" అనే పేరుతో వైద్య చికిత్సకు సంబంధించిన సెకండ్ ఓపెనియన్ కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. (చదవండి: భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..! బ్రిటన్లోనే తొలిసారిగా..) -
అత్యంత అరుదైన పావురం!చూస్తే..షాకవ్వడం ఖాయం
పావురం అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. పూర్వం వాటిని సమాచారాన్ని చేరే వేసే సాధనాలుగా ఉపయోగించేవారు. ఇటీవల ఈ పావురాలను పెంచేందుకు భయపడే పరిస్థితులు తలెత్తాయి కూడా. వాటి విసర్జకాల వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని పలువురు హెచ్చరించడం జరిగింది. దీంతో ఒకరకంగా వాటిని పెంచడం, ఆహారం వేయడం తగ్గించారు ప్రజలు. వాటి సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారు ఆరోగ్య నిపుణులు కూడా. ఇలా ఉండగా గూలాబీ రంగులో ఉన్న ఓ పావురం ప్రజల ముందు హఠాత్తుగా ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేలోని గ్రేట్ మాంచెస్టర్ వద్ద టౌన్ సెంటర్ సమీపంలో వాకింగ్ చేసేవాళ్లు ఓ పక్క, మరోవైపు పోలీసుల పెట్రోలింగ్తో జన సందోహంగా ఉన్న ప్రదేశంలో ఈ పక్షి కనువిందుఉ చేసింది. ఏదైన రంగు దానిపై పడటం వల్ల అలా ఉందా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. నిజానికి పావురాలు తెలుపు, నలుపు, బుడిద రంగులోనే ఎక్కువగా ఉంటాయి. అవేమి కాకుండా పింక్ రంగులో ఉండడం అనేది అత్యం అరుదు అనే చెప్పాలి. మొదటగా చూసిన వెంటనే దాన్ని పావురమే ప్రజలు అనుకోలేదు. ఏదో వింత పక్షి అనే అనుకున్నారు అంతా. కాసేపటికి గానీ అర్థకాలేదు అది పింక్కలర్లో ఉన్న ఓ పావురమేనని. ఇదిలా ఉండగా గతంలో న్యూయార్క్ నగరంలో జెండర్ రివీల్ పార్టీలో అట్రాక్షన్ కోసం అని ఓ పావురానికి గూలాబిరంగు వేసి ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పావురాన్ని రక్షించడమే గాక అది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దాన్ని వైల్డ్ బర్డ్ ఫండ్కు తరలించారు. అలానే ఈ పక్షికి కూడా ఎవరైన గూలాబీ రంగు వేశారేమోనని సందేహిస్తున్నారు. అయితే ఈ పావురం బంధింపబడలేదు. మిగతా పావురాల్లో స్వేచ్ఛగా ఎగురుతూ కనిపించింది. ఎందువల్ల ఆ పావురం ఇలా గూలాబీ రంగులో ఉందనేది తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఫోటోను నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో చూసిన యూకేలోని స్థానికులు, పోలీసు అధికారులు తాము కూడా ఈ వింత పావురాన్ని చూసినట్లు తెలపడం విశేషం. Has anyone else seen this pink pigeon in Bury and does anyone know why it is pink?! #Bury #pinkpigeon #pigeon #pink #bird pic.twitter.com/wrx63R21TP — Harriet Heywood (@Heywoodharriet_) September 9, 2023 (చదవండి: కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..) -
దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..
