Movie News
-
Karmastalam: యోధుడిలా అరవింద్ కృష్ణ
అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. రాయ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ కృష్ణ పాత్రకు సంబంధించిన లుక్ను, మేకింగ్ వీడియోని షేర్ చేశారు.అరవింద్ కృష్ణ ప్రస్తుతం సూపర్ హీరో పాత్రలతో ఆడియెన్స్ను ఆకట్టునేందుకు రెడీ అవుతన్నారు. ఇలాంటి టైంలో ఓ యోధుడిలా ‘కర్మస్థలం’లో కనిపించబోతోన్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్, మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇక సెట్లోనే అరవింద్ కృష్ణ చేస్తున్న వర్కౌట్స్, రిహార్సల్స్ అన్నీ కూడా ఎంతో నేచురల్గా ఉన్నాయి. గుర్రపు స్వారీ కూడా ఈ చిత్రంలో హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. విజువల్స్, బీజీఎం ఈ సినిమాను అదనపు ఆకర్షణ అయ్యేలా ఉంది. -
'అందుకే నాపై దుష్ప్రచారం'.. పోలీసులకు మంగ్లీ ఫిర్యాదు
టాలీవుడ్ సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది సుబ్బారావుపై కంప్లైంట్ ఇచ్చారు. తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సింగర్ మంగ్లీ తన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. ఇటీవల న్యాయవాది సుబ్బారావు తన కార్యాలయం వద్దకు వచ్చి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు.ఆ డబ్బులు ఇవ్వనందుకే తనపై మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుబ్బారావు డబ్బులు డిమాండ్ చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయని మంగ్లీ పోలీసులకు తెలిపారు. తనపై పెట్టిన కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని సింగర్ అన్నారు. కాగా.. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ రూ.10 కోట్లు మోసం చేశారని పంజాగుట్ట పోలీస్స్టేషన్లో అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
నెంబర్వన్.. అల్లు అర్జున్ ఆలోచన అదేనా?
స్టార్స్ జీవితంలో ఒక భారీ విజయం దక్కడం సులభమే కావచ్చు... కానీ దానిని నిలబెట్టుకోవడం కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ డమ్ అనేది చాలా అస్థిమితంగా మారింది. ఖచ్చితంగా నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు ఒక్కో ఏడాది ఒక్కో హీరో చిత్రానికి పట్టం కడుతుండడంతో నెంబర్లాట దోబూచులాటగా మారుతోంది.ఈ పరిస్థితిలో ప్రస్తుతానికి మాత్రం ఇటు కలెక్షన్స్ పరంగా చూసినా అటు రెమ్యునరేషన్ పరంగా చూసినా, అల్లు అర్జున్ నెం1గా నిలుస్తున్నాడనేది నిర్వివాదం. తాజాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన చిత్రం ’రాకా’ కోసం ఏకంగా రూ.300 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుని సమకాలీన హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు బన్నీ. ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకూ 5, 6 స్థానంలో ఉన్న స్టైలిష్ స్టార్ కాస్తా ఒక్క ఉదుటున నెం1 ఐకాన్ స్టార్గా చేసింది పుష్పరాజ్ పాత్ర. ప్రస్తుతం అల్లు అర్జున్ హవా నడుస్తున్నప్పటికీ ఇది వన్ సినిమా వండర్ అనీ త్వరలోనే మరో టాప్ హీరో నెం1 ఛెయిర్ని ఆక్రమిస్తాడని సినీ పండితుల్లో పలువురు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ మాత్రం ఈ ఊహాగానాలను పటాపంచలు చేయాలని, తన స్టార్ డమ్ని మరింత పెంచే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం 2030 వరకూ తన ప్లేస్ని శాశ్వతం చేసుకునేలా తదుపరి ప్రాజెక్టులను ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు.పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎంపికలు చూస్తే ఆ విషయం సులభంగా అర్ధమవుతుంది. జవాన్ లాంటి భారీ హిట్ ఇచ్చిన అట్లీని తన తదుపరి సినిమాకు ఎంపిక చేసుకోవడం ద్వారా తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాదిలో భారీ హిట్స్కి కేరాఫ్గా నిలిచిన లోకేష్ కనగరాజ్, అదే విధంగా మళయాళ పరిశ్రమకు చెందిన బాసిల్ జోసెఫ్లను ఐకాన్ స్టార్ జోడీ కట్టడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం, అతని రాబోయే ప్రాజెక్ట్లతో ముడిపడి ఉన్న ఇతర పేర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే విభిన్నమైన జానర్ల మిశ్రమాన్ని అందించడం ద్వారా భారతీయ చిత్రసీమలో తనదైన హవాను ఆయన కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు అర్ధం అవుతుంది.ఉత్కంఠభరితమైన కథనాలకు చిరునామా లాంటి సందీప్ రెడ్డి వంగా , విభిన్న తరహా యాక్షన్ విన్యాసాలకు కేరాఫ్ లాంటి ప్రశాంత్ నీల్ , జనరంజక చిత్రాలకు పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ విలక్షణమైన శైలికి మరోపేరు లాంటి బాసిల్ జోసెఫ్, వైవిధ్యభరిత హీరోచిత కధలను తెరకెక్కించే లోకేష్ కనగరాజ్ ల వరకు ఆయన ఎంపిక వెనుక ఆలోచనల గాఢతను మనకు తెలియజెబుతాయి. ఈ దర్శకుల చిత్రాలు కమర్షియల్ సక్సెస్కు గ్యారెంటీతో పాటు అవకాశాన్ని బట్టి సెన్సేషన్ను కూడా సృష్టించగలవు. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే నెం1 కుర్చీకి అత్యంత సమీపంలో ఉంటూ, స్పిరిట్ వంటి సినిమాలతో దూసుకొస్తున్న ప్రభాస్ , రాజమౌళి సినిమా ద్వారా మహేష్ బాబు...లతో పాటు పలువురు టాప్ హీరోలు బన్నీ దక్కించుకున్న స్థానానికి గట్టి పోటీని ఇవ్వడం ఖాయం. వీటిని తిప్పికొట్టేలా బన్నీ ఎంపికలు ఉంటాయా లేదా అనేది త్వరలోనే తేలుతుంది. -
ఆశా భోస్లే మరణం.. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే?
లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం వేళ ఆశా సింగర్గా ఎంత సంపాందించారన్న విషయంపై బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆస్తులు దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై తన గాత్రాన్ని వినిపించిన ఆమె బాగానే సంపాదించారు. అంతే కాకుండా ఆమె సొంత రెస్టారెంట్ను ఆశాస్ పేరుతో ప్రారంభించారు. ఇది దుబాయ్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో విస్తరించింది. ఆశా భోస్లే తన డబ్బును రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజా నివేదికల ప్రకారం కేవలం ముంబై, పూణేలలోని విలాసవంతమైన గృహాలతో పాటు ఆమె ఆస్తుల విలువ రూ.80 -రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. -
'అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయాం'.. మెగాస్టార్, ఎన్టీఆర్ నివాళి
ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మరణంపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె గాత్ర తరతరాలుగా ఎన్నో రకాల భావోద్వేగాలను మోసుకొస్తూ.. భారతీయ సినిమాకు ఓ శాశ్వతమైన తోడుగా నిలిచిందని ట్వీట్ చేశారు. ఆమె ప్రతి పాటకు తీసుకొచ్చిన అప్రయత్నమైన సౌందర్యాన్ని.. బహుముఖ ప్రజ్ఞను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని మెగాస్టార్ రాసుకొచ్చారు. భారతీయ సినిమా అత్యంత అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయిందన్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చిరు పోస్ట్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ నివాళి..లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారి మరణ వార్త విని తీవ్ర బాధపడ్డానని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆమె మధురమైన గాత్రం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణనాడిగా నిలిచిందన్నారు. ఆమె స్వరం లక్షలాది హృదయాలను తాకిందని.. ఆమె తరతరాలుగా నిలిచిపోయే వారసత్వాన్ని వదిలివెళ్లారని సంతాపం వ్యక్తం చేశారు. అది ఎల్లప్పుడూ గౌరవంతో, ప్రేమతో గుర్తుంచుకోవాలని.. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే సేవలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.లెజండరి సింగర్, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) ఇవాళ కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. Growing up meant waking up to melodies that felt like home, and so many of them carried the voice of Asha Bhosle ji.From old radios in the morning to late-night songs playing softly in the background, she was always there, without us even realizing how deeply she shaped our… pic.twitter.com/OV8Ythx6ms— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) April 12, 2026 Asha Bhosle ji’s voice has been a timeless companion to Indian cinema, carrying a spectrum of emotions across generations. I have always admired the effortless grace and versatility she brought to every song.Indian cinema has lost one of its most irreplaceable voices. My… pic.twitter.com/3zpUS7MqNj— Chiranjeevi Konidela (@KChiruTweets) April 12, 2026 Deeply saddened by the news of Asha Bhosle ji’s passing. Her magical voice was the heartbeat of Indian cinema for decades and touched millions of hearts. She leaves behind a legacy that will live on for generations and will always be remembered with respect and love. My deepest… pic.twitter.com/U81F2NBBeD— Jr NTR (@tarak9999) April 12, 2026 -
మృణాల్.. టాలీవుడ్ హీరోనే పెళ్లి చేసుకో : అల్లు అరవింద్
స్టేజ్పై సరదాగా మాట్లాడే టాలీవుడ్ ప్రముఖుల్లో నిర్మాత అల్లు అరవింద్ ఒకరు. సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో ఆయన స్పీచ్ ఎప్పుడూ నవ్వించేలా ఉంటుంది. అలాగే టాలెంట్ ఉన్న యువ నటీనటులను ప్రోత్సహించేలా ఆయన మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాళ్ల ప్రేమ విషయాలను కూడా బయటపెడుతుంటాడు. అయితే ఆయనకు తెలిసి అంటాడో తెలియక అంటాడో తెలియదు కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కొన్నిసార్లు నిజమవుతుంటాయి. ఓ సినిమా ఈవెంట్లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ..‘తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు.కాబట్టి ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని దీవించగా..ఆయన మాటలే నిజమై.. వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా ఆయన మరో నటిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. సీతారామం ఫేం మృణాల్ ఠాకుర్ని కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.తాజాగా ఆయన అడివి శేష్-మృణాల్ జంటగా నటించిన ‘డెకాయిట్’ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృణాల్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. లావణ్య మాదిరే నువ్వు కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. ‘ఇంతకు ముందు ఒక అమ్మాయిని(లావణ్య త్రిపాఠి) దీవించాను. ఆమె మా వరుణ్ తేజ్ భార్య అయిపోయింది. అలాగే నువ్వు(మృణాల్) కూడా ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాకు(టాలీవుడ్) కావాలి. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని అరవింద్ నవ్వుతూ అన్నాడు. #AlluAravind to #MrunalThakur,"You should marry somebody from here (Tfi ) and settle."We all know what happened when #AlluAravind said this on stage last time🤫😙 pic.twitter.com/3F9KQxvYft— MovieMind (@_MovieMind) April 12, 2026 -
పిల్లలను ఎలా పెంచాలి?..ఆలియాకు సద్గురు సలహా ఇదే
ఆమె ఒక అగ్రగామి బాలీవుడ్ ప్రముఖుడి కుమార్తె..ఆ తర్వాత అందాల బాలీవుడ్ నటి బోలెడన్ని విజయాలు చవిచూసింది. బోలెడు మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే మాత్రమేం... నిన్నటి బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్ గత కొన్ని వారాలుగా అయోమయానికి గురవుతోంది. తన నాలుగేళ్ల చిన్నారిని ఎలా పెంచాలో తెలీక సతమతమవుతోంది. గత నవంబర్ 6, 2022న మాతృత్వంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి, ఆమె తాను చదువుతున్న పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలను ఇన్ స్ట్రాగామ్ వేదికగా తరచు పంచుకుంటూ ఉండడం దీనికో నిదర్శనం. ఈ నేపధ్యంలోనే ఆమె తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్ (సద్గురు)తో సంభాషణలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సద్గురు ముందు తాను ఎదుర్కుంటున్న సమస్య... పిల్లల పెంపకంపై సలహా ఇవ్వమని కోరడం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. అయితే దానికి సద్గురు ఇచ్చిన సలహా ఇంటర్నెట్ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెఐటిఓ) చెన్నైప్లస్ ఆధ్వర్యంలో ఇన్ కన్సర్వేషన్ విత్ మిస్టిక్ అనే థీమ్తో నిర్వహించిన ఈకార్యక్రమానికి హాజరైన ఆలియా భట్, సద్గురువుతో ఒక వ్యక్తి ఎంత సమయం నిద్రపోవాలి అనే అంశం మొదలుకుని ప్రధానంగా పిల్లల పెంపకం, ఇంటర్నెట్ యుగం, ట్రోల్స్, వైఫల్యం పట్ల భయం, అనే విషయాలపై చర్చించారు.ఈ సందర్భంగా ‘మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తమ లాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?‘ అని ఆలియా భట్ సద్గురువును అడిగారు. దీనికి సమాధానమిస్తూ.. ‘ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు.‘ ఆందోళన చెందే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వారు అంతగా ఆందోళన చెందడం ద్వారా తమకు తామే హాని చేసుకుంటారు’’ అంటూ సద్గురు అలియాకు స్పష్టం చేశారు. దీనికి స్పందిస్తూ, ఆలియా భట్, ‘పిల్లల పెంపకం అనే ఆందోళనను తల్లిదండ్రుల్లో తొలగించగలమని నేను అనుకోను. మీరు కూడా దీనిని అంగీకరిస్తారని భావిస్తున్నాను,‘ అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తె రాహాకు ఏం నేర్పించాలనే అంశంపై కూడా తాను మధనపడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దాంతో సద్గురు స్పందిస్తూ పిల్లలకు సంతోషంగా ఉండడం సహజంగానే వస్తుందని వారికి మీరు నేర్పించేంది ఏముంటుంది? అంటూ ఎదురు ప్రశ్నించారు. మీ కుమార్తె రాహాకు కష్టపడి ఏదేదో నేర్పించే బదులు సంతోషంగా ఎలా జీవించాలో తన కుమార్తె రాహా నుంచి నేర్చుకోమని సద్గురు ఆలియా భట్కు ఎదురు సలహా ఇచ్చారు. అనవసరమైన హడావిడి లేని తల్లిగా ఉండమని,జీవితంలోని ఆనందాలు ఎలా ఆస్వాదించాలో తన కుమార్తె నుంచి నేర్చుకోమని ఆలియా భట్కు సద్గురు సూచించారు. ఆ సంభాషణలో భాగంగా అలా నేర్చుకోవడం ఎలా అనేది కూడా సద్గురు ఆమెకు వివరించారని ఆయన అధికారిక యూట్యూబ్ ఛానెల్ వెల్లడించింది. ఏది ఏమైనా పిల్లల పెంపకంపై నిత్యం ఆందోళన చెందే తల్లిదండ్రుల ఆలోచనలకు అద్దం పడుతూ అలియాభట్ వేసిన ప్రశ్నకు సద్గురు ఇచ్చిన సమాధానం ఓ పెద్ద చర్చనే లేవనెత్తిందని చెప్పాలి. -
గ్లామర్తో ట్రెండ్ మార్చనున్న వైరల్ బ్యూటీ
ఇతర భాషా నటీమణులు ముఖ్యంగా ఉత్తరాది కథానాయకలకు దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉంటోంది. అలా చాలా మంది దక్షిణాది చిత్రాలలో నటిస్తూ మకాం వేస్తున్నారు. అలాంటి వారిలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరు అని చెప్పావచ్చు. ఈ మరాఠి బ్యూటీ మిస్టర్ బచ్చన్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, భాగ్యశ్రీ బోర్సే మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి. కారణం చూడగానే ఇట్టే ఆకర్షించే అందం, శరీర ఆకృతి కావచ్చు. అయితే స్టార్ హీరోల సరసన నటిస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించలేదు. అదే విధంగా తమిళంలోకి కాంత చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నటనకు మంచి పేరు వచ్చింది. కాగా ఈ అమ్మడు ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే నటించారు. అలా నటించడం వల్లే ఈ అమ్మడికి రావలసిన క్రేజ్ రావడం లేదని తెలిసి వచ్చినట్లు సమాచారం. దీంతో ఇకపై తన పాత్రల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు టాక్. అంటే ఇకపై గ్లామర్ విషయంలో కాస్త డోస్ పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాల మాట. అందులో భాగంగానే ఈ బ్యూటీ లేటెస్ట్గా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇతర కార్యక్రమాల్లోనూ మోడరన్ దుస్తులు ధరించి పాల్గొంటున్నారు. ఇలాగైనా తన ఫేట్ను మార్చుకోవాలని భాగ్యశ్రీ యతి్నస్తున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. ఇకపై ఈ అమ్మడిని మరో కోణంలో చూడబోతున్నామన్న మాట. View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
యాక్షన్ హీరోలా చూపించారు: వెంకట్
‘‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి యాక్టింగ్తో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకో వాల్సి వచ్చింది. నన్ను యాక్షన్ హీరోలా చూపించారు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో వెంకట్ చెప్పారు. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, శివ రామరాజు’ వంటి చిత్రాల్లో నటించిన వెంకట్ హీరోగా నటించిన తాజా సినిమా ‘హరుడు’.హెబ్బాపటేల్, సలోని హీరోయిన్లుగా నటించారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వీఆర్ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ–‘‘మంచి సినిమాలను మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా ‘హరుడు’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఆ మాట నిలబెట్టుకున్నాం: శర్వానంద్
‘‘నేను మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాననే తెలుగు ప్రేక్షకుల నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ‘బైకర్’ చిత్రం తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని మొదటి నుంచే చెబుతున్నాను. మంచి ఫ్యామిలీ సినిమా తీసి, ఆ మాట నిలబెట్టుకున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ మౌత్ టాక్ వల్ల మా చిత్రం అద్భుతంగా ఆడుతోంది’’ అని హీరో శర్వానంద్ తెలిపారు.అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్’. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదల అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో శర్వానంద్ మాట్లాడుతూ–‘‘అభిలాష్ మంచి తండ్రీ కొడుకుల కథ చెప్పాడు. నాకు అద్భుతమైన సినిమా అందించిన యూవీ క్రియేషన్స్కు ధన్యవాదాలు. నా వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను.ఈ ఏడాది నాకు రెండు హిట్లు వచ్చాయి’’ అని చెప్పారు. అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మా సినిమాలోని రేసింగ్తో పాటు తండ్రీ కొడుకు, భార్యాభర్తల భావోద్వేగాలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. మొదటి రోజు నుంచే థియేటర్లకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘‘మా మూవీలోని ఎమోషన్ కు ఆడియన్స్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు మాళవిక నాయర్. -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..
ముంబై: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయింత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. లోక్మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. :ఆమెకు ఐసీయూ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దాని ఆమె కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వెల్లడించారు.సినిమా పాటలతో పాటు గజల్స్, ఖవ్వాలీ, శాస్త్రీయ కచేరీలు తన మధుర గాత్రంతో మెప్పించిన ఆశా భోస్లేకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వేదిక ఏదైనా సరే తన పాటకు తిరుగులేదని లెజెండరీ సింగర్గా నిరూపించుకున్నారు. పదేళ్ల వయసు నుంచే తన పాటలతో మెప్పించిన ఆశ సుమారు 800లకు పైగా చిత్రాల్లో 12 వేల పైచిలుకు పాటలు పాడారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే.. ఎన్నో మరపురాని పాటలు ఆలపించారు. -
శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్
యాంకర్, నటి అనసూయ మరోసారి నటుడు శివాజీపై కౌంటర్ వేసింది. కొద్దిరోజుల క్రితం మహిళల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన చెత్త వ్యాఖ్యలపై అనసూయ (Anasuya)ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, తాజాగా చీర కట్టుకుని తన కుటుంబంతో పాటుగా అనసూయ గుడికి వెళ్లింది. కొందరు నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ.. శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆమె కూడా కౌంటర్ ఇచ్చింది.నెటిజన్లు షేర్ చేసిన థంబ్నైల్ ఎలా ఉండాలో తనదైన స్టైల్లో అనసూయ ఒక సలహా కూడా ఇచ్చింది 'శివాజీ సృష్టించిన చీర ధరించి తిరుగుతున్న అనసూయ అంటూ థంబ్నైల్ పెడుతారనుకున్నాను. సరైన హెడ్లైన్ కూడా ఇదే కదా.. ఎందుకంటే మేము గతంలో ఎప్పుడు చీరలు కట్టుకోలేదు. ఏమైనా పోస్ట్ చేసేముందు చూసుకోవాలి కదా..' అంటూ కౌంటర్ ఇచ్చింది. వాస్తవంగా చాలా ఈవెంట్లలో అనసూయ చీరకట్టులోనే కనిపించిన సందర్భాలు ఉన్నాయి. గుడికి వెళ్తున్న సమయంలో దాదాపు చీరకట్టులోనే వెళ్తారనే విషయం తెలిసిందే. అనసూయ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా షేర్ చేస్తున్నారు. Tappu tappu! “Sivaji srushtinchina cheera ane vastraanni dharinchi tirugutunna Anasuya” Idi kada undali header!! Endukante antaku mundu memanta asalu cheerale kattukoledu 🙄 entamma.. chuskovali kada post chesemundu 🤦🏻♀️ https://t.co/9IiFZ7PQgh— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 11, 2026 -
సతీమణి పేరుతో రిషబ్ శెట్టి బిగ్ ప్లాన్.. మరో సినిమా కష్టమేనా?
కాంతార ఫ్రాంచైజీ సినిమాలతో కన్నడ నటుడు రిషబ్ శెట్టికి పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడని వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఆయన తన సోషల్మీడియాలో పలు ఖాతాలను అన్ఫాలో చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంతార సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ను ప్రస్తుతం రిషబ్ ఫాలో కావడం లేదు. దీంతో నిర్మాత విజయ్ కిరగందూర్తో విభేదాలు కలిగాయని వార్తలు వచ్చాయి. ఇకపై కాంతార నుంచి మరో సినిమా రాకపోవచ్చని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. అయితే, ఇందులో తన సతీమణి ప్రగతి శెట్టి పాత్ర ఎక్కువగా ఉందని రూమర్స్ వస్తున్నాయి.కాంతార ఛాప్టర్-1 ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరడంతో రిషబ్ శెట్టి తన రెమ్యునరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 75 కోట్ల రెమ్యునరేషన్తో పాటు తన సతీమణి సహ-నిర్మాతగా ఉండాలని కండీషన్ పెట్టారట. ఈ ఢీల్ హోంబలే ఫిల్మ్స్కు నచ్చలేదని టాక్.. డబ్బు విషయం కంటే ఒక సినిమాకు సంబంధించి పూర్తి హక్కులు తమ సంస్థకే చెందాలని నిర్మాత విజయ్ కిరగందూర్ ఉంటారట.. ఇలాంటి కండీషన్ను వారు ఎట్టిపరిస్థితిల్లోనూ అంగీకరించరట. ఈ కారణంతోనే ఆ సంస్థకు సంబంధించిన సోషల్మీడియా ఖాతాలను రిషబ్ శెట్టి అన్ఫాలో కొట్టారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ రిషబ్ శెట్టి కలుగజేసుకుని ముందుకు వస్తేనే కాంతార నుంచి మరో సినిమా వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అసలు విషయం ఏదైనప్పటికీ రిషబ్పై సోషల్మీడియాలో విమర్శలు వస్తున్నాయి. -
‘ది ప్యారడైజ్’.. అంచనాలు పెంచేసిన సుబ్బలక్ష్మి!
దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట సోషల్లో దూసుకెళ్తున్నాయి. తాజాగా హీరోయిన్గా నటిస్తున్న కయాదు లోహర్ లుక్ని కూడా విడుదల చేశారు. కయాదు బర్త్ డే సందర్భంగా ఈ రోజు(ఏప్రిల్ 11) ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ బర్త్డే విషెస్ తెలిపారు. ఇందులో ఆమె సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ‘వెండితెర పై వెలగని తార’ మా సుబ్బలక్ష్మిని చూడండి అంటూ కయాదు పాత్రపై క్యూరియాసిటీ పెంచారు. శ్రీకాంత్ ఓదెల సినిమాలో హీరోయిన్కి చాలా ప్రాధన్యత ఉంటుంది. దసరాలో కీర్తి సురేశ్ పోషించిన వెన్నెల పాత్ర ఏ రేంజ్లో పేలిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు సుబ్బలక్ష్మి పాత్ర కూడా అదే స్థాయిలో బలంగా ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం కయాదు ఓ మధ్యతరగతి యువతిగా కనిపించబోతునట్లు సమాచారం. ఇందులో నాని ‘జడల్’ అనే పాత్ర పోషిస్తున్నాడు. విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఆగస్ట్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘యూత్’. మార్చి 19న తమిళ్లో విడుదలైన ఈ చిత్రం..అక్కడ సూపర్ హిట్ టాక్తో భారీ కలెక్షన్స్ని రాబట్టింది. ఇక అదే నెల 27న తెలుగులో విడుదలైంది. అయితే తమిళ్తో పోలిస్తే..తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో రాబోతుంది. ఏప్రిల్ 16 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.యూత్ కథేంటంటే..ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బెకరీ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. తల్లి సరోజ(దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. తండ్రికి మాత్రం ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. చదువు పక్కకు పెట్టి.. అమ్మాయిలకు సైట్ కొడుతుంటాడు. ఆయన చేష్టలకు స్కూల్లో ఏ అమ్మాయి అతని వైపు చూసేది కాదు. కానీ ఇంటర్లో మాత్రం గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్).. ముగ్గురు తన జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురి వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? బ్రేకప్స్, అవమానాలతో ప్రవీణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? తల్లి సరోజకు వచ్చిన సమస్య ఏంటి? బాగా చదువుకోవాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కోరికను ప్రవీణ్ నెరవేర్చాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Ada ennada ithu kaadhaluku vandha sodhanai? 🤭💔 pic.twitter.com/gJHkSEqa9N— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026 -
ప్రేమతో మా సినిమా చూస్తున్నారు.. ధన్యవాదాలు: అడివి శేష్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నిన్న (శుక్రవారం) రిలీజైంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి సినిమాను చూసింది ‘డెకాయిట్’ యూనిట్. అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను మేం ప్రేమతో చేశాం. మీరు కూడా ప్రేమతో చూశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రంలో సరస్వతి పాత్ర చేసిన మృణాల్ మా హీరో (నవ్వుతూ). నా బెస్ట్ ఫ్రెండ్ షానియల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం నాకు ఎమోషనల్గా అనిపిస్తోంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన సరస్వతి పాత్ర మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు మృణాల్ ఠాకూర్. ‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు షానియల్ డియో. -
అదే నిజమైన విజయం: నిహారిక
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ‘రాకాస’ వసూళ్ల పరంగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ‘రాకాస’ యూనిట్ హైదరాబాద్లో సక్సెస్మీట్ను నిర్వహించగా, బ్రహ్మాజీ, మైత్రీ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మైత్రీ రవి మాట్లాడుతూ– ‘‘నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్ సాధించాం. భవిష్యత్లో ఆమె చేసే సినిమాలన్నింటినీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ అంటే సినిమా హిట్ అయినట్లే. ‘రాకాస’ చిత్రాన్ని నమ్మి, తీసుకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు ‘థ్యాంక్స్’ అని చెప్పారు సంగీత్ శోభన్. ‘‘మా డిస్ట్రిబ్యూటర్లందరూ సంతోషంగా ఉన్నారంటే అదే నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. ఈ వేసవిలో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియన్స్ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు’’ అని చెప్పారు నిహారిక. ‘‘నా డ్రీమ్ని, నా కథను ఇంత వరకు తీసుకుని వచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కు థ్యాంక్స్’’ అని చెప్పారు మానస. పంపిణీదారులు సన్నీ, భాస్కర్, రమేశ్ యాదవ్, పాండు, సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడారు. -
డేట్ ఫిక్స్
రవిబాబు ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘రేజర్’. సురేష్ ప్రోడక్షన్స్ సంస్థ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే నెల 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలి పారు.‘‘మా నాన్న చలపతిరావుగారి జయంతి సందర్భంగా మా సినిమాను మే 8న రిలీజ్ చేస్తున్నాం. నాపై ఆయన ఆశీర్వాదాలు ఉన్నట్లుగానే ప్రేక్షకుల ఆశీర్వాదాలూ లభిస్తాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు రవిబాబు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. రాజేశ్. -
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..కేఫ్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..జిమ్లో హనీ రోజ్ కసరత్తులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
యూకేలో ఆంటీ కేసు... అనసూయ పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటి అనసూయ యాంకర్గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ దక్కించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాకుండా మహిళలపై జరిగే అన్యాయాలపై పోరాడుతూ వారికి మద్దతుగా తనవంతు పోరాటం చేస్తోంది. ముఖ్యంగా మహిళలపై ట్రోల్స్ చేసేవారికి తనదైన స్టైల్లో ఇచ్చిపడేస్తుంది.తాజాగా అనసూయ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. యూకేలో జరిగిన సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ మహిళను ఆంటీ అని పిలిచిన ఓ వ్యక్తికి లండన్లోని కోర్టు ఏకంగా రూ.1.5 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్ను అనసూయ తన ట్విటర్లో షేర్ చేసింది. హమ్ అంటూ.. ఈ తీర్పును సమర్థిస్తూ అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా.. గతంలో కొందరు నెటిజన్స్ అనసూయను సైతం ఆంటీ అంటూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్)కాగా.. గతంలో నటుడు శివాజీ మహిళల దుస్తులను ఉద్దేశించి ఓ మూవీ ఈవెంట్లో చేసిన కామెంట్స్కు అనసూయ కౌంటరిచ్చింది. మహిళలు ఎలాంటి దుస్తులైనా ధరించడం వాళ్ల వ్యక్తిగతమని పేర్కొంది. ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చని.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని అనసూయ తెలిపింది. Hmmmm…. pic.twitter.com/NlOfnWbt8l— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 9, 2026 -
భర్తతో విడాకులు.. అందుకే భరణం వదులుకున్నా: బుల్లితెర నటి
ప్రముఖ బాలీవుడ్ నటి డెల్నాజ్ ఇరానీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. హిందీలో పలు సీరియల్స్తో పాటు మూవీస్లో మెప్పించిన నటి వైవాహిక బంధం, విడాకులపై నోరు విప్పారు. తన భర్త రాజీవ్ పాల్తో విడాకుల సమయంలో తాను భరణం కంటే మనశ్శాంతికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అందుకే తనకు డివోర్స్ తర్వాత ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె వెల్లడించారు. తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమానికి హాజరైన ఈ విషయాన్ని పంచుకున్నారు.తన విడాకుల వ్యవహారం చాలా కష్టంగా సాగిందని డెల్నాజ్ ఇరానీ తెలిపారు. పార్సీ కుటుంబం నుంచి వచ్చిన తాను మొదట్లో విడిపోవాలని అస్సలు అనుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఒకరినొకరు తేలికగా తీసుకోవడంతోనే మా బంధం విచ్ఛిన్నమైందని పంచుకుంది. వ్యక్తిగత సవాళ్ల వల్ల నా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. అదే సమయంలో నా తండ్రి గుండెపోటుకు గురై మరుసటి ఏడాదే మరణించారని తెలిపింది.మాలో ఒకరు విడాకుల కోసం ఒత్తిడి చేయగా.. మరొకరు పూర్తిగా సిద్ధంగా లేరని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ నేను ఎలాంటి భరణం కోరకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. వివాదాల కంటే శాంతినే కోరుకున్నా.. స్వతంత్రంగా తన జీవితాన్ని మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నానని ఆమె స్పష్టం చేశారు.కాగా.. డెల్నాజ్, రాజీవ్ 1993లో 'పరివర్తన్' సీరియల్ సెట్స్లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దశాబ్దానికి పైగా సాగిన తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 2010లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2012లో ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు తీసుకున్న కొద్దికాలానికే ఇద్దరు కలిసి బిగ్ బాస్ షోలో కనిపించారు. ప్రస్తుతం నటి డెల్నాజ్.. డీజే పెర్సీ కర్కారియా అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో శ్రీలీల.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరోయిన్ శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే చివరిసారిగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలతో మెప్పించిన కన్నడ బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్లోనూ మెప్పించింది. పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్తో అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ ఏడాది పరాశక్తి మూవీతోనూ అలరించింది. Actress #Sreeleela visited Tirumala Tirupati Devasthanams today to seek divine blessings 🙏 pic.twitter.com/TBSdj6FQ6G— Eluru Sreenu (@IamEluruSreenu) April 9, 2026 -
'మిమ్మల్ని చూసి నిజంగా గర్వపడుతున్నా'.. ఐకాన్ స్టార్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులపై ప్రశంసలు కురిపించారు. సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడాన్ని అభినందించారు. ప్రతి ఏటా ఒక మంచి పని చేయడం.. హెచ్పీవీ వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించిన అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. మీరంతా కలిసి అద్భుతమైన పని చేశారని కొనియాడుతూ ట్వీట్ చేశారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే కార్యక్రమాన్ని స్వీకరించి.. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా ప్రోగ్రామ్ చేపట్టిన నా అభిమానులందరినీ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. మీరందరూ అద్భుతమైన పని చేశారు. మీ ప్రతి కార్యాచరణ చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోతోంది. మీ శక్తి అంతా మంచి పనులకే కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నిజంగా గర్వపడుతున్నా. ఈ గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ అమూల్యమైన మద్దతు, ప్రోత్సాహం అందించిన గౌరవనీయ మంత్రులు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల్లో శాశ్వతమైన సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల కోసం మనమందరం కలిసికట్టుగా నిలబడదాం.' అంటూ పోస్ట్ చేశారు. I am truly soo proud of all my fans for embracing the “One Good Deed Every Year” initiative and taking up a meaningful programme like the #HPVVaccine Awareness Drive. You guys have outdone yourself and it truly fills my heart seeing every activity . Soo glad all of your energy is…— Allu Arjun (@alluarjun) April 10, 2026 -
‘డైమండ్ డెకాయిట్’ మూవీ రివ్యూ
పార్థ గోపాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. సూర్య జి. యాదవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘన హీరోయిన్గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు(ఏప్రిల్10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..ఒక మనిషిని రక్షించేందుకు ప్రయత్నించిన గోపాల్ కుటుంబం చిన్నాభిన్నాం అవుతుంది. భయంకర డెకాయిట్గా పేరు తెచ్చుకున్న మునుస్వామి నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా ఎదుగుతాడు. జైలు నుంచి విడుదలైన గోపాల్ అతని గ్యాంగ్లో చేరుతాడు. అయితే బయటకు అతను మునుస్వామి నాయుడికి నమ్మకస్తుడిగా కనిపించినా, లోపల మాత్రం అమాయకులను రక్షిస్తూ డబుల్ లైఫ్ గడుపుతుంటాడు. గోపాల్ గతంలో ఎందుకు జైలుకు వెళ్లాడు? అతని అసలు లక్ష్యం ఏమిటి? వరుస హత్యలు, మరో హత్యా యత్నం వెనుక ఉన్న నిజం ఏమిటి? గోపాల్ ఎందుకు బండిపోటుగా మారుతాడు? చివరకు బయటపడే నిజాలు కథకు కీలకం అవుతాయి.ఎలా ఉందంటే..క్రైమ్, యాక్షన్, సెంటిమెంట్ కలయికతో రూపొందిన కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, సినిమా అంతర్లీనంగా ఒక హృద్యమైన ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటాయి. దర్శకుడు సూర్య జి. యాదవ్ కథను నడిపించిన తీరు బాగుంది.అసలు కథను ప్రారంభించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నా, ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగించాడు. ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్లో కథనం కాస్త ఎమోషనల్గా సాగుతుంది. స్క్రిన్ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. హీరోగా, నిర్మాతగా పార్ధ గోపాల్ రెండు విభాగాలకు న్యాయం చేశాడు. నిర్మాతగా ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరోగా బాగానే నటించాడు. యాక్షన్తో ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించాడు. దర్శకుడు సూర్య జి. యాదవ్ కథ, స్క్రీన్ప్లే, మాటలతో సినిమాను భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు.సాయి రాజు రాసిన డైలాగ్స్ సహజం ఉన్నాయి. : పీఆర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్.గోపాల్ కుటుంబం ఊరి నుంచి వెళ్లిపోయే ముందు వచ్చే పాటు బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -రేటింగ్: 2.5/5 -
దురంధర్-2 వసూళ్లు.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా మూడు వారాలైనా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 1500 కోట్లు మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దురంధర్ సీక్వెల్గా తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్లోనే సీక్వెల్ రిలీజ్ చేశారు.ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1680 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే రూ.1276 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్లో దాదాపు రూ.404 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1081 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవరాల్గా చూస్తే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరి దురంధర్-2 ఈ చిత్రాల రికార్డులు బద్దలు కొడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. Duniya mein ek ka hi raj - DHU…RAN…DHAR 🔥⁰Day-wise break-up | IndiaWeek 1: ₹690 Cr* Week 2: ₹271 Cr* DAY 16: ₹23 Cr* DAY 17: ₹27 Cr* DAY 18: ₹30 Cr* DAY 19: ₹11 Cr* DAY 20: ₹11 Cr* DAY 21: ₹10 Cr* DAY 22: ₹8 Cr* India: ₹1081 Cr* Worldwide GBOC (3… pic.twitter.com/pw6lPwb4nV— Jio Studios (@jiostudios) April 10, 2026 -
రాకా మూవీ.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న మూవీ రాకా. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు. రాకా పేరుతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తోడేలు లుక్లో ఉన్న అల్లు అర్జున్ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఐకాన్ స్టార్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా టైటిల్ రివీల్ వేళ టాలీవుడ్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ మూవీలో బన్నీ పారితోషికంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి ఐకాన్ స్టార్ ఎంత ఛార్జ్ చేస్తున్నారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం ఈ సినిమాకు అల్లు అర్జున్కు దాదాపు రూ.175 కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా చేస్తోన్న బాలీవుడ్ భామ దీపికా పదుకొణెకు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో మరో హీరోయిన్గా రష్మిక కనిపించనున్నారని టాక్. నేషనల్ క్రష్కు దాదాపు రూ. 5-7 కోట్లు చెల్లించనున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్ ఖాన్తో 'జవాన్' తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను దాదాపు రూ. 700 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీపిక పదుకొణె, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఈ చిత్రంలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. -
నయనతార ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ టాక్ ఏంటి?
వరుస బ్లాక్బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కాన్సెప్ట్ బాగున్నా.. తెరపై ఆకట్టుకునేలా తీయడంతో దర్శకుడు విఘ్నేష్ విఫలం అయ్యాడని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.కథ విషయానికొస్తే.. ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ టుడే’ మాదిరే ఈ చిత్రం కూడా ఫోన్ చుట్టూనే నడుస్తుంది. అయితే ఇందులో కథను 14 ఏళ్లు ముందుకెళ్లి..అంటే 2040లో నడుస్తున్నట్లుగా చూపించారు. అప్పటి వరకు మొబైల్, సోషల్ మీడియా ప్రభావం మన జీవితాలపై ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు విఘ్నేష్. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అంటూ ప్రేమకు కూడా ఒక ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరమైన పాయింటే కానీ.దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపై చూపించి ఉంటే బాగుండేదని సినిమా చూసిన నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. #LIK (Tamil) {2.25/5} - Lyt Idi Kuda.#LoveInsuranceKompany #LIKReview #CMReviews pic.twitter.com/qi58kxTikQ— Cinema Madness 24*7 (@CinemaMadness24) April 10, 2026#LIK - 2/5Movie has a unique futuristic concept, but the story is weak and not very engaging. PR gives a good performance and tries hard to carry the film with his energy. Some scenes and comedy work, but the slow narration and uneven screenplay make it boring at times.…— Raghavendra (@SRaghavendra87) April 10, 2026 -
కాంతార వివాదం.. అలా చేసేందుకు ఒప్పుకున్న రణ్వీర్ సింగ్
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కాంతార వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే దురంధర్ హీరో క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంకా కోర్టులో ఇంకా నడుస్తోంది. రణ్వీర్ సింగ్ సోషల్ మీడియాలో చెప్పిన సారీ సరిపోదంటూ బెంగళూరుకు చెందిన న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో పాటు కర్ణాటకలోని చాముండి ఆలయాన్ని సందర్శించాలని కోర్టు ఆదేశించింది.దీనిపై తాజాగా రణ్వీర్ సింగ్ న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. మరోసారి క్షమాపణ పత్రాన్ని సమర్పిస్తామని రణ్వీర్సింగ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ముంబైలోని సింధీ కుటుంబంలో పెరగడం వల్ల తనకు ఇక్కడి ఆచారాలు, వాటి సున్నితత్వం గురించి అవగాహన లేదని తన క్షమాపణ పత్రంలో పేర్కొన్నారు. సరైన సమయంలో చాముండి ఆలయాన్ని సందర్శించి.. తన భక్తిని చాటుకుంటానని కోర్టుకు లిఖితపూర్వకంగా అందజేశారు.అసలు వివాదం ఎంటంటే?గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కాంతార మూవీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. 'కాంతార: చాప్టర్ 1' చిత్రంలోని ఒక కీలక సన్నివేశాన్ని అనుకరించారు. రిషబ్ నటనను ప్రశంసించే సందర్భంలో రిషబ్ అద్భుతమైన నటించారు.. ముఖ్యంగా ఆడ దెయ్యం(చాముండి దైవం) మీ శరీరంలోకి ప్రవేశించే షాట్ అమోఘం అంటూ వేదికపై యాక్షన్ చేస్తూ చూపించారు. ఇదంతా తమ దైవాన్ని కించపరిచేలా రణ్వీర్ ఇమిటేట్ చేశారంటూ పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. పవిత్రమైన దైవాన్ని దెయ్యంగా సంభోధించడం కరెక్ట్ కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదంకర్ణాటక హైకోర్టుకు చేరింది. -
‘జయహో జనార్ధన’.. టైటిల్ పోస్టర్ రిలీజ్
నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘జయహో జనార్ధన’. పానుగంటి శరత్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, బీవీఎం శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటర్ గా నందమూరి హరి, కెమెరామెన్ గా విజయ్ ఠాగూర్ ఆర్ డైరెక్టర్ గా భూపతి యాదగిరి పనిచేయగా మ్యూజిక్ అందించింది చరణ్ అర్జున్.ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లాంచ్ విజనరీ డైరెక్టర్ సంపత్ నంది గారి చేతుల మీదుగా జరిగింది. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు నిర్మాత, దర్శకుడు అయిన పానుగంటి శరత్ రెడ్డి గారు.పోస్టర్ లాంచ్ తర్వాత సంపత్ నంది గారు మాట్లాడుతూ ..నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి ని మరియు మూవీ టీం ని అభినందించి ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
'కుంభమేళా' మోనాలిసాకు బిగ్ షాక్.. భర్తపై పోక్సో కేసు!
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఫేమస్ అయిన మోనాలిసా భోంస్లే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 11న కేరళలోని అరుణ్మనూర్లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో ఆమె ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి రోజుకి మోనాలిసా ఇంకా మైనరే అని..ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమేననే ఆరోపణలు వచ్చాయి. దీనికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) విచారణ జరపగా..అది నిజమేనని తేలింది. దీంతో మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది?మహాకుంభమేళాలో తన అందం, అభినయంతో నెటిజన్ల మనసు గెలుచుకున్న మోనాలిసా.. పెద్దలను ఎదురించి, ఫేస్బుక్ ద్వారా పరిచమైన ఫర్మాన్ ఖాన్ని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికి ఆమె మైనర్ అని, ఫర్మాన్ ఆమెను ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగింది. మోనాలిసా మైనర్ అని, ఈ వివాహం చెల్లదంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) కేరళ విభాగం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ రంగంలోకి దిగి లోతుగా విచారణ చేపట్టింది. కమిషన్ జరిపిన విచారణలో మోనాలిసా వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువని, ఆమె మైనర్ అని ఆధారాలతో సహా తేలింది. పెళ్లి రోజుకు ఆమె వయసు 16 సంవత్సరరాల 2 నెలల,12 రోజులు మాత్రమేనని తేలడంతో భర్త ఫర్మాన్పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. -
భారత్ సీక్రెట్ మిషన్ 'మిస్టర్- ఎక్స్' ట్రైలర్
కోలీవుడ్ నటుడు ఆర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మిస్టర్ ఎక్స్.. దర్శకుడు మను ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రుల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు. కోలీవుడ్లో ఎఫ్ఐఆర్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఫ్రేమ్ మను ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం అందిస్తుండటంతో బజ్ క్రియేట్ అయింది. ఏప్రిల్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది.దర్శకుడు మను ఆనంద్ మిస్టర్ ఎక్స్ కథను గతంలో ఒకసారి మీడియాతో పంచుకున్నారు. 1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించామన్నారు. 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ లేదన్నారు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్ చిత్రమని చెప్పారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎఫ్ఐఆర్ లేకుంటే ఈ చిత్రం అవకాశం తనకు వచ్చేది కాదని దర్శకుడు మను ఆనంద్ పేర్కొన్నారు. -
‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: డెకాయిట్ నటీనటులు: అడివి శేష్,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులునిర్మాత: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్కథ, స్క్రీన్ప్లే: అడివి శేష్ దర్శకత్వం: షానియల్ డియోసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్విడుదల తేది: ఏప్రిల్ 10, 2026అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన చిత్రం ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్తో అంచనాలు పెంచేసిన ఈ టీం మరి ఆడియెన్స్ని మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం.కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.ఎలా తీశారంటే?..ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రేమ కథల్ని ఎంత కొత్తగా, ఎంత అట్రాక్టివ్గా చెప్పామన్నదే విజయంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఆ విషయంలో డెకాయిట్ కొంత వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రేమకు కులం అడ్డు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇందులోనే అదే పాయింట్ను చూపించారు. కానీ ఇందులోని ప్రేమ కథను, ప్రేమికుల్ని కాస్త కొత్తగా, భిన్న శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేయసి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు హీరో. ఇద్దరూ కలిసి దొంగ తనాలు కూడా చేస్తుంటారు. ఇంటర్వెల్కు ఓ చిన్న పాటి ట్విస్ట్లాంటిది ఇస్తారు.ఇక సెకండాఫ్లో హీరోకి అసలు విషయం తెలియడం, గతానికి సంబంధించిన నిజం, తన కోసం ప్రేయసి చేసిన త్యాగం ఇవన్నీ తెలుస్తాయి. ఇక ప్రేయసికి ఉన్న ఇబ్బందిని తీర్చేందుకు ప్రియుడు చేసే త్యాగంతో క్లైమాక్స్ కాస్త బరువెక్కినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ ముందే పసిగట్టేస్తారు. కాబట్టి చివరకు అదేదో పెద్ద ట్విస్ట్, త్యాగంలా అనిపించదు. పైగా ఇది వరకు సినిమాల్లో చూసేసి ఉండటంతో ఇక్కడ ఆ ట్విస్ట్ అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు.అయితే ఈ చిత్రంలో కరోనా సమయంలో హాస్పిటల్స్ చేసిన దోపిడి, వ్యవహరించిన తీరుని మాత్రం బాగానే చూపించారు. ఈ సినిమాలో చాలా వరకు కరోనా నాటి పరిస్థితులు, అప్పటి వైద్య వ్యవస్థ గురించే చర్చించారు. ఆ పార్ట్ వరకు డెకాయిట్ ఆడియెన్స్ని మెప్పించే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు.ఎలా చేశారంటే?అడివి శేష్ ఈ సారి కాస్త కొత్తగా కనిపించాడు. యాసలోనూ చాలా వరకు మాడ్యులేషన్ చూపించాడు. ఆ యాస వల్లే కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాకపోవచ్చు. లుక్స్, యాక్షన్ పరంగా అడివి శేష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. ఇక మృణాల్కి మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సరస్వతి అలియాస్ జూలియట్గా మృణాళ్ ఆడియెన్స్ మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. ఇక అనురాగ్ కశ్యప్ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది. సునీల్, ప్రకాష్ రాజ్ కారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఆర్ఆర్ సైతం సరికొత్తగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అయితే విజువల్స్ గురించి చెప్పుకోవాలి. కెమెరా వర్క్ టాప్ నాచ్లో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా అనిపిస్తాయి. ప్రతీ పైసాకి తగ్గ వర్క్ తెరపై కనిపిస్తుంది. -
నాకు లక్ లేదనడం బాధగా ఉంది: హీరోయిన్ కృతీ శెట్టి
‘‘ఓ నటిగా నేను చేసే ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతాను. అయితే కొన్ని సినిమాలకు సరైన బాక్సాఫీస్ ఫలితాలు రాలేదు. దీంతో నా హార్డ్వర్క్ గురించి కాకుండా నాకు లక్ లేదని కామెంట్ చేస్తున్నారు. అది నాకు బాధగా ఉంది. సినిమా రిజల్ట్ అనేది నా చేతిలో ఉండదు. కానీ అలాంటి కామెంట్స్ వల్ల ఒక అవకాశం మిస్ కావడమనేది బాధగా ఉంటుంది. ఇప్పుడు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా రిలీజవుతోంది.‘ఈ సినిమాలో ఈ అమ్మాయి ఉంది కాబట్టి డౌట్గా ఉంది’ (సినిమా రిజల్ట్ను ఉద్దేశించి) అని కామెంట్ చేస్తున్నారు. నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులు ఇలా అనుకోవడం నాకు బాధగా ఉంది. కానీ ఎప్పటిలానే ప్రతి సినిమాకీ నా వంతు కృషి చేస్తాను’’ అని చెప్పారు కృతీ శెట్టి. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. శ్రీ పద్మినీ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు.⇒ ఈ చిత్రంలో నేను ధీమా అనే పాత్ర పోషించాను. తనకు నోమోఫోబియా. అంటే ధీమా దగ్గర మొబైల్ ఫోన్ లేకపోతే ఆమెకు భయం వేస్తుంది. సోషల్ మీడియాకి బానిస అయిన అమ్మాయి. ఈ పాత్ర చేయడం నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో నయనతారగారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఓ ప్రాబ్లమ్ వచ్చి, నయనతారగారికి ఫోన్ చేయగా, ఆమె మంచి సలహా ఇచ్చారు... చక్కగా గైడ్ చేశారు. ⇒ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కథ 2040లో జరిగినా అందరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే... ఇప్పుడు కూడా అందరూ మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియాను ఎక్కువగానే వినియోగిస్తున్నారు. నెగటివ్ ట్రోల్స్ చేసేవారు నెగటివ్గా థింక్ చేస్తుంటారు. ఈ ఆలోచనా ధోరణి వాళ్ల జీవితాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం. ఈ మధ్య అందరూ అన్నీ ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. ఏమో... భవిష్యత్లో లవ్ను ఇన్సూరెన్స్ చేసే చాన్స్ ఉంటే, అలా చేస్తారేమో. నాకైతే పాత కాలపు ప్రేమలంటేనే ఇష్టం. ప్రస్తుతం నా ఫోకస్ అంతా యాక్టింగ్పైనే ఉంది. ఐదేళ్ల తర్వాతో, పదేళ్ల తర్వాతో... ఒక వ్యక్తితో డేటింగ్ చేసి, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడిగారితో సినిమా చేస్తున్నాను. తమిళంలో ఓ సినిమా అంగీకరించాను. హిందీలో ఓ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి.. -
అసలు కథ ఇదేనా?
ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి ఏ వార్త బయటకొచ్చినా చర్చనీయాంశమౌతోంది. తాజాగా ‘వారణాసి’ స్టోరీ లైన్ ఇది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తున్న స్టూడియో ఒకటి ఈ సినిమా కథను క్లుప్తంగా తన వెబ్సైట్లో రాసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ‘‘శివభక్తుడు (మహేశ్బాబు) కాలాతీతమైన ఓ సాహసోపేతమైన ప్రయాణం చేస్తూ, శతాబ్దాలుగా మరుగున పడిన ప్రాచీన నిగూఢ రహస్యాలను చేధించుకుంటూ ముందుకు సాగుతుంటాడు. అపారమైన శక్తి కలిగిన ఒక వస్తువు జాడ కనుక్కుని, దాన్ని చేజిక్కించుకోవడం అతని లక్ష్యం.ఈ క్రమంలో తాను ప్రయాణం చేసేలా పరిస్థితులను సృష్టించి, ప్రపంచంపై శాశ్వత ఆధిపత్యం సాధించాలనే క్రూరమైన సంకల్పం కలిగిన వ్యక్తి నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ శివభక్తుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? ఆ తర్వాతి పరిణామాలు ఏంటి? అన్నదే ‘వారణాసి’ కథాంశం’’ అని’’ ఆ వీఎఫ్ఎక్స్ కంపెనీ రాసుకొచ్చింది. దీంతో... ‘వారణాసి’ స్టోరీ ఇదేననే ప్రచారం సాగుతోంది. మరి... అసలు కథ ఇదేనా? అనేది తెలియాల్సి ఉంది. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారాణాసి’. ఈ సినిమాలో రుద్రగా, శ్రీరాముడిగా మహేశ్బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు.విలన్ కుంభగా పృథ్వీరాజ్, మందాకినిగా ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్తో పృథ్వీరాజ్ పాత్ర చిత్రీకరణ పూర్తయింది. మహేశ్బాబు, ప్రియాంకాలపై చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక సెట్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెట్లో మహేశ్బాబు, ప్రియాంకలపై ఓ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. బాబుల్ సుప్రియోతో ఓ పాటను రికార్డు చేసినట్లుగా చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి ఇన్స్టాలో పేర్కొన్నారు. ఈ పాటను ఉద్దేశించే ఆయన పేర్కొన్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘అర్ధనారి, తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్’ చిత్రాలు, ‘బిగ్ బాస్’ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రంలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. నాగ శివ దర్శకత్వంలో గణపర్తి శ్వేత సమర్పణలో గణపర్తి నారాయణరావు తేలప్రోలు, ప్రసన్న ఆంజనేయులు నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్.‘పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు పులగం సుప్రియ సహ నిర్మాతగా వ్యవహరించగా, దేవ్ జాండ్ సంగీతం అందించారు. మరోవైపు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఓ కీలక పాత్రలో అర్జున్ అంబటి నటిస్తున్నారు. -
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త హడావుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న డకాయిట్, కోలీవుడ్ నుంచి ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి ఎల్ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో డకాయిట్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎల్ఐకే మూవీపై కూడా కాస్తా బజ్ ఏర్పడింది.ఇక ఓటీటీల్లోనూ ఫ్రైడే సినిమాల సందడి ఉంటుంది. ఈ శుక్రవారం పలు సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటిలో తాయ్ కిజవి, తూ యా మైన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10టర్న్ ఆఫ్ ది టైడ్- సీజన్-3-(హాలీవుడ్ సిరీస్) ఏప్రిల్ 10అమెజాన్ ప్రైమ్ క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 10 ఓ రోమియో(హిందీ సినిమా)- ఏప్రిల్ 10జియో హాట్స్టార్తాయ్ కిజవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10హ్యాక్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 10సోనీ లివ్ తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10జీ5ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా(హిందీ మూవీ)- ఏప్రిల్ 10సన్ నెక్స్ట్ హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10 కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10ఆపిల్ టీవీ ప్లస్ ఔట్కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10లయన్స్ గేట్ ప్లే వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10 -
'ఎండు మిర్చి ఒక్కటే సరిపోదు.. మొత్తం తగలబెట్టేయాల్సిందే'.. సందీప్ రెడ్డి కౌంటర్
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దురంధర్ మూవీపై టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. నిన్న రాత్రి ఈ సినిమా చూశానని.. చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. అదే సమయంలో విమర్శకులపై తన స్టైల్లో ఇచ్చిపడేశారు. రచయితలు, నటులు అనేవాళ్లు ప్రాపగండతోనే తమ కెరీర్ నిర్మించుకున్నారని.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మాత్రం పిల్లుల్లా సైలెంట్ అయిపోయిందన్నారు.ఇప్పుడదే వర్గం దురంధర్ను ఎగతాళి చేస్తోందని సందీప్ రెడ్డి వంగా విమర్శించారు. మీ మొదటి ప్రవృత్తి ఎగతాళి చేయడమే అయితే.. మిమ్మల్ని మీరు ఉదారవాదులు అని పిలిపించుకోలేరని రాసుకొచ్చారు. నిజానికి ప్రాపగండ అనే ముద్ర ఎప్పుడు పడిందో తెలియదన్నారు. ఈ విషయంలో ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. దురంధర్ మూవీకి ఈ నల్ల దృష్టి ఇలా వెళ్లదు... గుప్పెడు మిరపకాయలతో పని జరగదు.... మొత్తం పొలం తగలబెట్టాల్సిందే అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కాగా.. కొందరు దురంధర్ రిలీజైనప్పటి నుంచి ప్రాపగండ ముద్ర వేస్తూ విమర్శలు చేస్తున్నారు. వారికి తన ట్వీట్తో ఇచ్చిపడేశారు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన ప్రభాస్తో స్పిరిట్ అనే మూవీ చేయనున్నారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. Writers & actors built careers on propaganda, and the industry stayed quiet like cats. Now the same clan mock Dhurandhar. You don’t get to call yourself liberal if your first instinct is to Mock. Don’t know when truth started getting labeled as propaganda...... strange times.…— Sandeep Reddy Vanga (@imvangasandeep) April 9, 2026 -
'చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నా'.. రష్మిక ట్వీట్ వైరల్
ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దు గుమ్మ రష్మిక మందన్నా. కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండతో సీక్రెట్ రిలేషన్లో కన్నడ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లాడింది. ఉదయ్పూర్లో వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. ఇటీవలే తన పెళ్లి తర్వాత తొలి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. విజయ్తో పెళ్లి తర్వాత చేసుకున్న తొలి పుట్టినరోజు కావడంతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తాజాగా తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ ఏడాది 30వ పుట్టినరోజు ఇంతకుముందు కంటే భిన్నంగా చేసుకున్నానంటూ ట్విటర్లో రాసుకొచ్చింది రష్మిక. చాలా రోజుల తర్వాత ఇంటికెళ్లానని.. అంతే కాకుండా చిన్నప్పటి నుంచి వెళ్తున్నా గుడికి కూడా వెళ్లానని ఆనందం వ్యక్తం చేసింది. సమయం లేకపోవడం వల్ల నా స్కూల్ను బయటి నుంచే చూశా.. అలా కాసేపు నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నానని చెప్పింది. ఈ రోజు నాకు ఎప్పటికీ తోడుగా ఉండబోయే వారి మధ్య కేక్ కట్ చేశానని సంతోషాన్ని పంచుకుంది. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఆశీర్వదిస్తున్న వారిని.. నా పెళ్లికి రాలేకపోయిన నా కుటుంబ సభ్యులను చిన్న డిన్నర్ పార్టీలో కలిశానని తెలిపింది. ఈ రోజు వరకు నా ప్రతి విషయంలో భాగమైన నా స్కూల్ ఫ్రెండ్స్.. కుటుంబంలా మారిన నా స్నేహితుల వరకు నా లైఫ్లో ప్రతీదీ ఒక మంచి కోసమే జరుగుతుందని నేను భావిస్తున్నానంటూ రష్మిక ట్వీట్ చేసింది. నా జీవితంలో ప్రతిదీ సార్థకమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చింది. My 30th birthday was kinda different this time. ❤️Went back home after a while. Went to the temple I’ve grown up going to.. ❤️Went to my school and saw it from outside (because of time constraints 🐒🙈) and revisited childhood for a quick bit.. ❤️Cut the cake amongst the… pic.twitter.com/5ZGxuBpUAD— Rashmika Mandanna (@iamRashmika) April 9, 2026 -
ఓటీటీకి సూపర్ హిట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇంట్లోనే ఎంచక్కా నచ్చిన సినిమాలు తెగ చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా క్రైమ్ స్టోరీస్, హారర్, థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. వీటితో పాటు మలయాళ మూవీస్ సైతం ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అక్కడ హిట్ అయినా సినిమాలు డబ్బింగ్ చేసి తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా మరో మలయాళ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సంభవం అధ్యాయం ఒన్ను ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. జియో హాట్స్టార్ వేదికగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాకు జీతూ సతీషన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఈ మిస్టరీ హారర్కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. -
నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ పీరియాడికల్ మూవీలో కెమెరా అసిస్టెంట్గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. కేఏప్రోడక్షన్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలోనే సాగే కథగా తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. టీవీ సౌకర్యం లేని ఓ ఊరి కథగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్లో గ్రామంలోని అందరూ కలిసి ఓకే చోట టీవీ చూడటం లాంటి సీన్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. -
హన్సిక మాజీ వదినకు షాక్.. ఏకంగా రూ.2 కోట్లకు..!
దేశముదురు చిత్రంలో తనదైన నటనతో మెప్పించిన బ్యూటీ హన్సిక. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లోనూ నటించిన ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగానే 2022లో సోహైల్ను పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ నాలుగేళ్లకే వీరి బంధం పటాపంచలైంది. ఈ ఏడాది మార్చి 11న ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.ఆ తర్వాత హన్సిక తీరుపై మాజీ వదిన ముస్కాన్ నాన్సీ జేమ్స్ విమర్శలు చేసింది. హన్సిక విడాకులను ఉద్దేశించి అంతా ఫేక్ ప్రపంచం అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. వాస్తవానికి హన్సికకు, ముస్కాన్కు గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.తాజాగా హన్సిక మాజీ వదినపై పరువునష్టం దావా వేసింది. తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తోందని ముస్కాన్పై రూ.2 కోట్లకు పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ముస్కాన్.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ చేయకూడదని ముస్కాన్ నాన్సీ జేమ్స్కు సూచించింది. ఇటీవలే విడాకులు తీసుకున్న హన్సిక తాజాగా మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ టాపిక్ కాస్తా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.సినిమా కెరీర్.. హన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, పవర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది. -
తిరుమల శ్రీవారి సేవలో నయన్ దంపతులు.. వీడియో వైరల్..!
కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకు పండితులు ఆశీర్వచనాలు అందించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన నయన్ దంపతులు తిరుమల స్వామివారికి మొక్కులు చెల్లించకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ జంట దర్శనం అనంతరం అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. నయన్ భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ ఎల్ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఏప్రిల్ 10న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ తిరుమలలో పూజలు చేశారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా. నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు. -
హారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఈ డైరెక్టర్..!
ది మమ్మీ చిత్రం గురించి పేర్కొంటూ ఇది ఒక కుటుంబం చుట్టూ తిరిగే కథా చిత్రం అన్నారు. ఒక జర్నలిస్ట్ కూతురి ఎడారిలో అదృశ్యం అయ్యి.. 8 ఏళ్ల తరువాత దొరుకుతుందన్నారు. అయితే ఆ తరువాత ఆ పాప శరీతంలో, ప్రవర్తనతో చాలా మార్పు కలుగుతుండటంతో ఆ కుటంబం భయభ్రాంతులకు గురౌతుందన్నారు. దానికి కారణాలు ఏమిటి? వంటి పలు ఆసక్తికరమైన ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశాలతో చిత్రం సాగుతుందన్నారు. ఈ చిత్రంలో మాన్స్టర్ రూపకల్పనను దర్శకుడు లీ క్రొనిన్ చాలా కొత్తగా మలిచారు. సాధారణ హారర్ చిత్రాల మాదిరిగా కాకుండా కొంచెం కొంచెం భయపెట్టే విధంగా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా మాన్స్టర్ను పగటివేళల్లో చూపుతూ కొత్త అనుభూతికి గురి చేస్తారన్నారు. కాగా ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. -
ఓటీటీలో 'ధురంధర్-2' ట్విస్ట్.. మరింత ఆలస్యం
రణవీర్ సింగ్- ఆదిత్య ధర్ కాంబినేషన్ మూవీ 'ధురంధర్-2'.. ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. అనుకున్న తేదీకంటే మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్కు రావచ్చని సమాచారం. హౌస్ఫుల్ థియేటర్స్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ. 1700 కోట్లకుపైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మారిందని తెలిసింది. ఈ చిత్రం హక్కులు జియోహాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు టాక్ ఉంది.సాధారణంగా బాలీవుడ్ చిత్రాలు 8వారాల థియేటర్ రన్ తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తారు. ఈ క్రమంలో ధురంధర్-2 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ లెక్కన మే 20లోపు ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈసారి లెక్కలు మారిపోయాయని టాక్. ప్రస్తుతం కొనసాగుతున్న ఊహాగానాల ప్రకారం, ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీని జూన్ మొదటి వారానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుపుతున్నారు. మే నెల మధ్యలో టోర్నమెంట్ ఉత్కంఠభరితమైన తుది దశకు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో క్రికెట్ సందడి పతాక స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ షెడ్యూల్ ధురంధర్-2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తే వీక్షకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఐపీఎల్ ముగియగానే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని జియోహాట్స్టార్ వ్యూహాత్మకంగా ప్రణాళిక రచిస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు. -
సమయం ఇవ్వండి.. సౌత్ ఫ్యాన్స్కు కయదు లోహర్ రిక్వెస్ట్
డ్రాగన్ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ అస్సామీ భామ కయాదు లోహర్. ఆ చిత్రం అనూహ్య విజయంతో ఈమె పేరు సినీ వర్గాల్లో మారుమోగింది. అంతే ఇతర భాషల్లోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. మలయాళం, తెలుగు, కన్నడం, మరాఠి భాషల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగులో నటించిన ఫంకీ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే మలయాళంలో నటించిన పళ్లిచటంబి చిత్రం త్వరలో తెరపైకి రానుంది.ఇలా పలు భాషల్లో చుట్టేస్తున్న కయదు లోహర్(Kayadu Lohar) ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తమిళంలో స్పష్టంగా మాట్లాడటం లేదే అని అడుగుతున్నారనీ, ఇప్పుడే ఒక్కో భాషల్లో చిత్రాలు చేస్తున్నానని, అయితే తాను దక్షిణాదికి చెందిన అమ్మాయిని కాదని అన్నారు. అయినా తనవల్ల అయినంత వరకూ ఒక్కో భాషను నేర్చుకోవడానికి యత్నిస్తున్నానని అన్నారు. ఏ భాషలో నటించినా, ఆ భాషలో మాట్లాడటమే ముఖ్యం అన్నారు. అందుకే ఇతర భాషలను నేర్చుకోవడానికి నూరు శాతం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కొంచెం సమయం ఇవ్వండి తమిళం, తెలుగు, మలయాళం తదితర దక్షిణాది భాషల్లో సరళంగా మాట్లాడతానన్నారు. డ్రాగన్ చిత్రం తరువాత కోలీవుడ్లో వరుసగా నటించకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు తాను మంచి కథా చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని, మంచి సక్సెస్ఫుల్ చిత్రంతో మళ్లీ వస్తానని చెప్పారు. డ్రాగన్ చిత్రంతో తమిళ ప్రేక్షకులు తనపై చూసిన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ అన్నారు. కాబట్టి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించి వారిని అలరించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా తెలుగులో ఈ అమ్మడు నానికి జంటగా ది పారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా ఇంతకు ముందు తమిళంలో నటించిడానికి అంగీకరించిన ఇమ్మార్టల్, ఇదయం మురుళి చిత్రాలు విదుదల కావలసి ఉంది. కాగా నటుడు శింబుకు జంటగా ఆయన 49వ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారీ బ్యూటీ. -
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ.. హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్..!
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ భామ అవనీత్ కౌర్..అమ్మ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న నిత్యా మీనన్..ఐటమ్ సాంగ్ లుక్లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ..హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్ పిక్స్..హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్.. వేకేషన్లో చిల్ అవుతోన్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. బుల్లిరాజుకు ప్రతిష్టాత్మక అవార్డ్
గతేడాది సంక్రాంతికి బ్లాక్బస్టర్గా నిలిచిన ఫుల్ ఫ్యామీలీ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు.తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. తాజాగా ప్రకటించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ(ఐఎన్సీఏ) అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ డైరెక్టర్తో పాటు బెస్ట్ యాక్టర్ కామెడీ రోల్ విభాగంలో అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ డైరెక్టర్గా అనిల్ రావిపూడి అవార్డ్ సొంతం చేసుకోగా.. కామెడీ రోల్ బెస్ట్ యాక్టర్గా రేవంత్(బుల్లిరాజు) దక్కించుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ప్రత్యేక పోస్టర్స్ను రిలీజ్ చేస్తూ గుడ్ న్యూస్ పంచుకుంది. ఐఎన్సీఏ అవార్డులు ప్రకటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. #SankranthikiVasthunam shines again on national stage 🌟'Hit Machine' @AnilRavipudi's directorial bags two prestigious honours at #INCA2026 🤩🏆#AnilRavipudi - Best Director#Revanth - Best Actor in a Comedy RoleVictory @VenkyMama @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/6meCSmPrRD— Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2026 -
అసలు మీరేం మాట్లాడుతున్నారు?.. గంగూలీకి నటి స్ట్రాంగ్ కౌంటర్..!
మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఇటీవల భోలేబాబా పార్ కరేగా' అనే బెంగాలీ సీరియల్ షూటింగ్లో నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ మరణించడంపై మాజీ క్రికెటర్ గంగూలీ మాట్లాడారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇదంతా షూటింగ్ కోసమే అయినా.. అతను నీటిలోకి ఎందుకు దిగారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బెంగాలీ నటి స్వాస్తిక ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలోనూ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.బాధలో ఉన్న ఆ కుటుంబంపై ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని సౌరవ్ గంగూలీని స్వాస్తిక బెనర్జీ తప్పుపట్టింది. తాజాగా ఓ ఛానెల్తో మాట్లాడిన ఆమె.. గంగూలీ లాంటి గొప్ప వ్యక్తి మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికింది. ఆయన మాటలు తమ వృత్తిని కించపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తమ పని విలువను తగ్గిస్తాయని స్వాస్తిక ముఖర్జీ అన్నారు.అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రతి రంగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని స్వాస్తిక పేర్కొన్నారు. గంగూలీ లాగా.. రాహుల్ లాంటి వాళ్లకు మద్దతు లభించదన్నారు. ఒకవేళ రాహుల్ నీటిలోకి దిగకపోయి ఉంటే.. అతని స్థానంలో మరో నటుడు వచ్చేవారని ఆమె తెలిపారు. ప్రస్తుత ఘటన చూస్తుంటే పరిశ్రమ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లను వేలేత్తి చూపుతోందన్నారు. కాగా.. బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ మృతితో ఏప్రిల్ 7 నుంచి సినీ పరిశ్రమ అంతా నిరవధిక సమ్మెకు దిగింది. -
‘చిరయ్యా’ రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది!
ప్రపంచంలో స్వేచ్ఛకు సరిహద్దు ఉండకపోవచ్చు గాని వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రం హద్దులు, సరిహద్దులతో పాటు పరిమితులు కూడా ఉంటాయి. స్నేహితులైనా, కుటుంబసభ్యులైనా అంతెందుకు కట్టుకున్న భాగస్వామికి అయినా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనివ్వాలి అనే సందేశాన్ని సుస్పష్టంగా ఇచ్చిన సిరీస్ చిరయ్యా. దివి నిథి శర్మ ఆలోచనకు శశాంత్ సింగ్ దర్శకత్వం వహించి తెర రూపమిచ్చిన సిరీసే ఈ చిరయ్యా. చాలా సున్నితమైన అంశాన్ని చక్కటి డ్రామాతో 6భాగాలతో ప్రేక్షకులను కట్టిపడేశాడు దర్శకుడు.పెళ్ళైతే చాలు కట్టుకున్న పెళ్ళాం ఇష్టం తో పని లేకుండా తనని తన సొంత ఆస్తిలా భావించే ప్రబుద్ధులకు ఈ సిరీస్ ఓ గుణపాఠమనే చెప్పాలి. హాట్ స్టార్ లో తెలుగులోనూ లభ్యమవుతున్న ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే. కాని చూసిన ప్రతి ప్రేక్షకుడి మనస్సు చివుక్కుమనడం ఖాయం. పెళ్లైన ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది. అంతలా ఏముందో ఈ సిరీస్ లో ఓసారి చూద్దాం. పెద్దలు కుదిర్చిన సంబంధంతో పూజ అరుణ్ ని పెళ్ళి చేసుకుని అత్తింట్లో అడుగుపెడుతుంది. అత్తమామలు ఇద్దరితో పాటు మిగతా కుటుంబసభ్యులంతా ఎంతో అపురూపంగా చూసుకుంటారు పూజని. ఆ కుటుంబంలో అరుణ్ వదిన దివ్య మొదట్లో పూజని కాస్త బెట్టుగా చూసినా తరువాత కలిసిపోతుంది. అందరూ బాగున్నా అరుణ్ తో పూజకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య గురించి తాను ఎవ్వరితో చెప్పుకోలేదు. అప్పుడు దివ్యకి పూజ సమస్య తెలుస్తుంది. కన్నబిడ్డ కన్నా ఎంతో అనురాగఆప్యాయతలతో పెంచిన అరుణ్ అసలు స్వరూపం తెలుసుకున్న దివ్య పూజకి ఎలాంటి పరిష్కారం చూపుతుందో చిరయ్యా సిరీస్ చూసే తెలుసుకోవాలి. నిజానికి ఈ సిరీస్ లోని పాయింట్ చాలా సున్నితమైన అంశం. దర్శకుడు ఎక్కడా అశ్లీలతకు ఎక్కువగా తావివ్వకుండా ఎంతో హుందాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అంతే ధీటుగా ప్రేక్షకులకు కూడా ఆకట్టుకునేలా ఉందీ సిరీస్. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పరిష్కారం సూపర్ అని చెప్పాలి. పెద్దలు మాత్రమే చూడదగ్గ ఈ సిరీస్ వీకెండ్ కు మంచి కాలక్షేపం.-హరికృష్ణ ఇంటూరు -
అల్లు అర్జున్ రాకా.. అసలు ఆ టైటిల్ అర్థమేంటో తెలుసా?
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టైటిల్ వచ్చేసింది. అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాకు ఫుల్ మాస్ టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఇకపై రాకా అనే పేరుతో తెరకెక్కించునున్నారు. టైటిల్తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ టైటిల్ గురించి టాలీవుడ్లో నెట్టింట చర్చ మొదలైంది. అసలు రాకా అంటే అర్థమేంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. మనిషి, మృగం కలగలిపిన పోస్టర్ చూస్తుంటే.. రాక్షసుడనే అర్థం వచ్చేలా టైటిల్ ఎంచుకున్నారా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో పాటు బన్నీ నెగెటివ్ రోల్ చేయనున్నారని టాక్. అది చెప్పేందుకే రాకా పేరును ఎంచుకున్నారేమోనని కొందరు అంటున్నారు.మరికొందరేమో రాకా అంటే.. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమిని కూడా అలానే పిలుస్తారని అంటున్నారు. ఎందుకంటే చీకటి, చెడుపై యుద్ధం చేసిన హీరో విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లు అభిమానులు భావిస్తున్నారు. పౌర్ణమి రోజు మనుషులు తోడేళ్లుగా మారుతారనే అపోహలు కూడా ఉన్నాయని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు రాకా అంటే క్రూరత్వం, ప్రమాదకరం, హింస అన్న అర్థాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఆసక్తికర టైటిల్పై ఎవరికీ తోచింది వారు తమకు నచ్చినట్లుగా అర్థాలు వెతుక్కుంటున్నారు. మరి అసలు అర్థమేంటో మేకర్స్ చెప్తే కానీ తెలిసేలా కనిపిచడం లేదు.The wait is over.Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026 -
నల్లగా, గలీజ్గా ఉందన్నారు.. అమ్మ ఘోరంగా ఏడ్చింది : జబర్ధస్త్ ఫైమా
వచ్చే జన్మలో అయినా ఆడపిల్లగా కాకుండా మగాడిగా పుట్టాలని అంటోంది జబర్ధస్త్ ఫైమా. పటాస్ షోతో వెండితెరకు పరిచయం అయిన ఈ లేడి కమెడియన్.. జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయింది. ఇక బిగ్బాస్ రియాల్టీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోలతో దూసుకెళ్తుంది. అయితే కెరీర్ ప్రారంభంలో మాత్రం ఫైమా చాలా అవమనాలను ఎదుర్కొందట. నల్లగా ఉందంటూ కొంతమంది ట్రోల్ చేశారట. తాజాగా ఓ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్న ఫైమా.. తన కెరీర్ గురించి.. పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.అమ్మ ఘోరంగా ఏడ్చింది..కెరీర్ ప్రారంభంలో చాలా అవమనాలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొన్నాళ్లకు నాకు హైప్ వచ్చింది. అందరూ ‘వీ వాంట్ ఫైమా’ అని అంటుంటే..కొందరు మాత్రం ‘ఏముంది దీనిలో అంత పొడుగుతున్నారు. గలీజ్గా, నల్లగా ఉంది’ అని ట్రోల్ చేశారు. నాతో పాటు మా అక్కలు కూడా అవి చూసి బాధపడ్డారు. ఒక రోజు నేను మా అమ్మకు ఫోన్ చేసి ‘ఎందుకు అమ్మ నన్ను ఇంత నల్లగా కన్నావు’ అని అడిగా. అప్పుడు అమ్మ ఘోరంగా ఏడ్చింది.కొత్త డ్రెస్ కోసం ఏడ్చేదాన్నిమాది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. వేసుకోవడానికి సరైన డ్రెస్లు కూడా ఉండేవి కాదు. ఇంటి పక్కనవాళ్లు కొత్త డ్రెస్ వేసుకుంటే ఏడ్చేదాన్ని. మేం మొత్తం నలుగురం అక్కాచెల్లెళ్లం.నేనే అందరికంటే చిన్నదాన్ని. వాళ్లు వేసుకున్న డ్రెస్సులే నాకు ఇచ్చేవాళ్లు. ఎప్పుడైనా డ్రెస్ కొనుక్కోవాల్సి వస్తే.. నలుగురు అక్కలకు కొనుక్కున్న డ్రెస్ ముక్కల నుంచి ఒక్కొక్కటి ఇచ్చి నాకు కొత్త డ్రెస్ కుట్టించేవాళ్లు. ఇప్పుడు అలా కుట్టించుకుంటే ఫ్యాషన్ అంటున్నారు(నవ్వుతూ..).గడ్డి మందు ఇచ్చి చంపాలి..ఇక చిన్న పిల్లలపై జరుగున్న అఘాయిత్యాల గురించి ఫైమా మాట్లాడుతూ..‘అలాంటి పనులు చేసినవాళ్లను గడ్డి మందు ఇచ్చి చంపాలి. చనిపోయే ముందు అయినా ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలియాలి. నాను పవర్స్ ఇస్తే అలానే చేస్తా. ఒక ఆడపిల్లగా జీవించడం చాలా కష్టం. ఆడపిల్లగా పుట్టినందుకు నేను అస్సలు హ్యాపీగా లేను. మనం అనుకున్నంత ఈజీ కాదు ఆడపిల్లగా బతకడం. చాలా కష్టాలు ఉంటాయి. వచ్చే జన్మలోనైనా నేను మగాడిలా పుట్టాలని కోరుకుంటున్నాను’ అని ఫైమా అన్నారు. -
అడివి శేష్ డకాయిట్.. ఫుల్ మెలోడి సాంగ్ రిలీజ్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఇటీవల ట్రైలర్ రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీతో హిట్ కొట్టాలని అడివి శేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు ఆడియన్స్ను అలరించాయి. నీవెంట నేను అంటూ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. శ్రీరామచంద్ర ఆలపించారు. ఈ సాంగ్ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. కాగా.. మూవీని ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. A melody born from a heart that truly loves 🎶💕#Dacoit third single out now ❤️#NeeventaNenu (Telugu) sung by @Sreeram_singer ▶️ https://t.co/Ins3Eg6tx6#TuJahaan (Hindi) sung by @AdityaRikhariii ▶️ https://t.co/1UxWgVECH5Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS… pic.twitter.com/SespX3usQI— Annapurna Studios (@AnnapurnaStdios) April 8, 2026 -
'దురంధర్-2 స్క్రిప్ట్ కాపీ కొట్టారు'.. డైరెక్టర్కు బిగ్ రిలీఫ్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజైన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.స్క్రిప్ట్ కాపీ కొట్టారు..దురంధర్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ప్రముఖ డైరెక్టర్ సంతోశ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దురంధర్ స్క్రిప్ట్ తనదేనని.. ఆదిత్య ధర్ నా స్క్రిప్ట్ను దొంగిలించారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ ఆదిత్య ధర్ బాంబే హైకోర్టు ఆశ్రయించారు. సంతోశ్ కమార్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. పరువు నష్టంతో పాటు, తన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆదిత్య ధర్ పిటిషన్పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సంతోశ్ కుమార్ను హెచ్చరించింది. ఇకపై ఆదిత్య ధర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని చిత్రనిర్మాత సంతోష్ కుమార్కు సూచించింది. ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకోవాలని బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16న జరగనుంది. దీంతో ఈ కేసులో దర్శకుడు ఆదిత్య ధర్కు ఉపశమనం లభించింది.కాగా.. 'ధురందర్ 2' రిలీజ్ తర్వాత తన రిజిస్టర్డ్ స్క్రిప్ట్ 'డి సాహెబ్' నుండి కాపీ కొట్టారని ఫిల్మ్ మేకర్ సంతోశ్ కుమార్ ఆరోపణలు చేశారు. తన స్క్రిప్ట్ స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SWA)లో రిజిస్టర్ చేశానని సంతోశ్ తెలిపారు. ఆదిత్య ధర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో దర్శకుడు సంతోశ్ కుమార్ వ్యాఖ్యలను ఆదిత్య ధర్ తప్పుబట్టారు. ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దని కోరుతూ కుమార్కు లీగల్ నోటీసులు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో దురంధర్ డైరెక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పదేపదే తనపై చేస్తున్న ఆరోపణలు.. ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆదిత్య ధర్ తరఫు న్యాయవాది బీరేంద్ర సరఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ప్రియుడితో హీరోయిన్ బ్రేకప్.. ఏడాదికే ఎండ్ కార్డ్..!
అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దంగల్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సన్యా మల్హోత్రా. ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్ను మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాలు, షోలలో కనిపించింది. గతేడాది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి, బేబీ జాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ లాంటి చిత్రాల్లో కనిపించింది. హిందీలో సినిమాలు చేస్తూ బిజీ ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ టోస్టర్, సుందర్ పూనమ్ అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీల్లోనే రిలీజ్ కానున్నాయి.అయితే తాజాగా సన్యా మల్హోత్రాకు సంబంధించి బాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఏడాదిగా డేటింగ్లో ఉన్న సన్యా తన ప్రియుడు రిషబ్ రిఖిరామ్ శర్మ బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకోవడంతో బాలీవుడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాగా.. సన్యా మల్హోత్రా గతేడాది నుంచి ప్రముఖ సితార్ ప్లేయర్ రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్లో ఉన్నారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి సందడి చేసేవారు. అయితే వీరిద్దరి రిలేషన్పై ఎక్కడా కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. తాజాగా వీరిద్దరు ఏడాదిలోనే తన రిలేషన్కు గుడ్ బై చెప్పేశారు. రిషబ్ వేరొకరితో డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. అందుకే సన్యా బ్రేకప్ చెప్పేసినట్లు బీటౌన్లో లేటేస్ట్ టాక్. గతంలోనూ ఓసారి తనకు బ్రేకప్ అయినట్లు సన్యా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నాలుగేళ్ల లాంగ్ రిలేషన్ తర్వాత బ్రేకప్ అయినట్లు తెలిపింది.రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు. -
ఆమెతో బ్రేకప్.. గట్టిగా అరిచా, ఏంటేంటో చేసేశా : సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయ్యాడు. కామెడీ కంటే ఎక్కువ ఆ షో హోస్ట్ రష్మితో నడిపిన లవ్ట్రాక్ సుధీర్ని మరింత ఫేమస్ చేసింది. ఆ ఫేమ్లో పలు షోలకు హోస్ట్గా చేసే అవకాశం వచ్చింది. అవి కూడా సక్సెస్ కావడంతో సుధీర్కు వెండితెర అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన పలు షోలకు హోస్ట్గా చేస్తున్నాడు. అందులో ఒకటి సర్కార్ సీజన్ 6. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది.ఇక ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్లో 'పాపం ప్రతాప్' మూవీ టీమ్ సందడి చేసింది. ఇందులో సుధీర్ తన బ్రేకప్ స్టోరీని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.14 ఏళ్ల పాటు ప్రేమలో..సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఒకనొక దశలో యాంకర్ రష్మితో ప్రేమలో ఉన్నారనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాళ్లిద్దరు కేవలం షో కోసం మాత్రమే లవ్ట్రాక్ నడిపామని చెప్పడంతో ఆ పుకార్లకు బ్రేక్ పడింది. అయితే రష్మితో కానీ మరో అమ్మాయితో సుధీర్ 14 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నాడట. చివరి ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అప్పటి నుంచి సింగిల్గానే ఉంటున్నాడట. బ్రేకప్.. నెక్లెస్ రోడ్పై పరుగెత్తా..సర్కార్ సీజన్ 6 లేటెస్ట్ ఎపిసోడ్లో సుధీర్ బ్రేకప్ స్టోరీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ‘14 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నాం. ఆ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. విషయం తెలిసి..ఏంటి ఇదంతా అని అడిగితే..‘ ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా..డిస్ట్రబ్ చేయకు’ అని చెప్పింది. చాలా బాధపడ్డా. నెక్లెస్ రోడ్డులో పరిగెడుతున్నా, అరుస్తున్నా.. ఏంటేంటో చేసేశా.. అంటూ బ్రేకప్ చెప్పిన రోజు జరిగిన విషయాన్ని వివరిస్తూ.. ఎమోషల్ అయ్యాడు. పక్కనే ఉన్న కో హోస్ట్ విష్ణు ప్రియ.. సుధీర్ని హగ్ చేసుకొని ఓదార్చింది. -
పెద్ది ఐటమ్ సాంగ్.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్కు ఛాన్స్.!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో ఈ స్టోరీ ఉండనుంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ హైలెట్గా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ పాటకు ఇప్పటికే మృణాల్ ఠాకూర్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా టాలీవుడ్లో మరో యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హిట్ కొట్టిన మానస వారణాసిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. యంగ్ హీరోయిన్ అయితే ఈ పాట మరింత హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ చేసేందుకు మృణాల్ ఠాకూర్ నో చెప్పినట్లు సమాచారం. అయితే మానస వారణాసి ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు మానస వారణాసి మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. -
కేవలం సినిమా మాత్రమే కాదు.. అంతకు మించి: రాకాపై అట్లీ ట్వీట్
ఐకాన్ స్టార్ అభిమానులకు ఈ రోజు పండగే. బన్నీ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ అట్లీ. ఎక్కడా లీక్ కాకుండా అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. బన్నీ పుట్టినరోజున మూవీ టైటిల్ ప్రకటించారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మూవీకి రాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ అట్లీ.. హీరో అల్లు అర్జున్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ సార్ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. రాకా కేవలం సినిమా మాత్రమే కాదన్నారు. కొన్నేళ్లుగా నా వెంట మోసుకొస్తున్న భాగమన్నారు. 18 ఏళ్లుగా ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నా.. అది ఎప్పటికీ మసకబారకుండా చూసుకున్నానని అట్లీ ట్వీట్ చేశారు. అది నన్ను పరీక్షించడమే కాకుండా తీర్చిదిద్దేలా చేసిందన్నారు. ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచిందని రాసుకొచ్చారు. నిజం చెప్పాలంటే... ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అట్లీ పోస్ట్ చేశారు. #Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs— atlee (@Atlee_dir) April 8, 2026 -
రాజమౌళి చేయలేనిది.. ‘రాకా’ టీమ్ చేసింది!
సాధారణంగా ఓ పెద్ద సినిమా వస్తుందంటే.. టైటిల్ ముందుగానే లీకవుతుంది. ఇలా షూటింగ్ మొదలవ్వగానే అలా లుక్ బయటకు వస్తుంది. చిత్ర యూనిట్ ఎంత గోప్యంగా ఉంచినా సరే.. ఏదో ఒక రకంగా లీకేజీలు జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లు అర్జున్-అట్లీ సినిమా విషయంలో ఇది జరగలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఒక్క లీకేజీ కూడా బయటకు రాలేదు. సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ముందే లీక్ చేసే మీడియా కూడా ఈ సినిమా టైటిల్ ని పసి గట్టలేకపోయింది. లెగసీ, వైల్డ్ ఫైర్, అయాన్, స్పార్క్..ఇలా రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఈ చిత్రానికి ‘రాకా’(Raaka) అనే టైటిల్ని ఖరారు చేసిన విషయం అధికారికంగా ప్రకటించేవరకు ఎక్కడ బయటకు రాలేదు.ఎంతో గోప్యంగా షూటింగ్ మొదలుపెట్టే రాజమౌళి సైతం ఈ లీకేజీ భారీ నుంచి తప్పించుకోలేకపోయాడు. మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీ టైటిల్..అధికారిక ప్రకటనకు ముందే బటయకు వచ్చేసింది. అలాగే మహేశ్ లుక్తో పాటు కొన్ని స్టిల్స్ కూడా ముందే నెట్టింట దర్శనమిచ్చాయి. అలాగే ‘ఫౌజీ’లోని ప్రభాస్ లుక్ కూడా ముందే లీకైపోయింది. ఈ లీకేజీని అరికట్టడంలో ‘రాకా’టీమ్ సక్సెస్ అయింది. (చదవండి: 'రాకా' పోస్టర్ రిలీజ్.. ఊహించని లుక్లో బన్నీ..)టైటిల్ విషయం చిత్ర యూనిట్కి కూడా ముందుగా చెప్పలేదట. నిర్మాతలతో పాటు అల్లు అర్జున్-అట్లీకి తప్పా..మిగతావారెవరికీ ఈ సినిమా టైటిల్ తెలియకుండా జాగ్రత్త పడ్డారట. అలాగే అల్లు అర్జున్ లుక్ కూడా ఇలా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. మనిషి, మృగం కలగలిపిన బన్నీ లుక్కి సంబంధించిన సన్నీవేశాలను చాలా గోప్యంగా చీత్రీకరించారట. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క లీకేజీ కూడా రాలేదు. ఈ విషయంలో ‘రాకా’ టీమ్ నుంచి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి. వాళ్లు తీసుకున్న జాగ్రత్తలను ఫాలో అయితే.. లీకేజీల బాధ నుంచి బయటపడతారు. రాకా విషయానికొస్తే.. ఈ చిత్రంలో బన్నీ హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు రిలీజ్ చేసింది విలన్ లుక్. హీరో పాత్రకు సంబంధించిన లుక్ చాలా స్టైలీష్గా ఉంటుందని టాక్. మరి ఆ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో దీపికా పదుకొణె పేరు అధికారికంగా ప్రకటించారు. మరో ఇద్దరు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంచారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. The wait is over.Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026 -
స్టైలిష్ స్టార్ టూ ఐకాన్ స్టార్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే?
మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అయ్యాడు. తన మొదటి సినిమా ‘గంగోత్రి’ నుంచి పుష్ప-2 వరకూ బన్నీ చేసిన ప్రతి సినిమాలో కొత్త రకమైన వైవిధ్యం ఉంటుంది. మాస్, క్లాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను ఇలా అందరిని మెప్పిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక స్టైల్ ఫాలో అవుతూ స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) నేడే. ఈ సందర్భంగా బన్నీ సినీ కెరీర్పై ఓ లుక్కేద్దాం.చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విజేత(1985) సినిమాలో బాలనటుడిగా నటించి మెప్పించిన బన్నీ.. ఆ తర్వాత 1986లో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించారు. ఆ తర్వాత ఏకంగా 15 ఏళ్ల గ్యాప్ ఇచ్చి 2001లో వచ్చిన చిరంజీవి ‘డాడీ’ సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ చిరంజీవి స్టూడెంట్గా తనదైన స్టైల్లో స్టెప్పులతో అదరగొట్టాడు.హీరోగా గంగోత్రి.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో ఓ సారి అల్లు అర్జున్ కూడా పాల్గొన్నాడు. చాలా మంది డ్యాన్స్ చేస్తుంటే బన్నీ కూడా స్టెప్పులతో అదరగొట్టేశారు. అదే టైమ్లో ఈ వేడుకలకు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి(నిర్మల)దగ్గరకు వెళ్లి ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోగా చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తానని చెప్పారు. అంతేకాదు అప్పుడు వంద రూపాయల నోటుని అడ్వాన్స్గా ఇచ్చి.. ఆ తర్వాత కొద్ది రోజులకు ‘గంగోత్రి’తో బన్నీని హీరోగా పరిచయం చేశారు రాఘవేంద్రరావు. ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్ దగ్గరే ఉందట.రెండో సినిమాకే నంది అవార్డు..ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 'ఆర్య'(2004) సినిమాలో లవర్ బాయ్గా నటించి హీరోగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. ఇక మూడో చిత్రం ‘బన్నీ’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్ని అంతా బన్నీ అని పిలవడం మొదలు పెట్టారు.బన్నీ వల్లే టాలీవుడ్కు సిక్స్ పాక్..టాలీవుడ్కి సిక్స్ ప్యాక్ బాడీని పరిచయం చేసింది కూడా అల్లు అర్జునే. దేశ ముదురు చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా సిక్స్ప్యాక్తో కనిపించాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీలో హన్సిక హీరోయిన్గా నటించింది. 'గంగోత్రి'లో అమాయకుడిగా కనిపించే బన్నీ 'దేశముదురు'లో మాత్రం సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా అలరించాడు. బన్నీ తర్వాతే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నితిన్ చాలామంది టాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్లో కనిపించారు.ఐకాన్ స్టార్గా అల్లు అర్జున్..మొదట్లో అందరు అల్లు అర్జున్ని స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బన్నీకి మరో బిరుదు ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప'తో ఐకాన్ స్టార్గా అయిపోయారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప, పుష్ప-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్స్గా నిలిచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. -
అనుమానం అక్కర్లేదు... బ్లాక్బస్టర్ ఖాయం: వెంకటేశ్
‘‘కొన్ని సినిమాలు ఆరంభించినప్పుడే ఒక మంచి అనుభూతి ఉంటుంది. ‘డెకాయిట్’ ఆరంభమైనప్పుడే సుప్రియ ఓ మంచి సినిమా తీస్తోందనే ఫీల్ ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే తను చాలా ప్యాషనేట్. క్రమశిక్షణ ఉన్న టీమ్ని ఎంచుకుంది. అడివి శేష్ వరుస హిట్స్ కొడుతున్నాడు. మరిన్ని బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. ‘డెకాయిట్’ కూడా బ్లాక్బస్టర్ అవుతుంది... ఎలాంటి అనుమానం అక్కర్లేదు’’ అని హీరో వెంకటేశ్ చెప్పారు. అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించారు.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సుప్రియ కోసం ఇక్కడికి వచ్చాననుకుంటున్నారు.నిజాయతీగా చెప్పాలంటే నాకు ఇష్టమైన మా సురేంద్ర మామ (సుప్రియ తండ్రి)కోసం వచ్చాను. ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. మృణాళ్ మంచి నటి. ఈ మూవీ ట్రైలర్ చూడగానే లవ్స్టోరీలోనే యాక్షన్, ఎమోష న్ అన్నీ ఉన్నాయని తెలిసిపోయింది. ఇలాంటి మంచి కథ ఎంచుకున్నందుకు గౌరవంగా ఉంది. యూనిట్కి ఆల్ ది వెరీ బెస్ట్’’ అని పేర్కొన్నారు. సుప్రియ మాట్లాడుతూ– ‘‘నాన్నగారి ఎస్ఎస్ క్రియేష న్్స బ్యానర్లో మంచి సినిమా తీయాలని ఎక్కడో మనసులో ఉంది. అందువల్లే ‘డెకాయిట్’ ఆరంభించాను. ఈ లోగోలో మా తాతగారి (ఏఎ న్ ఆర్) పంచె, మా నానమ్మ (అన్నపూర్ణ) కుంకుమ, పరిగెత్తే పాప, ముందు నడిపించే తాత... దాని వెనుక మా నాన్నగారు చేయించుకున్న మ్యూజిక్. ఇవన్నీ కూడగట్టి ఓ పదిహేను సెకన్లలో మా ఫ్యామిలీ కథ ఎలా చూపించుకోవాలా అనుకున్నాను. ‘డెకాయిట్’కి సైలెంట్గా ప్రోడ్యూస్ చేసి బ్యాక్బో న్ గా నిలిచిన మా అన్నయ్య సుమంత్కి థ్యాంక్స్’’ అని తెలిపారు. -
సుప్రియను వెక్కిరించడానికే వచ్చా.. నాగవంశీ ర్యాగింగ్
‘డెకాయిట్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత నాగవంశీ, సహ నిర్మాత సుప్రియపై సరదాగా ర్యాగింగ్ చేశారు. సినిమాలు ఎక్కువ రోజులు తీస్తున్నామని ఎప్పుడూ తమకు క్లాస్ పీకే సుప్రియ ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడి ‘డెకాయిట్’ పూర్తి చేసిందనిక వెక్కిరిస్తూ మాట్లాడారు. మమ్మల్ని సినిమాలు ఎందుకు ఇన్ని రోజులు తీస్తున్నారంటూ సుప్రియ ఎప్పుడూ తిట్టేవారు. కానీ ఇప్పుడు ఆమె రెండు సంవత్సరాలు కష్టపడి 147 వర్కింగ్ డేస్లో సినిమా తీశారు. ఇకపై మమ్మల్ని తిట్టే హక్కు ఆమెకు లేదని ఆటపట్టించారు. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో సుప్రియకు చూపించినందుకు అడివి శేష్కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే, “హీరోల్ని నెత్తిన ఎక్కించుకున్నామని ఎప్పుడూ క్లాస్ పీకే సుప్రియ, ఇప్పుడు తొలిసారి బయట హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనుభవించారు. ఇంతకు ముందు తన ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు తీసిన సుప్రియకు ఈ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. డెకాయిట్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరింత మంది హీరోలతో సుప్రియ సినిమాలు చేసి తమలాగే కష్టపడాలని చమత్కరించారు. ఓ వైపు నాగవంశీ సరదాగా ర్యాగింగ్ చేస్తుంటే, పక్కనే ఉన్న సురేశ్ బాబు నవ్వుతూ ఎంజాయ్ చేయడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
'అలా జరిగినందుకు క్షమించు'.. మృణాల్కు సారీ చెప్పిన సుమంత్
టాలీవుడ్ హీరో సుమంత్ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్కు క్షమాపణలు చెప్పారు. సీతారామం మూవీలో ఓ సీన్లో ఉందని అన్నారు. 'క్షమించు.. నీ రాముని నీ దగ్గరి నుంచి తీసుకెళ్లినందుకు' ఓ సీన్లో ఉందని అన్నారు. కానీ ఈ సీన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిటింగ్లో తీసేయాల్సి వచ్చిందని సుమంత్ తెలిపారు. అందుకే నేను 'డెకాయిట్లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించానని సుమంత్ వెల్లడించారు. డకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన సుమంత్ ఈ కామెంట్స్ చేశారు.కాగా.. అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీని లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. మృణాల్ ఠాకూర్ ని క్షమాపణలు కోరిన సుమంత్ 'సీతారామం' లో నేను మృణాల్ కి క్షమాపణలు చెప్పిన సీన్ ఒకటి ఉంది అది ఎడిటింగ్ లో డిలీట్ చేశారు అందుకే నేను 'డెకాయిట్' లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించాను : సుమంత్#AdiviSesh #MrunalThakur #Dacoit #Sumanth pic.twitter.com/5a1tUXY1lh— Filmy Focus (@FilmyFocus) April 7, 2026 -
అడివి శేష్ అంటే చాలా క్రష్ : టాలీవుడ్ నటి
టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు అడివి శేష్ అంటే నాకు క్రష్ ఉండేదని కామాక్షి భాస్కర్ల తన మనసులో మాటను బయటపెట్టింది. అయితే ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపింది. ఇప్పుడు ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టమని వెల్లడించింది. కామాక్షి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. నాకు శేష్ అంటే చాలా క్రష్ ఉండేది : కామాక్షి భాస్కర్ల#AdiviSesh #MrunalThakur #Dacoit #KamakshiBhaskarla pic.twitter.com/wFNG7XC1Z3— Filmy Focus (@FilmyFocus) April 7, 2026 -
'ఇది కేవలం నిశ్చితార్థం కాదు'.. టాలీవుడ్ హీరో ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇటీవలే కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకైన శ్రీనివాస్ తెలుగులో హీరోగా రాణిస్తున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. మార్చి 29న తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోబోతున్నారు.తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ క్షణం నుంచి అంతా మారిపోతుందంటూ రాసుకొచ్చారు. నిండు మనసులతో.. ఒకరి కళ్లలో ఒకరు కనిపిస్తుండగా.. మేము ఎప్పటినుంచో నమ్ముతూ వచ్చిన ఆ శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాం అంటూ పోస్ట్ చేశారు. ఎలాంటి హడావిడి లేదు.. తొందర లేదు... కేవలం ప్రేమ మాత్రమే ఉందంటూ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఒక నిశ్చితార్థం మాత్రమే కాదు..ఇది ఒక శాశ్వత బంధానికి ఆరంభం అంటూ నిశ్చితార్థం ఫోటోలను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు బెల్లంకొండ శ్రీనివాస్కు అభినందనలు చెబుతున్నారు.కాగా.. అల్లుడు శ్రీను మూవీతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. గతేడాది 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక శ్రీనివాస్కి కాబోయే సతీమణి కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. తాత జడ్జి కాగా తండ్రి లాయర్. ఇది పెద్దల కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. మార్చిలో తనకు కాబోయే భార్య అని కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. From this moment… everything changes.With hearts full and eyes only for each other,we stepped into a forever we’ve always believed in.No noise, no rush… just love, beautifully ours. 🖤This isn’t just an engagement,it’s the start of something timeless. ✨Location… pic.twitter.com/ufYAsHcYwK— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) April 7, 2026 -
ఓ సారి బ్రేకప్.. అమ్మకు కూడా తెలుసు: ఉప్పెన బ్యూటీ
ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.ఎల్ఐకే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హీరోయిన్ కృతిశెట్టి సైతం ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ప్రేమకథా చిత్రం కావడంతో కృతి శెట్టి కూడా ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడారు. తాను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానని తెలిపింది. అయితే ఓసారి బ్రేకప్ అయిందన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ విషయం మా అమ్మకు కూడా తెలుసని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. నా గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తే అలాంటి వారిని మాత్రమే బ్లాక్ చేస్తానని వెల్లడించింది ఉప్పెన బ్యూటీ. #PradeepRanganathan - I prefer to say I’m single. I’ve gone through many break-ups💔. I have not blocked anyone, but people have blocked me, and I used to reply faster than even ChatGPT during my college days itself😂#KrithiShetty - I’m single & I’ve gone through 1 break-up. My… pic.twitter.com/IUiPpHhx8A— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026 -
దురంధర్ కలెక్షన్స్.. బాహుబలి-2 రికార్డ్పై గురి..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,622.72 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే హిందీలో పలు రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డ్పై కన్నేసింది. తాజా వసూళ్లు చూస్తుంటే రాజమౌళి చిత్రం బాహుబలి-2 వసూళ్ల రికార్డ్ను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.దురంధర్-2 రిలీజైన 18 రోజుల్లోనే కన్నడలో రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసింది. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ బాహుబలి-2 కన్నడలో రూ. 129 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్-2 ఈ రికార్డ్కు కేవలం రూ.9 కోట్ల దూరంలోనే నిలిచింది. ఇదే జోరు కొనసాగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి-2ను దాటేయనుంది. ఇదే జరిగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడేతర చిత్రంగా దురంధర్-2 నిలవనుంది.ఇక కర్ణాటక బాక్సాఫీస్ను పరిశీలిస్తే కన్నడ చిత్రాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయినప్పటికీ తెలుగు చిత్రాలు కూడా కన్నడలో సత్తా చాటుతున్నాయి. శాండల్వుడ్ హీరో రిషబ్ శెట్టి మూవీ 'కాంతార చాప్టర్ 1' రూ. 247.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' కొనసాగుతోంది. కన్నడలో టాప్-5 చిత్రాలలో 'బాహుబలి 2' మాత్రమే కన్నడేతర చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ రికార్డ్ను దురంధర్-2 అధిగమించే ఛాన్స్ ఉంది. కాగా.. 'ధురందర్ 2' ఇప్పటికే కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా అవతరించింది. కర్ణాటకలో 'బాహుబలి 2' తర్వాత రూ. 100 కోట్ల మార్కును దాటిన రెండో కన్నడేతర చిత్రంగా 'ధురందర్ 2' నిలిచింది.కాగా.. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించారు. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. -
విజయ్-రష్మిక గ్రాండ్ రిసెప్షన్... కొడగు స్టైల్లో మెరిసిన జంట..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న వీరిద్దరు ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. ఉదయ్పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకలోఅత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.ఇటీవలే రష్మిక తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత తన తొలి బర్త్ డేను ఇరు కుటుంబాల సమక్షంలో జరుపుకుంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని ఇగ్గుతప్ప ఆలయాన్ని కూడా సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అయితే తాజాగా ఈ జంట మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించారు. రష్మిక సొంత గ్రామం కూర్గ్లో కొడగు సంప్రదాయంలో రిసెప్షన్ జరుపుకున్నారు. ఈ ఫంక్షన్లో రష్మిక కొడగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఈ రిసెప్షన్లో కూర్గి స్టైల్లో చీరను ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ- రష్మిక జంట స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కొడగు రావడం ఇది మూడోసారని తెలిపారు. మొదటిసారి రష్మికను కలవక ముందే ఇక్కడకు వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. గతంలో ఒకసారి వచ్చినప్పుడు తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. అయితే తన ఫ్రెండ్ ఈ రిసెప్షన్కు హాజరు కాలేదని తెలిపారు. నా స్కూల్ టైమ్లో స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చానని పంచుకున్నారు.చాలా అందంగా ఉంటారు..తనకు కొడగు అందాలు అంటే చాలా ఇష్టమని.. ఇక్కడి మహిళలు కూడా అంతే అందంగా ఉంటారని కొనియాడారు. కూర్గ్ మహిళలు చాలా అందంగా ఉంటారని.. నేను కూర్గ్ అమ్మాయినే వివాహం చేసుకున్నానని విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు. మిమ్మల్నందరినీ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కొడగు రిసెప్షన్కు ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక- విజయ్ జంటహా 'రణబాలి' సినిమాలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. -
ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
తమన్నా మాజీ బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మట్కా కింగ్. ఈ వెబ్ సిరీస్కు సైరత్' లాంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్లో కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ముంబయికి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా మట్కా కింగ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మట్కా నేపథ్యంలో సాగే క్రైమ్ కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీగా ఈ సిరీస్ తీసినట్లు అర్థమవుతోంది. ఈ క్రైమ్ సిరీస్ ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. -
పెళ్లి పీటలు ఎక్కనున్న అనుపమ?
-
' నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యా'.. ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొద్దిమంది డైరెక్టర్లలో ఆర్జీవీ ఒకరు. ఆయన ఏం మాట్లాడినా సరే అందులో ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. రోటీన్కు భిన్నంగా తన పంచ్లతో ఆకట్టుకుంటారు. అలా టాలీవుడ్లో విలక్షణ దర్శకుడిగా రాం గోపాల్ వర్మ అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు.ఇవాళ ఆర్జీవీ మరో వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 7న రాం గోపాల్ వర్మ బర్త్ డే కావడంతో తనదైన స్టైల్లో మరో ట్వీట్ చేశారు. ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యానంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు. అందువల్ల మీకు సంతోషం కలిగించే మరే ఇతర కారణాల కోసమైతే తప్ప.. ఈ రోజును వేడుకలా జరుపుకోవద్దు! ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు అభిమానులు ఆర్జీవీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. Today i reached 1 more year closer to my death and so let’s not celebrate unless for whatever reasons that makes you happy ! Thanks 💐💐💐 pic.twitter.com/mkKLW9G32t— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2026 -
అల్లు అర్జున్కి నో చెప్పిన ఆదిత్య ధార్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ
-
అతన్ని పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కూడా కన్నాను : త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్, టీవీకే అధినేత విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్తో త్రిష రిలేషన్తో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ ఫంక్షన్కి హాజరవ్వడంతో.. ఈ పుకార్లు ఇంకా ఎక్కువైయ్యాయి. త్వరలో పెళ్లి చేసుకుంటారని..ఆమె సినిమాలకు గుడ్బై చెప్పి..రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ కూడా త్రిష ఇకపై నటించబోదని చెప్పడంతో మరోసారి త్రిషపై నెట్టింట చర్చ జరిగింది. దీనిపై త్రిష తనదైన శైలీలో స్పందించింది. చిత్రా లక్ష్మణ్ వాఖ్యలకు కౌంటర్గా ‘అవును నేను సినిమాలు మానేసి, ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని, నిన్నటికి రెండేళ్లు నిండిన నలుగురు కవలలను పెంచుతున్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? ఈ రోజు వార్తలు రాసుకోవడానికి ఇది సరిపోతుందా లేదా ఇంకా ఏదైనా జోడించమంటారా?’ అని త్రిష ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్తో ఆమె సినిమాలు మానేసిందనేది పుకారు మాత్రమేనని తేలిపోయింది. త్రిష సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అమె ‘కరుప్పు’(తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించిన విశ్వంభర రిలీజ్కు రెడీ అవుతుంది. దేవిధంగా మలయాళంలో మోహన్లాల్ కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం. -
అల్లు అర్జున్- అట్లీ సినిమా పోస్టర్ విడుదల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబినేషన్ సినిమా (AA22xA6) నుంచి అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టైటిల్ పోస్టర్ను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన ఒక పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో ఒక క్రూర మృగం పంజా (చెయ్యి) మాత్రమే కనిపిస్తోంది.ఈ సినిమాలో తోడేలు చేయి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుంది. హాలీవుడ్ ప్రమాణాలతో అల్లు అర్జున్ నుంచి ఒక భారీ ప్రయోగాన్ని అట్లీ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ ఒక వింత శక్తి ఉన్న పాత్రలో లేదా ఇలాంటి వింత జీవులతో పోరాడే పాత్రలో కనిపిస్తారని అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్పై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా గురించి పలు వివరాలు ప్రకటిస్తారని సమాచారం. Brace for the BlAAst💥Title Poster - Tomorrow @ 11 AM@alluarjun @Atlee_dir @deepikapadukone#AA22xA6 pic.twitter.com/pPHn70C77o— Sun Pictures (@sunpictures) April 7, 2026 -
హగ్ చేస్కోవడం కూడా రాదా..! యంగ్ హీరోకి క్లాస్ పీకిన నయనతార
-
'మిస్ ఇండియా ఎర్త్' కిడ్నాప్.. భర్తపై ఫిర్యాదు
మిస్ ఇండియా ఎర్త్ -2019 విజేతగా చెప్పుకుంటున్న సయాలీ సుర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పూణేకు చెందిన ఈమె, 2019లో వివాహం చేసుకున్న తర్వాత ఇస్లాంలోకి మారి ‘అలీజా’గా పేరు మార్చుకున్నారు. అయితే, పూణేలోని చించ్వాడ్లో ఉంటున్న ఆమె కనిపించడం లేదు. తన భర్త ఆతీఫ్ వేధించాడని, బలవంతంగా మతం మార్చాడని ఆరోపిస్తూ ఇటీవల హిందూ మతంలోకి తిరిగి మారారు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఆమె కనిపించకుండా పోవడంతో చర్చనీయాంశంగా మారింది. పూణే పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. భర్త, అత్తింటివారే సయాలీ సర్వేని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు.2019లో మీరా-భయందర్కు చెందిన వ్యాపారవేత్త ఆతీఫ్ టాసేను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత, ఆమె ఇస్లాం మతంలోకి మారి, తన పేరును అతీజా టాసేగా మార్చుకుంది. గొడవల కారణంగా వారి వివాహ బంధం చాలా త్వరగా ముగిసిపోయింది. ఆతీఫ్ టాసేను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని ఆమె గతంలో ఆరోపించారు. అతను పెట్టిన శారీరక హింసను కేవలం తన పిల్లల కోసం భరించానని పేర్కొంది. తనతో దూరం అయిన తర్వాత ఆమె తిరిగి హిందూ మతంలోకి చేరి తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకుంది. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఆమె కిడ్నాప్ కావడం చర్చనీయాంశంగా మారింది.(గమనిక: కొందరు నివేదికల ప్రకారం, 2019లో అధికారిక 'మిస్ ఎర్త్ ఇండియా' విజేతగా డాక్టర్ తేజస్విని మనోజ్ఞ ఉన్నారు. ) -
రూ. 29 కోట్లతో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన టాప్ సింగర్
నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ ముంబైలో ఒక కొత్త విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. బాలీవుడ్ నివేదికల ప్రకారం, శ్రేయా ఘోషల్ తన తల్లి షమిష్ఠ ఘోషల్, తండ్రి బిశ్వజిత్ ఘోషల్లతో కలిసి వర్లీలో రూ.29.70 కోట్లకు ఒక అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం, ఈ అపార్ట్మెంట్ ముంబైలోని అత్యంత ప్రీమియం నివాస ప్రాంతాలలో ఒకటైన వర్లీలోని గోద్రెజ్ ట్రైలజీలో ఉంది.రిజిస్టర్ పత్రాల ప్రకారం ఈ ఫ్లాట్ మొత్తం వైశాల్యం 2,750.28 చదరపు అడుగులు ఉంది. దీనితో పాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026న అధికారికంగా రిజిస్టర్ చేయబడింది. ఈ లావాదేవీలో రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లింపుతో పాటు రూ. 30వేల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉన్నాయని సమాచారం.‘సరిగమ’ విజేతగా కెరీర్ను ప్రారంభించిన శ్రేయాఘోషల్ బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా ఎన్నో చిత్రాల్లో తన పాటలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. మొదట దేవదాస్ చిత్రంతో హిందీలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గజని, 3 ఇడియట్స్, దబాంగ్, ఢిల్లీ 6, ఆషికీ-2, క్రిష్, పద్మావత్ వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలకు మంచి క్రేజ్ దక్కింది. తెలుగులో ఒక్కడు, సింహాద్రి, ఠాగూర్, సీతయ్య, వర్షం, మల్లీశ్వరి, నేనున్నాను, అతడు, అదుర్స్, రేసుగుర్రం, మనం, ఖైదీ నం. 150,గేమ్ ఛేంజర్ వంటి సినిమాలతో పాటు సుమారు 200కు పైగానే సాంగ్స్ పాడింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సాంగ్ కోసం సుమారు రూ. 25 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. -
ధురంధర్పై కామెంట్.. ఆ బడ్జెట్లో మనోళ్లు నిర్మించడం కష్టం
టాలీవుడ్ ప్రముఖ రచయిత బివిఎస్ రవి అరుదుగా మీడియాతో మాట్లాడుతారు. కానీ, ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలుకొడతారని ఆయనకు గుర్తింపు ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ధురంధర్ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడారు. ధురంధర్ సినిమా టాలీవుడ్లో అంత తక్కువ బడ్జెట్లో నిర్మించడం చాలా కష్టమని చెప్పారు. టాలీవుడ్లో సినిమా ప్రారంభించాక ప్రణాళికా లోపం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు.బాలీవుడ్లో ధురంధర్ రెండు భాగాల కోసం సుమారు రూ. 260 కోట్లు పెట్టారు. ఇప్పుడు ఇదే బడ్జెట్ గురించి రచయిత బివిఎస్ రవి ఇలా అన్నారు. అదే బడ్జెట్లో తెలుగులో నిర్మించడం సాధ్యం కాదని ఆయన గట్టిగా పేర్కొన్నారు. టాలీవుడ్లో కనక ధురంధర్ మూవీ నిర్మించి వుంటే.. కనీసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టించేవారని చెప్పారు. ఆపై క్వాలిటీ తక్కువగా ఉన్న ప్రోడక్ట్ చేతిలో పెడతారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితులు అలా తయారయ్యాయని ఓపెన్గానే రవి అన్నారు.'దర్శకుడు ఆదిత్య ధర్ సుమారు ఎనిమిది గంటలకు పైగానే ఫుటేజ్ చిత్రీకరించాడు. దాని కోసం అతను ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత పరిశోధన చేసి ఉంటాడో ఒక్కసారి ఊహించండి. అంత ఖర్చు పెట్టడానికి అతను తన నిర్మాతలను ఎలా ఒప్పించగలిగాడు..? పొరపాటు జరిగితే సాధారణ నిర్మాతల పతనానికి 'ధురంధర్' ఆరంభం అయ్యేది. ఈ మూవీ నిర్మాతలు రూ.260 కోట్లలోపే బలమైన నటులను ఎంపిక చేసుకుని అమోఘమైన ఫైట్లు, సినిమాలో రణవీర్ సింగ్ విలాసవంతమైన ఇల్లు, ఇతర అద్భుతమైన లొకేషన్లతో రెండు సినిమాలు తీశారు.' అని బివిఎస్ రవి చెప్పుకొచ్చారు.రచయిత బివిఎస్ రవి చేసిన వ్యాఖ్యలను చాలామంది సమర్ధిస్తున్నారు. కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఆయన చెప్పింది నిజమేనని అంటున్నారు. మనోళ్ల దృష్టి సినిమా కంటెంట్ మీద కాకుండా గ్రాండ్ ఎంట్రీ పేరుతో అనోసరమైన ఖర్చులు పెడుతారనే టాక్ ఉంది. ధురంధర్ రెండు భాగాలు కూడా 20నెలల్లోనే నిర్మించారు. కానీ తెలుగులో మాత్రం పాన్ ఇండియా పేరుతో ఏకంగా ఐదు సంవత్సరాల పాటు తీస్తారు. తీరా థియేటర్స్లో బొమ్మ పడితే కనీసం మూడోరోజు కూడా ప్రేక్షకులు కనిపించరు. ఆపై పార్ట్-2 అంటూ ఎండ్ కార్డ్తో ఒక ట్విస్ట్ ఇచ్చి బయటకు పంపుతారు.(వీడియో క్రెడిట్ గుల్ట్) #BVSRavi :“#Dhurandhar IS THE BEGINNING OF THE END FOR REGULAR PRODUCERS.They shot 8 HOURS of footage with ₹260 CRORES, while our producers need ₹500 CRORES to make a SINGLE FILM.”Full Interview: https://t.co/BsWnOkoFMA pic.twitter.com/gRGViC7ZHi— Gulte (@GulteOfficial) April 6, 2026 -
ఇకపై నేను సింగిలే: హీరోయిన్
సంచలన పాన్ ఇండియా కథానాయికల్లో నటి శ్రుతి హాసన్ ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా కూడా అలరిస్తూన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ భామ. తరచూ తన ఫొటోలు, సంచలన విషయాలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉండే శ్రుతి హాసన్ ప్రేమ వ్యవహారంలోనూ నెటిజన్లకు గట్టిగానే పని చెబుతుంటారు. ముఖ్యంగా తనకు సంబంధంచిన ప్రేమ వ్యవహారాలను చాలా బహిరంగంగా వెల్లడిస్తుంటారు. అలా ప్రేమ ,పెళ్లిపై అభిప్రాయాలను కూడా నిర్భయంగా వ్యక్తం చేస్తారు. గత కొన్నేళ్ల క్రితం ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా అనే వ్యక్తిని ప్రేమించి, అతనితో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్గా మారారు. అయితే ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారు. దీంతో అతని ఫొటోలను ఇన్ స్ట్రాగామ్ నుంచి తొలగించేశారు. కాగా ప్రస్తుతం పూర్తిగా నటనపైనే దష్టి సారిస్తున్న శ్రుతి హాసన్ తన బ్రేకప్ లో గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను ఇప్పటివరకు ఆరు సార్లు ప్రేమించానని చెప్పారు. అయితే అవన్నీ గాయాలతోనే ముగిశాయి అన్నారు.దాంతో ప్రశాంతత బాట పట్టినట్లు చెప్పారు. ఇలా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇకపై తాను సింగిలే అని నటి శ్రుతి హాసన్ చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
మదనపల్లి యాస మాట్లాడా: అడివి శేష్
‘‘నా గత సినిమాల్లో కథలో ఒక చిన్న భాగంగా ప్రేమకథ ఉంటుంది. కానీ, ‘డెకాయిట్’లో మాత్రం ప్రేమకథే మెయిన్ ప్లాట్ ఫామ్. ఒక ప్రేమకథలో యాక్షన్ చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఒక యాక్షన్ సినిమాలో లవ్ స్టోరీ చూసేందుకు వెళ్తే నిరుత్సాహపడరు. ఇందులోని భావోద్వేగాలన్నీ కూడా సహజంగా ఉంటాయి’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘డెకాయిట్’.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో అడివి శేష్ విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో లవ్ స్టోరీ తయారు చేశాం. ‘డెకాయిట్’ తెలుగు ట్రైలర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. హిందీలో మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ రీచ్ ఉంది. పవన్ సింగ్గారు ‘డెకాయిట్’లో చేయడం భోజ్ పురికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోజ్పురిలో కూడా ప్రీమియర్ వేస్తారా? అని ఫస్ట్ టైమ్ అడిగినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ మూవీ చేస్తున్నప్పుడు నా మోకాలికి గాయం కావడంతో షూటింగ్ రెండు మూడు నెలలు ఆలస్యం అయింది. ఆ ఎఫెక్ట్ ‘గూఢచారి 2’ మూవీపైన కూడా పడింది. ‘డెకాయిట్’ కోసం 45 డిగ్రీల వేడిలో క్లైమాక్స్ చిత్రీకరించాం.⇒ డైరెక్టర్ షానియల్ డియో, నేను బెస్ట్ ఫ్రెండ్స్. అయితే సినిమా విషయంలో మాత్రం రాజీపడం. మృణాల్ ఠాకూర్ అద్భుతమైన నటి. నాగచైతన్య–శోభితగార్ల పెళ్లికి హైదరాబాద్ వచ్చిన సమయంలో అనురాగ్ కశ్యప్గారికి ఈ కథ చె ప్పాం. ఆయనకి నచ్చడంతో వెంటనే చేస్తానన్నారు. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ సుప్రియగారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్గారికి కూడా ఇది చాలా ఫ్రెష్ ప్రాజెక్టు అయింది. ‘డెకాయిట్’ తెలుగు వెర్షన్లో ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో...’ సాంగ్ని, హిందీలో ‘చీజ్ బడీ õß మస్త్..’ పాటని పెట్టాం. పోలాకి విజయ్గారు చాలా స్వీట్ కొరియోగ్రాఫర్. ⇒ ఈ సినిమాలో నేను చేసిన హరి పాత్ర క్యారెక్టర్ని బట్టి ‘డెకాయిట్’ టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ పాత్ర కోసం మదనపల్లి యాస ప్రాక్టీస్ చేశాను. నా నుంచి వరుసగా సినిమాలు రావాలంటే నేను రచయితగా ఉండకూడదనుకున్నాను. ‘గూఢచారి 2’ తర్వాత ఎమోషనల్గా రీఛార్జ్ అవ్వాలి అనుకుంటున్నా. ‘డెకాయిట్’ ని డాల్బీలో రిలీజ్ చేయాలని మొదటి నుంచి అనుకున్నాం. అల్లు అరవింద్గారు ఫోన్ చేసి, సినిమా చాలా ప్రామిసింగ్గా ఉంది.. కలిసి పనిచేద్దామనడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు 19 ఏళ్లు. దాన్నుంచి బయటపడడానికి పదేళ్లు పట్టింది. నేను సిగరెట్స్, మందు తాగను, నాన్ వెజ్ కూడా తినను. అందుకే ఇప్పటికీ ఒకేలా ఉన్నాను. నా ‘గూఢచారి 2’ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుంది. -
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘ఎమ్4 ఎమ్’
అమెరికన్ నటి జో శర్మ, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఎమ్4 ఎమ్: మోటివ్ ఫర్ మర్డర్’. మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై ఎమ్సీ విన్ గ్రూప్ యూఎస్ఏ సహకారంతో మోహన్ వడ్లపట్ల నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది. ‘‘మా సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడాన్ని మేం గర్వంగా ఫీలవుతున్నాం.అలాగే ముంబైలో ప్రీమియర్ షో ప్రదర్శించగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. అదేవిధంగా అమెరికాలో టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ మా మూవీని విడుదల చేస్తోంది. మర్డర్ మిస్టరీగా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. -
ఆ అదృష్టం నాకు దక్కింది: జేడీ చక్రవర్తి
‘‘యాక్టర్స్ అందరికీ కమల్ హాసన్గారు ఒక కొలమానం. ఆయన చేసినన్ని క్యారెక్టర్లు ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ చేయలేదు, చేయబోరు. అయితే ‘గాయపడ్డ సింహం’ మూవీలో నేను పోషించిన ధర్మ పాత్ర నా కెరీర్లో గుర్తుండి పోతుంది. నటుడిగా కాదు కానీ, క్యారెక్టర్ పరంగా చూస్తే ధర్మలాంటి పాత్ర చేసే అదృష్టం కమల్ హాసన్గారికి దక్కలేదు.. ఆ అదృష్టం నాకు దక్కిందని భావిస్తున్నాను’’ అని నటుడు జేడీ చక్రవర్తి తెలిపారు. తరుణ్ భాస్కర్ హీరోగా, మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’.డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో స΄్తాశ్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కల్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదలవుతోంది. ఈ మూవీలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి పోషించిన బ్రూటల్ ధర్మ పాత్రని పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ‘మనీ, సత్య, అనగనగా ఒక రోజు’ లాంటి చిత్రాలు ట్రెండ్ సెట్టర్స్గా నిలిచాయి. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం ‘గాయపడ్డ సింహం’లో దొరికింది. మా సినిమా ‘దిల్’ రాజు గారికి నచ్చడం సంతోషం. మా మూవీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు’’ అని పేర్కొన్నారు.‘‘మా సినిమాని మేము ఎంత ఎంజాయ్ చేశామో, ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు పవన్ సాధినేని. ‘‘జేడీగారి బెస్ట్ సినిమాల్లో మనకు నచ్చిన అన్ని ఎలిమెంట్స్ ధర్మ పాత్రలో కనిపిస్తాయి’’ అన్నారు కశ్యప్ శ్రీనివాస్. ‘‘జేడీ చక్రవర్తిగారు సత్య పాత్రతో ఎంత పాపులర్ అయ్యారో ధర్మ క్యారెక్టర్లోనూ అంతే పాపులర్ అవుతారని నమ్ముతున్నాను’’ అని భాను కిరణ్ ప్రతాప చె ప్పారు. -
అమెరికన్ నటి.. తెలుగు దర్శకుడు.. పాన్ ఇండియా సినిమా
ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎం4ఎం' (M4M – Motive for Murder) సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పాన్ ఇండియా వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్పై, McWin Group USA సహకారంతో రూపొందించారు.(ఇదీ చదవండి: హీరోయిన్కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని)భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తోంది. అమెరికాలో విడుదల బాధ్యతలను TekFlix Entertainment, ఉత్తర భారత విడుదలను JVEL Entertainment సంస్థలు తీసుకున్నాను. విడుదలకు ముందే ఈ మూవీ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పలాసిస్ సీ థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా, ముంబైలోని IMPPA ప్రివ్యూ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. దీనికి మంచి స్పందన లభించింది.ఇక హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్లో విస్తృతంగా నిర్వహించిన ప్రమోషన్ టూర్.. సినిమాకు మరింత ప్రచారం తీసుకువచ్చింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..ప్రీమియర్కు అద్భుతమైన స్పందన వచ్చిందని, థ్రిల్లింగ్ స్టోరీ, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ఆరు రోజుల్లో బర్త్ డే.. బుల్లితెర నటి బలవన్మరణం) -
వైట్ డ్రెస్లో చిన్నపిల్లలా బిగ్బాస్ దివి.. పింక్ శారీలో మెగా కోడలు..!
రిసార్ట్లో చిల్ అవుతోన్న శాన్వీ మేఘన..పింక్ శారీలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి..వైట్ డ్రెస్లో చిన్నపిల్లలా బిగ్బాస్ దివి పోజులు..నయనతార బ్లాక్ అండ్ వైట్ లుక్స్..పల్లిచట్టంబి ప్రమోషన్స్లో బిజీగా కయాదు లోహర్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
'నేనేం పాపం చేశా.. ఇలా తిట్టడం మంచిది కాదు..'రేణు దేశాయ్
సినీ నటి రేణు దేశాయ్ మరో వీడియో రిలీజ్ చేసింది. తమపై అసభ్యంగా కామెంట్స్ ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మేము ఆర్టిస్టులమని..మా మనసు చాలా సున్నితంగా ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది. మేము టెర్రరిస్టులం కాదు కదా అని ప్రశ్నించింది. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే వాళ్లను తిట్టండి.. కానీ మాలాంటి ఆర్టిస్టులను తిట్టొద్దండి.. ప్లీజ్ అని వేడుకుంది. మేమేమీ నేరాలు చేయట్లేదు కదా అని రేణు దేశాయ్ వెల్లడించింది. మీకు నా పని నచ్చకపోతే.. నన్ను ఫాలో చేయడం ఆపేయండి అని సూచించింది. నేనేం పాపం చేశా.. ఇంత అసభ్యంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. రేణు దేశాయ్ను అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.సోషల్మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలకు ఫుల్ డిమాంట్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగానే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. గతంలో 2023లో మామి ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని ప్రదర్శించారు.తాజాగా ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా అనే మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటింంచింది. ఈనెల 10 నుంచి జీ5 వేదికగా అందుబాటులోకి రానుంది. '15 మంది స్నేహితులు.. ఒక పార్టీ.. ఒకరి మిస్టరీ హత్య' అంటూ పోస్టర్ను పంచుకున్నారు.ఈ చిత్రంలో వినయ్ పాఠక్, నీల్ భూపాలం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మించారు. ఈ సినిమాలో రణవీర్ షోరే, సౌరభ్ శుక్లా, కోయెల్ పూరీ, ఎంకే రైనా, పలోమి ఘోష్, చంద్రచూర్ రాయ్, సాదియా సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సాగర్ దేశాయ్ సంగీతం సమకూర్చారు. కాగా.. రజత్కపూర్ అంతకుముందు క్రౌడ్ఫండింగ్ ద్వారా ఆర్కే అనే మూవీని తెరకెక్కించారు. 15 Friends. 1 Party. 1 Mysterious Murder.But the real question is - who wanted him dead?Watch #EverybodyLovesSohrabHanda premieres 10th April, on #ZEE5#EverybodyLovesSohrabHandaonZEE5@ApplauseSocial @nairsameer @deepaksegal #MithyaTalkies #RajatKapoor @pathakvinay… pic.twitter.com/CUha1btJlU— ZEE5Official (@ZEE5India) April 6, 2026 -
కోర్ట్ రీమేక్.. స్టార్ నటి వారసురాలి ఎంట్రీ..!
తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన మూవీ కోర్ట్. రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ కీలక పాత్రలో మెప్పించారు. ఇక్కడ సూపర్ హిట్ అయిన మూవీని కోలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. త్యాగరాజన్ డైరెక్షన్లో రంజన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీతో సీనియర్ హీరోయిన్, నటి దేవయాని వారసురాలు ఎంట్రీ ఇస్తోంది. దేవయాని కుమార్తె ప్రియాంక ఈ సినిమాతో కోలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ లాంఛ్కు హాజరైన దేవయాన్ని ఈ విషయాన్ని ప్రకటించింది. తన కూతురికి అవకాశమిచ్చిన త్యాగరాజన్కు ధన్యవాదాలు తెలిపింది. తన కూతురు సినీ ఇండస్ట్రీలో రాణిస్తుందని దేవయాని ధీమా వ్యక్తం చేసింది.కాగా.. నటి దేవయాని గురించి పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత దర్శకుడు రాజకుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. ప్రస్తుతం తన చిన్న కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. కాగా.. గతేడాది విడుదలైన 3 బీహెచ్కే సినిమాలో సిద్ధార్థ్ తల్లిగా దేవయాని కనిపించిన విషయం తెలిసిందే. #Devayani தியாகராஜன் சார் வந்து இந்தப் படத்துல என்னோட மகள் பிரியங்கா ராஜ்குமார், அதுக்கப்புறம் ஹரி கதிரேசன், இரண்டு பேரையும் லான்ச் பண்றாங்க.கண்டிப்பா இவங்க உங்க பேரை காப்பாத்துவாங்க, நல்லா நடிப்பாங்க, சினிமால ரொம்ப நாளா இருப்பாங்க. pic.twitter.com/8U6AeTw7aT— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) April 6, 2026 -
సినిమాలకు పూర్తిగా గుడ్ బై.. నటుడి కామెంట్స్ వైరల్..!
ఇటీవల స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్తో ఆమెకు రిలేషన్ ఉందని రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో వాటి మరింత బలం చేకూరింది. ఆ తర్వాత కోలీవుడ్లో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది.ఈ సంగతి పక్కన పెడితే తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. త్రిష త్వరలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని మాట్లాడారు. యూట్యూబ్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు త్రిష టీమ్ నుంచి ఎలాంటి స్పందనైతే రాలేదు. ఇదే నిజమైతే వెండితెరపై త్రిషను చూడాలనుకున్న ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. చిత్ర లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
రిలీజ్కు సిద్ధమైన తెరచాప.. ఎప్పుడంటే?
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం తెరచాప. ఈ సినిమాకు జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అనన్య క్రియేషన్స్ బ్యానర్లో కైలాష్ దుర్గం నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. -
నాగ శౌర్య యాక్షన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ బ్యాడ్బాయ్ కార్తీక్. ఈ చిత్రంలో విధి యాదవ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాగ శౌర్య ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించనున్నారు. ట్రైలర్లో ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయికుమార్, నరేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతమందించారు. -
దేవరకొండతో పెళ్లి తర్వాత తొలి బర్త్ డే.. సెలబ్రేషన్స్ చూశారా?
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజును మరింత స్పెషల్గా జరుపుకుంది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో తన బర్త్ డే రోజు మరింత ఆనందంగా గడిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పలు చిత్రాల మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్తో పెళ్లి తర్వాత జరిగిన పుట్టినరోజు కావడంతో మరింత ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రాయలసీమలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. జయమ్మ పాత్రలో రష్మిక వీడియోలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక బర్త్ డే రోజు మైసా టీమ్ సైతం ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. Surrounded by love & powered by happiness!🫶#RashmikaMandanna celebrates her birthday the sweetest way!❤️#VijayDeverakonda #VIROSH #TeluguFilmNagar pic.twitter.com/MA5BseCsce— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2026 -
ఆరు రోజుల్లో బర్త్ డే.. బుల్లితెర నటి బలవన్మరణం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ బుల్లితెర నటి సుభాషిణి బాలసుబ్రమణ్యం బలవన్మరణానికి పాల్పడింది. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన నటి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో కోలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. కుటుంబ కలహాల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ సంఘటనపైగు సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు ఆమె మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సహనటులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తమిళంలో ప్రముఖ సీరియల్ కాయల్లో తన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. 2012లో 'ఇని అవన్' అనే చిత్రంతో ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించారు. శ్రీలంక మూలాలు కలిగిన నటి చెన్నైలోని అయ్యప్పంతంగల్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. తన పుట్టినరోజుకు కేవలం కొన్ని రోజుల ముందుగానే ఆమె మరణించడంతో అభిమానులు షాకవుతున్నారు. ఏప్రిల్ 12న ఆమె తన పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. ఇదే నెలలో ఏప్రిల్ 21న ఆమె వివాహ రెండవ వార్షికోత్సవం కూడా రాబోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుభాషిణికి ఇన్స్టాగ్రామ్లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. -
హీరోయిన్కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
మలయాళ హీరోయిన్ మంజు వారియర్కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని పాలక్కాడ్లో ఓ ఈవెంట్కు హాజరైన మంజు వారియర్ను ఓ మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. అది చూసిన అక్కడి యాంకర్ ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శించింది. అయితే సదరు మహిళ మాత్రం.. నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం.. అందుకే ముద్దు పెట్టుకున్నా అని బదులిచ్చింది.ఓపికగా సెల్ఫీలుఇంత జరిగినప్పటికీ మంజు వారియర్ కోపగించుకోలేదు. ఎంతో సహనంతో మిగతా అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వారితో సెల్ఫీలు దిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంజు వారియర్ విషయానికి వస్తే.. ఈమె నటి మాత్రమే కాదు. డ్యాన్సర్, రైటర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్ కూడా! సాక్ష్యం అనే మలయాళ చిత్రంతో కథానాయికగా వెండితెరపై అరంగేట్రం చేసింది. సినిమాఈ పుళయం కాదన్ను, అసురన్, పాత్రం, కలియట్టం ఇలా అనేక సినిమాలు చేసింది. కన్నెళుతి పొట్టుం తొట్టు (1999) చిత్రానికిగానూ జాతీయ అవార్డు పొందింది. అయితే ఈ సినిమా తర్వాత బ్రేక్ తీసుకుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. చివరగా ఎల్ 2: ఎంపురాన్ చిత్రంలో కనిపించింది. చతుర్ముఖం చిత్రంతో నిర్మాతగా మారింది. సల్లాపం అనే పుస్తకం రాసి తనలో రచయిత్రి కూడా దాగి ఉందని నిరూపించింది. అలాగే ఈమెకు వీణ వాయించడం కూడా వచ్చు. A lady fan kissed Malayalam Actress #ManjuWarrier in a public function 🤯 pic.twitter.com/y1PAFXZUju— 000009 (@ui000009) April 6, 2026 చదవండి: పెద్దిలో ఐటం సాంగ్.. భలే తప్పించుకుందే! -
వినాయక్ అంటే సుమోలు ఎగరాల్సిందేనా..! నా నెక్స్ట్ మూవీ ఎలా ఉండనుందంటే..!
-
ఆ సమస్య వల్ల 5 ఏళ్లుగా పాడటమే మానేశా: స్టార్ సింగర్
సుజాత మోహన్.. సౌత్ ఇండస్ట్రీలో పేరుమోసిన గాయని. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడతో పాటు హిందీ, మరాఠి భాషల్లోనూ అనేక పాటలు పాడింది. దాదాపు 20 వేల పాటలు ఆలపించింది. టాలీవుడ్కు అనేక హిట్స్ ఇచ్చింది. అయితే కొంతకాలంగా ఆమె పాటలు పాడటమే మానేసింది. అందుకు గల కారణాన్ని తాజాగా ఓ వేదికపై బయటపెట్టింది.ఐదేళ్లుగా పాటల్లేవ్సుజాత మోహన్ మాట్లాడుతూ.. నేను గొంతు సమస్యతో బాధపడుతున్నాను. దానివల్ల మునుపటిలా పాడలేకపోతున్నాను. అందుకే ఐదేళ్లుగా ఎక్కడా ఒక్క పాట కూడా పాడలేదు అని తెలిపింది. ఇది విని ఆమె అభిమానులు షాకవుతున్నారు. తను త్వరగా కోలుకుని మళ్లీ తన గాత్రంతో అలరించాలని ఆకాంక్షిస్తున్నారు. దీనిపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సోదరి ఏఆర్ రెహానా స్పందిస్తూ.. గతంలో సుజాతకు కోరస్గా పాడాను. గొంతు సమస్యఅప్పుడు ఆమె దగ్గరినుంచి చాలా నేర్చుకున్నాను. తన గొంతు తనకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న డాక్టర్స్ ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయండి అని కోరింది. కాగా గతంలోనూ సుజాత గొంతు సమస్యతో బాధపడింది. 2010వ దశకంలో మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడింది. మూడేళ్లపాటు తన గొంతును తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. చివరకు మంచి చికిత్స ద్వారా కోలుకుని మళ్లీ పాటలు పాడింది.పాటలుసుజాత మోహన్ తెలుగులో అనేక హిట్ సాంగ్స్ పాడింది. తెలుగులో పరువం వానగా, నా చెలి రోజావే.. (రోజా మూవీ), ఓ చెలియా.. (ప్రేమికుడు), రూప్ తేరా మస్తానా (రిక్షావోడు), మూసిన ముత్యాలకే.., ఏలే ఏలే మరదలా (అన్నమయ్య).. ఓ వానా పడితే (మెరుపు కలలు), సారీ సారీ (బావగారు బాగున్నారా), పూవుల్లో దాగున్న (జీన్స్), అందాల ఆడబొమ్మ (సమరసింహారెడ్డి), చెప్పవే చిరుగాలి (ఒక్కడు) ఇలా అనేకానేక పాటలతో తెలుగు సంగీత ప్రియులను అలరించింది.చదవండి: మంచివాళ్లకే మంచివాడిని.. నావాళ్ల జోలికొచ్చారంటే: పవన్ -
హగ్ చేసుకున్న యంగ్ హీరోపై నయన్ కామెంట్
నయనతార హీరోయిన్గా.. కవిన్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త మూవీ 'హాయ్'.. డాడా సినిమాతో కవిన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఏకంగా నయన్తో సినిమా ఛాన్స్ కొట్టేశాడు. ఈ కొత్త చిత్రాన్ని జి.స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి విష్ణుఎడవన్ కథ, దర్శకత్వం నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు లోకేష్ కనకరాజ్ వద్ద ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలకు అసోసియేట్గా పనిచేశారన్నది గమనార్హం. ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్, ప్రభు, రాధిక, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి ఇతర సినీ ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శిష్యుడిగా విష్ణు ఎడవన్ చాలా సినిమాలకు పనిచేశారు. అయితే, తొలిసారి దర్శకుడిగా హాయ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా ఈ చిత్రంలో జరిగిన ఒక సంఘటన గురించి దర్శకుడు విష్ణు ఎడవన్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఇంతకు ముందు నయనతార నిర్మాతగా కవిన్ హీరోగా ఊర్కురువి అనే చిత్రం నిర్మించాల్సి ఉందన్నారు. అప్పుడే నయనతారకు కవిన్ తెలుసన్నారు. ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ప్రారంభం కాలేదనీ, ఇప్పుడు నయనతార,కవిన్ నటిస్తున్న హాయ్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.ఈ చిత్రం తొలి రోజు షూటింగ్లో నయనతారను కవిన్ కౌగిలించుకునే సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. అయితే నయనతారను కౌగిలించుకోవడానికి కవిన్ సంకోశించారన్నారు. దీంతో ఇంతకు ముందు ఎవరినీ కౌగిలించుకోలేదా? అని ఆమె కవిన్ను సరదాగా ఆట పట్టించారన్నారు. ఇలా నయనతార సెట్లో ఉంటే జాలీగా ఉంటారని చెప్పారు. కాగా హాయ్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. నయనతార నటించిన చిత్రాలు ఇటీవల తెరపైకి రాకున్నా, త్వరలో మలయాళంలో ముమ్ముట్టి, మోహన్లాల్లతో కలిసి నటించిన పెట్రియట్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన ఒక చిత్రం చేస్తున్న నయనతార హిందీలో సల్మాన్ఖాన్కు జంటగా ఒక చిత్రాన్ని కమిట్ అయ్యారు. ఇకపోతే తమిళంలో మన్నాంగట్టి, రాకాయి చిత్రాలు చేతిలో ఉన్నాయి. మలయాళంలో యశ్తో కలిసి నటించిన టాక్సిక్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.ఇలా పలు భాషల్లో నటిస్తూ నయనతార బిజీగా ఉన్నారు. ఇక ఈమె తన భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నిర్మించిన ఎల్ఐకే చిత్రం ఈ నెల 10న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
నిద్రపోవద్దు!
‘నిద్రపోవద్దు. ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే అతను అంత దగ్గరవుతాడు అంటోంది’ వి డ్రీమ్ ఫిల్మ్స్ సంస్థ. మమ్ముట్టి లీడ్ రోల్లో మలయాళ–తమిళ ద్విభాషా థ్రిల్లర్ ‘స్ట్రీట్ లైట్స్’కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్దత్ దర్శకత్వంలో ఈ సంస్థ ‘డోంట్ స్లీప్’ టైటిల్తో ఓ సినిమా నిర్మిస్తోంది.ఈ తెలుగు చిత్రానికి ‘ది లాంగర్ యు స్లీప్, ది క్లోజర్ హీ గెట్స్’ (ఎంత ఎక్కువసేపు నిద్రపోతే అతను అంత దగ్గరవుతాడు) అనేది ట్యాగ్లైన్. ‘చౌర్య పాఠం’ ఫేమ్ ఇంద్ర రామ్ హీరోగా రూపొందుతున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ని విజయ్ సేతుపతి ఆవిష్కరించారు. ‘‘ఎమోషనల్గా సాగే ఈ చిత్రం టెక్నికల్గానూ గొప్పగా ఉంటుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వినోదాల సత్తిబాబు
‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఇటీవలే సూపర్ హిట్ అందుకున్న హీరో సంతోష్ శోభన్ కొత్త సినిమాకు ‘సత్తిబాబు పరలోక యాత్ర’ అనే టైటిల్ ఖరారైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ ఫేమ్ లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వం వహించనున్నారు.యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మించనుంది. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను జూన్ మొదటివారంలో ప్రారంభిస్తామని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. -
అంబులెన్స్ నడపడం సవాల్ అనిపించింది: మృణాల్ ఠాకూర్
‘‘సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు నన్ను తెలుగు అమ్మాయిగా అంగీకరించారు. నేను మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారిలో ఏర్పడింది. ‘డెకాయిట్’లో చేసిన సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. అడివి శేష్, మృణాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్ నారంగ్ సహ–నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో మృణాల్ ఠాకూర్ చెప్పిన విశేషాలు. ⇒ ‘డెకాయిట్’ ఓ డిఫరెంట్ లవ్స్టోరీ మూవీ. ఈ చిత్రంలో నేను సరస్వతి పాత్రలో, హరి పాత్రలో శేష్ నటించాం. హరి, సరస్వతి ఎందుకు డెకాయిట్స్గా మారారనేది సినిమాలో చూడాలి. సరస్వతి క్యారెక్టర్ నాకో సవాల్. ఈ సినిమా కోసం కొన్ని స్టంట్, చేజింగ్, డ్రైవింగ్ సన్నివేశాలు చేశాను. అంబులెన్స్ కూడా నడిపాను. చాలా స్పీడ్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ వెహికల్కు హ్యాండ్ బ్రేక్ లేదు. ఇలాంటి రిస్కీ సీన్స్ కూడా చేశాను. ⇒ ‘సీతారామం, హాయ్.. నాన్న, ఫ్యామిలీ స్టార్’లను తెలుగులోనే తీశాం. కానీ ‘డెకాయిట్’ను తెలుగు, హిందీ భాషల్లో చేశాం. నాకైతే తక్కువ రెమ్యునరేషన్తో రెండు సినిమాలు చేసిన ఫీలింగ్ కలిగింది (సరదాగా). ఈ సినిమాలో ఓ సీన్లో బురదలో నటించాల్సి వచ్చింది. కానీ మేకర్స్ నా ఫేస్ గురించి ఆలోచించి బురద బదులు చాక్లెట్ను ప్లాన్ చేశారు. ఇలా చాలా కేరింగ్గా చూసుకున్నారు. షానియల్గారు అద్భుతమైన డైరెక్టర్. ఓ మంచి సినిమా చేసిన ఫీలింగ్ నాకు ఉంది. -
ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది: ‘దిల్’ రాజు
‘‘ఒక అప్లికేషన్ (యాప్) బ్యాక్డ్రాప్తో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా తీశారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రదీప్ హీరోగా, దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్నాడు. విఘ్నేష్ శివన్ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తారు. ఈ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ని ప్రేక్షకులు ఆదరించి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని ‘దిల్’ రాజు చెప్పారు. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది.శ్రీ పద్మినీ సినిమాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తెలుగు వెర్షన్ చూశాను... చాలా ఎంజాయ్ చేశాను. 2040లో మనం టెక్నాలజీపై ఎంత ఆధారపడతామో ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు’’ అని చెప్పారు. ‘‘మన రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం... ఇలా అన్నింటికీ ఫోన్ పైనే ఆధారపడుతున్నాం.మనుషుల కంటే మిషన్స్పైనే నమ్మకం పెరుగుతోంది. మిషనే పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక అప్లికేషన్ మనకి సరైన పార్ట్నర్ ఎవరో చెబితే? దాన్ని నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చెప్పారు ప్రదీప్ రంగనాథన్. ‘‘ఈ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న ధీమా పాత్ర చేశాను’’ అన్నారు కృతీ శెట్టి. ‘‘మంచి కాన్సెప్ట్తో తీసిన ప్రయోగాత్మక చిత్రం ఇది’’ అన్నారు విఘ్నేష్ శివన్. డిస్ట్రిబ్యూటర్ శివప్రసాద్, నిర్మాత హరిప్రసాద్ పాల్గొన్నారు. -
‘డెకాయిట్’లో రొమాన్స్ కష్టంగా అనిపించింది: మృణాల్
అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ బట్టి చూస్తే..ఇది లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమా అని అర్థమవుతుంది. ఇందులో హరి పాత్రలో హీరో అడివి శేష్, సరస్వతి పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. అయితే మృణాల్ తొలిసారి ఇందులో యాక్షన్ సీన్స్ కూడా చేసింది. అంతేకాదు ఓ పాపకు తల్లిగానూ నటించింది. అయితే ఈ సన్నివేశాలన్నీ ఈజీగానే చేసింది కానీ.. రొమాన్స్ సీన్సే కాస్త ఛాలెంజింగ్గా అనిపించాయట. ఈ విషయాన్ని స్వయంగా మృణాలే చెప్పింది. డెకాయిట్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆదివారం మృణాల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఛాలెంజింగ్గా అనిపించిన సన్నివేశాలేంటని ఓ విలేకరి అడగ్గా.. ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ‘యాక్షన్ సీన్లు నాకు ఇబ్బంది కాలేదు కానీ.. రొమాన్స్ సన్నివేశాలే ఛాలెంజింగ్గా అనిపించాయి. ఇదొక డిఫరెంట్ లవ్స్టోరీ సినిమా. ఇందులో హీరోపై కోపం ఉన్నప్పటికీ.. పాస్ట్లో ప్రేమగా ఉండాలి. రొమాన్స్ చేయాలి. అలా నటించడం నాకు సవాల్గా అనిపించింది. సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది’ అన్నారు. ఇక స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు పారితోషికం కూడా తగ్గించుకున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చింది. -
వామ్మో జ్యోతిక.. ఆ జిమ్ వర్కవుట్స్ ఏంటి?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. 1997లో హిందీ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అజిత్ హీరోగా నటించిన వాలి చిత్రంతో కోలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పించింది. తమిళంతో పాటు తెలుగు,హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. రెండు దశాబ్దాలకు పైగా నటిస్తూ ఎవర్ గ్రీన్ హీరోయిన్గా తన కెరీర్లో దూసుకెళ్లింది. ఆ తర్వాత 2006లో సూర్యను పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. సూర్య, జ్యోతిక దంపతులకు దేవ్ అనే కొడుకు, దియా అనే కూతురు ఉన్నారు. ప్రస్తుతం వీరి పిల్లలు ముంబయిలో చదువుతున్నారు.ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా.. జ్యోతిక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. తాజాగా తన జిమ్ వర్కవుట్ వీడియోను ఇన్స్టాలో వీడియో షేర్ చేసింది. ఇందులో పలు రకాల కసరత్తులు చేస్తూ జ్యోతిక కనిపించింది. ఈ స్టన్నింగ్ వర్కవుట్స్ చూస్తుంటే జ్యోతిక ఫిట్నెస్పై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం జ్యోతిక రెండు వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
కొత్త అనుభూతిని పంచేలా ‘డైమండ్ డెకాయిట్’
పార్థ గోపాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. సూర్య జి. యాదవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘన హీరోయిన్. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది.. ఈ చిత్రం టైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వాకాడ అప్పారావు, నిర్మాత శిరీష్ రెడ్డి, నటుడు శివాజీ రాజా పాల్గొని, ‘డైమండ్ డెకాయిట్’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. పార్ధ గోపాల్ మాట్లాడుతూ–‘‘సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్... ఇలా అన్నీ కలిసిన పూర్తి ఎంటర్టైనర్ ‘డైమండ్ డెకాయిట్’. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని తెలిపారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో మా సినిమా తీశాం. థియేటర్లో వీక్షించి, యూనిట్ని సపోర్ట్ చేయాలి’’ అని సూర్య జి. యాదవ్ పేర్కొన్నారు. -
కాలి నడకన తిరుమలకు.. ఎందుకు వెళ్తానంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్వీకపూర్కు తిరుమలను తరచుగా సందర్శిస్తూ ఉంటారు. అమ్మ శ్రీదేవి బాటలోనే ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఎప్పుడు తిరుమలకు వెళ్లినా కాలి నడకనే కొండపైకి చేరుకుంటుంది జాన్వీ. సెలబ్రిటీ అయినప్పటికీ కాలి నడకన వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. దీని వెనుక గల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.తాను తిరుమలకు కాలి నడకన వెళ్లేందుకు గల కారణాలను వివరించింది జాన్వీ కపూర్. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. కాలినడకన ప్రయాణించడం వల్ల కలియుగ దైవం బాలాజీకి మరింత దగ్గరైనట్లు అనిపిస్తుందని తెలిపింది. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవమని తనకు చాలా ఇష్టమని పేర్కొంది. భక్తితో మెట్లు ఎక్కి ఇష్టదైవమైన శ్రీవారి చెంతకు చేరడాన్ని ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తానని జాన్వీ కపూర్ వెల్లడించింది. -
సంతోశ్ శోభన్ రాకాస.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
మ్యాడ్ హీరో సంతోష్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన మరో సినిమా 'రాకాస'. ఈ సినిమాను నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీతో మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. హారర్ కామెడీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రిలీజైంది.ఈ చిత్రానికి తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. రెండో రోజు కూడా ఈ సినిమా అదే జోరు కొనసాగించింది. వీకెండ్ కలిసి రావడంతో రెండు రోజుల్లో రూ.10.30 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. This isn’t just a run… it’s a full-blown festival in theatres. 🎬✨#Rākāsā crosses a solid 10.30 CR worldwide in just 2 days — powered by packed houses, whistles, and non-stop laughs. 😎❤️🔥Lights on, confetti up… and the box office joins the celebration. 🎉🔥Don't miss out… pic.twitter.com/w4R7Z6OS3a— Pink Elephant Pictures (@PinkElephant_P) April 5, 2026 -
ఈ సినిమాలో విజయ్ను ఢీ ఫేమ్ చేయలేదు!
ఇటీవల టీఎన్ 2026 చిత్రం గురించి చాలా వివాదాస్పద చర్చ జరుగుతున్న విషయం తెలిసింది. కారణం ఈ చిత్రంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ను వ్యంగ్యాస్త్రాలతో విమర్శించే సన్నివేశాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల వచ్చాయి. ఇటీవల ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. అందులో హీరోగా నటించిన నట్టి గెటప్ విజయ్ను పోలి ఉంది. దీంతో టీవీకే పార్టీ చెన్నై విల్లివాక్కం నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అధవ్అర్జున్ టీఎన్–2026 చిత్రంపై విమర్శలు చేశారు. విజయ్ను పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించడానికి ఈ చిత్రాన్ని ఎన్నికలకు కొద్ది వారాల ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అయితే ఈ చిత్రాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కన్నన్ గ్రూప్ పతాకంపై కన్నన్రవి, కందన్రవి, దీపక్ రవి నిర్మించిన చిత్రం టీఎన్ 2026. తంబిరామయ్య కథను సమకూర్చిన ఈ చిత్రానికి ఆయన వారసుడు, అర్జున్ సర్జా అల్లుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించారు. నట్టి కథానాయకుడిగా నటించిన ఇందులో శ్రితరావు నాయకిగా నటించారు తంబిరామయ్య, ఎంఎస్ భాస్కర్, ఇళవరసు, చాందిని తమిళరసన్, యాషిక ఆనంద్, విజీ చంద్రశేఖర్ ముఖ్యపాత్రలు పోషించారు. తర్బకా శివ సంగీతాన్ని, ముత్తయ్య చాయాగ్రహణం అందించారు. ఈనెల 10న తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ఏఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తంబిరామయ్య మాట్లాడుతూ టీఎన్ 2026 చిత్రం ఏ రాజకీయ పార్టీని విమర్శించే విధంగా ఉండదని పేర్కొన్నారు. అధవ్ అర్జున తమ చిత్రం గురించి తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన చిత్రం చూడాలని అన్నారు. విజయ్ సింహం అని, ఆయన్ని ఎవరూ విమర్శించలేరని తంబిరామయ్య పేర్కొన్నారు. ఈ చిత్రంలో విజయ్ను ఢీ ఫేమ్ చేయలేదని నట్టి పేర్కొన్నారు. -
'అశ్లీల సైట్లో నా ఫోటోలు.. బాయ్స్ చూసేవారు'
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది. అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్ తన బాధను పంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్లైన్లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. -
వేణు ఊడుగుల కొత్త సినిమా.. ఈ సారి బ్రదర్ ఎమోషన్!
ఒకవైపు దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే.. నిర్మాతగానూ దూసుకెళ్తున్నాడు వేణు ఊడుగుల. ఆయన నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం భారీ కలెక్షన్స్తో బోలెడు అవార్డులను సొంతం చేసుకుంది. ఆయన సమర్పణలో మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుంది. ప్రముఖ అడ్వకేట్ , రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన డా.నాగేశ్వరరావు పూజారి తన ‘సైన్మా స్టూడియోస్’ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.పీవీఎన్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు నిర్మాత డా.నాగేశ్వరరావు పూజారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో ఒక అమ్మాయి కంటిని, ఆ కంటిలో ఇద్దరు బ్రదర్స్ సైకిల్ పై వెళ్తుండటం చూపించారు.‘గుణం, గణం, నీతో రణం - ఇది తథ్యం’.. ఇద్దరు సోదరుల భావోద్వేగభరితమైన కథ ’ అంటూ వేణు ఊడుగుల ఈ పోస్టర్ని ట్వీట్ చేశాడు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు. -
‘గేదెల రాజు’లో హీరోలు.. విలన్లు లేరు
‘‘మేం ఎన్ని చెప్పినా ప్రేక్షకుల్ని థియేటర్స్కి రప్పించేది కంటెంట్ మాత్రమే. మూవీలో కంటెంట్ ఉందని ఆడియన్స్ అనుకుంటే తప్పకుండా ఆదరిస్తారు. మా ‘గేదెల రాజు’లో మంచి కంటెంట్ ఉందని మేము నమ్ముతున్నాం... మా సినిమాని సక్సెస్ చేయండి’’ అని సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె చెప్పారు. చైతన్య మోటూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘గేదెల రాజు’. రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. రఘు కుంచె నటించి, సమర్పించిన చిత్రమిది. వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్లో చైతన్య మోటూరి మాట్లాడుతూ–‘‘మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుంది. మా మూవీలో హీరోలు, విలన్స్ ఉండరు... పాత్రలు మాత్రమే ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘మా అబ్బాయి చైతన్య మోటూరికి సినిమా మీద ఉన్న ప్యాషన్ను ఎంకరేజ్ చేయాలని ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు వాణి రవికుమార్ మోటూరి. -
టోవినో థామస్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళ స్టార్ టోవినో థామస్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ పల్లి చట్టంబి. ఈ సినిమాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా పల్లి చట్టంబి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1950 దశకంలో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
'అది కూడా మీరే చెప్పండి'.. జీవిత రాజశేఖర్ ఆగ్రహం
హీరో రాజశేఖర్ తాజాగా బైకర్ మూవీతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇండియాలోనే తొలి స్పోర్ట్స్ మోటోక్రాస్ రేసింగ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ బైకర్ సినిమా సక్సెస్ను సెలబ్రేట్ చేసుకున్నారు.హైదరాబాద్లో జరిగిన సక్సెస్ మీట్కు రాజశేఖర్ సతీమణి జీవిత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మూవీ రివ్యూవర్లపై మాట్లాడారు. సినిమా ఎంత బాగా తీసినా కూడా విమర్శలు చేస్తూనే ఉంటారన్నారు. రివ్యూలు చదువుతుంటే.. సినిమా ఎలా తీయాలో రివ్యూయర్లనే అడుగుదామా అనిపిస్తోందని తెలిపారు. సినిమాలో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలోడ్రామా అని తీసి పారేస్తారు.. అదే స్టైలిష్గా తీస్తే డెప్త్ లేదని విమర్శిస్తారు. ఏది నమ్మాలో మాకు అర్థం కావడం లేదన్నారు. ఒక సినిమా వెనుక ఎంతో మంది కష్టం, కోట్లాది రూపాయల ఖర్చు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రేక్షకులు రివ్యూలు చూసి కాకుండా.. స్వయంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని జీవిత పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రేక్షకుడి రివ్యూనే మాకు ముఖ్యమని అన్నారు. ఏవైనా గొడవలున్నా, మనస్పర్థలున్నా మనసు విప్పి మాట్లాడుకోండి.. ఎవరినీ దూరం పెట్టకండి.. సంతోషంగా ఉండటమే జీవితం అంటూ ఆమె ప్రేక్షకులకు సందేశమిచ్చారు జీవిత రాజశేఖర్. ఈ కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. -
రేణు దేశాయ్పై ట్రోల్స్.. ఆరుగురు అరెస్ట్
సినీ నటి రేణు దేశాయ్పై అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.సోషల్మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక వీడియో చేశారు. 'పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. త్వరలో మరికొందరిని అరెస్ట్ చేస్తారు. ఎవరూ తప్పించుకోలేరు. మీ తల్లిదండ్రులకు సమాచారం ఇస్తారు. మీరు ఉద్యోగం చేస్తుంటూ ఆఫీస్లో తెలుపుతారు. ఎవరినీ బూతులతో తిట్టకండి.' అంటూ కోరారు. రేణు దేశాయ్ని ఎందుకు తిట్టారని వారిని పోలీసులు ప్రశ్నాంచారు. ఆమె వల్ల మీకేమి కష్టం జరగలేదు కదా అని అడిగితే.. ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి తాము తిట్టామని అలా కాస్త ఫేమస్ కావచ్చని అనుకున్నట్లు వివరణ ఇచ్చారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
శ్రీహరి కొడుకు హీరోగా కొత్త సినిమా, టైటిల్ ఇదే
దివంగత ప్రముఖ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘ఆస్మాన్’ అనే టైటిల్ ఖరారైంది. రామ్ నందన్ దర్శకత్వంలో కొండారు వెంకటేశ్, శ్రీకాంత్ మన్నెం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శనివారం జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ ఇవ్వగా, సందీష్ కిషన్ స్విచ్చాన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్ను మేకర్స్కు అందించగా, తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ–‘‘రామ్ నందన్ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్బస్టర్ కొట్టబోతున్నాం’’ అని చెప్పారు. ‘‘తెలుగులో నాకు ‘ఆస్మాన్’ తొలి చాన్స్. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్తో రాబోతున్నాం. మూడు షెడ్యూల్స్లోనే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం’’ అని తెలిపరు రామ్ నందన్.‘‘మేఘాంశ్ శ్రీహరితో మా శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్స్లో తొలి సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీకాంత్ మన్నెం. ‘‘మూడేళ్ల క్రితం మా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశాం. అప్పట్నుంచి కథలు వింటూనే ఉన్నాం. కోడి రామకృష్ణగారి స్టూడెంట్ అయిన రామ్నందన్ మాకు ఈ కథను ఏడాది క్రితం చెప్పారు. ఆయన ఇది వరకే అరబిక్లో సినిమా చేశారు. ‘ఆస్మాన్’ సస్పెన్స్–థ్రిల్లర్గా ఉంటుంది’’ అని చెప్పారు వెంకటేశ్ కొండారు. కెమెరామెన్ షోయబ్ మాట్లాడారు. ఈ సినిమాకు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
ప్రభాస్ ఫౌజీ.. వారికి సీరియస్ వార్నింగ్..!
రెబల్ స్టార్ పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న చిత్రం ‘ఫౌజీ’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకి విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫౌజీ టీమ్ కొందరికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఫౌజీ సెట్స్ నుంచి లీకైన చిత్రాలను కొన్ని ఖాతాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయని మా దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలా కంటెంట్ను లీక్ చేసేవారికి మా హెచ్చరిక.. ఎవరైనా సరే చర్యలు తప్పవని ఫౌజీ టీమ్ హెచ్చరించింది. మేము ఎంతో జాగ్రత్తగా నిర్మిస్తున్న సినిమాకు ఈ లీకులు దెబ్బతీస్తున్నాయని ట్వీట్ చేశారు. లీక్ కంటెంట్ను షేర్ చేయకుండా దూరంగా ఉండాలని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నామంటూ పోస్ట్ చేసింది.దీనిపై దర్శకుడు హను రాఘవపూడి సైతం స్పందించారు. మీకు ప్రత్యేకమైన అనుభూతిని అందించడానికి మేము శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి లీకులతో మా కష్టాన్ని వృథా చేయొద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. దయచేసి సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేద్దామని హను రాఘవపూడి విజ్ఞప్తి చేశారు. కాగా.. ప్రభాస్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. We’ve poured our hearts into #Fauzi to give you something truly special.Humbly requesting everyone, please don’t spoil the magic with leaks.Let’s experience it the way it’s meant to be… together in theatres. 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/n4w3xDi8Fm— Hanu Raghavapudi (@hanurpudi) April 4, 2026 -
ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది.. థ్రిల్ అవుతారు: అడివి శేష్
‘‘ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎన్ని మంచి చిత్రాలు చేశామన్నదే నా లైఫ్ ఫిలాసఫీ. ప్రాణం పెట్టి చేసిన సినిమా ‘డెకాయిట్’. ఇందులో ముఖ్యమైన విషయాలున్నాయి. కానీ, వాటిని ట్రైలర్లో చూపించలేదు. మా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అడివి శేష్ మాట్లాడుతూ–‘‘మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడు? అనే అంశమే ‘డెకాయిట్’లో ప్రధానంగా ఉంటుంది. ఇది యూనివర్సల్ కథ’’ అని పేర్కొన్నారు. ‘‘డెకాయిట్’లో నేను చేసిన సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది’’ అని మృణాల్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఈ తరహా పాత్రలో నేను ఇంతవరకు నటించలేదు’’ అని చెప్పారు అనురాగ్ కశ్యప్. ‘‘మంచి లవ్స్టోరీతో కూడిన యాక్షన్ ఫిల్మ్ ఇది’’అని చె΄్పారు షానియల్ డియో. ‘‘మహేశ్ బాబు, ఎన్టీఆర్గార్లు మా సినిమా ట్రైలర్ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా ఎప్పుడూ విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత సుప్రియ. -
‘వారణాసి’ క్రేజీ అప్డేట్.. ‘మందాకిని’తో పాట స్టార్ట్!
హైదరాబాద్లో మళ్లీ అడుగుపెట్టారు మందాకిని. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’లో ప్రియాంకా చోప్రా పోషిస్తున్న పాత్ర పేరు మందాకిని అని తెలిసిందే. ఈ టైమ్ ట్రావెల్ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాలో రుద్ర, శ్రీరాముడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూట్లో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్నారు ప్రియాంకా చోప్రా. ఈ షూటింగ్ ప్రిపరేషన్ వీడియోను ఆమె తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. తన స్కిన్ మరింత గ్లోతో కనిపించేందుకు ఆమె తన ముఖానికి షీట్ మాస్క్ను ధరించినట్లుగా ఆ వీడియోతో స్పష్టం చేశారు ప్రియాంక. ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రియాంకా చోప్రా హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్లో మొదలైన ఈ షూట్ షెడ్యూల్లో మహేశ్బాబు కూడా పాల్గొంటారని, కొంత టాకీ పార్టుతో పాటు ఓ పాట చిత్రీకరణను కూడా మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఆ తర్వాతి షెడ్యూల్ కోసం ‘వారణాసి’ యూనిట్ అంటార్కిటికా వెళుతుందని తెలిసింది. అంటార్కిటికా లొకేషన్స్లో ఈ సినిమా షూట్ జరగనున్నట్లుగా ఇటీవల ప్రియాంకా చోప్రా ‘ఎక్స్’ వేదికగా కన్ఫార్మ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. On the move 🙌✨Priyanka Chopra heading for Varanasi work 👀Style on point. Focus locked.Another big moment loading ⚡From global icon to grounded roots…she does it all effortlessly 💛#PriyankaChopra #Varanasi pic.twitter.com/XHituw8UAL— Viral Celeb X (@ViralCelebX) April 4, 2026 -
రష్మిక బర్త్ డే.. మైసా టీమ్ స్పెషల్ పోస్టర్
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లీడ్ రోల్లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రవీంద్ర పూలే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్లో రష్మిక లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.తాజాగా ఇవాళ రష్మిక బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రష్మిక జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ను పంచుకున్నారు. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ కలర్లో రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మోడ్లో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో రష్మిక కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2026లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతేకాకుండా రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా వస్తోన్న రణబలిలోనూ నటిస్తున్నారు.She ruled with charm…She conquered with grace…Now she’s coming with pure RAGE🔥Team #Mysaa wishes the ever-stunning @iamRashmika a blazing Happy Birthday ❤️🔥Get ready for her most explosive performance yet In cinemas 2026.💥#HappyBirthdayRashmika pic.twitter.com/0XXdcpBhPf— MYSAA (@MysaaTheFilm) April 5, 2026 -
'రామాయణ' టీజర్పై విమర్శలు.. హృతిక్ రోషన్ కౌంటర్
రణ్బీర్ కపూర్ నటించిన ‘రామాయణ’ టీజర్పై షోషల్మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా విడుదలైన టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆశించినంత రేంజ్లో లేవని చిత్ర దర్శకుడు నితీశ్ తివారీపై కామెంట్లు చేస్తున్నారు. ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను ఎదుర్కొంటున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్పందించారు. విజువల్ ఎఫెక్ట్స్పై తన ఇన్స్టాగ్రామ్లో ఒక వివరణాత్మక నోట్ను పంచుకున్నారు. ఆయన ఏ సినిమా పేరు ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు చేసిన సమయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న చర్చలో భాగంగానే నిలుస్తోంది.నాసిరకం విఎఫ్ఎక్స్ (VFX) ఉన్నాయని హృతిక్ అంగీకరించినప్పటికీ, విజువల్స్ను కేవలం వాస్తవికత ఆధారంగానే అంచనా వేయకూడదని స్పష్టం చేశారు. సినిమాలు, ముఖ్యంగా ఫాంటసీ, పౌరాణిక చిత్రాలు, వాస్తవికతను ప్రతిబింబించేలా మాత్రమే విజువల్స్ ఉంటాయని పేర్కొన్నారు. వీఎఫ్ఎక్స్ అంటే కేవలం వాస్తవానికి దగ్గరగా ఉండటమే కాదంటూనే.. ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఎంచుకుంటారని క్లారిటీ ఇచ్చారు. కొన్నిసార్లు అది ‘స్టోరీ బుక్’ తరహాలో కూడా ఉండవచ్చిని పేర్కొన్నారు.ఇలాంటి ప్రాజెక్టుల వెనుక ఉండే కృషి స్థాయిని కూడా హృతిక్ రోషన్ నొక్కిచెప్పారు. విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే చిత్రాల కోసం సంవత్సరాల తరబడి మేకర్స్ పనిచేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రేక్షకుల అభిప్రాయాన్ని కొట్టిపారేయకుండా వారి అంచనాలకు మించి విఎఫ్ఎక్స్ ఉండాలని సూచించారు.కల్కి 2898 AD, బాహుబలి, రామాయణ వంటి భారీ సినిమాలు నిర్మించిన వారు అసలైన హీరోలని ప్రశంసించారు. గతంలో ఎవరూ చేయలేని సాహసాన్ని చేస్తున్నారని గుర్తుచేశారు. రామాయణ సినిమాలోని వీఎఫ్ఎక్స్ వీడియో గేమ్ లాగా ఉన్నాయన్న విమర్శలపై హృతిక్ టెక్నికల్గా సమాధానమిచ్చారు. -
స్టార్ హీరోయిన్ రెస్టారెంట్లో న్యూడిల్స్ ధర ఎంతో తెలిస్తే..
ముంబైలో అత్యంత ఖరీదైన రెస్టారెంట్ల జాబితాలో శిల్పాశెట్టి ‘బాస్టియన్’ ఒకటనే విషయం తెలిసిందే. అక్కడి ఫుడ్ మెనూ ధరల గురించి తరుచుగా నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది. బాస్టియన్లో ఫుడ్ తిన్న కొందరు తమ బిల్లును గత ఏడాది నుంచి సోషల్మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. అందులోని ధరలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తరుచుగా ఈ బిల్లు సోషల్మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.ముంబైలోని ఒక ప్రీమియం ఫైన్-డైనింగ్ రెస్టారెంట్గా బాస్టియన్కు గుర్తింపు ఉంది. ఇక్కడ విలాసవంతమైన సౌకర్యాలతో పాటు రుచికరమైన సీఫుడ్ కూడా దొరుకుతుంది. ఎంతో ఆకర్షణీయమైన వాతావరణం ఉండటం వల్ల చాలామంది సెలబ్రిటీలు, వ్యాపారావేత్తలు అక్కడికి వెళ్తుంటారు. విలాసవంతమైన ప్రదేశం కాబట్టి అక్కడి ఫుడ్ ధరలు కూడా ప్రీమియంగానే ఉంటాయి. బాస్టియన్లో ఫుడ్ తిన్న కొందరు తమ బిల్లును షేర్ చేశారు. నలుగురికి కలిపి రూ. 21,731 అయినట్లు తెలిపారు. చికెన్ న్యూడిల్స్ ధర రూ. 950 ఉండటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ధర ఏకంగా రూ. 1450 ఉండటంతో మాటలు రావడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే, ఈ ధరలు అన్నీ కూడా ఏడాది క్రితం నాటివి కావడం విశేషం. ప్రస్తుతం ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చని అంటున్నారు.బాస్టియన్ రెస్టరంట్ ఒక్కరోజులో రూ.2-3 కోట్ల టర్నోవర్ చేస్తుందని అంచనా ఉంది. సాధారణ రోజుల్లో రూ.2 కోట్లు, వీకెండ్లో రూ.3 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా ఉంది. సుమారు 1400 మందికి పైగానే అతిథులు అక్కడ స్టే చేయొచ్చట. ఒకేసారి 700 మంది భోజనం చేసేలా వీలు ఉందని చెబుతారు. View this post on Instagram A post shared by Cute Relationship Memes | Abhishek Watts (@cuterelationship.in) -
శూద్రులు కాదు దళితులు.. ఆసక్తిగా 'ఫూలే' తెలుగు ట్రైలర్
మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే మీద మొదటిసారి ఒక హిందీ సినిమా తెరపైకి వచ్చింది. డైరెక్టర్ అనంత్ మహాదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖా పాల్ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. గతేడాదిలో అనేక వివాదాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. అయితే, ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందనీ... కులవాదాన్ని ప్రోత్సహిస్తుందనీ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్య క్షుడు ఆనంద్ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడంతో సినిమా విడుదల సమయంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే, అయితే స్వయంగా బ్రాహ్మ ణుడైన ఈ చిత్ర దర్శకుడు అనంత్ మహాదేవన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా రూపొందిందనీ, ఎటు వంటి అజెండా లేదనీ చెప్పారు. దీంతో ఎట్టకేలకు గతేడారి ఏప్రిల్ 25న విడుదలైంది. సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు తెలుగు వర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫూలే 199వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న తెలుగులో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.ఫూలే స్వయంగా చదువు చెప్పి సావిత్రీబాయిని దేశంలోనే మొదటి మహిళా టీచర్ని చేశాక, పుణె పట్టణ సమీపంలోని దళితవాడలో ఆడపిల్లలకు స్కూలు పెట్టారు. ఏ కులానికి చెందిన అమ్మాయిలైనా వచ్చి చదువుకోవచ్చని ప్రకటించారు. సావిత్రీబాయితోపాటు చదువుకున్న ముస్లిం స్త్రీ ఫాతిమా షేక్ ఆమెకు అండగా ఉండేది. సావిత్రీబాయి ఈ దేశం మొత్తం చరిత్రలో భర్త సహాయంతో చదువుకొని టీచరై, ఆడపిల్లలకు బడి పెట్టిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. -
సీక్వెల్కు నో.. ఆయనతో నటించడం కష్టం: హీరోయిన్
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని చాలా బోల్డ్ నటీమణల్లో ఆండ్రియా ఒకరు. కథానాయకిగా పలు చిత్రాల్లో నటించినా, ఇప్పుడు ఎలాంటి చాలెంజింగ్ పాత్రలు అయినా చేయడానికి రెడీ అనే నటి. ఇటీవల నిర్మాతగా కూడా మారి తాజాగా లెజెండ్ శరవణన్ కథానాయకుడిగా నటించిన లీడర్ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఇకపోతే చాలాకాలం క్రితం సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్(యుగానికి ఒక్కడు). ఇందులో ఆండ్రియా, రీమాసేన్ హీరోయిన్గా నటించారు. యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ధనుష్ హీరోగా ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రానికి సీక్వెల్ చేస్తానని దర్శకుడు సెల్వరాఘవన్( Selvaraghavan) ఆ మధ్య ప్రకటించారు. అయితే ఆ తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. ఆ చిత్ర తొలి భాగంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన ఆండ్రియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయిరత్తిల్ ఒరువన్–2 చిత్రం గురించి మాట్లాడింది. పార్ట్-1లో నటించిన అనుభవంతో ఆ తర్వాత తను చేసిన ప్రతి ప్రాజెక్ట్ చాలా సులువుగా అనిపించిందని తెలిపింది. సినిమా షూటింగ్ సమయంలో సెల్వరాఘవన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఏదీ జరగదని చెప్పింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతమంటూ పేర్కొంది. కాబట్టి మళ్లీ ఆయనతో సినిమా చేయడం తన వల్ల కాదని పేర్కొంది. షూటింగ్ సమయంలో తాను అనుభవించిన మానసిక, శారీరక ఒత్తిడిని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె గుర్తుచేసుకుంది. తర్వాత ఎలాంటి పాత్ర వచ్చినా సరే చాలా ఈజీగా నటించగలిగానని పేర్కొంది. ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందవచ్చు, లేకపోవచ్చు కానీ, సీక్వెల్ తాను నటిస్తానని మాత్రం ఆశించవద్దని క్లారిటీ ఇచ్చింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడం చాలా కష్టమని ఆండ్రియా పేర్కొంది. -
నిలవాలి కలకాలమే...
‘‘రా నాతో... ఆ ఆకాశంలో మేఘాలవుదాం... ఓ వర్షం కురిపించేద్దామ్..’ అంటూ మొదలవుతుంది ‘కామాఖ్య’ సినిమాలోని ‘సఖీ’పాట. సమైరా, సముద్ర ఖని, అభిరామి ప్రధానపాత్రధారులుగా, అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ సినిమా ‘కామాఖ్య’. వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి స్నేహం నేపథ్యంలో సాగే మెలోడీ సాంగ్ ‘సఖీ’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.‘‘సఖీ... గులాబీ మన స్నేహమే... సరదాల దీవి మన స్నేహమే... సఖీ’, ఇలాంటి మన స్నేహమే... నిలవాలి ఇంక కలకాలమే..’ అంటూ ఈపాట సాగుతుంది. సంగీత దర్శకుడు గ్యాని స్వర కల్పనలో అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈపాటను లక్ష్మీ మేఘన ఆలపించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. -
ట్రెండింగ్లో గాడ్ మోడ్ సాంగ్
‘గాడ్ మోడ్...’ అంటూ హుషారుగా చిందేస్తున్నారు హీరో సూర్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరభద్రుడు’. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. మే 14న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘గాడ్ మోడ్...’ అంటూ సాగేపాటని శనివారం విడుదల చేశారు మేకర్స్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈపాటని కాల భైరవపాడారు.‘‘తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల్లోపాపులర్ కంటెంట్ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ‘వీరభద్రుడు’ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని పెంచింది. ‘గాడ్ మోడ్...’ అంటూ సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పక్కా మాస్ ఎనర్జీతో ఊపేస్తూ, థియేటర్లలో విజిల్స్ పండించే డ్యా న్స్ నంబర్గా నిలుస్తుంది.కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పవర్ఫుల్గా, క్యాచీగా ఉండి ఒక్కసారి వినగానే గుర్తుండిపోయేలా ఉన్నాయి. కాల భైరవ వాయిస్ ఈపాటకు అదనపు పవర్ ఇచ్చి, ప్రతి బీట్ను మరింత ఎలివేట్ చేసింది. ఈ సాంగ్లో సూర్య చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. స్టైల్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ... అన్నీ కలిపి ఆయన్ను మరింత స్పెషల్గా చూపిస్తున్నాయి. ఇప్పటికే ఈపాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ, సినిమా హైప్ను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జీకే విష్ణు. -
సోషల్ మీడియాలో ధురంధర్-3.. కథ-స్క్రీన్ ప్లే రెడీ
గత నెల రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్-2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం (ధురంధర్-2) ఎలా ముగిసిందో సినిమా చూసిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. భార్య, కొడుకును వదిలి ఇండియా వచ్చేస్తాడు హీరో. ఆ తర్వాత ‘RAW’ కనుసన్నల నుంచి తప్పించుకొని నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అయితే దూరం నుంచే తన తల్లిని, చెల్లిని చూసి తిరిగి వెనుదిరుగుతాడు. ఇలా సాగిన ధురంధర్-2 క్లయిమాక్స్ నుంచి ధురంధర్-3 కథను అల్లేస్తున్నారు సోషల్ మీడియాలోని కొంతమంది జనం. అయితే హీరో మరోసారి రా ఏజెంట్గా పాకిస్థాన్లో అడుగుపెడతాడని, కొత్త గెటప్లో పాకిస్టాన్లో మరోసారి అడుగుపెట్టి తన భార్య, కొడుకును కలుస్తాడంటూ ఎవరికివారు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అల్లేస్తున్నారు. ఇలా ధురంధర్ ఫ్రాంచైజీపై ఓ కొత్త చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ధురంధర్-3పై దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల ఇదే ప్రశ్న ఆదిత్య ధర్కి ఎదురైంది. దానికి 'ఏమో చెప్పలేం' అన్నట్టు మాత్రమే ఆయన స్పందించాడు. అంతేకానీ ధురంధర్-3 తప్పకుండా తీస్తానని ఆదిత్య ధర్ అనలేదు.కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథలని నిజానికి ఓసారి పరిశీలిస్తే ఈ దర్శకుడికి కచ్చితంగా పార్ట్-3కి ఓ లైన్ దొరికే అవకాశం ఉందనే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. -
రాముడిగా రణ్బీర్ సెట్ కాలేదు.. బాలీవుడ్ నటుడు కీలక వ్యాఖ్యలు!
దర్శకుడు నితీశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాపై నటుడు సునీల్ లహ్రీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాముడిగా పాత్రకి రణ్బీర్ కపూర్ అంతగా సెట్ అవ్వలేదన్నాడు. రాముడి పాత్రకు ఉండాల్సిన మృదు స్వభావం రణ్బీర్లో కనిపించలేదన్నాడు.తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘రామాయణ’టీజర్ చూశాను. అందులో నేను ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు కనిపంచలేదు. రాముడిగా రణ్బీర్ చూడడానికి బాగానే ఉన్నాడు. కానీ అతనిలో సున్నితం, అమాయకత్వం కనిపించడం లేదు. ఆయన కాస్త కఠినంగా కనిపిస్తున్నారు. తన నటనతో అయినా ఈ పాత్రకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ..‘రణ్బీర్ రాముడి పాత్ర కాకుండా లక్ష్మణుడు లేదా భరతుడి పాత్రలు పోషిస్తే బాగా సెట్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది మనసులను గెలుచుకున్న ‘రామాయణం’ సీరియల్లో లక్ష్మణుడు పాత్రని సునీల్ లహ్రీ పోషించాడు. ‘రామాయణ’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై రూ. 4000 భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ దీపావళికి విడుదల కానుంది. -
‘లీడర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : లీడర్నటీనటులు:శరవణన్, పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్, ఐశ్వర్య తదితరులునిర్మాణ సంస్థ: లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్దర్శకుడు: ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్సంగీతం: జిబ్రాన్సినిమాటోగ్రఫీ: ఎస్. వెంకటేష్ఎడిటర్ : ప్రదీప్ ఇ.రాఘవ్విడుదల తేది: ఏప్రిల్ 3‘ది లెజెండ్’(2022) తో ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘లీడర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? శరవణన్ ఖాతాలో హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..శక్తివేల్ (శరవణన్) కారు మెకానిక్. భార్య చనిపోతుంది. కూతురు అయిరేని(ఇయల్) అంటే అతనికి ప్రాణం. ఆమెకు వినికిడి లోపం ఉంటుంది. ఆమెకు ఆపరేషన్ చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు శక్తివేల్ ఉండగా.. ఓ రోజు ఎస్సై ఇంద్రా సత్యమూర్తి (ఆండ్రియా) వచ్చి.. తన షెడ్డులోకి రిపేర్కి వచ్చే సాల్ట్(బాహుబలి ప్రభాకర్)కు చెందిన కారులో ఓ ఆడియో బగ్ పెట్టమని కోరుతుంది. దానికి శక్తివేల్ నిరాకరిస్తాడు. అయితే తన కూతురిని సాల్ట్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని నమ్మించి..పోర్టులో ఉన్న పేలుడు పదార్థాల కంటెయినర్ని బయటకు తీసుకొచ్చేలా చేస్తుంది. పోలీసుల ఆధీనంలో ఉన్న ఆ కంటెయినర్ తిరిగి తీసుకురాకపోతే..నిజంగానే కూతురుని చంపేస్తామని సాల్ట్ హెచ్చరిస్తాడు. మరి కూతురుని కాపాడుకునేందుకు శక్తివేల్ ఏం చేశాడు? పోలీసుల ఆధీనంలో ఉన్న కంటెయినర్కు విదేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ డెవిల్(సంతోష్ ప్రతాప్)కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎస్సై ఇంద్రా సత్యమూర్తి వేసిన ప్లాన్ ఏంటి? ఆమె అలా ప్లాన్ వేసేలా చెసిందెవరు? అసలు శక్తివేల్ గతం ఏంటి? అతని భార్య మీరా(పాయల్ రాజ్పుత్)ని తన చేతులతోనే ఎందుకు చంపాడు? ట్వల్వ్ మెన్ స్క్వాడ్ అనే సీక్రెట్ రా ఏజెంట్కి శక్తివేల్తో ఉన్న సంబంధం ఏంటి? శక్తివేల్కి, డెవిల్కి మధ్య ఉన్న వైరం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. తండ్రి-కూతురు ఎమోషనల్తో కూడిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ తరహా చిత్రాల్లో యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉంటే.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. లీడర్లో ఆ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. భారీ యాక్షన్స్తో పాటు చిన్న చిన్న ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథనం సాగుతుంది. రొటీన్ కథే అయినా.. స్క్రీన్ప్లే మాత్రం అదిరిపోయింది. ఫస్టాఫ్ అంతా తండ్రి కూతురు బాండింగ్తో పాటు.. ఎస్పై ఇంద్రా సత్యమూర్తి ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతుంది. సాల్ట్ యార్డ్లో జరిగే అక్రమాలను బయట పెట్టేందుకు ఎస్సై ఇంద్ర.. శక్తివేల్ సాయం అడిగినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. పోలీసుల ఆధీనంలో ఉన్న కంటెయినర్ని పట్టుకునేందుకు శక్తివేల్ వేసిన ప్లాన్.. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బ్లాక్.. సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం భారీ యాక్షన్ సన్నివేశాలలతో ఆసక్తికరంగా సాగుతుంది. శక్తివేల్ ప్లాష్బ్యాక్ ఆకట్టుకుంటుంది. అయితే హీరో హీరోయిన్ల లవ్స్టోరీ మాత్రం సినిమాటిక్గా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంతగా కుదరలేదు. అలాగే రా ఏజెంట్స్ చేసే ఆపరేషన్స్ కూడా మరింత థ్రిల్లింగ్గా సాగితే బాగుండేది అనిపిస్తుంది. చివరి గంట మాత్రం భారీ యాక్షన్, ట్వీస్టులతో కథనం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్రైన్ యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇదే కథ, స్క్రీన్ప్లేతో స్టార్ హీరో చేస్తే మాత్రం.. ఫలితం మరోలా ఉండేది. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేసుకోకపోవడం కూడా కొంతమేర మైనస్సే. స్పై యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు ‘లీడర్’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. శక్తివేల్ పాత్రకు శరవణన్ న్యాయం చేశాడు. రా ఏజెంట్ మాదిరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీరియస్ లుక్ని మెంటేన్ చేశాడు. యాక్షన్ సీన్లలో కూడా బాగానే నటించాడు. ఇక మీరాగా పాయల్ రాజ్పుత్ తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆండ్రియా, లాల్, శ్యామ్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్, బాహుబలి ప్రభాకర్తో పాటు మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీబ్రాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. వేంకటేష్ సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ఓటీటీలో డైరెక్ట్గా స్ట్రీమింగ్ కానున్న మూవీ.. ఫన్నీగా ట్రైలర్
బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు, సాన్యా మల్హోత్ర నటించిన సినిమా ‘టోస్టర్’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ డైరెక్ట్గా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ఏప్రిల్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వివేక్ దాస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన పూరన్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఫరా ఖాన్, సీమా పహ్వా తదితరులు నటించారు. ఈ మూవీని రాజ్కుమార్ రావు సతీమణి నటి పత్రలేఖ కంపా ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మించారు.ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కథ మొత్తం భార్యాభర్తల మధ్య జరగనుందని అర్థం అవుతుంది. మహా పిసినారి పాత్రలో రాజ్కుమార్ రావ్ నటిస్తున్నాడు. ఒకరోజు పెళ్లికి వెళ్లిన రాజ్ కొత్త జంట కోసం రూ. 5వేలు విలువ చేసే ఒక టోస్టర్ను గిఫ్ట్గా ఇస్తాడు. అయితే, పలు కారణాలతో ఆ పెళ్లి ఆగిపోతుంది. దీంతో తాను ఇచ్చిన కానుకను తిరిగి ఇవ్వాలని పెళ్లి వారి ఇంటికి వెళ్తాడు. తను గిఫ్ట్గా ఇచ్చిన వస్తువు కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది పూర్తి స్టోరీలో రివీల్ కానుంది. -
రామాయణం బడ్జెట్ చూస్తే షాక్! ఆదిపురుష్, వారణాసితో పోల్చితే
-
వాటిని అధిగమిస్తూ ఛాన్స్లు తెచ్చుకుంటున్నపూజా
సినిమాల్లో లక్కు అవకాశాలను అందించినా, నిలబెట్టేది మాత్రం ప్రతిభనే. అదే శాశ్వత స్థానాన్ని కల్పిస్తుంది. లక్కు, ప్రతిభలో మధ్య ఊగిసలాడుతున్న నటీమణుల్లో పూజాహెగ్డే ఒకరు. పుష్కరం కాలం పాటు కథానాయకిగా కొనసాగుతున్నారు. తెలుగులో అల్లుఅర్జున్ సరసన నటించిన అలవైకుంఠపురంలో, మహేష్బాబుకు జతగా నటించ్చిన మహర్షి వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించడంతో పూజాహెగ్డేకి ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చింది. అయితే ఆ తర్వాత నటించిన కొన్ని భారీ చిత్రాలు నిరాశపరచడంతో ఈమెకి అవకాశాలు కరువయ్యాయి. అదే సమయంలో ఈమె నటించిన బీస్ట్ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీని హిందీ చిత్రాలు ఆదుకున్నాయి. అయితే అక్కడ కూడా సరైన విజయం లిభించలేదు. ఈమధ్య సూర్యతో నటించిన రెట్రో చిత్ర విజయం పూజాహెగ్డేకు మళ్లీ ఆశలను చిగురింపజేసింది. కూలీ చిత్రంలో ఐటెం సాంగ్లో నటించి అలరించారు. ఇలాంటి తరుణంలో మరోసారి విజయ్తో జననాయకన్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అయితే ఈ చిత్రం సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ చిత్ర పరిశ్రమలో జయాపజయాలు సరి సమానం అని పేర్కొన్నారు. తాను నటిస్తూ బిజీగానే ఉన్నానని, ఎవరి ఊహాత్మక ప్రశ్నలకు బదులు చెప్పదలుచుకోలేదన్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో ఒక్క చిత్రంలో నటిస్తున్న పూజాహెగ్డే తమిళంలో ధనుష్తో జత కట్టడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. -
నాలో సీమ ఫీలింగ్ ఉంది: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అనంతపురంలో ముగిసింది. అక్కడి స్థానికులు విజయ్–రష్మిక జంట మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని, బైక్ ర్యాలీలతో అభిమానులు విజయ్ పట్ల అభిమానం చాటుకున్నారని యూనిట్ పేర్కొంది. అలాగే తన రాయలసీమ ఫ్యాన్స్ని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్లో కలిశారు. రాయలసీమకు ఎప్పుడొచ్చినా తన సొంతూరుకి వచ్చినట్లుగా అనిపిస్తోందని, తన లోపల సీమ ఫీలింగ్ ఉందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.రష్మిక... బ్యాక్ టు జపాన్వచ్చే నెల జపాన్ వెళ్లనున్నారు రష్మికా మందన్నా. ‘క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్–2026’ టెన్త్ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవం మే 23న టోక్యోలో జరగనుంది. ఈ వేడుకకు రష్మికా మందన్నా ఓ ప్రజెంటర్గా హాజరు కానున్నారు. అయితే ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డు వేడుకలో ఆమె పాల్గొనడం ఇదేం తొలిసారి కాదు. 2024లో ఆమె ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని, ‘బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్’ విభాగంలో విజేతకు అవార్డును అందించారు. ఇలా ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఓ ప్రజెంటర్గా పాల్గొన్న తొలి ఇండియన్ యాక్టర్గా నిలిచారామె. మళ్లీ వచ్చే నెలలో జపాన్ వెళ్లనున్నారు. ఇక మొత్తం 32 విభాగాల్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది. తాజాగా నామినేషన్స్ను ప్రకటించారు. ఈ క్రమంలోనే అవార్డుల ప్రజెంటర్స్ పేర్లను కూడా ప్రకటించారు నిర్వాహకులు. ఈ జాబితాలో రష్మికా మందన్నా పేరు ఉంది. -
మే 14న వీరభద్రుడు
సూర్య హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కరుప్పు’. త్రిష హీరోయిన్గా నటించారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ చిత్రం మే 14న విడుదల కానుంది.కాగా, ఈ సినిమాకు తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో కత్తి పట్టుకుని మాస్ లుక్లో కనిపిస్తున్నారు సూర్య. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్. -
దురంధర్ నటుడికి జాక్పాట్.. జూనియర్ ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం మూడు నెలల్లోనే సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దురంధర్ టీమ్కు ఎక్కడా లేని క్రేజ్ను తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో నటించిన వారికి ఆదరణ ఓ రేంజ్లో వస్తోంది. తాజాగా ఓ దురంధర్ నటుడికి ఏకంగా టాలీవుడ్ ఛాన్స్ తీసుకొచ్చింది దురంధర్. ఈ మూవీలో నటించిన బిమల్ ఒబెరాయ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న డ్రాగన్ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో బిమల్కు అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది.కాగా.. బిమల్ ఓబెరాయ్ దురంధర్లో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడర్ శ్రీరాని బలోచ్ పాత్రలో మెప్పించారు. ఈ పాత్ర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సీరియస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో బిమల్ ఆడియన్స్ను అలరించారు. తాజాగా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్ మూవీలో ఎలాంటి రోల్ చేస్తారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. #Dhurandhar fame #BimalOberoi aka #ShiraniBaloch has been roped in by #PrashanthNeel for #Dragon. 🔥#NTRpic.twitter.com/kqkYsg3myv— Milagro Movies (@MilagroMovies) April 3, 2026 -
టాలీవుడ్లోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్..దర్శకుడు ఎవరంటే?
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు టాలీవుడ్ వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ, ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ తెలుగు సినిమాతో సౌత్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. ‘పేపర్ బాయ్’, ‘అరి’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. చిత్రంలోని అత్యంత కీలకమైన సన్నివేశాలను డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో సినిమాను రూపొందిస్తున్నారు.ఈ క్రేజీ ప్రాజెక్టులో జాక్వెలిన్ సరసన నటించే హీరో ఎవరు? సినిమా టైటిల్ ఏమిటి? అనే విషయాలను చిత్ర యూనిట్ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. అయితే, టాలీవుడ్కు చెందిన ఒక స్టార్ హీరో ఇందులో నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఈ చిత్ర టైటిట్తో పాటు ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. -
మెగా హీరో కొత్త సినిమా.. సంబరాల ఆగిపోయినట్టేనా?
మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీ ఆగిపోయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మెగా హీరో మరో కొత్త సినిమా ప్రకటించారు. క మూవీ డైరెక్టర్ సుజిత్, సందీప్ల దర్శకత్వంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సాయి దుర్గ తేజ్ కెరీర్లో 19 మూవీగా నిలవనుంది. ప్రస్తుతం ఈ సినిమాను ఎస్డీటీ19 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కంచునున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ చేయనున్నారు. Secrets of the Ages… Power beyond imagination.Stepping into something truly powerful… Excited to be part of this journey with the Dynamic directors @Dir_Sujith & @Dir_SandeepM and Passionate Producer @Sahugarapati7 anna#SDT19 #CosmicChronicles @Shine_Screens… pic.twitter.com/OxXyLhUK6S— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 3, 2026 A powerful collaboration comes together for #SDT19 ❤️🔥Mega Supreme Hero @IamSaiDharamTej joins hands with visionary director duo @Dir_Sujith & @Dir_SandeepM, backed by blockbuster producer @Sahugarapati7 🔥A new cinematic chapter unfolds. ✨#CosmicChronicles #Archana… pic.twitter.com/dWagdUQwBk— Shine Screens (@Shine_Screens) April 3, 2026 -
రూ.4,000 కోట్ల బడ్జెట్.. ఇదెలా మర్చిపోయారు? వీడియో వైరల్
కొన్ని కథలు తెరపై ఎన్నిసార్లు చూపించినా చూడాలనిపిస్తుంది. తెలిసిన కథే అయినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అలాంటి ఇతిహాస కథే రామాయణం. రాముడి కథను మరోసారి సినీప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు సినిమా వస్తోంది.. అదే రామాయణ. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.టీజర్లో ఇది గమనించారా?హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2న) టీజర్ కూడా వదిలారు. ఇందులో రాముడు శివధనస్సు విరిచినప్పటినుంచి అరణ్యవాసం వరకు అనేక విషయాలకు సంబంధించిన గ్లింప్స్ను జత చేశారు. అయితే శ్రీరాముడు నగర వీధుల్లో నడుస్తుంటే జనం పూలతో స్వాగతం పలికే చిన్న క్లిప్లో ఓ పొరపాటు దొర్లింది. ఓ వ్యక్తి తలపాగా ఉన్నట్లుండి రంగు మారింది. మొదట నీలిరంగులో, తర్వాత వంకాయ కలర్లో.. ఆ తర్వాత మళ్లీ నీలిరంగులోకి మారింది. అలా వదిలేశారేంటి?34 సెకన్ల నుంచి 38 సెకన్ల నిడివి మధ్యలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ మూవీలో ఈ చిన్న తప్పిదాన్ని అలాగే వదిలేశారేంటి? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇది వీఎఫ్ఎక్స్ సమస్య కాదని కలర్ గ్రేడింగ్ వల్ల అలా జరిగిందని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు.సినిమారామాయణ విషయానికి వస్తే.. నితీశ్ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ సంస్థ ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ చేసే బాధ్యతలను చేపట్టింది. హన్మ్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. Notice the blue turban guy next to the kid his turban colour changes to purple in between shots 😳😳₹4000 Cr Movie has new technology altogether it seems 🤩🤩#Ramayana pic.twitter.com/Bu48kWPhlq— Pan India Review (@PanIndiaReview) April 3, 2026 చదవండి: యుగానికి ఒక్కడు సీక్వెల్.. నేనైతే అస్సలు చేయను: ఆండ్రియా -
'ఐ యామ్ నాట్ జెట్లీ..' బోల్డ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
'మత్తు వదలరా' సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేశ్ రానా.. కమెడియన్ సత్యని హీరోగా ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు 'జెట్లీ' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సత్య ఈజ్ నాట్ జెట్లీ అంటూ సాగే పుల్ మాస్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు సాయి సోమయాజులు లిరిక్స్ అందించగా..శ్రావణ భార్గవి ఆలపించారు. ఈ పాటకు కాల భైరవ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రియా సింఘా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. Repeat after us...SATYA IS NOT JETLEE ❌SATYA IS NOT JETLEE ❌#SatyaIsNotJetlee video song out now ❤🔥▶️ https://t.co/HYbBF6efT4#JETLEEA @RiteshRana's turbulence 🛫A @kaalabhairava7's musical.Starring #Satya, #RheaSingha, @vennelakishore @harshachemudu… pic.twitter.com/yNbmWTB1kj— Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2026 -
‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత మెగా డాటర్ నిహారిక నిర్మించిన రెండో చిత్రం రాకస. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్స్..మరే చిత్రానికి చేయలేదు. మెగా హీరోలు కూడా ప్రమోషన్స్లో పాల్గొనడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ట్రైలర్, టీజర్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నిర్మాతగా నిహారిక ఖాతాలో రెండో విజయం పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరు(సంగీత్ శోభన్).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్పోర్ట్ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నటీనటులు, కథను పట్టించుకోరు. భయపెడుతూ నవ్విస్తే చాలు.. ఆ సినిమాను ఆదరిస్తారు. రాకస టీమ్ కూడా అదే పని చేసింది. చిన్నప్పుడు చదువుకున్న బకాసురుడి కథను స్ఫూర్తిగా తీసుకొని దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే హారర్ కంటే ఎక్కువగా కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. అది బాగానే వర్కౌట్ అయింది కూడా. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసే సన్నివేశాలతో ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను తీర్చిదిద్దారు.పాడుబడ్డ కోట..ఆ కోటకు వెయ్యేళ్ల చరిత్ర.. బ్రహ్మరాక్షసుడి కండీషన్..ఇలా సినిమా ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడైతే హీరో ఎంట్రీ ఇస్తాడో కథనం కామెడీ వైపు టర్న్ తీసుకుంటుంది. ప్రియురాలి కోసం అమెరికా నుంచి రావడం..అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. ఊరి పెద్దల తీర్పుతో పాస్పోర్టు కోల్పోవడం..ఇందంతా కామెడీగా సాగిపోతాయి. అయితే ఈ తరహా పంచ్లు, కామెడీ సీన్లు చాలా సినిమాల్లో చూడడంతో ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోదు. అసలు కథను ప్రారంభించడానికి ఇదంతా సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్తో కథపై ఆసక్తి పెరుగుతుంది. హీరో ఎప్పుడైతే కోటలోకి ప్రవేశిస్తాడో.. అప్పటి నుంచి కథనం పరుగులు పెడుతూ.. నవ్వులు పూయిస్తుంది. బ్రహ్మరాక్షసుడి సీన్ భయపడితే..దెయ్యాల సీన్ నవ్వులు పూయిస్తుంది. ఇక గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, నయన్ సారిక కూడా కోటలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నవ్వులు డబుల్ అవుతాయి. అదే సమయంలో బ్రహ్మరాక్షసుడి నుంచి ఈ గ్యాంగ్ ఎలా తప్పించుకుంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్గా అనిపిస్తుంది. అయితే సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. ఈ రోజుల్లు దెయ్యాలు, రాక్షసులు ఉంటాయా? అని లాజిక్కులు వెతక్కుండా సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. సంగీత్ శోభన్ మంచి నటుడు. ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమైపోతాడు. వీరూ పాత్రలో కూడా ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్, సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నయన్ సారిక తెరపై అందంగా కనిపించింది. వీరిద్దరి లవ్ట్రాక్ అంతగా పండలేదు కానీ.. బోర్ మాత్రం కొట్టించదు. గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ల కామెడీ కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. కోటలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టాలి. ఈ విషయంలో సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్ విజువల్స్ బాగుతున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిహారిక ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. గ్రాండ్ లెవల్ లో సినిమాను నిర్మించారు. -
15 రోజుల్లో దురంధర్-2 కలెక్షన్స్.. అఫీషియల్ ప్రకటన
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. గతేడాది రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచిన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 19న విడుదలైదన ఈ మూవీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ మరో మైలురాయిని చేరుకుంది. రిలీజైన 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు.తొలివారంలో వెయ్యి కోట్లు దాటిన దురంధర్ ది రివెంజ్.. రెండోవారంలో కాస్తా జోరు తగ్గింది. ఈ వసూళ్లతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు దంగల్, బాహుబలి-2, పుష్ప-2 తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో రూ. 937.32 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.ఆదిత్య ధర్ డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కించారు. పాకిస్తాన్కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ భారతీయ గూఢచారి హంజా అలీ మజారి పాత్రలో నటించారు. ఇందులో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పాండోర్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు.Duniya bhar mein goonj rahi hai naye Hindustan ki dahaad. 🔥Day-wise break-up | IndiaWeek 1: ₹690 Cr*DAY 9: ₹42 Cr*DAY 10: ₹64 Cr*DAY 11: ₹71 Cr*DAY 12: ₹26 Cr*DAY 13: ₹28 Cr*DAY 14: ₹21 Cr*Day 15: ₹19 Cr*India: ₹961 Cr*Worldwide GBOC (2 weeks)India:… pic.twitter.com/jF0uS998P1— Jio Studios (@jiostudios) April 3, 2026 -
'మీ హేమక్క ఎప్పుడు అలా చేయదు'.. వీడియో రిలీజ్
టాలీవుడ్ నటి హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ప్రెస్ మీట్లోనూ తనకు పాజిటివ్ రాకుండానే.. వచ్చిందని రాసుకొచ్చారని తన బాధను పంచుకుంది.తాజాగా నటి హేమ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ప్రస్తుతం కొండాపూర్లోని పబ్కి వచ్చానని తెలిపింది. పోలీసుల రైడ్లో కొంతమందికి పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. అక్కడే ఉన్న నన్ను కూడా టెస్ట్ చేశారని.. కానీ నాకు నెగెటివ్ వచ్చిందని చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'రేపు మళ్లీ ఈ వీడియోను పోస్ట్ చేస్తాను.. మీ హేమక్క ఎప్పుడు తప్పు చేయదు.. జెన్యూన్గా ఉంటుంది.. ముక్కుసూటిగా ఉంటది.. లవ్ యూ ఆల్' అంటూ వీడియోలో మాట్లాడారు హేమ.HYD కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్పై పోలీసుల రైడ్లో కొంతమందికి పాజిటివ్ వచ్చింది అని చెబుతున్నారు.అక్కడ ఉన్న తనకు టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చిందని నటి హేమ వీడియో విడుదల చేశారు. హేమ ఎప్పుడు తప్పు చేయదు జెన్యూన్ గా ఉంటుంది..ముక్కు సూటిగా మాట్లాడుతుంది ..అని అన్నారు నటి హేమ… pic.twitter.com/gzH3Y6EhQn— Tupaki (@tupaki_official) April 3, 2026 -
హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై చిన్ని బాబు అంటూ తనయుడిపై తన ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ అల్లు అయాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మలయాళ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ డైరెక్షన్లో పని చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.Many happy returns of the day to the love of my life. Happy Birthday, my chinni babu. #HBDAlluAyaan #AyaanisaVibe pic.twitter.com/czUM77roIv— Allu Arjun (@alluarjun) April 3, 2026 -
సడన్గా ఓటీటీకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హనుమాన్ ఫేమ్ వరలక్ష్మీ శరత్కుమార్ స్వీయ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సరస్వతి. ఈ చిత్రంలో ప్రియమణి ప్రకాశ్రాజ్, రావు రమేశ్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 6న విడుదలైంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద రెస్పాన్స్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా రాణించలేకపోయింది. ఈ సినిమాతో వరలక్ష్మీ దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది.తాజాగా ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు భాషలతో పాటు కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో చూడనివారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. సరస్వతి కథేంటంటే..లక్ష్మి(వరలక్ష్మి శరత్కుమార్) సింగిల్ మదర్. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తుంది. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. ఆగస్ట్ 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్లో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే.. సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాస్లో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదేరోజు రాత్రి స్కూల్ నుంచి లక్ష్మికి ఓ ఫోన్ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని,వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. అదేరాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి..ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.అయితే సీఐ కృష్ణారెడ్డి(మురళీ శర్మ) మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్ చేస్తానంటూ.. శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయిస్తుంది. న్యాయవాది రామానుజం (ప్రకాశ్ రాజ్)ఆమెకు తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయ సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? సరస్వతిపై అత్యాచారానికి పాల్పడిందెవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే. -
అప్పుడేమో విరక్తి.. ఇప్పుడేమో ప్రశంసలు కురిపించిన 'సీత'
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. నిన్న (ఏప్రిల్ 2న) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. టీజర్లో రాముడిని హైలైట్ చేసి చూపించారు. సీత, హనుమంతుడు, రావణాసురులను చూపించలేదు.టీజర్పై సీత ప్రశంసలుఈ టీజర్పై రామాయణ్ టీవీ సీరియల్లో సీతగా నటించిన దీపిక చికిల ప్రశంసలు కురిపించింది. టీజర్ చూశాను, చాలా బాగుంది. ఎంతో రిచ్గా, అద్భుతంగా తీశారు. ఒక అందమైన కావ్యంలా కనిపిస్తోంది, అందులో డౌటే లేదు. ఈ మూవీ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే దీపిక గతంలో రామాయణ కథపై సినిమాలు తీయడాన్ని విమర్శించింది. అప్పుడేమో విరక్తి'రామాయణాన్ని పదేపదే తెరకెక్కించాలని చూస్తున్నవారిని చూస్తుంటే విరక్తిగా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లు తెరకెక్కించిన ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కొత్త యాంగిల్, కొత్త లుక్.. ఇలా ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలని ట్రై చేస్తారు. అలా వారు యదార్థ కథను నాశనం చేస్తున్నారు. కాబట్టి రామాయణంపై సినిమాలు తీయకపోవడమే మంచిది' అని దీపిక అభిప్రాయపడింది. ఇప్పుడు ఆమె తన మనసు మార్చుకుని రామాయణపై ప్రశంసలు కురిపించడం విశేషం!సీరియల్- సినిమాఇకపోతే దీపిక.. 1980లో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణ సీరియల్లో సీతాదేవిగా నటించింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా అరవింద్ త్రివేది రావణుడిగా, సునీల్ లహ్రి లక్ష్మణుడిగా, దారా సింగ్ హనుమంతుడిగా యాక్ట్ చేశారు. ఇక నితీశ్ తివారి రామాయణ విషయానికి వస్తే.. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ అనే సంస్థ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ అందిస్తోంది. యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: వెండితెరపై వీరుల పోరాటం -
‘బైకర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : బైకర్నటీనటులు: శర్వానంద్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులునిర్మాణ సంస్థ: యూవి క్రియేషన్స్నిర్మాతలు:వంశీ-ప్రమోద్దర్శకత్వం: అభిలాష్ రెడ్డిసంగీతం: జిబ్రాన్సినిమాటోగ్రఫీ: జె యువరాజ్ఎడిటింగ్: అనిల్ కుమార్ పివిడుదల తేది: ఏప్రిల్ 3, 2026శర్వానంద్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘బైకర్’ తో వచ్చాడు. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శర్వా ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ (శర్వానంద్) మోటోక్రాస్ రేసర్. తండ్రి సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీలే ఆయన గురువు. ఎప్పుటికైనా ఇండియాలో కూడా మోటోక్రాస్ రేసింగ్కు గుర్తింపు తీసుకురావాలనే తండ్రి కల కోసం విక్కీ అహర్నిశలు కష్టపడతాడు. నెంబర్ వన్ బైక్ రేసర్గా నిలుస్తాడు. కొడుకు ఛాంపియన్గా మారిన తర్వాత అంతర్జాతీయ స్థాయి రేసింగ్ పోటీల్లోకి దించాలనుకుంటాడు సునీల్. అందుకోసం ఐఎన్జీ అనే స్పాన్సరింగ్ కంపెనీ అధినేత(అతుల్ కులకర్ణి)ని ఒప్పిస్తాడు. అగ్రిమెంట్ కాగితాలపై సంతకం చేసిన తర్వాత విక్కీ అనూహ్యంగా రేసింగ్ నుంచి తప్పుకుంటాడు. తండ్రిని చిన్న మాట అంటేనే భరించలేని విక్కీ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనన్య(మాళవిక నాయర్) ఎవరు? ఆమె విక్కీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? కొన్నాళ్ల పాటు రేసింగ్కు దూరంగా ఉన్న విక్కీ.. మళ్లీ మోటోక్రాస్ రేసర్గా ఎందుకు మారాడు? తిరిగి వచ్చిన కొడుక్కి సునీల్ మళ్లీ కోచింగ్ ఇచ్చాడా? లేదా? చివరకు తండ్రికొడుకులు కలిశారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..తెలుగు తెరపై స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాదు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాక్సింగ్, హాకీ.. ఇలా వివిధ క్రీడల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో ఇప్పటివరకు సినిమా రాలేదు. అదొక్కటే బైకర్ ప్రత్యేకత. కథా, కథనం రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా సినిమాల మాదిరే సాగుతుంది. ఛాంపియన్గా ఉండే హీరో ఉన్నపళంగా క్రీడను వదిలేసి సాధారణ జీవితం గడపడం.. తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా మళ్లీ ఆయన క్రీడల్లోకి రావడం.. క్లైమాక్స్లో విజేతగా నిలవడం..స్పోర్ట్స్ డ్రామా చిత్రాలన్నీ దాదాపు ఇలానే సాగుతాయి. అయితే కథనం ఎలా సాగింది? ఎమోషన్ ఏమేరకు పండింది? అనేదానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. బైకర్లోనూ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. సంఘర్షణ ఉంది. కానీ, అది ప్రేక్షకుడిపై అంతగా ప్రభావం చూపించలేకపోయింది. విజువల్స్తో పాటు రేసింగ్ సన్నివేశాలు మాత్రం అదిరిపోతాయి. రేసింగ్ సీన్లను తెరపై చూస్తుంటే గూస్బంప్స్ వస్తాయి. రేసింగ్ వదిలేసి సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా హీరో పరిచయ సన్నివేశాలు ఉంటాయి. భార్య, కొడుకుతో హాయిగా గడుపుతున్న సమయంలో తండ్రి గురించి ఓ వార్త వినడం.. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయిన తర్వాత నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. హీరో, హీరోయిన్ల లవ్స్టోరీ ఒకవైపు.. రేసింగ్ సీన్లు మరో వైపు.. ఫస్టాఫ్ అంతా ఇలా సాగుతుంది. ప్రతీది డీటైలింగ్గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెంకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం చాలా వరకు ఎమోషనల్గా సాగుతుంది. తండ్రి కోసం మళ్లీ రేసర్గా మారడం.. ప్రాక్టీస్ సమయంలో హీరో పడే ఇబ్బందులు.. విలన్ చేసే కుట్రలను ఛేదించి.. చివరకు విజేతగా నిలవడం.. ఇలా ఊహకందేలా కథనం సాగుతుంది. ముందుగా చెప్పినట్లు భావోద్వేగాలను మరింతగా పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు రేసింగ్ సీన్లపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. అవి ఆకట్టుకున్నాయి కూడా! అదే స్థాయిలో భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం శర్వా నటన అని చెప్పొచ్చు. తెరపై చూస్తుంటే అచ్చమైన స్పోర్ట్స్ మెన్లానే ఆయన లుక్ ఉంది. అటు యాక్షన్, ఇటు ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించాడు. ఈ మూవీ కోసం శర్వానంద్ పడిన కష్టమంతా తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. హీరో తండ్రి, కోచ్ బుల్లెట్ సునీల్గా రాజశేఖర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయనకు పెద్దగా డైలాగులు లేకున్నా.. కథ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. హీరోయిన్ మాళవిక నాయర్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్లు ‘జెర్సీ’ సినిమాను గుర్తు చేస్తాయి. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. పాటలు కూడా సందర్భానుసారం వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. రేసింగ్ సీన్లను తెరపై అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
వెండితెరపైకి వీరుల పోరాటం
స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో మహానుభావులు పోరాటాలు చేశారు. బ్రిటిషర్లకు ఎదురు నిలిచి అమరులైన వారు ఎందరో ఉన్నారు. ఈ వీరుల పోరాట స్ఫూర్తిని కథలుగా మలిచి, వెండితెరపైకి తెస్తున్నారు కొందరు దర్శకులు. ఆ సినిమాల విశేషాలు తెలుసుకుందాం. పోరాటానికి కొత్త నిర్వచనం ‘‘ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయంలో పోరాటానికి ఓ యోధుడు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. అదేంటి అనేది ‘ఫౌజి’ సినిమాలో చూడొచ్చు’’ అని ఈ చిత్రం యూనిట్ చెబుతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా ప్రధానంగా 1940 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో బ్రిటిష్ సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రకథ ప్రధానంగా ప్రేమ, త్యాగం, యుద్ధం వంటి అంశాల మేళవింపుతో ముడి పడి ఉంటుందని తెలిసింది. ‘ఫౌజి’లో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.గత నెలలో ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు ప్రభాస్. అయితే వేసవి కావడంతో ఓ చిన్న బ్రేక్లో భాగంగా ప్రభాస్ విదేశాలకు వెళ్లారని, వచ్చే నెలాఖర్లో తిరిగి ఆయన ‘ఫౌజి’ షూట్లో పాల్గొంటారని సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. రణబాలి తిరుగుబాటు బ్రిటిషర్లకు ఎదురు నిలిచి, తిరుగుబాటు చేసిన ఓ యోధుడి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘రణబాలి’. రాయలసీమ ప్రాంతంలో 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆ సమయంలో భారతదేశ ప్రజల పట్ల బ్రిటిష్ పాలకులు ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు? మాతృభూమి కోసం రణబాలి ఎలాంటి పోరాటం చేశాడు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందని తెలిసింది. ‘డియర్ కామ్రేడ్ (2019), ఖుషి (2023)’ వంటి చిత్రాల తర్వాత ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తీసిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్లో విజయ్ దేవరకొండ నటిస్తుండగా, జయమ్మగా రష్మికా మందన్నా నటిస్తున్నారు. విలన్ సర్ థియోడోర్ హెక్టార్ పాత్రను ‘మమ్మీ’ సినిమా ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ అనంతపురంలో జరుగుతోందని తెలిసింది. విజయ్ దేవరకొండతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. టీ సిరీస్ ఫిలింస్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ల సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. డేవిడ్ రెడ్డి ‘మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటిషర్లకు అతను వార్ డాగ్ అయ్యాడు..’, ‘ఏ బ్రిటిష్ ఇండియా నహీ హై, ఏ డేవిడ్ రెడ్డీకా ఇండియా హై’... ఇటీవల విడుదలైన ‘స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్లోని రెండు డైలాగ్స్ ఇవి. మంచు మనోజ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. 1897 నుంచి 1920 మధ్య బ్రిటిష్ పాలనా కాలం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. బ్రిటిష్ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరాడిన యోధుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారు. ఉక్రెయిన్ నటి మరియా ర్యబోషప్క హీరోయిన్గా నటిస్తుండగా, ఆర్. పార్తీబన్, కాంచన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో భరత్ మోటుకూరి, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుందని తెలిసింది. ది ఇండియా హౌస్ నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వి మెగా పిక్చర్స్ పతాకంపై విక్రమ్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం అప్పట్లో లండన్లో కొందరు భారతీయుల వ్యూహాత్మక కార్యాచరణ, అమలు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ప్రధాన సినిమా కథాంశం 1905 నేపథ్యంలో సాగుతుంది. స్వాతంత్య్ర సమర యోధుడు వీర్ సావర్కార్ ప్రస్తావన ఈ సినిమా కథనంలో ఉంటుందని సమాచారం. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రæపోషిస్తున్నారు. ఒక తిరుగుబాటుదారుని కథ ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘అన్ని తిరుగుబాటులకు యుద్ధ రంగమే ఆధారం కాదు. కొన్ని విధి చేత ఎంపిక చేయబడతాయి. ఇది ఒక తిరుగుబాటుదారుని కథ’ అని ఈ సినిమా కాన్సెప్ట్ గురించి మేకర్స్ తెలి΄ారు. 18వ శతాబ్దంలో బెంగాల్ ప్రావిన్స్లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఓ తిరుగుబాటుదారుని నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తిరుగుబాటుదారునిగా రిషబ్ శెట్టి నటిస్తారు.ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
శారీలో నభా నటేశ్ అందాలు.. ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్..!
ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్ అందాలు..ఏఐ పిక్స్ షేర్ చేసిన రేణు దేశాయ్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గ్లామరస్ పిక్స్..శారీలో మత్తెక్కిస్తోన్న హీరోయిన్ నభా నటేశ్ అందాలు.. మార్చి జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి.. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
తెలుగులో తొలి ఏఐ సినిమా.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
ఏఐ వచ్చాక అన్ని రంగాల్లో సరికొత్త సాంకేతికతను అందిపుచ్చకుంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతున్నారు. తాజాగా పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్గా “అంబ’s రివెంజ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జయవర్ధన్ మాడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. 'తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. “అంబs రివెంజ్” ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్ను వినియోగింతాం. విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ను విడుదల చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంభందించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం " అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత కథాచిత్రాల దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ పౌరాణిక ప్రయోగాత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. -
దురంధర్-2 కోసం స్టార్ హీరో త్యాగం..!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. ఈనెల 10న రిలీజ్ కావాల్సిన హారర్-కామెడీ చిత్రం భూత్ బంగ్లాను పోస్ట్పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.ప్రస్తుతం దురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అందుకే భూత్ బంగ్లాను ఓ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల వల్లే వారం రోజులు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రేక్షకులకు మెరుగైన సినిమా అనుభవాన్ని అందించడం.. థియేటర్లలో సినిమా విజయవంతంగా రన్ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె అన్నారు. 'ధురందర్: ది రివెంజ్' చిత్రానికి మరింత సమయాన్ని ఇవ్వడం వల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని ఎగ్జిబిటర్లు భావించారు.కాగా.. భూత్ బంగ్లా చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, పరేష్ రావల్, టబు, రాజ్పాల్ యాదవ్, జిషు సేన్గుప్తా, మిథిలా పాల్కర్ కీలక పాత్రల్లో నటించారు. -
‘కార్మేని సెల్వం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘కార్మేని సెల్వం’నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్నిర్మాణ సంస్థ: పాత్వే ప్రొడక్షన్స్నిర్మాత:అరుణ్ రంగరాజులుదర్శకుడు: రామ్ చక్రిసంగీత దర్శకుడు: ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ (MAAS)సినిమాటోగ్రఫీ: యువరాజ్ దక్షణ్ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్విడుదల తేది: ఏప్రిల్ 3, 2026దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించడమే కాకుండా.. విలక్షణ నటుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నాడు సముద్రఖని. ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాల్లో లీడ్ రోల్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే ‘కార్మేని సెల్వం’. రేపు(ఏప్రిల్ 3) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..చెన్నైకి చెందిన సెల్వం(సముద్రఖని) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. వ్యాపారవేత్త సంపత్(గౌతమ్ మీనన్) దగ్గర డ్రైవర్గా పని చేస్తుంటాడు. భార్య శాంతి(లక్ష్మీ ప్రియా), కొడుకు బాలునే అతని ప్రపంచం. ఉన్నంతలో సంతోషంగా ఉండాలనేది అతని నైజం. బంధువుల ముందు చిన్నచూపు కావొద్దనేది భార్య శాంతి నైజం. ఫంక్షన్లో అవమానించారని, పౌరుషంతో ఇంట్లో దాచుకున్న డబ్బుతో పాటు మెడపై ఉన్న పుస్తెల తాడుని సైతం అమ్మి ఆడపడుచు కూతురుకి కానుకగా ఇచ్చేస్తుంది. ఓ రోజు కొడుకు తలకు గాయం కావడంతో ఆస్పత్రి ఖర్చులకై సొంత బావ దగ్గర రూ. 10 వేలు అప్పు తీసుకొస్తాడు సెల్వం. ఆ అప్పుని తీర్చేందుకు తన బాసుకు తెలియకుండా ఆయన కారుని టాక్సీలో పెడతాడు. టాక్సీలో ఎక్కినవాళ్ల మాటలు విని..సెల్వంకి డబ్బుపై ఆశ పెరుగుతుంది. ఆ ఆశ తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? భార్య, కొడుకుని వదిలేసి.. వేరే దేశం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు సెల్వం తిరిగి ఇండియాకు వచ్చాడా? రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణఈ సినిమా చివరిల్లో ఒక డైలాగు ఉంటుంది. ‘అవసరం లేనివి కొంటే..అవసరమైనవి కోల్పోతాం’. ఈ ఒక్క డైలాగ్తో ఈ కథ ఇచ్చే సందేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితం ఇది. డబ్బుపై ఆశతో ఫ్యామిలీని దూరం పెట్టి.. చిన్న చిన్న సంతోషలను సైతం మిస్ చేసుకుంటున్నాం. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్నట్లుగా.. పక్కవాళ్లను చూసి మన స్థాయిని మించి ఖర్చు చేస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలే.. ఇలాంటి పనులు చేసే అప్పులపాలు అవుతున్నాయి. కార్మెనీ సెలం సినిమాలో ఇదే చూపించారు. అప్పుల వల్ల మధ్యతరగతి కుటుంబాల సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలని ఎలా ప్రభావితం అవుతాయి అనేది చాలా రియలిస్టిక్ ఇందులో చూపించారు. అయితే ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తకాదు. మిడిల్ క్లాస్ కష్టాల నేపథ్యంలో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే సినిమాలు వస్తున్నాయి. కానీ ఇందులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలు చేస్తున్న తప్పులను చూపించారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చాలా ఎమోషనల్గా కథనం సాగుతుంది. ఫస్టాఫ్ మొత్తం మిడిల్ క్లాస్ కష్టాలను, సెకండాఫ్లో ఆ కష్టాల నుంచి బయటపడేందుకు చేసే అప్పులు, తప్పులను చూపిస్తూ..చివరిలో ఓ మంచి సందేశం అందించారు. ఆడపడచు పిలిచింది కదా అని సంతోషంగా ఫంక్షన్కి వెళ్తే.. అక్కడ వాళ్లను అవమానించడం.. అది తట్టుకోలేక దాచుకున్న కొద్ది డబ్బుని కూడా కానుకగా ఇవ్వడం.. అప్పు తీర్చడానికి సెల్వం తొలిసారి తప్పు దారి ఎంచుకున్నప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల మాటలు విని.. సెల్వం చేసే తప్పులన్నీ మనమో లేదా మన చుట్టు ఉన్నవాళ్లో చేసే ఉంటారు. అందుకే ఆ పాత్రతో కనెక్ట్ అయిపోతారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తి పెంచుతుంది. సెకండాఫ్ మొత్తం మరింత ఎమోషనల్గా సాగుతుంది. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఇతర దేశాలకు వెళ్లినవాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఈ సినిమా చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తారు.సెల్వం పాత్రలో సముద్ర ఖని ఒదిగిపోయాడు. . మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్ను పండించారు. ఆయన సతీమణిగా లక్ష్మీ ప్రియా తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.రేటింగ్: 2.75/5 -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడవుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్లో శర్వానంద్ బైకర్ రిలీజ్ కానుంది. దీంతో పాటు సంగీత్ శోభన్ కొత్త సినిమా రాకాస థియేటర్లలో సందడి చేయనుంది. వీటితో పాటు సముద్రఖని కార్మేని సెల్వం ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిలో బైకర్ మూవీపై ఆడియన్స్లో బజ్ క్రియేట్ అయింది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ మృత్యుంజయ్ ఈ ఫ్రైడే ఓటీటీలో సందడి చేయనుంది. మరో తెలుగు సినిమా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని కూడా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియన్స్ విషయానికొస్తే ఈ రెండు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, సిరీస్లు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫిక్స్..మృత్యుంజయ్-(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03బ్లడ్హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా- సీజన్-2-(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03అమెజాన్ ప్రైమ్..మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 03జియో హాట్స్టార్..ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03జీ5..బాబ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03ఆపీల్ టీవీ ప్లస్..యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03సన్ నెక్ట్స్..వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03సోనీ లివ్సితారే జమీన్ పర్(బాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 03 -
రాయలసీమలో రణబలి షూటింగ్.. వీడియో వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న హిస్టారికల్ యాక్షన్ మూవీ రణబలి. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని నంద్యాల జిల్లాలో జరుగుతోంది.తాజాగా ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ గుర్రంపై వస్తున్న వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ముండమోపి నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..రాప్పా సంపుదువ్ కానీ..' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ వింటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగానే తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో ఎక్కువ శాతం రాయలసీమ ప్రాంతంలో తెరెకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. Proper Rayalaseema Dialogues &Proper Rayalaseema Houses.నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..Mass 💥 #RanaBali pic.twitter.com/UCPAarktV6— low battery🪫 (@low__battery287) April 2, 2026


