breaking news
Movie News
-
కాంతా లగా ఫేమ్ ఆకస్మిక మరణం.. ఆమెను తలచుకుని భర్త ఎమోషనల్!
'కాంతా లగా' అనే పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (Shefali Jariwala). 2002లో వచ్చిన ఈ పాటతోనే మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్తో యూత్కు దగ్గరైంది. కానీ ఊహించని విధంగా ఆమె ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తాజాగా ఆమె మరణాన్ని తలచుకుని భర్త పరాగ్ త్యాగి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన భార్యతో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు.పరాగ్ తన పోస్ట్లో రాస్తూ.. 'షెఫాలి నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతావు. నువ్వు ఒక నమ్మకమైన స్నేహితురాలు, నా ప్రియమైన భార్య. నువ్వు మా అందరిని అమ్మలా చూసుకున్నావ్. ఎల్లప్పుడూ ఇతరులకు మొదటి స్థానం ఇచ్చే నువ్వు గొప్ప అంకితభావం గల వక్తి. కేవలం ఆప్యాయతగల భార్య మాత్రమే కాదు.. సింబాకు అద్భుతమైన తల్లివి కూడా. నువ్వు ప్రేమించిన వారి వెంట నిలిచే నమ్మకమైన స్నేహితురాలివి. అందుకే షెఫాలి గుర్తింపునకు అర్హురాలు. ఆమె ప్రజలను అలరించిన విధానం మరిచిపోలేనిది. ఇప్పుడు మనతో లేకపోయినా తన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేం. శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అంటూ ఎమోనషల్ అయ్యారు. కాగా.. ఆమె మరణం తర్వాత ఐదు రోజులకు షెఫాలీ జరివాలా జ్ఞాపకార్థం ముంబయిలో ప్రార్థనా సమావేశం నిర్వహించారు. View this post on Instagram A post shared by Parag Tyagi (@paragtyagi) -
కలర్ ఫుల్ శారీలో అనసూయ.. బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ విష్ణుప్రియ గ్లామరస్ లుక్స్!
కుమారుడితో హీరోయిన్ అమలాపాల్ పోజులు..కలర్ఫుల్ శారీలో అనసూయ అదిరిపోయే లుక్స్..మొబైల్తో బిజీ బిజీగా సురేఖవాణి కూతురు సుప్రీత..బ్లాక్ బ్యూటీలా బిగ్బాస్ ముద్దుగుమ్మ విష్ణు ప్రియ.. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
వైరల్ ఎలా అవ్వాలంటోన్న శ్రీలీల.. అసలు విషయం ఏంటంటే?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఏడాది నితిన్ సరసన రాబిన్హుడ్లో మెప్పించిన భామ.. ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈనెల 4న వైరల్ వయ్యారి అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీల, దేవీశ్రీ ప్రసాద్ చేసిన ప్రమోషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీకి కాల్ చేసిన శ్రీలీల.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మీ రీల్సే కనిపిస్తున్నాయి.. మీలా వైరల్ ఎలా అవ్వాలో నేర్పిస్తారా అని అడిగింది. ఏంటీ వైరల్ ఎలా అవ్వాలో మీకు నేర్పాలా?కామెడీ వద్దమ్మా? మీరే నాకు నేర్పాలని దేవీశ్రీ అన్నారు. నిజమే కదా.. మీరు వయ్యారంగా ఓ మాస్ స్టెప్ వేస్తే అదే వైరలైపోద్ది అని చెప్పాడు. అదేదో మీరే ఇవ్వండి సార్ అని శ్రీలీల ముద్దుగా అడగడంతో.. వైరల్ వయ్యారి అంటే ఎలా ఉంది సాంగ్ అంటూ దేవీశ్రీ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఇదంతా వైరల్ వయ్యారి పాట కోసమే వీరిలా వైరైటీ ప్రమోషన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.#Junior second single #ViralVayyari out on July 4thIn cinemas July 18th. @sreeleela14 @ThisIsDSP pic.twitter.com/TDAbv8w5Rz— ScreenTimeGuru (@ScreenTimeGuru) July 1, 2025 -
రజినీకాంత్ కూలీ చిత్రం.. అమిర్ ఖాన్ పాత్రపై అఫీషియల్ ప్రకటన
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో దహా అనే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన అమిర్ ఖాన్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కూలీ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.Introducing #AamirKhan as Dahaa, from the world of #Coolie 😎⚡#Coolie is all set to dominate IMAX screens worldwide from August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv @girishganges… pic.twitter.com/Z8pI5YJzRe— Sun Pictures (@sunpictures) July 3, 2025 -
ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మూవీ.. ఆ నాలుగు పాత్రలపైనే ఆసక్తి!
మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో చిత్రం అలరించేందుకు సిద్ధమైంది. ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ జూలై 25న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో థియేటర్లలోకి రానుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్కి మధ్య జరగబోయే భీకర పోరాటం ఈ సినిమాలో చూపించనున్నారు. ఫైట్స్, విజువల్స్ చూస్తే ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది. 1960ల నాటి రెట్రో-ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్లో ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలోని నలుగురి పాత్రలపై ఓ లుక్కేద్దాం. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ కనిపించనున్నారు. ఫెంటాస్టిక్ ఫోర్కు నాయకుడిగా ఉంటారు. రీడ్ రిచర్డ్స్ తన శరీర ఆకృతి మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సూ స్టార్మ్ (ఇన్విజిబుల్ ఉమెన్)గా వెనెస్సా కిర్బీ కనిపించనుంది. ఆమె క్షిపణుల నుంచి వచ్చే ఇంటర్ డైమెన్షనల్ శక్తి దాడులను నిరోధించేంత శక్తివంతమైన పాత్ర పోషించింది. జానీ స్టార్మ్ (హ్యూమన్ టార్చ్) గా జోసెఫ్ క్విన్ నటించారు. బెన్ గ్రిమ్ (ది థింగ్) పాత్రలో ఎబోన్ మోస్-బచ్రాచ్ కనిపిస్తారు.కాగా.. ఈ చిత్రానికి మాట్ షాక్మాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కెవిన్ ఫీజ్ నిర్మించారు. 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో జూలై 25, 2025న విడుదల కానుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్, సారా నైల్స్ కూడా కనిపించనున్నారు. -
‘సోలో బాయ్’ ప్రతి ఒక్కరిలో కనిపిస్తాడు : సెవెన్ హిల్స్ సతీష్
సొంతంగా కష్టపడి తన కాళ్ళ మీద తాను బతకాలనుకునే ఆలోచన గల వ్యక్తి చుట్టు తిరిగే కథే ఇది. ప్రతి ఒక్కరిలోను సోలో బాయ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అన్నారు నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సతీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ గతంలో బట్టల రామకృష్ణ బయోపిక్ సినిమా తీసినప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ లాగా చేశాం. అది మాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ సమయంలో నేర్చుకున్న వాటిని బేస్ చేసుకుని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ సోలో బాయ్ సినిమా చేశాము. కానీ ప్రస్తుతం స్టార్స్ ఉన్న సినిమాలకు థియేటర్లు ముందుగానే బ్లాక్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ పై ఇంకా బ్యాలెన్స్ కాలేదు.→ ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకునేప్పటికీ రెండు గంటల పది నిమిషాలు ఫైనల్ అవుట్ పుట్ వచ్చింది. U/A సర్టిఫికేట్ తో ఆంధ్ర తెలంగాణలో కలిపి సుమారు 120 నుండి 150 స్క్రీన్స్ మధ్యలో విడుదల కానుంది.→ గౌతమ్ ఈ సినిమా ప్రమోషన్లలో 100% మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ రెండు సీజన్లో ఉండటం వల్ల అతని ఫేమ్ ఈ సినిమాకు మరింత తోడ్పడుతుంది అనుకుంటున్నాను.→ నాకు ఉన్న బడ్జెట్లో నాకు ఉన్న సర్కిల్లో నేను మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేశాను. అది కచ్చితంగా ప్రేక్షకులను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అనుకుంటున్నాను.→ ఈ చిత్ర కథలు నా ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము. నా మిత్రులు ఎవరైనా నిర్మాతలుగా ఆ కథకు నేను దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను. అనుకున్న బడ్జెట్ కంటే కొంత తక్కువలోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాం→ నార్నె నితిన్ తో ఒక సినిమా చేయబోతున్నాను. థ్రిల్లర్ జోనర్ లో కథ ఒకే అయింది. -
రెండో భర్తతోనూ విడాకులు.. అందుకేనన్న బాలీవుడ్ నటి!
పలు సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించిన బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా. తన అందం, అద్భుతమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్లో ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలతో పాటు బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్లో చాహత్ నటించింది. అయితే 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడిన ముద్దుగుమ్మ.. నాలుగు నెలలకే విడాకులిచ్చింది. ఆ తర్వాత 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతనితో కూడా తెగదెంపులు చేసుకుంది. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది చాహత్ ఖన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె రెండోసారి విడాకులు తీసుకోవడంపై మాట్లాడింది. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది.రెండోసారి విడాకుల గురించి చాహత్ మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ నాకు సరైనది అనిపించిన దాన్నే చేశా. దానికే కట్టుబడి ఉంటా. ఏదైనా తప్పని అనిపిస్తే అలాంటి పని చేయను. ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా చెప్పే ధైర్యం నాకు ఉంది. ప్రపంచం ఏమి చెప్పినా నేను ఎప్పుడూ తప్పును సమర్ధించను. మీకు ఆ రకమైన నమ్మకం, ధైర్యం, ఆత్మగౌరవం ఉండాలి. కేవలం ఒక మహిళగా మాత్రమే కాదు, ఒక మనిషిగా.. ఏదైనా కరెక్ట్ కాదనిపిస్తే అందులో భాగం కాలేను. అలాంటి వాటికి నేను దూరంగా వెళ్తాను. అలాగే మనం పిల్లల కోసం ఆలోచిస్తూ మనకు సరిగాలేని వివాహ బంధంలో ఉండిపోకూడదు. ఎందుకంటే పిల్లలు మనకంటే ఎక్కువగా ప్రభావితమవుతారు. అది కలిగించే నష్టం మీకు కూడా తెలియదు. వారు పెద్దయ్యాక వారి స్నేహితుల నుంచి విన్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. అందుకే నా కుమార్తెల కోసం నేను దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా' అని తెలిపింది. -
అనుమానాస్పద స్థితిలో నటి మృతి.. అతిగా డ్రగ్స్ తీసుకుందా?
ప్రముఖ అడల్ట్ ఫిల్మ్ స్టార్ కైలీ పేజీ(28) అనుమానాస్పదంగా మృతి చెందారు. జూన్ 25న ఆమె లాస్ ఏంజిల్స్లోని తన నివాసంలో మరణించినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు. ఆమె మరణానికి గల కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. కానీ మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవలడం వల్లే ఆమె చనిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్ సంబంధిత వస్తువులు ఆమె ఇంటిలో కనిపించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అంతేకాదు ఆమె గదిలో ఇతరులు సన్నిహితంగా ఉన్న గ్రాఫిక్ ఫోటోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడం వల్ల చనిపోయిందా లేదా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.కైలీ పేజీ అసలు పేరు కైలీ పైలెంట్. 2016లో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి దాదాపు 200పైగా సినిమాల్లో నటించింది. 2017లో వచ్చిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ "హాట్ గర్ల్స్ వాంటెడ్: టర్న్డ్ ఆన్"లో కూడా కనిపించారు, ఇందులో ఆమె అడల్ట్ ఇండస్ట్రీలోని తన అనుభవాలు, అక్కడ ఎదురయ్యే సవాళ్ల, సమస్యలను గురించి ఓపెన్గా మాట్లాడింది. కైలీ మరణ వార్త తెలియగానే ఆమె స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. -
హీరో చెంప చెళ్లుమనిపించింది.. ఆ దెబ్బతో ఇమేజ్ డ్యామేజ్!
ఆవేశం అనర్థదాయకం అని ఈ హీరోయిన్ విషయంలో రుజువైంది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది. టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాల్లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఫరా నాజ్. ఆమె సోదరి టబు.చిన్న వయసులోనే..హైదరాబాద్లో పుట్టిన ఫరా నాజ్ (Farah Naaz Hashmi) తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. యష్ చోప్రా 'ఫాల్సే' మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 17 ఏళ్లు మాత్రమే! ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి, టాలెంట్కు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులిచ్చారు. మార్తే డం టక్, నసీబ్ అప్నా అప్నా, లవ్ 86, ఇమాందార్, వీరు దాదా, దిల్జలా, బాప్ నంబ్రీ బేటా దస్ నంబ్రీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది.ఆవేశంస్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఫరా నాజ్కు ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవపడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు, కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయటపెట్టిందట! తన బాధ ఇంట్లోవాళ్లకు అర్థమవ్వాలనే అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది.చెంప చెళ్లుమనిపించిందికసం వర్దీకీ సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్కు ఒళ్లంతా మండిపోయింది. ఆవేశం పట్టలేక అతడి చెంప చెళ్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన రఖ్వాలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఫరాకు బదులు మాధురీ దీక్షిత్ను హీరోయిన్గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్టయ్యేదని అనిల్ కపూర్ ఫీలయ్యాడట! ఈ విషయం తెలిసిన ఫరా.. అనిల్ను బెదిరించినట్లు భోగట్టా! ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగెటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్ను దెబ్బ తీసింది.చెల్లితో అసభ్యంగా..జాకీ ష్రాఫ్తో కలిసి దిల్జలా మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెంజోంగ్ప ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా.. టబును తీసుకుని వెళ్లింది. తను తాగి పడిపోయింది. అప్పుడు పూటుగా తాగిన జాకీ ష్రాఫ్.. టబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్ను బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా.. మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతరకాలంలో మాత్రం అపార్థం చేసుకున్నానని యూటర్న్ తీసుకుంది.రెండు పెళ్లిళ్లుఫరా.. రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ను పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన ఆరేళ్లకే విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాదే నటుడు సుమీత్ సైగల్ను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనక్కూడా ఇది రెండో పెళ్లే! అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఫరా.. తెలుగులో ఒంటరి పోరాటం, విజేత విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.చదవండి: ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ -
'హరి హర వీరమల్లు' ట్రైలర్ ఎట్టకేలకు విడుదల
పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన 'హరి హర వీరమల్లు'( Hari Hara Veera Mallu) మూవీ ట్రైలర్ వచ్చేసింది. సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన 'వీరమల్లు' ఎట్టకేలకు వచ్చేశాడు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు 5ఏళ్లకు పైగా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. దీంతో బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయిందని నిర్మాత ఎ.ఎం రత్నం చెప్పారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో జులై 24న విడుదల కానుంది. -
దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్గా రికార్డు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తాజాగా హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా వెల్లడించింది. వినోదరంగంలో గణనీయంగా కృషి చేసినందుకుగాను ప్రతి ఏటా హాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ’ జాబితాను వెల్లడిస్తుంది. ఈ ఏడాది మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపికను ఎంపిక చేసినట్లు హాలీవుడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఈ జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ఉన్నారు. భారత్ నుంచి ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ జాబితాలో స్థానం పొందలేకపోవడం గమనార్హం.2006లో ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ సినిమా ఐశ్వర్యతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది దీపిక. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ఓం శాంతి ఓం తో మంచి గుర్తింపు సంపాదించుంది. 2017లో త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాలో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 ఏడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. -
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ
బుల్లితెర, వెండితెర, రాజకీయం.. అన్నిచోట్లా తనదైన మార్క్ చూపించారు స్మృతి ఇరానీ (Smriti Irani). సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి చిన్న వయసులోనే జీవితాన్ని చదివేశారు. కష్టాలు, తిరస్కరణలు తనను రాటు దేల్చాయి. అందుకే నటిగా మొదలైన తన ప్రయాణం కేంద్రమంత్రిని చేసింది. స్మృతి ఇరానీ మొదట యాడ్స్లో.. తర్వాత సీరియల్స్లో నటించారు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సీరియల్స్ కూడా నిర్మించారు. నా జీవితం అగ్నిపథ్ సినిమావంటిదిజై బోలో తెలంగాణ సహా పలు చిత్రాల్లో యాక్ట్ చేశారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ బీజేపీలో కేలక నేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తాజాగా స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్ జోహార్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్ కుచ్ హోతా హై మూవీ నుంచి నా లైఫ్ సడన్గా అగ్నిపథ్ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు. అమ్మకు అన్యాయంఏదైనా ప్రేమగీతం చెప్తారనుకుంటే ఇలా ప్రతీకారంతో రగిలిపోయే సినిమాను ఎంపిక చేసుకున్నారేంటని కరణ్ తిరిగి ప్రశ్నించారు. అందుకు స్మృతి స్పందిస్తూ.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొడుకు చేసే ప్రయత్నాలను అగ్నిపథ్లో చూపిస్తారు. అమ్మకు అన్యాయం జరిగిందన్నది అతడి ఆవేదన. నా లైఫ్లోనూ అదే జరిగింది. మా అమ్మకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని!అద్దె ఇంట్లో ఉన్న అమ్మకు..అగ్నిపథ్ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల క్రితం తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ.1 అద్దె కడుతోంది అని చెప్పుకొచ్చారు.కష్టాలతో సావాసంమరో ఇంటర్వ్యూలోనూ తన పేరెంట్స్ కష్టాలు బయటపెట్టారు స్మృతి ఇరానీ. నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీదాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. కాగా స్మతి పేరెంట్స్ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే?
కొన్ని సినిమాలు థియేటర్లలో మ్యాజిక్ చేద్దామనుకుంటాయి. తీరా కనీస ఆదరణ కూడా దక్కక బొక్కబోర్లా పడతాయి. థగ్ లైఫ్ సినిమా అలాంటి కోవకు చెందినదే! మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఓటీటీలో థగ్లైఫ్ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో రూ.90 కోట్లే ఇస్తామని పేచీ పెట్టింది. చివరకు చర్చల అనంతరం రూ.110 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు భోగట్టా. అంతేకాదు సినిమా రిలీజయ్యాక 8 వారాల తర్వాతే ఓటీటీలో ప్రసారం చేస్తామన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దాంతో నాలుగు వారాల్లోనే థగ్ లైఫ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేడ (జూలై 3) సడన్గా నెట్ఫ్లిక్స్లో దర్శనమిచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.వివాదాలుథగ్ లైఫ్ రిలీజ్కు ముందు భారీ అంచనాలున్నాయి. ఎప్పుడైతే కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్లో కమల్ హాసన్ నోరు జారారో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో థగ్లైఫ్ కన్నడలో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ వ్యవహారం కోర్టుదాకా వెళ్లగా.. కర్ణాటకలో సినిమా రిలీజ్ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కానీ అప్పటికే థగ్లైఫ్ మిగతా చోట్ల రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. థగ్ లైఫ్ సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే నెట్ఫ్లిక్స్లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దాన్ని రద్దు చేయడం వల్ల మల్టీప్లెక్స్ థియేటర్లు.. థగ్లైఫ్ నిర్మాత కమల్ హాసన్పై రూ.25 లక్షల జరిమానా వేసినట్లు తెలుస్తోంది. Streaming now on NETFLIX #ThugLife pic.twitter.com/u3BxaX2Dfm— Christopher Kanagaraj (@Chrissuccess) July 2, 2025 చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
'అలాంటి వారికే ఇండస్ట్రీలో గుర్తింపు'.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఆరోపణలతో టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన పూనమ్ మరో ట్వీట్ చేసింది. ఒరిజినల్ కంటెంట్, స్క్రిప్ట్ ఉన్న దర్శకుడు క్రిష్ అంటూ కొనియాడింది. ఎన్నో కాపీరైట్ సమస్యలు, పీఆర్ స్టంట్లు ఉన్న దర్శకుడికి వచ్చినంత గుర్తింపు, విజయం లభించడం లేదని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ చూస్తే మరోసారి త్రివిక్రమ్ను ఉద్దేశించే పరోక్షంగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్కు ముందు పూనమ్ చేసిన ట్వీట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెలలోనే రిలీజ్ కానుందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈనెల 3న ఉదయం 11 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. కారణాలేంటో తెలీదు గానీ మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు జ్యోతికృష్ణ.. డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో బాబీ డియోల్, అనుపమ ఖేర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు.Krish a director with original content and authentic scripts doesn’t get as much recognition or success like that of a director with multiple copyright issues and pr stunts.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 2, 2025 త్రివిక్రమ్పై మా అసోసియేషన్కు ఫిర్యాదుపూనమ్ కౌర్ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే మెయిల్ ద్వారా ఇప్పటికే మా అసోసియేషన్కు ఫిర్యాదు చేశానని తెలిపింది. క్లియర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్పైనే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు రాజకీయ, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో కాపాడుతున్నారని కూడా చెప్పానని పూనమ్ కౌర్ ప్రస్తావించింది. ఈ విషయంపై నేను మహిళల గ్రూప్తో మాట్లాడతానని కూడా పూనమ్ వెల్లడించింది. అంతేకాకుండా తన మెయిల్కు రిప్లై కూడా వచ్చిన స్క్రీన్షాట్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
తమిళనాడులో అక్కినేని కోడలు శోభిత..ఫ్యాషన్ డ్రెస్లో మిల్కీ బ్యూటీ తమన్నా!
తమిళనాడులో ఎంజాయ్ చేస్తోన్న అక్కినేని కోడలు శోభిత..శారీలో అనుపమ పరమేశ్వరన్ క్యూట్ లుక్స్..ఫ్యాషన్ డ్రెస్లో మిల్కీ బ్యూటీ తమన్నా హోయలు..కలర్ఫుల్ శారీలో టాలీవుడ్ నటి శాన్వీ మేఘన..పింక్ శారీలో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ గ్లామరస్ లుక్స్.. View this post on Instagram A post shared by Seetha🦋🇮🇳 (@kirrakseetha) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by PARVATHY KRISHNA (@parvathy_r_krishna) -
ముంబయి టూ గోవా.. పరుగులు తీసిన స్టార్ హీరో.. వామ్మో అన్ని కిలో మీటర్లా?
పార్టీలు చేసుకోవాలి క్యాసినోలు చూసుకోవాలి బీర్లు తాగాలి బీచ్లలో పడి దొర్లాలి... గోవా అనగానే లెట్స్ గో... అనేందుకు చాలా మందికి అవే కారణాలు కావచ్చు. కానీ ఆ అగ్రనటుడు మాత్రం గోవాకి పరుగులు తీసిన కారణం వీటికి పూర్తిగా భిన్నం కావడం విశేషం. ఫిట్గా ఉండండి హిట్ అనిపించుకోండి అని ప్రభోధించడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏకంగా 600 కి.మీ ప్రయాణం అది కూడా ఎలా? పరుగులు తీస్తూ కాసేపు సైక్లింగ్లో మరింత సేపు...ఇంతకీ ఎవరా నటుడు? ఏమా కధ? లెట్స్ గెట్ ఇన్ టూ దిస్ స్టోరీ...ఫ్యాషన్ రంగంలో మోడల్ సినిమా రంగంలో నటుడు, అనగానే చాలామంది గుర్తుకు రావచ్చు కానీ.. ఫిట్నెస్ ఐకాన్ అనేది కూడా వీటికి జతకలిస్తే మాత్రం దేశవ్యాప్తంగా గుర్తుకు వచ్చే ఏకైక పేరు మిలింద్ సోమన్. గత కొన్నేళ్లుగా అన అనూహ్యమైన ఫిట్నెస్ స్థాయిలతో అందర్నీ అబ్బుపరుస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మిలింద్..మరోసారి తన శారీరక సామర్ధ్యాన్ని చాటుకున్నాడు. ‘ది ఫిట్ ఇండియా రన్’ పేరుతో ఏటా నిర్వహించే రన్నింగ్ ఈవెంట్ దీనికి వేదికగా నిలిచింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ముంబయి నుంచి గోవా వరకు సుమారు 600 కిలోమీటర్ల దూరం మోటారు వాహనం లేకుండా ప్రయాణించారు. ఈ ప్రయాణం 5 రోజుల్లో పూర్తి చేసిన ఘనత సాధించాడు.ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 90కిమీ సైక్లింగ్ 21కిమీ పరుగు ఇలా విభజించుకుంటూ ఆయన ప్రయాణించాడు. గత నెల అంటే జూన్ 26న ముంబైలోని శివాజీ పార్క్ నుంచి మిలింద్ సోమన్ ఫిట్ ప్రారంభమైంది. మహారాష్ట్ర భూభాగానికి ఆనుకుని ఉన్న కొంకణ్ బెల్ట్ను పూర్తిగా కవర్ చేస్తూ పెన్, కొలాడ్, చిప్లూన్, రత్నగిరి, కంకవళి ల మీదుగా ప్రయాణిస్తూ జూన్ 30న గోవాకు చేరుకున్నాడు. తన సాహస ప్రయాణాన్ని తాజాగా ఆయన ఇన్ షేర్ చేశాడు. దానితో పాటే ఓ సందేశాన్ని కూడా.'ఫిట్ ఇండియన్ రన్ 5రోజుల పాటు 600కిమీ పూర్తి చేశాను. ఇది ప్రతీ ఏటా తప్పనిసరిగా నేను ఎదుర్కునే ఛాలెంజ్, శరీరం, మనస్సు బాగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకునేందుకు ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఉపకరిస్తుంది. అనేక మంది నాకు బెస్ట్ విషెస్ చెప్పడం మరెన్నో అఛీవ్ చేయాలని కోరుతుండడం నాకు మరింత ప్రేరణగా మారుతోంది. ప్రతి భారతీయుడు ఫిట్ ఇండియన్ అవ్వాలి. జైహింద్' అంటూ పంచుకున్నాడు.ప్రతీ ఒక్కరిలో ఫిట్నెస్ పట్ల ఆసక్తి పెంచేందుకు గత 2020లో భారత ప్రభుత్వం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమంలో మిలింద్ పాల్గొంటున్నాడు. ఈ సారి 60ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో ఆయన సాధించిన ఈ ఫీట్... ఫిట్నెస్లో ఆసక్తి ఉన్న చాలామందికి ప్రేరణ అందిస్తోంది. -
ఓటీటీకి వచ్చేస్తోన్న హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో మలయాళ చిత్రాలకు పుల్ డిమాండ్ ఉంటోంది. గతంలో వచ్చిన పలు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలు సైతం డిజిటల్ ఫ్లాట్ఫామ్లో ఆడియన్స్ను ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో నుంచి వచ్చే చిత్రాల్లో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కావడంతో ఓటీటీల్లో సత్తా చాటుతున్నాయి. తాజాగా మరో మలయాళ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.టొవినో థామస్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ నరివెట్ట స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఈనెల 11 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్రైలర్ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్గా నటించగా.. సూరజ్ వెంజరమూడు, చేరన్ కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ మూవీకి అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మే 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తెలుగులోనూ మే 30న రిలీజైంది.Echoes of truth, shadows of injustice!Watch Narivetta from July 11 only on SonyLIV#NarivettaOnSonyLIV@ttovino #SurajVenjaramoodu #Cheran #AnurajManohar #AryaSalim #JakesBijoy pic.twitter.com/lon0ikr836— Sony LIV (@SonyLIV) July 2, 2025 -
తెలుగులో ఎంట్రీ ఇస్తోన్న భజరంగీ భాయిజాన్ ఫేమ్..!
సల్మాన్ ఖాన్ మూవీ బజరంగీ భాయిజాన్లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటి హర్షాలీ మల్హోత్రా. ఈ సినిమాలో మున్ని అనే పాత్రలో సినీ ప్రియులను మెప్పించింది. ముంబయికి చెందిన హర్షాలీ బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. హిందీలో పలు సీరియల్స్లో తన నటనతో రాణించింది. 2015లో విడుదలైన బజరంగీ భాయిజాన్ మూవీతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది.ప్రస్తుతం హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న అఖండ సీక్వెల్లో నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హర్షాలీ.. జనని పాత్రలో కనిపించనుందని తెలిపారు. ఈ మేరకు హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.కాగా.. గతంలో బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో సంయుక్త, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా ఈ ఏడాది కానుకగా సెప్టెంబరు 25న విడుదల కానుంది. A smile of an angel and a heart of gold ❤️Introducing Bajrangi Bhaijaan fame #HarshaaliMalhotra as 'JANANI' from #Akhanda2 ✨#Akhanda2 THANDAAVAM IN THEATRES DUSSEHRA 25th SEPTEMBER #Akhanda2Thaandavam 'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial… pic.twitter.com/t5M3pVh8c1— 14 Reels Plus (@14ReelsPlus) July 2, 2025 -
'ఏ మాయ చేశావే నాగచైతన్యతో కాదు.. ఆ స్టార్ హీరోతో చేయాలని': డైరెక్టర్
ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచింది. నాగచైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. దీంతో ఈ సినిమా రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. అయితే మొదటి ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా నాగచైతన్యను అనుకోలేదని తెలిపారు. స్టార్ హీరో మహేశ్ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్లో చిరంజీవి గెస్ట్ రోల్గా పెట్టాలని అనుకున్నట్లు గౌతమ్ వాసుదేవ్ తెలిపారు. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్తో ప్లాన్ చేశానని పేర్కొన్నారు.కాగా.. జూలై 18న 'ఏమాయ చేసావె' రీ రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది. Gautam Vasudev Menon explaining how the #YMC story developed keeping Mahesh babu @urstrulyMahesh in mind , and initial climax he planned was different planning to cast Chiranjeevi as guest role pic.twitter.com/iC2gXj3uhu— #Coolie varaaru 🌟 (@yourstrulyvinay) July 1, 2025 -
'రామ్చరణ్ ఒప్పుకోకుంటే సినిమా రిలీజ్ అయ్యేది కాదు'.. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి
మెగా హీరో రామ్ చరణ్ వివాదంపై దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. గేమ్ ఛేంజర్ కోసం చరణ్ మాకు పూర్తిగా సహకరించారని తెలిపారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని విడుదల చేయమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదంగా మారడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..'మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్వీసీ సంస్థకు, రామ్ చరణ్కు అవినాభావ సంభంధం ఉంది. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైనా చిన్న మాట దొర్లినా రామ్ చరణ్కు, అభిమానులకు నా క్షమాపణలు. నేను అన్న ఉద్దేశం కాదు. మాకు మెగా హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి వాళ్లను నేను అవమానించేంత ముర్ఖుణ్ణి కాదు. రామ్ చరణ్ వల్లే సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశాం. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు అంటాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చేలా ప్రవర్తించకండి. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కావడం వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి. త్వరలోనే రామ్ చరణ్తో మరో సినిమా చేయబోతున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025 -
కూతురిగా చేసిన నటితో రొమాన్స్.. డైరెక్టర్ వద్దని చెప్పారు: అమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్ ఇటీవలే 'సితారే జమీన్ పర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. అయితే గతంలో అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ ఫాతిమా సనా షేక్ అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించింది.అయితే దంగల్లో అమిర్ ఖాన్ కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ ఆ తర్వాత 2018లో వచ్చి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ కలిసి రొమాన్స్ చేసింది. అయితే తన కూతురి పాత్రలో నటించిన ఆమెతో అమిర్ ఖాన్ రొమాన్స్ చేయడంపై తాజాగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఈ సినిమా మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ ఉండదని థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య అన్నారని గుర్తు చేశారు. అయితే తనకు ప్రేమికుడిగా నటించడానికి ఫాతిమాకు ఎలాంటి అభ్యంతరం లేదని డైరెక్టర్తో చెప్పానని అమిర్ ఖాన్ వెల్లడించారు. ఎందుకంటే నేను ఆమె తండ్రిగా ఒక సినిమాలో మాత్రమే నటించా.. నిజ జీవితంలో కాదని డైరెక్టర్తో చెప్పినట్లు తెలిపారు. నేను నిజ జీవితంలో ఆమె ప్రియుడిని కాదు.. మేమిద్దరం కలిసి కేవలం సినిమా చేస్తున్నామని దర్శకుడితో చెప్పినట్లు వివరించారు. అంతే కాకుండా గత సినిమాల్లో తల్లి-కొడుకులుగా నటించిన అమితాబ్ బచ్చన్- వహీదా రెహ్మాన్లు.. ఆ తర్వాత ప్రేమికులుగా నటించారని అమిర్ గుర్తు చేశారు. దీపిక, ఆలియా భట్, శ్రద్ధా కపూర్ లాంటి తారలు ఈ మూవీని రిజెక్ట్ చేసినప్పటికీ ఫాతిమా ఈ చిత్రానికి సంతకం చేశారని అమిర్ ఖాన్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన సినిమా అని నిర్మాత ఆదిత్య చోప్రా నుంచి కాల్ వచ్చిన తర్వాత తాను షాక్ అయినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. -
రైతుల కష్టాల నేపథ్యంతో ‘వీడే మన వారసుడు’
రమేష్ ఉప్పు హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. లావణ్యా రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు సందేశాత్మక చిత్రాలు వచ్చేవి. ఆ తరహాలో ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రైతుల కష్టాలను చక్కగా ఆవిష్కరించిన కుటుంబకథా చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు రమేష్ ఉప్పు. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర, వీఎన్ ఆదిత్య, నటుడు–దర్శక–నిర్మాత సాయి వెంకట్, ΄ోలీసాఫీసర్ రమావత్ తేజ, హీరో కృష్ణ సాయి, కాంగ్రెస్ నాయకుడు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
అల్లు అర్జున్ స్టార్డమ్ని మరెవరూ టచ్ చేయలేరు: టాప్ డైరెక్టర్
పుష్ప2 సినిమా అల్లు అర్జున్(Allu Arjun) స్టార్డమ్ని ఆకాశానికి చేర్చిందనేది తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది టాప్ స్టార్స్ ఉండగా ఒక్కసారిగా వీరందరినీ మన బన్నీ దాటేశాడు. తన తదుపరి సినిమాకి ఏకంగా రూ.300కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడనే వార్త టాప్ బాలీవుడ్ స్టార్స్కి కూడా దిమ్మదిరిగిపోయేలా షాక్ ఇచ్చింది. ఓ వైపు ఎంతో కాలంగా ఇంటర్నేషనల్ స్టార్స్గా వెలుగొందుతున్న ఎందరో బాలీవుడ్ హీరోలు, మరోవైపు ఇటీవలే గ్లోబల్ స్టార్స్గా మారిన దక్షిణాది హీరోలు.. మరి వీరందరిలో భవిష్యత్తులో బన్నీని బీట్ చేయగల హీరో ఎవరు? అనే ప్రశ్నలు చర్చలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే అల్లు అర్జున్ స్టార్డమ్ని బీట్ చేయడం ఇప్పట్లో మరెవరికీ సాధ్యం కాదు ఓ టాప్ డైరెక్టర్ తేల్చేయడం విశేషం.ఆయన కూడా సాదా సీదా హిందీ సినిమాల దర్శకుడేమీ కాదు అనేక హిట్ చిత్రాలు అందించిన అగ్రగామి బాలీవుడ్ దర్శకుడు మధర్ భండార్కర్(Madhur Bhandarkar). తాజాగా ఆయన మాట్లాడుతూ ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ‘‘సమీప రోజుల్లో, ఎవ్వరూ కూడా అల్లూ అర్జున్ దక్కించుకున్న క్రేజ్ను కనీసం తాకలేరు. ఆయన నిజమైన పాన్ఇండియా స్టార్’’ అని మధుర్ భండార్కర్ అన్నారు. అంతేకాదు.. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తీరు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ భారీగా మాస్ ఆకర్షణను సంపాదించి పెట్టిందని ప్రాంతాలకతీతంగా అల్లు అర్జున్ను ప్రేక్షకులతో కనెక్ట్ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.పుష్ప సినిమా విజయం గతంగా మారిపోయినా ఇప్పటికీ అల్లు అర్జున్ను ప్రశంసిస్తున్న వారి జాబితా అంతకంతకూ పెరిగిపోతుండడం విశేషం. బన్నీని ఆకాశానికి ఎత్తేస్తున్న బాలీవుడ్ ప్రముఖుల్లో మధుర్ భండార్కర్ మాత్రమే కాదు అల్లు అర్జున్ మాత్రమే పుష్ప చేగలడంటూ బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ అన్నాడు. అతని ఎనర్జీ ఎక్స్ట్రార్డినరీ అంటూ యువ హీరో కార్తీక్ ఆర్యన్ పొగిడితే...ఐకాన్స్టార్తో ఒక్కసినిమాలో అయినా నటించాలని ఉందని బాలీవుడ్ నటి అనన్య పాండే తపిస్తున్నారు. అతని లాంటి డ్యాన్సర్ని చూడలేదని టాప్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తేల్చేశారు. ఆయన ఎనర్జీ మరెవరికీ సాధ్యం కాదు అని బాలీవుడ్లో ఎనర్జిటిక్ హీరోగా పేరున్న షాహిద్ కపూర్ ఒప్పేసుకున్నాడు. అతనో స్టైల్ ఐకాన్ అంటూ మరో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్లు...అభివర్ణించాడు. ఇలా ఎందరో బన్నీపై భారీ స్థాయిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న అల్లు అర్జున్ అట్లీల సినిమా పై అంచనాలను వీరి అభిప్రాయాలు మరింతగా పెంచేస్తున్నాయనేది నిజం. ఈ నేపధ్యంలో ఆ స్థాయి అంచనాలను అందుకోవడానికి బన్నీ అట్లీ ద్యయం మరింతగా కృషి చేయకతప్పదు. -
నేను డాక్టర్ని కాదు.. పుకార్లపై క్లారిటీ ఇచ్చిన తెలుగు బ్యూటీ
కోమలి ప్రసాద్( Komalee Prasad) నటిగా తెలుగు తెరపై తనకు వచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. ఇక త్వరలోనే ‘శశివదనే’ చిత్రంతో తెరపైకి రాబోతోన్నారు. ఈలోపు కోమలి ప్రసాద్ మీద సోషల్ మీడియా, మీడియాలో ఓ అసత్య ప్రచారం మొదలైంది. యాక్టింగ్ కెరీర్ను వదిలి పెట్టారని, డాక్టర్ వృత్తిలోకి వెళ్లారని కోమలి ప్రసాద్ మీద రూమర్లు క్రియేట్ చేశారు. దీంతో ఈ వార్తల్ని ఖండిస్తూ కోమలి ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు.‘అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎంతో కష్టపడి ఇప్పటి వరకు సినిమాల్లో కెరీర్ను కొనసాగిస్తూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఆ శివుని ఆశీస్సులతో నా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాను.నాలో, నా శ్రేయోభిలాషులలో అనవసరమైన ఆందోళనలను రేకెత్తించేలా ఈ రూమర్లను ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ స్పష్టతనిస్తూ పోస్ట్ వేస్తున్నాను. చివరి శ్వాస వరకు నటిగా నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నా వెన్నెంటే ఉన్న నా శ్రేయోభిలాషులందరికీ, నా కంటే నన్ను ఎక్కువగా నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. నేను ప్రస్తుతం నా స్క్రిప్ట్లను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాను. త్వరలో కొత్త ప్రకటనలతో మీ అందరినీ చాలా గర్వపడేలా చేస్తాను’ అని కోమలి ప్రసాద్ అన్నారు. -
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
నెగెటివ్ ట్రోలింగ్ని, ఫేక్ రివ్యూస్ని అరికట్డడంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కన్నప్ప సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేదని అభినందించాడు. ఇకపై మేము కూడా అదే ఫాలో అవుతామని చెప్పారు.మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం ఏంటి?మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్కి రెండు రోజుల ముందే మంచు విష్ణు ఓ హెచ్చరికను జారీ చేశారు. కన్నప్ప సినిమాని టార్గెట్గా చేసుకొని కావాలని ఎవరైన నెగెటివ్గా పోస్టులు పెట్టిన, వ్యక్తిగత హననానికి పాల్పడినా.. ఉద్దశ్యపూర్వకంగా విమర్శలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పబ్లిక్ కాషన్ నోటీస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది మంచి ఫలితాన్నే ఇచ్చింది. రిలీజ్ తర్వాత ఫేక్ రివ్యూస్, నెగెటివ్ ట్రోలింగ్ పెద్దగా జరగలేదు. ట్వీటర్లో సినిమాపై, మంచు ఫ్యామిలీపై నెగెటివ్ పోస్ట్లు పెట్టలేదు. సినిమాకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయి.అదే ఫాలో అవుతాం : దిల్ రాజుసినిమాను కాపాడాడానికి ఎవరు ఏ మంచి చేసినా.. మేమంతా అది ఫాలో అవుతామని అన్నారు దిల్ రాజు. ఆయన నిర్మించిన తాజా చిత్రం తమ్ముడు జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. నెగెటిట్ ట్రోలింగ్పై స్పందించారు. ‘కన్నప్ప చిత్రబృందం మంచి నిర్ణయం తీసుకుంది. రిలీజ్కు ముందే అలా ఒక హెచ్చరిక జారీచేస్తే.. ఫేక్ రివ్యూస్, నెగెటివ్ ట్రోలింగ్, పైరసీ తగ్గిపోతుంది. అలా అని రివ్యూస్ని ఆపడం మా ఉద్దేశం కాదు. రివ్యూస్ రాయండి. కానీ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి. సినిమాపై కావాలని నెగెటివ్గా రాస్తే.. ఎక్కువగా నష్టపోయేది నిర్మాత మాత్రమే. హీరోలు, దర్శకులు ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో హిట్ కొడతారు. కానీ నిర్మాత అయితే ఆ సినిమాకు డబ్బులు పోగొట్టుకోవాల్సిందే కదా? అది దృష్టిలో పెట్టుకొని జన్యూన్గా రివ్యూస్ ఇవ్వండి. దయచేసి హెల్ప్ చేయకపోయినా పర్లేదు ..డ్యామేజ్ మాత్రం చేయెద్దు’ అని దిల్ రాజు విజ్ఞప్తి చేశాడు. -
సైడ్ యాక్టర్గా అజిత్.. నాకు నచ్చలేదు: విష్ణు
మంచు విష్ణు (Vishnu Manchu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్తో తీశారు. టాలీవుడ్లో ఎవరూ దొరకలేదా? అంటే? వరుస ఫ్లాపులు అందుకున్న తనతో కన్నప్ప వంటి మైథాలజీ సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రారని అసలు విషయం చెప్పారు. అందుకే మహాభారత్ సీరియల్ తీసిన ముకేశ్తో కన్నప్ప సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించారు. బాలీవుడ్లో ఛాన్స్మరి హీరోగా బాలీవుడ్లో అడుగుపెట్టే ఆలోచనలేమైనా ఉన్నాయా? అంటే విష్ణు ఇలా స్పందించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. చాలాకాలం క్రితం హిందీలో సినిమా చేయమని కొందరు నన్ను సంప్రదించారు. కానీ వారు ఆఫర్ చేసినవేవీ నాకు నచ్చకపోవడంతో అక్కడ సినిమాలు చేయలేదు. పైగా నటుడిగా నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అదే సమయంలో అభిమానుల ప్రేమను పొందాను. వారిని నేను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏవి పడితే అవి చేసి వారిని నేను బాధపెట్టలేను.చిన్న రోల్.. నచ్చలేదుఉదాహరణకు స్టార్ హీరో అజిత్ను తీసుకుందాం. ఆయన ఇండియాలోనే పెద్ద సూపర్స్టార్స్లో ఒకరు. షారూఖ్ ఖాన్ అశోక మూవీలో ఆయన సైడ్ రోల్ చేశారు. అది నాకు నచ్చలేదు. అజిత్ అన్నతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు.. మీరు ఇంత చిన్న పాత్ర చేసినందుకు నిరాశచెందాను అని చెప్పాను. అందుకాయన చిన్నగా నవ్వి సైలెంట్గా ఉండిపోయారు.సెల్ఫిష్గా ఆలోచించలేనుకాబట్టి ఏదో ఒక రోల్.. అని లైట్ తీసుకుని సినిమా చేయలేను. జనాలకు నచ్చినా, నచ్చకపోయినా నా ఇష్టమొచ్చిన సినిమాలు చేస్తా అని సెల్ఫిష్గా ఆలోచించలేను అని విష్ణు చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు తిన్నడు/కన్నప్పగా నటించారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్లాల్, శరత్కుమార్, కాజల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
సుష్మితా సేన్కి అరుదైన వ్యాధి.. 8 గంటలకో స్టెరాయిడ్, లేదంటే..
నటీనటులు కూడా మనుషులే. వాళ్లకు అందరిలాగే కోపాలు, బాధలు, సమస్యలు ఉంటాయి. కానీ వాటిని బయట ప్రపంచానికి తెలియనీకుండా.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుంటారు. అలాంటి వారిలో నటి సుష్మితా సేన్ కూడా ఒకరు. తన అందచందాలతో అలరించడమే కాకుండా.. బోల్డ్ స్టేట్మెంట్స్ , జిమ్లో కసరత్తులు చేస్తూ ఓ వర్గానికి ఇన్సిపిరేషన్గా నిలిచిన ఈ మాజీ మిస్ యూనివర్స్.. ఒకప్పుడు చావు అంచులదాక వెళ్లి వచ్చింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే..తెరపై ఎనర్జిటిక్గా కనిపించింది. మొన్నటి వరకు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్ తీసుకునేదట. ఆమె తీసుకున్న ఓ నిర్ణయమే ఇప్పుడు ఆమెని ఆరోగ్యకరంగా ఉండేలా చేసిందట.ఏం జరిగింది?సుష్మిత కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే అనారోగ్య సమస్యలతో పోరాటం చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 2014 నుంచే ఆమె ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన అడిసన్స్ డిసీజ్తో బాధపడుతున్నటు వెల్లడించింది. ఆమె శరీరంలో కార్డిసోల్ అనే హర్మోన్ ఉందని తేలిందట. ఇది ప్రాణాంతకమైనది అని..దీన్ని సరి చేయాలంటే.. ప్రతి 8 గటలకు ఒకసారి హైడ్రో కార్డిసోన్ అనే స్టెరాయిడ్ ని ఇంజెక్ట్ చేయాలని వైద్యులు చెప్పారట. అలాగే వ్యాయామాలు, బరువైన పనులు చేయకూడదని సూచించారట.జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ కానీ సుష్మిత మాత్రం తన ఫిట్నెస్ కోచ్ని పిలిపించుకొని జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసిదంట. యాంటీ గ్రావిటీ వ్యాయామాలతో పాటు డిటాక్సిఫికేషన్ ప్రారంభించిందట. అయితే ఓ రోజు సుష్మిత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దుబాయ్ నుంచి అబుదబీ తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ తర్వాత టర్కీ వైద్యులు ఫోన్ చేసి సుష్మితా జీవితంలో మిరాకిల్ జరిగిందని చెప్పాడట. తన అడ్రిల్ గ్రంధి ఇప్పుడు సవ్యంగా పని చేస్తుందని చెప్పారట. తన 35 ఏళ్ల వైద్య కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట. ఇకపై ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో సుష్మితా ఊపిరిపీల్చుకుందంట. 1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సుస్మితా సేన్ తనకు 18వ ఏట(1994) విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. 1997లో రత్సగన్ అనే తమిళ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలువరు అగ్రహీరోలతో సినిమాలు చేసింది. తెలుగులో నాగార్జున తో కలిసి 'రక్షకుడు' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్లోనూ రాణించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ పరంగా ఇప్పటికీ బీజీగా ఉన్నారు. -
సహజత్వానికి చిరునామా సాయి పల్లవి
మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి అన్నది నానుడి. అలా నటి అన్న తరువాత కాస్త గ్లామర్ అవసరం అన్నది సినిమా వాళ్ల మాట. అందుకే అందాలారబోతకు దూరంగా ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు అందుకు సిద్ధం అంటున్నారు. అయితే ఎలాంటి గ్లామర్ అవసరం లేకుండానే పాన్ ఇండియా స్టార్ అయిన కథానాయకి ఎవరైనా ఉన్నారంటే అది నటి సాయిపల్లవినే అవుతారు. డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన అరుదైన తారలలో ఈమె ఒకరు. సాయిపల్లవి మంచి డాన్సర్. తద్వారా కలిగిన ఆసక్తినే సినిమా. తొలి రోజుల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన సాయిపల్లవి ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం ఏ ముహూర్తాన విడుదలై సంచలన విజయం సాధించిందో గానీ, ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లోనూ వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి.అయితే తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్న సాయిపల్లవికి అక్కడ ప్లాప్ల సంఖ్చ చాలా తక్కువే. అదే విధంగా ప్లాప్ అయిన చిత్రాలలోనూ తన నటనకు మంచి మార్కులు పడటం అనేది అరుదైన విషయమే. అందుకు కారణం పాత్రల విషయంలో సాయిపల్లవి చూపే ప్రత్యేక శ్రద్దనే అని చెప్పవచ్చు. తనకు నచ్చిన బాటలో పయనిస్తున్న ఈమె అందంపై కాకుండా అభినయనానికి ప్రాముఖ్యనిస్తున్నారు. అలా సహజ నటిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఇప్పటి వరకూ గ్లామరస్ పాత్రల్లో నటించిందే లేదు.అలా ఆమె సహజత్వానికి చిరునామాగా ముద్ర వేసుకున్నారు. ఇటీవల తమిళంలో అమరన్ చిత్రంలో నటించి అందరి అభినందనలను అందుకున్న సాయిపల్లవి, తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రంలోనూ నటనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్ని చిత్రాల్లో నటించామన్నది కాకుండా ఎన్ని మంచి చిత్రాల్లో నటించామన్నదే ముఖ్యం అని భావించే సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రామాయణం అనే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న భారతీయ ఇతిహాస గాథలో సీతగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె నటన ఎంతగా ఆకట్టుకుంటుందోన్న ఆసక్తి ఇప్పుడు సినీ ప్రేమికుల్లో నెలకొంది. -
బడ్జెట్ కాదు .. సబ్జెక్ట్ ముఖ్యం గురూ
కొత్త సంవత్సరం వచ్చి ఆరు నెలలు పూర్తయింది. చూసినవాళ్లకు చూసినన్ని అన్నట్లుగా ఈ ఆరు నెలల్లో స్ట్రయిట్ మూవీస్100కి పైగా రిలీజ్ అయ్యాయి. కానీ వందలో హిట్ అంటే పది శాతమే. కోట్లు బడ్జెట్ పెట్టి గ్రాండ్గా తీసినంత మాత్రాన వసూళ్లు కూడా గ్రాండ్గా ఉంటాయనుకుంటే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డట్టే. ‘బడ్జెట్ కాదు... సబ్జెక్ట్ ముఖ్యం’ అనే పంథాలో సినిమా పరిశ్రమ వెళ్లాల్సిన అవసరం ఉంది. 2025లో హిట్ అయిన చిత్రాలతోపాటు భారీ అంచనాల మధ్య థియేటర్కి వచ్చి, నిరాశపరిచిన పెద్ద చిత్రాల గురించి ఓ రౌండప్.⇒ 2025 సినిమా బాక్సాఫీస్ బోలెడన్ని అంచనాలతో మొదలైంది. జనవరిలో దాదాపు పదిహేను చిత్రాలు విడుదల కాగా... రెండంటే రెండే హిట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంక్రాంతి పండగకి ముందుగా వచ్చిన చిత్రం రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై, అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఆ వెంటనే వచ్చిన బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా ఎబౌ యావరేజ్ హిట్గా నిలిచింది.బాబీ కొల్లి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతికి మంచి హిట్ అంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. కాగా ఈ సీజన్లో ‘గేమ్ చేంజర్’ రూపంలో నష్టాలు చవి చూసిన ‘దిల్’ రాజుకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కాస్త ఊరటనిచ్చింది. ⇒ ఫిబ్రవరిలో దాదాపు పదిహేను సినిమాలు విడుదలైతే, ‘తండేల్’ సినిమా రూపంలో ఒకే ఒక్క హిట్ దక్కింది. అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. శ్రీకాకుళం మత్స్యకారుల్లోని కొందరి జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో నాగచైతన్య తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారు. ⇒ మార్చిలో దాదాపు 20 సినిమాలు విడుదల కాగా, రెండు శాతం హిట్ దక్కింది. ఈ హిట్టయిన రెండు సినిమాలూ భారీ బడ్జెట్ కాదు... భారీ స్టార్స్ కూడా లేరు. నూతన తారలు రోషన్, శ్రీదేవి జంటగా, ప్రియదర్శి ప్రధానపాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కోర్ట్’. హీరో నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ‘కోర్ట్’ చిన్న సినిమాగా రిలీజై, సక్సెస్పరంగా పెద్ద సినిమా అనిపించుకుంది.కంటెంట్ ఉంటే స్టార్స్, భారీ బడ్జెట్ అవసరం లేదనడానికి ‘కోర్ట్’ ఓ తాజా ఉదాహరణ. అలాగే హిట్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్గా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ అంచనాలు అందుకుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ⇒ ఈ ఏడాది వేసవికి టాలీవుడ్ బాక్సాఫీస్ చల్లబడింది. ఏప్రిల్లో రిలీజైన ఏ సినిమా ఆడియన్స్తో క్లాప్ కొట్టించలేకపోయింది. సిద్ధు జొన్నలగడ్డ హిరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘జాక్’ ఫ్లాప్గా నిలిచింది. అలాగే ప్రదీప్ మాచిరాజు హీరోగా మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మించిన ‘అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి’ చిత్రం మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి నితిన్–భరత్ దర్శకులు. ఇదే నెలలో వచ్చిన సూపర్ నేచురల్ హారర్ మూవీ ‘ఓదెల 2’, కల్యాణ్రామ్–విజయశాంతిల యాక్షన్ చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు.దర్శకుడు సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్తేజ్ దర్శకత్వంలో డి. మధు, సంపత్ నంది నిర్మించిన చిత్రం ‘ఓదెల 2. ఇక ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రాన్ని నిర్మించారు. ‘కోర్ట్’ వంటి సూపర్హిట్ తర్వాత ప్రియదర్శి హీరోగా ‘సారంగపాణి జాతకం’ సినిమా వచ్చింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం హిట్ కాలేదు. ఇలా ఏప్రిల్ పూర్తిగా నిరాశ పరిచింది. ⇒ మే నెల తొలి రోజే ‘హిట్: ది థర్డ్ కేస్’తో ప్రేక్షకులను పలకరించారు నాని. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా టైటిల్కి తగ్గట్టే హిట్ అయింది. ఇక శ్రీవిష్ణుకి ‘సింగిల్’ సినిమా రూపంలో మరో సూపర్హిట్ లభించింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలకపాత్రలో మెప్పించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.హీరోయిన్ సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. నూతన తారలు నటించిన ఈ చిత్రంలో సమంత అతిథిపాత్ర చేశారు. ‘శుభం’ ఓ మంచి ప్రయత్నంగా నిలిచిపోయింది. ఇక నవీన్చంద్ర ‘లెవన్’, రాజేంద్రప్రసాద్–అర్చన–రూపేష్–ఆకాంక్షా సింగ్ లీడ్ రోల్లో చేసిన ‘షష్టిపూర్తి’, తమిళ హిట్ ఫిల్మ్ ‘గరుడన్’ రీమేక్గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్–నారా రోహిత్– మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించే ప్రయత్నంలో తడబడ్డాయి. ‘లెవన్’ సినిమాకు లోకేశ్ అజ్ల్సస్, ‘భైరవం’కు విజయ్ కనకమేడల, ‘షష్టిపూర్తి’కి పవన్ప్రభ దర్శకత్వం వహించారు. ⇒ నార్నే నితిన్ హీరోగా రూపొందిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ జూన్ తొలి వారంలో వచ్చి ఫ్లాప్గా నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామారావు ఈ సినిమాను నిర్మించారు. ఇక జూన్ మూడో వారంలో ధనుష్–నాగార్జున–రష్మికా మందన్నా లీడ్ రోల్స్లో నటించిన ‘కుబేర’ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్స్కు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమాను పుస్కూర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ నిర్మించారు. అయితే ‘కుబేర’ సినిమా తెలుగులో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తమిళంలో ఆదరణ దక్కలేదు. ఈ చిత్రం విడుదలైన రోజే అనంతిక సనీల్కుమార్–హను రెడ్డి–రవితేజ దుగ్గిరాల లీడ్ రోల్స్లో నటించిన మీడియమ్ రేంజ్ సినిమా ‘8 వసంతాలు’ అలరించలేకపోయింది.ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ చివర్లో విష్ణు మంచు కలల ్రపాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదలైంది. ప్రభాస్, మోహన్బాబు, మోహన్లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్కుమార్, ఆర్. శరత్కుమార్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా గ్యాప్ తర్వాత ‘కన్నప్ప’ రూపంలో విష్ణు చెంత ఓ మంచి హిట్ చేరింది. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో ఎమ్. మోహన్బాబు ‘కన్నప్ప’ను నిర్మించారు. ఇలా ఈ ఏడాది ప్రథమార్ధం తొమ్మిది హిట్స్తో సరిపెట్టుకుంది. ‘మంచిని ఆశిద్దాం’ అంటారు కాబట్టి ద్వితీయార్ధం హిట్స్తో కళకళలాడాలని కోరుకుందాం. -
మెగా ఫ్యాన్స్కు దిల్ రాజు సోదరుడు క్షమాపణలు
రామ్ చరణ్ అభిమానులకు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. తాను మాట్లాడిన మాటలతో మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసిందన్నారు. నా వ్యాఖ్యల పట్ల ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే కమాపణలు కోరుతున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేశారు. గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ తమకు పూర్తిగా సహకరించారని ఆయన లేఖలో రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్తో పాటు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించమని శిరీష్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించాలని లేఖ ద్వారా కోరారు.అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఫెయిల్యూర్ తర్వాత రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ కనీసం ఫోన్ కూడా చేయలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తన సోదరుడు చేసిన కామెంట్స్పై దిల్ రాజు వివరణ కూడా ఇచ్చారు. అతను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని.. ఫస్ట్ టైమ్ కావడం వల్లే ఎమోషనల్గా అలా మాట్లాడి ఉంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో శిరీష్ రెడ్డి క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు.అసలు శీరిష్ రెడ్డి ఏం చెప్పారంటే?గేమ్ ఛేంజర్ గురించి నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..' గేమ్ ఛేంజర్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం. అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్ ఛేంజర్ ప్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు.' అని అన్నారు. -
లండన్లో రష్మిక చిల్.. జూన్ జ్ఞాపకాల్లో చాహల్ మాజీ భార్య ధనశ్రీ!
లండన్లో చిల్ అవుతోన్న రష్మిక మందన్నా..జూన్ జ్ఞాపకాల్లో చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ..ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గ్లామరస్ లుక్స్..అదిరిపోయే అవుట్ఫిట్లో అరియానా గ్లోరీ..వెకేషన్లో నిషా అగర్వాల్ చిల్.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
హీరోయిన్గా స్టార్ హీరో కుమార్తె ఎంట్రీ.. ఇంతకీ ఎవరంటే?
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది కామన్గా వినిపించే పదమే. చాలామంది అగ్రతారల పిల్లలు కూడా సినిమానే కెరీర్గా ఎంచుకోవడం మనం ఎక్కువగా చూస్తుంటాం. వారి బాటలోనే నడుస్తూ ఇండస్ట్రీలో తమ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటారు. అలా మరో స్టార్ హీరో కుటుంబం నుంచి వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూతురు విస్మయ అరంగేట్రానికి సిద్ధమైంది.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. తుడక్కం అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి జూడే ఆంథానీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జుడే ఆంథోని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఆశీర్వాద్ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. విస్మయ మోహన్ లాల్ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు ఆశీర్వాద్ సినిమాస్కు ఎంతో గర్వంగా ఉందని సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించింది. ఈ సంతోషకరమైన వార్తను మోహన్ లాల్ సైతం ట్వీట్ ద్వారా పంచుకున్నారు. తుడక్కం సినిమాపై నీ జీవితకాల ప్రేమకు ఇదే మొదటి అడుగు అంటూ రాసుకొచ్చారు.కాగా..విస్మయ సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ.. రచయితగా రాణిస్తోంది. రచయితగా ఆమె తన తొలి పుస్తకం 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్'ను 2021లో పెంగ్విన్ బుక్స్ ద్వారా విడుదల చేసింది. అంతేకాకుండా విస్మయ మార్షల్ ఆర్ట్స్ పట్ల కూడా నైపుణ్యం సాధించింది. థాయ్లాండ్లో మార్షల్ ఆర్ట్స్లోనూ శిక్షణ తీసుకున్నారు.మరోవైపు విస్మయ సోదరుడు ప్రణవ్ మోహన్లాల్ సైతం జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం 'ఆది'మూవీతోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రణవ్ ప్రస్తుతం డైస్ ఐరే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక మోహన్ లాల్ విషయానికొస్తే ఈ ఏడాదిలో ఎంపురాన్-2తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'ఎంపురాన్'-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత తుడురుమ్ అనే మూవీతో అలరించారు. Dear Mayakutty, may your "Thudakkam" be just the first step in a lifelong love affair with cinema.#ThudakkamWritten and Directed by Jude Anthany Joseph and Produced by Antony Perumbavoor, Aashirvad Cinemas#VismayaMohanlal@antonyperumbavoor @aashirvadcine… pic.twitter.com/YZPf4zhSue— Mohanlal (@Mohanlal) July 1, 2025 -
ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!
-
మరింత క్షీణించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. కన్నీటి పర్యంతమవుతోన్న భార్య!
ఈ రోజుల్లో ఎప్పుడు.. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. విధి రాతకు ఇక్కడ ఎవరు అతీతులం కాదేమో. ఎవరి జీవితంలో ఎప్పుడెలా తలకిందులవుతుందో ఊహించలేం. అలాంటి పరిస్థితి రాకూడదని మనం అనుకుంటాం. కానీ ప్రస్తుతం మనందరిని వెండితెరపై నవ్వించినా ఫిష్ వెంకట్ పరిస్థితి చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకతప్పదు. గతంలోనే కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినా కూడా ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.గత కొద్ది నెలలుగా బాగానే ఉన్నా ఫిష్ వెంకట్ మరోసారి ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. కిడ్నీల ఫెయిల్యూర్తో తొమ్మిది నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్న ఆయన.. మళ్లీ ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు. ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్ ఫ్యామిలీ.. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. మళ్లీ ఆయన ఆరోగ్యం మొదటికి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్కు డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో డయాలసిస్తో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు.. అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్తో తెగ పాపులర్ అయ్యారు. టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన ఈ నటుడు.. ప్రస్తుతం ఫిష్ వెంకట్ దయనీయ స్థితిలో ఉన్నాడు. దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే కోలుకునే అవకాశముందని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కాగా.. నాలుగేళ్ల క్రితమే ఆయనకు బీపీ, షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో ఆపరేషన్ చేశారు. -
గేమ్ ఛేంజర్పై శిరీష్ కామెంట్స్.. అసలు విషయం చెప్పిన దిల్ రాజు!
టాలీవుడ్లో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన శిరీష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ మాట వరసకు కూడా ఫోన్ చేయలేదంటూ మాట్లాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ వార్తల వేళ నిర్మాత దిల్ రాజు స్పందించారు. గత పది రోజులుగా ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ టాపిక్ లేకుండా జరగడం లేదన్నారు. గేమ్ ఛేంజర్ మూవీతో నేనే ఎక్కువగా ట్రావెల్ అయ్యాను.. శిరీష్కు ఈ సినిమాతో కనెక్షన్ చాలా తక్కువని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని శిరీష్ చూసుకున్నారని వివరించారు. గేమ్ ఛేంజర్ సమయంలో శంకర్ ఇండియన్-2 చేయడం వల్ల మా సినిమా వాయిదా పడుతూ వచ్చిందని వెల్లడించారు. అయినా కూడా రామ్ చరణ్ మా సినిమాకు చాలా ఓపికగా సహకరించి పూర్తి చేశారని దిల్ రాజు తెలిపారు. నా సోదరుడు శిరీష్ మొదటిసారి ఇంటర్వ్యూలో మాట్లాడారని.. ఆయన మొత్తం డిస్ట్రిబ్యూషన్ కోణంలోనే ఆలోచిస్తారని అన్నారు. శిరీష్ ఎమోషనల్గా మాట్లాడారు.. కానీ అతని ఉద్దేశం అస్సలు అది కాదని.. రామ్ చరణ్తో మాకు ఎలాంటి వివాదం ఉండదని దిల్ రాజు స్పష్టం చేశారు.కాగా.. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన తమ్ముడు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటించారు. ఈ మూవీలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. -
‘మైత్రీ’ వాళ్లకి ‘రేట్లు’ మాత్రమే కావాలి.. కోట్లల్లో నష్టపోయాం : దిల్ రాజు సోదరుడు
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్. డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా రాణిస్తున్న శిరీష్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలను కొని భారీగా నష్టపోయమని, తిరిగి ఇస్తామని చెప్పిన డబ్బులను కూడా ఇవ్వలేదని విమర్శించాడు. అదే సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సినిమాలను కొని నష్టపోతే.. ఆ నిర్మాత సూర్యదేవరనాగవంశి తిరిగి డబ్బులు ఇచ్చాడని చెబుతూ.. మైత్రీ నిర్మాతలకి, నాగవంశీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేశా చేశారు. (చదవండి: 'ఆర్య'కు రెమ్యునరేషన్.. అందుకే అల్లు అర్జున్ ఆ రేంజ్కు వెళ్లాడు: శిరీష్)‘మైత్రీ మూవీస్ బ్యానర్ సినిమాల వల్ల మేం నష్టపోయామే తప్ప.. ఒక్క రూపాయి లాభం వచ్చింది లేదు. వాళ్లకు రేట్లు(డబ్బులు) మాత్రమే కావాలి. మొదట్లో వారి సినిమాలన్నీ నైజాంలో మేమే డిస్ట్రీబ్యూషన్ చేశాం. అల వైకుంఠమురములో.. చిత్రాన్ని నైజాం ఏరియాకి రూ.20 కోట్లకు కొంటే.. రూ. 40 కోట్లు(షేర్) వచ్చింది. ఆ తర్వాత పుష్ప సినిమా వస్తే..దాన్ని రూ.42 కోట్లకి ఇస్తామని చెప్పారు. సూపర్ డూపర్ హిట్టయినా సినిమాకే రూ. 40 కోట్లు వస్తే..వీళ్లు నెక్ట్స్ సినిమాకి రూ. 42 కోట్లు అడగడం ఎంత వరకు న్యాయం? ఇలా చేస్తే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎలా బతకగలడు? వాడు సంపాదించుకోవద్దా? (చదవండి: 'గేమ్ ఛేంజర్'తో మా బతుకు అయిపోయింది.. మమ్మల్ని అతనే కాపాడాడు: నిర్మాత)ఇదే కాదు మైత్రీ నిర్మించిన సవ్యశాచి చిత్రాన్ని రూ.5.50 కోట్లకు కొంటే.. మూడున్నర కోట్ల నష్టం వచ్చింది. మరిన్ని చిత్రాలు ఇచ్చి ఆ నష్టాన్ని పూడుస్తామని చెప్పారు. ఆ తర్వాత చిత్రలహరి, అమర్ అక్బర్ అంథోని, గ్యాంగ్ లీడర్ చిత్రాలను ఇచ్చారు. కానీ వాటి వల్ల కూడా నష్టాలే వచ్చాయి. నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి రూ. 7 కోట్ల ఎన్ఆర్ఏ అడిగారు. కానీ ఆ సినిమా వల్ల కూడా రూ.1.75 కోట్లు నష్టం వచ్చింది. ఉప్పెన చిత్రాన్ని మొదటి మాకే ఇస్తానని చెప్పి..రిలీజ్ సమయానికి మేమే సొంతంగా రిలీజ్ చేస్తామని అన్నారు. దీంతో దిల్ రాజు వెళ్లి మాట్లాడి డీల్ సెట్ చేశారు. ఆ చిత్రంతో కొంత లాభాలు వచ్చాయి. ఆ తర్వాత పుష్ప చేశారు. ఇక చివరిగా ‘అంటే సుందరానికి ..’ చిత్రాన్ని మేమే నైజాంలో రిలీజ్ చేసి.. మైత్రీ వాళ్లని దూరం పెట్టేశాం. వారి బ్యానర్లో వచ్చిన చిత్రాలను మేము రిలీజ్ చేయడం లేదు’ అని శిరీష్ అన్నారు. -
డకాయిట్ నుంచి శృతి హాసన్ అవుట్.. కారణం అదేనన్న అడివి శేష్!
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న తాజా డగాయిట్. క్షణం, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్గా పనిచేసిన షానీల్ డియో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్ సరసన హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు.అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ను ఎంపిక చేశారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఆమె తప్పుకోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ను ఎంచుకున్నారు. తాజాగా శృతి హాసన్ మూవీ తప్పుకోవడంపై అడివి శేష్ స్పందించారు. శృతిహాసన్తో తనకు విభేదాలు తలెత్తాయని వచ్చిన రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)డకాయిట్ నుంచి శృతిహాసన్ తప్పుకోవడంపై ఎలాంటి వివాదం లేదని అడివి శేష్ అన్నారు. మా ఇద్దరి మధ్య విభేదాల వల్లే తాను తప్పుకుందని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇక్కడ ప్రధానంగా వర్కింగ్ స్టైల్ కుదరక పోవడం వల్లే తాను తప్పుకుందని తెలిపారు. అంతేకాకుండా శృతిహాసన్ కూలీ మూవీతో బిజీగా ఉన్నారని శేష్ తెలిపారు.అడివి శేష్ మాట్లాడుతూ..'కూలీతో ఆమె బిజీగా ఉన్నారు. సినిమా చేయడానికి నాకు చాలా టైమ్ పడుతుంది. ఆ ప్రాసెస్లో నాకు సింక్ అవ్వాలి. అంతే తప్ప ఇందులో ఎలాంటి వివాదం లేదు. మృణాల్ స్క్రిప్ట్ వినగానే ఓకే చెప్పారు. పది గంటలకు కథ చెప్పగానే.. మధ్యాహ్నం ఒంటిగంటకే ఓకే చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అరవై శాతం పూర్తయింది' అని పంచుకున్నారు. కాగా.. డకాయిట్ మూవీని తెలుగు, హిందీలో ఓకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అనుపమ పరమేశ్వరన్ మూవీ.. సెన్సార్ బోర్డ్పై సినీ సంఘాల ఆగ్రహం!
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన లేటెస్ట్ మలయాళ మూవీ 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ చిత్రంలో మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేశ్ గోపీ కీలక పాత్రలో నటించారు. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. సెన్సార్ కోసం బోర్డ్ ముందుకు వెళ్లగా.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు నో చెప్పింది. జానకి అనే పేరు సీతాదేవికి మరో పేరు అని.. అలాంటి పాత్రకు ఈ పేరు పెడితే స్క్రీనింగ్ చేయడం కుదరదని సెన్సార్ బోర్డ్ పేర్కొంది. సినిమాలో జానకి అనే పేరుని ఉపయోగించొద్దని సెన్సార్ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు క్లారిటీ ఇచ్చింది. టైటిల్, పాత్ర పేరుని మార్చాలని చిత్రబృందానికి బోర్డ్ సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టలేమని బోర్డు చెప్పింది. జానకి అనే మహిళ.. కోర్టులో చేసే న్యాయపోరాటం అనే స్టోరీతో 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాని డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ్ తీశారు.అయితే సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడంపై మలయాళ చిత్ర సంస్థలు మండపడుతున్నాయి. సెన్సార్ బోర్డ్ వైఖరిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించాయి. అసోసియేషన్ ఫర్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA), నిర్మాతల సంఘం, ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ తిరువనంతపురంలోని సీబీఎఫ్సీ ప్రాంతీయ కార్యాలయం ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఎఫ్సీ నిర్ణయం ఏకపక్షంగా ఉందని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు.(ఇది చదవండి: పేరు తీసేయాల్సిందే.. అనుపమ సినిమాకు కష్టాలు)అయితే 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాలో ఎటువంటి మతపరమైన అంశాలు లేవని దర్శకుడు స్పష్టం చేశారు. అయినా కూడా ఈ నిర్ణయం తమను నిరాశకు గురి చేస్తోందని ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ జనరల్ సెక్రటరీ ఉన్నికృష్ణన్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమాకు తిరువనంతపురంలోని సీబీఎఫ్సీ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ముంబయి ప్రధాన కార్యాలయంలో ఈ మూవీ సెన్సార్కు అడ్డంకులు ఎదురయ్యాయి. దీనిపై నిర్మాతలు ఇప్పటికే కేరళ హైకోర్టు ఆశ్రయించారు. -
నా రియల్ లైఫ్లో వాళ్లు లేరు.. అయినా ఫీల్ కాలేదు: లయ
తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్గా మెప్పించిన బ్యూటీ లయ. భద్రం కొడుకో మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన లయ.. ఆ తర్వాత స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత యూఎస్ వెళ్లిపోయిన లయ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా జాబ్ కూడా చేసింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది.నితిన్ హీరోగా వస్తోన్న తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో రిలీజ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కు హాజరైన లయ.. తమ్ముడు సినిమా గురించి తన అనుభవాలు పంచుకుంది. నా రియల్ లైఫ్లో అక్కా, తమ్ముడు అంటూ తనకెవ్వరు లేరని తెలిపింది. అందుకే ఈ చిత్రం తన కెరీర్లో చాలా స్పెషల్ అని ఆనందం వ్యక్తం చేసింది. ఈ మూవీ కోసం దాదాపు 90 రోజుల పాటు చెప్పుల్లేకుండానే పని చేశానని లయ వెల్లడించింది.లయ మాట్లాడుతూ..' ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్కు నేను ఎప్పుడు ఫీలవ్వలేదు. ఎందుకంటే నాకు అక్కా, తమ్ముడు, చెల్లి లాంటి వాళ్లు ఎవరూ లేరు. నా సినిమా జర్నీలో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సినిమా మొత్తం చెప్పుల్లేకుండా పరిగెత్తడం చాలా ఈజీ అనుకున్నా. కానీ తర్వాత రోజు అలానే చేస్తుంటే ఆ నొప్పి అప్పుడు అర్థమైంది. దెబ్బ మీద దెబ్బ తగిలి అలానే అలవాటు చేసుకున్నా. ఇన్నాళ్లు నా పాత సినిమాలు చూసి ఎలా అభిమానించారో.. నా తమ్ముడు సినిమాకు కూడా అలాగే మద్దతిస్తారని ఆశిస్తున్నా' అని తన అనుభవాన్ని పంచుకుంది.కాగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించింది. -
'తనే నా జీవితంలో మొదటి స్నేహితురాలు'.. తమ్ముడు డైరెక్టర్ భావోద్వేగం
తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో నితిన్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న లయ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో జూలై 04న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తమ్ముడు మూవీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈవెంట్కు హాజరైన దర్శకుడు వేణు శ్రీరామ్ తన జర్నీ గురించి మాట్లాడారు.తన జీవితంలో మొదటి స్నేహితురాలు అక్క అని వేణు శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన తన సోదరిని అందరికీ పరిచయం చేశారు. నా జీవితంలో మొట్టమొదటి కెమెరా మా అక్కనే కొనిచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు తొందరగానే పెళ్లి అయిపోందన్నారు. నా మొదటి షార్ట్ ఫిలిం ఆ కెమెరాతోనే తీశానని వేణు శ్రీరామ్ వెల్లడించారు. మా అక్క కష్టపడేతత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. -
'అల్లు అర్జున్' రెమ్యునరేషన్.. అందుకే ఆ రేంజ్లో ఉన్నాడు: శిరీష్
ఆర్య సినిమా 2004లో భారీ విజయం అందుకుంది. కథ, దర్శకత్వం సుకుమార్. ఈ మూవీ అల్లు అర్జున్తో పాటు నిర్మాతలు దిల్ రాజు-శిరీష్ల బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కు కూడా రెండో సినిమానే.. అయితే, రూ. ఆరు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 35 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఆ సినిమాకు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తాజాగా నిర్మాత శిరీష్ చెప్పుకొచ్చారు.'ఆర్య సినిమాకు మా బడ్జెట్ రూ. 6 కోట్లు మాత్రమే. అయితే, అల్లు అర్జున్కు రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలో చెప్పాలని అల్లు అరవింద్ను అడిగాం. కానీ, సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఎంత అనేది ఆయన చెప్పలేదు. మాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. ఆయన (అల్లు అరవింద్) ఎంత అడుగుతాడోనని మాలో ఒత్తిడి ఉంది. సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు ఆయన ఇంటికి వెళ్లాం. అప్పటికీ రెమ్యునరేషన్ గురించి తేల్చలేదు. మరుసటిరోజున ప్రసాద్ ల్యాబ్లో సినిమా వేశాం. అరవింద్ గారు సినిమా చూసి ఇంటికి వెళ్లిపోయారు. అప్పుడు దిల్ రాజు కూడా ఆయన ఇంటికి వెళ్లారు. సార్.. ఇప్పటికైనా అల్లు అర్జున్ రెమ్యునరేషన్ చెప్పండి అంటూ దిల్ రాజు రిక్వెస్ట్ చేశాడు. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'తో మా బతుకు అయిపోయింది.. మమ్మల్ని అతనే కాపాడాడు: నిర్మాత)అప్పుడు అరవింద్( Allu Aravind) ఒక్కటే మాట చెప్పారు. 'ఆర్య సినిమా నైజాంలో కోటి రూపాయలు చేస్తే నా కొడుక్కి పది లక్షలు ఇవ్వండి. రెండు కోట్లు చేస్తే ఇరవై లక్షలు, మూడు కోట్లు చేస్తే ముపై లక్షలు, నాలుగు కోట్లు చేస్తే నలభై లక్షలు ఇవ్వండి. అదే నా కొడుకు రెమ్యునరేషన్. అయితే, ఐదు కోట్లు చేస్తే యాభై లక్షలు ఇవ్వవద్దు. నా కొడుకు రెమ్యునరేషన్ రూ.40 లక్షలు మాత్రమే. కానీ, సినిమా వల్ల నష్టపోయి నైజాంలో కోటి చేస్తే పది లక్షలు మాత్రమే ఇవ్వండి. అంతకు మించి ఇవ్వద్దు.' అని అరవింద్ చెప్పారు.అల్లు అరవింద్ గారు చాలా ఆదర్శంగా నాడు రెమ్యునరేషన్ అడిగారని ఆ ఇంటర్వ్యూలో శిరీష్ చెప్పుకొచ్చారు. అందుకే నేడు అల్లు అర్జున్ అంత స్థాయిలో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోల తండ్రులు నిర్మాతలుగా ఉన్నారు. ఒక నిర్మాత బాధలు ఎలా ఉంటాయో వాళ్లకు తెలుసు. కానీ, డబ్బు విషయంలో అలాంటి హీరోల ప్రవర్తన ఎలా ఉందో అందరికీ తెలుసు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. -
కన్నడ బిగ్బాస్ హోస్ట్ ఎవరో ప్రకటించిన టీమ్
బిగ్బాస్ షో వివిధ రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న సెలబ్రిటీ రియాల్టీ షో అని తెలిసిందే. త్వరలో కన్నడ బిగ్బాస్-12 సీజన్ ప్రారంభం కానుంది. దాదాపు అన్ని సీజన్లకు హోస్ట్గా వ్యవహరించిన హీరో సుదీప్ ఇకపై తాను ఆ కార్యక్రమానికి హోస్ట్గా చేయాలనుకోవడం లేదని ఆయన గతంలోనే ప్రకటించారు. అయితే, ఈసారి ఎవరు హోస్ట్గా చేస్తారని కన్నడలో ఆసక్తి పెరిగింది. మళ్లీ కిచ్చా సుదీప్ హోస్ట్గా రావాలని ఆయన అభిమానులు #KicchaBackOnBBK, #BiggBossKannada12 హ్యాష్ట్యాగ్స్తో వైరల్ చేశారు. దీంతో సుదీప్ మనసు మార్చుకున్నారు. మళ్లీ హోస్ట్గా చేస్తానని ఆయన అధికారికంగా ప్రకటించారు.బిగ్బాస్ హోస్ట్ విషయంలో కిచ్చా సుదీప్ తన మనసు మార్చుకున్నారు. మళ్ళీ 'బిగ్ బాస్' షోను హోస్ట్ చేయడానికి అంగీకరించారు. ఈమేరకు మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. కలర్స్ కన్నడ ఛానల్ 'బిగ్ బాస్' నిర్వాహకులు కిచ్చా సుదీస్తో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలిసింది. కిచ్చా సుదీప్ హోస్ట్గా ఒప్పుకోకుంటే తమకు వేరే ఆప్షన్లు లేవని నిర్వహాకులు అన్నారు. అందుకే ఆయన్ను ఒప్పించామని మీడియా సమావేశంలో చెప్పారు. అయితే, 12వ సీజన్ తర్వాత, 13వ సీజన్కు ఎవరు హోస్ట్గా ఉంటారనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ స్వయంగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. రాబోయే 4 సీజన్లకు తానే హోస్ట్గా ఉంటానని ఆయన అన్నారు. తాము అలాంటి ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు.కన్నడ బిగ్బాస్ ఎందుకు చేయనని చెప్పానంటే..మిగతా భాషల్లో బిగ్బాస్కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్బాస్కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు. అలాంటి గుర్తింపు లేనప్పుడు దీనికోసం కేటాయించే సమయాన్ని సినిమాలపై పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే హోస్టింగ్కు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నా. అందుకే నాకు బిగ్బాస్ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్ చేశానని ఆయన అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేస్తామని చెప్పడంతోనే హోస్ట్గా చేసేందుకు ఒప్పుకున్నానని సుదీప్ అన్నారు. -
ధనుష్ రూ. 20 కోట్లు డిమాండ్.. విషయం తెలిసి బాధేసింది: వెట్రిమారన్
నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాబినేషన్లో వడచైన్నె అనే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత కూడా ధనుష్ కావడం విశేషం. కాగా దానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో వడచైన్నె– 2 చిత్రం గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు వచ్చే ఏడాది ఆ చిత్రం ఉంటుందని ధనుష్ బదులిచ్చారు. కాగా ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ ఉత్తర చైన్నె నేపధ్యంలో నటుడు శింబు కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనతో కూడిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేశారు. దీంతో నటుడు ధనుష్ నటించాల్సిన వడచైన్నె– 2లో శింబు నటిస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అంతే కాకుండా వడచైన్నె– 2 చిత్ర కాపీ రైట్స్ కోసం నటుడు ధనుష్ రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో దర్శకుడు వెట్రిమారన్ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన పరిస్థితి. ఆయన వివరణ ఇస్తూ ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి తానూ గమనిస్తున్నానని, అయితే శింబు హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం వడచైన్నె 2 కాదనీ, ఉత్తర చైన్నె నేపధ్యంలో సాగే మరో కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అయితే వడచైన్నె చిత్రంలోని పాత్రల ఛాయలుగానీ కొనసాగింపులు గానీ ఉంటే ఈ చిత్ర నిర్మాత (ధనుష్)తో తాము మాట్లాడుకుని అనుమతి పొందుతామని చెప్పారు. ఇకపోతే నటుడు ధనుష్ కాపీరైట్ రూ.20 కోట్లు అడిగారన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఈ విషయమై ధనుష్తో చర్చించానని, ఆయన సార్ మీకు ఏది కరెక్టో అది చేయండి, తాము తమ సైడ్ నుంచి నో అబ్జెక్స్ పత్రం ఇస్తాం అని చెప్పారన్నారు. అంతే కానీ డబ్బు ఏమీ వద్దు అని ఆయన చెప్పారన్నారు. అలాంటిది ప్రస్తుతం జరుగుతున్న వదంతులు బాధిస్తున్నాయని దర్శకుడు వెట్రిమారన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
కొత్తపల్లిలో ఒకప్పుడు!
‘కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి సినిమాలను నిర్మించిన నటి–నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను నిర్మించిన రానా, ప్రవీణ కలిసి మళ్లీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ చిత్రం నిర్మిస్తున్నారు.‘‘ఓ ఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఓ గ్రామీణ యువకుడి జీవితం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది. తెలుగు సినిమాకు ఒక లవ్లెటర్లాంటిది ఈ చిత్రం. నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని యూనిట్ పేర్కొంది. -
దీపావళికి కె–ర్యాంప్
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కె–ర్యాంప్(K-RAMP)’ ఈ దీపావళికి థియేటర్స్లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వంలో హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరు కుంది.కాగా సోమవారం ‘కె–ర్యాంప్’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేసి, ఈ చిత్రాన్ని ఈ దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘కిరణ్ అబ్బవరం కెరీర్లో ‘కె–ర్యాంప్’ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: చేతన్ భరద్వాజ్, సహ–నిర్మాత:జి. బాలాజీ. -
పాన్ ఇండియా చిత్రం ఆరంభం
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వస్తున్న పాన్ ఇండియా చిత్రం శనివారం ఆరంభమైంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటించనున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్పై పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ‘‘ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో పూరి చాలా కేర్ తీసుకుంటున్నారు.దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్ని సిద్ధం చేయడంతో పాటు నటీనటులను కూడా ఎంపిక చేశారు. ప్రీ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా చిత్రం విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి సీఈఓ: విషు రెడ్డి. -
గూఫీ విషయాలు చెప్పేస్తున్నా.. ‘రా’ కోరుకుంటా..రష్మిక మందన్న కామెంట్స్
ప్రస్తుతం రష్మిక మందన్న అంటే నేషనల్ క్రష్...మెగాస్టార్ చిరంజీవి సైతం తన అభిమానాన్ని దాచుకోలేనంటూ మాట్లాడేంత స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం ఈ సౌత్ బ్యూటీ ఏం మాట్లాడినా, ఏం చేసినా సెన్సేషన్. వరుస విజయాల ఈ కధానాయిక పంచుకునే విశేషాల కోసం సోషల్ మీడియా నిరంతరం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే... రష్మిక మందన్న తొలిసారిగా స్నాప్ చాట్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది.ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాల తర్వాత అదే స్థాయిలో ఇండియన్ యువతను ఆకట్టుకుంటున్న స్నాప్చాట్ లో ఆమె ఖాతా తెరవడం అభిమానులకు మరిన్ని విశేషాలతో కనువిందు చేయడమే అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ‘‘నేను ఎల్లప్పుడూ కొంచెం ‘రా’ గా( పచ్చిగా) కొంచెం వాస్తవంగా ఉండగలిగే ప్రదేశాలనే కోరుకుంటాను. అదే క్రమంలో ఇప్పుడు, స్నాప్చాట్లో ప్రవేశించాను. దీని ద్వారా నా తెర వెనుక క్షణాలు, నా చిన్న చిన్న ఆనందాలు కూడా పంచుకుంటాను.అంతేకాదు గూఫీ విషయాలు (చిన్న చిన్న పొరపాట్లు, తడబాట్లు, నవ్వు తెప్పించే చిరు తప్పిదాలు..వగైరా) కూడా. మధ్యలో ఉన్న ప్రతిదాన్ని (నా సోషల్ మీడియా బృందం చేసే ముందు కూడా) పంచుకునే సమయం ఇది. మీరు దీన్ని చూస్తుంటే, చాలా ధన్యవాదాలు, అభిమానులు ఇప్పటివరకు ప్రతిదానిలో అక్షరాలా భాగమయ్యారు వారికి ఇంకా ఎక్కువ సమయం అందివ్వడానికి నేను వేచి ఉండలేను. త్వరలో మిమ్మల్ని కలుస్తాను, నా ప్రేమికులారా ’’అని రష్మిక మందన్న ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో వేచి చూద్దాం..స్నాప్చాట్ వేదికగా ఈ నేషనల్ క్రష్ సృష్టించే జోష్ ఎలా ఉంటుందో... -
ముద్దుల కుమారుడితో టాలీవుడ్ జంట చిల్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ ఏడాదిలోనే తండ్రైన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి రహస్య(Rahasya Gorak ) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట తమ ముద్దుల కుమారుడితో చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.కాగా.. కిరణ్ అబ్బవరం, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఇక కిరణ్ అబ్బవంరం సినిమాల విషయాలకొస్తే..‘క’తో గతేడాది భారీ హిట్ అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘దిల్ రూబా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘కె-ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు. #TFNReels: Cutest fam vibes!😍 Actor @Kiran_Abbavaram and #RahasyaGorak’s adorable video with their lil munchkin is pure love!!💗#KiranRahasya #KiranAbbavaram #FamilyGoals #TeluguFilmNagar pic.twitter.com/VPg9xAOnXF— Telugu FilmNagar (@telugufilmnagar) June 30, 2025 -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఆ తెలుగు సినిమానే కాస్తా స్పెషల్!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్లలో కన్నప్ప సందడి చేస్తుండగా.. ఈ వారంలో తమ్ముడు అంటూ నితిన్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దీంతో బిగ్బాస్ గౌతమ్ నటించిన సోలో బాయ్ కూడా బాక్సాఫీస్ వద్దకు రానుంది. అయితే ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు.మిమ్మల్ని అలరించేందుకు ఈ వారం కూడా బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధమైపోయాయి. వాటిలో ప్రధానంగా తెలుగులో వస్తోన్న ఉప్పు కప్పురంబు సినిమాపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ప్రియమణి నటించిన వెబ్ సిరీస్ గుడ్ వైఫ్, ప్రియాంక చోప్రా హెడ్ ఆఫ్ స్టేట్, అమితాబ్ బచ్చన్ నటించిన కాళిధర్ లపతా కాస్తా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. వీటితో పాటు కమల్ హాసన్ నటించిన భారీ చిత్రం థగ్ లైఫ్ కూడా ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూలై మూడో తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. మరి ఏ యే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..అటాక్ ఆన్ లండన్- హంటింగ్ ది 7/7 బాంబర్స్- జూలై 01ది ఓల్డ్ గార్డ్-2- జూలై 02థగ్ లైఫ్(తమిళ సినిమా)- జూలై 03(రూమర్ డేట్)ది శాండ్మాన్ సీజన్-2- జూలై 03ది సమ్మర్ హికరు డైడ్- జూలై 05అమెజాన్ ప్రైమ్ వీడియో..ది హెడ్స్ ఆఫ్ స్టేట్- జూలై 02ఉప్పు కప్పురంబు(తెలుగు సినిమా)- జూలై 04జియో హాట్స్టార్కంపానియన్- జూన్ 30గుడ్ వైఫ్(వెబ్ సిరీస్)- జూలై 04జీ5కాళిధర్ లపతా(హిందీ సినిమా)- జూలై 04సోనిలివ్ది హంట్- రాజీవ్ గాంధీ హత్య కేసు- జూలై 04 -
మీరనుకున్నట్లు శ్రీదేవి అమాయకురాలు కాదు: సీనియర్ నటి పూనమ్
టాలీవుడ్ ప్రియుల గుండెల్లో అతిలోక సుందరిగా ముద్రవేసుకున్న హీరోయిన్ శ్రీదేవి. బాలీవుడ్తో పాటు తెలుగులోనూ స్టార్ హీరోయిన్గా మెప్పించింది. తాజాగా ఆమెపై మరో నటి, హీరోయిన్ పూనమ్ ధిల్లాన్ ప్రశంసలు కురిపించారు. అందరూ అనుకున్నట్లుగా తానేమీ తెలివితక్కువ వ్యక్తి కాదని తెలిపింది. తను చాలా అందమైన, అద్భుతమైన మనిషి అని అన్నారు. మీడియాలో చూపినట్లుగా మాటలు రాని వ్యక్తి కాదని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి పూనమ్ ధిల్లాన్.. శ్రీదేవిని ఉద్దేశించి ఇలా కామెంట్స్ చేశారు.నటి పూనమ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. 'శ్రీదేవి చాలా తెలివైన నటి. మీడియా ఆమెను మాటలు రాని వ్యక్తిగా ముద్ర వేసింది. కానీ ఆమె అంత తెలివైనది కాదు. తనను అమాయకురాలిగా ముద్ర వేయడం అదంతా ఒక కుట్ర అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమె చాలా తెలివిగల అమ్మాయి. అలా కాకపోతే ఆమె అంత అద్భుతమైన నటి ఎలా అవుతుంది? అందుకే శ్రీదేవి అమాయకురాలిగా నమ్మడాన్ని నిరాకరిస్తున్నా. నేను ఎల్లప్పుడూ ఆమె పనిని ఆరాధించేదాన్ని. తనతో కలిసి రెండు చిత్రాలలో పనిచేశా. శ్రీదేవి చాలా నిగ్రహం కలిగిన వ్యక్తి.' అని పంచుకుంది. కాగా.. శ్రీదేవి, పూనమ్ ధిల్లాన్ 'సోనే పే సుహాగా', 'జుదాయి' వంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు.ఇక సినిమాల విషయానికొస్తే నటి పూనమ్ ధిల్లాన్ చివరిసారిగా రితేష్ దేశ్ముఖ్, తమన్నా భాటియా నటించిన 'ప్లాన్ ఎ ప్లాన్ బి'లో కనిపించింది. ఆమె జియో హాట్స్టార్ షో 'దిల్ బెకరార్'లో కూడా కనిపించనుంది. -
అందమైన 'కోయిల'గా దేత్తడి హారిక (ఫోటోలు)
-
ఓటీటీలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీల్లో మిస్టరీ థ్రిల్లర్స్కు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఓటీటీలో ఇలాంటి కంటెంట్నే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సరికొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు, చిత్రాలు వచ్చేస్తున్నాయి. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణి కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మండల మర్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలై 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొత్త పోస్టర్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్లో వాణికపూర్ తొలిసారి డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. ఈ సిరీస్లో వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ను చరణ్దాస్పూర్ పట్టణం నేపథ్యంలో తెరకెక్కించారు. శతాబ్దాల క్రితం జరిగిన హత్యల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధాని నిర్మించారు. 'ది రైల్వే మెన్' (2023) తర్వాత నెట్ఫ్లిక్స్, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వస్తోన్న సిరీస్ ఇదే కావడం విశేషం. Har vardaan mein ek shraap chhupa hai, mol chukane ka waqt jald aane wala hai 🕸️Watch Mandala Murders, out 25 July, only on Netflix.#MandalaMurders #MandalaMurdersOnNetflix #VaibhavRajGupta @SurveenChawla @ShriyaP #JameelKhan @gopiputhran @manan_rawat @MogreYogendra… pic.twitter.com/eQm3iX4x8a— Vaani Kapoor (@Vaaniofficial) June 30, 2025 -
రూ.67 లక్షల కారు.. నాన్న కొనివ్వలేదు, నేనే లోన్ పెట్టి..: సురేశ్ గోపి కుమారుడు
'తండ్రి ఎంత సంపాదించాడన్నది నాకు ముఖ్యం కాదు. నా కష్టార్జితంతోనే నేను ముందుకు సాగుతాను' అంటున్నాడు మలయాళ నటుడు మాధవ్ సురేశ్. కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి కుమారుడే మాధవ్. ఇటీవల ఇతడు లగ్జరీ బ్రాండ్ గోల్ఫ్ జీటీఐ కారు కొనుగోలు చేశాడు. తండ్రి సంపాదనతోనే ఇంత పెద్ద కారు కొన్నాడని పలువురు కామెంట్లు చేశారు. తాజాగా ఈ కామెంట్లపై మాధవ్ స్పందించాడు. నాన్న కొనివ్వలేదు..ఓ ఇంటర్వ్యూలో మాధవ్ సురేశ్ (Madhav Suresh) మాట్లాడుతూ.. ఇటీవల నేను గోల్ఫ్ జీటీఐ కారు కొన్నాను. కేరళలో దీని ధర రూ.67 లక్షలు. మిగతా రాష్ట్రాల్లో అయితే దీని ఖరీదు ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే కారు తెచ్చుకోగానే చాలామంది మా నాన్నే కొనిచ్చాడని నన్ను తీసిపడేశారు. మీ అందరికీ ఓవిషయం చెప్తున్నా.. అది లోన్ తీసుకుని కొన్నాను. ప్రతి నెల కారు ఈఎమ్ఐ నేనే కట్టుకుంటాను. నా సంపాదనతోనే లోన్ చెల్లిస్తాను. మా నాన్న సంపాదించిందంతా ఆయన రిటైర్ అయ్యాక విశ్రాంత జీవితం గడిపేందుకు ఉపయోగపడుతుంది. లేదంటే నా సోదరీమణుల పెళ్లికి ఖర్చు చేస్తాడు. ఆయన డబ్బు వాటికోసం మాత్రమే ఉపయోగించాలి.ట్రోల్స్.. లైట్ తీసుకుంటాఒకవేళ నేను సంపాదించలేకపోతే అప్పుడు ఆయన సాయం తీసుకుంటాను. కానీ నేను కొన్న కారు మా నాన్న ఇచ్చిందైతే కాదు. నేను నా కోసం, నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. ఇక నన్ను తిట్టేవాళ్లపై నాకేమాత్రం కోపం లేదు. ఎందుకంటే నాకోసం వారు సమయం కేటాయిస్తున్నారు. అలా అని వారి ట్రోలింగ్కు స్పందిస్తూ కూర్చోను. నాకు గౌరవం ఇచ్చేవారినే తిరిగి గౌరవిస్తాను. నాన్న బీజేపీ మంత్రి అవడం వల్ల చాలామంది ఆయన్ని, మా కుటుంబం మొత్తాన్ని ద్వేషిస్తూ ఉంటారు. వాటిని నేను లెక్క చేయను అని మాధవ్ సురేశ్ చెప్పుకొచ్చాడు.సినిమా..మాధవ్ ప్రస్తుతం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ చేశాడు. ఇందులో సురేశ్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ టైటిల్పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవి మరో పేరైన జానకిని.. సినిమాలో దాడికి గురైన మహిళకు పెట్టడం సమంసజం కాదని అభిప్రాయపడింది. ఈ విషయంపై నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్ 27న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది.చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
'నేను ఏం మాట్లాడిన అలానే తీసుకుంటారు'.. విడాకుల రూమర్స్పై అభిషేక్ బచ్చన్!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్-ఐశ్వర్య జంటపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే వినిపిస్తున్నాయి. వీరిద్దరు విడాకుల తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి చాలాసార్లు కనిపించడంతో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. అంతేకాకుండా ఐశ్వర్య బర్త్ డే ఆలస్యంగా విష్ చేయడం.. ఆమెతో అభిషేక్ బచ్చన్ ఎక్కువగా కనిపించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అభిషేక్ ఇప్పటివరకు స్పందించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్ బచ్చన్.. తనపై వస్తున్న రూమర్స్పై స్పందించారు. సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న తప్పుడు సమాచారంపై తాను ఎందుకు స్పందించలేదనే విషయాన్ని వెల్లడించారు. నెగెటివ్ వార్తలు రాయడం అనేది ఈ రోజుల్లో కొత్త ట్రోలింగ్ ట్రెండ్ అని అభిషేక్ అన్నారు. తాను ఏం మాట్లాడిన ప్రజలు నెెగెటివ్గానే తీసుకుంటారని స్పష్టం చేశారు.అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. "గతంలో నా గురించి వచ్చిన కథనాలేవీ నన్ను ఎలాంటి ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. నేను ఏదైనా మాట్లాడితే అది వారిని చాలా బాధ పెడుతుంది. నేను ఏం చెప్పినా ప్రజలు దాన్ని నెగెటివ్గానే తీసుకుంటారు. ఎందుకంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా అమ్ముడవుతాయి. అలాంటి ప్రతికూలతను బయటపెట్టే వ్యక్తులు తమ మనస్సాక్షితో జీవించాలి. ఇక్కడ మనందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇది ఒక కొత్త ట్రోలింగ్ ఫ్యాషన్. మీరు సోషల్ మీడియాలో ఏదైనా చెప్పే బదులు.. డైరెక్ట్గా నాతో వచ్చి చెప్పడానికి మీకు అనుమతి ఇస్తా. కానీ నా ఎదురుగా వచ్చి చెప్పడానికి మీకు ధైర్యం ఉండదు. ఎవరైనా నా ఎదురుగా వచ్చి మాట్లాడితే వారిని స్వయంగా నేనే గౌరవిస్తా" అని అన్నారు. కాగా.. అభిషేక్ ప్రస్తుతం కాళిధర్ లపతా చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. మరోవైపు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 13 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. -
దిల్ రాజు బయోపిక్.. హీరోగా ఎవరు సెట్ అవుతారంటే?
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హీరో నితిన్- దిల్ రాజుతో ఇంటర్వ్యూ నిర్వహించారు.ఈ ఇంటర్వ్యూలో నితిన్- దిల్ రాజు మధ్య సరదా సంభాషణ జరిగింది. భవిష్యత్తులో మీ బయోపిక్ తీసే అవకాశముందా? అని నితిన్ ప్రశ్నించారు. అందుకు తగిన కంటెంట్ ఉంటుందా? అని అడిగారు. దీనికి దిల్ రాజు సమాధానమిచ్చారు. కచ్చితంగా కావాల్సిన కంటెంట్ ఉంటుంది.. దాదాపు 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నానని తెలిపారు. ఒకవేళ బయోపిక్ తీస్తే హీరోగా ఎవరైతే సెట్ అవుతుందని నితిన్ అడిగారు. చాలామంది నితిన్ నీ తమ్ముడిలా ఉంటారని చెబుతారు. అది నువ్వు ఒక్కడినే అని నాకు అనిపిస్తోందని అన్నారు.#Nithiin: మీ బయోపిక్ తీసే అంత కంటెంట్ మీ లైఫ్ ఉందా ? Dil Raju: Yea Definite గా ఉంది. pic.twitter.com/ZbDxyfFogS— Rajesh Manne (@rajeshmanne1) June 30, 2025 -
డైరెక్ట్గా ఓటీటీకి సలార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సలార్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఫేమ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ తర్వాత ఆడుజీవితం సినిమాతో మరోసారి సినీ ప్రియులను అలరించాడు. ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించారు.ప్రస్తుతం మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న సర్జమీన్ అనే బాలీవుడ్లో చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో కాజోల్ హీరోయిన్గా కనిపించనుంది. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు.సర్జమీన్ మూవీని జూలై 25 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన పేరుతో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఇబ్రహీం అలీ ఖాన్ ఉగ్రవాదిగా కనిపంచనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు.సర్జమీన్' కథేంటంటే?కశ్మీర్ నేపథ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. తన విధి పట్ల ఎంతో నిబద్ధత చూపించే విజయ్ మీనన్ (పృథ్వీరాజ్) చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో మీరా పాత్రలో కాజోల్, హర్మన్ పాత్రలో ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. మాతృభూమిని కాపాడటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు అనే క్యాప్షన్తో జియోహాట్స్టార్ ఈ వీడియోను షేర్ చేసింది. Sarzameen ki salamati se badhkar kuch nahi 🇮🇳#Sarzameen, releasing July 25, only on @JioHotstar!#SarzameenOnJioHotstar@itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze @MARIJKEdeSOUZA @somenmishra0 @Soumil1212 #ArunSingh… pic.twitter.com/qtxTBsq4Iq— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 30, 2025 -
సోషల్ మీడియా క్రేజ్.. ఏకంగా మూవీ ప్రమోషన్లలో కుమారి ఆంటీ!
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. గతంలో సోషల్ మీడియా వల్ల ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అలాంటి వారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఫేమస్ అయ్యారు. కుమారి ఆంటీ, కుర్చీ తాత, మోనాలిసా ఇలా ఎందరో ఉన్నారు. హైదరాబాద్లో రోడ్డు పక్కన్ భోజనాలు విక్రయించే కుమారి ఆంటీ ఓకే ఒక్క మాటతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. టూ లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం థౌజండ్ అయ్యిందని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.అదే ఫేమ్తో ఇప్పుడు ఏకంగా మూవీ ప్రమోషన్లలో భాగమయ్యారు కుమారి ఆంటీ. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన సినిమా షో టైమ్ ప్రమోషన్లలో సందడి చేశారు. సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్తో ఆమె ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కుమారి ఆంటీ ప్రమోషన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్
టాలీవుడ్ స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి (Ravuri Sravana Bhargavi)- హేమచంద్ర ఇప్పటికీ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోయారంటూ 2022లో పుకార్లు మొదలయ్యాయి. అవి అబద్ధమంటూ ఏనాడూ వీరిద్దరూ జంటగా బయటకు రాలేదు. పైగా హేమచంద్ర లేకుండానే కూతురితో ఒంటరిగా ట్రిప్స్కు వెళ్తోంది శ్రావణ భార్గవి. దీంతో వీరు దాపంత్య జీవితానికి స్వస్తి పలికి, ఒంటరిగా జీవిస్తున్నారని అభిమానులకు అర్థమైపోయింది.తప్పు చేస్తున్నామా?తాజాగా శ్రావణ భార్గవి ప్రేమ గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. జీవితం చాలా సున్నితమైనది. అవసరాలు, గొడవలు, అపార్థాలు, చిక్కుముళ్లు.. వీటితోనే బతికేయడంలో అర్థంపర్థం లేదు. ప్రేమ ఒక్కటే అర్థవంతమైనది. మనం మనస్ఫూర్తిగా ఒకర్ని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా? అని కించిత్తు కూడా బాధపడనక్కర్లేదు. ఉదారంగా, మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి. ఆ ప్రేమే.. మనం జీవితంలో గెలిచామా? ఓడామా? అనేది నిర్ణయిస్తుంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.హేమచంద్రతో ప్రేమపెళ్లిటాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావణ భార్గవి.. పాటలు పాడటమే కాదు, రాస్తుంది కూడా! అలాగే హీరోయిన్స్కు డబ్బింగ్ కూడా చెప్తుంది. ‘గబ్బర్సింగ్’, ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రాల్లో శ్రుతీహాసన్కి డబ్బింగ్ చెప్పింది. ఈగ హిందీ వర్షన్లో సమంతకు డబ్బింగ్ చెప్పింది. 2013లో సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. శ్రావణ భార్గవి- హేమచంద్ర ఒకప్పుడు కలిసి టీవీ షోలు చేశారు. ఓ షోలో జడ్జిలుగా కూడా వ్యవహరించారు. లక్కీ లవ్ అనే షార్ట్ ఫిలింలో జంటగానూ నటించారు.చదవండి: రూ. 25 కోట్ల ఎఫెక్ట్.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న నటుడు -
'కన్నప్ప'కు ఇలా జరగడం బాధేస్తుంది: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్లో 80 శాతం సీట్లు ఫిల్ అవుతున్నాయి. ఆపై తమిళనాడులో కూడా మంచి టాక్తో రన్ అవుతుంది. తెలుగులో కూడా మ్యాట్నీ, సాయంత్రం షోలు హౌస్ఫుల్ అయిపోతున్నాయి. అయితే, తాజాగా మంచు విష్ణు తాజాగా సోషల్మీడియాలో విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు. కన్నప్ప చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు ఆవేదన చెందారు. ఎంతో కష్టపడి సినిమాను నిర్మించామని, ఎవరూ పైరసీని ప్రొత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేశారు.కన్నప్ప సినిమా పైరసీకి గురైందని నటుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఇప్పటికే సుమారు 30వేలకు పైగానే అనధికారిక పైరసీ లింక్లను తమ టీమ్ తొలగించిందని ఆయన పేర్కొన్నారు. పైరసీ అంటే మరొకరి శ్రమను దోచుకోవడమే.. ఇలాంటి చర్య దొంగతనంతో సమానం అవుతుందన్నారు. ఈ విషయంలో చాలా బాధగా ఉందని విష్ణు ఆవేదన చెందారు. ' మన ఇంట్లో పిల్లలకు మనం దొంగతనం చేయమని మనం నేర్పించం. ఇలా ఒక సినిమాను పైరసీలో చూడడం కూడా దొంగతనంతో సమానమే అవుతుంది. దయచేసి ఇలాంటి వాటిని అరికట్టండి. మా ‘కన్నప్ప’ సినిమాను ఆదరించండి.' అంటూ విష్ణు కోరారు.కన్నప్ప సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 58 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీలో ప్రభాస్ పాత్రతో పాటు మంచు విష్ణు నటన అద్భుతంగా ఉందంటూ టాక్ బయటకు రావడంతో టికెట్లు బాగానే తెగుతున్నాయి. బుక్మైషోలో ప్రతిరోజు సుమారు ఒక లక్షకు పైగానే టికెట్లు సేల్ అవుతున్నాయి. -
'కన్నప్ప' తర్వాత మంచు విష్ణు సినిమా ఇదే.. దర్శకుడు ఎవరంటే..?
'కన్నప్ప' సినిమా విజయం తర్వాత మంచు విష్ణు జోరు పెంచుతున్నారు. త్వరలో ఆయన నటించనున్న కొత్త సినిమాపై వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించనున్న దర్శకుడు ఎవరో కూడా సమాచారం బయటికి వచ్చింది. కన్నప్ప మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మ్యాట్నీ, సాయింత్రం షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి. దీంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఇదే జోష్తో ఆయన మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. 'కన్నప్ప'కు కొరియోగ్రాఫర్గా పనిచేసిన ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు తర్వాతి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వైరల్ అవుతుంది.'కన్నప్ప' హిట్ తర్వాత మంచు విష్ణు- ప్రభుదేవా కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ రానుందని సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రభుదేవా ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. గతంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి సినిమాలతో దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కన్నప్ప సినిమాకు కొరియోగ్రాఫర్గా పనిచేసిన ప్రభుదేవా... మంచు విష్ణుతో మంచి స్నేహం ఏర్పడింది. దీంతో వారిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కమర్షియల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు ఫ్యామిలీనే నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
విజయ్ సేతుపతి- నిత్యా మీనన్ సినిమా టీజర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కొత్త సినిమా ‘తలైవా తలైవి’ (Thalaivan Thalaivi) టీజర్ను విడుదల చేశారు. ఆపై మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen) ఆయనకు జోడీగా నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. జులై 25న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళ్తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. -
విడుదలై తర్వాత వెట్రిమారన్ చేస్తున్న సినిమా ఇదే
నటుడు శింబు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన ఏ చిత్రంలో నటించినా సంచలనమే అవుతుంది. అదేవిధంగా కోలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన దర్శకుడు వెట్రిమారన్. ఈయన చిత్రాలు ఇతర చిత్రాలకు కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టే కథాంశాలే ఈయన చిత్రాలకు కంటెంట్ అవుతాయి. ఈయన ఇటీవల తెరకెక్కించిన విడుదలై, విడుదలై 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అలాంటి వారికి సంచలన న్యూస్ ఏమిటంటే నటుడు శింబు హీరోగా చిత్రం చేయబోతున్నారన్నదే. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇది ఇంతకు ముందు వడచెన్నై చిత్రంలో దర్శకుడు అమీర్ పోషించిన రాజన్ వాగైయరో పాత్రతో కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం. దీంతో ఈ చిత్రానికి రాజన్ వాగైయారో అనే టైటిల్ నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో దర్శకుడు నెల్సన్, నటుడు కవిన్ ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్లు, ఆండ్రియా(Andrea Jeremiah) ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగును వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే సోషల్ పొలిటికల్ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కేజీ చిత్రాన్ని కలైపులి ఎస్ ధాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వెట్రిమారన్ చాలా టైట్ షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
ముందుంది మస్త్ మజా
2025 నేటితో సగం పూర్తయింది. అయితే ఈ ప్రథమార్ధంలో వచ్చిన స్టార్ హీరోల చిత్రాల సంఖ్య తక్కువే. కానీ ద్వితీయార్ధం ధూమ్ ధామ్గా ఉండబోతోంది. పలువురు స్టార్స్ వెండితెరపైకి దూసుకు రావడానికి రెడీ అయ్యారు. సో... 2025 సెకండాఫ్ హీరోల అభిమానులకు పండగే. అలాగే హీరోయిన్ల ఫ్యాన్స్కి కూడా. ‘ముందుంది మస్త్ మజా’ అంటూ థియేటర్లకు రానున్న ఆ చిత్రాల గురించి...ఈ ఏడాదే విశ్వంభర ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడింది. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, ‘విశ్వంభర’ అనే పుస్తకం, ‘విశ్వంభర’ ప్రపంచం సినిమాలో కీలకంగా ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్స్తో యూనిట్ బిజీగా ఉంది. ‘విశ్వంభర’ ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.అఖండ తాండవం హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రానున్న తాజా చిత్రం ‘అఖండ 2’. 2021లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్గా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోంది. సంయుక్త ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారని టీజర్ స్పష్టం చేస్తోంది. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. సైమన్ ఈజ్ కమింగ్ ధనుష్తో కలిసి ‘కుబేర’ సినిమాతో థియేటర్స్లోకి వచ్చారు నాగార్జున. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ఈ మూవీలో నాగార్జున చేసిన లీడ్ రోల్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే రోల్ని నాగార్జున ‘కూలీ’లో చేశారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సైమన్ అనే పవర్ఫుల్ విలన్పాత్రలో నాగార్జున కనిపిస్తారు. నాగార్జున పూర్తి స్థాయి విలన్గా కనిపించనున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇటు వీరమల్లు... అటు ఓజీ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు, ఓజీ’... ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే విడుదల కాన్నాయి. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా జూలై 24న విడుదల కానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించారు. ఇక పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీ’. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ గ్యాంగ్స్టర్ సినిమాను సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.పోలీసాఫీసర్ లక్ష్మణ్ భేరీరవితేజ పోలీసాఫీసర్గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే పవర్ఫుల్పోలీసాఫీసర్పాత్రలో రవితేజ కనిపిస్తారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. షూటింగ్ దాదాపు పూర్తయింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. రాజా సాబ్ రెడీ విష్ణు మంచు టైటిల్ రోల్ చేసిన ‘కన్నప్ప’ సినిమాలో రుద్రగా కనిపించి ప్రేక్షకులను అలరించారు ప్రభాస్. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ హారర్ కామెడీ యాక్షన్ సినిమాను మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లు. తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపిస్తారు.ఆంధ్రా కింగ్ తాలూకా... ఓ సినిమా హీరోకి, ఆ హీరో ఫ్యాన్కి మధ్యలో జరిగే సంఘటనలతో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో అభిమానిగా రామ్, సినిమా స్టార్ సూర్యకుమార్గా ఉపేంద్ర కనిపిస్తారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పి. మహేశ్బాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాజమండ్రిలో ఆరంభమైంది. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. సెంటిమెంటల్ తమ్ముడు ఈ ఏడాది మార్చిలో నితిన్ నుంచి ‘రాబిన్హుడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలైలో ‘తమ్ముడు’ సినిమాతో మరోసారి వస్తున్నారు నితిన్. అక్కా తమ్ముడు సెంటిమెంట్తో వస్తున్న ఈ సినిమాలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలకపాత్రధారులు. లయ తమ్ముడిపాత్రలో నితిన్ కనిపిస్తారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. త్వరలో కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు కానీ జూలై చివర్లో లేదా ఆగస్టులో ‘కింగ్డమ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమా రెండు డిఫరెంట్ టైమ్లైన్స్లో సాగుతుందని టాక్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమికులు క్రైమ్ చేయాల్సి వస్తే! ఈ ఏడాది మే 1న నాని హీరోగా చేసిన ‘హిట్ 3’ సినిమాలో అడవి శేష్ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఆయన సోలో హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్: ఏ లవ్స్టోరీ’ డిసెంబరు 25న రిలీజ్ కానుంది. ఈ క్రైమ్ లవ్స్టోరీ థ్రిల్లర్ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనురాగ్ కశ్యప్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. బ్రేకప్ చేప్పుకున్న ప్రేమికులు కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథనం అని తెలిసింది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ–నిర్మాత.కిష్కింధపురిలో...బెల్లకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. అలాగే లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ‘హైంధవ’, సాగర్కె. చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ సినిమాలు కూడా చేస్తున్నారు సాయిశ్రీనివాస్. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.సోషియో ఫ్యాంటసీ ‘స్వయంభూ’ నిఖిల్ హీరోగా నటిస్తున్నపాన్–ఇండియా మూవీ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లు. ఇందులో హీరో మాత్రమే కాదు... హీరోయిన్లు కూడా యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.లవ్స్టోరీ తెలుసు కదాఈ ఏడాది వేసవిలో ‘జాక్’ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ థియేటర్స్కి వచ్చారు. ఇక ఈ దీపావళికి ‘తెలుసు కదా’ అనే లవ్స్టోరీతో రానున్నారు సిద్ధు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న రిలీజ్ కానుంది. ముక్కోణపు ప్రేమకథగా ‘తెలుసు కదా’ ఉంటుందట. ఏటిగట్టు సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 75 శాతం పూర్తయింది. ఈ సినిమా సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. మిరాయ్ అడ్వెంచర్ ‘హను–మాన్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తర్వాత హీరో తేజ సజ్జా నటిస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ‘మిరాయ్’. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్. మంచు మనోజ్ విలన్గా చేస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. ఇంకా నవీన్చంద్ర ‘షో టైమ్’, ఆది సాయికుమార్ ‘శంబాల’, సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’తోపాటు పలు మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఉమన్ పవర్ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలు వరుసగా విడుదలవుతుంటే... స్టార్ హీరోయిన్ల చిత్రాలూ దూసుకు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తమ పవర్ చూపించడానికి అనుష్క, లావణ్యా త్రిపాఠి, రష్మికా మందన్నా వంటి తారలు రెడీ అయ్యారు. ⇒ పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన ఓ బాధిత గిరిజన మహిళ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి, లెజెండ్గా ఎలా ఎదిగింది? అనే కథాంశంతో అనుష్క ‘ఘాటీ’ రూపొందింది. క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో తమిళ హీరో విక్రమ్ ప్రభు లీడ్ రోల్ చేశారు. ⇒ కుటుంబ బంధాలను నిలపడానికి సతీ లీలావతి ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సతీ లీలావతి’. లావణ్యా త్రిపాఠి టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ ఆమె భర్తపాత్ర చేశారు. భార్యాభర్తల అనుబంధాన్ని ఎమోషనల్గా, ఎంటర్టైనింగ్గా చూపిస్తూ, తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. . ⇒ స్టార్ హీరోల చిత్రాల్లోనూ గుర్తింపు తెచ్చుకునేపాత్రలు చేస్తూ దూసుకెళుతున్న రష్మికా మందన్నా నటించిన తొలి ఉమన్ సెంట్రిక్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి ఓ లీడ్ రోల్ చేశారు. ఈ ప్రేమకథా చిత్రంలో క్లిష్టమైన రిలేషన్షిప్ని ఎదుర్కొనే కాలేజీ విద్యార్థినిగా రష్మిక నటించారు. ఇక ఇది కాకుండా ‘మైసా’ అనే మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీ కూడా రష్మిక డైరీలో ఉంది. ⇒ అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. మూఢ నమ్మకాలు, మహిళా సాధికారిత వంటి అంశాలతో రూపొందిన ‘పరదా’ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.⇒ ఇంకా కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’ అంటూ టైటిల్ రోల్లో ఆగస్ట్ 27న థియేటర్స్కు రానున్నారు. జేకే చంద్రు దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం తెలుగులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. అలాగే వరలక్ష్మిపోలీసాఫీసర్గా నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా మరికొందరు నాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో తమ పవర్ని నిరూపించుకోనున్నారు. కన్యారాశి టైమ్ వచ్చిందిహిట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (2018)కి సీక్వెల్గా ‘ఈఎన్ఈ రిపీట్’ సినిమా రానుంది. ‘ఏలినాటి శనిపోయింది.. కన్యారాశి టైమ్ వచ్చింది’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. తొలి భాగంలో నటించిన విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను సీక్వెల్లోనూ నటించనున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ సీక్వెల్కు దర్శకత్వం వహించనున్నారు. డి. సురేష్బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్.ఫీల్గుడ్ లవ్స్టోరీనరేశ్ అగస్త్య హీరోగా విపిన్ దర్శకత్వంలో ఉమా దేవి కోట నిర్మించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాలో రబియా ఖతూన్ కథానాయికగా నటించారు. ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘ఫీల్గుడ్ లవ్స్టోరీతో రూపొందించిన ఈ చిత్రంలో మ్యూజిక్కి మంచి స్కోప్ ఉంది. జస్టిన్ ప్రభాకరన్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఈ చిత్రం మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
రెమ్యునరేషన్ గురించి అస్సలు ఆలోచించను: కీర్తి సురేశ్
కీర్తిసురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ఉప్పు కప్పురంబు. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సుహాస్ కీలక పాత్ర పోషించారు. సెటైరికల్ కామెడీ వస్తోన్న ఈ సినిమాకు ఐవీ శశి దర్శకత్వం వహిచారు. రాధికా ఎల్ నిర్మించిన ఈ చిత్రానికి వసంత్ మురళీకృష్ణ మరింగంటి కథ అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు సుహాస్, కీర్తి సురేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కీర్తి సురేశ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడింది. నా విషయంలో పారితోషికం అనేది లాస్ట్ ఆప్షన్ అని చెప్పింది. తనకు మొదట కథనే చాలా ముఖ్యమని తెలిపింది. డిఫరెంట్ రోల్స్ చేయడమే నా లక్ష్యమని పేర్కొంది. ప్రతి ఒక్క సినిమాలో కొత్తగా చేయాలని ఉంటుందని కీర్తి సురేశ్ వెల్లడించింది. సినిమాలో ఛాలెంజ్ రోల్ చేయడం తనకిష్టమని తెలిపింది. కాగా.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా జూలై 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
రెజీనా గ్లామరస్ లుక్స్... బర్త్ డే పార్టీలో తమన్నా చిల్!
బర్త్ డే పార్టీలో ఎంజాయ్ చేస్తోన్న తమన్నా భాటియా..వెబ్ సిరీస్ జ్ఞాపకాల్లో శ్వేతాబసు ప్రసాద్..గ్రీన్ డ్రెస్లో అందాలు ఆరబోస్తోన్న రెజీనా కసాండ్రా..వెకేషన్లో చిల్ అవుతోన్న శిల్పా శిరోద్కర్..డిఫరెంట్ లుక్స్లో ఆదా శర్మ పోజులు పట్టు పరికిణీలో నటి శృతిక అర్జున్ హోయలు.. View this post on Instagram A post shared by Shrutika Arjun (@shrutika_arjun) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
వెకేషన్లో సూర్య దంపతులు.. వీడియో షేర్ చేసిన జ్యోతిక!
రెట్రో మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్తో జతకట్టారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరితో కలిపి పనిచేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో సూర్య తన కూతురితో కలిసి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ మమతా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా విరామం రావడంతో విదేశాల్లో వాలిపోయారు సూర్య. తన భార్య జ్యోతికతో కలిసి ఫారిన్లో చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవీ చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
మొదటి భార్యతో విడాకులు.. మద్యానికి బానిసయ్యా: అమిర్ ఖాన్
ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఆమిర్ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య రీనా దత్తాతో విడిపోయాక ఎదుర్కొన్న పరిస్థితిని వివరించారు. ఆ టైమ్లో తీవ్రమైన ఒత్తిడి, బాధకు గురయ్యానని వెల్లడించారు. దీంతో మద్యానికి బానిసైనట్లు తెలిపారు. నా సినిమా లగాన్ విజయం సాధించినప్పటికీ.. జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించదన్నారు. అది తన జీవితంలో చీకటిదశ అని పేర్కొన్నారు.అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'రీనాతో నేను విడిపోయినప్పుడు ఆ రోజు సాయంత్రంమే మద్యం ఫుల్ బాటిల్ తాగాను. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం తాగాను. ఆ సమయంలో ఎప్పుడూ నిద్రపోలేదు. అధిక మద్యం సేవించడం వల్ల నేను స్పృహ కోల్పోయేవాడిని. ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించా. ఆ సమయంలో ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు. అదే ఏడాది నా సినిమా లగాన్ రిలీజైంది. అప్పట్లో నన్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని పిలిచారు. అది నాకు చాలా వ్యంగ్యంగా అనిపించింది' అని పంచుకున్నారు.కాగా.. ఆమిర్, రీనా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంతేకాదు అమిర్ ఖాన్ తన రక్తంతో ఆమెకు ఒక లేఖ కూడా రాశాడు. రీనా మొదట అమిర్ ప్రేమను అంగీకరించలేదు.. కానీ తరువాత ఓకే చెప్పి.. ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా రీనా దత్తా ఆమిర్ మొదటి చిత్రం 'ఖయామత్ సే ఖయామత్ తక్'లో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది. వీరి వివాహమైన 16 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఈ జంటకు జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమిర్ 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ జంట 16 సంవత్సరాల తర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆమిర్ ప్రస్తుతం తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో రిలేషన్లో ఉన్నారు. -
ఆ డైరెక్టర్ మాట వల్లే కన్నప్ప వాయిదా వేశా: మంచు విష్ణు
కన్నప్ప మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు హీరో మంచు విష్ణు. తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరెకెక్కించిన కన్నప్ప ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంటోంది. దీంతో కన్నప్ప బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప సక్సెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు మంచు విష్ణు హాజరై మాట్లాడారు. కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సంచలన డైరెక్టర్ ఆర్జీవీ వల్లే తాను మూవీని పోస్ట్పోన్ చేశానని వెల్లడించారు. దీనికి గల కారణాలను మీడియాతో పంచుకున్నారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'నా జనరేషన్లో నేను నమ్మే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇవాళ ఆయన నాకు ఓ మేసేజ్ పెట్టాడు. మార్చిలో నాన్నగారిని కలవడానికి వచ్చారు. ఆ రోజు ఇంట్లో కన్నప్ప సినిమా మేకింగ్ నాలుగు నిమిషాల వీడియోను ఆయనకు చూపించాను. మీ సినిమా మొత్తం గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్..ఎక్స్ట్రార్డినరీ అని వీవీఎస్ రవి అన్నారు. ఈ మాట విన్న రాంగోపాల్ వర్మ ఒక మాట అన్నారు. ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్ను వదిలిపెడతాడా.. అవీ కూడా బ్రహ్మండగానే ఉంటాయి అన్నారు. అది విన్న తర్వాత భయపడి పోస్ట్పోన్ చేసేశా. ఈ రోజు కూడా టెక్నికల్గా మా డైరెక్టర్, ఎడిటర్, నేను చాలా సీక్వెన్స్లు వదిలిపెట్టేశాం. మేము అనుకున్నంతగా వీఎఫ్ఎక్స్ రాలేదు. ఇది మాకు ఒక పెద్ద గుణపాఠం' అని వెల్లడించారు. #RamGopalVarma అన్న ఒక్క మాటకి ఏప్రిల్ నుంచి పోస్టుపోన్ చేశాను - #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/yiMnZW5RdU— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2025 -
పెళ్ళైన ఇన్ని రోజులకి ఫోటోలు షేర్ చేసిన అఖిల్.. మ్యారేజ్ పిక్స్ వైరల్
-
సమంతపై ట్రోలింగ్.. ఆ వీడియోతో ఇచ్చిపడేసిన సామ్!
శుభం మూవీ తర్వాత సమంత సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. సోషల్ మీడియాలో ఇటీవల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. జిమ్లో వర్కవుట్స్ చేస్తూ తెగ బిజీ అయిపోయింది. ముంబయిలో జిమ్ వెలుపల ఆమె కనిపించడంతో కొందరు ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత కాస్తా అసహనానికి గురైంది.ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో జిమ్ వర్కవుట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. అందులో వీడియోతో పాటు ఓ కోటేషన్ కూడా రాసుకొచ్చింది. తన బాడీ గురించి కామెంట్స్ వారిని ఉద్దేశించి అందులో ప్రస్తావించింది. వీటిలో మొదటి మూడు చేయగలిగితే తప్ప నన్ను సన్నగా, అనారోగ్యంగా ఉన్నారని అలా చెత్తగా మీరు పిలవలేరు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఇది తన బాడీని షేమింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించే చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను జిమ్లో కష్టపడుతున్న వీడియోలను కూడా పంచుకుంది. సమంత తన వర్కౌట్ వీడియోతో ట్రోలర్స్కు సవాలు విసురుతోంది.కాగా.. సమంత చివరిసారిగా శుభం సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించింది. అంతకుముందు వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం 'రఖ్త్ బ్రహ్మండ్'తో పాటు 'బంగారం' అనే తెలుగు చిత్రంలో కనిపించనుంది. -
మంచు విష్ణు కన్నప్ప.. రెండో రోజు ఊహించని కలెక్షన్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా థియేటర్లలోకి వచ్చిన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. మొదటి రోజు రూ. 9.35 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో కలిపి ఇండియా వ్యాప్తంగా రూ. 16.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.కాగా.. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే విష్ణు మంచు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కన్నప్ప నిలవనుంది. గతంలో మంచు విష్ణు చిత్రాలైన జిన్నా, మోసగాళ్లు సినిమాలకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో మెప్పించగా.. మంచు విష్ణు తిన్నడు పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కనిపించింది. అంతేకాకుండా మోహన్ బాబు, అర్పిత్ రంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మంద, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, రఘు బాబు, మధు కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు క్రైమ్ డ్రామా!
చిన్న సినిమాలో ఓటీటీలో దూసుకెళ్తున్నాయి. థియేటర్స్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్ర సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. ఆ లిస్ట్లోకి ఇప్పుడు 23 మూవీ కూడా చేరింది. మల్లేశం'ఫేం రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామా మే 16న థియేటర్స్లో విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక రీసెంట్గా ఓటీటీలో విడుదలై మంచి వ్యూస్తో దూసుకెళ్తోంది. ఒకేసారి మూడు ఓటీటీల్లో ఈ చిత్రం ప్రీమియర్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్తో పాటు ఆహా, ఈటీవీ విన్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ట్రెండింగ్లో ఉంది. అలాగే ఆహాలో ట్రెండింగ్ అవుతున్న టాప్ 10 సినిమాలో టాప్ 2 ప్లేస్లో ఈ చిత్రం ఉంది.23 విషయానికొస్తే..1991లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహనం సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సాగర్(తేజ) ఓ పల్లెటూరిలో ఉంటాడు. లోన్ తీసుకుని ఇడ్లీ బండి పెట్టుకోవాలనేది కోరిక. కానీ అప్పు దొరకదు. పొగాకు కూలీ సుశీల(తన్మయి)ని ప్రేమిస్తుంటాడు. పెళ్లి కాకుండానే ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆమెని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు కావాలి. దీంతో తన ఫ్రెండ్ దాస్తో కలిసి బస్సు దోపిడీ చేయాలని అనుకుంటాడు. కానీ అది అమలు చేసే క్రమంలో ప్రయాణికులు తిరగబడతారు. అనుకోకుండా నిప్పంటుకుని 23 మంది సజీవ దహనం అయిపోతారు. తర్వాత ఏమైంది? కోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేదే మిగతా స్టోరీ. -
దాదాసాహెబ్... అంత ఈజీ కాదు: ఆమిర్ ఖాన్
దివంగత ప్రముఖ దర్శక–నిర్మాత–స్క్రీన్ రైటర్ దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke) జీవిత చరిత్ర వెండితెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో ఈ దాదాసాహెబ్ బయోపిక్ రూపొందనుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడారు. ‘‘దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయడం అనేది పెద్ద చాలెంజ్. వాణిజ్యపరమైన అంశాలున్న సాధారణ సినిమా కాదు ఇది. ఆ రోజుల్లోనే ఎవరూ ఊహించలేని విధంగా అడ్వెంచర్ చేసిన వ్యక్తి కథ ఇది. అంత ఈజీ కాదుఆయన జీవితంలో ఎన్నో ఎగ్జైట్ చేసే అంశాలు, సంగతులు, సంఘటనలు ఉన్నాయి. అడ్వెంచర్ జర్నీలాంటి ఈ సినిమా చేయడం అంత సులభం కాదు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయడాన్ని నేను, రాజు (దర్శకుడు రాజ్కుమార్ హిరాణి కావొచ్చు) పెద్ద గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన్ చేశాం’’ అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.చదవండి: '21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ -
రోజంతా కూర్చోబెట్టి.. అమ్మాయితో గుడి గంట కొట్టించారు : దిల్ రాజు
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు(Dil Raju) ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి..ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై పెద్ద సినిమాలను.. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చిన్న చిత్రాలను నిర్మిస్తూ.. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు వచ్చాయని, అవన్నీ తట్టుకొని నిలబడితేనే ఇప్పుడీ స్థానంలో ఉన్నానంటున్నాడు దిల్ రాజు. సినిమా రంగంలో ఇప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని పసిగట్టి జాగ్రత్తగా ఉంటేనే ఇక్కడ రాణించగలరి చెబుతున్నాడు. సినిమా రంగంలోకి రావాలనుకునే నూతన దర్శక నిర్మాతలు, నటీటనులతో పాటు టెక్నీషియన్లకు సరైన గైడెన్స్ ఇవ్వడం కోసం ‘దిల్ రాజు డ్రీమ్స్ ’ పేరిట ఆయన ఓ వేదికను ఏర్పాటు చేశాడు. తాజాగా ‘దిల్ రాజు డ్రీమ్స్ ’ వెబ్సైట్ని విజయ్ దేవరకొండ, దేవీశ్రీ ప్రసాద్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్తవాళ్లకు దిల్ రాజు పలు సూచనలు చేశారు. ఇక్కడ 1 శాతమే సక్సెస్ ఉంటుందని.. 24 గంటలు కష్టపడితే తప్ప ఆ సక్సెస్ రాదని అన్నారు. ఇండస్ట్రీలో జరిగే మోసాల గురించి చెబుతూ.. తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి వివరించాడు. (చదవండి: మా ఫ్యామిలీలో ఆయనే హిట్లర్.. నాతో పెళ్లికి ఆయన్ని ఒప్పించాలన్నా..!)‘1996లో నేను, శిరీష్ సినిమా రంగంలోకి వచ్చాం. ఫస్ట్టైం ఓ సినిమా కొందామని హైదరాబాద్ వచ్చాం. దర్శకనిర్మాతలతో చర్చించి సినిమా కొన్నాం. సినిమా ఓపెనింగ్ రోజు మాకు ఆహ్వానం అందింది. దీంతో నేను, శిరీష్ సెట్కి వెళ్లగానే.. ‘సర్..మీరు చూడడానికి చాలా బాగున్నారు.. ఈ సినిమాలో నటించండి’ అన్నారు. నేను ఓకే చెప్పాను. మరుసటి రోజు షూటింగ్కి వెళితే.. అక్కడ నాకు, శిరీష్కి బ్యానర్లు కట్టారు. ఎందులో అలా చేశారో అర్ధం కాలేదు. సరే అని లోపలికి వెళితే..అక్కడే కూర్చోబెట్టారు. మధ్యాహ్నం తర్వాత ఒకరు వచ్చి నాకు మేకప్ వేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత తీసుకెళ్లి.. ఒక అమ్మాయితో గంట కొట్టించి..మీ షూట్ అయిపోంది’ అని చెప్పారు. మేము సినిమా కొంటున్నాం కాబట్టి.. మమ్మల్ని ఆకర్షించడానికి అలా చేశారు. మరుసటి రోజు వెళ్లి.. ఇలాంటి యాక్టింగులు ఆపండి. సినిమాలు కొన్నాం కదా.. ఫస్ట్ అది కంప్లీట్ చేయండి’ అని చెప్పి వచ్చాం. ఆ తర్వాత నేను, శిరీష్, లక్ష్మణ్ చర్చించుకొని.. ఆ సినిమాను వదిలేసుకున్నాం. అడ్వాన్స్గా డబ్బులు వదిలేసి.. మరో సినిమాపై దృష్టి పెట్టాం. ఇలాంటి మోసాలు జరుగుతాయి. రూ. రెండు కోట్ల బడ్జెట్తో సినిమా పూర్తవుతుందని నమ్మించి.. చివరకు నాలుగు కోట్ల వరకు తీసుకొస్తారు. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో మనం రాణించగలుగుతామా లేదా అనేది మనకే తెలియాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. సినిమా అనేది ఒక అట్రాక్షన్. అది లాగుతుంటుంది. జీవితాలు మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎప్పుడైతే మీరు సినిమాలో సక్సెస్ అవుతున్నారని మీకు అర్థం అవుతుందో అప్పుడు మీరు 24 గంటలు కష్టపడాలి’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. -
షఫాలీ మరణానికి కారణం.. ఉపవాసం సమయంలో అలాంటి ఇంజెక్షనే!
‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (42) (Shefali Jariwala) ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్తో మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్తో యూత్కు దగ్గరైంది. జూన్ 27న కార్డియాక్ అరెస్ట్తో ఆమె మరణించినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ, ముంబై పోలీసులు ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. అయితే, తాజాగా ఆమె మరణం పట్ల పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే ప్రాణం మీదకు తీసుకొచ్చిందిని తెలుస్తోంది.నటి షఫాలీ జరివాలా మరణించిన వెంటనే, ముంబై పోలీసులు విచారణ ప్రారంభించి, ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవపరీక్ష నిర్వహించినప్పటికీ, మరణానికి గల కారణం గురించి వారు ఇంకా వెళ్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది. షెఫాలి చాలా సంవత్సరాలుగా వృద్ధాప్య వ్యతిరేక (యాంటీ ఏజింగ్) ఇంజెక్షన్లు తీసుకుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె అందుకు సంబంధించిన మెడిసిన్స్తో పాటు ఇంజెక్షన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన రోజున శుక్రవారం ఇంట్లో పూజా కార్యక్రమాలు జరగడంతో.. ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని సమాచారం. దీంతో ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడంతో కార్డియాక్ అరెస్టై ఉంటారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఆందోళనగా మారిందని, ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని సంఘటన స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్ట్మార్టం, ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం నిర్ధారించబడుతుందని పోలీసులు తెలిపారు. జూన్ 29న, షెఫాలి భౌతికకాయాన్ని ఓషివారా శ్మశానవాటికలో దహనం చేశారు. ఆమె భర్త పరాగ్ త్యాగి అంత్యక్రియలు చేస్తుండగా విలపిస్తూ కనిపించారు. తొలుత గాయకుడు హర్మీత్ సింగ్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగీని వివాహమాడారు. -
నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం
రాఘవ లారెన్స్ (Raghava Lawrence).. నటుడు, కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా! లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన రవిరాజ్ రాథోడ్ను కొన్నేళ్ల కిందట లారెన్స్ దత్తత తీసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ను చదివించాలనుకున్న లారెన్స్తన ట్రస్ట్ ద్వారా మంచి హాస్టల్ వసతి ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు. కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవి రాజ్ (Ravi Raj Rathod).. చెప్పాపెట్టకుండా స్కూల్ మానేసి వెళ్లిపోయాడు. తిరిగి లారెన్స్ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే తప్ప ఎవరూ దారి చూపలేదని ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.గుండె తరుక్కుపోతోందిలారెన్స్ను కలుద్దామంటే తిడతాడో, కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ లారెన్స్ కంటపడింది. ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. నా గుండె తరుక్కుపోతోంది. మాస్ సినిమా షూటింగ్ సమయంలో ఇతడిని కలిశాను. తనను స్కూల్లో చేర్పించాను. ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు. తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది.ఒక్కసారి చూడాలనుందిఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు. నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నేను నిన్ను తిట్టను, కొట్టనురా. నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ఎక్స్ (ట్విటర్)లో చెన్నైలోని లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ను పొందుపరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ఇంత మంచోడివి ఏంటన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. రాఘవ లారెన్స్.. ప్రస్తుతం కాంచన 4, బెంజ్, అధిగరం, కాల భైరవ, బుల్లెట్, హంటర్ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో కాంచన 4 చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు.చదవండి: దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. తేజస్విని -
ప్రభాస్ ప్లేస్లో బన్నీ.. ఎన్టీఆర్ ప్లేస్లో చరణ్.. ‘స్టార్స్’ మారిపోయారు!
తినే ప్రతి గింజపై తినేవారి పేరు ఉంటుందంటుంటారు. అలాగే ఓ దర్శకుడు రెడీ చేసిన కథ కూడా ఏ హీరో చేయాలని ఉంటే ఆ హీరో చెంతకు వెళ్తుందేమో. అప్పటికే ఒప్పుకున్న సినిమాలు, నిర్మాణ వ్యయాలు, స్క్రిప్ట్లో మార్పులూ చేర్పులు, కాల్షీట్స్ క్లాష్... ఇలా కారణాలు ఏమైనా ఇటీవలి కాలంలో కథలు ఒక హీరో నుంచి మరో హీరోకి షిఫ్ట్ అవుతున్న ట్రెండ్ బాగా కనిపిస్తోంది. ఇలా ఒకరు చేస్తారనుకున్న కథలో వేరే కథానాయకుడు ఎంట్రీ ఇస్తున్నారు. ఒక హీరోతో ప్లాన్ చేసిన కథలో మరో హీరో కనిపించనున్నారు. ఆ వివరాల్లోకి...సూపర్ హీరో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్హాసన్ లీడ్ రోల్లో రూపొందిన ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్లో రోలెక్స్ అనే పవర్ఫుల్ రోల్లో కనిపించారు సూర్య. ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందిన ఈ ‘విక్రమ్’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోలెక్స్ రోల్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ‘విక్రమ్’ సినిమా సమయంలోనే సూర్యతో లోకేశ్ ఓ కొత్త సినిమాను ప్లాన్ చేశారని, కానీ ఇది ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లోని సినిమా కాదని, ఇదొక సూపర్ హీరో ఫిల్మ్ అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే రీసెంట్గా దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో ఓ సినిమా చేయనున్నట్లుగా బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కన్ఫార్మ్ చేశారు. ఇది సూపర్ హీరో ఫిల్మ్ అని, వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుందని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. దీంతో సూర్య హీరోగా చేయాల్సిన సూపర్ హీరో ప్రాజెక్ట్ ఆమిర్ ఖాన్ చేతికి వెళ్లిందనే టాక్ తెరపైకి వచ్చింది. సినిమా జానర్, దర్శకుడు ఒకరే కావడంతో సూర్య సినిమాయే ఆమిర్ ఖాన్కు వెళ్లినట్లుగా స్పష్టం అవుతోంది. బ్రహ్మ రాక్షస ‘హను–మాన్’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘బ్రహ్మ రాక్షస’ (ప్రచారంలోకి వచ్చిన టైటిల్) అనే సినిమాను ఆరంభించారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించాల్సింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా నుంచి హీరో రణ్వీర్ సింగ్ తప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతిలోకి వెళ్లిందని, హీరో క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉండే ఈ ‘బ్రహ్మ రాక్షస’ సినిమా చేసేందుకు ప్రభాస్ కూడా ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను సెట్స్పైకి తీసుకువెళ్లాలని ప్రశాంత్ వర్మ ఆలోచిస్తున్నారని, ఆ దిశగా కార్యాచరణను మొదలుపెట్టారని తెలిసింది. ఇలా రణ్వీర్ సింగ్ చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రభాస్ చేంతకు చేరింది. గేమ్ చేంజ్ ఎన్టీఆర్ ఆడాల్సిన ఆటలను రామ్చరణ్ అడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన ఓ రూరల్ బ్యాక్డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా కథను రెడీ చేసుకున్నారు. ఈ కథకు ఎన్టీఆర్ను హీరోగా అనుకుని కొన్ని రోజులు వర్క్ చేశారు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లోని సినిమా ఇదే అని అందరూ అనుకున్నారు. కానీ ఈ దర్శకుడి రెండో సినిమా ‘పెద్ది’లో రామ్చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు రెడీ చేసిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ డ్రామా కావడం, ఇప్పుడు రామ్చరణ్ ‘పెద్ది’ సినిమా కూడా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో ఎన్టీఆర్ చేయాల్సిన ‘పెద్ది’ సినిమా రామ్చరణ్కు షిఫ్ట్ అయినట్లుగా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇక ‘పెద్ది’ సినిమాలో క్రికెట్, కబడ్డీ, కుస్తీ, ఖోఖో... ఇలా పలు రకాల క్రీడల ప్రస్తావన ఉంటుందని తెలిసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, దివ్యేందు వర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. కార్తికేయుడు అల్లు అర్జున్ హీరోగా చేయాల్సిన మైథాలజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో..’ వంటి చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మైథాలజీ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్లాల్సింది. కానీ ‘పుష్ప: ది రూల్’ సినిమా తర్వాత త్రివిక్రమ్తో కాకుండా తమిళ దర్శకుడు అట్లీతో తన సినిమాను ముందుకు తీసుకువెళ్లారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్తో తాను చేయాల్సిన మైథాలజీ ప్రాజెక్ట్ కోసం ఏడాదిన్నరపైనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేశారు త్రివిక్రమ్. దీంతో ఈ సినిమాను వదులుకోలేక ఈ సినిమాను ఎన్టీఆర్తో చేసేందుకు సిద్ధమయ్యారు త్రివిక్రమ్. కార్తికేయ (కుమారస్వామి, మురుగన్) ఆధారంగా ఈ మైథాలజీ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. వీటికి తోడు ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో ఎన్టీఆర్ చేతిలో ‘మురగ: గాడ్ ఆఫ్ వార్’ అనే పుస్తకం కనిపించింది. దీంతో త్రివిక్రమ్తో ఎన్టీఆర్ ఈ మైథాలజీ సినిమాను చేసేందుకే సన్నద్ధమౌతున్నారని, అందులో భాగంగానే ‘మురుగ’ పుస్తకాన్ని చదువుతున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా కాకుండా దర్శకుడు నెల్సన్తో ఓ సినిమా కమిట్మెంట్ ఉందన్న వార్తలు ఉన్నాయి. ఇంకా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కొరటాల శివతో ‘దేవర 2’ ఉంటుందని ఎన్టీఆర్నే కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేసే సినిమా సెట్స్పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఈలోపు వెంకటేశ్తో త్రివిక్రమ్ ఓ సినిమాను పూర్తి చేస్తారని, ఆ తర్వాత ఎన్టీఆర్తో సినిమాను సెట్స్పైకి తీసుకుని వెళ్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. రావణం కొంతమంది దర్శకులకు కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలా ‘సలార్, కేజీఎఫ్’ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్స్లో ‘రావణం’ ఒకటి. ఈ మైథాలజీ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ హీరో అనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఈ చిత్రం ఇప్పుడు అల్లు అర్జున్ చేతికి వెళ్లిందని టాక్. ప్రభాస్కు భారీ లైనప్ ఉండటం వల్లనే అల్లు అర్జున్తో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి... ప్రభాస్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతికి వెళ్లిందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నారు. సందీప్రెడ్డి వంగాతో ఓ సినిమా, సుకుమార్తో ‘పుష్ప 3’ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘రావణం’ సినిమా సెట్స్కు వెళ్లడానికి మరింత సమయం పట్టేలా తెలుస్తోంది. తొలిసారి కొత్తగా... యాక్షన్, లవ్స్టోరీ, ఫ్యామిలీ డ్రామా... ఇలాంటి తరహా సినిమాలను చాలానే చేశారు హీరో రామ్. కానీ సస్పెన్స్, హారర్, థ్రిల్ జానర్స్లో రామ్ హీరోగా వచ్చిన సినిమాలు లేవు. ఇప్పుడు ఈ జానర్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రామ్ సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కోసం కిశోర్ అనే ఓ నూతన దర్శకుడు ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ స్టోరీని రెడీ చేశారట. రానా స్పిరిట్ మీడియా, ఆర్కా మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యాయని సమాచారం. కానీ ‘విరూపాక్ష’తో సూపర్ హిట్ సాధించిన కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీతో నాగచైతన్య ముందుకు వెళ్లారు. ఇలా కిశోర్ రెడీ చేసిన కథ హోల్డ్లో పడింది. అయితే ఈ కథ ఇప్పుడు రామ్ చెంతకు చేరిందని, ఈ సినిమా స్క్రిప్ట్ పట్ల రామ్ చాలా ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్కు వెళ్లనుందనీ సమాచారం. తమ్ముడు వెండితెరపై ‘తమ్ముడు’ రీ ప్లేస్ అయ్యాడు. నితిన్ హీరోగా చేసిన తాజా చిత్రం ‘తమ్ముడు’. కానీ ఈ సినిమా హీరో నాని చేయాల్సిందని తెలిసింది. చివరి నిమిషంలో నితిన్ చేశారు. మరో ఆసక్తిరమైన విశేషం ఏంటంటే... ‘బలగం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’ అనే మరో రూరల్ బ్యాక్డ్రాప్ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలోని హీరో పాత్ర కోసం నానీని మేకర్స్ సంప్రదించారు. కొన్ని చర్చలు కూడా జరిగాయి. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా నితిన్ చేతికి చేరింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘బలగం’ సినిమాను నిర్మించిన ‘దిల్’ రాజు ఈ ‘ఎల్లమ్మ’ సినిమానూ నిర్మించనున్నారు. ఇక ‘ఎల్లమ్మ’లో హీరోయిన్గా సాయిపల్లవి, కీర్తీ సురేష్ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. చెన్నై లవ్స్టోరీ ఆనంద్ దేవరకొండ లవ్స్టోరీ కిరణ్ అబ్బవరంకి వెళ్లింది. వైష్ణవీ చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన ‘బేబీ’ సినిమా 2023లో రీలీజై, సూపర్హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘కలర్ఫొటో’ ఫేమ్ సాయి రాజేశ్ దర్శకుడు. కాగా ఈ సినిమా తర్వాత సాయిరాజేశ్ మరో లవ్స్టోరీని రెడీ చేశారు. రవి నంబూరి ఈ సినిమాకు దర్శకుడు. ‘బేబీ’ సినిమాలో లీడ్ పెయిర్గా నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య ఈ సినిమా చేయాల్సింది. కానీ ఈ సినిమా నుంచి ఇద్దరూ తప్పుకోవడంతో వారి స్థానాల్లో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి రాజేశ్, ఎస్కేఎన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. వీలైతే ఈ ఏడాది లేకపోతే, వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఈ తరహాలో ముందు ఓ కథను ఓ హీరో ఆల్మోస్ట్ ఒప్పుకుని, ఆ తర్వాత ఆ కథలో మరో హీరో నటిస్తున్న, నటించనున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. - మూసిని శివాంజనేయులు -
16 ఏళ్ల పాటు షూటింగ్.. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయిన సినిమా!
రూ.వందల కోట్ల పెట్టుబడి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు గానీ, దాదాపు అరవై ఐదు సంవత్సరాల క్రితమే, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమా విడుదలైంది. ఈ సెల్యులాయిడ్ దృశ్య కావ్యం కేవలం ఒక సినిమా కాదు. ఓ రకంగా అది ఒక ఒక ఉద్యమం అని చెప్పాలి. దాదాపు 16 సంవత్సరాల పాటు సాగిన నిర్మాణం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నభూతో నభవిష్యతిగా నిలిచింది. అప్పట్లోనే అకౌంటెంట్లకు చెమటలు పట్టించే బడ్జెట్తో రూపొందింది. ఒక హిందీ సినిమా మొత్తం వ్యయం సగటున రూ. 10 లక్షల లోపు ఉన్న సమయంలో కేవలం ఒక పాట గురించి రూ.కోటి ఖర్చు చేశారంటే ఆ సినిమా రూపకర్త గుండెధైర్యం గురించి ఏం చెప్పాలి?అందుకే ఇప్పటికీ ఆ సినిమా గురించి చెప్పుకుంటున్నారు. ఆ సినిమా పేరు.. మొఘల్–ఎ–ఆజమ్ ,ఈ సినిమాకు కె. ఆసిఫ్ నిర్మాణంతో పాటు దర్శకత్వం కూడా వహించారు మొఘల్–ఎ–ఆజం చిత్రాన్ని అనేక చిన్న ద్వీపాలను కొనుగోలు చేయగల బడ్జెట్తో తీశారని అప్పట్లో ఒక ట్రేడ్ విశ్లేషకుడు వర్ణించారు. ఈ క్లాసిక్ ఇండియన్ సినిమాలో పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్, మధుబాల దుర్గా ఖోటే వంటి నాటి మేటి నటులు నటించారు. 1960లో విడుదలైన మొఘల్–ఎ–ఆజం(Mughal-E-Azam) మొఘలుల రాచరిక ప్రపంచపు అహాలను వ్యూహాలను మాత్రమే కాదు ప్రేమైక హృదయాలను కూడా మనకు దగ్గర చేస్తుంది. నాటి అందాల నటి మధుబాలపై చిత్రీకరించిన ప్రేమికులకు ఇప్పటికీ ధైర్య సాహసాలను ప్రబోధించే గీతం ‘ప్యార్ కియా తో దర్నా క్యా‘, పాట చిత్రీకరణకు ఏకంగా రూ. 1 కోటి ఖర్చు అయింది. ఈ పాటను లాహోర్ కోటలోని షీష్ మహల్ కు ప్రతిరూపంలో చిత్రీకరించారు. ఈ పాట సెట్ నిర్మాణానికి ప్రస్తుతం ఒక భారీ చిత్ర నిర్మాణానికి అయ్యే విధంగా దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. చక్రవర్తి అక్బర్గా పృథ్వీరాజ్ కపూర్, అధికార సునామీలా ఆదేశాలను అమలు చేస్తూంటే, రాజకీయ ఉద్రిక్తత రాజభవన కుట్రల మధ్యలో ప్రేమ కోసం తిరుగుబాటుదారుడుగా మారిన యువరాజు సలీమ్గా దిలీప్ కుమార్, ఆయన ప్రేయసి అనార్కలిగా మధుబాల మనకు ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ చిత్రంలో అనార్కలి ప్రేమకథను చూడటం మాత్రమే కాదు కళ వేదన మధ్య నిజ జీవిత యుద్ధాన్ని ప్రేక్షకులు చవిచూస్తారు.అత్యధిక కాలం ఈ చిత్ర నిర్మాణం జరగడానికి తరచుగా షూటింగ్స్కు అంతరాయాలు కూడా దీనికి కారణం. నిర్మాణ విరామాలతో పాటు రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంలో రూపొందడం, నటీనటుల మార్పులు (సలీం పాత్ర పోషించిన మొదటి నటుడు స్థానంలో దిలీప్ కుమార్ వచ్చారు) ఆర్ధిక సమస్యలు వెంటాడడం... ఇలాంటివెన్నో సంభవించాయి. అవన్నీ ఎదుర్కుంటూనే కె. ఆసిఫ్ తన సర్వశక్తులు కేంద్రీకరించి మొఘల్–ఎ–ఆజం ను ఒక సినిమాలా కాకుండా యజ్ఞంలా తలపోయడంతో..ప్రతి సన్నివేశం ఒక కళాఖండంలా అనిపిస్తుంది. దీనికో ఉదాహరణ యుద్ధ సన్నివేశాల కోసం నిజమైన సైనికులను తీసుకోవాలని భావించిన కె. ఆసిఫ్ అందుకు భారత సైన్యాన్ని ఒప్పించడం , 1960 ఆగస్ట్ 5న విడుదలైన మొఘల్–ఎ–ఆజం రూ. 11 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ద్రవ్యోల్బణం, ప్రేక్షక జనసాంద్రత వగైరాలను పరిగణనలోకి తీసుకుంటే మొఘల్–ఎ–ఆజం ఇప్పటిదాకా అత్యధిక వ్యయంతో పాటు వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలుస్తుందని వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు.మొదట నలుపు–తెలుపులో ఒకే ఒక పాటతో విడుదలైన ఈ చిత్రాన్ని ఆ తర్వాత డిజిటల్గా రంగులు వేసి 2004లో తిరిగి విడుదల చేశారు తద్వారా కలర్ ఫుల్గా మారిన మొదటి నలుపు–తెలుపు భారతీయ చిత్రంగా కూడా ఇది నిలిచింది. తొలి రీరిలీజ్ చిత్రంగా, మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. అటు కలెక్షన్ల రికార్డ్స్తో పాటు జాతీయ అవార్డ్ సహా పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం దక్కించుకున్న ఈ సినిమా..భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని దక్కించుకుంది. -
దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. ఇంట్లో ఒప్పుకోలేదు: తేజస్విని
దేవుడు కోరుకున్నదానికంటే అన్నీ ఎక్కువే ఇచ్చాడంటోంది ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భార్య తేజస్విని (వైఘా రెడ్డి). మంచి కుటుంబం, పిల్లాడు ఉన్నాడని, ఇంతకంటే ఇంకేం కావాలని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజస్విని (Tejaswini) మాట్లాడుతూ.. మా కుటుంబమంతా ఏడాదికి ఒకసారి మాత్రమే సినిమాకు వెళ్లేవాళ్లం. అది కూడా దసరా పండగప్పుడే థియేటర్కు వెళ్లి మూవీ చూసేవాళ్లం. అలాంటిది సినీ బ్యక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు. మా ప్రయాణం సులభంగా సాగలేదు. గూగుల్లో వెతికా..నిజానికి నాకు దిల్ రాజు ఎవరో తెలియదు. దర్శకుడేమో అనుకున్నాను. ఈయన ఎవరని గూగుల్లో వెతికితే నిర్మాత అని తెలిసింది. ఆయనకు ఆల్రెడీ పెళ్లయి కూతురుందని తెలిశాక నేను వెనకడుగు వేశాను. నేను చిన్నప్పుడు అమ్మమ్మ-తాతయ్య, అత్తమామల దగ్గరే ఎక్కువ పెరిగాను. పెళ్లికి ఎవరిని ఒప్పించాలి? అని దిల్ రాజు అడిగినప్పుడు మా పెద్దమామయ్య పేరు చెప్పాను. ఆయన మా కుటుంబంలో హిట్లర్లాగా ఉంటాడు.పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదుతను చాలా స్ట్రిక్ట్. ఆయన్ను ఒప్పించాక మా పిన్నిని కన్విన్స్ చేయాలన్నాను. ఆశ్చర్యంగా మా పెద్దమామయ్య మమ్మల్ని అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ, పిన్ని అసలు నమ్మలేకపోయింది. మా పెళ్లికి తను ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకొచ్చింది. మాతృత్వం గురించి మాట్లాడుతూ.. నా కొడుకు అన్వయ్ మూడేళ్లబాబులా ప్రవర్తించడు. ఎప్పుడైనా నేను బాధలో ఉంటే నాకు ముద్దుపెట్టి, అమ్మా బానే ఉన్నావా? అని అడుగుతాడు. ఆ సినిమా తర్వాతే ప్రెగ్నెన్సీవాడి ముద్దు ముద్దు మాటలకు మాకు ఎంత ఒత్తిడి ఉన్నా ఇట్టే మాయం అయిపోతుంది. ఆ మధ్య బాలీవుడ్లో రాజ్కుమార్ రావు 'హిట్' మూవీ నిర్మాణ బాధ్యతలన్నీ నేనే చూసుకున్నాను. ఆ తర్వాత నేను గర్భం దాల్చడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. అన్వయ్ పుట్టాక నా జీవితమే మారిపోయింది. వాడు పుట్టి మూడేళ్లు కావడంతో సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నావా? అని అడుగుతున్నారు. అన్వయ్తో నేను సంతోషంగా ఉన్నాను. ఇంకెవరూ నాకు వద్దు అని తేజస్విని పేర్కొంది.దిల్ రాజు పర్సనల్ లైఫ్దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. వీరికి కూతురు హన్షితా రెడ్డి సంతానం. 2017లో అనిత గుండెపోటుతో మరణించింది. అనంతరం హైదరాబాద్కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని 2020లో దిల్ రాజు పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది.చదవండి: స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా? -
స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా?
టైటిల్: స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ (మూడో సీజన్)తారాగణం: లీ జుంగ్ జే, లీ బ్యుంగ్ హు, వి హా జూన్క్రియేటర్: హ్వాంగ్ డాంగ్ హ్యుక్ఓటీటీ: నెట్ఫ్లిక్స్చిన్నప్పుడు ఆడిన ఆటలకు లెక్కే లేదు. బడిలో తన్నులు తిన్నా, ఇంట్లో చీవాట్లు పెట్టినా సరే ఫ్రెండ్స్తో కలిసి పొద్దేక్కేదాకా ఆడుతుంటే ఆ మజానే వేరుండేది. కానీ, ఆ సరదా ఆటలే ప్రాణాంతకంగా మారితే? గేమ్స్ ప్రాణాలు తీస్తే.. అన్న ఆలోచనలో నుంచి వచ్చిందే స్క్విడ్ గేమ్. డబ్బు, స్వార్థం.. మనిషిని రాక్షసుడిలా మారుస్తుందని, విచక్షణ కోల్పోయేలా చేస్తుందని ఈ సిరీస్లో కళ్లకు కట్టినట్లు చూపించారు.మొదటి సీజన్లో ఏం జరిగింది?ఈ సిరీస్లో రెండు రకాల మనుషులుంటారు. పైసా కోసం ప్రాణాలకు తెగించేవారు.. వారి ప్రాణాలు పోతుంటే చూసి ఆనందించేవారు. తొలి సీజన్లో 456 మంది గేమ్ ఆడేందుకు వస్తారు. ప్లేయర్ 456 (హీరో లీ జుంగ్ జే) లక్ష్యం కూడా డబ్బు గెలుచుకోవడమే.. కానీ గేమ్ చివరి వరకు వచ్చేసరికి తనముందున్న 455 మంది పిట్టల్లా రాలిపోతారు. అవన్నీ తనను మానసికంగా డిస్టర్బ్ చేస్తాయి. కోట్లాది సంపదను గెలుచుకున్నా.. అది తనకు సంతోషాన్ని ఇవ్వదు. మనుషుల ప్రాణాలతో గేమ్ ఆడుతున్నవారి అంతు చూడాలని, ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు.. అదే మొదటి సీజన్.రెండో సీజన్ ఎలా ముగిసింది?ప్లేయర్ 456 మరోసారి ఆటలో అడుగుపెట్టడంతో రెండో సీజన్ ప్రారంభమవుతుంది. ఈ గేమ్కు ఎలాగైనా ముగింపు పలకాలని ఆవేశానికి పోయి కొంతమంది ప్లేయర్ల చావుకు కారణమవుతాడు. అంతటితో రెండో సీజన్ ఎటువంటి ముగింపు లేకుండానే అర్ధాంతరంగా ఆగిపోతుంది. అసలు ప్లేయర్ 456.. ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అన్న ఉత్సుకతో మూడో సీజన్ (Squid Game season 3 Review) మొదలవుతుంది. గేమ్ను ఎలాగైనా ఆపేయాలన్న కోపంతో గ్యాంగ్ను తయారు చేసుకుని విలన్కే ఎదురెళ్తాడు హీరో. సిరీస్ను మలుపు తిప్పే సంఘటనఈ క్రమంలో ఆ గ్యాంగ్లోని వారంతా చనిపోతారు. కానీ హీరోను మాత్రం చంపకుండా వదిలేస్తారు. నన్నెందుకు బతికించారు? చంపేయండి అని హీరో విలవిల్లాడతాడు. తనవల్ల ఏదీ మారదని.. ఏది జరగాలనుంటే అది జరుగుతుందని భావించి డీలా పడిపోతాడు. కానీ ఒక్క సంఘటన అతడిలో మళ్లీ శక్తిని, ధైర్యాన్ని నింపుతుంది. వరుసగా ప్రాణాలు పోతున్న ప్రదేశంలో ఓ చిన్నబిడ్డ ఊపిరి పోసుకుంటుంది. ఆ పసిపాప కోసం హీరో మళ్లీ పోరాటం మొదలుపెడతాడు. అప్పుడు సిరీస్ వేగం పుంజుకుంటుంది.విషాదకర క్లైమాక్స్మంచి పైచేయి సాధించినప్పుడే అందరికీ ఆనందం. కానీ, చెడు విజయం సాధించినప్పుడు అది అందరికీ రుచించదు. క్లైమాక్స్ చాలామందికి మింగుడుపడదు. దీనికోసమేనా మూడు సీజన్లు సాగదీశారు అనిపిస్తుంది. ప్రాణాంతక ఆటలకు కేంద్రమైన దీవిని కనిపెట్టేందుకు ప్రయత్నించిన డిటెక్టివ్ కష్టం కూడా వృథాగా పోతుంది. ఇదే చివరి సీజన్ అని ప్రకటించారు కానీ, ఈ క్లైమాక్స్ చూస్తుంటే మాత్రం సీజన్ 4కూ ఆస్కారం ఉందన్న అనుమానాలు వెలువడుతున్నాయి.సిరీస్ ఏం చెప్తోంది?డబ్బుకు షార్ట్కట్స్ ఉండవు. అలాంటి అడ్డదారులున్నాయంటే అది మీ ప్రాణాలతో పందెం కాస్తున్నట్లే లెక్క అని ఈ సిరీస్ హెచ్చరిస్తుంది. డబ్బు మనిషిని ఎలా ఏమార్చుతుందని చూపించారు. పసిపాప ప్రాణానికి హీరో తన ప్రాణం అడ్డేసినప్పుడు మంచితనం, మానవత్వం ఇంకా బతికే ఉందని తెలియజేశారు. ఈ సిరీస్ విషాదంగా ముగిసింది. చూసే జనాల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. -
చిరంజీవి బర్త్డే స్పెషల్.. 19 ఏళ్ల తర్వాత అవార్డ్ సినిమా రీరిలీజ్
చిరంజీవి- త్రిష కలిసి నటించిన ‘స్టాలిన్’ సినిమా రీరిలీజ్ కానుంది. 2006లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఖుష్బూ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, ప్రదీప్ రావత్ వంటి స్టార్స్ నటించారు. ఉత్తమ సందేశాత్మక చిత్రంగా (స్పెషల్ జ్యూరీ అవార్డు) నంది పురస్కారం కూడా స్టాలిన్ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీని చిరు సోదరుడు నాగబాబు నిర్మించగా గీతా ఆర్ట్స్ పంపిణీ చేసింది. ప్రస్తుతం స్టాలిన్ ఏకంగా మూడు (ఆహా, అమెజాన్, జియోహాట్స్టార్) ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ అనుష్క కూడా ఒక స్పెషల్ సాంగ్లో సందడి చేసింది.ఆగష్టు 22న మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్ చిత్రాన్ని 4K వర్షన్లో విడుదల చేయబోతున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ స్వామి నాయుడు ఒక పోస్టర్ను తాజాగా లాంచ్ చేశారు. ఈ సినిమా చాలామంది యూత్ను ఆలోచించేలా చేసిందని చెప్పవచ్చు. సుమారు 19 ఏళ్ల తర్వాత స్టాలిన్ రీరిలీజ్ కానున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్లీ త్రిష- చిరు కలిసి విశ్వంభరలో నటిస్తున్న విషయం తెలిసిందే. -
నాగార్జున రియల్ హీరో అంటూ సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడారు. తాజాగా ఆయన హైదరాబాద్లోని కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన పి.జనార్థన్రెడ్డి(పీజేఆర్) ఫ్లైఓవర్ను ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు గురించి రేవంత్రెడ్డి మాట్లాడుతూ నాగార్జున గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి సీఎం రేవంత్రెడ్డి ఇలా చెప్పుకొచ్చారు. 'ఆ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ను ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత నాగార్జునే స్వయంగా వచ్చి రెండు ఎకరాల స్థలం ప్రభుత్వానికి అప్పజెప్పారు. నగర అభివృద్ధిలో హీరోగా ముందు ఉంటానని ఆయన అన్నారు. మంచి సంకల్పంతోనే ఆ చెరువును అభివృద్ధి చేస్తున్నారంటూ.. రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్లు వాలంటీర్గా ఆయన ముందుకు వచ్చారు' అని సీఎం అన్నారు.గతేడాది ఆగష్టు నెలలో మాదాపూర్లో ఉన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్హాలును హైడ్రా కూల్చి వేసిన విషయం తెలిసిందే. నగరంలోని తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేతలకు చర్యలు చేపట్టింది. తమ్మిడికుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని ప్రభుత్వం ప్రకటించింది. ఆపై ఆ చెరువు చుట్టూ ఉన్న పలు కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసింది. అప్పుడు ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారింది. -
బీర్ తాగుతూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన హీరోయిన్
నాని నటించిన జెర్సీ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయింది 'శ్రద్ధా శ్రీనాథ్'( Shraddha Srinath).. కొద్దిరోజుల క్రితం డాకు మహారాజ్ సినిమాలో కూడా ఆమె మెప్పించింది. అయితే, తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిల్వర్ స్క్రీన్పై హోమ్లీగా కనిపించిన ఆమె బికినీ షోతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందించింది. ఆమె బీర్ తాగుతూ ఉందంటూ గుర్తించిన కొందరు ఆ ఫోటోను హైలెట్ చేస్తున్నారు.శ్రద్ధా శ్రీనాథ్ రీసెంట్గా మాల్దీవ్స్ వెకేషన్లో ఎంజాయ్ చేసింది. అక్కడ బికినీలో దిగిన ఫొటోలను తన సోషల్మీడియాలో పంచుకుంది. సినిమాల్లో ఎంతో పద్దతిగా కనిపించే శ్రద్ధా శ్రీనాథ్ ఇలా పబ్లిక్గా బీర్ తాగుతూ బికినీలో ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు అందరు ఆశ్చర్యపోతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో నటించిన ఈ బ్యూటీ త్వరలో హిందీ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అందుకే ఆమె ఇలాంటి గ్లామర్ ట్రీట్ ఇస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) -
ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం'. వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే వెండితెరపై ఆశించిన స్థాయిలో విజయం సాధించని ఈ చిత్రం.. డిజిటల్ స్క్రీన్పై మాత్రం దూసుకెళ్తుంది. జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అతున్న ఈ చిత్రం.. రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు గార్లపాటి రమేష్, వినోద్ విజయన్ మాట్లాడుతూ... ''మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రమే కాకుండా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది’ అన్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో హీరో సాయిరామ్ శంకర్ నటించారు. విశాఖ నగరంలో జరిగిన వరుస హత్యల మీద అతని మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. నిజంగా ఆ హత్యలు సిద్ధార్థ్ చేశాడా? లేదంటే వాటి వెనుక వేరొకరు ఉన్నారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘చంద్రేశ్వర’ మూవీ రివ్యూ
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే కోణంలో చాలా ఛేంజ్ వచ్చింది. కంటెంట్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. రొటీన్ చిత్రమే అని టాక్ వస్తే చాలు, ఆ సినిమా వైపు అసలు చూడను కూడా చూడటం లేదు. ఓటీటీలు వచ్చిన తర్వాతే ఈ మార్పు వచ్చింది. కొన్ని రోజులుగా కంటెంట్ బేస్డ్ ఫిల్మ్తో వస్తున్నట్లుగా ‘చంద్రశ్వేర’ మూవీ టీమ్ చెబుతూ వస్తుంది. అందులోనూ ఆర్కియాలజీ నేపథ్యంలో పురాతన కాలం నాటి ఓ గుడికి సంబంధించిన స్టోరీ లైన్తో ‘చంద్రేశ్వర’ తెరకెక్కిందని, ఈ సినిమా అందరూ చూడాలని మేకర్స్ చెబుతూ వచ్చారు. మరి ఇందులో ఉన్న విషయం ఏమిటి? అది ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుంది? రివ్యూలో తెలుసుకుందాం.‘చంద్రేశ్వర’ కథేంటంటే.. నందివర్మ పర్వతం కింద పురాతన కాలంనాటి ఓ గుడి కప్పెట్టబడి ఉందని, ఆ గుడి లోపల నిధి ఉందని తెలిసి ఆర్కియాలజీ విభాగానికి చెందిన ఎమ్డి చక్రవర్తి (నిళల్గళ్ రవి), ఓ టీమ్ని ఆ పర్వతం ఉన్న చంద్రగిరికి పంపిస్తాడు. ప్రొఫెసర్ బోస్ (బోసే రవి) ఆధ్వర్యంలో అతనితో కలిపి 8 మంది టీమ్ ఆ గ్రామానికి వెళుతుంది. కానీ, ఆ గ్రామ ప్రజలు, వారిని ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకుంటారు. అంతకు ముందు కూడా ఇలాగే కొందరు వచ్చి చేసిన పనులతో ఊరిలో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారని అడ్డుకుంటారు. ఎలాగోలా వారిని ఒప్పించి, బోస్ టీమ్ అక్కడ తవ్వకాలను చేపడుతుంది. కాకపోతే చీకటి పడిన తర్వాత ఆ గ్రామంలో ఎవరూ తిరగకూడదు. ఎవరైనా అలా ప్రయత్నిస్తే దారుణంగా చనిపోతుంటారు. అప్పుడే చంద్రగిరికి సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చిన గురు వర్మ (ఆశ వెంకటేష్), ఆ చావులు వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి, తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఆర్కియాలజీ టీమ్లోని అఖిల (ఆశ వెంకటేష్)తో ప్రేమలో పడతాడు. ఇక తన ఇన్విస్టిగేషన్లో గురు వర్మ సంచలన విషయాలు తెలుసుకుంటాడు. ఆ విషయాలు ఏంటి? ఆ ఊరిలో చావులకు కారణం ఏంటి? గురు వర్మ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు? నిజంగానే ఆ గ్రామంలో గుడి, అందులో నిధి ఉన్నాయా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఆర్కియాలజీ నేపథ్యంలో ఇంతకు ముందు చాలా సినిమాలే వచ్చాయి కానీ, ఇందులో ఆసక్తికరమై కథ, స్క్రీన్ప్లేతో చూస్తున్న ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు వచ్చే సన్నివేశం ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. సినిమా స్టార్టింగ్ సీనే.. ఒక గొప్ప సినిమా చూడబోతున్నామనే అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత నందివర్మ, విషయ్ గౌడ ఎపిసోడ్.. ఈ సినిమాకు బలం. అది మిస్సయితే ఈ సినిమా ఏం అర్థం కాదు. మేకర్స్ పోస్టర్లో ‘ప్రారంభం మిస్ కాకండి’ అని ప్రింట్ చేయించి ఉండాల్సింది. సినిమాపై ఇంకాస్త ఇంట్రస్ట్ వచ్చేది. ఒక రాజుని ఓడించాలంటే.. ముందు వారి ఆచార వ్యవహారాలపై దెబ్బకొట్టాలనే డైలాగ్, సనాతన పద్దతులను చూపించిన విధానం, హిస్టారికల్ ఎవిడెన్స్ వంటి పదాలు, విగ్రహాల మార్పిడి ఇవన్నీ కూడా దర్శకుడి మేధస్సుని తెలియజేస్తాయి.గుడి విశిష్టతను తెలిపే ఎపిసోడ్, అదృశ్య ఖడ్గంతో పాటు నిధి కోసం అఖిల చెప్పే 4 సీక్రెట్ దారులు వంటి వన్నీ కూడా సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. కాస్త పేరున్న నటీనటులు కనుక ఇందులో నటించి ఉంటే, అలాగే ద్వితీయార్థంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. సబ్ ఇన్స్పెక్టర్గా సురేష్ రవి ఆహార్యం బాగుంది. ఫస్ట్ సీన్లోనే అతని టాలెంట్ ఏంటో చెప్పే ప్రయత్నం బాగుంది. ఆ తర్వాత చంద్రగిరి వచ్చినప్పటి నుంచి ఆయన చేసే ఇన్విస్టిగేషన్ అందరినీ సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎందుకంటే, ఆ ట్విస్ట్లన్నింటికీ చెక్ పెట్టేది అతనే. పురాతన గ్రాంథిక భాష తెలిసిన ఎక్స్పర్ట్గా ఆర్కియాలజీ టీమ్లో కీలక పాత్ర పోషించే అఖిల పాత్రలో ఆశ వెంకటేష్ మెప్పిస్తుంది. తన అందంతోనూ, అలాగే ప్రేమికురాలిగా, టీమ్ సభ్యురాలిగా వైవిధ్యంగా కనిపించే అవకాశం ఆమెకు దక్కింది. చక్రవర్తిగా నిళల్గళ్ రవి, ప్రొఫెసర్ బోస్గా బోసే రవి, గ్రామ పెద్దగా చేసిన అతను, ఇంకా ఆర్కియాలజీ టీమ్ మెంబర్స్ అంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన హైలెట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా కొద్దిగా డౌన్ అవుతున్న ప్రతిసారి సంగీత దర్శకుడు అలా నిలబెట్టేశాడు. అఖిల అఖిల పాట బాగుంది. సినిమాటోగ్రపీ కూడా పురాతన రోజులకు తీసుకెళుతుంది. మొదట్లో వచ్చే విజువల్స్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని కనబరుస్తాయి. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉండొచ్చు. ఉన్నంతలో అయితే సినిమా బాగానే ఉంది. నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి. నటీనటులు: సురేశ్ రవి, ఆశ వెంకటేష్, నిళల్గళ్ రవి, బోసే వెంకట్, ఆడుకాలం మురుగదాస్, జెఎస్కె గోపి తదితరులుసంగీతం: జెరాడ్ ఫిలిక్స్డిఓపి: ఆర్వీ సీయోన్ ముత్తుఎడిటర్: నందమూరి హరినిర్మాత: డా. రవీంద్ర చారిడైరెక్టర్: జీవీ పెరుమాళ్ వర్ధన్విడుదల తేదీ: 27 జూన్, 2025 -
'ది ఫ్యామిలీ మ్యాన్' అభిమానులకు సర్ప్రైజ్
ఓటీటీలో 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. వారిని సర్ప్రైజ్ చేస్తూ తాజాగా ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. తొలి సిరీస్ 2019లో విడుదల కాగా.. రెండో సీజన్ 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సిరీస్లు సూపర్ హిట్ కావడంతో ది ఫ్యామిలీ మ్యాన్ నుంచి మూడో భాగం త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్లో మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee) కీలక పాత్ర పోషించారు. ఆయనకు జోడీగా ప్రియమణి నటించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా అందుబాటులోకి రానుంది.ఈ సిరీస్ తొలి సీజన్ భారత్పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
కరాటేలో బ్లాక్బెల్ట్.. డ్యాన్సర్, మోడల్. ఇవన్నీ కాదని నటనవైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించాడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. అతడే నటుడు మహేశ్ ఆనంద్ (Mahesh Anand).కెరీర్1982లో సనమ్ తేరీ కసం మూవీలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా పనిచేశాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ 'కరిష్మా' చిత్రంతో నటుడిగా మారాడు. సస్తి దుల్హన్ మహేంగ దుల్హ చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కవుట్ కాకపోవడంతో విలన్గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్లో కరడుగట్టిన విలన్గా పేరు గడించిన మహేశ్ ఆనంద్.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్ వన్, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి ఇక్కడి జనానికి దగ్గరయ్యాడు.ఐదు పెళ్లిళ్లువెండితెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట బర్క రాయ్ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవకాశాలు దూరంఅనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే (2000-2002) వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేశ్ కెరీర్ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అని ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్.. 2015లో రష్యన్ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్లు తెలుస్తోంది. పేదరికంలో మగ్గిన నటుడువందల సినిమాలు చేసిన మహేశ్.. దాదాపు 18 ఏళ్లపాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెప్ బ్రదర్ రూ.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కి పైగా సినిమాలు చేశా.. కానీ, ఇప్పుడు నీళ్ల బాటిల్ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరం అని రాసుకొచ్చాడు.మూడురోజులుగా కుళ్లిపోయిన మృతదేహం2019 ఫిబ్రవరి 9న మహేశ్ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. మూడు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమేనని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, అప్పటికే మరణించి మూడు రోజులైనట్లు వెల్లడించారు.చదవండి: ఆ డైరెక్టర్ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్ -
విజయ్ దేవరకొండకి కొత్త పేరు పెట్టిన రష్మిక.. ఎంత ముద్దుగా ఉందో!
విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో ఉన్నారనే గాసిప్ గత కొనేళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. వాటిపై ఇటు రష్మిక కానీ అటు విజయ్ కానీ స్పందించడం లేదు కానీ..‘అవును మేం ప్రేమలోనే ఉన్నాం’ అన్నట్లుగా అప్పుడప్పుడు హింట్ అయితే ఇస్తున్నారు. కలిసి ట్రిప్స్కి వెళ్తున్నార.. ఒకరి సినిమాపై ఒకరు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఏదైనా సినిమా ఈవెంట్స్లో ప్రేమ, పెళ్లి ప్రస్తావన వస్తే.. పరోక్షంగా తాము రిలేషన్లో ఉన్నట్లుగానే ఒప్పుకుంటున్నారు. ఒకే లొకేషన్స్ ఉన్న ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ..తమ లవ్ మ్యాటర్ని కొంచెం కొంచెం రిలీల్ చేస్తున్నారు. తాజాగా రష్మిక విజయ్కి ముద్దుగా కొత్త పేరుతో పిలిచి.. మరోసారి ప్రేమ పుకార్లకు ఆజ్యం పోసింది.వారియర్గా రష్మిక.. ఇటీవల కుబేర చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన రష్మిక..ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే మైసా. రవ్రీంద పూలే దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక డిఫరెంట్ పాత్ర పోషిస్తుంది. తొలిసారి ఆమె వారియర్గా కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో రష్మిక వారియర్ లుక్లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసింది. చాలా మంది సినీ తారలు మైసా పోస్టర్ లుక్పై ప్రశంసలు కురిస్తూ.. రష్మికకి ఆల్ ది బెస్ట్ చుబుతున్నారు. అలా విజయ్ దేవరకొండ కూడా మైసా ఫస్ట్లుక్ పోస్టర్ని ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ సినిమా అద్భుతంగా ఉండనుంది’ అని రాసుకొచ్చాడు.విజ్జూ.. నువ్వు గర్వపడేలా చేస్తా విజయ్ పోస్ట్పై రష్మిక స్పందించింది. ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ.. ‘విజ్జూ.. ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా చేయబోతున్నాను’ అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది. విజయ్తో అలా ముద్దుగా విజ్జూ అని పిలవడంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో విజయ్కి చాలా మంది హీరోయిన్లు స్నేహితులుగా ఉన్నప్పటికీ...ఎవరూ కూడా అలా పిలవలేదు. విజయ్తో రష్మికకు స్నేహానికి మించిన బంధం ఉంది కాబట్టే అలా ముద్దుగా పిలిచిందని చాలా మంది నెట్టింట పోస్టులు పెడుతున్నారు. -
ఆ డైరెక్టర్ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్
విమర్శలు అందుకోని సెలబ్రిటీలు ఉండరు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సినిమా రూపంలో వారు విమర్శలపాలవుతూనే ఉంటారు. హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) కూడా అలా తిట్లు తినే ఇక్కడివరకు వచ్చిందట! ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు. సుహాస్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ తనను బాధపెట్టిన ఓ సంఘటనను చెప్పుకొచ్చింది. ఇప్పటికీ బాగా గుర్తుకీర్తి మాట్లాడుతూ.. ప్రియదర్శన్ సర్ డైరెక్ట్ చేసిన మలయాళ చిత్రం(గీతాంజలి)తో కథానాయికగా నా జర్నీ మొదలైంది. అప్పుడు జరిగిన ఓ సంఘటన నాకు చాలా బాగా గుర్తుంది. ఓ సన్నివేశం షూటింగ్ అయ్యాక.. ఎంత చెత్తగా చేశావో తెలుసా? వెళ్లి మానిటర్ చూసుకోపో అని తిట్టాడు. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు అది మొదటి సినిమా కావడంతో ఏడ్చేశాను. ఆయన అందరినీ అలానే అనేస్తాడు. ఆయన కూతురు, నటి కళ్యాణి ప్రిదయర్శన్ను కూడా అలాగే తిట్టేవాడు.అంతదాకా తెచ్చుకోనుకానీ ఉప్పుకప్పురంబు డైరెక్టర్ అని శశి మాత్రం నటీనటులకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. ఈయన ఆవేశంతో తిట్టేవరకు పరిస్థితులు చేయిదాటిపోనివ్వను. అప్పటికే ఆయన చెప్పిన సీన్లో బాగా నటిస్తాను. ఇంకో విషయమేంటంటే.. ఈ డైరెక్టర్ మంచి నటుడు కూడా! చాలామంది డైరెక్టర్లు చెప్తారంతే.. కానీ ఈయన ఎలా యాక్ట్ చేయాలని చేసి చూపిస్తాడు అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. గీతాంజలి చిత్రంతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి సురేశ్.. తెలుగులో నేను శైలజ, నేను లోకల్, మహానటి, రంగ్దే, దసరా, సర్కారువారిపాట వంటి పలు చిత్రాల్లో నటించింది. కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ వాడే కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చింది.చదవండి: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్ -
గుండె పోటు కాదు.. 42 ఏళ్ల నటి మృతిపై అనుమానాలు!
‘కాంటా లగా’ఫేం, బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా(42) మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రియాంక చోప్రా, లారదత్తాతో పాటు పలువుడు బాలీవుడ్ తారలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. శుక్రవారం ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆధారలేవి లేవని, మృతికి ఇంకా కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.అసలేం జరిగిందంటే.. శుక్రవారం రాత్రి షెఫాలి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను అంథేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. అమె కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందినట్లు తొలుత వార్తల వచ్చాయి. కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం వాటిని ధ్రువీకరించలేదు.పోలీసులు ఏం చెబుతున్నారంటే.. షఫాలీ మృతిపై తాజాగా ముంబై పోలీసులు అప్డేట్ ఇచ్చారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని, ప్రస్తుతం అనుమానాస్పద ఘటనగానే పరిగణలోకి తీసకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మాకు సమాచారం వచ్చింది. అంధేరీలోని షఫాలి నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించాం. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించాం. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆమె అపార్ట్మెంట్లో ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇంట్లో పని చేస్తున్న వారిని, వంట మనిషిని ప్రశిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే అనుమానస్పద ఘటనగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని ముంబై పోలీసులు తెలిపారు.రీమిక్స్ సాంగ్తో ఫేమస్.. 2002లో వచ్చిన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్తో ఫేమస్ అయింది షెఫాలి. ఈ గుర్తింపుతోనే సినిమా అవకాశాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ముజ్సే షాదీ కరోగా చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం పలు టీవీ రియాలిటీ షోలతో పాపులారిటీ సంపాదించుకుంది. హిందీ బిగ్బాస్ సీజన్ 13లోనూ కంటెస్టెంట్గా పాల్గొని అలరించింది. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్ని వివాహం చేసుకుంది. 2009లో అతనితో విడాకులు తీసుకొని.. 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకుంది. -
టాలీవుడ్లో నెం1 గ్లోబల్ స్టార్ ఎవరు?
టాలీవుడ్ సూపర్ స్టార్ల స్టార్ ఫైట్... ఇప్పుడు గ్లోబల్ ఫైట్గా మారింది. గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ హీరోలు రాణిస్తుండడం, అయితే ఒకరి తర్వాత ఒకరు రికార్డ్స్ బద్దలు కొట్టడంతో... వీరిలో ఎవరు నెం1 గ్లోబల్ స్టార్ అనేది ఇంకా తేలలేదు. తొలుత ప్రభాస్, తర్వాత ఎన్టీయార్, రామ్ చరణ్, ఆ తర్వాత అల్లు అర్జున్... పాన్ ఇండియా సినిమాల ద్వారా సత్తా చాటారు. అయితే వీరిలో ఎవరు టాప్ అనేది ఇంకా నిరూపణ కాలేదు. ఈ నేపధ్యంలో వచ్చే 2027 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. టాలీవుడ్ స్టార్ల నుంచి దూసుకు వస్తున్న మూడు భారీ ప్రాజెక్టులు ఎస్ఎస్ఎంబి29, ఎఎ22, స్పిరిట్... చిత్రాలు మూడూ గ్లోబల్ బాక్సాఫీస్ను లక్ష్యంగా చేసుకొని రూపొందుతున్నాయి. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.ఈ మూడింటిలో రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న తొలిచిత్రం ఎస్ఎస్ఎంబి29పై అత్యధికంగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ ద్వారా ఇప్పటికే గ్లోబల్ ప్రేక్షకుల నాడి తెలిసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. తొలిసారిగా మహేష్ బాబు ఈ చిత్రంలో పూర్తి మేకోవర్తో కనిపించనున్నాడు. సమాచారం. అంతేకాక పాన్ ఇండియా సినిమా లో తన సత్తా తొలిసారి చాటనున్నాడు. అల్లూ అర్జున్, అట్లీ కాంబినేషన్ లో మాస్ అండ్ స్టైల్ ఎంటర్టైనర్గా ఎఎ22 చిత్రం కూడా దాదాపుగా అదే సమయంలో రానుంది. ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న 2వ చిత్రంగా నిలవబోతోంది. విజువల్స్, యాక్షన్, హై ఎనర్జీ ప్రెజెంటేషన్ కారణంగా ఇది ఇండియన్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ సూపర్ హీరో సినిమాల అభిమానులను కూడా ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు.హీరోగా ఇప్పటికే గ్లోబల్ స్టార్ డమ్ను స్వంతం చేసుకున్న ప్రభాస్...స్పిరిట్ కూడా రేసు లో వుంది. తన ప్రతీ సినిమా ద్వారా ప్రేక్షకులకు షాక్ కొట్టే కధాంశాలతో హిట్స్ కొట్టే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కు దర్శకత్వం వహిస్తున్నారు, ఇప్పటికే దీపిక పదుకునే నిష్క్రమణ సందీప్ వంగా పై కామెంట్స్ తదితర వార్తల ద్వారా ఈ చిత్రం నిత్యం సినీ అభిమానుల నోట్లో నానుతోంది.ఈ చిత్రం యాక్షన్, డార్క్ థీమ్, బోల్డ్ నెరేటివ్ తో రూపొందుతోంది. అంతర్జాతీయ నటుల ఎంపిక, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ వంటి లతో ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది.ఈ మూడు ప్రాజెక్టులు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశముంది. ప్రతి చిత్రమూ దేనికదే తనదైన ప్రత్యేకతను కలిగి ఉండటంతో, ఇండియన్ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో తదుపరి సినిమాలకు ఈ మూడూ దేనికదే ప్రత్యేక శైలి లో దిశా నిర్ధేశ్యం చేయనున్నాయి. ఆ మార్గదర్శకత్వం చేస్తున్నవారు దక్షిణాది వారు అందులోనూ ఒక్క అట్లీ తప్ప అందరూ తెలుగు వారు కావడం నిజంగా గర్వకారణమే. -
కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్
కొందరు పెళ్లి పేరు ఎత్తితేనే పారిపోతుంటారు. అందులో డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి ముచ్చటే లేదు. ఈ ఏడాదే ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పడుతుందంటూ ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపించినా అవన్నీ ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. డార్లింగ్ జీవితంలోకి రాబోయే అమ్మాయి ఎక్కడుందో? ఏంటో? లక్కీ గర్ల్ అని అభిమానులు సరదాగా అనుకుంటూ ఉంటారు. పెళ్లంటే ముఖం చాటేస్తున్న హీరోఅయితే ఎవరెన్ని అనుకున్నా.. వయసు మీద పడుతున్నా సరే.. ప్రభాస్ మాత్రం పెళ్లంటేనే నాలుగడుగులు వెనకడుగు వేస్తున్నాడు. వయసు దాటిపోతున్నా.. లెక్క చేయడం లేదు. రియల్ లైఫ్లోనే కాదు రీల్ లైఫ్లో కూడా ఇదే జరిగింది. కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో కనిపించాడు ప్రభాస్. ఓ సీన్లో తిన్నడు(విష్ణు).. రుద్ర(ప్రభాస్)ను నీకు పెళ్లయిందా? అని అడుగుతాడు. అందుకు రుద్ర.. నా పెళ్లి గురించి నీకెందుకులే.. అని కౌంటరిచ్చాడు. అప్పుడు విషయం అర్థమైన తిన్నడు.. పెళ్లి చేసుకుంటే తెలిసేది అని డైలాగ్ విసురుతాడు. ఈ సంభాషణకు థియేటర్లో చప్పట్లు, విజిల్స్ గట్టిగానే పడ్డాయి. ప్రభాస్ అభిమానుల అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోతోంది.కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. అక్షయ్ కుమార్, మోహన్లాల్, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: రెండో బిడ్డ జననం.. ఫోటో షేర్ చేసిన ఇలియానా -
ఒసామా బిన్లాడెన్పై వెబ్ సిరీస్.. ఎలా ఉందంటే?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో అమెరికన్ మేన్ హంట్: ఒసామా బిన్ లాడెన్ వెబ్ సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.9/11... అమెరికా చరిత్రలో ఇదో మరచిపోని సంఖ్య. నాటికి, నేటికి, రేపటి తరానికి గుర్తుండిపోయే దారుణ ఘటన ఈ 9/11. న్యూయార్క్ నగరంలోని రెండు పెద్ద ఆకాశ హార్మ్యాలను విమానాలతో నేలమట్టం చేసి దాదాపు 3000కి పైగాప్రాణాలను బలిగొన్న ఈ ఘటన అతి కిరాతక చర్యగా అమెరికా చరిత్రలో నిలిచిపోయింది. అత్యంత హేయమైన ఈ తీవ్రవాద దాడి 9/11కి సూత్రధారి బిన్ లాడెన్. అంతటి కరుడు గట్టిన తీవ్రవాదిని ఉత్కంఠభరితంగా మట్టుబెట్టాయి నిఘా సంస్థలు. ఇదే ఇతివృత్తంగా నాటి ఘటనలను సిరీస్ రూపంలో నేడు నెట్ ఫ్లిక్స్ మన ముందుకు తీసుకొచ్చింది.‘అమెరికన్ మేన్ హంట్: ఒసామా బిన్ లాడెన్’ పేరుతో ఈ సిరీస్ మూడు భాగాలతో నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు భాషతోపాటు దాదాపు అన్ని భారతీయ భాషలలో ఈ సిరీస్ని విడుదల చేశారు. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే ... సిరీస్ మొత్తం అప్పుడు జరిగిన కొన్ని వాస్తవ సన్నివేశాలతో రూపకల్పన చేయడం. అంతేకాదు... అమెరికాలో ఈ ఆపరేషన్ గురించి అధికారులు ఎప్పటికప్పుడు అప్పటి ప్రెసిడెంట్కి బ్రీఫ్ చేయడం, అలాగే అప్పటి ఈ ఆపరేషన్కు సంబంధించిన కొందరు అధికారుల వీడియో బైట్స్ను కూడా చాలా చక్కగా ఎడిట్ చేసి, చూపించారు.నిజానికి ఈ సిరీస్ చూడడం మొదలు పెట్టిన కొద్ది సమయానికే మనం కూడా ఈ ఆపరేషన్లో వర్చ్యువల్గా ఇన్వాల్వ్ అయిపోతాం. మనకు 9/11 ఘటన గురించి తెలిసింది పిడికిడెంత అయితే ఈ సిరీస్ ద్వారా కొండంత విషయాలు తెలుస్తాయి. ‘అమెరికన్ మేన్ హంట్: ఒసామా బిన్ లాడెన్’... వర్త్ఫుల్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్
‘‘ప్రపంచ సినిమాకి చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణులను అకాడమీలోకి ఆహ్వానిస్తున్నందుకు మాకెంతో థ్రిల్గా, ఆనందంగా ఉంది. అంకితభావం, నిబద్ధతతో ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ పురోగతికి కృషి చేస్తున్న ప్రతిభావంతులు వీరు ’’ అంటూ ఆస్కార్ అకాడమీ కమిటీ సీఈవో బిల్ క్రామర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ పేర్కొన్నారు. 98వ ఆస్కార్ అవార్డు వేడుక వచ్చే ఏడాది మార్చి 15 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16)న లాస్ ఏంజెల్స్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు కమిటీ ఈ వేడుకకు సంబంధించిన పనులు మొదలుపెట్టింది.ఇందులో భాగంగా విజేతల ఎంపిక ఓటింగ్ కోసం అకాడమీలో సభ్యులుగా చేరాలంటూ దేశ, విదేశాలకు చెందిన సినిమా తారలకు ఆహ్వానం పంపింది కమిటీ. ఆ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది కొత్తగా 534 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లుగా పేర్కొంది. వారిలో యాక్టింగ్ విభాగంలో ఇండియన్ స్టార్స్ కమల్హాసన్, ఆయుష్మాన్ ఖురానాలకు, దర్శకురాలుపాయల్ కపాడియా, సినిమాటోగ్రాఫర్ రణబీర్ దాస్, క్యాస్టింగ్ డైరెక్టర్ కరణ్, ఫ్యాషన్ డిజైనర్ మ్యాక్సిమా బసు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ స్మృతీ ముంద్రాలకు ఆహ్వానం పంపారు.ఆస్కార్ అవార్డు విజేతల ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు హక్కు లభిస్తుంది. నామినేషన్ల దశ నుంచి విజేతల ఎంపిక వరకూ సభ్యులు ఓటింగ్లోపాలు పంచుకోవాల్సి ఉంటుంది. కాగా కొత్తగా ఎంపిక చేసిన 534 మంది సభ్యుల్లో స్త్రీల సంఖ్య 41 శాతం ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జనవరి 12 నుంచి 16 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ దక్కించుకున్నవారి జాబితాను జనవరి 22న ప్రకటిస్తారు. -
కన్నప్ప రిలీజ్.. మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన కన్నప్ప ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో కన్నప్ప టీమ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ చూసిన మంచు మనోజ్ తన రివ్యూ కూడా ఇచ్చేశారు. అన్న ఇంత బాగా చేస్తాడని ఊహించలేదని అన్నారు. అలాగే ప్రభాస్ నటనపై ప్రశంసలు కురిపించారు.అయితే తాజాగా మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న కూడా కన్నప్ప మూవీపై పోస్ట్ చేసింది. శివుని సేవ చేసినవాడికి లోకమంతా సహాయకరమే అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఈ సందర్భంగా కన్నప్ప టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పిది. మీరంతా కన్నప్ప సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలంటూ అభిమానులను కోరింది. మంచు ఫ్యామిలీ వివాదం తర్వాత మొదటిసారి మంచు మనోజ్, మంచు లక్ష్మీప్రసన్న పాజిటివ్గా పోస్టులు చేయడంతో విష్ణు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. -
బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ దివి.. డిఫరెంట్ లుక్లో హీరోయిన్ సమంత!
నెదర్లాండ్స్ వేకేషన్లో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్..పింక్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఆలియా భట్ పోజులు..బీచ్లో బిగ్బాస్ బ్యూటీ విష్ణుప్రియ చిల్..బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్స్.. వెరైటీ డ్రెస్లో హీరోయిన్ సమంత లుక్స్.. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
'నా జీవితంలో అత్యుత్తమమైన రోజు'.. పెళ్లి తర్వాత అఖిల్ పోస్ట్
అక్కినేని హీరో అఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని ఆయన పెళ్లాడారు. ఈ నెల ఆరో తేదీన వీరిద్దరు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. జూబ్లీహిల్స్లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో టాలీవుడ్ తారలు, సన్నిహితులు సందడి చేశారు.పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. తాజాగా పెళ్లి తర్వాత తొలిసారి తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించిందని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మధుర జ్ఞాపకాలు అందించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. ఈ ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
కల్కి చిత్రానికి ఏడాది.. సీక్వెల్పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత
గతేడాది సరిగ్గా ఈ రోజు విడుదలై బాక్సాఫీస్ సునామీ సృష్టించిన చిత్రం కల్కి 2898 ఏడీ. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మైథలాజికల్ సినిమా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూడో సినిమాగా నిలిచింది.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.అయితే ఈ మూవీ తర్వాత సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో కల్కి-2 అప్డేట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఇంకెప్పుడు మొదలవుతుందా? అని అప్డేట్స్ కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. ఈ సినిమా రిలీజైన సరిగ్గా ఏడాది పూర్తి కావడంతో నిర్మాత అశ్వనీదత్ కల్కి-2పై అప్డేట్ ఇచ్చారు.ఈ ఏడాది సెప్టెంబర్లో కల్కి-2 షూటింగ్ మొదలు కానుందని నిర్మాత అశ్వనీదత్ వెల్లడించారు. వచ్చే ఏడాది మే లేదా జూన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను కల్కి-2 కనువిందు చేయనుందని అశ్వనీదత్ అన్నారు.Celebrating 1️⃣ year of #Kalki2898AD with the most awaited update on #Kalki2! 🔥#1YearForKalki2898AD#1YearForKalkiKARNAge@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/kkycW3Gt8U— Telugu FilmNagar (@telugufilmnagar) June 27, 2025 -
హీరోగా గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు.. టీజర్ చూశారా?
గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్లో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.మూవీ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ టీజర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే కాలేజీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా జులై 18న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో రవి చంద్రన్, జెనీలియా, రావు రమేష్, సుధారాణి, అచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. -
'అప్పటిదాకా కన్నప్ప ఓటీటీకి రాదు..' మంచు విష్ణు క్లారిటీ!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో భారీ అంచనాల మధ్య జూన్ 27న ప్రపంచవ్యాప్తందా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే కన్నప్పకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రభాస్.. రుద్ర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.అయితే రిలీజ్ ముందు రోజు మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు కన్నప్ప గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ మూవీని ఓటీటీకి ఎప్పుడు తీసుకొస్తారని ప్రశ్నించగా.. ఆయన సమాధానామిచ్చారు. నా సినిమా 10 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుందని స్పష్టం చేశారు. రిలీజ్ విషయంలో నాపై ఒత్తిడి లేదని చెప్పారు. అందుకే కన్నప్పను పది వారాల తర్వాతే ఓటీటీకి తీసుకొస్తామని వెల్లడించారు. -
తొలిసారి మాస్ సాంగ్ పాడిన 'సుహాస్'
టాలీవుడ్ హీరో సుహాస్ తొలిసారి గాయకుడిగా మారాడు. తను నటిస్తున్న కొత్త సినిమా 'ఓ భామ అయ్యే రామ' కోసం అదిరిపోయే మాస్ సాంగ్ను ఆయన పాడారు. ఈ చిత్రంలో సుహాస్కు జోడిగా మాళవిక మనోజ్ నటించింది. ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్లో హరీశ్ నల్లా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ దశలో ఉంది. జూలై 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాథ్విక్ ఆనంద్, నయని పావనిముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
కన్నప్ప మూవీ రిలీజ్.. ఆనందంతో చొక్కా చింపుకున్న అభిమాని!
మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన చిత్రం కన్నప్ప అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి పాజిటివ్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాపై మంచు మనోజ్ సైతం ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ రోల్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్ల వద్ద అభిమానులు మంచు విష్ణు, ప్రభాస్ అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు.అయితే కన్నప్ప చూసిన ఓ అభిమాని థియేటర్ వద్ద తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. థియేటర్కు వచ్చిన అభిమాని కన్నప్ప మూవీపై బ్లాక్బస్టర్ హిట్ అంటూ కేకలు వేశాడు. మంచు విష్ణును ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి చెబుతున్నా.. పక్కా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా హిట్ అంటూ ఏకంగా తన షర్ట్నే చింపుకుని మరి కన్నప్పపై తన అభిమానం చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు సైతం సూపర్ హిట్ అంటూ కామెంట్స్ చేశారు. -
జూలై 18న 'వీడే మన వారసుడు' చిత్రం విడుదల
రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందిన సందేశాత్మక చిత్రం ‘వీడే మన వారసుడు’. ఈ సినిమాలో రమేష్ ఉప్పు (RSU) హీరోగా నటించడమే కాకుండా ఈ ప్రాజెక్ట్కు కథ , స్క్రీన్ప్లే, మాటలు, పాటలు ,నిర్మాతతో పాటు దర్శకత్వం కూడా ఆయనే వ్యవహరించాడు. ఇందులో రమేష్ ఉప్పు (RSU)కు జోడిగా లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ నటించారు. అర్.ఎస్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపోందిన ఈ చిత్రానికీ శ్రీమతి యు.రమాదేవి సమర్పకురాలుగా వ్యవహారిస్తున్నారు. సమ్మెట గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించారు. జూలై 18న తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్ను అభినందించారు. కుటుంబం, రైతుల పోరాటం, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం వంటి అంశాలను సమర్థవంతంగా చిత్రీకరించినందుకు ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా దర్శకనిర్మాత రమేష్ ఉప్పు (RSU) మాట్లాడుతూ.. 'సమాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. సెన్సార్ బోర్డు సభ్యులతో పాటు, ప్రీమియర్ షో చూసిన పలువురు ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపించడంతో మా నమ్మకం మరింత పెరిగింది. మా శ్రమకు మంచి సక్సెస్ అందుతుందనే నమ్మకం బలంగా ఉంది. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని థియేటర్కు వెళ్లి చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.' అని చెప్పారు. ఈ నెల 29న మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
హీరోగా స్టార్ హీరో తనయుడి ఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడంటే?
విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఫీనిక్స్’. స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకే బ్రేవ్మ్యాన్ పిక్చర్స్ నిర్మించారు. ఫీనిక్స్ మూవీలో అభినక్షత్ర, వర్ష హీరోయిన్లుగా నటిస్తుండగా... వరలక్ష్మి శరత్కుమార్, సంపత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలోని ఇందా వాంగికో...(ఇదిగో తీసుకో అని అర్థం) అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. గతంలో నానుమ్ రౌడీదాన్, సిందుబాద్’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన సూర్య సేతుపతి హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్, చక్కని ఎమోషన్తో రూపొందించిన ఈ చిత్రాన్ని జూలై 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. -
వారియర్గా 'రష్మిక మందన్నా'.. కొత్త సినిమా ప్రకటన
2018లో "ఛలో" తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా సత్త చాటుతున్నారు. పుష్ప, యానిమల్, ఛావా సినిమాలతో పాటు రీసెంట్గా 'కుబేర'తో బాక్సాఫీస్ వద్ద మెప్పించారు. కిల్లర్ లుక్స్తో ఇటు యూత్ ఐకాన్గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్ ఆప్షన్గా ఆమె మారిందని చెప్పవచ్చు. వరుస చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకున్నారు. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె మరో ఆసక్తికర ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. త్వరలో 'మైసా' అనే సినిమాతో వస్తున్నట్లు ఒక పోస్టర్తో ప్రకటించారు. అందులో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచారు. పాన్ ఇండియా రేంజ్లో రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. తాను గతంలో ఎప్పుడూ పోషించని పాత్రతో 'మైసా' కోసం చేస్తున్నట్లు రష్మిక చెప్పారు. అభిమానుల కోసం ఎప్పుడు కూడా కొత్తగా, భిన్నంగా ఉన్న పాత్రలే చేయాలనేది తన ఉద్దేశం అంటూ పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ మైసా పోస్టర్ను రష్మిక షేర్ చేశారు. ఇప్పటి వరకు రష్మికను శ్రీవల్లి, గీతాంజలిగా చూసిన ప్రేక్షకులు త్వరలో ఒక వారియర్గా ఆమెను చూడనున్నారు. భారీ బడ్జెట్తో ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. మరిన్ని విషయాలు త్వరలో ప్రకటించనున్నారు. -
హ్యాపీ డేస్ సీక్వెల్పై శేఖర కమ్ముల ఫోకస్
-
‘కన్నప్ప’ మూవీ రివ్యూ
టైటిల్ : కన్నప్పనటీనటులు: విష్ణు మంచు, మోహన్ బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీనిర్మాత: మోహన్ బాబుకథ:పరుచూరి గోపాల కృష్ణ,ఈశ్వర్ రెడ్డి, జి. నాగేశ్వర రెడ్డితోట ప్రసాద్దర్శకత్వం: ముకేశ్ కుమార్ సింగ్సంగీతం : స్టీఫెన్ దేవస్సీసినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌఎడిటర్: ఆంథోనీవిడుదల తేది: జూన్ 27, 2025కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథకుడిగా, నిర్మాతగాను వ్యవహరించాడు. మంచు ఫ్యామిలికి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించాయి. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్ వచ్చాక ఈ సినిమాపై ఉన్న నెగెటివిటీ తగ్గిపోయింది. ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Kannappa Movie Review).కథేంటంటే..తిన్నడు(మంచు విష్ణు) పరమ నాస్తికుడు. అతని తండ్రి నాథ నాథుడు(శరత్ కుమార్) మాటే ఆయనకు వేదం. గూడెం ప్రజలకే ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడానికి చెందిన యువరాణి నెమలి(ప్రీతీ ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ఓసారి గూడెంలో ఉన్న వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. ఈ విషయం కాల ముఖుడికి తెలిసి.. గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు. అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని వీడాల్సి వస్తుంది. నెమలితో కలిసి అడవికి వెళ్తాడు. శివుడి పరమభక్తురాలైన నెమలి.. దేవుడినే నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు? వీరి జీవితంలోకి రుద్ర(ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం కోసం కాల ముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడు పరమ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కన్నప్ప కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పరమ నాస్తికుడైన తిన్నడు పరమ భక్తుడిగా ఎలా మారాడు అనేది 50 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘భక్త కన్నప్ప’ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అదే కథతో ఇప్పుడు మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఓ భక్తి కథకు కావాల్సినంత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ ను నేటి తరానికి నచ్చేలా ‘కన్నప్ప’ కథను చెప్పాలనుకున్నారు. ఈ విషయంలో మంచు విష్ణుని అభినందించాల్సిందే. అయితే టెక్నికల్గా సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. సీజీ వర్క్ పేలవంగా ఉంది. వార్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎమోషన్ని తెరపై బాగా పండించి ఆ లోపాలను కాస్త కప్పిపుచ్చారు. భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్గా సాగుతూ.. శివ భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శివుడు గొప్పతనాన్ని పాట రూపంలో చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత తిన్నడు ఎందుకు నాస్తికుడిగా మారాల్సి వచ్చిందో అర్థవంతంగా చూపించారు. మంచు విష్ణు ఎంట్రీ కథనం ఆసక్తి పెరుగుతుంది. యువరాణి నెమలితో ప్రేమలో పడడం.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ని ఆకట్టుకుంటాయి. పాటల పేరుతో భక్తి చిత్రంలోనూ శృంగార రసాన్ని బాగానే పండించారు. కొన్ని చోట్ల ఆ శృంగార రసం మితిమీరిపోయింది కూడా. ఇక మోహన్ బాబు ఎంట్రీ, మోహన్ లాల్ ఎంట్రీ సీన్స్ అదిరిపోతాయి. అయితే ఫస్టాఫ్లో వచ్చే యుద్ద సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఓవరాల్గా ఫస్టాఫ్ పర్లేదులే అన్నట్లుగా సాగుతుంది. ఇక సెకండాఫ్లో కథనం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రుద్రగా ప్రభాస్ ఎంట్రి ఇచ్చిన తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ప్రభాస్ కనిపించేది 20 నిమిషాలే అయినా.. ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోతారు. క్లైమాక్స్లో విష్ణు నటన ఆకట్టుకుంటుంది. శివ భక్తులకు చివరి 40 నిమిషాలు అయితే విపరీతంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తిన్నడు అలియాస్ కన్నప్పగా మంచు విష్ణు బాగా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్లో విష్ణు నటన అదిరిపోతుంది. ఆయన కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్గా కన్నప్ప నిలిచిపోతుంది. గూడెపు యువరాణి, శివుడి పరమ భక్తురాలు నెమలిగా ప్రీతి ముకుందన్ మంచి నటనతో ఆకట్టుకుంది. తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శిస్తూనే.. నటన పరంగాను మంచి మార్కులే సంపాదించుకుంది. విష్ణు, ప్రీతీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక రుద్రగా ప్రభాస్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తెరపై కనిపించేది 20 నిమిషాలే అయినా.. అవే సినిమాకు కీలకంగా మారుతాయి. తిన్నడు, నెమలితో పాటు మహాదేవ శాస్త్రీ పాత్రలకు రుద్రకు మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయి. ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్లో విజిల్స్ వేయిస్తాయి. ఇక శివుడికి తనకంటే గొప్ప భక్తుడు లేడని భావించే మహాదేవ శాస్త్రీగా మోహన్బాబు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన డైలాగు డెలివరీ ఆ పాత్రకు హుందాతనం తెచ్చింది. మోహన్లాల్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతీదేవి పాత్రలో కాజల్ ఒదిగిపోయారు. ఇక తిన్నడు తండ్రిగా శరత్కుమార్ నటన బాగుంది. కానీ, ఓన్ వాయిస్తో చెప్పిన డబ్బింగ్ బాగోలేదు. చిన్నప్పటి తిన్నడుగా నటించిన అవ్రామ్.. నటన పరంగా ఓకే కానీ డబ్బింగ్ దారుణంగా ఉంది. తెలుగు పదాలు సరిగా పలకలేకపోయాడు. బ్రహానందం, మధుబాల, శివబాలాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా బాగుంది. స్టీఫెన్ దేవస్సీ పాటలు పర్వాలేదు కానీ నేపథ్య సంగీతమే అంతగా బాగోలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేసేలా బీజీఎం ఉంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. న్యూజిలాండ్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. మనోజ్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభిస్తోంది. శుక్రవారం (జూన్ 27న) కన్నప్ప చిత్రాన్ని విష్ణు సోదరుడు, హీరో మంచు మనోజ్ ప్రసాద్ ఐమాక్స్లో వీక్షించాడు. ఈ సందర్భంగా అతడు సినిమా బాగుందని మెచ్చుకున్నాడు. మనోజ్ మాట్లాడుతూ.. కన్నప్ప మూవీ చూశాను. చాలా చాలా బాగుంది. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్కు వెళ్తుంది. క్లైమాక్స్లో (విష్ణు) ఇంత గొప్ప పర్ఫామెన్స్ ఇస్తారని కలలో కూడా అనుకోలేదు. వెయ్యి రెట్లు బాగుందిఅందరూ చాలా అద్భుతంగా చేశారు. నేను అనుకున్నదానికంటే వెయ్యి రెట్లు బాగుంది. చిత్రయూనిట్ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలని, మీరు పెట్టిన డబ్బు వెయ్యింతలు తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. సినిమా ప్రారంభంలో ఐదు నిమిషాలు మిస్సయ్యాను. దానికోసం కన్నప్ప సినిమాను మరోసారి చూస్తాను అని మనోజ్ చెప్పుకొచ్చాడు.ప్రత్యేకంగా చెప్పాలా?కానీ అన్న పేరును మాత్రం ప్రస్తావించలేదు. మరో వీడియోలో మాత్రం 'చివరి 20 నిమిషాలైతే అదిరిపోయింది. అన్న (విష్ణు) కూడా ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు. నాన్న (మోహన్బాబు) యాక్టింగ్ గరించి ప్రత్యేకంగా చెప్పాలా? అదరగొట్టాడు. సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. కన్నప్పకన్నప్ప సినిమా విషయానికి వస్తే.. మహాభారతం సీరియల్ ఫేం ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. మోహన్బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. 2023లో షూటింగ్ ప్రారంభించారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ నిర్మితమైంది. ప్రభాస్, మోహన్లాల్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఈ సినిమా చేశారు.చదవండి: సినిమాటోగ్రాఫర్ రసూల్ భార్య ఎవరో తెలుసా? ఆ టాలీవుడ్ నటి -
ఓటీటీలో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసిన రెండు సినిమాలు
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ‘23’ (23 Movie) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన చిలకలూరి పేట, చుండూరు, జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుడు సంఘటనల గురించి ఈ సినిమా ఉంటుంది. మే 16న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అయితే, తాజాగా భారత్లోని యూజర్స్కు కూడా చూసేలా మేకర్స్ ఛాన్స్ కల్పించారు.‘మల్లేశం’ (Mallesam) సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న రాజ్.ఆర్ 23 మూవీని తెరకెక్కించారు. తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో స్టూడియో 99 సంస్థ ఈ మూవీని నిర్మించింది. అయితే, ఈ చిత్రం జూన్ 27 నుంచి సడెన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. 1991 సమయంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మారణకాండ ఘటన, 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన కార్ బాంబు దాడి గురించి 23 సినిమాతో తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్తో '23' చిత్రంలో చూపించారు. ఈ మూడు కేసుల్లో నేరం ఒక్కటే అయినప్పటికీ శిక్షల్లో ఎక్కువ తక్కువలు ఎందుకంటూ మన న్యాయ వ్యవస్థని ఈ చిత్రం ప్రశ్నిస్తుంది.ఓటీటీలో ఆర్జీవీ సైకలాజికల్ థ్రిల్లర్ 'శారీ' సినిమాఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘శారీ’(Saaree Movie Review ) సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్లో కూడా విడుదల కావచ్చని సమాచారం. ఆరాధ్య దేవి, సత్య యాదు జంటగా ఇందులో నటించారు.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ. { "ns": "yt", "el": "detailpage", "cpn": "Xqxdhc9HnhSixtPI", "ver": 2, "cmt": "3.078", "fmt": "396", "fs": "0", "rt": "4.145", "euri": "", "lact": 1, "cl": "775466715", "mos": 0, "state": "8", "volume": 100, "cbr": "Firefox", "cbrver": "140.0", "c": "WEB", "cver": "2.20250624.08.00", "cplayer": "UNIPLAYER", "cos": "Windows", "cosver": "10.0", "cplatform": "DESKTOP", "hl": "en_US", "cr": "IN", "len": "142.621", "fexp": "v1,23986026,18618,49740,512303,133212,14625955,11684381,53408,9105,22730,2821,106030,18644,14869,47210,15124,65,13526,391,26504,9252,3479,690,1829,9937,574,6258,16948,7703,2661,4815,2,20224,7495,6476,869,4409,12345,2796,2596,1910,3746,2625,843,776,897,4414,351,2323,1883,1843,591,4578,28,729,11,763,2599,80,659,986,3084,720,645,947,5385,3303,1091,28,261,695,626,2351,6437,348,1254,192,182,1888,310,122,1873,2144", "feature": "search", "afmt": "251", "muted": "0", "docid": "fsdK6xda2Ro", "ei": "EUJeaLuEH-qf4t4PnYeHyQk", "plid": "AAY4iEOhCAo86WLX", "referrer": "https://www.youtube.com/results?search_query=rgv+saree+movie+video+songs", "sourceid": "ys", "list": "RDfsdK6xda2Ro", "of": "IZ1XMevbm4svzp3Lk5SroA", "vm": "CAIQARgEOjJBSHFpSlRJQlM3MWRzWVdHcTg5V0dRbXRBX3hESjY1S2dPOFA2YkxONGxHWE15ZkN5UWJSQUZVQTZSUlFsMlhCSG12TF9XRWtmbnBKbV8yOXF1b1oxSXhZQzNuM0xxb1NFWWx6bmpXc0FVdERYenhMNFVUUGExWXM0aWxla3BvWTFTUDN1QbgBAQ", "vct": "3.078", "vd": "142.621", "vpl": "0.000-3.078", "vbu": "0.000-19.708", "vbs": "0.000-142.621", "vpa": "0", "vsk": "0", "ven": "0", "vpr": "1", "vrs": "4", "vns": "2", "vec": "null", "vemsg": "", "vvol": "0.6846994830911334", "vdom": "1", "vsrc": "1", "vw": "683", "vh": "384", "dvf": 0, "tvf": 73, "lct": "2.986", "lsk": false, "lmf": false, "lbw": "10216572.222", "lhd": "0.042", "lst": "0.000", "laa": "itag_251_type_3_src_reslicemakeSliceInfosMediaBytes_segsrc_reslicemakeSliceInfosMediaBytes_seg_1_range_158063-333590_time_10.0-20.0_off_0_len_175528_end_1", "lva": "itag_396_type_3_src_reslicemakeSliceInfosMediaBytes_segsrc_reslicemakeSliceInfosMediaBytes_seg_2_range_437753-622942_time_12.7-19.7_off_0_len_185190_end_1", "lar": "itag_251_type_3_src_reslicemakeSliceInfosMediaBytes_segsrc_reslicemakeSliceInfosMediaBytes_seg_1_range_158063-333590_time_10.0-20.0_off_0_len_175528_end_1", "lvr": "itag_396_type_3_src_reslicemakeSliceInfosMediaBytes_segsrc_reslicemakeSliceInfosMediaBytes_seg_2_range_437753-622942_time_12.7-19.7_off_0_len_185190_end_1", "laq": "0", "lvq": "0", "lab": "0.000-20.001", "lvb": "0.000-19.708", "ismb": 23760000, "relative_loudness": "3.300", "optimal_format": "360p", "user_qual": 0, "release_version": "youtube.player.web_20250624_21_RC00", "debug_videoId": "fsdK6xda2Ro", "0sz": "false", "op": "", "yof": "false", "dis": "", "gpu": "ANGLE_(Intel,_Intel(R)_HD_Graphics_400_Direct3D11_vs_5_0_ps_5_0),_or_similar", "ps": "desktop-polymer", "debug_playbackQuality": "medium", "debug_date": "Fri Jun 27 2025 12:32:47 GMT+0530 (India Standard Time)", "origin": "https://www.youtube.com", "timestamp": 1751007767639 } -
సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్
మహబూబాబాద్ రూరల్: సినిమా చూస్తున్న ప్రేక్షకులపై ఒక్కసారిగా సీలింగ్ పడగా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏషియన్ ముకుంద థియేటర్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. థియేటర్లో బుధవారం ప్రేక్షకులు ‘కుబేర’ సినిమా చూస్తున్నారు. రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా సీలింగ్ పైకప్పుభాగం ఊడిపడడంతో ప్రేక్షకులు భయభ్రాంతులకు గురై వెంటనే థియేటర్ నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా, కొద్దిసేపు ఉల్లాసం కోసం వస్తే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఈ కారణంతోనే విజయ్ ఆంటోనీ సినిమాను విడుదల చేస్తున్నా: సురేష్ బాబు
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటించిన కొత్త సినిమా 'మార్గన్' (Maargan) నేడు (జూన్ 27)న విడుదలైంది . లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని, దీప్షిక తదితరులు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.'మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విజయ్ ఆంటోనిగారి ప్రయాణాన్ని నేను చూస్తూనే ఉన్నాను. ఆయనకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది. నేను అలాంటివారు తీసే చిత్రాలని ఇష్టపడుతుంటాను. అందుకే ‘మార్గన్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను' అని సురేష్ బాబు అన్నారు. సినిమా విడుదల సందర్భంగా ‘మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్’ అంటూ యూనిట్ నిర్వహించిన ప్రెస్మీట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ‘‘సురేష్బాబుగారు మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా తొలి సక్సెస్. ఇక ‘మార్గన్’ సాధారణ సీరియల్ కిల్లర్ చిత్రం కాదు. కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది.' అని అన్నారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా తొలి ఆరు నిమిషాల మూవీని చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
సినిమాటోగ్రాఫర్ రసూల్ భార్య ఎవరో తెలుసా? ఆ టాలీవుడ్ నటి..
గాయం, చిత్రం, నువ్వునేను, గులాబీ, కిక్.. ఇలా ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పని చేశారు రసూల్ ఎల్లోర్. ఒకరికి ఒకరు, సంగమం, భగీరథ చిత్రాలను డైరెక్ట్ కూడా చేశారు. సినిమాల్లో పని చేస్తున్న సమయంలోనే నటి జాహ్నవితో పరిచయం ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లి చేసుకున్నారు. జాహ్నవి.. యజ్ఞం, హ్యాపీ చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్గా నటించారు.అల్లు అర్జున్ హ్యాపీ మూవీలో జాహ్నవిసినిమా సెట్లో పరిచయం..ఆమె సినిమాలు మానేయడం గురించి సినిమాటోగ్రాఫర్ రసూల్ స్పందించాడు. ఒకరికి ఒకరు సినిమా సెట్లో మేమిద్దరం కలిశాం. అలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత తను సినిమాలు మానేసింది. అందుకు ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవు. మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాకే తను సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ తను తల్చుకుంటే మంచి దర్శకురాలు కాగలదు అని చెప్పారు. రసూల్ సినిమాటోగ్రాఫర్గా.. ఫ్యామిలీ సర్కస్, లిటిల్ సోల్జర్స్, వాంటెడ్, జల్సా, ఊసరవెల్లి, ఏజెంట్, దేవకీ నందన వాసుదేవ.. ఇలా ఎన్నో చిత్రాలు చేశారు.యజ్ఞం సినిమాలో నటి జాహ్నవిచదవండి: స్టార్ సింగర్ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే? -
చిటుకు... చిటుకు
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, ‘దిల్’ రాజు యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ విడుదల చేయనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘చికిటు..’ అనే పాటని విడుదల చేశారు మేకర్స్. శ్రీనివాస మౌళి సాహిత్యం అందించిన ఈ పాటని అనిరు«ధ్, అరివు పాడారు. ‘‘కూలీ’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్ను నెలకొల్పాయి. తాజాగా విడుదలైన ‘చికిటు..’ పాటకి మంచి స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: గిరీష్ గంగాధరన్. -
సందడే సందడి
భాగ్యనగరంలో భలే జోరుగా షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరోస్. సందడి సందడిగా ఈ షూటింగ్స్ జరుగుతున్నాయి. మరి... హైదరాబాద్లో ఏ స్టార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో తెలుసుకుందాం.షామిర్పేటలో... తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో ఒకరైన చిరంజీవి ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఒక పాట మినహా ‘విశ్వంభర’ సినిమా పూర్తి చేశారు చిరంజీవి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడవ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని షామిర్పేటలో శరవేగంగా జరుగుతోంది. చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ ఉంటుందని, జూలై 1 నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందనీ తెలిసింది. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో ఈ సినిమా రూపొందుతోందని టాక్. ‘మెగా 157’ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. అఖండ తాండవం హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ చిత్రాల తర్వాత వారి కాంబినేషన్లో రూపొందుతోన్న నాలుగో చిత్రమిది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్కి సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట బోయపాటి శ్రీను. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఆర్ఎఫ్సీలో... వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ఆయన కథానాయకుడిగా ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఫౌజి’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తీస్తున్నారట హను రాఘవపూడి. ‘సీతారామం’ వంటి హిట్ మూవీ తర్వాత ఏడాదికిపైగా సమయం తీసుకుని ‘ఫౌజి’ కథను తీర్చిదిద్దారు దర్శకుడు. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా భట్ యువరాణి పాత్ర చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆటా పాటా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్, దేవర’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో భాగంగా ఎన్టీఆర్పై ఓ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. అయితే ఇది రెగ్యులర్ సాంగ్ కాదని, దేశభక్తి నేపథ్యంలో ఉంటుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా, మలయాళ నటుడు టొవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా 2026 జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్పల్లిలో... హీరో మహేశ్బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దుర్గా ఆర్ట్స్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర కాదని... నెగటివ్ క్యారెక్టర్ అని టాక్.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలోని ఓ స్టూడి యోలో జరుగుతోంది. అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారట. ప్రస్తుతం మహేశ్బాబు, ఇతర నటీనటులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో మహేశ్ సరికొత్త లుక్లోకి మారిపోయారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్నగర్ టాక్. మొయినాబాద్లో... హీరో రవితేజ, దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్ లో ‘ఆర్టీ 76’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రవితేజ నటిస్తున్న 76వ చిత్రం ఇది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్కి సమీపంలోని మొయినాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది.రవితేజతో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొంటున్నారని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ట్రేడ్ మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్ మిస్ అవకుండా కథను సిద్ధం చేశారు కిశోర్ తిరుమల. ఈ సినిమా కోసం రవితేజ స్పెషల్గా మేకోవర్ అయ్యారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ మహేశ్బాబు పి. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ర్యాపో 22’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ గబ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్ స్టాప్గా డే అండ్ నైట్ షూటింగ్ చేసిన అనంతరం తర్వాతి షెడ్యూల్ని హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు యూనిట్. ముచ్చింతల్లో... ‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ఫ్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. నానితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు నాని. ‘ది ఫ్యారడైజ్’ నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఇప్పటికే విడుదలైన ఓ గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సినిమా 2026 మార్చి 26న రిలీజ్ కానుంది. తుక్కుగూడలో... ‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై ‘హను మాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరో, హీరోయిన్తో పాటు ప్రముఖ తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. గండిపేటలో... ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.ప్రత్యేకంగా వేసిన సెట్లో సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధిలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మనసును హత్తుకునే స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూపొందుతోంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.శంషాబాద్లో... ‘జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాల ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్లో జరుగుతోంది. నవీన్ పొలిశెట్టితో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రముఖ స్టూడియోలో...‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియన్ హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. మనోజ్ మంచు, జగపతి బాబు, శ్రియ శరణ్, జయరామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. టీమ్ అంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని సమాచారం. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్గా నిలవనున్నాయి. ‘మిరాయ్’ 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లో సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.పై సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. - డేరంగుల జగన్ మోహన్ -
పనస తోటలో లైగర్ భామ.. శారీలో శ్రద్ధాదాస్ స్టన్నింగ్ లుక్స్!
పనస తోటలో లైగర్ భామ అనన్య పాండే..మా ప్రమోషన్లతో బిజీబిజీగా కాజోల్...బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..శారీలో శ్రద్ధాదాస్ గ్లామరస్ లుక్స్..బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ కిల్లర్ పోజులు.. View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
న్యూజిలాండ్లో 7 వేల ఎకరాలు.. మంచు విష్ణు రియాక్షన్ వైరల్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.న్యూజిలాండ్లో మీరు 7000 ఎకరాలు కొన్నారా? సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై మీరేమంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి మంచు విష్ణు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నీకు ఓ వంద ఎకరాలు రాసిస్తా నువ్వు కూడా వచ్చేయ్ అంటూ మీడియా ప్రతినిధికి నవ్వుతూ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ఇటీవల 7 వేల ఎకరాలు కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. దీనిపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా..భారీ బడ్జెట్తో తెరకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా బాలనటులుగా నటించారు.న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్నారా? Vishnu Manchu Reaction 🤣 pic.twitter.com/EfEJ1BugO6— Rajesh Manne (@rajeshmanne1) June 26, 2025 -
థియేటర్లలో కన్నప్ప.. ఓటీటీల్లో ఏకంగా డజన్ చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ శుక్రవారం థియేటర్లలో టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ కన్నప్ప సందడి చేయనుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న ఈ సినిమా జూన్ 27, 2025 ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నుంచి కాజోల్ హారర్ థ్రిల్లర్ మా, నికిత రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్నెస్, కోలీవుడ్ నుంచి విజయ్ ఆంటోనీ మార్గన్, లవ్ మ్యారేజ్, ఎం3గన్ 2.0, మలయాళం నుంచి కూడల్ అనే చిత్రాలు బిగ్ స్క్రీన్పై సందడి చేయనున్నాయి.ఇక థియేటర్ల సంగతి పక్కనపెడితే శుక్రవారం వచ్చిందంటే ఓటీటీ ప్రియులకు పండగే. ఈ వీకెండ్లో ఫుల్ వినోదం అందించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు విరాటపాలెం (తెలుగు సిరీస్), ఒక పథకం ప్రకారం మూవీ టాలీవుడ్ ప్రియులకు అలరించేందకు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు ఒక్క రోజులోనే దాదాపు 12కు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ లిస్ట్ మీరు కూడా చూసేయండి.నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 27 పొకేమాన్ హారిజన్స్- సీజన్-2 - జూన్ 27జియో హాట్స్టార్ మిస్త్రీ (హిందీ సిరీస్) - జూన్ 27జీ5 విరాటపాలెం (తెలుగు సిరీస్) - జూన్ 27 బిబీషణ్ (బెంగాలీ సిరీస్) - జూన్ 27 అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) - జూన్ 28సన్ నెక్స్ట్ అజాదీ (తమిళ సినిమా) - జూన్ 27 ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) - జూన్ 27 ఆప్ కైసే హో- జూన్ 27 నిమ్మ వస్తుగలిగే నీవే జవాబ్దారు(కన్నడ సినిమా)- జూన్ 27ఆపిల్ ప్లస్ టీవీ స్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27లయన్స్ గేట్ ప్లేక్లీనర్- జూన్ 27 -
ప్రియమణి థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రియమణి, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ 'గుడ్ వైఫ్'. అమెరికన్ సిరీస్ 'గుడ్ వైఫ్' అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తని రక్షించుకునేందుకు ఓ మాజీ మహిళ లాయర్ ఏం చేసింది? అనే కోణంలో ఈ సిరీస్ను రూపొందించారు. ఇందులో ప్రియమణి లాయర్గా కనిపించనుండగా.. ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ నటించారు.తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. జూలై నాలుగో తేదీ నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. Behind every powerful woman is a story waiting to be told 👩🏽🔥Mark your calendars 🗓️ - #TheGoodWife streaming from July 4th ✨#HotstarSpecials #GoodWife streaming from July 4 on #JioHotstar#GoodWifefromJuly4onJioHotstar #GoodWifeTrailer #GoodWifeOnJioHotstar #JioHotstarTamil… pic.twitter.com/ITRWF89kLC— JioHotstar Tamil (@JioHotstartam) June 26, 2025 -
'గెలాక్టస్తో యుద్ధానికి సిద్ధం'.. ఫెంటాస్టిక్ ఫోర్ తెలుగు ట్రైలర్ చూశారా?
మార్వెల్ అభిమానులకు ఇక పండగే! 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' అనే హాలీవుడ్ సినిమా వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్కి మధ్య జరగబోయే భీకర పోరాటం ఈ సినిమాలో చూపించనున్నారు. ఫైట్స్, విజువల్స్ చూస్తే ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది. 1960ల నాటి రెట్రో-ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్లో ఈ సినిమా ఉండనుంది.ఈ చిత్రానికి మాట్ షాక్మాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కెవిన్ ఫీజ్ నిర్మించారు. 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో జూలై 25, 2025న విడుదల కానుంది.ఈ చిత్రంలో పెడ్రో పాస్కల్ (రీడ్ రిచర్డ్స్/మిస్టర్ ఫెంటాస్టిక్), వెనెస్సా కిర్బీ (సూ స్ట్రోమ్/ఇన్విజిబుల్ ఉమెన్), జోసెఫ్ క్విన్ (జానీ స్ట్రోమ్/హ్యూమన్ టార్చ్), ఎబోన్ మోస్-బచ్రాక్ (బెన్ గ్రిమ్/ది థింగ్) నటించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్, సారా నైల్స్ కూడా కనిపించనున్నారు. -
ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా మారదాం: రామ్ చరణ్
తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కృషికి టాలీవుడ్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎఫ్డీసీ ఛైర్మన్, సినీ నిర్మాత దిల్రాజు అన్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మలయాళ చిత్ర పరిశ్రమలాగే మనం కూడా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడేవారిపై నిషేధం విధించేలా సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.రామ్ చరణ్ మాట్లాడుతూ..' మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక మంచి హై.. ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడిపితే అది మంచి హై.. ఈవెనింగ్ స్పోర్ట్స్ ఆడి ఫ్రెష్ అయితే అది ఒక మంచి హై.. గోపిచంద్ చెప్పినట్లు ఆ హై వేరు.. మనల్ని మనమే రక్షించుకుందాం.. డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి.. జీవితాలని పాడుచేసుకోకూడదు.. మన సోసైటీ మనమే క్లీన్ చేసుకుందాం. గతంలో కొన్ని స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి బాధేసింది. అప్పుడు నేను తండ్రిని కాదు. ఇప్పుడు నేను కూడా ఒక తండ్రిని. ఒక విజయవంతమైన సినిమా చేసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. మన కుటుంబంతో మొదలు పెట్టి స్కూల్, సమాజం బాగుచేసుకుందాం. ఈ విషయంలో పోలీస్శాఖ కృషిని ప్రశంసిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారదాం.. డ్రగ్స్ను నిర్మూలిద్దాం' అని పిలుపునిచ్చారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఒక్కసారి ట్రై చేయిరా అనే వాళ్లు ఉంటారు. కానీ ఒక్కసారి అటువైపు వెళ్తే ఇక బయటపడటం కష్టం. ఎవరైనా మనకు అలాంటి వాళ్లు కనపడితే వారికి దూరగా ఉందాం. జిమ్లో మంచి వర్కవుట్ చేస్తే మంచిగా అనిపిస్తది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఒక హై వస్తది. డబ్బులు ఇంకొకరికి ఇచ్చి హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక హై వస్తది. నచ్చిన పని చేస్తున్నప్పుడు ఒక హై వస్తది. నచ్చిన పని చేసి సక్సెస్ అందుకున్నప్పుడు ఒక హై వస్తది. ఛేజ్ ది సక్సెస్ ... డ్రగ్స్ వంటి నెగిటివిటీకి దూరంగా ఉండండి. మిమ్మల్ని చూసి మీ పేరేంట్స్ గర్వపడతారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తది. అందుకే మన డ్రగ్స్కి దూరంగా ఉందాం. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం. మీ ప్రేమకు ధన్యవాదాలు' అని అన్నారు.Getting Successful in filmsPlaying a Game after our workSpending quality time with FamilyGives you high that you can't get from anywhere.- #RamCharan Message to Youthpic.twitter.com/rjDHweFOfQ— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 26, 2025 -
‘కన్నప్ప’ నిర్మాణ సంస్థ వార్నింగ్.. అలా చేయడం వల్లేనన్న విష్ణు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అయితే ఇటీవల'కన్నప్ప' తీసిన నిర్మాణ సంస్థ చాలా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. క్రిటిక్స్, యూట్యూబర్స్ ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లు నోట్లో రాసుకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ప్రెస్మీట్లో మంచు విష్ణు స్పందించారు.చెన్నైలో కన్నప్ప సినిమా చూసిన ఒకతను నన్ను కౌగిలించుకుని ఏడ్వడం మొదలెట్టారు.. చివరిగంట నా లైఫ్లో చూడలేదని చెప్పాడు. మహానటుడు రజినీకాంత్ సినిమా చూసిన చెప్పిన మాట నా లైఫ్లో మర్చిపోలేనని అన్నారు. అయితే కన్నప్ప చూసిన ఒకతను రివ్యూ ఇచ్చేశాడు. ఈ రివ్యూ వచ్చిన మూడు గంటల్లో ట్విటర్లో దాదాపు 42 మంది రివ్యూలు రాసి 0.5 రేటింగ్ ఇచ్చారని తెలిపారు. అయితే కొందరు కన్నప్ప సినిమా చూడకుండానే ట్విటర్లో రివ్యూలు ఇచ్చారని అన్నారు. అందువల్లే ఇలాంటి వారిని అరికట్టడం కోసమే కాపీరైట్ స్ట్రైక్, లీగల్ ప్రొసీజర్ తప్ప ఎవర్నీ బెదిరించడం నా ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. మీ వల్లే సినిమాలు వెళ్తాయని.. సినిమా చూస్తూ రివ్యూలు పెట్టడం పైరసీ చేయడంతో సమానమన్నారు. ట్విటర్, యూట్యూబ్లో సినిమా చూసేటప్పుడు పెట్టే వాళ్లను బ్లాక్ చేశామని తెలిపారు. అంతే తప్ప వార్నింగ్ ఇచ్చే సీన్ నాకు ఎక్కడిదంటూ నవ్వుతూ అన్నారు.కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఇందులో బాలనటులుగా చేశారు. -
24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్.. మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్
మరికొన్న గంటల్లో(జూన్ 27) మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచు ఫ్యామిలీ, ముఖ్యంగా విష్ణు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ (దాదాపు రూ. 250 కోట్లు) పెట్టి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అదే రేంజ్లో ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లోనూ సినిమా ఈవెంట్స్ నిర్వహించారు. విష్ణు పడిన కష్టానికి ఫలితం తగ్గింది. ఈ సినిమాకు కావాల్సినంత రీచ్ అయితే వచ్చినట్లు ఉంది. అందుకే రిలీజ్కి ముందే భారీగా టికెట్స్ అమ్ముడు పోతున్నాయి. ఈ సినిమా టికెట్స్ని ఆన్లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోనే 1,15,000 టికెట్స్ సేల్ చేసి కన్నప్ప రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.‘24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్ అయిపోయాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. సినిమా రిలీజ్కు ముందే ఇంత గొప్ప ప్రేమను పొందడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ప్రేమ చూపుతున్న ప్రతీ మూవీ లవర్కు థాంక్స్. ఇది సినిమా కాదు మహా శివుడి మహిమ.. కన్నప్పకు అంకితం’ అంటూ విష్ణు ట్వీట్ చేశాడు. కన్నప్ప విషయానికొస్తే.. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్తో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్ కీలక పాత్రలు పోషించారు.115,000 tickets sold in just 24 hours.My heart is racing! 🙏🏽To witness this kind of pre-release love and anticipation is truly humbling.I’m deeply grateful to every movie lover for the unwavering support.This is not just a film, This is all glory to Lord Shiva and #Kannappa…— Vishnu Manchu (@iVishnuManchu) June 26, 2025 -
కన్నప్ప తీసింది వాళ్ల కోసమే.. కక్కుర్తి పడి కాదు: మంచు విష్ణు
సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంచు విష్ణు స్పందించారు. కన్నప్ప మూవీ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. తన సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని.. వాళ్లను ఇబ్బందిపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. అందుకే టికెట్ రేట్లు పెంచలేదని అన్నారు. తెలంగాణలో టికెట్లకు ఎలాంటి పెంపు లేదని తెలిపారు. ఏపీలో కూడా కేవలం కొన్ని సెంటర్లలో మాత్రమే పెంపు ఉంటుదని మంచు విష్ణు వెల్లడించారు.అమెరికాలో సైతం కన్నప్ప ప్రీమియర్ షోలకు కేవలం 16 డాలర్లుగా మాత్రమే నిర్ణయించామని మంచు విష్ణు వెల్లడించారు. ఆ తర్వాత పెద్దవారికి 14 డాలర్లు, పిల్లలకు 12 డాలర్లుగా టికెట్ ధరలు ఉన్నాయని తెలిపారు. ఏ రోజు అయితే పాప్కార్న్, కోక్ ధరలు తగ్గిస్తారో ఆ రోజు నుంచి నేను మల్టీప్లెక్స్లో టికెట్స్ పెంచడానికి ఆలోచిస్తానని అన్నారు. అంతే తప్పా నా కక్కుర్తి కోసం టికెట్ రేట్స్ పెంచడం లేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను పిల్లలు ఎక్కువగా చూడాలన్నదే తన కోరిక అని తెలిపారు. నా చిన్నప్పుడు రామాయణ, మహభారతం గురించి నేను టీవీల్లో చూసేవాడిని.. మన చరిత్ర, దేవుళ్ల గురించి సినిమాలు, కామిక్ బుక్ కల్చర్ ద్వారే తనకు తెలిసిందన్నారు. పిల్లలకు కూడా ఈ సినిమా నచ్చాలనే ఉద్దేశంతోనే కథను తీశామని విష్ణు స్పష్టం చేశారు.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. -
తమన్నా మాజీ ప్రియుడితో డేటింగ్.. దంగల్ నటి ఏమన్నారంటే?
దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అమిర్ ఖాన్ దంగల్ మూవీలో గీతా ఫోగట్ పాత్రలో ఆమె అదరగొట్టేసింది. 2015లో ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ అనే చిత్రంలోనూ నటించింది. అయితే ఆ మూవీ తర్వాత మరో సినిమా చేస్తున్న క్రమంలోనే ఒక నిర్మాత నుంచి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె 'మెట్రో... ఇన్ డినో' అనే మూవీలో కనిపించనుంది.ఈ మూవీ తర్వాత ఫాతిమా సనా షేర్.. గుస్తాక్ ఇష్క్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా మాజీ బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ హీరోగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి జంటగా కనిపించారు. దీంతో ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. విజయ్ వర్మతో సనా డేటింగ్లో ఉందంటూ రూమర్స్ పుట్టకొచ్చాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఊహాగానాలపై ఫాతిమా సనా షేక్ స్పందించింది. తన రాబోయే చిత్రం ఆప్ జైసా కోయి' ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె మాట్లాడారు. మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? అడిగిన ప్రశ్నకు ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని. నా జీవితంలో ఎవరూ లేరని స్పష్టం చేసింది.ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ..'ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉన్నా. నా లైఫ్లో ఎవరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు మంచి వ్యక్తులంటూ ఎవరూ లేరు. మంచివాళ్లు కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటారు. మీరు ఏదైనా పార్ట్నర్షిప్లో ఉంటే మిమ్మల్ని మీరు కోల్పోకుండా రిలేషన్ స్ట్రాంగ్ ఉండేందుకు కృషి చేస్తారు. రిలేషన్ బలంగా ఉండాలంటే అదే మార్గమని నేను భావిస్తున్నా' అని క్లారిటీ ఇచ్చేసింది.ఆప్ జైసా కోయి మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రేమ, సమానత్వం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవిస్తారు. వారు ఒకరి మాట ఒకరు వింటారు. వాటిని తిరస్కరించరు. ఈ సినిమాలో ప్రేమ, సమానత్వం గురించేనని.. ఈ విషయంలో ఇద్దరూ రాజీ పడాలని ఫాతిమా సనా షేక్ తెలిపింది. కాగా.. ఆప్ జైసా కోయి చిత్రంలో ఆర్ మాధవన్ సరసన నటించింది. మాధవన్తో కలిసి పనిచేయడం నాకు చాలా అద్భుతంగా అనిపించిందని వెల్లడించింది. ఇప్పటికే 'ఆప్ జైసా కోయి' ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూలై 11న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
ఆరేళ్లపాటు డేటింగ్.. మాజీ ప్రియుడిని మరవలేకపోతున్న బ్యూటీ!
బాలీవుడ్ భామ మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్సే గుర్తొస్తాయి. ఆ తర్వాత ఆమె డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్తో ప్రేమాయణం నడిపించింది. అయితే వీరి ప్రేమబంధం ఎక్కువ రోజులు నిలవలేదు. దాదాపు ఆరేళ్ల డేటింగ్ అనంతరం బ్రేకప్ చెప్పేసుకుని అభిమానులకు షాకిచ్చారు. అయితే కొన్నినెలల క్రితం ఐపీఎల్ మ్యాచ్లో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పక్కన మలైకా కనిపించడంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే దీనిపై ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా తన మాజీ భాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ బర్త్ డే కావడంతో విషెస్ తెలిపింది ముద్దుగుమ్మ. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్డే, అర్జున్ కపూర్' మాజీ ప్రియుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న మలైకా అరోరా మాజీ లవర్కు విషెస్ చెప్పడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అయితే గతేడాది బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట మాత్రం సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా.. అర్జున్ కపూర్ ఇటీవలే తెరపైకి వచ్చిన 'మేరే హస్బెండ్ కి బివి' అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం 'నో ఎంట్రీ 2' అనే మూవీలో నటించనున్నారు. -
ధోనీని గంగూలీ బీట్ చేయగలడా? క్రికెటర్లలో ఎవరి బయోపిక్ రేంజ్ ఏంటి?
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది గంగూలీ బయోపిక్. ఎప్పటి నుంచో ప్లాన్స్ వేసినప్పటికీ తాజాగా ఈ సినిమా పట్టాలక్కనుంది వచ్చే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సెన్సేషన్ మాలిక్ చిత్రంలో హీరోగా చేసిన రాజ్కుమార్ రావ్ గంగూలీ పాత్ర పోషించనున్నాడు. అది తప్ప ఇంకా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు విశేషాలు ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో... గత కొంత కాలంగా ఊపందుకున్న క్రికెటర్ల బయోపిక్స్..వాటికి దక్కిన ప్రేక్షకాదరణను ఒక్కసారి పరిశీలిస్తే...సచిన్..విన్సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ ఫిల్మ్ 2017లో విడుదల అయింది. ఇండియన్ క్రికెట్ గాడ్గా అభిమానులు పిలుచుకునే సచిన్ జీవితం ఆధారంగా ఇది పూర్తి స్థాయి డాక్యుమెంటరీ ఫిల్మ్గా తయారైంది. కధ విషయానికి వస్తే సచిన్ బాల్య దశ నుంచి 2011 వరల్డ్ కప్ గెలుపు వరకు ఈ చిత్రంలో చూపించారు. ఇందులో సచిన్ స్వయంగా తన పాత్ర పోషించడం విశేషం. ఈ డాక్యుమెంట్రీ రూ.76 కోట్ల వరకూ వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు, ఫ్యాన్స్ ఆదరణ దక్కించుకుంది.థోనీ...ధనాధన్ మాజీ కెప్టెన్ ఎమ్.ఎస్. ధోనీ ద అన్టోల్డ్ స్టోరీ 2016లో విడుదలైంది. ఇందులో థోనీ పాత్రను దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషించాడు. ఇందులో కథ ధోనీ క్రికెటర్గా మారడం నుంచి భారత కెప్టెన్గా ఎదగడం దాకా కొనసాగుతుంది. ఈ సినిమా రూ.216 కోట్లు వసూలు బాక్స్ ఆఫీస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. సినిమాలో సుశాంత్ నటనకు ప్రశంసలు దక్కాయి. దేశవ్యాప్తంగా ధోనీ అభిమానుల ఆదరణ పొందింది. అజహర్...యావరేజ్ సర్..మహ్మద్ అజారుద్దీన్ జీవిత కధ ఆధారంగా రూపొందిన అజహర్ చిత్రం కూడా 2016లోనే విడుదలైంది. దీనిలో అజహర్ పాత్రను బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి పోషించాడు. క్రికెటర్గా అజార్ కెరీర్ కొనసాగిన విధం, మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం వరకు సినిమా సాగుతుంది. మొత్తంగా రూ.50 కోట్లు వసూలు చేసి యావరేజ్ చిత్రంగా నిలిచింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే దక్కించుకుంది.మిథాలీ...సారీ...మహిళల క్రికెట్కు భారత్లో చక్కని బాట వేసిన మిథాలి రాజ్ జీవితం ఆధారంగా రూపొందిన శభాష్ మిథు..2022లో విడుదలైంది.ఇందులో మిథాలి పాత్రను బాలీవుడ్ నటి తాప్సీ పన్ను పోషించింది. భారత మహిళా క్రికెట్ తో పాటుగా ఎదిగిన మిథాలీ జీవితాన్ని చూపించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. కనీసం రూ.2 కోట్లు కూడా వసూలు చేయలేక కమర్షియల్గా ఘోర పరాజయం పొందింది. ఈ సినిమా కథన శైలి, స్క్రీప్లేపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే, మిథాలి పాత్రను తాప్సీ సమర్ధంగా పోషించిందని ప్రశంసలు రావడం ఒక్కటే ఈ సినిమాకు దక్కిన ఊరట.కపిల్...కప్ ఫుల్...కపిల్దేవ్ 83 పేరిట రూపొందిన చిత్రం భారత క్రికెట్ దిగ్గజం కపిల్ జీవితంలో ముఖ్య ఘట్టమైన ప్రపంచ కప్ విజయం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కపిల్ పాత్రను బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ పోషించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం రూ.193 కోట్లతో మంచి వసూళ్లే రాబట్టినా, చిత్రం బడ్జెట్ ప్రకారం కమర్షియల్ సక్సెస్ అనిపించుకోలేకపోయింది. అయితే విమర్శలు ప్రశంసలు బాగానే అందుకుంది.మొత్తం గా చూస్తే ధోనీ బయోపిక్ మాత్రమే అన్ని రకాలుగా విజయం సాధించింది అని చెప్పొచ్చు మరి గంగూలీ ఈ విషయం లో ధోని ని బీట్ చేయగలడా... -
కన్నప్ప కోసం వెయిటింగ్.. వారి కోసమంటూ మంచు మనోజ్ పోస్ట్!
కన్నప్ప టీమ్కు మంచు మనోజ్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ శుక్రవారం విడుదలయ్యే కన్నప్ప సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం నాన్న, ఆయన టీమ్ ఎన్నో ఏళ్లు ఎంతో కష్టపడ్డారని రాసుకొచ్చారు. మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్రామ్ల అందమైన జ్ఞాపకాలను థియేటర్లో చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్ ద్వారా మనోజ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' కన్నప్ప చిత్రానికి, టీమ్కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కోసం నాన్నతో పాటు ఆయన బృందం ఎంతో శ్రమించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే మా లిటిల్ ఛాంపియన్స్ అరియానా, వివియానా, అవ్రామ్ల అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్పై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. తనికెళ్ల భరణిగారి జీవితకాల కల జీవం పోసుకుని.. ఈ శుక్రవారమే కన్నప్ప విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్, మోహన్లాల్ , అక్షయ్కుమార్, ప్రభుదేవాతో పాటు ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరు సినిమా కోసం చేసిన చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. మంచు మనోజ్ ఇటీవలే భైరవం మూవీతో అభిమానులను అలరించారు. అయితే ఈ ట్వీట్లో ఎక్కడూ కూడా తన సోదరుడు మంచు విష్ణు పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. All the best to Team #Kannappa!My Dad and his team have poured years of effort and love into this film. I’m praying it roars to blockbuster success.Can’t wait to see my little champs Ari, Vivi, and Avram make memories on the big screen.So happy that #TanikellaBharani garu's… pic.twitter.com/CLg6wpinVx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 26, 2025 -
ఐశ్వర్య రాయ్తో పెళ్లికి ముందు ఆ హీరోయిన్తో ఎంగేజ్మెంట్!
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారు అంటుంటారు. అందుకేనేమో.. పీకల్లోతు ప్రేమలో ఉన్న అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్.. ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయారు. మనసు నిండా ఒకరినొకరు నింపుకున్నారు కానీ, తలరాతల్లో మాత్రం లేకుండా పోయారు. జంటగా నడవాలనుకుంటే వేర్వేరుగా ప్రయాణించారు. అభిషేక్.. ఐశ్వర్యను, కరిష్మా.. సంజయ్ను పెళ్లాడారు. అసలు ఆనాడేం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందాం..అభిషేక్- కరిష్మా ప్రేమసినీరంగంలో సత్తా చాటుతున్న కపూర్ ఫ్యామిలీలో పుట్టింది కరిష్మా (Karisma Kapoor). 17 ఏళ్ల వయసులోనే నటిగా ప్రయాణం ప్రారంభించింది. మొదట్లో కొన్ని వైఫల్యాలు చూసిన కరిష్మా.. రాజా హిందుస్తానీ చిత్రంతో సక్సెస్ అందుకుంది. తర్వాత ఈ బ్యూటీ బిగ్బీ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)తో ప్రేమలో పడింది. అభిషేక్ సోదరి శ్వేత బచ్చన్ పెళ్లిలోనే వీరి చూపులు కలిశాయి. ఐదేళ్లపాటు ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. జయా బచ్చన్తో కరిష్మా కపూర్నా కోడలు: జయా బచ్చన్దీంతో 2002లో అమితాబ్ బచ్చన్ 60వ పుట్టినరోజు వేడుకల్లో జయా బచ్చన్.. అభిషేక్, కరిష్మాల ఎంగేజ్మెంట్ను ప్రకటించింది. కరిష్మాను తన కోడలిగా చేసుకోనున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్లో పెద్ద పండగే జరగబోతుందనుకున్నవారికి షాకిస్తూ వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అమితాబ్ తన సంపదలో కొంత భాగం అభిషేక్ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయాలని కరిష్మా తల్లి బబిత డిమాండ్ చేసిందట! ఈ నిశ్చితార్థం రద్దవడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లిఎంగేజ్మెంట్ ఆగిపోయిన కొద్ది నెలలకే బబిత.. తన కూతురికి మంచి వ్యాపారవేత్తను చూసి పెళ్లి చేసింది. 2003లో కరిష్మా, సంజయ్ కపూర్ల పెళ్లి జరిగింది. ఇతడికిది రెండో పెళ్లి కావడం గమనార్హం. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. పిల్లలు పుట్టిన కొంతకాలానికే కరిష్మా- సంజయ్ విడాకుల కోసం కోర్టుకెక్కారు. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2016లో డివోర్స్ మంజూరయ్యాయి. కొద్దిరోజుల క్రితమే సంజయ్ కపూర్ కన్నుమూశాడు. ఇకపోతే అభిషేక్ బచ్చన్.. 2007లో ఐశ్వర్యరాయ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అభిషేక్- ఐశ్వర్య అయినా సంతోషంగా ఉన్నారా? అంటే.. అప్పుడే దూరంగా ఉన్నట్లు అనిపిస్తారు. అంతలోనే జంటగా కనిపిస్తారు. వీరి మధ్య ఏం జరుగుతుందనేది వారికే తెలియాలి! #KarismaKapoor and #AbhishekBachchan's #wedding announcement in the early 2000s was a highly anticipated union between two of #Bollywood's most prominent families. However, the engagement was abruptly called off, and the wedding never took place.#bollywood #aishwaryarai pic.twitter.com/U1dRUrmnT2— The Cheshire Cat (@C90284166) November 5, 2024 చదవండి: కాస్టింగ్ కౌచ్.. ఓ గొప్ప ఫిలింమేకర్ కాంప్రమైజ్ అడిగాడు: నటుడు -
బెట్ ఇలాంటి ‘వార్’ చూసి ఉండరు: ఎన్టీఆర్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన స్పై యాక్షన్ మూవీ ‘వార్’ (2019) కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్డౌన్ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.ఈ పోస్టర్లను ఎన్టీఆర్ తన ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్డౌన్ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్వీట్తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు.కూలీతో పోటీఆగస్ట్ 14న వార్ 2 తో పాటు మరో భారీ పాన్ ఇండియా చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్లో రజనీకాంత్ మేనియా ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ వార్లో గెలిదెవరో చూడాలి. Bet you haven’t ever seen a WAR like this! Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025 -
శ్రీలీల తీరుపై టాలీవుడ్ సీరియస్
-
పదేళ్ల ప్రయాణం.. ‘కన్నప్ప’ గురించి 10 ఆసక్తికర విషయాలు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 2014లో ఈ చిత్రానికి బీజం పడితే.. పదేళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఇప్పటికే చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. టీజర్, ట్రైలర్ మొదలు.. ప్రతి ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించి సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పది ఆసక్తికర విషయాలు మీకోసం..1) ఈ సినిమాను తొలుత సీనియర్ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి తీయాలని భావించాడు. తక్కువ బడ్జెట్లో రా అండ్ రస్టిక్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడట. కానీ ఆ స్క్రిప్ట్ మంచు విష్ణు దగ్గరకు వెళ్లాక.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తీయాలని భావించారట.2) 2014లో భరణి దగ్గర విష్ణు ఈ సినిమా కథ హక్కులను తీసుకున్నాడు. కొంతమంది దిగ్గజ రచయితలతో కలిసి స్క్రిప్ట్ని డెవలప్ చేసుకున్నారు. లొకేషన్స్ కోసం 2018లో విష్ణు పోలాండ్కి వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రం రూపొందించారు.3) ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2023 సెప్టెంబర్లో ప్రారంభం అయింది. ఎక్కువ భాగం న్యూజిలాండ్లోనే చిత్రీకరించారు. 2023 నవంబర్లో ఈ సినిమా టైటిల్ని అధికారికంగా ప్రకటించారు.4) ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేం ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.5) 2024 మహాశివరాత్రి సందర్భంగా మంచు విష్ణు ఫస్ట్లుక్ని విడుదల చేశారు. అలాగే మోహన్ బాబు బర్త్డే సందర్బంగా 2024 మార్చి 19న కన్నప్ప కామిక్ బుక్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రతి సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.6) గతేడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫెస్ట్వల్లో ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ 14న ట్రైలర్ని విడుదల చేశారు.7) మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించారు. కన్నప్పగా విష్ణు, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు, చిన్నప్పటి తిన్నడుగా విష్ణు కొడుకు అవ్రామ్ నటించారు. అలాగే విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో నటించడంతో పాటు ‘శ్రీకాళహస్తి గాథ’ పాటను ఆలరించారు.8) ఇటీవల కాలంలో ఎక్కువమంది స్టార్స్ కలిసి నటించిన చిత్రం కన్నప్ప అనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్తో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్ కీలక పాత్రలు పోషించారు.9) ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇస్తూ 12 కట్స్ చెప్పిందట. దీంతో 195 నిమిషాల నిడివితో రూపొందిన చిత్రం.. చివరకు 182 (3:02 గంటలు)నిడివితో విడుదల కాబోతుంది.10) ఈ సినిమాకు దాదాపు రూ.200-250 కోట్ల వరకు ఖర్చు చేశారట. ప్రభాస్, మోహన్లాల్ ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారని విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. -
అలాంటి సన్నివేశంలో నటించా.. సిరి రియాక్షన్ ఇదే: శ్రీహాన్
గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్ (Shrihan), జెన్నీఫర్ ఇమాన్యుయేల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా జూలై 11న విడుదల కానుంది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘దం దిగ దం...’ సాంగ్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. కాలేజ్ డేస్లోకి..ఈ పాటకి ప్రణవ్ చాగంటి సాహిత్యం అందించగా, యాజిన్ నిజార్ పాడారు. ఈ సందర్భంగా రాజా దారపనేని మాట్లాడుతూ.. ‘‘యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన మా సినిమాలో వినోదంతో పాటు మంచి ప్రేమకథ ఉంది. మా చిత్రాన్ని నైజాంలో ఏషియన్ సునీల్గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు’’ అన్నారు. దయానంద్ గడ్డం మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులను కాలేజ్ డేస్లోకి తీసుకెళ్లి, అప్పటి ఆ రోజులను గుర్తు చేస్తుంది’’ అన్నారు. మూడుసార్లు మౌత్ వాష్వర్జిన్ బాయ్స్లో నటించేందుకు బిగ్బాస్ బ్యూటీ సిరి అభ్యంతరం చెప్పలేదా? అని శ్రీహాన్కు ప్రశ్న ఎదురైంది. అందుకు శ్రీహాన్ స్పందిస్తూ.... సినిమాల విషయంలో మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం. ఎన్నడూ ఎలాంటి అభ్యంతరాలు రాలేవు. కాకపోతే ఈ సినిమాలో లిప్లాక్ సీన్ షూటింగ్ అయ్యాక సిరి నాతో రెండుమూడుసార్లు మౌత్వాష్ చేయించింది అని చెప్పుకొచ్చాడు. సిరి- శ్రీహాన్ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే! ఇక ఈ ఈవెంట్లో నిర్మాత రాజా దారపునేని.. బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీతో కలిసి స్టేజీపై చిందేశాడు. చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
Tollywood: సినీ దర్శకుడిపై కేసు
బంజారాహిల్స్: సినిమా షూటింగ్ను మధ్యలోనే నిలిపివేసి ఆ సినిమాకు సంబంధించిన ఫుటేజీలు ఉన్న ల్యాప్ట్యాప్లు, ఐప్యాడ్ను తీసుకువెళ్లిన ఘటనలో నమ్మకద్రోహానికి పాల్పడ్డ సినీ దర్శకుడిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ అల్లు సాయిలక్ష్మణ్ సినిమాలు నిర్మించేందుకు హైదరాబాద్కు వచ్చి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని స్రవంతినగర్లో ఓ అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకుని సినిమా కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. 2024లో సినిమా నిరి్మంచేందుకు అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన సాయిలక్ష్మణ్ అల్లు ఆర్ట్స్ అకాడమీ ప్రొడక్షన్ పేరుతో మల్లిఖార్జున్ అనే డైరెక్టర్తో ‘గాడ్స్ ప్రీమియర్ లీగ్’ (జీపీఎల్) సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమాకు వేములవాడ శివకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్గా కుదిరాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే డైరెక్టర్ మల్లిఖార్జున్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో నిర్మాత సాయిలక్ష్మణ్ ఆ సినిమా షూటింగ్ను నిలిపివేశాడు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వేములవాడ శివకుమార్ను డైరెక్టర్గా పెట్టుకుని ప్రొడక్షన్ నెంబర్–1 పేరుతో మరో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా చిత్రీకరణ 35 రోజులు పూర్తయిన తర్వాత సాయిలక్ష్మణ్ తన వ్యాపారం నిమిత్తం అమెరికా వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిపోయిన తర్వాత సినిమా షూటింగ్ నిలిచిపోయింది. షూటింగ్ జరపాలంటూ పలుమార్లు యూఎస్ఏ నుంచి సాయిలక్ష్మణ్ చెప్పినా శివకుమార్ వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా షూటింగ్కు సంబంధించిన ఫుటేజీలు, ఒక ఐటమ్ సాంగ్, మరో పాట రెండు ల్యాప్ట్యాప్లలోనూ, రెండు ఐప్యాడ్లలోనూ స్టోర్ చేసి ఉంచగా..వీటిని నిర్మాతకు చెప్పకుండా శివకుమార్ కార్యాలయాల నుంచి తీసుకువెళ్లిపోయాడు. తెచ్చి ఇవ్వాలని చెప్పినా వినిపించుకోలేదు. ఈ ల్యాప్ట్యాప్, ఐప్యాడ్లలో సినిమా డేటాతో పాటు ఫిలిం మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయని నిర్మాత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు దర్శకుడు శివకుమార్ సినిమా దృశ్యాలతో పాటు పాటలను ఇన్స్ట్రాగామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పోస్ట్ చేశారని, ఇది తమకు ఎంతో నష్టాన్ని కలిగించేదిగా ఉందని ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు డైరెక్టర్ శివకుమార్పై బీఎన్ఎస్ సెక్షన్ 316 (4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సముద్రపు ఒడ్డున బిగ్బాస్ అశ్విని శ్రీ.. ట్రెడిషనల్ లుక్లో వితికా షేరు!
సముద్రపు ఒడ్డున బిగ్బాస్ బ్యూటీ అశ్విని శ్రీ చిల్..వరుణ్ సందేశ్ వైఫ్ వితికా శేరు ట్రెడిషనల్ లుక్..బ్లాక్ డ్రెస్లో భూమిక చావ్లా పోజులు..మూవీ షూట్లో బిజీ బిజీగా రాశి ఖన్నా.. View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
ఈ ఏడాది సంక్రాంతి వచ్చి బ్లాక్బస్టర్గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ఓ రేంజ్లో అదరగొట్టేసింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్లో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.అయితే ఈ సినిమాలోని ఓ పాట ఆడియన్స్ను ఓ రేంజ్లో ఊపేసింది. గోదారిగట్టు మీద రామ చిలకవే అంటూ అభిమానులతో స్టెప్పలేయించింది. ఈ పాటలో వెంకీమామ, ఐశ్వర్య రాజేశ్ తమ డ్యాన్స్తో ఫ్యాన్స్ను మెప్పించారు. అంతేకాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.అయితే ఈ పాటకు కేవలం మన ఆడియన్స్ మాత్రమే ఊగిపోయారనుకుంటే పొరపాటే అవుతుంది. తాజాగా ఫారినర్స్ కూడా ఈ సాంగ్కు ఫిదా అయిపోయారు. స్వీడన్కు చెందిన కర్ల్ స్వాన్బెర్గ్ అనే నటుడు తన సతీమణితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. వెంకటేశ్ ఐశ్వర్య రాజేశ్ పాత్రల్లో వీరిద్దరు అదరగొట్టేశారు. కేవలం ఈ సాంగ్ మాత్రమే కాదు.. పలు ఇండియన్ చిత్రాలకు సంబంధించిన పాటలతో పాటు డైలాగ్స్, సీన్స్ కూడా రీ క్రియేట్ చేస్తుంటారు. ఏదేమైనా ఇండియన్ సినిమాలపై వీరికున్న అభిమానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం గోదారి గట్టు మీద రామ చిలకవే సాంగ్ చూసేయండి. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
మంచు విష్ణు కన్నప్ప.. ఏపీలో టికెట్ ధరల పెంపు
ఏపీలో కన్నప్ప సినిమా టికెట్ రేట్లు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. రిలీజ్ రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు జారీ చేసింది. అయితే కేవలం హయ్యర్ క్లాస్ టికెట్ రేట్లు మాత్రమే పెంచుకునేందుకు సడలింపు ఇచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. టికెట్ రేటుకు అదనంగా రూ.50 పెంచుకునేందుకు ఉత్తర్వులిచ్చింది. తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా టికెట్ ధరల పెంపు కోసం ఏపీ గవర్నమెంట్కు మంచు విష్ణు దరఖాస్తు చేసుకోవడంతో టికెట్ పెంపునకు అనుమతిచ్చింది.బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
క్రికెట్ వీడియోపై నెటిజన్ వ్యంగ్య కామెంట్.. ఇచ్చిపడేసిన తమన్!
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ టాలీవుడ్ బీజీఎం కింగ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బాలయ్య సినిమాలకు ఓ రేంజ్లో తన టాలెంట్ బయటపెడతారు. అయితే తమన్లో కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు.. క్రికెట్లోనూ మనోడు అదరగొట్టేస్తాడు. సీసీఎల్ లీగ్లో తెలుగు వారియర్స్ టీమ్లో కీలక ప్లేయర్ కూడా. అలాంటి ఓ క్రికెట్ వీడియోను షేర్ చేస్తూ డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో అంటూ పోస్ట్ చేశారు.అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ తమన్ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. షార్ట్కి, స్లాట్కి తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్ అని అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇది చూసిన తమన్ తనదైన శైలిలోనే ఇచ్చిపడేశాడు. ఓకే రా.. వచ్చి నేర్చుకుంటా.. అడ్రస్ పంపు బే.. అంటూ అదే స్టైల్లో రిప్లై ఇచ్చాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో తమన్ చెప్పింది కరెక్ట్ అంటూ చాలామంది పోస్టులు పెట్టారు. అనవసరంగా నువ్వే తెలియకుండా కామెంట్ చేశావంటూ అతనికి ఇచ్చి పడేస్తున్నారు. Ok Ra Vachiii nerchukunntaaa adresss pammpu bae ! https://t.co/B0M6AGbnO7— thaman S (@MusicThaman) June 25, 2025 Don’t bowl short bro 🤪🔥💥 !! pic.twitter.com/sIUMcd2iaY— thaman S (@MusicThaman) June 24, 2025 -
కన్నప్ప రిలీజ్.. శ్రీశైల ఆలయంలో మంచు విష్ణు పూజలు
కన్నప్ప విడుదలకు ముందు మంచు విష్ణు శ్రీశైల ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరెకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు నటించారు.తన ఆధ్యాత్మిక ప్రయాణంలోని మధుర క్షణాలను మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శించినట్లు తెలిపారు. పన్నెండు జ్యోతిర్లింగాలు. ఒక ప్రయాణం. శాశ్వత శాంతి. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ శైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పవిత్ర దర్శనం ఇప్పుడే పూర్తి చేసుకున్నానంటూ ఫోటోలను షేర్ చేశారు.ఈ సందర్శనతో పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలకు నా ప్రయాణం ముగింపునకు చేరుకుంది.. నా హృదయం నిండిపోయిందని.. నా ఆత్మ ధన్యమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చారు. ప్రస్తుత జీవితం సానుకూలత, కృతజ్ఞత, శాంతి తప్ప మరేమీ లేదని పోస్ట్ చేశారు. నా హృదయానికి దగ్గరగా ఉన్న చిత్రం.. ఈ రోజు నేను మోస్తున్న స్ఫూర్తిని ప్రతిబింబించే కథ.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కన్నప్ప కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. . హర హర మహాదేవ్ అంటూ పోస్ట్ చేశారు. Twelve Jyotirlingas. One journey. Eternal peace.Just completed the sacred darshan at Sri Sailam Mallikarjuna Swamy Temple — one of the twelve revered Jyotirlingas of Lord Shiva.With this visit, my journey to all twelve Jyotirlinga temples comes to a divine close.My heart is… pic.twitter.com/COYa872JrG— Vishnu Manchu (@iVishnuManchu) June 25, 2025 -
కన్నప్పకు చిక్కులు! మంచు విష్ణు ఆఫీస్లో జీఎస్టీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కన్నప్ప చిత్రయూనిట్కు భారీ షాక్ తగిలింది. సినిమా రిలీజ్కు రెండు రోజుల ముందు జీఎస్టీ అధికారులు సోదాలకు దిగారు. మంచు విష్ణు (Vishnu Manchu)తో పాటు పలువురి ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్ కథానాయిక. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. కన్నప్ప బడ్జెట్ను విష్ణు ఎన్నడూ బయటపెట్టలేదు. ఓ ఇంటర్వ్యూలో రూ.100 కోట్లా? రూ.200 కోట్లా? అని అడిగినప్పుడు కూడా చెప్పేందుకు నిరాకరించాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు తన ఆఫీసుకు వస్తారని, ఎందుకీ గొడవ అని సమాధానం దాటవేశారు. చివరకు సినిమా రిలీజ్కు ముందే అధికారులు మంచు విష్ణు కార్యాలయంలో సోదాలకు దిగారు.చదవండి: వంద కోట్ల క్లబ్లో 'కుబేర' -
రజినీకాంత్ కూలీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. చికిటు అంటూ సాగే ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ను రాజేందర్, అరివు, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు.రజినీకి భారీ పారితోషికం..ఈ మూవీ బడ్జెట్తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం.#Chikitu 💃🕺 - https://t.co/TcCvuNmTSE#Coolie #CoolieFirstSingle Superstar @rajinikanth in a @Dir_Lokesh directorial 💥 @sunpictures ⚡️With the legendary TR sir, the genius @Arivubeing and thank you @iamSandy_Off for making us dance🙏🏻#Coolie releasing worldwide August… pic.twitter.com/KGjY2S3v8g— Anirudh Ravichander (@anirudhofficial) June 25, 2025 -
Chandreshwara: జూన్ 27న మరో మహాశివుని చిత్రం విడుదల
ఈ నెల 27న కన్నప్ప రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు మరో శివుడు బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన మరో చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘చంద్రేశ్వర’. ‘అదృశ్య ఖడ్గం’ అనేది ట్యాగ్లైన్. ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వం వహించగా, సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై డాక్టర్ రవీంద్ర చారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్కు మంచి స్పందన లభించింది. జూన్ 27న ఈ చిత్రం గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది.ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ.. ఈ వారంలో రెండు భక్తి సినిమాలు ఒకటి ‘కన్నప్ప’, రెండు ‘చంద్రేశ్వర’ పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారు. చివరి నిమిషం వరకు ఈ సినిమా అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎటువంటి అశ్లీలత ఇందులో ఉండదు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు తరలివచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు. -
చిరు-నాగ్తో మల్టీస్టారర్.. ఇలా మిస్ అయింది!
టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి( Chiranjeevi,), నాగార్జున(Nagarjuna) ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పండుగ సమయంలో లేదా ఏదైనా శుభకార్యం జరిగితే ఫ్యామిలీతో కలిసి హాజరవుతుంటారు. కెరీర్ పరంగానే కాకుండా వ్యాపార పరంగానూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అంతా క్లోజ్గా ఉండే ఈ ఇద్దరు..ఇప్పటి వరకు కలిసి నటించకపోవడం గమనార్హం. వీరిద్దరి కలయికలో ఓ సినిమా వస్తే బాగుటుందని అటు అక్కినేని ఫ్యాన్స్తో పాటు ఇటు మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు.అయితే గతంలోనే వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో అది ఆగిపోయిందట. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ..చిరు, నాగ్లతో ఓ సినిమా ప్లాన్ చేశాడట. వీరిద్దరికి ఉన్న స్టార్ ఇమేజ్ దృష్ట్యా.. భారీ బడ్జెట్తో సినిమాను తీయాలని భావించాడట. అయితే దానికి తగ్గట్టుగా కథ సెట్ కాకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.ఆ తర్వాత కూడా పలువురు దర్శకుడు వీరిద్దరితో సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు.అయితే సరైన కథ దొరకపోవడంతో చిరంజీవి, నాగార్జున ఇప్పటివరకు కలిసి నటించలేదు. ఆ మధ్య అనిల్ రావిపూడి కూడా వీరిద్దరితో కలిసి సినిమా చేస్తాడనే రూమర్ వినిపించింది. చిరంజీవితో తీయబోయే సినిమాలో నాగార్జున కూడా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఒట్టి పుకారే అని తేలిపోయింది. సరైన కథ రావాలే కానీ కలిసి నటించడానికి తాము రెడీ అని చిరు, నాగ్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ మన దర్శక-రచయితలే వారిని మెప్పించే కథలను సిద్ధం చేయడం లేదు. మరి వారిద్దరు మెచ్చే కథ ఏ దర్శకుడు తీసుకొస్తాడో..అసలు చిరు-నాగ్ కాంబినేషన్లో సినిమా వస్తుందో రాదో చూడాలి. -
వంద కోట్ల క్లబ్లో 'కుబేర'
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ కుబేర (Kuberaa Movie). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనాలకు విపరీతంగా నచ్చేసింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తాజాగా కుంభస్థలాన్ని కొట్టేసింది. నాలుగు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని కుబేర చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.కుబేర కథదీపక్ (నాగార్జున) నిజాయితీ గల సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. ఆయనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ.50 వేల కోట్లను బ్లాక్లో పంపించాలి. దానికోసం దీపక్.. నలుగురు భిక్షగాళ్లను తీసుకొచ్చి వాళ్ల పేరు మీద చెరో రూ.10 వేల కోట్ల చొప్పున అకౌంట్లో జత చేస్తాడు. ఆ తర్వాత నలుగురిలో ఒకరైన యాచకుడు దేవా (ధనుష్) తప్పించుకుని పారిపోతాడు. దేవా ఎందుకు తప్పించుకున్నాడు? దేవాను నీరజ్ గ్యాంగ్ పట్టుకుంటుందా? లక్ష కోట్లు చేతులు మారాయా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే! Wealth. Wisdom. And now... ₹100+CR worth of WAVE 🌊#Kuberaa rules with a grand century at the box office.🔥Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/xKr1UYXP60— Kuberaa Movie (@KuberaaTheMovie) June 25, 2025 -
హనుమాన్ నటి హాలీవుడ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?
హనుమాన్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో అభిమానం దక్కించుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. అంతకుముందే బాలయ్య మూవీ వీరసింహారెడ్డిలో తనదైన నటనతో మెప్పించింది. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన కోలీవుడ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా తన హాలీవుడ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది.ప్రముఖ బ్రిటీష్ నటుడు జెరెమీ ఐరన్స్తో కలిసి వరలక్ష్మీ శరత్ కుమార్ అరంగేట్రం చేయనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మూవీకి రిజానా-ఏ కేజ్డ్ బర్డ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రముఖ శ్రీలంక దర్శకుడు చంద్రన్ రుత్నం దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణాది సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన వరలక్ష్మీ.. హాలీవుడ్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. #Varalaxmi goes to Hollywood@varusarath5 makes her #Hollywood debut alongside the acclaimed British actor #JeremyIrons.Directed by veteran director #ChandranRutnam the film is shot in Sri Lanka. The film RIZANA-A Caged Bird is inspired by a true story.#sumathistudios… pic.twitter.com/yrWTPDvy5K— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 25, 2025 -
తను లేకపోతే ఫీలవుతుందని డైరెక్టర్ చెప్పారు: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కన్నప్ప. ఇప్పటికే టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చేశాయి. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు.అంతేకాకుండా ఈ మూవీలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ కూడా నటించారు. ఇటీవల అతని షూటింగ్కు సంబంధించిన వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో విష్ణు కుమార్తెలిద్దరు అరియానా- వివియానా సైతం ప్రత్యేక భక్తి పాటలో మెరిశారు. దీంతో ఈ మూవీలో మంచు విష్ణు ఫ్యామిలీ అంతా కనిపించనుంది. అయితే మంచు విష్ణుకు మరో కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మంచు విష్ణు ముగ్గురు పిల్లలు నటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో తన చిన్న కుమార్తె గురించి మాట్లాడారు. తాను కూడా ఈ సినిమాలో ఉందని తెలిపారు. చిన్నపాపను కూడా ఓ సీన్లో పెట్టేశామని అన్నారు. అవ్రామ్ నా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తాడని వివరించారు. నా చిన్న కూతురిని ఓ సీన్లో పెట్టమని డైరెక్టర్ సలహా ఇచ్చారు. లేకపోతే పెద్దయ్యాక తను ఫీలవుతుందని చెప్పారు. ఎక్కడైనా చిన్నపిల్లల సీన్లో ఛాన్స్ ఉంటే పెట్టేయండి అని చెప్పానని..తను డైలాగ్ కూడా చెప్పిందని మంచు విష్ణు తెలిపారు. దీంతో మొత్తంగా విష్ణు నలుగురు పిల్లలు కన్నప్పలో కనిపించనున్నారు. -
మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. ఎక్కడ చూడాలంటే?
సప్తగిరి, ప్రియాంకశర్మ జంటగా నటించిన చిత్రం పెళ్లికాని ప్రసాద్. ఈ ఏడాది మార్చి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు అభిలాష్రెడ్డి గోపిడి దర్శకత్వం వహించారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం.. ఈ రోజు నుంచి మరో ఓటీటీకి వచ్చేసింది. తాజాగా అమెజాన్ ప్రైమ్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం పెళ్లి కాని ప్రసాద్ సినిమాను చూసి ఓటీటీలో ఎంజాయ్ చేయండి. ఈ మూవీని కె.వై.బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల సంయుక్తంగా నిర్మించారు. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు వినోదం అందించనుంది.‘పెళ్లికాని ప్రసాద్’ కథేంటంటే..?ప్రసాద్(సప్తగిరి) కి 38 ఏళ్లు. మలేషియాలో మంచి ఉద్యోగం.. భారీ జీతం. అయినా ఆయనకి పెళ్లి కాదు. దానికి ఒక కారణం వాళ్ళ నాన్నే(మురళీధర్). రెండు కోట్ల కట్నం ఇచ్చే అమ్మాయినే చేసుకోవాలని కండిషన్ పెడతాడు. చివరకు ఓ సంబంధం సెట్ అయి ప్రసాద్ ఇండియాకు తిరిగి వస్తాడు. అయితే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. కట్ చేస్తే... ప్రియా(ప్రియాంక శర్మ) ఎప్పటికైనా పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ కావాలనుకుంటుంది. ఆమెతోపాటు అమ్మ నాన్న లను, బామ్మను కూడా విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటుంది.ప్రియ ఫ్యామిలీ మొత్తం ఓ ఎన్నారై సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రసాద్ గురించి తెలిసి.. ఫ్యామిలీ మొత్తం డ్రాప్ చేసి పెళ్లి చేయిస్తారు. పెళ్లి తర్వాత ప్రసాద్ ఇండియాలోనే ఉండాలనుకుంటాడు. ఈ విషయం ప్రియకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు ప్రసాద్ పెళ్లి తరువాత ఇండియాలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? పెళ్లి తర్వాత ప్రసాద్కి ఎదురైన సమస్యలు ఏంటి? విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రియ ఫ్యామిలీ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
కరీనా కపూర్ బాత్రూమ్లో నా పోస్టర్ అతికించుకుంది: సల్మాన్ ఖాన్
అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలు, పోస్టర్లు గది నిండా నింపుకుంటుంటారు చాలామంది. అయితే ఓ హీరోయిన్ తన బాత్రూమ్లో స్టార్ హీరో పోస్టర్లు అతికించిందుకుందట! ఈ విషయాన్ని భాయ్జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) బయటపెట్టాడు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. కరీనా కపూర్! ఆమె అతికించిన పోస్టర్దో ఎవరికో కాదు సల్మాన్దే!సల్మాన్పై ఫన్నీ పోస్టర్లుసల్మాన్ ఖాన్.. ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడో సీజన్కు మొదటి గెస్టుగా విచ్చేశాడు. షోలో ప్రసారం చేయని అన్సీన్ ఫుటేజ్ను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. అందులో రోడ్డు పక్కన, కళ్లజోడు దుకాణంలో, మెన్స్ సెలూన్లో సల్మాన్ను ఎలా వాడేస్తున్నారనేది తెలియజేస్తూ ఆయా పోస్టర్లను చూపించాడు. అవి చూసి నవ్వేసిన హీరో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు.కరీనా బాత్రూమ్లో నా పోస్టర్కరీనా కపూర్ బాత్రూమ్లో కూడా నా పోస్టర్ ఉందని విన్నాను. తర్వాత నేనోసారి ఆమె ఇంటికి వెళ్లినప్పుడు చూశాను. అప్పుడామె వయసు 8 ఏళ్లుంటాయనుకుంటాను. తనకు 15 ఏళ్లొచ్చాక నా పోస్టర్ తీసేసి రాహుల్ రాయ్ పోస్టర్ పెట్టుకుంది అని చెప్పుకొచ్చాడు. కాగా కరీనా, సల్మాన్ బాడీగార్డ్, క్యూంకీ, బజ్రంగీ భాయ్జాన్ వంటి చిత్రాల్లో నటించారు.ట్రిప్పుకెళ్తాంబాలీవుడ్ ట్రియో (ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ త్రయం) గురించి చెప్తూ.. ఆమిర్ ఖాన్, నేను, షారూఖ్.. ముగ్గురం కలిసి ఓ ట్రిప్కు వెళ్దామని ఆమిర్ అన్నాడు. ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాం అన్నాడు. ఇంతలో అర్చన పూరణ్ సింగ్ కలగజేసుకుంటూ ఎవరికీ తెలియని చోటంటూ భూమిపై ఏదీ లేదు. మీరు చందమామ పైకి వెళ్తే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. అందుకు హీరో నవ్వుతూ.. అవును, అది ట్రై చేయొచ్చు, కానీ ఎంతకాలం పడుతుందో చెప్పలేం అని సరదాగా అన్నాడు.చదవండి: ఆయన కోపం, తిట్లు భరించలేకపోయా.. మధ్యలోనే వెళ్లిపోయా! -
కమల్ హాసన్కి భారీ షాక్
-
Trisha Love Story: హింట్ ఇస్తున్నా త్రిష..!
-
కోర్ట్లో తప్పు ఒప్పుకొన్న నటుడు శ్రీకాంత్
తమిళ నటుడు శ్రీకాంత్.. ఈ మధ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టులో హాజరు పరచగా.. తను చేసిన తప్పుని ఒప్పుకొన్నాడు. అసలు డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చాడు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తు పదార్థలు అలవాటు చేశాడని న్యాయస్థానానికి విన్నవించాడు. ప్రసాద్ తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని, డబ్బు అడిగిన ప్రతిసారి ఆయన కొకైన్ ఇచ్చేవాడని, అలా తనకు అది అలవాటు అయిపోయిందని శ్రీకాంత్ అన్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్?)తాను డ్రగ్స్ అమ్మలేదని, కేవలం తీసుకున్నానని శ్రీకాంత్ చెప్పాడు. తీసుకోవడం తప్పని తనకు తెలుసని, బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టుని కోరాడు. కానీ న్యాయస్థానం శ్రీకాంత్ అభ్యర్థని తిరస్కరించింది. జూలై 7 వరకు రిమాండ్ విధించింది. ఇక ఇదే కేసుతో సంబంధమున్న నటుడు కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. దొరకగానే అతడిని కూడా అరెస్ట్ చేయనున్నారు.'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న శ్రీకాంత్.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దాదా, స్టాప్ లాంటి స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీస్ చేశాడు. దళపతి విజయ్ 'స్నేహితుడు' చిత్రంలోనూ శ్రీకాంత్ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇతడు కాస్త డౌన్ అయ్యాడు. ఈ ఏడాది శ్రీకాంత్ చేసిన రెండు తమిళ మూవీస్, ఓ తెలుగు సినిమా 'ఎర్రచీర' రిలీజైంది. కాకపోతే అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే గనుక)