రిషి సునక్ (Rishi Sunak) యూకే ప్రధాన మంత్రి కావడంలో భారతీయ బిలియనీర్, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి (Narayana Murthy) పాత్ర ఉందని ఆ దేశ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) నమ్ముతున్నారని ఇటీవల విడుదలైన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. 'ది రైట్ టు రూల్' అనే ఈ పుస్తకాన్ని ది టెలిగ్రాఫ్ వార్తాపత్రికకి పొలిటికల్ ఎడిటర్ అయిన బెన్ రిలే-స్మిత్ రచించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్కు సంబంధించిన పలు విషయాలను ఇందులో ప్రస్తావించారు. పార్టీగేట్ కుంభకోణం గురించి స్యూ గ్రే ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు ప్రధాని జాన్సన్ తన అధికారిక నివాసంలో పార్టీలకు ఆతిథ్యం ఇవ్వడానికి కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఆరోపించినప్పుడు 2023 ఫిబ్రవరి కంటే ముందే రిషి సునక్ తన ప్రధాని పదవి కోసం రంగం సిద్ధం చేయడం ప్రారంభించాడని రచయిత పుస్తకంలో పేర్కొన్నారు. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) బోరిస్ జాన్సన్ రాజకీయ కుట్రలను నమ్మేవారని 'ది రైట్ టు రూల్' పుస్తకం పేర్కొంది. బోరిస్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు ముఖ్య సలహాదారుగా పనిచేసిన బ్రిటిష్ రాజకీయ వ్యూహకర్తను ప్రస్తావిస్తూ, "సునక్ మామ, భారతీయ బిలియనీర్ నారాయణ మూర్తి.. డొమినిక్ కమ్మింగ్స్ను తన పక్కన పెట్టుకున్నట్లు పుకారును బోరిస్ వినిపించేవారని పుస్తకంలో రాశారు. పార్టీగేట్ తిరుగుబాటు కాలంలో కమ్మింగ్స్ డౌనింగ్ స్ట్రీట్లో ఎలాంటి అధికారిక పాత్రను పోషించలేదు. 2020 నవంబర్లోనే ఆయన రాజీనామా చేశారు. జాన్సన్ తన మాజీ రాజకీయ సహాయకుడు, అతనితో విభేదాలు ఉన్నందున, ఇప్పుడు సునక్ రాజకీయ అదృష్టాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాడని నమ్మినట్లుగా పుస్తకంలో రాసుకొచ్చారు. -
భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు
UK Student Visa యునైటెడ్ కింగ్డమ్ సర్కార్ భారతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. విద్యార్థి , పర్యాటక వీసాల ధరలను ఏకంగా 200 శాతం పెంచేసింది. ఈమేరకు బ్రిటన్ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. పార్లమెంటరీ ఆమోదం తరువాత పెంచిన ఫీజులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ పెంపుతో ప్రభుత్వ పథకాలకు ఎక్కువ నిధుల ప్రాధాన్యతకు అవకాశం లభిస్తుందని యూఏ హోం ఆఫీస్ పేర్కొంది. దీంతో లక్షలాదిమంది భారతీయ విద్యార్థులపై భారం పడనుంది. UK హోమ్ ఆఫీస్ ప్రకటన ప్రకారం, ఆరు నెలల కంటే తక్కువ కాలానికి విజిట్ వీసా ధర 15 నుండి 115 పౌండ్లకు చేరింది. విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా(Study Visa) ఫీజు దాదాపు 127 పౌండ్లనుంచి 490 చేరింది. అలాగే పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసా ఫీజు కూడాపెరగనుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ డేటా ప్రకారం, 2021-2022లో 120,000 కంటే ఎక్కువ మందే భారతీయ విద్యార్థులు యూకేలో చదువుతున్నారు. కాగా జూలైలో అక్కడి ప్రభుత్వం వర్క్, విజిట్ వీసాల ధరలో 15 శాతం పెరుగుదలను ప్రకటించింది. ప్రయార్టీ, స్టడీ వీసాలు, స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ల ఫీజును 20 శాతం పెంచింది. -
ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..
UK Flats: భూమి మీద అత్యంత విలువైనది.. కాలంతోపాటు విలువ పెరిగేది ఏదైనా ఉందంటే అది భూమి (ఇళ్లు) మాత్రమే. అన్ని దేశాల్లోనూ ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుతున్నాయి. అయితే యూకేలోని ఓ నగరంలో మాత్రం రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లను రూ.100కే విక్రయిస్తున్నారు. లూయీ నగరంలోని కార్నిష్ టౌన్ సెంటర్లో నివాసితులకు చౌకగా ఇళ్లు అందించేందుకు 6,40,000 పౌండ్ల (రూ.6.6 కోట్లు) విలువైన గ్రేడ్ 2 లిస్టెడ్ ఫ్లాట్లను 1 పౌండ్ (రూ.103)కే విక్రయించడానికి కౌన్సిల్ అంగీకరించింది. 11 కోస్ట్గార్డ్ ఫ్లాట్లను త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్కు విడుదల చేయాలన్న సిఫార్సును కార్న్వాల్ కౌన్సిల్ క్యాబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా గ్రాంట్ ఫండింగ్ ద్వారా 1 మిలియన్ పౌండ్లతో పునరుద్ధరణ పనులను చేపట్టడానికి ముందుకొచ్చింది. డిప్యూటీ కౌన్సిల్ లీడర్ డేవిడ్ హారిస్ ప్రకారం.. ‘ఈ ఫ్లాట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడంలేదు. దీని వల్ల ఇప్పటికే రెండో ఇంటి యాజమాన్యం, హాలిడే హోంలు అధిక స్థాయిలో ఉన్న లూయీ పట్టణంలో చౌక గృహ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కమ్యూనిటీ-నేతృత్వంలోని పునరాభివృద్ధి పథకం ఈ ఫ్లాట్లను పేదలకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తుంది. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఫీచర్!) అధిక సంఖ్యలో హాలిడే హోమ్లు ఉండే ఇంగ్లాండ్లో సెకండ్ హోమ్లు, హాలిడే హోమ్ల సమస్య కార్న్వాల్లో మరీ ఎక్కువగా ఉంది. 2021లో ఈ ప్రాంతంలో 13,000 సెకండ్ హోమ్లు ఉన్నట్లుగా కార్న్వాల్ లైవ్ నివేదించింది. కౌన్సిల్ 2021లో చేపట్టిన నార్త్ రోడ్ భవనం పునర్నిర్మాణాన్ని ఆర్థికంగా పనికిరానిదిగా, అవసరానికి మించినదిగా ప్రకటించారు. అధిక నిర్వహణ ఖర్చులను నివారించేందుకు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. లూయి కౌన్సిలర్లు ఎడ్వినా హన్నాఫోర్డ్, అర్మాండ్ టామ్స్ మద్దతుతో త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ 1 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ఖర్చుతో ఆస్తుల పూర్తి పునరుద్ధరణను చేపట్టడానికి ముందుకొచ్చింది. అర్హతలు ఇవే.. ఇదే విధమైన పథకాన్ని 2015లో స్టోక్-ఆన్-ట్రెంట్ కౌన్సిల్ అమలు చేసింది. వీటిపై ఆసక్తి ఉన్నవారు కనీసం ఐదేళ్ల పాటు కొత్త ప్రాపర్టీలలో ఉండటానికి అంగీకరించాలి. ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. కుటుంబ ఆదాయం 18,000 నుంచి 25,000 పౌండ్ల మధ్య ఉండాలి. కొత్త పథకం పోర్ట్ల్యాండ్ స్ట్రీట్ ప్రాంతంలో ఉంటుందా లేదా నగరంలోని మరొక వెనుకబడిన ప్రాంతంలో ఉంటుందా అన్నది ఇంకా నిర్ణయించలేదని హౌసింగ్ క్యాబినెట్ సభ్యుడు, కౌన్సిలర్ రాండీ కాంటే పేర్కొన్నారు. -
దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్!
ఉద్యోగులు కరోనా మహమ్మారి భారీ నుంచి తప్పించుకున్నా.. లేఆఫ్స్ భారీ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇప్పటికే లెక్కకుమించిన ఉద్యోగులను తొలగించిన దిగ్గజ కంపెనీలు ఇప్పటికి కూడా అదేపనిలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో డెలాయిట్ (Deloitte) 3శాతం ఉద్యోగులను తొలగిస్తూ నివేదికలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మల్టి నేషనల్ ప్రొఫెషనల్ సర్వీస్ నెట్వర్క్ డెలాయిట్ 'యూకే' (UK)లో 800 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఈ సంస్థలో అక్కడ మొత్తం 27,000మంది పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ కొంత మందగమనంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఖర్చులను తగ్గించుకోవడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి పెద్దగా ప్రాజెక్టులు రావడం లేదని, రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రభావం టెక్ కంపెనీల మీద ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: ఒక్క ఐడియా విలువ రూ.10 లక్షలు.. ట్రై చేసుకోండి! ఇదిలా ఉండగా.. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గణనీయమైన తొలగింపులను ప్రకటించి ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. 2023 జనవరిలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు గతంలో నివేదికలు వెల్లడించాయి. అమెజాన్ కంపెనీ కూడా ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు 18,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ జాబితాలో మెటా, ట్విటర్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. -
కూతురిపై ప్రేమ: గిన్సిస్ వరల్డ్ రికార్డ్ కోసం ఏం చేశాడో తెలుసా?
Mark Owen Evans Record గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం కొంతమంది ఒక గోల్. ఎవరూ చేయడానికి సాహసించని పనులు , విన్యాసాలతో తమ పేరును ప్రత్యేకంగా నిలుపుకోవాలని చూస్తాడు. అయితే ఇక్కడ ఓ 49 ఏళ్ల వ్యక్తి వ్యక్తి తన గారాల పట్టి మీద ఉన్న ప్రేమను అనూహ్యంగా చాటుకున్నాడు. యూఏకి చెందిన మార్క్ ఓవెన్ ఇవాన్స్ ఏకంగా తన ముద్దుల కుమార్తె పేరును శరీరంపై 667 సార్లు టాటూలా వేయించుకుని పంచ రికార్డు సాధించాడు. ఇలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరును నమోదు చేసుకోవడం ఇది రెండో సారికావడం విశేషం. అలా తన సొంత రికార్డును తానే అధిగమించాడు. 2017లో తొలిసారిగా తన కూతురు పేరును తన వీపుపై 267 సార్లు టాటూ వేయించుకుని రికార్డు సృష్టించాడు. కానీ 2020లో అమెరికన్ డైడ్రా విజిల్ తన పేరు మీద 300 సార్లు టాటూ వేయించుకోవడం ద్వారా రికార్డును బద్దలు కొట్టడంతో ఎవాన్స్ ఆ రికార్డును కోల్పోయాడు. తాజాగా ఇవాన్స్ తన కూతురు పేరు 'లూసీ'పై 667 టాటూలు వేయించుకుని తన రికార్డును తానే బ్రేక్ చేయడమేకాదు తమ తండ్రీకూతుళ్లు బంధం సాటిలేనిదని నిరూపించాడు. ఇద్దరు టాటూ ఆర్టిస్టులు గంటపాటు శ్రమించి మొత్తం భాగాన్ని పూర్తి చేశారు. ఒక్కో కాలుపై 200, మొత్తం 400 టాటూలతోపాటు ఈ మొత్తం టాటూలు పూర్తి కావడానికి ఐదున్నర గంటలు పట్టిందని ఇవాన్స్ మీడియాకుతెలిపారు. ఇది విచిత్రంగా ఉన్నా.. రికార్డును తిరిగి దక్కించు కోవడం, దీన్ని తన కుమార్తెకు అంకితం చేయడం సంతోషంగా ఉందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. -
చిన్నారుల చేతులకు మెహెందీ పెడుతున్నారా..?
గోరింటాకుతో తయారు చేసే హెన్నా తలకు మంచి కండిషనర్గా ఉంటుందని పెడుతుంటారు. అందరికీ తెలిసిందే కానీ ఒక్కొసారి అది పడకపోతే లేనిపోని చర్మ సమస్యలు ఎదుర్కొనక తప్పదు. అందరికి ఒకేలా ఉండదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలావరకు సహజసిద్ధంగా తయారు చేసిన హెన్నాతో ఇబ్బందులు ఉండవు. ఒక్కొసారి అవి బాగా ఎరుపుగా పండాలని వాటిలో కెమికల్స్ కలుపుతారు. అవి అందరి శరీరానికి పడవు. రియాక్షన్ ఇచ్చి కాలినగాయాల మాదిరిగా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి చేదు అనుభవమే యూకేలో ఓ చిన్నారికి ఎదురైంది. వివరాల్లోకెళ్తే..కిర్ట్సీ న్యూటన్ తన ఏడేళ్ల చిన్నారి మటిల్డాను టర్కీలో విహారయాత్రకు వెళ్లింది. అక్కడ ఓ హోటల్లో చిన్నారి చేతిపై బ్లాక్హెన్నాతో(మెహందీ) టాటు వేయించుకుంది. సీతాకోక చిలుక మాదిరి డిజైన్ వేయించుకుంది. ఆ తర్వాత అది రియాక్షన్ ఇచ్చి దురద, మంట రావడం మొదలైంది చిన్నారికి. దీంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా ఆ హెన్న టాటు కారణంగా ఇలా అయ్యిందన్నారు. అందులో ఉండే కెమికల్స్ చర్మ సంబంధిత అలెర్జీలు ఇస్తాయని చెప్పారు. దీంతో ఆ టాటు వేయించుకున్న ప్రదేశం అంతా కాలిన గాయంలా ఎర్రగా అయిపోయింది. వైద్యులు దురద రాకుండా, పుండులా ఏర్పడకుండా ఉండేలా యాంటి బయోటిక్ క్రీమ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి నెమ్మదిగా కోలుకుంటోంది. జుట్టుకి కూడా వినియోగించే ఈ బ్లాక్ హెన్నా ఇంత చేటు తెస్తుందని ఊహించలేదని ఆ చిన్నారి తల్లి వాపోయింది. ఇక తలకు కూడా ఆ హెన్నాను ఉపయోగించాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది. దయచేసి తల్లిదండ్రులు ఇలాంటివి చిన్నారులకు అలవాటు చేయకండి. అవి మీ చిన్నారుల లేత చర్మాన్ని గాయపరుస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. సహజంగా గోరింటాకు చెట్లతో ఉన్న వాటితోనే ఏమైన వేసుకోండి గానీ ఇలా ఏదైనా హోటల్, షాపింగ్ మాల్లో హెన్న టాటులు(మెహిందీలు) వేయించుకోకండని హెచ్చరించారు. సహజ సిద్ధంగా గోరింటాకు చెట్లతో తయారు చేసిన వాటినే నేరుగా పెట్టకోకండి అని సూచిస్తోంది ఆ బాధిత చిన్నారి తల్లి. (చదవండి: ఆ ఒక్క సంజ్ఞతో..ఆ ఆవుల మందను కదలకుండా చేశాడు!) -
జీ20 సమ్మిట్: ఆకట్టుకున్న అక్షత, గ్రాండ్గా గుడ్బై, రిషీ వీడియో వైరల్
జీ 20 సమ్మిట్ లో యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతదేశంలో మూడు రోజుల పాటు జరిగిన G20 సమ్మిట్లో UK ప్రధాన మంత్రి రిషి సునక్ ,భార్య అక్షతా మూర్తి హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా భారతీయ కుటుంబానికి చెందిన అక్షతామూర్తి కట్టు బొట్టుతో తనదైన శైలితో మరింత ఆకట్టుకున్నారు. రెండు రోజులపాటు సాగిన భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. An important trip to India for the G20, delivering for the UK on the world stage 🇬🇧 👇 pic.twitter.com/H3MvrCJ7zg — Rishi Sunak (@RishiSunak) September 11, 2023 ఈ సందర్బంగా భారతదేశానికి వీడ్కోలు పలుకుతున్నప్పుడు సంప్రదాయ చీరలో అత్యంత మనోహరంగా కనిపించారు అక్షత. రా మ్యాంగో లేబుల్ నుండి పింక్ చీర,చెవిపోగులు, చిన్న బిందీతో ఇండియన్ లుక్తో అక్షతా మూర్తి తన భారత పర్యటనను ముగించారు. అంతేకాదు భారత సంతతికి చెందిన ఈ జంట ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి ముఖ్యంగా అక్షత సాంప్రదాయ చీర లుక్ చర్చనీయాంశంగా నిలిచింది. యూకే ఆధారిత సస్టైనబుల్ లేబుల్ విత్ నథింగ్ అండర్ నీత్తో కూడిన తెల్లటి బటన్ డౌన్ షర్ట్ను ధరించాలరు. ఢిల్లీలో పూల ప్రింటెడ్ స్కర్ట్తో భారత మండపంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నిర్వహించిన G20 డిన్నర్లో ఇండో-వెస్ట్రన్ మ్యాక్సీ డ్రెస్ ధరించారు. పర్యటన ముగించుకొని వెడుతున్న సందర్బంగా రిషి సునక్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను,వీడియోను పంచుకున్నారు.దీంతో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) దేశ రాజధాని నుండి బయలుదేరే ముందు, అక్షత , రిషి సునక్ అక్షరధామ్ ఆలయంలో పూజలు చేశారు. ఇక్కడ కూడా ఆమె పింక్ పలాజో , పింక్ దుపట్టాతో కూడిన ఆకుపచ్చ కుర్తాతో కనిపించగా, మరోవైపు, బ్రిటన్ ప్రధాని అధికారిక దుస్తులు ధరించారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన మిల్లెట్ ఎగ్జిబిషన్కు హాజరైనప్పుడు, అక్షత లిలక్ మార్బుల్-ప్రింట్ డ్రెస్లో కనిపించారు. కాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి , రచయిత్రి సుధా మూర్తి కుమార్తె అక్షత అన్న సంగతి తెలిసిందే. -
బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో..
పదహారు సంవత్సరాల బ్రిటీష్–పాకిస్థానీ మహ్నూర్ ఛీమ లండన్లోని జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (జీసిఎస్ఈ) లెవెల్లో 34 సబ్జెక్లలో టాప్ గ్రేడ్ సాధించి రికార్డ్ సృష్టించింది. గణిత శాస్త్రం, ఖగోళశాస్త్రంలాంటి శాస్త్రాలు, ఫ్రెంచ్, లాటిన్... మొదలైన భాషలలో అద్భుతమైన ప్రతిభ చూపుతుంది మహ్నూర్. ఆమె ఎంచుకున్న 34 సబ్జెక్ట్లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఫిల్మ్ స్టూడియోస్, సైకాలజీ... మొదలైన సబ్జెక్ట్లు ఉన్నాయి. ‘ఇది మహ్నూర్కు మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఈతరంలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయం’ అని ట్వీట్ చేశారు పాక్ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ‘వైద్యురాలిగా పదిమందికి సేవ చేయాలి’ అనేది తన జీవిత ఆశయంగా చెబుతుంది మహ్నూర్. It is always very uplifting to meet bright young minds like Mahnoor Cheema. By securing A* in a wide range of subjects from Maths and Astronomy to French and Latin, Mahnoor has not only made all of us proud but also has also set a great example for our children. During the past… pic.twitter.com/ZAc3WCFL8k — Shehbaz Sharif (@CMShehbaz) September 4, 2023 (చదవండి: మీకు తెలుసా!..బ్రెడ్తో పాదాల పగుళ్లు మాయం!) -
భారత్ను ఇలా చూడడం గర్వంగా ఉంది: రిషి సునాక్
ఢిల్లీ: ఇండియాకు రావడం చాలా సంతోషంగా ఉందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. మోదీ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని అన్నారు. వసుధైక కుటుంబం అనే గొప్ప థీమ్తో జీ20 సమావేశం జరుగుతున్నందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. జీ20 నిర్వహణకు భారత్ సరైన వేదిక అని రిషి సునాక్ తెలిపారు. భారత్-బ్రిటన్ మధ్య ప్రత్యేకమైన వాణిజ్య ఒప్పందానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. జీ20 కార్యక్రమాన్ని భారత్ దిగ్విజయంగా నిర్వహిస్తున్నందున గర్వంగా ఉందని అన్నారు. #WATCH | G 20 in India | On G20 India's theme 'Vasudhaiva Kutumbakam', UK PM Rishi Sunak says, "I think it is a great theme. When you say 'One Family', I am an example of the incredible living bridge that PM Modi described between the UK and India - almost 2 million like me in… pic.twitter.com/ALtze1jpPt — ANI (@ANI) September 8, 2023 జీ20 థీమ్ వసుధైక కుటుంబంపై హర్షం వ్యక్తం చేశారు రిషి సునాక్. ఒకే కుటుంబం థీమ్.. భారత్-యూకే మధ్య స్నేహసంబంధాలకు సరిగ్గా సరిపోతుందని చెప్పారు. ఖలిస్థానీ వివాదంపై మాట్లాడిన రిషి సునాక్.. యూకేలో ఇలాంటి శక్తులకు స్థానం లేదని చెప్పారు. #WATCH | G-20 in India | On the Khalistan issue, United Kingdom Prime Minister Rishi Sunak to ANI says, "It's a really important question and let me just say unequivocally that no form of extremism or violence like that is acceptable in the UK. And that's why we are working very… pic.twitter.com/443p1vz1pS — ANI (@ANI) September 8, 2023 భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపిన రిషి సునాక్.. తన కుటుంబం ఇక్కడి నుంచే ప్రారంభం అయిందని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించనని అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ తీరుపై ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇండియా శాంతివైపే ఉంటుందని అన్నారు. #WATCH | G 20 in India | On G20 India's theme 'Vasudhaiva Kutumbakam', UK PM Rishi Sunak says, "I think it is a great theme. When you say 'One Family', I am an example of the incredible living bridge that PM Modi described between the UK and India - almost 2 million like me in… pic.twitter.com/ALtze1jpPt — ANI (@ANI) September 8, 2023 ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్కు డ్యాన్సులు.. -
యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్కు రిషి
-
రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు..
ఢిల్లీ: జీ20 సమావేశానికి హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తదితరులకు రెండు రోజుల పాటు దేశ రాజధానిలో అతిథ్యం ఇవ్వనున్నారు. భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే జీ20 కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కానున్న విషయం తెలిసిందే. రిషి సునాక్.. బ్రిటన్కు చెందిన తొలి భారత సంతతి ప్రధానమంత్రి రిషి సునక్ సెప్టెంబర్ 8న శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు. ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్లో రిషి సునాక్కు బస ఏర్పాట్లు చేశారు. జో బైడెన్.. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకుంటారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి VK సింగ్ స్వాగతం పలుకుతారు. జో బైడెన్కు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బస ఏర్పాట్లు చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన జీ20 సమావేశాలకు హాజరవుతారా..? లేదా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ బైడెన్కు కరోనా నెగటివ్ రావడంతో ఆయన భారత్కు రానున్నారు. జస్టిన్ ట్రూడో.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రేపు సాయంత్రం 7 గంటలకు భారత్కు చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు ఆహ్వానం పలుకుతారు. ట్రూడో ఢిల్లీలోని లలిత్ హోటల్లో బస చేస్తారు. కెనడాలో ఈ మధ్య ఖలిస్థానీ ఉగ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన భారత్కు రావడం ప్రధాన్యత సంతరించుకుంది. జపాన్ ప్రధాని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రేపు భారత్కు వస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పాలం ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగుతారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆహ్వానం పలుకుతారు. కిషిదా భారత్కు రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో భారత్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన.. ప్రధాని మోదీతో సమావేశమై భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇదీ చదవండి: Sanathana Dharma Row: అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. -
బ్రిటన్లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!
బ్రిటన్లోని రెండవ అతిపెద్ద నగరమైన బర్మింగ్హామ్ (Birmingham) దివాలా (bankrupt) తీసింది. స్థానిక సంస్థ అయిన బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ మిలియన్ల పౌండ్ల వార్షిక బడ్జెట్ లోటు కారణంగా దివాలా తీసినట్లు ప్రకటించింది. బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆధీనంలో పాలన సాగిస్తోంది. 100 మందికి పైగా కౌన్సిలర్లతో ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక సంస్థ ఇది. నగదు లోటుతో సంస్థ దివాలా తీసిందని, పౌరుల రక్షణ, ఇతర చట్టబద్ధమైన సేవలను మినహాయించి అన్ని కొత్త ఖర్చులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు సెక్షన్ 114 నోటీసును జారీ చేసింది. సంక్షోభానికి కారణమదే.. "సమాన వేతనాల చెల్లింపు" చేపట్టాల్సి రావడంతో తీవ్ర సంక్షోభం తలెత్తిందని, ఇందు కోసం ఇప్పటిదాక 650 మిలియన్ పౌండ్ల నుంచి 760 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశామని, నిధుల లోటుతో భయంకరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడిందని కౌన్సిల్ పేర్కొంది. ఈ మేరకు కౌన్సిల్ తాత్కాలిక ఫైనాన్స్ డైరెక్టర్ ఫియోనా గ్రీన్వే స్థానిక ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 114(3) కింద ఒక నివేదికను విడుదల చేశారు. 2012లో బర్మింగ్హామ్ కౌన్సిల్పై కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.1 బిలియన్ల పౌండ్ల సమాన వేతన క్లెయిమ్లను చెల్లించింది. ఈ కేసులో యూకే సుప్రీం కోర్ట్ 174 మంది మహిళా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అథారిటీ పరిధిలో పనిచేసే మహిళా టీచింగ్ అసిస్టెంట్లు, క్లీనర్, క్యాటరింగ్ సిబ్బంది, చెత్తను సేకరించేవారు, వీధులు శుభ్రం చేసే కార్మికులు పురుషలతో సమానంగా బోనస్ ఇవ్వాలని కేసు వేశారు. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల మాదిరిగానే, బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ కూడా వయోజన సామాజిక సంరక్షణ డిమాండ్, ఆదాయ తగ్గుదల కారణంగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని కౌన్సిల్ నాయకుడు జాన్ కాటన్, డిప్యూటీ లీడర్ షారన్ థాంప్సన్ ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యత అని వివరించారు. -
పేదరికం పై పైకి!
యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది. – గారెత్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్ (కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు? పేదరికం పెంచిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది. ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం యూకేలో కోవిడ్ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది. కోవిడ్కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం. యూరప్ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్ కమిషన్ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్ యూరప్ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లెక్క అలా.. మనది ఇలా రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు. ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది. 2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి. 16.3 కోట్ల దిగువ మధ్యతరగతి? రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. పేదరికంపై నడ్జ్ ఫౌండేషన్ పోరు ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం. వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్ ఫౌండేషన్ -
నలుమూలల సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే "పండుగ"!
యునైటెడ్ కింగ్డమ్లోని స్కాట్లండ్ రాజధాని ఎడన్బరా నగరంలో ఏటా ఆగస్టులో జరిగే ఎడిన్బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలుస్తోంది. ఆగస్టు మొదటివారం నుంచి చివరి వారం వరకు మూడువారాలకు పైగా జరిగే ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేస్తాయి. ఈ ఏడాది ఆగస్టు 5న మొదలైన ఈ వేడుకలు ఆగస్టు 28 వరకు జరగనున్నాయి. యూరోపియన్, అమెరికన్, ఆఫ్రికన్, ఆసియన్ సంస్కృతులకు చెందిన ఎందరో కళాకారులు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలపై తమ కళాప్రదర్శనలు చేస్తారు. భారతీయ కళాకారులు కూడా ఈ వేదికలపై శాస్త్రీయ, జానపద సంగీత నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నేపథ్యం ఎడిన్బరాలో ఈ వేడుకలు దాదాపు డెబ్బయి ఐదేళ్లుగా జరుగుతున్నాయి. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు రుడాల్ఫ్ బింగ్ అనే నాజీ కాందిశీకుడు ఎడిన్బరా చేరుకున్నాడు. కొంతకాలానికి అతడు ఎడిన్బరాలోని గ్లైండెబోర్న్ నాటక సంస్థకు జనరల్ మేనేజర్గా ఎదిగాడు. ప్రపంచం నలుమూలలకు చెందిన సంస్కృతులన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చి కళా సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో బింగ్ తన మిత్రుడు హెన్రీ హార్వే వుడ్తో కలసి ఎడిన్బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ వేడుకలను ప్రారంభించాడు. ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి దేశ దేశాలకు చెందిన కళాకారులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి ప్రదర్శనల ద్వారా తేలికగా ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని వారు భావిస్తుంటారు. ఈ వేడుకల సందర్భంగా ఎడిన్బరా వీథుల్లో భారీ ఎత్తున ఊరేగింపులు నిర్వహిస్తారు. ఊరేగింపులో పలువురు తమ కళానైపుణ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంటారు. సాయంత్రం వేళల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా ప్రదర్శనలు భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈసారి జరుగుతున్న వేడుకల్లో ఎడిన్బరా నగరం ఎటుచూసినా కోలాహలంగా పండుగ కళతో కనిపిస్తోంది. (చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు")