మెగాస్టార్‌కు ఆ దేశ పౌరసత్వం.. ఆయన టీమ్ ఏమన్నారంటే? | Megastar Chiranjeevi Team Clarity On Honorary UK Citizenship | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: మెగాస్టార్‌కు గౌరవ పౌరసత్వం? స్పందించిన టీమ్

Mar 4 2025 3:40 PM | Updated on Mar 4 2025 3:48 PM

Megastar Chiranjeevi Team Clarity On Honorary UK Citizenship

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మువీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌లో చిరు సందడి చేశారు. అయితే తాజాగా మెగాస్టార్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుకు యూకే గౌరవ పౌరసత్వం అందించనుందని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ టీమ్ స్పందించింది. ఇటీవల ఓ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి తాను లండన్‌ వెళ్తన్నట్లు చెప్పడంతో ఈ ఈ వార్తలొచ్చాయి.

 ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందన్న వార్తలు అవాస్తవమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు రాసేముందు ముందుగా ధృవీకరించుకోవాలని తెలిపింది. విశ్వక్ సేన్ మూవీ లైలా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెగాస్టార్ లండన్‌ వెళ్లనున్నట్లు తెలిపారు. లండన్‌లో ఓ ఈవెంట్‌లో తనకు సన్మానం జరగనుందని మెగాస్టార్ తెలిపారు. దీంతో కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సిటిజెన్‌షిప్ గురించే లండన్‌ వెళ్తున్నారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా.. చిరంజీవి చివరిసారిగా భోలా శంకర్‌లో కనిపించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర్ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో చిరు జతకట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement