breaking news
Movie News
-
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ను రిలీజ్ చేశారు. గన్స్ అండ్ రోజెస్ అనే ఫుల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వ వేమూరి లిరిక్స్ అందించగా..హర్ష ఆలపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. -
లగ్జరీ కారు కొన్న కమెడియన్.. దివాళీ గిఫ్ట్ అంటూ పోస్ట్
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.కోటి 30 లక్షల విలువైన టయోటా కారును తనకు తానే గిఫ్ట్గా ఇచ్చుకున్నాడు. ఈ దిపావళికి సరికొత్త బహుమతిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొత్త కారుతో దిగిన ఫోటోలను తన తల్లిదండ్రులతో కలిసి ఇన్స్టా స్టోరీస్లో పంచుకున్నారు. కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ భామ కృతి సనన్ కూడా ఇదే కారును కొనుగోలు చేశారు. పలువురు బాలీవుడ్ అగ్రతారలు సైతం ఈ ఖరీదైన కారును కొన్నారు.అయితే ఈ ఏడాది ప్రారంభంలో సమయ్ రైనా తన యూట్యూబ్ షోలో ఇండియాస్ గాట్ లాటెంట్పై వివాదం మొదలైంది. ఈ వివాదం తర్వాత అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ఇండియాస్ గాట్ లాటెంట్ ఎపిసోడ్లను తన యూట్యూబ్ నుంచి తొలగించారు. వివాదం జరిగిన కొన్ని నెలల తర్వాత సమయ్ రైనా భారత్లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టు 15న బెంగళూరులో మొదలైన ప్రదర్శన ముంబయి, కోల్కతా, చెన్నై, పూణే, ఢిల్లీ లాంటి నగరాల్లో తన షోలు నిర్వహించాడు. -
బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. సోషల్ మీడియాలో పోస్ట్
బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యూటీ.. ఈ దివాళీని మరింత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోనుంది. తమకు బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు విషెస్ చెబుతున్నారు. కాగా.. 2023లో పరిణీతి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన పరిణీతి చోప్రా కనిపించింది. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్లో మాత్రమే నటించింది. ఇటీవల పరిణితి చోప్రా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో పాల్గొన్న తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకున్న సంగతి తెలిసిందే.(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో పరిణీతి చోప్రా.. పుట్టబోయే బిడ్డకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్!)అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. బాలీవుడ్లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి. View this post on Instagram A post shared by Raghav Chadha (@raghavchadha88) -
పిల్లలతో కలిసి సమంత దీపావళి సెలెబ్రేషన్స్ (ఫోటోలు)
-
టీమిండియా మహిళ స్టార్ క్రికెటర్తో పెళ్లి.. హింట్ ఇచ్చిన దర్శకుడు
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్ను పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్మృతి బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన పలాశ్ ముచ్చల్కు స్మృతితో పెళ్లి విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ముచ్చల్.. ఆమె త్వరలోనే ఇండోర్కు కోడలిగా రానుంది.. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే అంటూ ఆ వార్తలను ధృవీకరించారు.కాగా.. గతంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. స్మృతి బర్త్ డే సందర్భంగా అతను విషెస్ తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరు తమపై వస్ుతన్న ఊహాగానాలపై స్పందించలేదు. కాగా.. పలాష్ ముచ్చల్ ప్రస్తుతం 'రాజు బజేవాలా'మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అవికా గోర్, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు. ముచ్చల్ తన సోదరి పాలక్ ముచ్చల్తో కలిసి అనేక బాలీవుడ్ చిత్రాలకు సంగీతమందించారు.తాజాగా ఇవాళ ఇంగ్లాండ్తో టీమిండియా తలపడుతున్న సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు ముచ్చల్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందనకు నా శుభాకాంక్షలు' తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్లో గెలిచి దేశానికి కీర్తి తీసుకురావాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని అన్నారు. -
కోటిన్నర విలువైన కారు కొన్న ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ ఖరీదైన కారు కొనుగోలు చేసింది. తాజాగా మెర్సిడెస్-బెంజ్ను తన సొంతం చేసుకుంది. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ. 1.50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ కారు కొనడంతో తన డబ్బు అంతా అయిపోయిందని.. ఇప్పుడు ఈఎంఐ మాత్రమే అందుబాటులో ఉందని నియా శర్మ ఫన్నీగా పోస్ట్ చేసింది.కాగా.. ఢిల్లీకి చెందిన నియా శర్మ పదేళ్లకు పైగా బుల్లితెర నటిగా రాణిస్తోంది. 2010లో కాళీ - ఏక్ అగ్నిపరీక్ష సీరియల్తో తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత ఏక్ హజారోన్ మే మేరీ బెహ్నా హై షో సీరియల్తో ఫేమస్ అయింది. అంతేకాకుండా జమై రాజా, ఇష్క్ మే మార్జావాన్, నాగిన్- 4, సుహాగన్ చుడైల్ లాంటి షోలలో కనిపించింది. ఆమె చివరిసారిగా రియాలిటీ షో లాఫర్ చెఫ్స్ సీజన్- 2లో మెరిసింది. అయితే నియా బిగ్ బాస్లో పాల్గొంటుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాను బిగ్బాస్లో పాల్గొనడం లేదని సోషల్ మీడియా ద్వారా నియా స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం ఎలాంటి సీరియల్ను ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) -
నేషనల్ అవార్డ్ వచ్చినా సరే చెత్తకుండిలో పడేస్తా : విశాల్
నటుడు విశాల్కు తమిళ, తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. ఈ ఏడాదిలో మదగజరాజ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆపై నటి ధన్సికతో నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మకుటం చిత్రం కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు రవి అరసుతో పలు విభేదాలు రావడంతో ఈ మూవీని తానే తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఒక పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, అవార్డ్స్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో దుమారం అవుతున్నాయి.సినిమా, నటీనటులకు వచ్చే అవార్డ్స్ గురించి విశాలు ఇలా అన్నారు. కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో కేవలం ఏడెనిమిది మంది కలిసి ఒక జ్యురీగా ఏర్పడి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అంటూ అవార్డుల కోసం ఎలా ఎంపిక చేస్తారని విశాల్ అభిప్రాయపడ్డారు. ఇదంతా నాన్సెన్స్ అంటూనే తనకు జాతీయ పురస్కారం దక్కినా సరే చెత్తబుట్టలోనే పారేస్తానని ఆ ఇంటర్వ్యూలో అన్నారు. అవార్డులను తానంతగా నమ్మనని, అవి పనికిరాని విషయం అంటూ పేర్కొన్నారు. ఇది కేవలం తనకు అవార్డు రాకపోవడం వల్ల చేస్తున్న కామెంట్ కాదన్నారు. ఒకవేళ భవిష్యత్లో తనకు అవార్డ్ వచ్చినా సరే ఇదే మాటపై కట్టుబడి ఉంటానన్నారు. నిజమైన గుర్తింపు అనేది ప్రేక్షకుల నుంచి మాత్రమే వస్తుందనే క్లారిటీ తనకు ఉందన్నారు. తాను ఎప్పటికీ అది మాత్రమే నమ్ముతానని విశాల్ చెప్పారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సినిమా కోసం ఎలాంటి స్టంట్స్ అయినా సరే తానే స్వయంగా చేస్తానని విశాల్ అన్నారు. దీంతో ఇప్పటి వరకు చాలా గాయాలు అయ్యాయి అన్నారు. ఇప్పటివరకూ 119 కుట్లు పడ్డాయని విశాల్ చెప్పారు. తన సినిమాలకు డూప్ ఉండరని క్లారిటీ ఇచ్చారు. డూప్తో చేయించడం తనకు ఇష్టం లేదన్నారు. "I don't believe in awards🏆. Awards are Bull sh!t. 8 people can't decide what 8 Crore people will like❌. I'm saying including national Awards. Not because I don't get awards. If they give awards, I will just throw in Dustbin🚮"- #Vishal recent podcastpic.twitter.com/IjsO6CIoYL— AmuthaBharathi (@CinemaWithAB) October 18, 2025 -
పవన్ కల్యాణ్ సినిమాలో యాక్ట్ చేయను: కిరణ్ అబ్బవరం
ఈ సారి దీపావళికి థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ఏకంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె-ర్యాంప్ ఒకటీరెండు రోజుల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటన్నింటిలో కె-ర్యాంప్ సినిమాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఈ పండక్కి హాయిగా నవ్వుకునేలా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.షార్ట్ ఫిలింస్ నుంచి హీరోగా..దీంతో కిరణ్ అబ్బవరానికి (Kiran Abbavaram) పెద్ద హిట్టే అందినట్లు కనిపిస్తోంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇతడు మాట్లాడుతూ.. సైడ్ క్యారెక్టర్లు చేయనని చెప్తున్నాడు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. రచయిత అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. అనుకోకుండా షార్ట్ ఫిలింస్ చేశాను. నాకంటూ ఏదో గుర్తింపు కావాలనిపించింది. షార్ట్ ఫిలింస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో రాజావారు రాణిగారు సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ హిట్టవడంతో పేరొచ్చింది. లైఫ్ చేంజ్జనాల్లోకి వెళ్లాలంటే ఏం చేయాలి? అని ఆలోచించి ఎస్ఆర్ కళ్యాణమండపం కథ రాసుకున్నాను. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. కాలేజీలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానినే! ఆయన సినిమాలు ఎంజాయ్ చేశాను. కానీ, సినిమా ఇండస్ట్రీకి వచ్చాక జీవితం మారిపోయింది. హీరోగా నా కెరీర్ను నిర్మించుకునే పనిలో ఉన్నాను. క్యారెక్టర్స్ చేయనుపెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నా.. నాకంటూ సొంత గుర్తింపు కోరుకుంటున్నా.. కాబట్టి ఈ సమయంలో క్యారెక్టర్స్ చేయలేను. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేస్తా! ఒకవేళ.. కిరణ్ అబ్బవరం మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అంటే అప్పుడు కచ్చితంగా చేస్తాను. కేవలం పవన్ సినిమాలో కనిపించాలని మాత్రం చేయను అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.చదవండి: ఏంటి సంజనా.. నీకు, నాకు పెళ్లిచూపులా?: నాగార్జున -
బిగ్బాస్ కోసం జాబ్ వదిలేశాను.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీజ
బిగ్బాస్ 9 నుంచి దమ్ము శ్రీజను ఎలిమినేషన్ పేరుతో కావాలనే హౌస్ నుంచి పంపించేశారని ప్రేక్షకుల అభిప్రాయం. దీంతో రీఎంట్రీ కోసం ఆమెకు మద్ధతు కూడా తెలిపారు. అయితే, బిగ్బాస్ మనసు మాత్రం కరగలేదు. తనకు నచ్చిన వారిని మాత్రమే హౌస్లో ఉంచుతాననే సంకేతాన్ని ఈ సీజన్తో బిగ్బాస్ ఇచ్చేశాడు. దీంతో ఈ షో అంతా ఒక ఫేక్ అంటూ ఓట్లేసిన వారే అంటున్నారు. తమ ఓటింగ్తో సంబంధం లేకుండా శ్రీజను ఎలా ఎలిమినేట్ చేస్తారని ఫైర్ అయ్యారు. అయితే, ఎన్నో ఆశలతో బిగ్బాస్లోకి అడుగుపెట్టిన శ్రీజ మాత్రం ఇప్పటికీ ఆ ట్రామా నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. తాజాగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో షేర్ చేసింది.శ్రీజ తండ్రి విశాఖ మున్సిపాలిటీ 92వ వార్డులో పారిశుధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. చిన్న తనం నుంచే కష్టాలతో పెరిగిన శ్రీజ కూడా చాలా కష్టపడి చదవి ఉన్నత చదువులు పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నెలకు రెండు లక్షలకు పైగా జీతంతో ఉద్యోగం సాధించింది. అయితే, ఇండస్ట్రీ మీద ఉన్న ఫ్యాషన్తో బిగ్బాస్ వైపు అడుగులేసింది. అందులో ఛాన్స్ రాగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. కానీ, బిగ్బాస్ మాత్రం ప్రేక్షకుల ఓటింగ్స్తో సంబంధం లేకుండా ఆమెను హౌస్ నుంచి పంపించేశాడు. దీంతో ఆమె జీవితంలో తీరని నష్టాన్ని బిగ్బాస్ మిగిల్చాడని చెప్పవచ్చు.ఉద్యోగం కూడా వదిలేశాను: శ్రీజబిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు. దీపావళి సెలబ్రేషన్స్ టైమ్లో హౌస్లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అగ్నిపరీక్ష దాటుకునేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవల్స్ దాటుకొని అక్కడి వరకు చేరుకున్నాను. బిగ్బాస్ కోసం ఒక పర్మినెంట్ టాటూ కూడా చేతిపై వేయించుకున్నాను. ఈ షో కోసం నా జాబ్ను కూడా వదులుకున్నాను. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుపు కోసం వంద శాతం ప్రయత్నం చేసిన సరే లక్ కలిసిరాలేదు. ఎలిమినేషన్ రౌండ్లో కూడా ప్రతి టాస్క్లో చివరి వరకు వెళ్లాను. కానీ, గెలుపు మాత్రం దక్కలేదు. ఇప్పటి వరకు జరిగిన బిగ్బాస్ సీజన్స్లో కూడా నా మాదిరి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. 5వారాలు హౌస్లో ఉన్నా కూడా ఒక జర్నీ లేకుండానే బయటకు వచ్చేశాను. అని కన్నీళ్లు పెట్టుకుంది. View this post on Instagram A post shared by Srija Dammu (@srija_sweetiee) -
ఓటీటీలోకి చావును వెంటాడే సినిమా.. ధైర్యం ఉంటేనే చూడండి (రివ్యూ)
ఈ వీకెండ్లో మీరు అదిరిపోయే సినిమా చూడాలని అనుకుంటున్నారా..? అయితే, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్(Final Destination Bloodlines) చిత్రాన్ని చూసేయండి. అయితే, ఇందులో హింసాత్మకమైన సీన్స్ ఉంటాయి. మిమ్మల్ని కలవరపరిచే ఛాన్స్ ఉంది. కాబట్టి సున్నితమైన వారు, చిన్న పిల్లలు దూరంగా ఉండటం మంచిది. ఫైనల్ డెస్టినేషన్ మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, అక్టోబర్ 16న జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో అదిరిపోయే సూపర్ థ్రిల్లర్ సినిమా చూడాలనే ఆసక్తి ఉంటే దీనిని వదులుకోకండి. రూ.440 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2700 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ మూవీ రన్టైమ్ కేవలం 1:50 మాత్రమే.ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ ఏడాది పార్ట్-6 విడుదలైంది. చివరిగా 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 తర్వాత సుమారు 14 ఏళ్లకు ఈ ఫ్రాంఛైజీ నుంచి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్ వచ్చింది. ఈ మూవీని దర్శకులు జాక్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టీన్ తెరకెక్కించారు. కైట్లిన్ శాంటా జువానా, రిచర్డ్ హార్మన్, టోనీ టాడ్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.మన కుటుంబంలోని వ్యక్తులు ఏ విధంగా మరణిస్తారో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? ఇదే కాన్సెప్ట్తో సినిమా కొనసాగుతుంది. అయితే, నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ మూవీని తీశామని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఈ ఫ్రాంఛైజీలోని 5 సినిమాలు కూడా ఇదే రేంజ్లో ఉంటాయి. తాజాగా విడుదలైన పార్ట్-6 కథ విషయానికి వస్తే.. 1968లో ఓ స్కై వ్యూ హోటల్లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (బ్రెక్ బాసింగర్). జరగబోయే ప్రమాదం గురించి ఆమె పసిగట్టేస్తుంది. అయితే, వారి ఆయుష్షు తీరినా కూడా ఐరిస్ తెలివిగా కొందరిని కాపాడుతుంది. ఎంతో ఘోరమైన ప్రమాదంలో చాలామంది దారుణమైన రీతిలో మరణిస్తారు. కానీ ఐరిస్ వల్ల కొందరు ప్రాణాలతో బయటపడతారు. చావును ఎదిరించి ప్రాణాలతో ఉన్న వారిని ఒక్కొక్కరిగా చావు తరుముతూ వస్తుంది. అయితే, ఒక ఆర్డర్ ప్రకారమే వారు మరణిస్తారు. ఈ క్రమంలోనే వారందరినీ కాపాడిని ఐరిస్ వంతు ఒకరోజు వస్తుంది. ఆమె మరణిస్తే తన తర్వాతి కుటుంబ సభ్యులు కూడా చనిపోతారని గ్రహిస్తుంది. ఈ ఆర్డర్ను తప్పించేందుకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? చావును ఎదిరించి ఎలా బతికింది..? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఐరిస్ చాలా పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ఏంటి..? ఫైనల్గా తన కుటుంబ సభ్యులను కాపాడుకుందా..? ఈ క్రమంలోనే ఆమె మనవరాలు స్టేఫినీ (కైట్లిన్ శాంటా జువానా) చేసిన సాహసం ఏంటి..? అనేది తెలియాలంటే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్ చూడాల్సిందే. ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సీన్లు ఉండవ్.. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ, ఘోరమైన ప్రమాదాలు కలవరపరిచేలా ఉంటాయి.ఫైనల్ డెస్టినేషన్ కథ సింపుల్గానే ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తూ.. సస్పెన్స్ తో కూడిన డెత్ సీన్స్ ట్రీట్ ఇస్తాయి. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఆడియెన్స్ ఈ మూవీకి దూరంగా ఉండటం మంచింది. మనిషి జీవితంలో మరణం ఏ రీతిలో పలకరిస్తుంది ముందే తెలుసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. -
హైదరాబాద్లో షూటింగ్స్ సందడి
కొందరు సెట్స్లో... కొందరు నేచురల్ లొకేషన్స్లో... ఇలా హైదరాబాద్లో షూటింగ్ చేస్తూ ఈ వారం అంతా బిజీ బిజీగా గడిపారు కొందరు స్టార్స్. ఆదివారం, దీపావళికి సోమవారం బ్రేక్ తీసుకోనున్న స్టార్స్ కొందరైతే... హాలిడే లేకుండా షూట్లో పాల్గొననున్న స్టార్స్ కూడా ఉన్నారు. ఇక గత ఆరేడు రోజులుగా హైదరాబాద్లో ఏయే సినిమాల షూటింగ్స్ జరి గాయో తెలుసుకుందాం.సెట్లో శంకరవరప్రసాద్... చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత చిరంజీవి, నయనతార జోడీగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయితే ‘గాడ్ఫాదర్’ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో హీరో వెంకటేశ్, హీరోయిన్ కేథరిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవి, నయనతార, కేథరిన్, నటుడు సచిన్ ఖేడేకర్లతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది.ఆర్ఎఫ్సీలో అడ్వెంచర్ మహేశ్బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). రామ్చరణ్, ఎన్టీఆర్లతో ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రధారులు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తు్త్తన్నారు. ఈ సినిమా కోసం మహేశ్బాబు పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ మహేశ్బాబుకి సంబంధించిన ఎలాంటి లుక్ అధికారికంగా చిత్రయూనిట్ విడుదల చేయలేదు. అయితే చిత్రీకరణ సమయంలోని కొన్ని ఫొటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే.అమేజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. సూపర్ స్టార్ మహేశ్బాబు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకీ లభించని ఘనత ‘ఎస్ఎస్ఎమ్బీ 29’కి దక్కనుందని టాక్. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కెన్యా దేశంలో ఈ సినిమా చిత్రీకరణని ΄్లాన్ చేశారు రాజమౌళి. ఇప్పటికే ఆయన అక్కడి లొకేషన్స్ని కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ ఈ నవంబరులో రానుండటంతో అందరిలో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది.యాక్షన్ ఎంటర్టైనర్... పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్సింగ్’ (2012) తర్వాత హీరో పవన్ కల్యాణ్– డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రమిది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్ని తెరకెక్కిస్తున్నారట హరీష్ శంకర్. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందట. నవంబరు చివరికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని ఫిల్మ్నగర్ టాక్.హిట్ కాంబినేషన్లో... హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరిలది హిట్ కాంబినేషన్ అని చెపొ్చ్చు. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ (2023) మూవీ బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ హిట్ కాంబోలో వస్తున్న ద్వితీయ చిత్రం ‘ది ΄్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ మూవీ కోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్లో చిత్రీకరిస్తున్నారు. నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటోందట.ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్. గతంలో విడుదల చేసిన స్టిల్లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్లో కనిపించిన సంగతి తెలిసిందే. హీరో లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్. ‘దసరా’ వంటి హిట్ కాంబినేషన్లో వస్తున్న ‘ది ΄్యారడైజ్’ పై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.ఓ వీరాభిమాని కథ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ చిత్రాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలుపోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది.ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోని రైల్వేస్టేషన్లో హీరో రామ్పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు మహేశ్బాబు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. రామ్తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై పలు సన్నివేశాలను తీస్తున్నారట దర్శకుడు. ఈ సినిమాలో ఉపేంద్ర ఓ స్టార్ హీరోగా నటిస్తుండగా ఆయన వీరాభిమాని పాత్రలో రామ్పోతినేని నటిస్తున్నారు. తన అభిమాన హీరో కోసం ఈ వీరాభిమాని ఏం చేశాడు? అన్నది తెలియాలంటే నవంబరు 28 వరకు వేచి ఉండాలి. ఈ చిత్రం అదే రోజు విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి హిట్ మూవీ తర్వాత ‘విరూపాక్ష’ (2023) మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘ఎన్సీ 24’ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరితో పాటు ఇతర నటీనటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్లో కనిపించిన నాగచైతన్య ‘ఎన్సీ 24’లో స్టైలిష్గా సరికొత్త లుక్తో కనిపించనున్నారు. అదే విధంగా మీనాక్షీ చౌదరి కూడా సరికొత్త పాత్రలో కనిపిస్తారు. రాయలసీమ నేపథ్యంలో... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ‘లెనిన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అఖిల్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు మురళీ కిశోర్.రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్, గెడ్డంతో మాస్ లుక్లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమాలో తొలుత శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. శ్రీలీల స్థానాన్ని ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ సినిమాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేశారట. అయితే హీరోయిన్ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్.యాక్షన్... ఎమోషన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పూరిసేతుపతి’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్కుమార్, బ్రహ్మాజీలతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట పూరి జగన్నాథ్. తనదైన మాస్, కమర్షియల్ స్టయిల్లో ఒక యునిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారట పూరి. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ముచ్చింతల్లో మహాకాళి ‘హనుమాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో రూపొందిన తొలి చిత్రం ‘హను–మాన్’ (2024) పాన్ ఇండియా బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారు ప్రశాంత్ వర్మ. అందులో భాగంగా ఈ యూనివర్స్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షో రన్నర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. నటీనటుల వివరాలను మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అసురుల గురువు శుక్రాచార్యుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ఫస్ట్ లుక్ని మాత్రం ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ‘మహాకాళి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. నటీనటులపై కీలకసన్నివేశాలు తీస్తున్నారు మేకర్స్. డిసెంబరు నెలాఖరుకి ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా ప్రస్తుతం హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
మూవీ రివ్యూవర్స్పై కె-ర్యాంప్ నిర్మాత ఆవేదన
ఈ దీపావళి సందర్భంగా కిరణ్ అబ్బవరం నటించిన ‘కె- ర్యాంప్’(K- Ramp Review) సినిమా నేడు (అక్టోబర్ 18) విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే, తాజాగా ఈ చిత్ర నిర్మాత రాజేశ్ దండ రివ్యూవర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాకి కొందరు ఇచ్చిన రేటింగ్స్ చూసి చాలా బాధపడినట్లు ఆయన పేర్కొన్నారు. కొందరు రివ్యూవర్లు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆవేదన చెందారు.మీడియా సమావేశంలో కె- ర్యాంప్ చిత్ర నిర్మాత రాజేశ్ ఇలా అన్నారు. 'ఈ సినిమా కేవలం నవ్వుకునేందుకు మాత్రమే తీశాం. ఇందులో లాజిక్స్ వెతకాలని చూస్తే ఏం చేయలేం. మా సినిమాకు రివ్యూవర్లు ఇచ్చిన రేటింగ్స్ చూసి చాలా బాధపడ్డాను. మీ అభిప్రాయాన్ని నేను తప్పకుండా అంగీకరిస్తాను. కానీ, ఇక్కడ ఒక పొరపాటు జరుగుతుంది. మా లాంటి చిన్న నిర్మాతల మీద వివక్ష చూపుతున్నారు. సోషల్మీడియాలో కొన్ని సినిమాలకు ఫస్టాఫ్ రివ్యూ ఇచ్చేసి కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాతే సెకండాఫ్ రివ్యూ ఇస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు..?మరికొందరు మాత్రం రివ్యూ షేర్ చేసి చాల సమయం తర్వాతే రేటింగ్ ఇస్తున్నారు. నేను చిన్న నిర్మాతననే ఇలా చేస్తున్నారా.. ఈ సమస్య నాకు మాత్రమే కాదు . ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మీరు రివ్యూ ఇచ్చేందుకు బాహుబలి లాంటి సినిమాకు ఎంత శ్రద్ధ పెడుతారో కె- ర్యాంప్ లాంటి చిత్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ, కొందరు వివక్ష చూపుతున్నారు. ఇలాంటి దోరణి ఇకనైనా మారాలి.' అని ఆయన అన్నారు.నిర్మాత రాజేశ్ వ్యాఖ్యలపై నెటిజన్లు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా బాగుందంటూ ఆయనకు ఆండగా నిలబడుతున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరం నటన సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఆపై హీరోయిన్ యుక్తి తరేజా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నప్పటికీ అంతే రేంజ్లో దుమ్మురేపిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
'కురుక్షేత్ర-2' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యానిమేషన్ చిత్రం'మహావతార్ నరసింహా' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీంతో ఇదే ట్రెండ్ను పలు సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కురుక్షేత్ర యానిమేటెడ్ చిత్రం కొద్దిరోజుల క్రితం నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ మూవీకి కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. దీంతో పార్ట్-2 ను దర్శకుడు ఉజాన్ గంగూలీ రూపొందించారు. తాజాగా కురుక్షేత్ర-2 ట్రైలర్ను షేర్ చేశారు. అక్టోబర్ 24న నెట్ఫ్లిక్స్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది.'కురుక్షేత్ర-1' కథేంటి?అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత పాండవులకు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు.. రాజ్యంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాట తప్పుతారు. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఓపిగ్గానే ఉంటారు. సంజయుడితో కౌరవులకు రాయబారం పంపిస్తారు. కానీ అది విఫలమవుతుంది. కౌరవులు.. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్నారనే విషయం పాండవులకు తెలుస్తుంది. దీంతో కృష్ణుడు, అర్జునుడు వైపు.. కృష్ణుడి సైన్యం దుర్యోధనుడికి దక్కుతుంది. అలా 'కురుక్షేత్రం' మొదలవుతుంది. ఆయుధాలే పట్టనని అనుకున్న అర్జునుడు.. కృష్ణుడి గీతోపదేశం తర్వాత ఎలా మారాడు? ఈ యుద్ధంలో అసలేం జరిగిందనేది అసలు కథ? -
మెడికల్ స్టోర్లో సేల్స్మెన్గా పనిచేస్తున్న తెలుగు హీరో!
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా కూడా శివ కుమార్ రామచంద్రవరపు మెప్పించాడు. ప్రస్తుతం ఆయన ఒక మెడికల్ షాప్లో సేల్స్మెన్గా పనిచేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. తన కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాకుండా విలన్గా కూడా పలు సినిమాల్లో నటించాడు. గతేడాదిలోనే ఆయన హీరోగా నటించిన చిత్రం నరుడి బ్రతుకు నటన విడుదలైన విషయం తెలిసిందే. నిన్నుకోరి, వకీల్ సాబ్, తొలిప్రేమ, మజిలీ వంటి చిత్రాలతో శివ కుమార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మల్టీ టాలెంట్ ఉన్న శివ కుమార్ ఇలా మెడికల్ షాప్లో పనిచేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.అయితే, శివ కుమార్కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. సినిమా ఛాన్సులు లేకపోవడంతో తెలంగాణలోని సూర్యాపేటలో ఒక మెడికల్ షాపులో ఆయన పనిచేస్తున్నట్లు ఒక వీడియో ఫుటేజ్ సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. షాప్లోకి వచ్చిన కస్టమర్స్కు మెడిసిన్స్ ఇస్తూ శివ కుమార్ కనిపించారు. దీంతో నెటిజన్లు కూడా ఆయన్ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. దొంగతనం, డ్రగ్స్ అమ్మడం వంటి పనులు చేయడం లేదు కదా అంటూ అతన్ని ప్రశంసిస్తున్నారు. కొందరైతే ఆ షాప్ తనదే ఉండొచ్చిన కూడా అంటున్నారు.టాలీవుడ్లో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసిన శివ కుమార్ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం అంటూ జరగదని కొందరు నెటిజన్లు తెలుపుతున్నారు. అదంతా ఏదైనా సినిమా, వెబ్ సీరిస్ కోసం ఉండొచ్చని పేర్కొంటున్నారు. మెడికల్ షాప్లో సేల్స్మెన్గా పనిచేసే అవసరం ఆయనకు లేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే, అసలు విషయం తెలియాల్సి ఉంది. -
ఓటీటీలో 'ఓజీ'.. అధికారికంగా ప్రకటన
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ నటించిన‘ఓజీ’ (OG) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది. సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ తదితరులు నటించారు. 'హరి హర వీరమల్లు' వంటి భారీ డిజాస్టర్ తర్వాత వచ్చిన ఓజీ కాస్త పర్వాలేదనిపించింది.ఓజీ సినిమా అక్టోబర్ 23 నుంచి ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ,తమిళ్, కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన ఓజీ ఆ తర్వాత ఆశించినంత రేంజ్లో కలెక్ట్ చేయలేదు. కాంతార సినిమా విడుదల తర్వాత చాలాచోట్ల ఓజీ చిత్రాన్ని తొలగించేశారు కూడా. దీంతో ఓజీ బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.ఓజీ కథేంటి..?ఓజీ కథ అంతా 1970-90ల మధ్యకాలంలో జరుగుతుంది. జపాన్లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్) ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(ప్రకాశ్రాజ్)పై అటాక్ జరిగితే.. రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్ట్ని నిర్మించి.. సత్యదాదా డాన్గా ఎదుగుతాడు. అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకొని నాసిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు.ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ)తో పాటు తన కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నగరాన్ని తమ గుప్పిట్లో పెటుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్లో ఉన్న తన కంటేనర్ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్లో ఉన్న ఓమీ.. ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్ట్ని స్వాధీనం చేసుకొని.. అతడి మనుషులను దారుణంగా చంపేస్తాడు. అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటేనర్లో ఉన్న విలువలైన వస్తుంలేంటి? సత్యాదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ప్లాష్బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘కె-ర్యాంప్’ మూవీ రివ్యూ
ఈ దీపావళికి ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమాగా ‘కె- ర్యాంప్’(K- Ramp Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? కిరణ్ అబ్బవరం ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కుమార్ అబ్బవరం(కిరణ్ అబ్బవరం) రిచ్ కిడ్. ఎంసెంట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ..చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న(సాయి కుమార్) ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్.. తొలి చూపులోనే క్లాస్మేట్ మెర్సీ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. మెర్సీ కూడా కుమార్ని ఇష్టపడుతుంది. ఇద్దరి ఫ్యామిలీకీ వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో మెర్సికి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందనే విషయం తెలుస్తుంది. ఆమెకు ఉన్న వ్యాదితో కుమార్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాది ఎలా సోకింది? దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? ఈ కథలో నరేశ్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ప్రమోషన్స్లో చెప్పినట్లుగానే ఇది కామెడీతో కూడిన కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలలో లాజిక్స్ గురించి వెతుకొద్దు. కథలో కొత్తదనం, ట్విస్టులు కూడా పెద్దగా ఆశించొద్దు. ఊరమాస్ కామెడీ సీన్లతో ఫన్ జనరేట్ చేస్తే చాలు.. ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. నూతర దర్శకుడు జైన్స్ నాని అదే పని చేశాడు. కథపై దృష్టిపెట్టకుండా హీరో కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్కి తగ్గట్లుగా సీన్లను పేర్చుకుంటూ వెళ్లాడు. అవి హిలేరియస్ అనిపించాయి. రొటీన్ కామెడీ స్టోరీకి చివరిలో ఎమోషనల్ టచ్ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరో పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ కథ ప్రారంభం అవుతుంది. ఇక కిరణ్ అబ్బవరం ఎంట్రీ సీన్ థియేటర్స్లో ఈళలు వేయిస్తుంది. రాజశేఖర్ సినిమా పాటలకు ఆయన వేసే స్టెప్పులు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథంతా రొటీన్గానే సాగుతుంది. కుమార్ కేరళకు వెళ్లడం.. మెర్సీని చూసి ప్రేమలో పడడం.. ఆమె కోసం చేసే పనులు ఇవ్వన్నీ రెగ్యులర్ సినిమాల్లో చూసినట్లుగానే ఉంటాయి. కొన్ని ఊరమాస్ సన్నివేశాలు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్గానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం హీరోయిన్ ఉన్న ఆరోగ్య సమస్యతో హీరో ఎలా ఇబ్బందికి గురయ్యాడనేదే చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిశోర్ పాత్ర ఎంట్రీ తర్వాత ఫన్ డోస్ ఇంకాస్త పెరుగుతుంది. ఒకవైపు వెన్నెల కిశోర్.. మరోవైపు నరేశ్..వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు..ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్గా సాగుతుంది. నరేశ్ చెప్పే మాటలు.. సాయి కుమార్-కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. నరేశ్ పాత్ర చెప్పే కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. లాజిక్స్, కొత్తదనం ఆశించకుండా థియేటర్స్కి వెళితే.. హాయిగా నవ్వుకొవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రానికి కిరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. యాక్షన్, ఫన్తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకు ప్లస్ అయింది. అరుదైన వ్యాధి ఉన్న మెర్సీ పాత్రలో యుక్తి తరేజా ఒదిగిపోయింది. ఫస్టాఫ్లో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు కానీ.. సెకండాఫ్లో మాత్ర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై కిరణ్-యుక్తిల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే కిరణ్ పాత్ర పూరి జగన్నాథ్ సినిమాల్లోని హీరోని గుర్తు చేస్తే.. యుక్తి పాత్ర మారుతి సినిమాల్లోని హీరోయిన్ని గుర్తు చేస్తుంది. ఇక వీకే నరేశ్ పాత్ర ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి నవ్వులు పూశాయి. అయితే ఆయనకు ఇంకొన్ని సీన్లు పడితే బాగుందనిపించింది. ఇక వెన్నెల కిశోర్ కనిపించేది కాసేపే అయినా.. ఆ ఎపిసోడ్ అదిరిపోతుంది. సాయి కుమార్, మురళీధర్ గౌడ్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారంగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను తెరపై బాగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉన్నాయి. -
25 ఏళ్లకే పెళ్లి చేసుకున్న దంగల్ నటి
దంగల్ ఫేమ్ జైరా వాసిం (Zaira Wasim) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. తాజాగా ఆమె పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నిఖా జరిగినట్లు రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో తన ముఖం చూపించలేదు కానీ భర్తతో నెలవంకను చూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.దంగల్తో ఫేమ్16 ఏళ్ల వయసులో దంగల్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది జైరా. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇందులో చిన్నప్పటి గీతా ఫొగట్ పాత్రలో యాక్ట్ చేసింది జైరా. ఈ మూవీకిగానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత సీక్రెట్ సూపర్స్టార్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. సినిమాలకు గుడ్బైaఈ రెండు సినిమాలకుగానూ నేషనల్ చైల్డ్ అవార్డు గెలుచుకుంది. ఆమె నటించిన మూడో సినిమా ద స్కై ఈజ్ పింక్. ఇదే తన ఆఖరి సినిమా! తన విశ్వాసాలకు ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో సినిమా ఇండస్ట్రీకి గుడ్బై చెప్పింది. సోషల్ మీడియాలో ఉన్న తన ఫొటోలను డిలీట్ చేయాలని అభిమానులను కోరింది. View this post on Instagram A post shared by Zaira Wasim (@zairawasim_) చదవండి: ఒక్క టాస్క్కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం -
నువ్వు నాదానివే..!
నచ్చిన డిజర్ట్ కళ్ల ముందు ఊరిస్తుంటే ఎవరికైనా నోరారా ఆరగించాలని అనిపిస్తుంది. రష్మికా మందన్నాకూ అలానే అనిపించింది. కానీ రష్మిక తినలేని పరిస్థితి. ఎందుకంటే... ప్రస్తుతం రష్మికా మందన్నా ఓ స్పెషల్ డైట్ను ఫాలో అవుతున్నారట. ఇందులో భాగంగా జిమ్లో స్పెషల్ వర్కౌట్స్ చేస్తున్నారు. అలాగే ఈ డైట్ మెనూలో రోజూ స్వీట్ తినకూడదు. దీంతో తన కళ్ల ముందు ఉన్న డిజర్ట్ను తినలేక పోతున్నానన్న బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ, ‘డియర్ డిజర్ట్... నువ్వు ఎప్పటికీ నా దానివే.కానీ ఈ రోజు కాదు’ అనే క్యాప్షన్తో ఇన్స్టాలో రష్మిక ఓ వీడియోను షేర్ చేయగా, వైరల్ అవుతోంది. ‘‘ఫిట్నెస్ కారణంగా సినిమా స్టార్స్ తమకు ఇష్టమైన ఆహారానికి దూరం కావాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్స్ మెరుపు తీగలా ఉండటం కోసం నచ్చిన ఆహారాన్ని త్యాగం చేస్తారు... ఇలాంటి త్యాగాలు తప్పవు’’ అని నెటిజన్లు స్పందిస్తున్నారు.ఇక రష్మికా మందన్నా నటించిన హిందీ చిత్రం ‘థామా’ ఈ నెల 24న విడుదల కానుంది. అలాగే రష్మిక లీడ్ రోల్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబరు 7న రిలీజ్ కానుంది. అలాగే ‘మైసా’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్, హిందీలో ‘కాక్టైల్ 2’తో పాటు మరో రెండు సినిమాలతో రష్మిక ఎప్పటిలానే బిజీ బిజీ. -
జోడీ రిపీట్?
నాగార్జున కెరీర్లోని వందో సినిమా ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ద్వి పాత్రాభినయం చేస్తున్నారని, కథలో ముగ్గురు హీరోయిన్లకు చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ హీరోయిన్గా టబు ఖరారయ్యారనే వార్తలు తెరపైకి వచ్చాయి.తాజాగా మరో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ అనుష్కా శెట్టిని సంప్రదించారని టాక్. ఇక 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమాలో నాగార్జున, అనుష్కా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత ‘డాన్’ (2007), ‘రగడ’ (2010), ‘ఢమరుకం’ (2012) చిత్రాల్లో నాగార్జున, అనుష్క నటించారు.అలాగే నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016)లో అతిథి పాత్ర చేశారు అనుష్క. ఇంకా నాగార్జున భక్తుడిగా నటించిన ‘ఓం నమో వేంకటేశాయ’ (2017)లో భక్తురాలిగా ఆమె నటించారు. ఇంకో విషయం ఏంటంటే... నాగార్జున హీరోగా నటించిన ‘కింగ్’ (2008)లో ఓ పాటలో నటించిన అనుష్క ఇప్పుడు ‘కింగ్ 100’లో హీరోయిన్గా కనిపిస్తారా? నాగ్–అనుష్కల జోడీ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
ఫిబ్రవరిలో ప్రారంభం
‘రంగస్థలం’ (2018) వంటి బ్లాక్బస్టర్ చిత్రం తర్వాత హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దుబాయ్లో జోరుగా జరుగుతున్నాయని తెలిసింది. గతంలో రామ్చరణ్, సుకుమార్ కలిసి ఈ సినిమా కథా చర్చల కోసం దుబాయ్లో సమావేశమైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ దుబాయ్లో ఉంటూ, ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. రామ్చరణ్ కెరీర్లోని ఈ 17వ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుందట.ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కృతీ సనన్, సమంత వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంతో రామ్చరణ్ బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలోని ఈ సినిమా వచ్చే మార్చి 27న రిలీజ్ కానుంది. -
బ్లూ శారీలో సీతారామం బ్యూటీ.. ఆదితి రావు హైదరీ స్టన్నింగ్ లుక్!
బ్లూ శారీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. హీరోయిన్ శ్రియా శరణ్ డిఫరెంట్ అవుట్ఫిట్.. సింగర్ శ్రేయా ఘోషల్ దివాళీ సెలబ్రేషన్స్.. క్రేజీ అవుట్ఫిట్లో సోనాలి బింద్రే హోయలు.. స్టన్నింగ్ లుక్లో ఆదితి రావు హైదరీ.. View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
కాంతార చాప్టర్ 1 బ్లాక్బస్టర్ హిట్.. వారణాసిలో ప్రత్యేక పూజలు
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కన్నడ హీరో వారణాసిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. కాంతార మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్లో రిషబ్ శెట్టి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది దసరా కానుకగా కాంతార: చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతారకు ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమా.. కేవలం 16 రోజుల్లోనే రూ. 717 కోట్ల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే పలు స్టార్ హీరోల చిత్రాలను సైతం అధిగమించింది. శాండల్వుడ్ చరిత్రలోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్నాథ్ సంగీతమందించారు. -
డీజీపీని కలిసిన మంచు మనోజ్ దంపతులు
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉందని ట్వీట్లో రాసుకొచ్చారు.మంచు మనోజ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'నేను, నా భార్య మౌనిక గౌరవనీయులైన డీజీపీ శివధర్రెడ్డిని కలిశాం. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉంది. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ప్రయాణం క్రమశిక్షణ, ధైర్యం, నైతిక పోలీసింగ్ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.Me and my wife @BhumaMounika met Shri B. #ShivadharReddy Garu, the new @TelanganaDGP 💐Delighted to see a leader of integrity and vision take charge. His journey from the grassroots to the top reflects discipline, courage, and an unshakable commitment to ethical policing.… pic.twitter.com/0f4g3YS7FP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 17, 2025 -
నేరుగా ఓటీటీకే సూపర్ నేచురల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. ఆడియన్స్ సైతం డిజిటల్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మరో సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. మానవ్ కౌల్, భాషా సుంబ్లి నటించిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 7న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ పంచుకున్నారు. ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. కశ్మీర్లోని బారాముల్లా లోయ ప్రాంతానికి చెందిన డిఎస్పీ రిద్వాన్ సయ్యద్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిద్వాన్ బదిలీపై వచ్చిన వెంటనే ఓ యువకుడు అదృశ్యమవుతాడు? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే బారాముల్లా కథ. ఈ చిత్రాన్ని బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య, లోకేష్ ధార్తో కలిసి జ్యోతి దేశ్పాండే నిర్మించారు. Welcome to the town, where truth is a myth, and myths have truth. Enter the world of ‘Baramulla’ on 7th November. Only on Netflix.#BaramullaOnNetflix pic.twitter.com/pB7swLUIYm— Netflix India (@NetflixIndia) October 17, 2025 -
మెగా కోడలి సస్పెన్స్ థ్రిల్లర్.. సడన్గా ఓటీటీకి!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన చిత్రం టన్నెల్(Tunnel). కోలీవుడ్ హీరో అథర్వా మురళి సరసన ఈ చిత్రంలో కనిపించింది. తమిళంలో తనల్(Thanal) పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీకి రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లచ్చురామ్ ప్రొడక్షన్స్పై ఎ. రాజు నాయక్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అథర్వ పోలీస్ ఆఫీసర్గా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్గా మెప్పించారు.తాజాగా ఈ చిత్రం నెల రోజులైనా కాకముందే ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. క్రూరమైన హత్యలకు పాల్పడుతున్న ఓ సైకోను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
హీరోయిన్ను అలా టచ్ చేసిన సౌబిన్.. వీడియో వైరల్
సందట్లో సడేమియా... శునకానందం పొందాలయా...అన్నట్టుగా మారుతోంది కొందరు ప్రబుద్ధుల ప్రవర్తన. అభిమానం పేరిట అసభ్యత ముదురుతోంది. ముఖ్యంగా హీరోయిన్లపై అది అనుచితంగా మారుతోంది. రకరకాల కారణాలతో జన సమూహాల్లోకి వస్తున్న కధానాయికలను అసభ్యకరంగా తాకకూడని చోట తాకుతున్న సంఘటనలు కంపరం కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలలో బాధితులుగా మారిన పలువురు తారల జాబితాలో ఇప్పుడు మళయాళ నటి నవ్యనాయర్ కూడా జరిగింది. వివరాల్లోకి వెళితే... పాతిరాత్రి అనే మళయాళ చిత్రంలో సౌబిన్ షాహిర్ (కూలీ ఫేమ్) నవ్యనాయర్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని వీరిద్దరూ పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే క్రమంలో కోజికోడ్లోని హైలైట్ మాల్లో సినిమా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ తర్వాత సినిమా తారాగణం వేదిక నుంచి బయటకు వెళుతుండగా, ఊహించని సంఘటన జరిగింది, అక్కడ జనంలో ఉన్న ఒక వ్యక్తి నటి నవ్య నాయర్ను అకస్మాత్తుగా వెనుక నుంచి తడిమాడు. ఇది జరిగిన వెంటనే సౌబిన్ షాహిర్(Soubin Shahir) కూడా నవ్యనాయర్ను కాపాడే క్రమంలో తాను కూడా టచ్ చేశాడు. ఈ సంఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడం ప్రారంభించారు. తొలుత తనను తాకిన వ్యక్తి వైపు నవ్యనాయర్ ఉరిమిచూడడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో అనేక మంది నటికి మద్దతుగా కామెంట్స్ చేశారు. అయితే కొందరు మాత్రం ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు, అపరిచితులు తాకితే ఉరిమి చూసిన నటి సౌబిన్ తాకితే ఎందుకు ఊరుకుంది? అంటూ కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే దీనిపై చాలా మంది అభిమానులు సౌబిన్ను సమర్థించడానికి ముందుకు వచ్చారు, వీడియోను పరిశీలనగా చూడాలని అందులో, అగంతకుడు తాకిన తర్వాత ఆమెకు రక్షణగా మాత్రమే సౌబిన్ వ్యవహరించాడని అంటూ కొందరు పరిణితి ప్రదర్శించారు. అంతేకాక తనను రెండవ సారి తాకింది సౌబిన్ అని ఆమెకు తెలుసు. అంటూ గుర్తు చేశారు. ‘‘ఒకరి శరీరంపై చేతులు పెట్టడానికి అనుమతి అవసరం... ఈ సంఘటనలో సౌబిన్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిoచినట్టు స్పష్టంగా తెలుస్తోంది.’’ అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.రతీనా దర్శకత్వం వహించి బెంజీ ప్రొడక్షన్స్ నిర్మించిన పాతిరాత్రి సినిమాలో నవ్య సౌబిన్లు పోలీస్ ఆఫీసర్లు జాన్సీ, హరీష్ పాత్రలను పోషించారు. అర్ధరాత్రి జరిగే ఒక రహస్య సంఘటనను వారు వెలికితీసే థ్రిల్లర్ ఈ జంటను అనుసరిస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల అవుతోంది. View this post on Instagram A post shared by IndianCinemaGallery (@indiancinemagallery_official) -
'నా కథను ఎన్టీఆర్తో చేయించండి'
కోలీవుడ్ నటుడు శింబు (Silambarasan TR), దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరసన్’ (Arasan). తెలుగులో ‘సామ్రాజ్యం’ (Saamrajyam) పేరుతో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు వర్షన్ ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ (NTR) విడుదల చేశారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు చెప్పారు.ప్రోమో పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఏకంగా 5 నిమిషాలకు పైగానే ఉంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన వడ చెన్నై యూనివర్స్లో భాగంగానే సామ్రాజ్యం చిత్రం తీస్తున్నారు. ఇందులో ధనుష్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఉత్తర చెన్నై నేపథ్యంలోని గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ప్రోమోలో మీడియా ప్రతినిధులు తన కథ గురించి చెప్పాలని శింబును అడుగుతారు. దానికి అతను "నా కథను ఎవరితో చేయిద్దామనుకుంటున్నారు.. ఎన్టీఆర్తో చేయించండి కుమ్మేస్తాడు" అనే డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు సోషల్మీడియాలో అది ట్రెండ్ అవుతుంది. -
విక్రమ్ తనయుడి బైసన్.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తోన్న తాజా చిత్రం బైసన్(Bison Kaalamaadan). ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఈ రోజు రిలీజ్ అయింది. వచ్చేవారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే బైసన్ మూవీ నుంచి ఓ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మంచి మనసు అంటూ సాగే పాటను విడుదల చేశారు. మారి సెల్వరాజ్ రాసిన ఈ సాంగ్ను తెలుగులోకి యనమండ్ర రామకృష్ణ ట్రాన్స్లేట్ చేశారు. ఈ పాటను మనువర్ధన్, గాయత్రీ సురేశ్ ఆలపించారు. -
దీపావళి పార్టీ.. చిచ్చుబుడ్డిలా మెరిసిన తారలు (ఫోటోలు)
-
సుధీర్ బాబు జటాధర.. ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజైంది. కాగా.. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. 'పూర్వం ధనాన్ని దాచిపెట్టి... మంత్రాలతో బంధనాలు వేసేవాడు' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఈ కథను ధనపిశాచి అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సోనాక్షి సిన్హా ధనపిశాచి పాత్రలో విశ్వరూపం చూపించింది. నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సీన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా కథేంటో ట్రైలర్ చూస్తేనే ప్రేక్షకులను తెలిసిపోతోంది. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కాంతార 1.. ఇప్పటివరకు ఎంతొచ్చిందంటే?
మూడేళ్ల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమా (Kantara Movie) బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం రూ.15- 20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.450 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1 Movie) తెరకెక్కించారు. కాంతార లాగే.. కాంతార 1 బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా? ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా? లేదా? అన్న అనుమానాలు ఉండేవి.తెలుగులో రికార్డుఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది కాంతార 1. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ వసూళ్ల ఊచకోత కొనసాగిస్తూనే ఉంది. ఈ రెండు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.105 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. సినిమాఅలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది. కాంతార విషయానికి వస్తే రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. A divine storm at the box office 💥💥#KantaraChapter1 roars past 717.50 CRORES+ GBOC worldwide in 2 weeks.Celebrate Deepavali with #BlockbusterKantara running successfully in cinemas near you! ❤️🔥#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara… pic.twitter.com/rd92Dch1mS— Hombale Films (@hombalefilms) October 17, 2025The unstoppable divine saga takes over the box office 🔥#KantaraChapter1 crosses 717.50 CRORES+ GBOC worldwide, including a phenomenal 105 CRORES+ from Telugu states in just 2 weeks.Experience the magic of #BlockbusterKantara this Deepavali in cinemas ❤️🔥#KantaraInCinemasNow… pic.twitter.com/dD584CNPMp— Ramesh Bala (@rameshlaus) October 17, 2025చదవండి: నడవలేని స్థితిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. రాఘవతో ఫోటో -
Bigg Boss 9: నేను లక్స్ పాపను..
-
నువ్వు ఎలా ఉన్నా బాగుంటావ్ నీరూ..!
-
కొత్త దర్శకుడితో విక్రమ్ సినిమా ప్లాన్
పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే అతికొద్ది మంది కథానాయకులలో నటుడు విక్రమ్ ఒకరు. ఈయన జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. విక్రమ్ చిత్రం వస్తుందంటేనే అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఈయన ఇటీవల హీరోగా నటించిన వీర ధీర సూరన్ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా విక్రమ్ నటన, శారీరక భాషకు ప్రశంసలు లభించాయి. తదుపరి రెండు మూడు చిత్రాల్లో విక్రమ్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవన్నీ చర్చల దశలో ఉన్నాయి. కాగా ప్రస్తుతం శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. కాగా తాజాగా విక్రమ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. యువ దర్శకుడు విష్ణు ఎడవన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం నయనతార, కెవిన్ కలిసి నటిస్తున్న హాయ్ చిత్రం ద్వారా విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దీన్ని జి.స్టూడియోస్, లలిత్ కుమార్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. తదుపరి విక్రమ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె.గణేశ్ నిర్మించనున్నట్లు సమాచారం. హాయ్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్ హీరోగా నటించే చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
చిరంజీవి సినిమాలో...
చిరంజీవి సరసన మాళవికా మోహనన్ నటించనున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర)ల కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. కెవిన్ ప్రోడక్షన్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. చిరంజీవి కెరీర్లోని 158వ సినిమా ఇది. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్కు చాన్స్ ఉందని, ఒక హీరోయిన్గా మాళవికా మోహనన్, మరో హీరోయిన్గా రాశీ ఖన్నా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది.గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుందని, అతి త్వరలోనే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై ఓ స్పష్టత రానుందని సమాచారం. మరి... చిరంజీవి సరసన రాశీ ఖన్నా, మాళవికాలకు హీరోయిన్లుగా నటించే చాన్స్ లభిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు మాళవికా మోహనన్. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, రిద్ది కుమార్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. -
వెండితెరపై సినీ జీవితం
సైన్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్... ఇలా వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్స్లో సినీ తారలు నటించడం చూస్తూనే ఉన్నాం. ఈ కోవలో ఇప్పటివరకు చాలా బయోపిక్స్ వచ్చాయి. మరికొన్ని బయోపిక్స్ రానున్నాయి. అయితే వీటిలో సినీ తారల బయోపిక్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ సడన్గా ఇప్పుడు బాలీవుడ్లో సినీ తారల జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్స్ సంఖ్య ఎక్కవైంది. మరి... ఏ స్టార్స్ బయోపిక్స్ వెండితెరపైకి రానున్నాయి? ఈ తారల బయోపిక్స్లో ఎవరు నటించనున్నారు? అన్న వివరాలపై ఓ లుక్ వేయండి.ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కేను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకుంటాం. పూర్తి నిడివితో తొలి భారతీయ సినిమా తీసిన వ్యక్తిగా దాదా సాహెబ్ ఫాల్కే ఘనత గొప్పది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా దాదా సాహెబ్ ఫాల్కే పేరిట అవార్డును ప్రదానం చేస్తుంది. ఇలాంటి ప్రముఖ వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు... ఇండస్ట్రీ వర్గాల్లోనూ క్రేజ్ ఉంటుంది. దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కేగా ఆయన కనిపిస్తారు.ఆమిర్ ఖాన్తో గతంలో ‘పీకే, 3 ఇడియట్స్’ వంటి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ తీసిన రాజ్కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్లో నటించనున్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా వెల్లడించారు. రాజ్కుమార్ హిరాణి, అజిభిత్ జోషి, హిందుకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్ ఈ సినిమా స్క్రిప్ట్పై నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ బయోపిక్కు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు ఇటీవలి కాలంలో మరింత ఊపందుకున్నాయట. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. ఈ సినిమాకు దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స పోర్ట్ చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా: ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 2023 సెప్టెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీ చిత్రం ‘నోట్ బుక్’ ఫేమ్ నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లుగా, కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మించనున్నట్లుగా ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనౌన్స్మెంట్లో ఉంది.అయితే దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని, అందుకే రాజమౌళి ఈ సినిమాలో భాగమయ్యారని, ఇందులో దాదా సాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాను 2023 సెప్టెంబరులో ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. సో... ఈ చిత్రంపై స్పష్టత రావాల్సి ఉంది.మ్యూజిక్ మేస్ట్రో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బయోపిక్ వెండితెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్లో ఇళయరాజాగా ధనుష్ నటిస్తారు. గత ఏడాది మార్చిలో ఇళయరాజా బయోపిక్ను అధికారికంగా ప్రకటించారు. ధనుష్తో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తీసిన అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈపాటికే పూర్తి స్థాయిలో ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందట.ప్రస్తుతం ధనుష్ రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ను హీరోగా పరిచయం చేసే సినిమా పనుల్లో అరుణ్ బిజీగా ఉన్నారు. ఇలా ధనుష్, అరుణ్ల ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ‘ఇళయరాజా’ బయోపిక్ సెట్స్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఇళయరాజా బయోపిక్లో రజనీకాంత్, కమల్హాసన్లు గెస్ట్ రోల్స్లో నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రోడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సంస్థలు ఈ బయోపిక్ను నిర్మించనున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్పై ఉంది.ఆమిర్ లేదా రణ్బీర్ ప్రఖ్యాత గాయకులు కిశోర్ కుమార్ బయోపిక్ వెండితెర పైకి రానుంది. ఈ బయోపిక్పై దర్శకుడు అనురాగ్ బసు ఎప్పట్నుంచో వర్క్ చేస్తున్నారు. ఈ బయోపిక్లో రణ్బీర్ కపూర్ నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేక పోయారు. ‘‘కిశోర్ కుమార్గారి బయోపిక్లో రణ్బీర్ కపూర్ను అనుకున్న మాట వాస్తవమే. కాక పోతే ఈ బయోపిక్కు బదులు ‘రామాయణ’ సినిమాను రణ్బీర్ కపూర్ ఎంపిక చేసుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో అతను మంచి నిర్ణయమే తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు అనురాగ్ బసు.కాగా కిశోర్ కుమార్ బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో తెరపైకి వచ్చాయి. ఇటీవల ఓ సందర్భంలో కిశోర్ కుమార్గారి బయోపిక్లో నటించే చాన్స్ వస్తే తప్పుకుండా చేస్తానన్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా చె΄్పారు. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించే అవకాశం ఉందని ఊహించవచ్చు. కానీ కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు తొలుత రణ్బీర్ కపూర్ను అనుకున్నారు. అప్పట్లో కుదర్లేదు. అయితే ఇప్పుడు ‘రామాయణ’ సినిమా పూర్తి కావొచ్చింది. రణ్బీర్ కపూర్ చేస్తున్న మరో సినిమా ‘లవ్ అండ్ వార్’ చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో కిశోర్ కుమార్ బయోపిక్లో రణ్బీర్ కపూర్ నటించే అవకాశం లేక పోలేదు. పైగా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్తో ఆమిర్ ఖాన్ బిజీ కానున్నారు. ఒకేసారి రెండు బయోపిక్స్లో ఆమిర్ ఖాన్ నటించడం సాధ్యం కాక పోవచ్చు కనుక కిశోర్ కుమార్గా వెండితెరపై రణ్బీర్ కపూర్ కనిపించే అవకాశం లేక పోలేదు.ఫైనల్గా కిశోర్ కుమార్ బయోపిక్లో ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మరోవైపు కిశోర్కుమార్ బయోపిక్ చేయాలని బాలీవుడ్ దర్శకుడు సూజిత్ సర్కార్ ఓ కథ రెడీ చేశారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ను హీరోగా అనుకున్నారు. కానీ అనురాగ్ బసు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న సూజిత్ సర్కార్ తన ప్రయత్నాలను ఆపేశారు. ఈ విషయాలను సుజిత్ సర్కార్ ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు.గురుదత్ బయోపిక్లో విక్కీ? ‘సైలాబ్, కాగజ్ కె పూల్, ఫ్యాసా’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్ ఫిల్మ్స్ తీసిన లెజెండరీ దర్శకుడు గురుదత్ జీవితం వెండితెర పైకి రానుందని బాలీవుడ్ సమాచారం. అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ బయోపిక్కు భావనా తల్వార్ దర్శకత్వం వహిస్తారని, ‘ ఫ్యాసా’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలో గురుదత్గా విక్కీ కౌశల్ నటిస్తారని, ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ఈ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారని బాలీవుడ్ భోగట్టా. మరి... వెండితెరపై గురుదత్గా విక్కీ కౌశల్ నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.మధుబాల బయోపిక్ ‘ ఫ్యార్ కియాతో డర్నా క్యా...’ అంటూ వెండితెరపై అనార్కలిగా మధుబాల నటన అద్భుతం. 1960లో విడుదలైన ‘మొఘల్ ఏ అజం’ సినిమా మధుబాలకు అప్పట్లో దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాయే కాదు... పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మధుబాల. దాదాపు 60 సినిమాల్లో నటించిన మధుబాల 36 సంవత్సరాల చిన్న వయసులో తుది శ్వాస విడిచారు. కాగా, మధుబాల బయోపిక్ రానుంది. గత ఏడాది మార్చిలో ఈ బయోపిక్ను అధికారికంగా ప్రకటించారు. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన ‘డార్లింగ్స్’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన జస్మీత్ కె. రీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్ సంస్థతో బ్రిజ్ భూషణ్ (మధుబాల సోదరి) మధుబాల బయోపిక్ను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో మధుబాలగా ఆలియా భట్ లేదా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటించనున్నారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనీష్ మల్హోత్రా కూడా మధుబాల బయోపిక్ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో మధుబాలగా కృతీ సనన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ మనీష్ మల్హోత్రా నిర్మించే మధుబాల బయోపిక్పై తమకు సమాచారం లేదన్నట్లుగా బ్రిజ్ భూషణ్ ఓ సందర్భంలో వెల్లడించారనే వార్తలు బాలీవుడ్ ఉన్నాయి.ట్రాజెడీ క్వీన్ దివంగత ప్రముఖ నటి, ట్రాజెడీ క్వీన్గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మీనా కుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్ ఔర్ మీనా’ అనే సినిమా రానుంది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో ఈ సినిమా ప్రారంభం కాలేదు. తొలుత ‘కమల్ ఔర్ మీనా’ చిత్రానికి మనీష్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపించింది. ప్రస్తుతం ఈ మూవీకి దర్శకుడిగా సిద్ధార్థ్. పి మల్హోత్రా ఉన్నారు. అలాగే ఈ ‘కమల్ ఔర్ మీనా’లో మీనా కుమారిగా తొలుత కృతీ సనన్ పేరు వినిపించింది.కానీ ఆ తర్వాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని దర్శకుడు కమల్ అమ్రోహిగా ఆయుష్మాన్ ఖురానా, రాజ్కుమార్ రావు వంటి హీరోల పేర్లు బాలీవుడ్లో వినిపిస్తున్నాయట. అయితే ఈ అంశాలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ ఏడాది జూలైలో కియారా అద్వానీ ఓ పాపకు జన్మనిచ్చారు. దీంతో కియారాకు సెట్స్కు వచ్చేందుకు వీలుపడదు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని బాలీవుడ్ సమాచారం. అమ్రోహీ ఫ్యామిలీతో కలిసి సిద్ధార్థ్. పి. మల్హోత్రా, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి.ది అన్టోల్డ్ స్టోరీ గ్లామరస్ క్వీన్గా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సిల్క్ స్మిత. ఆ తరం స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేశారు. అయితే సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నారామె. ఎవరూ ఊహించని రీతిలో 1996 సెప్టెంబరు 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చింది.విద్యాబాలన్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా సిల్క్ స్మిత జీవితం ఆధారంగానే మరో సినిమా రానుంది. ‘సిల్క్ స్మిత: ది అన్టోల్డ్ స్టోరీ’గా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో సిల్క్ స్మితగా చంద్రికా రవి నటిస్తున్నారు. ఈ మూవీతో జయరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇలా సినిమా తారల జీవితాల ఆధారంగా రూపొందనున్న మరికొన్ని బయోపిక్స్ చర్చల దశల్లో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
కెనడాలో రీతూ వర్మ చిల్.. రెజీనా స్టన్నింగ్ అవుట్ఫిట్!
కెనడాలో చిల్ అవుతోన్న హీరోయిన్ రీతూ వర్మ..పదహారణాల అమ్మాయిలా ముస్తాబైన హీరోయిన్ మాధవీలత..హీరోయిన్ రెజీనా స్టన్నింగ్ అవుట్ఫిట్..కలర్ఫుల్ డ్రెస్లో పాలక్ తివారీ హోయలు..శారీలో సింగర్ గీతా మాధురి ట్రెడిషనల్ లుక్.. View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
నాకిప్పుడు 16 నెలల ప్రెగ్నెన్సీ.. రూమర్స్పై స్పందించిన సోనాక్షి సిన్హా!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధరలో కనిపించనుంది. ఈ మూవీలో విలన్ లాంటి పాత్రలో నటించింది. ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ కూడా కీ రోల్ ప్లే చేయనుంది.ఈ సినిమా సంగతి పక్కనపెడితే.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఆమె తన భర్తతో కలిసి దివాళీ బాష్కు హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ డ్రెస్లో కనిపించి సందడి చేసింది. దీంతో సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.అయితే తాజాగా తన ప్రెగ్నెన్సీపై వస్తున్నా వార్తలపై సోనాక్షి సిన్హా స్పందించింది. మానవ చరిత్రలోనే ప్రెగ్నెన్సీలో ప్రపంచ రికార్డ్ అని పోస్ట్ చేసింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇప్పటికీ నేను 16 నెలల గర్భంతో ఉన్నానంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ శుభవార్తను దీపావళి వరకు కొనసాగించండి అంటూ ఫన్నీగా రియాక్షన్ ఇచ్చింది. తమపై వస్తున్న వార్తలపై మా స్పందన ఇలానే ఉంటుందని సోనాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. గత కొన్ని నెలలుగా సోనాక్షి ఎక్కడా కనిపించినా ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ రియాక్ట్ అయింది. కాగా.. సోనాక్షి సిన్హా.. జూన్ 2024లో జహీర్ ఇక్బాల్ను వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
వరుసగా మూడు రోజుల సెలవులు.. ఓటీటీల్లో ఒక్క రోజే 19 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. దీనికి తోడు వచ్చే సోమవారమే దీపావళి పండుగ. ఇంకేముంది వరుసగా మూడు రోజులు సెలవులు కూడా వచ్చేస్తున్నాయి. ఈ వారాంతానికి తోడు దీపావళి కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అయ్యేందుకు సినీ ప్రియులు సిద్ధమైపోయారు. మీ కోసమే ఈ వారంలో మిత్రమండలి, తెలుసుకదా, డ్యూడ్, కె ర్యాంప్ లాంటి థియేటర్లకు వరుసగా క్యూ కడుతున్నాయి.అదే సమయంలో థియేటర్లలో వెళ్లలేని వారు ఓటీటీ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫ్రైడే ఏయే సినిమాలు డిజిటల్గా స్ట్రీమింగ్ కానున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారి కోసం రెండు టాలీవుడ్ మూవీస్ శుక్రవారం స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. మంచు లక్ష్మీ దక్ష, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కంధపురి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. వీటితో పాటు ఆనందలహరి అనే వెబ్ సిరీస్ కూడా సందడి చేయనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు శుక్రవారమే ఓటీటీలో అలరించనున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేసేయండి.ఓటీటీల్లో ఫ్రైడే మూవీస్నెట్ఫ్లిక్స్ 27 నైట్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 17 గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) - అక్టోబర్ 17 గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 17 షీ వాక్స్ ఇన్ డార్క్నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబర్ 17 ద ఫెర్ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబర్ 17 టర్న్ ఆఫ్ ది టైడ్- సీజన్ 2- (హాలీవుడ్ సిరీస్)- అక్టోబర్ 17 ది డిప్లొమాట్- సీజన్ 3- అక్టోబర్ 17 హౌటూ ట్రైన్ యువర్ డ్రాగన్(యానిమేషన్ మూవీ)- అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్దక్ష(తెలుగు సినిమా)- అక్టోబరు 17హాలీవుడ్ హస్లర్- గ్లిట్జ్, గ్లామ్, స్కామ్(డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబరు 17ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్- అక్టోబర్ 18 జియో హాట్స్టార్ఘోస్ట్స్ సీజన్-5(హాలీవుడ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17 ఆహా ఆనందలహరి (తెలుగు వెబ్ సిరీస్) - అక్టోబరు 17జీ5 కిష్కింధపురి (తెలుగు సినిమా) - అక్టోబరు 17 భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) - అక్టోబరు 17 ఎలుమలే (కన్నడ సినిమా) - అక్టోబరు 17 మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) - అక్టోబరు 17 అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) - అక్టోబరు 17సన్ నెక్స్ట్ ఇంబమ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 17 మట్టా కుతిరై(మలయాల సినిమా)- అక్టోబర్ 19లయన్స్ గేట్ ప్లే సంతోష్ (హిందీ సినిమా) - అక్టోబరు 17 వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17 -
మీ ఫేవరేట్ హీరో ఎవరు?.. సిద్ధు జొన్నలగడ్డ ఏమన్నారంటే?
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా వస్తోన్న రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ తెలుసుకదా. ఇప్పటికే ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ నిర్మించారు.రిలీజ్కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో సిద్ధు సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు. ట్విట్టర్ వేదికగా ఆస్క్ సిద్దు పేరుతో చిట్ చాట్ నిర్వహించారు. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధనాలిచ్చారు సిద్ధు. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ గురించి సైతం పలువురు అడిగారు. అంతేకాకుండా మీ ఫెవరేట్ హీరో ఎవరని కూడా ప్రశ్నించారు. దీనికి సిద్ధు తన నచ్చిన హీరో రణ్బీర్ కపూర్ అంటూ ఆన్సరిచ్చారు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ త్వరలోనే జరగనుందని రిప్లై ఇచ్చాడు. Ranbir kapoor ! Fan boy moment Yet to happen— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) October 16, 2025 -
‘కె-ర్యాంప్’ టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్..
తన సినిమాలను ప్రేక్షకులకు రీచ్ చేసేందుకు సాధ్యమైనంత కొత్తగా ప్రయత్నిస్తుంటారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తన లేటెస్ట్ మూవీ కె-ర్యాంప్పై కూడా ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో తన సినిమా ‘ఎస్ఆర్ కల్యాణమండపం’కు డీజే మిక్స్ చేసి ఆ కంటెంట్ ను వైరల్ చేశారు. ఇప్పుడు ‘K-ర్యాంప్’ టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్ చేసి యూత్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ డీజే మిక్స్ "K-ర్యాంప్" మీద ఒక వైబ్ క్రియేట్ చేస్తోంది. టీజర్, ట్రైలర్ లో పేలిన డైలాగ్స్ అన్నీ ఈ డీజే మిక్స్ లో యాడ్ చేయడం కొత్త ఫీల్ కలిగిస్తోంది.జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. -
రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ హీరోయిన్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ అర్చన కవి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు రిక్ వర్గీస్ను ఆమె పెళ్లాడింది. ఈ విషయాన్ని ప్రముఖ టీవీ హోస్ట్ ధన్య వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు, అభిమానులు అర్చనకు విషెస్ చెబుతున్నారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా.. అర్చన కవికి ఇది రెండో వివాహం. ఆమె గతంలో 2016లో హాస్యనటుడు, యూట్యూబర్ అబీష్ మాథ్యూను వివాహం చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021లో తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పేశారు. విడాకులు తీసుకుని కొత్త జీవితాలను ప్రారంభించారు. డివోర్స్ అయిన నాలుగేళ్ల తర్వాత అర్చన మరోసారి పెళ్లి పీటలెక్కింది. అయితే రిక్ వర్గీస్ తనకు ఓ డేటింగ్ యాప్లో పరిచయమయ్యాడని గత ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.ఇక సినిమాల విషయానికొస్తే.. 2009లో నీలతామర అనే రీమేక్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతంలో పలు సినిమాలు చేసిన అర్చన ఇటీవలే ఐడెంటిటీ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టోవినో థామస్, త్రిష కృష్ణన్ కూడా నటించారు. అర్చన అంతకుముందు మమ్మీ అండ్ మీ, బెస్ట్ ఆఫ్ లక్, సాల్ట్ అండ్ పెప్పర్, మజవిల్లినాట్టం వారే, అరవాన్, మోనై అంగనే ఆనాయి, డే నైట్ గేమ్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ ఎ కల్లన్ లాంటి మలయాళ సినిమాల్లో మెప్పించింది. అంతేకాకుండా ఎంతే ప్రియా గణంగల్, బ్లడీ లవ్, టాక్ విత్ ఆర్చీ, ట్రావెల్, సుందరి నీయుమ్ సుందరన్ జానుమ్ వంటి షోలలో కనిపించింది. -
పేరు పెట్టకుండా బండ్ల గణేశ్ ట్వీట్.. ఆయన మీదేనా?
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh)కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన ఏ ట్వీట్ చేసినా.. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపైన తనదైన శైలీలో స్పందిస్తుంటారు. కొన్ని విషయాలపై డైరెక్ట్గా, మరికొన్ని విషయాలపై పరోక్షంగా ఆయన కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది. గురువారం మధ్యాహ్నం ఆయన తన ఎక్స్ ఖాతాలో “అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……! అంటూ రాసుకొచ్చాడు. పేరునూ ప్రస్తావించకుండా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉంటాయా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఆ నిర్మాతకు కౌంటర్గానేనా?ఇటీవల టాలీవుడ్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ ముందు కొంతమంది దర్శకనిర్మాతలు, హీరోలు ఇచ్చే స్టేట్మెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా మిత్రమండలి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నివాసు(Bunny Vasu) చాలా ఎమోషనల్గా మాట్లాడారు. తమ సినిమాను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తొక్కేయాలని చూస్తున్నారని.. కానీ జనాలు సినిమా బాగుంటేనే చూస్తారని, లేకపోతే చూడరని... డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది నడవదని అన్నారు. అంతటితో ఆగకుండా..తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకోవద్దని.. నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ రోజు సినిమా రిలీజై మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. ఇదే రోజు బండ్ల గణేశ్ పైవిధంగా ట్వీట్ చేయడంతో .. బన్నీవాసుకి కౌంటర్గానే ఇలా పోస్ట్ పెట్టాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆయన పోస్ట్ కింద చాలామంది ఇది బన్నీవాసు గురించే అని కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని, ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు అన్నారని తెలియదు కానీ.. బన్నీవాసు పేరు అయితే బాగా ట్రోల్ అవుతుంది.“అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……!— BANDLA GANESH. (@ganeshbandla) October 16, 2025 -
హోటల్ లీజు వివాదం.. వెంకటేశ్, రానాకు కోర్టు షాక్!
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోలు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబు కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. కాగా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో వెంకటేశ్, రానా, అభిరామ్తోపాటు నిర్మాత దగ్గుబాటి సురేశ్పై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.అసలు ఈ కేసు వివాదం ఏంటి..?డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్లోని వెంకటేష్కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు ఈ ఏడాది జనవరిలో గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు
ఆసియా కప్ హీరో తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. ప్రస్తుతం మనశంకరవరప్రసాద్గారు మూవీలో నటిస్తోన్న చిరు.. ఈ టీమిండియా క్రికెటర్ను సత్కరించారు. ఈ సందర్భంగా మూవీ సెట్లో కేక్ కట్ చేసిన తిలక్ వర్మకు.. ఆసియా కప్ ఫైనల్ నాటి ఫోటోను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో నయనతార, అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు.కాగా..ఇటీవల దుబాయ్లో పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ విజయం కీలకమైన సమయంలో రాణించాడు. దీంతో తిలక్ వర్మపై పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మీసాల పిల్ల అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Megastar #Chiranjeevi Garu met young cricket sensation #TilakVarma on the sets of #ManaShankaraVaraPrasadGaru and felicitated him for his stellar contribution to India’s glorious win against Pakistan. 🏏💫A proud moment as the Megastar appreciated the Hyderabad boy’s talent,… pic.twitter.com/9HVOg2ZRy4— Team Megastar (@MegaStaroffl) October 16, 2025 -
డిఫరెంట్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)
-
కాంతార చాప్టర్-1 తగ్గేదేలే.. పుష్ప, సలార్ రికార్డ్స్ బ్రేక్!
కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార: చాప్టర్ 1 రెండు వారాలు దాటినా ఏ మాత్రం కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే రూ.650 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-10లో నిలిచింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ చిత్రాలను అధిగమించింది. కేవలం హిందీలోనే రూ.155.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్తో ప్రభంజనం సృష్టించిన కాంతార మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్(రూ. 152.65 కోట్లు), సాహో(రూ. 145.67 కోట్లు, బాహుబలి-ది బిగినింగ్' (రూ. 118.5 కోట్లు), పుష్ప: ది రైజ్ - పార్ట్ I(రూ. 106.35 కోట్లు) చిత్రాలను దాటేసింది. ఈ జాబితాలో పుష్ప-2 రూ. 812.14 కోట్ల వసూళ్లతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బాహుబలి-2(రూ. 511 కోట్లు), కేజీఎఫ్ -2 రూ. 435.33 కోట్లు, కల్కి 2898 ఏడీ రూ. 293.13 కోట్లతో ఉన్నాయి. ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఎనిమిదో ప్లేస్లో నిలిచింది. దీపావళి సెలవులు రావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.కాకగా.. ఈ సినిమాను 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు,హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు..పుష్ప -2: రూ. 812.14 కోట్లుబాహుబలి- 2: రూ. 511 కోట్లుకెజిఎఫ్- 2: రూ. 435.33 కోట్లుకల్కి 2898 ఏడీ: రూ. 293.13 కోట్లుఆర్ఆర్ఆర్ : రూ. 272.78 కోట్లురోబో2: రూ 188.23 కోట్లుమహావతార్ నరసింహ: రూ. 188.15 కోట్లుకాంతార చాప్టర్-1: రూ. 155.5 కోట్లుసలార్ - పార్ట్ I: రూ. 152.65 కోట్లుసాహో : రూ. 145.67 కోట్లు -
కొచ్చాడియాన్ కేసులో లతా రజనీకాంత్ పిటిషన్ కొట్టివేత
తమిళ స్టార్ హీరో రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు ఉన్న విషయం తెలిసిందే. 2015లో తమ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ టైంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం తిరిగి ఇవ్వకపోవడంతో లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదైంది. ఆమె ష్యూరిటీ సంతకం పెట్టడం వల్లే ఈ చిక్కులు వచ్చాయని సమాచారం. అయితే, ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. కానీ, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ బెంగళూరు కోర్టులో లత పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది.2014లో విడుదలైన 'కొచ్చాడియాన్' చిత్రానికి సంబంధించిన ఫోర్జరీ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ లత రజనీకాంత్ చేసిన దరఖాస్తును బెంగళూరు కోర్టు కొట్టివేసింది. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొంది. అయితే, 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిందితులపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె దరఖాస్తును కొట్టివేశారు.2015లో, చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో లత నకిలీ పత్రాలను ఉపయోగించి కోర్టును కూడా మోసం చేశారని ఒకరు పిటిషన్ వేశారు. తప్పుడు పత్రాలతో ఆమె మీడియా గ్యాగ్ ఆర్డర్ పొందారని పిటిషన్ దాఖలైంది. ఈ ఆర్డర్తో ఆమెపై వచ్చిన పలు మీడియా కథనాలు తొలగించారని అందులో పేర్కొన్నారు. కొచ్చాడియాన్తో సంబంధం ఉన్న ఆర్థిక వివాదాలకు సంబంధించిన దాదాపు 70 మీడియా సంస్థలకు చెందిన వార్తలు తొలగించారని తెలిపారు. -
దారుణంగా ఎన్టీఆర్ లుక్.. ఎందుకో తెలిస్తే..!
-
‘మిత్రమండలి’ మూవీ రివ్యూ
టైటిల్ : మిత్రమండలినటీనటులు: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ తదితరులునిర్మాణ సంస్థ: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: కల్యాన్ మంతిన, భాను ప్రతాప,డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగలదర్శకుడు: విజయేందర్సంగీతం : ఆర్. ఆర్ ధ్రువన్సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ ఎస్జెవిడుదల తేది: అక్టోబర్ 16, 2025మిత్రమండలి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ‘జాతిరత్నాలు’తో పోల్చారు. ఓ జాతిరత్నం ప్రియదర్శి ఇందులో హీరోగా నటించడం.. స్టార్ కమెడియన్స్ అంతా ఇతర పాత్రల్లో కనిపించడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు అయితే పెరిగాయి. ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో బన్నీ వాసు చేసిన కామెంట్స్.. ‘ఈ సినిమా నచ్చకపోతే నా తర్వాత సినిమా చూడకండి’అంటూ నాని రేంజ్లో ప్రియదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ ‘మిత్రమండలి’పై హైప్ని క్రియేట్ చేశాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం(Mithra Mandali Movie Review).కథేంటంటే...జంగ్లీపట్నానికి చెందిన నారాయణ(వీటీవీ గణేష్)కి కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకంటే.. వారిని చంపేసే రకం. తుట్టె కులం అండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక ఎన్ఎమ్) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్)ని కలుస్తాడు. లంచం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్(సత్య) ద్వారా స్వేచ్ఛ పారిపోవడం వెనక అదే ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓయి), రాజీవ్ (ప్రసాద్ బెహరా) ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నలుగురు ఆవారాగాళ్లు. రోజంతా బాతకాలు కొట్టడం.. సాయంత్రం మందేసి చిందులు వేయడమే వీరి పని. ఇలాంటి చిల్లర గాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వేచ్ఛ పారిపోవడం వెనున ఉన్న అసలు కారణం ఏంటి? స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా(Mithra Mandali Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..కామెడీ చిత్రాలకు కథతో సంబంధం లేదు. నవ్వులు పూయించే సన్నివేశాలు ఉంటే చాలు, ఆ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇక కథతో కూడిన కామెడీ ఉంటే.. ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుంటారు. జంద్యాల, ఈవీవీ చిత్రాలే ఇందుకు నిదర్శనం. కథలో కొత్తదనం లేకున్నా.. కామెడీ పండించినా..ఆ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికి ఉదాహారణ ‘జాతిరత్నాలు’. ఈ రెండూ లేని కామెడీ చిత్రం ‘మిత్ర మండలి’. చెప్పుకోవడానికి పెద్ద కథ లేదు.. నవ్వుకోవడానికి కామెడీ సన్నివేశాలు లేవు. కానీ ‘స్టార్’ కమెడియన్స్ అంతా ఈ చిత్రంలో ఉన్నారు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు చూసుకున్న ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. కామెడీ చిత్రం కదా ఆ కొత్తదనం ఆశించడం తప్పే అవుతుంది. కానీ కామెడీ అనుకొని రాసుకున్న సన్నివేశాలు అయినా నవ్వులు పూయించే విధంగా ఉండాలి కదా? అది లేదు. ఒక ఫిక్షనల్ సిటీ.. కులపిచ్చి గల రాజకీయ నేత.. ఇంట్లో అమ్మాయి పారిపోవడం.. దాని వెనుక నలుగురు కుర్రాళ్లు ఉండడం.. ఈ సింపుల్ కథతో కావాల్సినంత కామెడీ పుట్టించొచ్చు. దర్శకుడు పేపర్పై రాసుకున్నప్పుడు కూడా ఇలాగే ఊహించొచ్చు. కానీ ఆయన ఊహకి తెర రూపం ఇవ్వడంలో మాత్రం విఫలం అయ్యాడు. కామెడీ అనుకొని రాసుకున్న సన్నివేశాలేవి నవ్వించలేకపోయాయి. ప్రధాన పాత్రలు చెప్పే డైలాగ్స్.. వారి ప్రవర్తన..ప్రతీదీ అతిగానే అనిపిస్తుంది. కులపిచ్చి ఉన్న నారాయణ ఎమ్మెల్యే టికెట్ కోసం చేసే ప్రయత్నం.. కూతురు పారిపోవడం.. నలుగురు మిత్రుల గ్యాంగ్ చేసే అల్లరి సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ సత్య చేసే కామెడీ ఒకటే కాస్త నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త బెటర్. ఛేజింగ్ సీన్, పెళ్లి సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా మిత్రమండలి చేసే కామెడీ కాస్త నవ్వులు పూయిస్తే.. చాలా చోట్ల అతిగానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి, రాగ్ మయూరి, విష్ణు, సత్య, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్..వీళ్ల కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో కామెడీ పండించగలరు. కానీ ఈ చిత్రంలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయారు. దానికి కారణం దర్శకుడు అనే చెప్పాలి. వీరి కామెడీ టైమింగ్ని వాడుకోవడంలో ఆయన విఫలం అయ్యాడు. ఉన్నంతలో సత్య ఒక్కడే కాస్త నవ్వించాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ ఆయన చేసే కామెడీ వర్కౌట్ అయింది. మిగతా పాత్రలన్నీ అతి చేసినట్లుగానే అనిపిస్తుంది. స్వేచ్ఛగా నిహారిక తన పరిధిమేర నటించింది. సాంకేతికంగా సినిమా ఓకే. ఆర్. ఆర్ ధ్రువన్ నేపథ్య సంగీతం పర్వాలేదు. నిబ్బా నిబ్బి సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో!
'లవ్టుడే', 'డ్రాగన్' సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇతడు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ప్రేమలు బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 17న రిలీజవుతోంది. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్ 15న) స్వాగ్ ఈవెంట్ నిర్వహించారు.హీరోయిన్ జుట్టు పట్టుకుని లాగి..ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. డ్యూడ్ చిత్రంలో హీరోను బుగ్గగిల్లి క్యూట్గా ఫీలవుతుంది మమిత. ఈ సీన్ను స్టేజీపై రివర్స్ రోల్స్లో చేశారు. మమిత బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకుని లాగి, కొడుతున్నట్లుగా సీన్లో లీనమైపోయాడు ప్రదీప్. ఇది క్యూట్గా లేదు అని మమిత డైలాగ్ చెప్పింది. వీళ్ల యాక్టింగ్ చూసేవారి ఫీలింగ్ కూడా అదే! అదే విషయాన్ని యాంకర్ బయటకు చెప్పేసింది. ఇది నిజంగానే క్యూట్గా లేదమ్మా.. ఇంత వైలెంట్గా ఉన్నారేంటి? అని నవ్వేసింది. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే వేడుకలో మమిత ఎంతో గ్రేస్తో డ్యాన్స్ చేసింది. చదవండి: యూత్కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ! -
'పృథ్వీరాజ్ సుకుమారన్' కొత్త సినిమా.. పవర్ఫుల్ గ్లింప్స్
మలయాళ నటుడు 'పృథ్వీరాజ్ సుకుమారన్'(Prithviraj Sukumaran) నేడు 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన మలయాళ కొత్త సినిమా 'ఖలీఫా'(Khalifa) నుంచి పవర్ఫుల్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కిస్తున్న రివెంజ్ థ్రిల్లర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు 15ఏళ్ల తర్వాత 'పోక్కిరి రాజా' (2010) మళ్లీ వారిద్దరూ కలిసి ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. అమీర్ అలీగా ఆయన ఈ సినిమాలో కనిపిచనున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. ఇందులో విద్యుత్ జమ్వాల్, సత్యరాజ్, కృతి శెట్టి, ప్రియంవద కృష్ణన్ నటించనున్నారు. 2026 ఓనమ్ పండుగ సందర్భంగా పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది. -
దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. తొలి భారతీయ సెలబ్రిటీగా రికార్డ్
భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంటారు నటి దీపికా పదుకొణె (Deepika Padukone). కేవలం తన నటనతోనే కాకుండా తన స్పీచ్లతోనూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అందుకే ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెటా AIకి తన గొంతును అందించిన తొలి భారతీయ సెలబ్రిటీగా ఆమె నిలిచింది. తాను ఇప్పుడు మెటా ఏఐలో భాగమైనట్లు ఒక వీడియోతో సోషల్మీడియాలో పంచుకున్నారు. ఆమెకు మరోసారి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది.మెటా ఇటీవల ప్రత్యేక ఏఐ చాట్బాట్ యాప్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వివిధ రకాల టెక్స్ట్, ఇమేజ్, వీడియో డేటాతో శిక్షణ ఇవ్వడం వల్ల మీరు అడిగే ప్రశ్నను కూడా విస్తృత స్థాయిలో అర్థం చేసుకుంటుంది. మీతో చాటింగ్ చేయడమే కాకుండా వాయిస్తో సలహాలు, కబుర్లు కూడా చెబుతుంది. మీకు కావాల్సింది ప్రాంప్ట్లను అందిస్తే చాలు మాట్లాడేస్తుంది. ఏదైనా అంశం మీద లోతుగా తెలుసుకోవాలనుకుంటే విశ్లేషణ కూడా చేస్తుంది. ఇప్పుడు ఇవ్వన్ని మీ అభిమాన నటి దీపికా పదుకొనె వాయిస్తో మీరు వినేయవచ్చు. ఆమెతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కానీ, ఆమె వాయిస్ మాత్రం ఏఐ ఆధారంగా మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది.వాయిస్ ఇన్పుట్స్తో మెటా ఏఐ అసిస్టెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు దానికి దీపికా పదుకొణె వాయిస్ తోడవుతుంది. అంటే స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఎప్పుడైనా దీపికతో మాట్లాడొచ్చన్నమాట. మెటా ఏఐలో హాలీవుడ్ నుంచి కొంతమంది ప్రముఖుల వాయిస్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇండియా నుంచి మాత్రం కేవలం దీపికా పదుకొనె వాయిస్ మాత్రమే అందుబాటులోకి రానుంది.ఈ క్రమంలోనే దీపిక ఒక వీడియోను షేర్ చేసుకున్నారు. ఇది చాలా బాగుంది అని తాను అనుకుంటున్నట్లు పేర్కంది. తాను ఇప్పుడు మెటా AIలో భాగమయ్యానని దీంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ అంతటా తన వాయిస్తో ఇంగ్లీషులో చాట్ చేయవచ్చని ఆమె పంచుకున్నారు. ఒక్కసారి దీనిని ప్రయత్నించి ఏమనుకుంటున్నారో తెలియజేయాలని ఆమె కోరారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
కృతిశెట్టి ఎదురుచూపులు.. ఇప్పుడా టైమ్ వచ్చింది
కొందరి హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నా సరే ఒక్కోసారి విజయాలు అందని ద్రాక్షే అవుతంది. నటి కృతిశెట్టి(Krithi Shetty) పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఉప్పెన చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. తొలి సినిమా తర్వాత వరుసగా విజయాలు దక్కాయి. దీంతో టాలీవుడ్లో దూసుకుపోతారనే ప్రచారం జరిగింది. అంతే ఆ తరువాత కృతిశెట్టి నటించిన చిత్రాలు పరాజయం పాలవడం మొదలెట్టాయి. అయితే ఆ తరువాత కోలీవుడ్పై దృష్టి సారించారు. అంతకుముందే తెలుగు, తమిళం భాషల్లో నటించిన ద్విభాషా చిత్రాలు ది వారియర్, కస్టడీ చిత్రాలు పూర్తిగా నిరాశపరచాయి. అయినప్పటికీ అమ్మడికి తమిళంలో అవకాశాలు వరించాయి. అయితే అక్కడ ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉండడం గమనార్హం. తమిళంలో కృతిశెట్టి నటించిన మూడు చిత్రాలు ఇప్పుడు ఒకే నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతుండడం విశేషం. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా కృతిశెట్టి కెరీర్కు హెల్ప్ అవుతుంది. దీంతో అలాంటి విజయం కోసం ఈ అమ్మడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. కార్తీకి జంటగా నటిస్తున్న వా వాద్దియార్ చిత్రం డిసెంబర్ 5న తెరపైకి రానుంది. తర్వాత ప్రదీప్ రంగనాథన్కు జంటగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కావలసింది. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ దీపావళికి తెరపైకి రానుండడంతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్కు వాయిదా పడింది. ఇకపోతే కృతి నటిస్తున్న మరో చిత్రం జీవీ. రవిమోహన్ నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో మరో నాయకిగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. వీటిలో నటి కృతిశెట్టి దశను మార్చే చిత్రం ఏది అవుతుందో చూడాలి. -
ఆ దివ్య తోటలోనికి ఆమె తరలి వెళ్లింది
‘ఆ తోటలోనొకటి ఆరాధనాలయము’ అని గానం చేసి తెలుగువారి అపురూప గాయనిగా నిలిచిన రావు బాలసరస్వతి దివిలోని దివ్య పాటల లోగిలికి తరలి వెళ్లారు.‘మల్లెపూలు మొల్లపూలు కల్వపూలు కావాలా’... అని సుమగీతాలనిచ్చిన రావు బాలసరస్వతి వాడని పూలుండే లోకానికి బయలుదేరారు. గాయనిగా సవాళ్లు ఎదుర్కొన్నా గొంతు ఖైదు చేయబడినా నిలిచిన నాలుగు నిక్కమైన నీలాలతోనే నేటికీ మిలమిలలాడిన ఆమె వజ్రాల నదులు పారే అంబరాల బాట పట్టారు. ఆమెకు తెలుగువారి నివాళి. లలిత సంగీత ప్రపంచపు సురాగమయ జోహారు.ఈ వేళ పొద్దున్నే ఫేస్బుక్లో, ఇతర గ్రూపుల్లో రావు బాలసరస్వతి గారి ఫొటో చూడగానే మనసు కీడు శంకించింది. చాలా రోజులు నుంచి ఆమె ఆరోగ్యం బాగా లేదని తెలుసు. అయినా వున్నారనే ఆలోచన తృప్తినిస్తుంది. ఇంక ఈ రోజు తో ఆ ఆశ లేదు. ఆమె తెలుగువారి తొలి నేపథ్యగాయని అవునో కాదో ఆ చర్చ వేరేగాని తొలి ప్రముఖ నేపథ్య గాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సి.ఆర్.సుబ్బరామన్, ఎస్.రాజేశ్వరరావుల సంగీతంలో ఎన్ని గొప్ప పాటలు. ‘దేవదాసు’లో ఆమె పాడిన ‘తానే మారెనా... గుణమ్మే మారెనా’ పాట ఎంతమందికో ఇష్టం. ఆమె పాడిన ’ఆ తోటలో నొకటి ఆరాధనాలయము’ విని ‘అందులో ఆమె అందగాడెవరే అని గొంతెత్తి పాడుతూ వుంటే మనసు ఎటో వెళ్లిపోతుంది’ అన్నారు మహా రచయిత చలం. అంత మధురమైన స్వరం బాలసరస్వతిది. చాలా ఏళ్ల క్రితం గుంటూరులో ప్రోగ్రాం. కారణం ‘అజో విభో అవార్డు’ ఆమెను వరించింది. ఆ సభకు హాలులో జనం పోటెత్తారు. ఎన్ని రోజులు అయింది! ఆమెని చూడాలి. ఆమె పాట వినాలి. అప్పటికే భర్త ఆంక్షలతో ఆంధ్రదేశం ఆమె పాటకి దూరమై దాదాపు అర్ధ శతాబ్దం అయింది. అందుకే అదో అపురూప అవకాశం అని విజయవాడ నుంచి మేమూ వెళ్ళాం. ఎప్పటిలా నేను పాడనని నిర్వాహకులకి చె΄్పారుట. అవార్డు ఇచ్చాక ‘అమ్మా... ఒక ముక్క పాడండి’ అని ప్రేక్షకులు ఒక్క గొంతుతో అడిగితే సరేనని –చలి గాలి వీచింది – తెరవారబోతోందిఇకనైన ఇలు చేరవా – ఓ ప్రియా ఇకనైన ఇలు చేరవా...పాట వింటూ అందరూ చప్పట్లు కొట్టారు. ఆ ఉద్వేగాన్ని మర్చిపోలేను. అందరి కళ్లలో నీళ్ళు! లేచి నిల్చుని చప్పట్లు. మారుమోగిన హాలు. ఆ తర్వాత ఆమెతో చనువు ఏర్పడ్డాక అడిగాను ’ఎందుకలా పాడనంటారు’ అని . ‘చాలా రోజులుగా పాడలేదు గదా... అప్పటి పాటలా రాకపోతే నాకు బాగుండదు’ అన్నారు. ’ఎవరన్నారు మీ పాట అప్పటి పాటలా లేదని.? వయసుతో మరింత అందం వచ్చింది’ అన్నాను. నిజమే! ఆ గొంతులో మధురిమ ఏ మాత్రం తగ్గలేదు. ‘బెజవాడ వచ్చి నాలుగు రోజులు మీ ఇంట్లో వుంటా, నన్ను పాడమని అడగద్దు’ అన్నారొకసారి. అలాగేనని తీసుకుని వచ్చాను. మహీధర రామ్మోహనరావు గారు, నండూరి రామ్మోహనరావు గారు... ఇలా అందరూ వచ్చారు ఆమెను చూడటానికి. ఆమెకీ వారందరంటే అభిమానమే. అందరూ ఇంట్లో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాక పాట ఎలా ఆగుతుంది? రామ్మోహనరావు గారి కోరిక పై ‘ఆ తోటలో నొకటి ఆరాధనాలయం’ పాడారు. ‘రెల్లు పూల పానుపు పైన ఎవరో వెన్నెల జల్లినారమ్మా!’ అని ఆమె పాడుతూ ఉంటే నిజంగానే వెన్నెల మా అందరి మనసుల్లో. ఆ స్వరం జల్లుజల్లుగా కురిపించింది. అంత మంది పండితులు, కవులు మధ్య కూర్చునే సరికి ఆ కోయిల అలా నాలుగు గంటలసేపు పాడింది! ఎంత భాగ్యం కదా!అదే మొదలు. ఎప్పుడు రావాలి అని అనిపిస్తే అపుడు విజయవాడ రావడం నాలుగు రోజులు వుండడం. మా ఇంట్లో కుదరని పరిస్థితి వచ్చినప్పుడు హేమ పరిమిగారిని అడిగాను. ఆమె ఎంతో సంతోషించి వారి పొదరింట్లో రెండు మూడుసార్లు ఆతిథ్యం యిచ్చారు. బాలసరస్వతి గారి పాట ఎంత మధురమో మనసు అంత సున్నితం. ఒకసారి స్నేహం చేస్తే మర్చిపోరు. ఆత్మీయతను పదిసార్లు గుర్తు తెచ్చుకుంటారు. మనకి ఆమె చిన్నప్పటి నుంచి తెలిసిన చుట్టం అవుతారు. రాగానే ముందు పాత పరిచయాలు గుర్తుకు తెచ్చుకుని వారిని ఒకసారి కలవాలి అని అనుకుంటారు. ‘అమ్మాయి’ అంటూ స్వంత కూతురులా చూసుకుంటారు. అలా వారి పెద్దబ్బాయి, చిన్నబ్బాయి మా వారిని అన్నయ్య అని, నన్ను వదినా అని కలిపేసుకున్నారు. మామయ్య గారి (బాలాంత్రపు రజనీకాంతరావు) పై అభిమానం. వి.ఏ.కే రంగారావు గారి దృష్టిలో ఆమె పాడిన అన్ని పాటలలోకి గొప్పది రజనీ గారు స్వరపరిచిన ‘తన పంతమే తా విడువడు’. ఆమెకు లలితమైన సంగీతం మాత్రమే యిష్టం. సుబ్బరామన్ సంగీతం ఆమెకు యిష్టం. హాయిగా పాడుకోవచ్చు అంటారు. తన గొంతుకు సరిపోయే పాట, సంగీతం అయితేనే పాడతారు. పాట పాడితే అది పదికాలాలు వుండాలి అంటారు. ‘పాట నాకు నచ్చకపోతే ఎంత పెద్దవాళ్ళైనా లేచి వెళ్లి పోతాను’ అంటారామె. అందుకే సంగీత దర్శకులు ‘బాలమ్మా సరేనా?’అని అడిగి ట్యూన్ చేసేవారట. మీరా భజనలు ఎంత గొప్పగా పాడేవారని. వసంతదేశాయి దగ్గర వాటిని నేర్చుకున్నారు. ‘మీరా భజన్ కర్ణాటక పద్ధతిలో పాడితే బాగుండదు’ అని ఆమె స్ధిర అభిప్రాయం. అందుకే హిందీ మాటలు పలికే పద్ధతిని నేర్చుకుని అదే విధంగా పాడేవారు. హిందీ చిత్ర పరిశ్రమలోకి వెళ్ళ లేకపోవడం ఆమెకు కొంచెం అసంతృప్తి. మనసులో కొంచెం ఆ బాధ మిగిలిపోయింది. హిందీ సినీ సంగీతం గురించి ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఈల వినపడితే ఎవరా అని ఇటు అటు చూస్తే ‘నేనే’ అని చిలిపిగా నవ్వేవారు. ‘అమ్మకి అల్లరి ఎక్కువ’ అని ఆమె పిల్లలు కూడా గారాబం చేసేవారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ‘వైఎస్ఆర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్’ యిస్తే వచ్చేందుకు ఆరోగ్యం సహకరించలేదు. ఆ పురస్కారంతో పొటో దిగి పంపారు. ఇక మళ్ళీ ఆమెను చూడలేము. కాని పాట వున్నంత వరకూ ఆమె చిరస్థాయిగా వుండి పోతారు.– ప్రసూన బాలాంత్రపు -
హీరోయిన్ ప్రణీత స్టన్నింగ్ లుక్.. బిగ్బాస్ బ్యూటీ ట్రేడిషనల్ లుక్!
అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత హాట్ ట్రీట్..బర్త్ డే డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్న దివ్యాంగణ సూర్యవన్షీ..బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ట్రేడిషనల్ లుక్..బ్లాక్ శారీలో హీరోయిన్ కాజోల్ గ్లామరస్ లుక్స్..థామా ప్రమోషన్స్లో బిజీ బిజీగా రష్మిక.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1.. దీపావళికి బిగ్ బ్లాస్ట్.. అదేంటంటే!
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ పలు సూపర్ హిట్ సినిమాలను దాటేసింది. ఇప్పటికే కూలీ, జైలర్, బాహుబలితో పాటు కాంతార రికార్డ్ను సైతం బ్రేక్ చేసింది. కన్నడలో అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో కొనసాగుతోంది.అయితే ఒకవైపు బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగిస్తుంటే.. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కాంతార చాప్టర్-1 థియేటర్లలో రన్ అవుతోంది. ఇలాంటి సమయంలో ట్రైలర్ ఏంటని సినీ ప్రియులు పెద్ద డైలమాలో పడ్డారు. సినిమా విడుదలై రెండు వారాలు అయ్యాక ట్రైలర్ ఏంటని తెగ చర్చించుకుంటున్నారు. దీపావళి ట్రైలర్ పేరుతో ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు 12 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు మేకర్స్. దీంతో ఆడియన్స్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులకు ఏదైనా బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నారేమో తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే. The divine roar continues to light up screens worldwide 💥#KantaraChapter1 Deepavali Trailer out Tomorrow at 12:07 PM.Experience the ultimate cinematic celebration of Dharma.#BlockbusterKantara running successfully in cinemas near you! 🔥#KantaraInCinemasNow… pic.twitter.com/1R6xFJR2P9— Hombale Films (@hombalefilms) October 15, 2025 -
గుర్తు పెట్టుకోండి.. మీరు కూడా బతికేది సినిమాపైనే.. బన్నీవాసు స్వీట్ వార్నింగ్!
టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు (Bunny Vasu) ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలకిచ్చే రేటింగ్స్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో మూవీ రేటింగ్స్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు మీ సైట్లో.. యాప్లో సినిమాలకు రేటింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. ఇవన్నీ చీప్ ట్రిక్స్ అని బన్నీవాసు విమర్శించారు. జర్నలిస్టులు మన చిత్రాలకు విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కదా.. అలాంటప్పుడు మీ రేటింగ్స్ ఎందుకని నిలదీశారు. టికెట్ కొనే సమయంలోనే ఈ సినిమా బాగుంది..ఇది బాగాలేదని రేటింగ్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇవాళ మిత్రమండలి మూవీ టీమ్ నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన కామెంట్స్ చేశారు.బాగున్నా సినిమాలకు ఎప్పుడు తేడా రాదని బన్నీ వాసు అన్నారు. మీరు కూడా సినిమా మీదే బ్రతుకుతున్నారని గుర్తు పెట్టుకోండని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఆ లైక్స్.. రేటింగ్స్ ఎవరు ఇస్తున్నారో కూడా అథాంటికేషన్ ఉండదని.. దానికి మెకానిజం ఏంటో కూడా తెలియదని బన్నీ వాసు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ టాలీవుడ్లో చర్చకు దారితీశాయి.కాగా.. బన్నీ వాసు సమర్పణలో వస్తోన్న చిత్రం మిత్ర మండలి. ఈ మూవీలో ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక ఎన్ఎం, విష్ణు, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విజయేంద్ర ఎస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. -
కొత్త లోకా నటి బర్త్ డే.. తనకు తానే బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
బర్త్ డే వచ్చిందంటే చాలు.. సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలు, ఖరీదైన బహుమతులు సర్వ సాధారణం. తాజాగా అలాగే ఓ ప్రముఖ నటి తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ అహానా కృష్ణ తన బర్త్డేను స్పెషల్గా మార్చేసుకుంది. 30 ఏట అడుగుపెడుతున్న వేళ ఖరీదైన బహుమతిని తనకు తానే ఇచ్చుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించింది.తన బర్త్ డే కానుకగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.93 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల వయస్సు నుంచి 30లోకి అడుగుపెట్టినందుకు కొంచెం బాధగా ఉందని రాసుకొచ్చింది. నాకు ఫుల్ సపోర్ట్గా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఎందుకంటే నాకు నచ్చినట్లుగా జీవించే హక్కు కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. నేను సాధించిన ప్రతిదానికీ మీరే కారణమంటూ పేరేంట్స్ను కొనియాడింది. నా కలలును నిజం చేసినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటానని అహానా కృష్ట ఫోటోలను షేర్ చేసింది.కాగా.. నటుడు కృష్ణ కుమార్ కుమార్తె అయినా అహాన కృష్ణ 2014లో సినిమాల్లో అడుగుపెట్టింది. జాన్ స్టీవ్ లోపెజ్ మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత లూకా, అడి వంటి చిత్రాల్లో నటించింది. ఆమె చివరిసారిగా ఈ ఏడాది నాన్సీ రాణిలో కనిపించింది. కల్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా: చాప్టర్ 1 - చంద్ర(కొత్త లోకా) చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) -
పనిమనిషికి ఆస్తి.. ఆమె కాళ్లపై పడి దండం పెట్టా: రంగనాథ్ కుమారుడు
పెద్దరికం, రాజసం, గాంభీర్యం.. ఆయన కనిపిస్తే ఇవన్నీ కలపోసినట్లుగా ఉంటాయి. ఆయనే టాలీవుడ్ నటుడు రంగనాథ్. మూడు వందలకు పైగా సినిమాలు చేసిన ఆయన 2015లో తన నివాసంలో ఉరేసుకుని చనిపోయారు. గోడలపై పనిమనిషి మీనాక్షి పేరు రాసి తన పేరిట ఉన్న బాండ్స్ను ఆమెకు అప్పగించాలని కోరారు. రంగనాథ్ జీవితం గురించి, చివరి రోజుల గురించి ఆయన కుమారుడు నాగేంద్ర కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.అమ్మ చనిపోయాక..'1995లో అమ్మ మంచానపడింది. నడుము కింది భాగానికి స్పర్శ లేకుండా పోయింది. తను ఎప్పటికీ కోలుకోలేదని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నాన్న, నేను ఇంటిపనులు విభజించుకున్నాం. నాన్న వంట చేస్తే నేను ఇల్లు తుడిచి గిన్నెలు తోమేవాడిని. అమ్మ బాత్రూమ్ వెళ్తే కూడా మేమిద్దరమే క్లీన్ చేసేవాళ్లం. మనుషుల్ని మాట్లాడుకున్నా కొద్దిరోజులకే పని మానేసేవారు. అక్క పెళ్లి కోసం నాన్న ఇల్లమ్మేశాడు. అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. రూ.800 అద్దె ఇంట్లోకి..సినిమాలు తగ్గిపోవడంతో రూ.2,500 అద్దె కడుతున్న ఇంటి నుంచి రూ.800 అద్దె ఉన్న ఇంటికి మారాం. ఆర్థిక పరిస్థితి బాగోలేదని అర్థమైంది. ఇలాగైతే కష్టమని నేను దుబాయ్ వెళ్లి సంపాదిస్తానన్నాను. నాన్న ఒప్పుకోకపోయినా దుబాయ్ వెళ్లాను. అందుకు నాపై కోపంతో ఏడాదిన్నరపాటు మాట్లాడలేదు. అయినా అక్కడే రెండేండ్లు ఉండి ఇండియాకు వచ్చేశా.. అమ్మకోసమైనా ఉండిపోరా అన్నాడు. అందుకే పనిమనిషికి ఆస్తిమళ్లీ రూ.2500 అద్దె ఉన్న పాత అపార్ట్మెంట్కు షిఫ్ట్ అయ్యాము. మీనాక్షి మా పనిమనిషి. అమ్మను బాగా చూసుకునేది. అమ్మ చనిపోయాక నాన్నను మాతో పాటు రమ్మన్నాం. కానీ నాన్న ప్రైవసీ కావాలన్నారు. స్వేచ్ఛగా జీవించాలనుకున్నారు. ఆయనకు అడ్డు చెప్పలేకపోయాం. మీనాక్షి.. తనకు ఇల్లు కావాలని అడిగిందని విన్నాను. అందుకే నాన్న చనిపోయేముందు ఆమె కోసం కొంత ఆస్తి రాసిచ్చి పోయాడు. ఏదేమైనా మా అమ్మానాన్న కోసం చాలా సేవ చేశావని మీనాక్షి కాళ్లపై పడి దండం పెట్టుకున్నాను. పదోసారి ప్రాణం పోయిందినేను కట్టుకున్న భార్య గతేడాది చనిపోయింది. ఆమె మనసు స్థిమితంగా ఉండదు. తొమ్మిదిసార్లు చనిపోయేందుకు ప్రయత్నించింది. ప్రతిచిన్నదానికి ఎక్కువ భయపడి, బెదిరిపోయి ట్యాబ్లెట్లు మింగేది. పదోసారి అలాగే చేసింది. కానీ, ఈసారి డోసు ఎక్కువయ్యేసరికి చనిపోయింది. నా భార్య చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు. అప్పుడే బంధుత్వాలను తెంచేసుకున్నా.. నా కొడుకుతో బతుకున్నాను. నాన్న ఎడమచేతికి తెలియకుండా కుడిచేత్తో దానధర్మాలు చేసేవాడు. ఆయన సంపాదించిందంతా ఆయనే ఖర్చు చేశారు. మాకేమీ ఇవ్వలేదు' అని నాగేంద్ర కుమార్ చెప్పుకొచ్చాడు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. -
ఓటీటీకి తెలుగు రొమాంటిక్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఎంత పెద్ద సినిమాలైనా నెల రోజుల తర్వాత ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్లకైతే కొదవే లేదు. వారంలో నాలుగైదు వెబ్ సిరీస్లే ఉంటున్నాయి. వీటిలో క్రైమ్, రొమాంటిక్ ఓరియంటేడ్ స్టోరీలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగులో మరో ఆసక్తికర సిరీస్ అలరించేందుకు వచ్చేస్తోంది.తెలుగులో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఆనందలహరి (Ananda lahari). ఈ సిరీస్లో ఆనంద్, లహరి అనే యువ జంట చుట్టూ తిరిగే ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పాన్ గోదావరి అంటూ ఈస్ట్ అబ్బాయి, వెస్ట్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ, పెళ్లి నేపథ్యంలో తీశారు. ఇందులో అభిషేక్, భ్రమరాంబిక జంటగా నటించారు ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఈ నెల 17 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్కు సాయి వానపల్లి దర్శకత్వం వహించారు.2 days to go!Not just another love story… it’s an Anandalahari of fun, drama & heart!Oct 17th, witness how East meets West — in love, war & Flexi Raju style! 😎@sureshProdns @SouthBayLive#aha #SureshProductionsmini pic.twitter.com/AuSbATe8uz— ahavideoin (@ahavideoIN) October 15, 2025 -
తమిళ సినిమాకు తెలుగులో క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్లో ఊహించని రికార్డ్!
డ్రాగన్ మూవీతో తెలుగు ఆడియన్స్లోనూ క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ ఏడాదిలో రిలీజైన చిత్రం కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అదే ఊపులో మరో రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా వస్తోన్న లేటేస్ట్ సినిమా డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో కీర్తీశ్వరన్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ మూవీ రిలీజ్కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్లు ఓపెన్ కావడంతో ఓవర్సీస్లో హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తమిళ సినిమాకు తెలుగు ఆడియన్స్ ఎక్కువగా టికెట్స్ బుక్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు తమిళ వర్షన్కు 27 వేల డాలర్లు రాగా.. తెలుగు వర్షన్కు 32 వేల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ సినిమా విడుదలకు ముందే కలెక్షన్స్ జోరు చూస్తుంటే సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలైన లవ్ టుడే (2022), డ్రాగన్ (2025) తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి. లవ్ టుడే తెలుగు వెర్షన్ రూ.11.81 కోట్ల నికర కలెక్షన్లు సాధించింది. ఓవరాల్గా ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.66.57 కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో డ్రాగన్ చిత్రానికి రూ.18.68 కోట్లు రాగా.. ఇండియాలో రూ.101.34 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా.. ఇప్పటికే డ్యూడ్ భారతదేశంలో రూ.17.26 లక్షలు ముందస్తు బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, శరత్ కుమార్, హృదు హరూన్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. -
ప్రెగ్నెన్సీతో పరిణీతి చోప్రా.. పుట్టబోయే బిడ్డకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్!
బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. 2023లో రాజకీయ నాయకుడితో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా సినిమాలు చేయడం తగ్గించింది. గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించింది. ప్రస్తుతం కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్లో నటించింది.సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే హీరోయిన్ పరిణితి చోప్రా బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలోనే పరిణీతికి మరో స్టార్ హీరోయిన్ గిఫ్ట్ను పంపి సర్ప్రైజ్ ఇచ్చింది. డెలివరీకి ముందే పుట్టబోయే బిడ్డ కోసం బహుమతి పంపిన విషయాన్ని పరిణీతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.(ఇది చదవండి: అలాంటి డ్రెస్లో సోనాక్షి.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసినట్టేనా!) మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న పరిణీతి చోప్రాకు స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) సర్ప్రైజ్ ఇచ్చింది. తన సొంత బ్రాండ్ అయిన ఎడ్-ఎ-మమ్మా నుంచి సరికొత్త హ్యాంపర్ను గిఫ్ట్గా పంపింది. ఆలియా భట్ బహుమతిపై పరిణీతి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది. తన బిడ్డకోసం గిఫ్ట్ పంపినందుకు ధన్యావాదాలు తెలిపింది. కాగా.. పరిణితి చోప్రా ఇటీవలే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కనిపించింది. ఆ తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకుంది.అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. బాలీవుడ్లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు పంకజ్ ధీర్(Pankaj Dheer) ( 68) ఇవాళ కన్నుమూశారు. కొన్నేళ్ల పాటు క్యాన్సర్తో పోరాడిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే క్యాన్సర్కు పలుసార్లు శస్త్ర చికిత్స జరిగినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పంకజ్ మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికాగ సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం ముంబయిలోని విలే పార్లేలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఇది చదవండి: తొలి తెలుగు సింగర్ ఇక లేరు)కాగా.. పంకజ్ ధీర్ నవంబర్ 9.. 1956న పంజాబ్లో జన్మించారు. 1980 ప్రారంభంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్లో బుల్లితెరతో పాటు సినిమాల్లో నటించారు. బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్ సీరియల్లో కర్ణుడి పాత్రలో మెప్పించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. మహాభారతంతో పాటు చంద్రకాంత(1994–1996), ది గ్రేట్ మరాఠా, ససురల్ సిమర్ కా లాంటి సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా సడక్, బాద్షా, సోల్జర్ వంటి చిత్రాలలో కూడా కనిపించారు.అయితే అనితా ధీర్ను పంకజ్ వివాహం చేసుకున్నాడు. వీరికి నికితిన్ ధీర్ అనే కుమారుడు ఉన్నాడు. అతను కూడా నటనలో రాణిస్తున్నారు. ఆయన కుమారుడు నికితిన్ బుల్లితెర నటి క్రతికా సెంగర్ను వివాహం చేసుకున్నాడు. అతను తన తండ్రి పంకజ్ ధీర్తో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. Actor Pankaj Dheer, played Karn in Mahabharat, Passed Away. Om Shanti🙏#pankajdheer pic.twitter.com/uJSTFoOb4b— Sumit Kadel (@SumitkadeI) October 15, 2025 -
అలాంటి డ్రెస్లో సోనాక్షి.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసినట్టేనా!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర మూవీలో కీలక పాత్రలో కనిపిచంనుంది. ఇటీవలే సోనాక్షి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. స్పెషల్ సాంగ్ను సైతం విడుదల చేశారు. ధన పిశాచి పేరుతో విడుదలైన పాట ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ మూవీలో సోనాక్షి విలన్ లాంటి పాత్రలో కనిపించనుంది. టీజర్లోనూ సోనాక్షి లుక్స్ అభిమానులను అలరించాయి.అయితే సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ముద్దుగుమ్మ గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ముంబయిలో జరిగిన వెడ్డింగ్ వేడుకలో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. అయితే గత కొన్ని రోజులుగా సోనాక్షి ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరు జంటగా ఓ ఈవెంట్లో కనిపించారు. ఇందులో సోనాక్షి వదులుగా ఉండే అనార్కలి సూట్లో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనాక్షి గర్భవతి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆమె ఫేస్ చూస్తుంటే ఈ వార్త నిజమేనని అనిపిస్తోందని ఏకంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. ఫోటోలకు పోజులిచ్చే సమయంలో సోనాక్షి తన చేతితో బేబీ బంప్ను దాచేందుకు ప్రయత్నించిందని మరికొందరు పోస్టులు పెట్టారు.అయితే ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి, జహీర్ ఎలాంటి ప్రకటనైతే చేయలేదు. ఈ ఏడాది జూలైలోనూ సోనాక్షి తాను ఎప్పుడూ గర్భవతి అని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారో వెల్లడించింది. జహీర్తో తన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ను కూడా పంచుకుంది. అయితే జహీర్తో పెళ్లి తర్వాత సోనాక్షిని నెట్టింట తెగ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. ఎంతో ఏడ్చా!
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఐటం గర్ల్గా పలు సినిమాలు చేసింది దీప్షిక నగ్పాల్ (Deepshikha Nagpal). షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'కోయిల' మూవీ (Koyla Movie)లో ఓ అభ్యంతకర సన్నివేశంలో యాక్ట్ చేసింది. అందులో దుస్తులు తొలగిస్తున్నట్లుగా కనిపించినప్పటికీ.. అది నిజం కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కోయిల మూవీ డైరెక్టర్ రాకేశ్ సర్ నాకు ఆ సన్నివేశం గురించి ముందే చెప్పారు. నా తల్లి ఎదురుగానే సీన్ వివరించారు. సరే, షూటింగ్ ఎప్పుడు? అని ఎటువంటి బెరుకు లేకుండా అడిగాను.డ్రెస్ ధరించే సీన్ కంప్లీట్ చేశానేను చెప్పింది అంతా గుర్తుందిగా? అని ఆయన మరోసారి క్రాస్చెక్ చేసుకున్నారు. గుర్తుందని బదులిస్తూనే మీరేం భయపడవద్దని ధైర్యం చెప్పాను. కెమెరాను నా ఎదురుగా కాకుండా టాప్ యాంగిల్లో పెట్టమన్నాను. కేవలం నా భుజాల వరకే కనిపించేలా జాగ్రత్తపడ్డాను. నేను డ్రెస్ తీసేస్తున్నట్లుగా మీకు కనిపించింది కానీ, మినీ టాప్, అలాగే జీన్స్ నా ఒంటిపై అలాగే ఉన్నాయి. బట్టలు ధరించే ఎంతో సులువుగా ఆ సీన్ పూర్తి చేశాం. కానీ సినిమా రిలీజయ్యాక ఆ సీన్ ఎంతో వివాదాస్పదమైంది. హేళన చేశారుకెమెరా ముందు దుస్తులు తొలగించావా? అని నా అనుకున్నవాళ్లే నన్ను దారుణంగా విమర్శించారు. ఆ మాటలకు ఎన్నోసార్లు ఏడ్చాను. ఒకసారి నా కూతురు కోయిల సినిమా సీడీని కోపంతో విరిచేసింది కూడా! సినిమాల్లోలాగే నిజ జీవితంలో కూడా నేను అలాగే చేస్తానని నా క్యారెక్టర్ను తప్పుపట్టారు. నా పిల్లలు కూడా నన్ను గౌరవించరని హేళన చేశారు అని చెప్తూ ఎమోషనలైంది. ఒకప్పుడు సినిమాలు చేసిన దీప్షిక.. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తోంది. ఈమెకు రెండు పెళ్లిళ్లవగా రెండుసార్లు విడాకులయ్యాయి. హిందీ బిగ్బాస్ 8వ సీజన్లో పాల్గొనగా మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయింది.చదవండి: బాయ్ఫ్రెండ్ ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోను: ఫ్లోరా సైనీ -
నెలలోపే ఓటీటీలోకి మంచు లక్ష్మీ థ్రిల్లర్ సినిమా
మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మీ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ చెప్పుకోదగ్గ సినిమాలే రీసెంట్ టైంలో ఏం రాలేదు. కొన్నాళ్ల క్రితం ఓటీటీ కోసం హిందీలో ఓ షో చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గత నెలలో లీడ్ రోల్ చేసిన ఓ తెలుగు సినిమా రిలీజైంది. ఇప్పుడది ఓటీటీలోకి కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)మంచు లక్ష్మీ పోలీస్గా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దక్ష'. మోహన్ బాబు అతిథి పాత్రలో కనిపించారు. మర్డరీ మిస్టర్ థ్రిల్లర్ స్టోరీతో తీశారు. సెప్టెంబరు 19న థియేటర్లలోకి వస్తే.. వచ్చిన విషయం కూడా చాలామందికి తెలియనంత వేగంగా వెళ్లిపోయింది. ఇప్పుడు అక్టోబరు 17 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మంచు లక్ష్మీనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి బిగ్ స్క్రీన్పై తేలిపోయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?'దక్ష' విషయానికొస్తే.. హైదరాబాద్లో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణిస్తాడు. ఆ కేసును సీఐ దక్ష (లక్ష్మీ మంచు) ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధి హత్యకు గురవుతాడు. ఈ రెండు కేసుల్లో క్లూస్ ఒకేలా ఉంటాయి. మరోవైపు దక్ష మీద డాక్యుమెంటరీ తీయాలని జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. అతడు సేకరించిన సమాచారంతో నమ్మశక్యం కాని ఓ నిజం వెలుగులోకి వస్తుంది. ఇంతకీ హత్యలు చేసింది ఎవరు? దక్ష, మిథిలా (చిత్రా శుక్లా)కు సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్) -
మెగా హీరో 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ రిలీజ్
మెగాహీరో సాయితేజ్ నుంచి గత రెండేళ్లుగా ఎలాంటి సినిమా రాలేదు. 2023లో 'విరూపాక్ష'తో సక్సెస్ అందుకున్నప్పటికీ.. పవన్తో కలిసి నటించిన 'బ్రో' ఫ్లాప్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు 'సంబరాల ఏటిగట్టు' అనే మూవీతో రాబోతున్నాడు. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)గ్లింప్స్ బట్టి చూస్తే మాస్ యాక్షన్ మూవీ అని క్లారిటీ వచ్చింది. అయితే విజువల్స్ అన్నీ 'కేజీఎఫ్'లో నరాచీని గుర్తుచేసేలా కనిపించాయి. సాయితేజ్ బాడీ బిల్డింగ్ అంతా బాగానే ఉంది. గ్లింప్స్లోనూ కథ ఎలా ఉండబోతుందనే రివీల్ చేశారు. లెక్క ప్రకారం గత నెలలోనే సినిమా రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా గ్లింప్స్లో మూవీ రిలీజ్ డేట్ వేయలేదు. మరి ఈ ఏడాది తీసుకొస్తారా లేదంటే వచ్చే ఏడాది థియేటర్లలోకి మూవీ వస్తుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మాధురి వస్తువు దొంగతనం.. గొడవ పడాలని చూస్తున్నావా?) -
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్
కల్పిత కథలతో సినిమాలు తీయడం సులభమే. కానీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూవీస్ తీసి హిట్ కొట్టడం చాలా కష్టం. కొన్నిసార్లు మాత్రం ఇలా తీసి బ్లాక్ బస్టర్ కొడుతుంటారు లేదంటే చూసే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ అందిస్తుంటారు. ఈ మధ్య అలా వచ్చిన 'ద లాస్ట్ బస్' అనే చిత్రం మూవీ లవర్స్కి మంచి అనుభూతి ఇస్తూ తెగ నచ్చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)కథేంటి?అది 2018. అమెరికాలోని కాలిఫోర్నియా. కెవిన్ (మాథ్యూ మెక్ కొనాగే) స్కూల్ బస్ డ్రైవర్. ఇతడికి నడవలేని స్థితిలో ఉండే తల్లి, టీనేజ్ కొడుకు ఉంటారు. ఓ రోజు డ్యూటీలో భాగంగా పిల్లల్ని స్కూల్లో దింపేసి కెవిన్.. ఇంటికి తిరిగొచ్చే దారిలో ఉంటాడు. అప్పుడే ఆ ప్రాంతమంతా కార్చిచ్చు అంటుకుంటుంది. దీంతో స్కూల్లో ఉన్న 22 మంది పిల్లల్ని మరోచోటకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కెవిన్పై పడుతుంది. ఓవైపు ఊళ్లకు ఊళ్లు తగలబడిపోతుంటాయి. మరోవైపు కెవిన్.. ఈ పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలి? మరి కెవిన్ ఏం చేశాడు? చివరకు పిల్లలతో పాటు బతికి బయటపడ్డాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమాని నిజంగా జరిగిన సంఘటనల స్ఫూర్తితో తీశారు. 2018లో కాలిఫోర్నియాలో కార్చిచ్చులో 85 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఊళ్లకు ఊళ్లు బూడిదయ్యాయి. ఇదంతా జరుగుతున్న సమయంలోనే కెవిన్ అనే సాధారణ స్కూల్ బస్ డ్రైవర్.. ఊళ్లని తగలబెట్టేసే మంటల్ని దాటుకుని 22 మంది పిల్లల్ని సాహసోపేతంగా ఎలా కాపాడాడనేదే 'ద లాస్ట్ బస్' మూవీ.పేరుకే ఇది సినిమా. కానీ చూస్తున్నప్పుడు ఏ మాత్రం అలా అనిపించదు. చాలా రియలస్టిక్గా ఉంటుంది. మనం కూడా ఆ బస్సులోనే ఉన్నామా అని ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఈ రేంజు విజువల్స్, గ్రాఫిక్స్ ఎలా తీశార్రా అని కచ్చితంగా సందేహం వస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క సీన్ కూడా గ్రాఫిక్స్లా అనిపించదు. ఫస్టాప్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది గానీ సెకండాఫ్కి వచ్చేసరికి సర్వైవల్ థ్రిల్లర్ జానర్లోకి వస్తుంది. తర్వాత ఏమవుతుందా అనే టెన్షన్ మనల్ని కుదురుగా కూర్చోనివ్వదు.ఏదైనా ఆపద వచ్చినప్పుడు 'ప్రెజెన్స్ ఆఫ్ మైండ్' అనేది చాలా కీలకం. ఇందులో బస్ డ్రైవర్ కెవిన్ ఆలోచన విధానం చూస్తే అదే గుర్తొస్తుంది. తొందరపడటం కంటే కొన్నిసార్లు ఏం చేయకుండా అలా ఉండటం కూడా ఒకందుకు మంచిదే అనేలా ఓ సీన్ ఉంటుంది. కానీ కార్చిచ్చు వీళ్ల దగ్గరకు కూడా వచ్చేసరికి మంటల్లోని బస్ పోనిచ్చే సీన్ అయితే ప్రీ క్లైమాక్స్లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చివరకొచ్చేసరికి హ్యాపీ ఎండింగ్తోనే ముగించడం సంతోషం.సినిమాలో కనిపించిన నటీనటులు ఎవరూ మనకు తెలియదు. కానీ వాళ్లతో పాటు మనం కూడా ట్రావెల్ అవుతాం. అయితే సినిమాలో ఎమోషన్స్, డ్రామా లాంటివి ఇంకా పెట్టొచ్చు కానీ దర్శకుడు ఆ పనిచేయలేదు. అది మాత్రం కాస్త వెలితిగా అనిపిస్తుంది. సెప్టెంబరు 19న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. అక్టోబరు 03 నుంచి ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతోనూ చూడొచ్చు. ఒకవేళ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు) -
ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్
ఏడాదిలో కచ్చితంగా మూడు నాలుగు సినిమాలైన తీసే విజయ్ ఆంటోనీ.. ఈ ఏడాది ఇప్పటికే 'మార్గన్' అనే మూవీతో వచ్చాడు. థియేటర్లలో ఆడనప్పటికీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. గత నెలలో 'భద్రకాళి' అనే డబ్బింగ్ బొమ్మతో వచ్చాడు. థియేటర్లలో దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)స్వతహాగా సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోనీ.. 'బిచ్చగాడు'తో హిట్ కొట్టి తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చాలా సినిమాలు తీస్తున్నాడు గానీ వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు అరుణ్ ప్రభు దర్శకత్వంలో 'భద్రకాళి' అనే పొలిటికల్ థ్రిల్లర్ చేశాడు. ఇందులో హీరోగా నటించడంతో పాటు సంగీతం, నిర్మాణం కూడా విజయ్ ఆంటోనీదే. సెప్టెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలోకి రాగా.. వచ్చే శుక్రవారం(అక్టోబరు 24) నుంచి హాట్స్టార్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'భద్రకాళి' విషయానికొస్తే.. కిట్టు (విజయ్ ఆంటోనీ) సెక్రటేరియట్లో ఓ పవర్ బ్రోకర్. ప్రభుత్వంలోని ఎలాంటి పని అయినా సరే చిటికలే చేసి పెడుతుంటాడు. అలా ఓసారి కేంద్ర మంత్రి లతకు సంబంధించిన రూ.800 కోట్ల భూముల వ్యవహారంలో వేలు పెడతాడు. అంతా సవ్యంగానే జరిగినా చివరలో ఓ ఎమ్మెల్యే హత్య జరగడం, దాని వల్ల లతకు రాజకీయంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏం జరిగిందా అని ఆరా తీయగా.. కిట్టు గురించి, అతడు వెనకేసిన రూ.6,200 కోట్ల గురించి తెలుస్తుంది. అసలు కిట్టు ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
మాధురి వస్తువు దొంగతనం.. గొడవ పడాలని చూస్తున్నావా?
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మంచి ఊపు మీద ఉన్నట్లున్నారు. గొడవలు పెట్టుకోవడమే పనిగా ప్రతిదానికి రచ్చ రచ్చ చేస్తున్నారు. మాధురి అయితే ఇప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిపోయింది. బుధవారం అటు సంజనతో ఇటు దివ్యతో గొడవలు పెట్టేసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. చూస్తుంటే 38వ రోజు గట్టిగానే డ్రామా ఉండబోతుందనిపిస్తోంది.ఉదయం లేవడం లేవడమే.. వంటగదిలోకి వచ్చిన మాధురి, బాత్రూమ్లో ఉంచిన తన స్టిక్కర్స్ని ఎవరు తీశారని సీరియస్ అయింది. సంజననే అవి తీసి పడేశానని అనడంతో.. నావి ఎందుకు తీస్తున్నావ్? అయినా నీకు దొంగతనం అలవాటేగా అని రెచ్చిపోయింది. మరోచోట కెప్టెన్ కల్యాణ్తో దివ్య మాట్లాడుతూ.. వీళ్లంతా మెంటల్ గాళ్లు అని రెండు మూడు రోజుల క్రితం వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి నోరు జారింది. స్మార్ట్, మెంటలో కాదు ఏదోటి కనిపించేయాలి, కంటెంట్ ఇచ్చేయాలి అన్నట్లు చేస్తున్నారని చెప్పుకొచ్చంది.(ఇదీ చదవండి: తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!)దీని తర్వాత కిచెన్లో ఉన్న ఎగ్ దోశలు వేసుకున్న మాధురి, కొంత కూర కూడా ప్లేటులో వేసుకుంది. నన్ను అడగకుండా ఎందుకు వేసుకున్నారని దివ్య అడిగేసరికి.. కొద్దిగా వేసుకున్నాను అని మాధురి సమాధానమిచ్చింది. ఒక్క సెకన్ అరవకండి అని దివ్య అనేసరికి.. వచ్చిన నుంచి గొడవ పడాలని చూస్తున్నావా అంటూ మాధురి సీరియస్ అయింది. నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చేయండి అని చెప్పింది.పర్సనల్గా నాకు మీకు బాండింగ్ అవసరం లేదు అని దివ్య అనగానే.. నాకు అస్సలు అవసరం లేదమ్మా, మీ బాండింగ్లు నాకెందుకు వాట్ ఏ జోక్, మేం బాండింగ్స్ కోసం వచ్చామనుకున్నారా? గేమ్ కోసం వచ్చామనుకున్నారా? నాన్న నాన్న అనుకుంటూ అని దివ్యని ఎగతాళి చేస్తున్నట్లు మాధురి మాట్లాడింది. ఎవరన్నారు అని దివ్య అనగానే.. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారట అని మాధురి సామెత చెబుతూ తనూజవైపు చూసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?) -
తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!
వైల్డ్ కార్డ్స్ రావడం ఏమో గానీ బిగ్బాస్ తెలుగు షోలో కాస్త జోష్ వచ్చింది. మాధురి, రమ్య తదితరుల గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది. వీళ్లతో పాటు వచ్చిన లేడీ వైల్డ్ కార్డ్ ఆయేషా.. నామినేషన్స్లో ప్రతాపం చూపించేసింది. తనూజని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. అంతా బాగానే ఉంది గానీ ఇమ్మాన్యుయేల్ ప్లేటు తిప్పేయడం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ 37వ రోజు అసలేం జరిగింది?సగం నామినేషన్స్తో సోమవారం ఎపిసోడ్ ఆగింది. అక్కడనుంచే మంగళవారం(అక్టోబరు 14) ఎపిసోడ్ మొదలైంది. ఈసారి పైనుంచి పడిన పట్టుకున్న మాధురి.. దాన్ని రీతూ చౌదరికి ఇచ్చింది. సమయమొచ్చినప్పుడు అండగా ఉంటానని మాట తప్పినందుకు భరణిని, తర్వాత దివ్యని నామినేట్ చేసింది. దీంతో రీతూ-దివ్య మధ్య చాలాసేపు వాదన నడిచింది. టైమ్ వచ్చినప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా అని చెప్పి కౌంటర్ ఇచ్చింది. నన్ను టార్గెట్ చేసినోళ్లు వెళ్లిపోతున్నారు. కానీ వాళ్లని నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు అని భరణి సీరియస్ అయిపోయాడు. చివరకు మాధురి.. దివ్యని నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?)ఈసారి బంతి గౌరవ్కి దొరికింది. దీంతో సంజనకు దాన్ని అందించాడు. నా ఆరోగ్యం బాగోలేదు. మీకు కనిపించలేదా? అంటూ గతవారం సంచాలక్గా చేసిన రాముని, తర్వాత భరణిని నామినేట్ చేసింది. ఎప్పటిలానే రాము పెద్దగా ఏం మాట్లాడలేదు. భరణి మాత్రం సంజనపై సీరియస్ అయిపోయాడు. మీరు గూండాలు అనడం సరికాదు, సంజనని వెంటనే బయటకు పంపు అనే మాట అని ఉంటే ఇప్పుడే వాకౌట్ చేస్తా అని భరణి శపథం చేశాడు. అంతా అయిన తర్వాత గౌరవ్.. భరణి పేరు ఫిక్స్ చేశాడు. తర్వాత కూడా గౌరవ్ బంతిని పట్టుకున్నాడు. కానీ అడగటంతో ఆయేషాకి ఇచ్చేశాడు.ఆయేషా.. బంతిని తీసుకెళ్లి సుమన్ శెట్టికి ఇచ్చింది. అతడేమో తనూజ, సంజనని నామినేట్ చేశాడు. దీంతో ఆయేషా అందుకుంది. నీ వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోంది. నీకున్న బాండింగ్స్ వల్ల ఫేవరిజం జరుగుతోంది. నీ వల్ల భరణి గేమ్ పాడవుతోందనిపిస్తోంది. స్టార్ మాలో సీరియల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ అది అక్కర్లేదు. బాయ్ ఫ్రెండో నాన్నో ఉంటే ఫైనల్ వరకు వచ్చేస్తాం అన్నట్లు ఉంది అని కల్యాణ్, భరణితో బాండింగ్ గుర్తుచేస్తూ తనూజని ఆయేషా టార్గెట్ చేసింది. దీంతో తనూజ కూడా రెచ్చిపోయింది. నువ్వు కూడా ఇంతకుముందు బాల్ కోసం సపోర్ట్ అడిగావ్గా అని బయటపెట్టింది. చివరకు నా టార్గెట్ నువ్వే అని తనూజని ఆయేషా నామినేట్ చేసింది. కెప్టెన్ కల్యాణ్.. తన పవర్ ఉపయోగించి రాముని నామినేట్ చేశాడు.మొత్తంగా ఈ వారం రాము, తనూజ, భరణి, దివ్య, సుమన్ శెట్టి, పవన్ నామినేషన్స్లో నిలిచారు. సరే దీని గురించి పక్కనబెడితే మొన్నటివరకు తనూజతో తిరిగిన ఇమ్మాన్యుయేల్.. ఆయేషా ఈసారి తనూజని టార్గెట్ చేసిన తర్వాత ప్లేటు తిప్పేశాడు. తనూజ vs ఆయేషా గొడవ జరుగుతున్నప్పుడు చప్పట్లు కొట్టాడు. అంతా అయిపోయిన తర్వాత 'సూపర్గా చెప్పావ్' అని ఆయేషాతో అన్నాడు. ఇదంతా చూస్తుంటే హౌసులో ఈ వారమంతా వాడీవేడీగా ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం) -
తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?
మరో తెలుగు హీరోయిన్ వివాదంలో నిలిచింది. బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుతో వివాదం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సదరు మేకప్ ఆర్టిస్ట్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడంతో ఈ సంగతి బయటపడింది. సదరు హీరోయిన్, ఆమె తల్లిపై లేడీ మేకప్ ఆర్టిస్టు సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?'గత కొన్నిరోజులుగా ఓ స్టార్ హీరోయిన్ నన్ను వేధిస్తోంది. ఆమె టీమ్, కుటుంబ సభ్యులు అయితే చాలా స్టుపిడ్గా ప్రవర్తిస్తున్నారు. దక్షిణాదిలో వాళ్లకు తక్కువ మొత్తానికి లేదంటే ఫ్రీగా పనిచేసినట్లు ఇక్కడ కూడా పనిచేస్తారని అనుకుంటున్నారు. మాకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. నాకు నీతో పనిచేయాలని లేదు. కాబట్టి ఇకపై ఫోన్, మెసేజ్ చేయకు'(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం)'ఆమె కుటుంబానికి చెందిన ఓ మనిషి.. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మిగతావాళ్లు సారీ చెబుతున్నారు. కానీ నాకు మీతో పనిచేయాలని లేదు. మా డబ్బులు నొక్కేయడం ఆపండి. లేదంటే ఈసారి మీ పేర్లు బయటపెడతాను' అని సదరు మేకప్ ఆర్టిస్ట్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.విషయానికొస్తే.. రీసెంట్ టైంలో తెలుగులో వరస సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్లో పలు ప్రాజెక్టులు చేస్తోంది. అయితే నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసే మేకప్ ఆర్టిస్టులని ఈ హీరోయిన్ తల్లి వద్దని చెబుతోందట. బదులుగా వేరే వాళ్లని పెట్టుకుని వాళ్లకు డబ్బులిస్తోంది. అయితే మేకప్ ఆర్టిస్టులకు ఎంత డబ్బులు ఇస్తుందో అంతకు రెట్టింపు.. నిర్మాత నుంచి వసూలు చేస్తున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?(ఇదీ చదవండి: శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?) -
పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమాతో వస్తున్నాడు. 'కె ర్యాంప్' పేరుతో తీసిన ఈ చిత్రం.. దీపావళి కానుకగా ఈ శనివారం (అక్టోబరు 18) థియేటర్లలోకి రానుంది. దీంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఇతడు.. ఒక్కడే ఊళ్లు తిరుగుతూ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఓ మీడియా మీట్ సందర్భంగా పలువురు అభిమానులు, మూవీ లవర్స్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న రాగా కిరణ్ నుంచి 'వద్దు' అనే సమాధానం వచ్చింది.'పవన్ కల్యాణ్ ఫ్యాన్గా 'ఓజీ' మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియెన్స్ ఎలా అనిపించింది' అని ఓ వ్యక్తి.. కిరణ్ అబ్బవరంని అడిగాడు. దీనికి కిరణ్ నుంచి 'ఇప్పుడు వద్దు బ్రో' అనే సమాధానమొచ్చింది. అయితే ఎందుకు నో చెబుతున్నాననే దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడు నా సినిమా 'కె ర్యాంప్' రిలీజ్ ఉంది. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబితే దానికోసం ఎక్కువ వాడుకుంటున్నారేమో, ఇప్పుడు ఎక్కువ చెబితే టికెట్స్ తెగుతాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. నాకు అది వద్దు. మరీ అన్నిసార్లు అభిమానం గురించి పదేపదే చెప్పడం కరెక్ట్ కాదు' అని కిరణ్ అబ్బవరం నుంచి సమాధానం వచ్చింది.(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)కిరణ్ చెప్పింది నిజమేనేమే! ఎందుకంటే గతంలో ఒకరిద్దరు తెలుగు హీరోలు.. తమ సినిమాల రిలీజ్ టైంలో పవన్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు చాలా మాటలు చెప్పేవారు. కిరణ్ అబ్బవరం ఈ సమాధానం చెబుతుంటే అవే సంఘటనలు గుర్తొచ్చాయి. 'కె ర్యాంప్' విషయానికొస్తే.. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీశారు. కేరళ బ్యాక్ డ్రాప్లో మొత్తం స్టోరీ అంతా జరగనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటోంది.'కె ర్యాంప్'తో పాటు ఈ వీకెండ్ ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్.. లిస్టులో ఉన్నాయి. అయితే ఎవరికి వాళ్లు గట్టిగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. మరి వీళ్లలో ఎవరు హిట్ కొడతారనేది చూడాలి? ప్రస్తుతానికి అన్ని చిత్రాల ట్రైలర్స్ బాగున్నాయి. కాకపోతే ఏది నిలబడి గెలుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఇలియానా.. మూడోసారి తల్లి కాబోతుందా?) -
ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు: నిర్మాత రాజేశ్ దండ
‘‘నిర్మాతగా ‘కె–ర్యాంప్’ నాకు ఆరవ సినిమా. నా గత ఐదు చిత్రాల్లో ఎక్కడా ఇబ్బందికరమైన పదాలు లేవు. ఒక్కో సినిమా కథ ఒక్కోలా ఉంటుంది. అంతే కానీ కావాలని కొన్ని పదాలు పెట్టి, ప్రేక్షకులను థియేటర్స్కు రప్పించాలని అనుకోను. అలాంటి సినిమాలు నేను తీయను. ‘కె–ర్యాంప్’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు’’ అని చె΄్పారు నిర్మాత రాజేశ్ దండ. కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజేశ్ దండ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కిరణ్గారు కుమార్ అబ్బవరం అనే పాత్రలో నటించారు. ఈ సినిమా కథ విని ఎగై్జట్ అయ్యాను. మా సినిమాకు సెన్సార్ వాళ్ళు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది ఇందులో ఇబ్బందికరమైన పదాలు ఉన్నాయని కాదు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. వీటిని చూసి ఎవరైనా ఆడియన్స్ ప్రేరణ పొందుతారేమోనని ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు... అంతే. వల్గారిటీ లేదు. ఇక ‘కె–ర్యాంప్’ సినిమా కిరణ్గారి వన్ మ్యాన్ షోలా ఉంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ బ్లాస్ట్ అవుతుంది.ఈ సినిమాతో నిర్మాత శివతో నాకు మంచి ప్రయాణం మొదలైంది. నా మీద నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమాలో భాగమయ్యారు శివ. ప్రస్తుతం మా బ్యానర్లో హీరోయిన్ సంయుక్తతో ఓ సినిమా చేస్తున్నాం. అలాగే ‘అల్లరి’ నరేశ్గారితో ఓ సినిమా ఉంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘టార్గెటెడ్ ట్రోలింగ్ గురించి బన్నీ వాసుగారు మాట్లాడిన విషయాలను నేను ఫాలో కాలేదు. పూర్తి విషయాలు తెలిసిన తర్వాత స్పందిస్తాను’’ అని చె΄్పారు. ‘‘కిరణ్గారిని ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శివ బొమ్మకు. -
ఫ్లాష్బ్యాక్లో యాక్షన్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ఎన్టీఆర్ ఓ డిఫరెంట్ లుక్లోకి మారారని టాక్. ఫ్లాష్బ్యాక్లో వచ్చే పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలెట్గా నిలవనున్నాయట. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రం 2026 జూన్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘వార్ 2’ రికార్డ్ : హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలైంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అత్యధిక మంది వీక్షించిన చిత్రాల జాబితాలో ‘వార్ 2’ చిత్రం టాప్లో ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తెలిపింది. ఈ నెల 6 నుంచి 12 వరకూ 3.5 మిలియన్ల మంది వీక్షించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో గత వారం ఇండియాలోనే ఎక్కువమంది చూసిన సినిమాగా ‘వార్ 2’ నిలిచింది. -
కబడ్డి... కబడ్డి
ప్రముఖ తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘బైసన్’. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. పా. రంజిత్ సమర్పణలో నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్పై సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితీ ఆనంద్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో ఈ నెల 17న విడుదల కానుంది. తెలుగులో జగదాంబే ఫిలిమ్స్ పై బాలాజీ ఈ నెల 24న విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ను హీరో రానా రిలీజ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ– ‘‘1990 బ్యాక్డ్రాప్లో కబడ్డి నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బైసన్’. ట్రైలర్ ఎంత ఆసక్తికరంగా ఉందో సినిమా కూడా థ్రిల్లింగ్ అంశాలతో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ దక్కుతుంది. కబడ్డి నేపథ్యంలో రాబోతున్న మా సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు. -
రకుల్ ప్రీత్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. ట్రైలర్ వచ్చేసింది
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబు లీడ్ రోల్స్లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ 2019లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా దే దే ప్యార్ దే 2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో మరోసారి రకుల్, అజయ్ కనిపించనుండగా.. టబు మాత్రం నటించడం లేదు. అయితే సీక్వెల్కు అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్, రకుల్ మధ్య కామెడీ సీన్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. మీ బాయ్ఫ్రెండ్ వయస్సు.. మీ నాన్న వయసంత ఉంటే.. అంటూ ట్రైలర్ను పోస్ట్ చేసింగి రకుల్ ప్రీత్ సింగ్. కాగా.. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్తా, గౌతమి కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం చిల్ర్డన్స్ డే సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి లవ్ రంజన్ కథను అందించడంతో పాటు టి-సిరీస్ భూషణ్ కుమార్తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించారు.When your BF is your dad’s age and not yours, you know it’s time for a #PyaarVsParivaar showdown! 🥊#DeDePyaarDe2 Trailer out now 👇https://t.co/y9YQB8wFLmReleasing In cinemas Nov 14 🎟️@ajaydevgn @ActorMadhavan #MeezaanJafri @anshul3112 @luv_ranjan @gargankur #TarunJain… pic.twitter.com/WoFj2WHp21— Rakul Singh (@Rakulpreet) October 14, 2025 -
సస్పెన్స్కు తెర.. రూ.300 కోట్ల సినిమా ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్!
కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం 'లోకా'. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లు సాధించినట్లు ఇటీవలే పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఆగస్టు 28న రిలీజైంది. ఆ తర్వాత తెలుగులో ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఫర్వాలేదనిపించింది.అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ రిలీజై 50 రోజులు కావొస్తోంది. పెద్ద పెద్ద సినిమాలే కేవలం నాలుగైదు వారాల్లోనే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అలాంటిది ఈ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఓటీటీకి రానుందని వార్తలొచ్చినా అలాంటిదేం జరగలేదు. రూమర్స్ రావడంతో దుల్కర్ సైతం ఓటీటీ రిలీజ్పై క్లారిటీ ఇచ్చారు.తాజాగా కొత్త లోక స్ట్రీమింగ్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ను రివీల్ చేశారు. జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ తేదీని రివీల్ చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. దీంతో కొత్త లోక మూవీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్లో సస్పెన్స్కు తెరపడింది. (ఇది చదవండి: హీరోయిన్కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)కొత్త లోక కథేంటంటే..'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయి. ఈమె గురించి కొందరికి తెలుసు. ఓ సందర్భంలో చంద్ర, బెంగళూరు రావాల్సి వస్తుంది. తన పవర్స్ బయటపెట్టకుండా సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. రాత్రిపూట ఓ కేఫ్లో పనిచేస్తుంటుంది. ఎదురింట్లో ఉంటే సన్నీ(నస్లేన్).. ఈమెని చూసి లవ్లో పడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల దెబ్బకు చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర గతమేంటి? ఎస్ఐ నాచియప్ప(శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. The beginning of a new universe.Lokah Chapter 1: Chandra — coming soon on JioHotstar.@DQsWayfarerFilm @dulQuer @kalyanipriyan @naslen__ @NimishRavi @SanthyBee#Lokah #LokahChapter1 #Wayfarerfilms #DulquerSalmaan #DominicArun #KalyaniPriyadarshan #Naslen #SuperheroFantasy… pic.twitter.com/BMlsbEJM0q— JioHotstar Malayalam (@JioHotstarMal) October 14, 2025 -
'నా కూతురిని ఒకరి భార్యగా పెంచలేదన్నాడు'.. సుస్మితా సేన్
బాలీవుడ్ భామ సుస్మితా సేన్ పరిచయం అక్కర్లేని పేరు. తనకు 18 ఏళ్ల వయసులోనే విశ్వసుందరిగా ఘనతను సొంతం చేసుకుంది. తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుస్మితా సేన్.. బాలీవుడ్, టాలీవుడ్లోనూ నటించింది. తెలుగులో నాగార్జునతో కలిసి 'రక్షకుడు' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ల్లో నటిస్తోంది.అయితే స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుస్మితా సేన్ తన వ్యక్తిగత జీవితం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పలువురితో డేటింగ్ చేసిన ఆమె..ఏ ఒక్కరిని పెళ్లాడలేదు. ఆమె రిలేషన్స్ మున్నాళ్ల ముచ్చటగానే మారాయి. ప్రేమాయణం కొనసాగించడం.. కొన్నేళ్లకు బ్రేకప్ ఆమె లైఫలో సర్వసాధారణంగా మారిపోయింది.ఇద్దరు పిల్లలకు తల్లిగా..అయితే సుస్మితా సేన్ పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. 24వ ఏట రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకుంది. తన తల్లిదండ్రుల మద్దతుతో కొన్నాళ్లకు ఇంకో బిడ్డ (అలీసా)నూ దత్తత తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుస్మితా సేన్ పిల్లలను దత్తత తీసుకోవడంలో ఎదురైన ఇబ్బందులను పంచుకుంది. తన తండ్రి సుబీర్ సేన్ తిరుగులేని మద్దతువల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. 2000 సంవత్సరంలో రెనీని దత్తత తీసుకున్నప్పుడు జరిగిన సంఘటలను పంచుకుంది. ఒంటరి మహిళలు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవడాన్ని జువెనైల్ జస్టిస్ చట్టాలు ఎప్పుడు నిషేధించలేదని వెల్లడించింది.సుస్మితా మాట్లాడుతూ.. 21 ఏళ్ల వయసులో చట్టబద్ధంగా ఏం చేయాలో నాకు తెలుసు. రెనీ కోసం చట్టపరమైన పోరాటం చేసే సమయంలో నాలో ఆందోళన మొదలైంది. రెనీ విషయంలో కుటుంబ కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే.. వారు బిడ్డను తిరిగి తీసుకుంటారు. అప్పటికే రెనీ నన్ను అమ్మా అని పిలవడం ప్రారంభించింది. అప్పు నాకు ఓ ఐడియా వచ్చింది. పాపను తీసుకుని కారులో నువ్వు పారిపో అని నాన్నతో చెప్పాను. మనం అలాంటి పని చేయకూడదు. కానీ బిడ్డను మా నుంచి ఎవరు తీసుకోలేరని గట్టిగా అనుకున్నాం."అని అన్నారు. అయితే ఈ కేసు మాకు అనుకూలంగా రావడంతో తన తండ్రి పెద్ద పాత్ర పోషించారని పంచుకుంది. నా తండ్రి వల్లే నాకిప్పుడు పిల్లలు ఉన్నారు.. నా బిడ్డను పోషించడానికి కోర్ట్ చెప్పినట్లుగా సగం ఆస్తిని రెనీ పేరిట రాసిచ్చారని తెలిపింది.ఆ సమయంలో న్యాయమూర్తి తనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ను ప్రస్తావించింది. మంచి కుటుంబంలోని అబ్బాయి ఎవరూ కూడా నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడరని న్యాయమూర్తి నా తండ్రిని కూడా హెచ్చరించారని వివరించింది. నేను ఆమెను ఎవరి భార్యగా పెంచలేదని నాన్న జడ్జితో చెప్పారని వెల్లడించింది. ఆ తీర్పే నా జీవితాన్ని మార్చేసిందని సుస్మితా సేన్ తెలిపింది. కాగా.. సుస్మితా సేన్ 1975 నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. -
ట్రెడిషనల్ శారీ లుక్లో ‘కూలి’ బ్యూటీ..
-
ఇంకా నయం.. ఆ సీన్స్ చూపలేదు.. ఇప్పటికైనా బిగ్బాస్ నిషేధించకపోతే!
ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్. ఆడియన్స్లో ఈ షోకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ షో రన్ అవుతోంది. టాలీవుడ్లో బిగ్బాస్ షో ఇప్పుడిప్పుడే ఆదరణ దక్కించుకుంటోంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో బిగ్బాస్ షో మరింత ఆసక్తికరంగా మారింది.తెలుగులో మినహాయిస్తే.. ఇటీవల బిగ్బాస్ కన్నడలో జరిగిన వివాదం మనందరికీ తెలిసిందే. ఈ షో కోసం వేసిన సెట్ వల్ల వ్యర్థాలు వస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో సడన్గా మూసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత మళ్లీ రీ స్టార్ట్ చేశారు. శాండల్వుడ్లో ఈ రియాలిటీ షో హోస్ట్గా హీరో కిచ్చా సుదీప్ వ్యవహరిస్తున్నారు. ఈ వివాదం ముగిసిపోవడంతో కన్నడలో బిగ్బాస్ ఎలాంటి అటంకం లేకుండా కొనసాగుతోంది.అయితే తాజాగా తమిళ బిగ్బాస్ షో చుట్టు వివాదం మొదలైంది. తమిళనాడులో 'బిగ్ బాస్' షోను నిషేధించాలని అధికార డీఎంకే ప్రభుత్వ మిత్రపక్షం తమిజ్హగ వజ్వురిమై కట్చి (టీవీకే) డిమాండ్ చేస్తోంది. ఈ షోలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు తమిళ సంస్కృతిని కించపరిచే విధంగా ఉన్నాయని టీవీకే లీడర్, ఎమ్మెల్యే వేల్మురుగన్ ఆరోపించారు. బిగ్ బాస్ షో తమిళ సంస్కృతి, సంప్రదాయంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. అసహ్యకరమైన శరీర కదలికలు, ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్ దృశ్యాలు.. టీనేజ్ అమ్మాయిలు, పిల్లలు సమక్షంలో చూడకూడదని అన్నారు. ఇంకా నయం ఈ షోలో ఇప్పటివరకు లైంగిక పరమైన దృశ్యాలను చూపించలేదని వేల్మురుగన్ సీరియస్ కామెంట్స్ చేశారు.ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ సంప్రదించానని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ నా తీర్మానాన్ని చర్చకు అనుమతించకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, ఐటీ, ప్రసార శాఖలు ఈ షోను నిషేధించకపోతే.. బిగ్ బాస్ సెట్తో పాటు విజయ్ టెలివిజన్ వద్ద వేల మంది మహిళలతో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని వేల్మురుగన్ హెచ్చరించారు. కాగా.. విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ తమిళ సీజన్ -9 అక్టోబర్ 5న గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ సీజన్లో దాదాపు 20 మంది కంటెస్టెంట్స్గా హౌస్లో అడుగుపెట్టారు. -
ఆమె ఎవరో తెలియదు.. నేను పట్టించుకోను : సిద్ధు జొన్నలగడ్డ
ఈ మధ్య సినిమా ప్రెస్మీట్స్లో కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. సెలెబ్రిటీలను కించపరుస్తూ ప్రశ్నలు అడిగితే తాము కూడా ‘సెలెబ్రిటీ’అయిపోతామనే అపోహతో కాంట్రవర్సీ ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda )ను ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై నెటిజన్స్ ఘోరంగా మండిపడ్డారు. ‘తెలుసు కదా’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న సిద్దుని ఓ మహిళా జర్నలిస్ట్ ‘మీరు నిజ జీవితంలో స్త్రీలోలుడా(వుమనైజర్) ’ అని అడగడంతో స్టేజ్పై ఉన్న సిద్ధుతో పాటు తోటి జర్నలిస్టులకు కూడా ఒక్కసారి షాకయ్యారు. ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూ కాదు సినిమా ఇంటర్వ్యూ అని సిద్ధు కాస్త ఘూటుగానే ఆమెకు సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మహిళా జర్నలిస్టు ప్రశ్నను తప్పుపడుతూ పలువురు నెటిజన్స్ కామెంట్ చేశారు. తాజాగా ఈ వివాదంపై మరోసారి సిద్ధు స్పందించారు.తెలుసు కదా సినిమా ప్రచారంలో భాగంగా నేడు మీడియాతో ముచ్చటించిన సిద్దు.. ‘వుమనైజర్’ ప్రశ్నపై మరోసారి స్పందించారు. ‘అమె అలా మాట్లాడడం అగౌరవం. మైకు ఉంది కదా అని ఏది పడితే అది అడగడం కరెక్ట్ కాదు. ఆమె అలా అడిగి..నవ్వుతున్నారు కూడా. అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు పద్దతిగా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు. మైకు తీసుకోగానే మారిపోయారు. సినిమా రిలీజ్ ఉంది కదా..ఏం అయినా అడగొచ్చు అనుకోవడం కరెక్ట్ కాదు. సినిమాకు రియల్ లైఫ్కి తేడా ఉంటుంది. సినిమాలో హీరో అండర్ కవర్ పోలీసు అయితే..బయట కూడా ఎన్కౌంటర్ చేయడు కదా? డ్రగ్స్ తీసుకునే పాత్రలో నటిస్తే..బయట కూడా డ్రగ్స్ తీసుకుంటాడని అనుకుంటామా? సినిమాకి బయటకు తేడా తెలియదా? సీనియర్ జర్నలిస్టులు పద్దతిగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. తమిళ హీరో ప్రదీప్ని కూడా ఆమెనె ఏదో అడిగారని, ఇష్యూ అయిందని చూశాను. అలాంటి వాటిపై ఆలోచించడం వేస్ట్. ఇలాంటి ప్రశ్నలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్. పెద్దగా పట్టించుకోను. నా పనిపై నేను ఫోకస్ పెడతా’ అని సిద్దు చెప్పుకొచ్చాడు. కాగా సిద్దు నటించిన తెలుసు కదా మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్.. మాళవిక 'రాజాసాబ్' జాకెట్!
బర్త్ డే సెలబ్రేషన్స్లో పూజా హెగ్డే స్మైల్గ్రీస్లో షూటింగ్.. 'రాజాసాబ్' జాకెట్తో మాళవికఅందాలరాశిలా కనిపిస్తున్న రాశీఖన్నాస్విట్జర్లాండ్ ట్రిప్లో 'కాంతార' బ్యూటీ సప్తమిగౌడదుబాయి వెళ్లిపోయిన బిగ్బాస్ దివి వద్త్యలంగావోణీలో మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియఫ్రెండ్ పెళ్లి పార్టీలో 'హనుమాన్' హీరోయిన్ అమృత View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sapthaami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Tabu (@tabutiful) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
వావ్.. సూపర్.. 72 గంటలు కూడా ఆడని సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్!
ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లో చిన్న సినిమా లపత్తా లేడీస్ అరుదైన ఘనత సాధించింది. ఈ మూవీ ఏకంగా 12 విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్ విమర్శలు చేశారు. గతేడాది రిలీజైన సినిమాలైన'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి అభిషేక్ బచ్చన్, 'చందు: ఛాంపియన్' సినిమాకు కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. జిగ్రా చిత్రానికిగానూ ఆలియా భట్ (Alia Bhatt) ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. 2023లో వచ్చిన లాపతా లేడీస్ ఉత్తమ చిత్రంగా నిలిచింది.అయితే లపత్తా లేడీస్క ఏకంగా 12 అవార్డులు రావడంపై ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్ విమర్శించారు. 2024లో వచ్చిన మంచి చిత్రాలకు గుర్తింపు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిల్మ్ఫేర్ అవార్డుల ఎంపిక ప్రక్రియ, భారతీయ చిత్ర పరిశ్రమపై దాని ప్రభావంపై సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.సుదీప్తో సేన్ ఇన్స్టాలో రాస్తూ.. 'ఈ ఏడాది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చూస్తే కొత్త ధోరణి బయటపడింది. కేవలం 72 గంటలకు పైగా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేని.. కాపీరైట్ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రం లపత్తా లేడీస్. అందరూ ఊహించినట్లుగానే 2024లో అత్యుత్తమ సినిమా ఏదనేది ఇంకా క్లారిటీ రాలేదు. ది కేరళ స్టోరీ జాతీయ అవార్డులను అందుకోవడానికి వ్యతిరేకంగా ఫిల్మ్ఫేర్ ఎందుకు అంతలా గొంతు విప్పిందో నాకిప్పుడు అర్థమైంది. ఈ ఉడ్(పరోక్షంగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి) సమాజం మమ్మల్ని గుర్తించకపోవడం.. ఆహ్వానించకపోవడంపై నేను చాలా సంతోషంగా ఉన్నా" అని అన్నారు.అంతే కాకుండా ఫేక్ నవ్వులు ముఖ్యంగా ఫేక్ పొగడ్తల నుంచి మేము తప్పించుకున్నామని సుదీప్తో సేన్ రాసుకొచ్చారు. ముంబయిలో సినిమా పేరుతో ఈ తమాషాలు.. కేన్స్లో సెల్ఫీలు తీసుకోకుండా మమ్మల్ని రక్షించనందుకు చాలా సంతోషంగా ఉన్నానని పోస్ట్ చేశారు. ఏదేమైనా సినిమా పేరుతో చేసే మోసం, నకిలీ వస్త్రధారణ నుంచి మేము బయటపడ్డామని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.ముఖ్యంగా మీడియా, సినిమా జర్నలిజం ఉన్నప్పుడు.. ఏ భారతీయ సినిమా సంస్థ నుంచి గొప్పగా ఆశించనని సుదీప్తో సేన్ స్పష్టం చేశారు. ఎందుకంటే గొప్ప గ్లామర్, సంపన్నమైన స్టార్స్కే ప్రపంచం గుర్తిస్తుందన్నారు. గ్రామాలు, చిన్న నగరాల నుంచి వచ్చే ప్రజలు మిస్టర్ బచ్చన్, షారూఖ్ ఖాన్ ఇంటి ముందు గుమిగూడే విధానమే ఇలాంటి సరైన ఉదాహరణ అని బాలీవుడ్పై విమర్శలు చేశారు.కాగా.. గత నెలలోనే సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన 'ది కేరళ స్టోరీ' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఈ సినిమాను కేరళ యువతులను ఇస్లాం మతంలోకి మార్చడంపై రియల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ జాతీయ అవార్డ్ కూడా గెలుచుకుంది. అయితే జాతీయస్థాయిలో సత్తా చాటిన ఈ సినిమాకు ఫిల్మ్ఫేర్ నుంచి ఎలాంటి అవార్డ్స్, ప్రశంసలు రాలేదు. దీంతో డైరెక్టర్ సుదీప్తో సేన్ తనదైన శైలిలో విమర్శించారు. View this post on Instagram A post shared by Sudipto Sen (@sudipto_sen) -
ఇలియానా.. మూడోసారి తల్లి కాబోతుందా?
కొన్నేళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేసి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న.. ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఏడాది జూన్ 19న రెండో కుమారుడికి జన్మనిచ్చింది. కానీ మూడు రోజుల క్రితం ఇలియానా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో బేబీ బంప్తో కనిపించింది. దీంతో మూడోసారి తల్లి కాబోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి అసలు విషయం?గోవాకు చెందిన ఇలియానా.. 2006లో వచ్చిన 'దేవదాస్' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పోకిరి, జల్సా, మున్నా, కిక్, జులాయి తదితర టాలీవుడ్ మూవీస్తో క్రేజ్ సంపాదించింది. 2012లో 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్కి వెళ్లింది. తర్వాత తెలుగు సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. అలా అని హిందీలో ఏమైనా కలిసొచ్చిందా అంటే లేదు. పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్లో 2018లో 'అమర్ అక్బర్ ఆంటోని' మరో ప్రయత్నం చేసింది. కానీ కలిసిరాలేదు.(ఇదీ చదవండి: 51 ఏళ్ల వయసులోనూ మలైకా ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్)అయితే 2014లోనే మన దేశ పౌరసత్వాన్ని విడిచిపెట్టిన ఇలియానా.. పోర్చుగీస్ పౌరసత్వం తీసుకుంది. అప్పటినుంచి అడపాదడపా హిందీ చిత్రాల్లో నటిస్తూ వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో మైఖేల్ డోలన్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. 2023 ఆగస్టులో తొలిబిడ్డకు జన్మనివ్వగా.. అదే ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. మొదటి కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ కాగా.. ఈ ఏడాది జూన్లో రెండో కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి కీను రాఫే డోలన్ అని పేరు పెట్టారు.ఇలియానా తాజాగా పోస్ట్ చేసిన విషయానికొస్తే.. ఇందులో బేబీ బంప్తో కనిపించింది. కానీ ఇది రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్న వీడియోలా అనిపిస్తుంది. ఇప్పుడు పోస్ట్ చేయడంతో మళ్లీ ప్రెగ్నెంట్ అయిందా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ రూమర్స్ నిజం కాదనిపిస్తోంది. ఒకవేళ అలా ఉంటే అనౌన్స్ చేసేదిగా!(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక) -
ఎన్టీఆర్ వార్-2.. బాక్సాఫీస్ నో క్రేజ్.. ఓటీటీలో సూపర్ రికార్డ్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వార్-2((War2 Movie)). ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో హృతిక్ రోషన్ కూడా నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది.అయితే ప్రస్తుతం వార్-2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబరు 09 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్ఫామ్లో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. 3.5 మిలియన్ల వ్యూస్తో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ కూలీ, సన్ ఆఫ్ సర్దార్-2, మహావతార్ నర్సింహా, మదరాసి సినిమాలను దాటేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని వార్-2 చిత్రానికి డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మాత్రం ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. Top 5 most-watched films on OTT in India, for the week of Oct 6-12, 2025, estimated based on audience researchNote: Estimated number of Indian audience (in Mn) who watched at least 30 minutes. pic.twitter.com/1a4ouoYh45— Ormax Media (@OrmaxMedia) October 13, 2025 -
వీళ్లు తెలుగు హీరోహీరోయిన్.. అప్పట్లో ఇలా.. గుర్తుపట్టారా?
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ టైంలో రిలీజైన పాటలతో పాటు గతంలో రిలీజైన సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ హల్చల్ చేస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ క్లిప్ వైరల్ అయిపోతోంది. వీళ్లు ఆ హీరోహీరోయిన్ కదా అని తెలిసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. మరి మీరేమైనా వీళ్లని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?)పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరిలో ఒకరు నిహారిక కాగా మరొకరు దినేశ్ నాయుడు. దినేశ్ ఎవరబ్బా అని మీరు ఆలోచిస్తున్నారు కదా! ప్రస్తుతం తెలుగులో హీరోగా సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ అసలు పేరు దినేశ్ నాయుడు. అప్పట్లో అంటే 11-12 ఏళ్ల క్రితం పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్ చేశాడు. వాటన్నింటిలోనూ దినేశ్ అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు ఓ క్లిప్ వైరల్ అవుతోంది. ఇది పదకొండేళ్ల క్రితం వచ్చిన 'టర్మ్స్ అండ్ కండీషన్స్' పాటలోనిది.అప్పట్లో నిహారిక కూడా పలు షార్ట్ ఫిల్మ్స్ చేసేది. అలా ఈ పాట కోసం విశ్వక్ సేన్తో నటించింది. అప్పటి సాంగ్ క్లిప్ ఇప్పుడు వైరల్ అయ్యేసరికి విశ్వక్ సేన్ ఇంతలా మారిపోయాడా అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ 'ఫంకీ' సినిమా చేస్తుండగా.. నిహారిక యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి నిర్మాతగా మారిపోయింది. గతేడాది 'కమిటీ కుర్రోళ్లు' మూవీతో హిట్ కొట్టింది. ఇప్పుడు కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. ఏదేమైనా వైరల్ క్లిప్ వల్ల విశ్వక్-నిహారిక జంట సోషల్ మీడియాలో టాపిక్ అయిపోయారు.(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)Idheppudu chesav @VishwakSenActor 😂😂🤣😂🤣😂🤣🤣😂😂😂🤣😂😂🤣#VishwakSen pic.twitter.com/r8cSk1AECD— Karthik Chowdary (@KChowdaryyy) October 13, 2025 -
మెగాస్టార్ సంక్రాంతి సినిమా.. రొమాంటిక్ ఫుల్ సాంగ్ అవుట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్తో ఫుల్ స్వింగ్లో దూసుకెళ్తున్నారు.ఇటీవల దసరా సందర్భంగా క్రేజీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మీసాల పిల్లా అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. -
కాంతార మరో రికార్డ్.. ఏకంగా రాజమౌళి బాహుబలినే!
రిషబ్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన కాంతార చాప్టర్-1 (Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కూలీ, జైలర్, లియో కలెక్షన్స్ రికార్డ్స్ తుడిచిపెట్టేసిన ఈ మూవీ టాలీవుడ్ బ్లాక్బస్టర్ బాహుబలి ది బిగినింగ్ ఆల్టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.675 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రూ.700 కోట్ల మార్క్ను చేరుకోనుంది.ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రెండోస్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో ఛావా(రూ.808 కోట్లు) మొదటిస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ చిత్రానికి రూ.451.90 కోట్ల నికర వసూళ్లు రాగా..రూ.542 కోట్ల గ్రాస్ సంపాదించింది. ఉత్తర అమెరికాలో కాంతారా చాప్టర్ -1.. పదకొండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్లో 17వ స్థానంలో కొనసాగుతోంది. తాజా వసూళ్లతో సల్మాన్ ఖాన్ సుల్తాన్ (రూ.628 కోట్లు), రాజమౌళి బాహుబలి (రూ.650 కోట్లు)ని అధిగమించింది. ఈ రెండు చిత్రాల కంటే తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా అరుదైన ఫీట్ను సాధించడం విశేషం.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబల్ ఫిల్స్మ్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. -
స్విట్జర్లాండ్ ట్రిప్లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)
-
శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?
యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఈ ఏడాది 'రాబిన్హుడ్', 'జూనియర్' సినిమాలతో వచ్చింది. కానీ ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ఈనెల 31న 'మాస్ జాతర' మూవీతో రానుంది. దీనిపై పెద్దగా అంచనాలైతే లేవు. ఇవి కాకుండా తెలుగు, తమిళ, హిందీలో తలో చిత్రం చేస్తోంది. ఇప్పుడు ఇన్ స్టాలో కొత్తగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఇప్పుడిది ఏంటా అనే క్వశ్చన్ మార్క్గా మారింది.(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)'ఏజెంట్ మిర్చి'గా శ్రీలీల.. అక్టోబరు 19న ప్రకటన రానుందని చెబుతూ ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో గ్లామరస్గా రఫ్ అండ్ టఫ్ లుక్లో కనిపించింది. క్యాప్షన్ చూస్తుంటే ఇదేదో హిందీ ప్రాజెక్టులా అనిపిస్తుంది. అయితే అది సినిమానా లేదా వెబ్ సిరీస్ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇవేం కాకుండా యాడ్ లాంటిది అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', శివకార్తికేయన్ 'పరాశక్తి', కార్తిక్ ఆర్యన్తో ఓ రొమాంటిక్ సినిమా చేస్తోంది. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ నిలబడాలంటే ఇవి కచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన వరస చిత్రాల్లో నటించింది. కాకపోతే 'ధమాకా', 'భగవంత్ కేసరి'తో పాటు 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ తప్పితే మిగతావి ఏవి ఉపయోగపడలేదు. ఇప్పుడు చేస్తున్న మూవీస్పై కాస్త బజ్ ఉంది. మరి శ్రీలీల లక్ ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక
మంచు మనోజ్ మంచి జోష్లో ఉన్నాడు. ఈ ఏడాది నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. కొన్నినెలల క్రితం 'భైరవం' రిలీజై మిశ్రమ స్పందన అందుకుంది. కానీ గత నెలలో 'మిరాయ్'లో మనోజ్ చేసిన విలనిజానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా కొన్ని భారీ సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. అలా హిట్ ఇచ్చిన ఆనందంలో ఉన్న మనోజ్.. అడపాదడపా మూవీ వేడుకల్లోనూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓ టీవీ ఛానెల్ అవార్డ్స్ ఫంక్షన్కి భార్యతో పాటు వచ్చాడు.ఈ కార్యక్రమంలోనే యాంకర్ రవి మాట్లాడుతూ.. మనోజ్లో మీకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? అని మౌనికని అడగ్గా.. చాలా గొప్ప స్నేహితుడు అని చెప్పింది. మర్చిపోలేని సందర్భం ఏదైనా ఉంది అని అడిగితే.. ఓ రోజు నాకు క్షమాపణ చెబుతూ లెటర్ రాశాడు. కానీ నాకు అర్థం కాక మళ్లీ అడిగానని నవ్వుతూ మౌనిక చెప్పుకొచ్చింది. పక్కనే ఉన్న మనోజ్.. లెటర్ ఎప్పుడు రాశానా అని గుర్తుతెచ్చుకుని ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. ఈ ప్రోమోలో విషయాన్ని సగం సగం చెప్పినట్లు చూపించారు. మొత్తం ఎపిసోడ్లో మనోజ్ ఆ లేఖ ఎందుకు రాశాడు? ఏం రాశాడనేది మౌనిక బయటపెడుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: 51 ఏళ్ల వయసులోనూ ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్)మనోజ్, మౌనికని 2023లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఇది రెండో పెళ్లి. అయినాసరే పెద్దల్ని ఒప్పించి ఒక్కటయ్యారు. వీళ్ల ప్రేమకు గుర్తుగా గతేడాది కూతురు కూడా పుట్టింది. ప్రస్తుతం మనోజ్.. అటు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు మూవీస్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీలో మనస్పర్థలు, గొడవలు జరిగినప్పటికీ ఇప్పుడు అవన్నీ సర్దుబాటు అయినట్లే కనిపిస్తున్నాయి. 'మిరాయ్' రిలీజ్ టైంలో చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అని విష్ణు ట్వీట్ చేశాడు. మనోజ్ పేరుని ట్వీట్లో ప్రస్తావించనప్పటికీ అన్నదమ్ముల మధ్య అంతరం తగ్గిందనే టాక్ అయితే వినిపిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
'కాంతార'కు అక్కడ భారీ నష్టాలే.. కారణం ఇదే
కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ చిత్రం కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. సోమవారం కూడా సుమారు రూ. 20 కోట్లకు పైగానే రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.675 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో బాహుబలి-1 ఫైనల్ కలెక్షన్స్ మార్క్ను కాంతార దాటేసింది. అయితే, కాంతారా చాప్టర్ 1 అమెరికాలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ గణనీయమైన నష్టాలను చవిచూసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు, ఈ చిత్రం దాదాపు రూ. 4 మిలియన్ల డాలర్స్ (రూ. 36 కోట్లు) వసూలు చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా తాజాగా మేకర్స్ షేర్ చేశారు. ఈ కలెక్షన్స్ నంబర్ పర్వాలేదనిపించినప్పటికీ బ్రేక్-ఈవెన్ మార్కుకు చాలా దూరంలో ఉంది. ఈ సినిమాను చాలా ఎక్కువ ధరకు అమెరికాలో కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేయడానికి దాదాపు రూ. 8 మిలియన్ల డాలర్స్ అవసరం అవుతుంది. ఆ మార్క్ను కాంతార అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీంతో అమెరికాలో కాంతార నష్టాలు మిగల్చడం తప్పదని సమాచారం.అయితే, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ బెల్ట్లో మాత్రం భారీ లాభాల దిశగా కాంతార దూసుకుపోతుంది. దీపావళి సందర్భంగా ఈ వారంలో మరో నాలుగు ప్రధాన సినిమాలు విడుదల కానున్నడంతో కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఏదేమైనా మరో మూడు రోజులు మాత్రమే కాంతార సందడి కనిపించనుంది. ఈ ఏడాదిలో ఛావా సినిమా రూ. 800 కోట్ల కలెక్షన్స్తో టాప్ వన్లో ఉంది. ఇప్పుడు కాంతార కూడా ఆ మార్క్ను అందుకోవాలని చూస్తుంది. 2022లో విడుదలైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్ 1 నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
51 ఏళ్ల వయసులోనూ ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్
రష్మిక హీరోయిన్గా చేస్తున్న లేటెస్ట్ హిందీ సినిమా 'థామా'. 'స్త్రీ' యూనివర్స్ నుంచి వస్తున్న కొత్త మూవీ ఇది. అక్టోబరు 21న హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో పాటలు మాత్రం ప్రతిదీ ఐటమ్ సాంగే అనిపిస్తుంది. తాజాగా రిలీజైన సాంగ్లో అయితే 51 ఏళ్ల బ్యూటీ అదిరిపోయే స్టెప్పులేయడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'థామా' నుంచి తాజాగా 'పా*యిజన్ బేబీ' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇది కూడా పార్టీ నేపథ్యంగా సాగే గీతం అర్థమవుతోంది. తొలుత మలైకా అరోరా గ్లామరస్గా కనిపిస్తూ స్టెప్పులేయగా, చివరలో రష్మిక కూడా మలైకతో కలిసి డ్యాన్స్ చేసింది. ఇదే కాదు గతంలో 'దిల్బర్' అంటూ సాగే మరో పాట రిలీజ్ చేశారు. ఇందులో నోరా ఫతేహి డ్యాన్స్ చేసింది. ఇది ఐటమ్ సాంగ్. అంతకుముందు రష్మిక పాట కూడా చూడటానికి ఐటమ్ సాంగ్లానే అనిపిస్తుంది. చూస్తుంటే సినిమాలో కామెడీతో పాటు ఐటమ్ గీతాలు చాలానే ఉన్నాయి!(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్స్ కృతి శెట్టి, కల్యాణి బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్) -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'దృశ్యం' సినిమా అనగానే చాలామందికి దర్శకుడు జీతూ జోసెఫ్ గుర్తొస్తాడు. ఎందుకంటే థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు ప్రస్తుతం మూడో పార్ట్ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. అయితే జీతూ లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కి సిద్దమైంది. ఇంతకీ ఈ థ్రిల్లర్ ఎప్పుడు ఓటీటీలోకి రానుంది? దీని సంగతేంటి అనేది చూద్దాం.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'మిరాజ్'. అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబరు 19న రిలీజైన ఈ థ్రిల్లర్.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు దీన్ని అక్టోబరు 20 నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు వీడియో కూడా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)'మిరాజ్' విషయానికొస్తే.. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్న కిరణ్ (హకీమ్ షాజహాన్) సడన్గా అభిరామి (అపర్ణ బాలమురళి).. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడే కిరణ్.. రైలు ప్రమాదంలో చనిపోయాడనే విషయం తెలిసి షాక్ అవుతుంది. దీని నుంచి తేరుకునేలోపు ఓ పోలీస్ ఆఫీసర్ (సంపత్ రాజ్), ఓ రౌడీ (శరవణన్), ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఆసిఫ్ అలీ).. అభిరామిని హార్డ్ డిస్క్ కోసం ప్రశ్నించడం మొదలుపెడతారు. ఇంతకీ ఆ హార్డ్ డిస్క్లో ఏముంది? కిరణ్కి ఏమైంది? వీళ్లందరి సాయంతో అభిరామి.. ఈ ప్రమాదం నుంచి బయటపడిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఇకపోతే ఈ వారం 24 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కిష్కింధపురి, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్, సంతోష్ చిత్రాలతో పాటు ఆనందలహరి అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇవి కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజులు కూడా ఉండొచ్చు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
మీరు ఉమెనైజరా..? ఇచ్చిపడేసిన సిద్ధూ
-
బావమరిది పెళ్లికి ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి..?
టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ – శివానీ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నితిన్ హ్యాట్రిక్ హిట్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. అక్టోబర్ 10న హైదరాబాద్లో నెల్లూరుకు చెందిన శివానీని ఆయన వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ దంపతులే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి ఆ ఇంటి ఆడపిల్ల కాబట్టి ప్రతి కార్యక్రమం ఆమె చేతుల మీదుగానే జరిపించారు. అయితే, తన బావమరిదికి పెళ్లి కానుకగా ఎన్టీఆర్ ఎలాంటి బహుమతి ఇచ్చారనేది సోషల్మీడియాలో వైరల్ అవుతుంది.కొత్త దంపతులు నితిన్–శివానీలకు పెళ్లి కానుకగా ఒక లగ్జరీ కారును ఎన్టీఆర్ ఇచ్చారని సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. నితిన్ అంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టం. గతంలో ఇదే మాట తారక్ కూడా చెప్పారు. తనకు సినిమా ఛాన్సులు రావడం వెనుక ఎన్టీఆర్ ప్రధానంగా ఉన్నారని తెలిసిందే. ఇప్పుడు తన బావమరిదికి ఏకంగా కారును గిఫ్ట్గా ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన లేనప్పటికీ రూమర్స్ మాత్రం బలంగానే వైరల్ అవుతున్నాయి.పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడైన నితిన్ 2023లో ‘మ్యాడ్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయ్, మ్యాడ్ స్క్వేర్ వంటి వరుస సినిమాలతో హిట్ అందుకున్నారు. -
లిటిల్ హార్ట్స్ మౌళికి భారీ రెమ్యునరేషన్తో మైత్రీ సినిమా!
లిటిల్ హార్ట్స్ (Little Hearts)సినిమాతో నటుడు మౌళి(Mouli Tanuj ) భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాదిలో ‘హ్యాష్ట్యాగ్ 90s’ అనే వెబ్ సిరీస్తో యూత్కు బాగా దగ్గరైన మౌళి తన టైమింగ్ డైలాగ్స్తో గుర్తింపు సంపాదించాడు. హీరోగా తొలి సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా తనతో ఒక సినిమా చేద్దాం అనుకునే రేంజ్కు చేరుకున్నాడు. కొత్త దర్శకులు కూడా ఇప్పటికే స్టోరీ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక భారీ నిర్మాణ సంస్థ నుంచి మౌళికి బిగ్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.చిన్న సినిమాగా విడుదలైన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఓటీటీలో కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది. దీంతో అతని మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు మౌళికి ఏకంగా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా ఆఫర్ ఇవ్వడమే కాకుండా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. ఏకంగా రూ. కోటి రెమ్యునరేషన్ కూడా వారు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కేవలం రెండో సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడం పెద్ద విషయమేనని చెప్పాలి. ఒక సినిమా హిట్ అయినప్పటికీ మరో ఛాన్స్ రావడం కష్టంగా ఉన్న ఈరోజుల్లో ఒక పెద్ద నిర్మాణ సంస్థ తన వద్దకే వచ్చి ఇలా ఆఫర్ ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. దీనంతటికీ కారణం మౌళికి యూత్తో బాగా కనెక్ట్ ఉంది. సోషల్మీడియాలో భారీ ఇమేజ్ ఉంది. అందుకే తనకు మైత్రీ మూవీస్ సినిమా అవకాశం ఇచ్చినట్లు టాక్. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో రావచ్చు. -
పదేళ్ల తర్వాత ధనుష్తో పనిచేయనున్న స్టార్ సంగీత దర్శకుడు
సౌత్ ఇండియాలో ప్రస్తుతం క్రేజీ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్న అనిరుధ్ తన సంగీత పయనాన్ని ప్రారంభించింది నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన 3 చిత్రంతోననే విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా, అందులోని వై దిస్ కొలవెరి పాట ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తరువాత 'రఘువరన్ బి.టెక్ , మారి, నవమన్మధుడు' చిత్రాల వరకూ ధనుష్ కోసం అనిరుధ్ సంగీతాన్ని అందించారు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉండటంతో అలా వారి జర్నీ కొనసాగింది. కానీ, వీరిద్దరి మధ్య బేధాబిప్రాయాలు వచ్చాయనే ప్రచారం కోలీవుడ్లో జరిగింది. కుటుంబ విషయంలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని కొందరు చెబితే... ఐశ్వర్యతో ధనుష్ విడాకులు తీసుకోవడం వల్ల అనిరుధ్ కాస్త దూరం జరిగాడని అంటారు. అయితే ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే.. సుమారు పదేళ్లుగా వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ హిట్ కాంబినేషన్లో చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సందర్భం ఇప్పుడు వస్తోందన్నది తాజా సమాచారం. ధనుష్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా అనిరుధ్ నటుడు రజనీకాంత్ చిత్రాలకు వరుసగా పని చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ధనుష్ హీరోగా లబ్బరు బంత్తు చిత్రం ఫేమ్ పచ్చుముత్తు తమిళరసన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే ధనుష్ అభిమానులకు ఖుషీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
దక్షిణ భారత కథలతో...
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సంస్థ ఆరు కొత్త తెలుగు, తమిళ ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్లను సోమవారం ప్రకటించింది. వాటిలో భాగంగా ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించనున్న తెలుగు చిత్రం ‘తక్షకుడు’. ఈ సినిమాలో ఆనంద్ అంధుడి పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా సందీప్ కిషన్ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ తెలుగు వెబ్ సిరీస్ రూ పొందనుంది.అలాగే ప్రియాంక మోహన్, పార్క్ హై–జిన్ ప్రధాన పాత్రల్లో రా కార్తీక్ దర్శకత్వంలో ‘మేడ్ ఇన్ కొరియా’ అనే తమిళ చిత్రం తెరకెక్కనుంది. అదేవిధంగా ఆర్. మాధవన్, నిమిషా సజయన్ ముఖ్య తారలుగా చారుకేశ్ శేఖర్ దర్శకత్వంలో ‘లెగసీ’ (తమిళం), గోమతి శంకర్ ప్రధాన పాత్రలో మిథున్ డైరెక్షన్లో ‘స్టీఫెన్’(తమిళం) చిత్రాలు, అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో ‘# లవ్’(తమిళం) అనే వెబ్ సిరీస్ రూ పొందనుంది. ‘‘పైన పేర్కొన్న సినిమాలు, సిరీస్ల ద్వారా దక్షిణ భారత భాషల్లోని కథలను ప్రోత్సహించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం’’ అని నెట్ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా శెర్గిల్ పేర్కొన్నారు. -
రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను: మమిత బైజు
‘‘డ్యూడ్’ సినిమాలోని కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు నాకు సవాల్గా అనిపించాయి. ఆ సన్నివేశాల కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. అలా చేయడం నాకు సవాల్గా, ఉత్సాహంగా అనిపించింది’’ అని హీరోయిన్ మమిత బైజు తెలి పారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ అవుతోంది.మమిత బైజు మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’లో నేను చేసిన కురల్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. ఈ సినిమాని కీర్తీశ్వరన్ అద్భుతంగా తీశారు. ప్రదీప్ రంగనాథ్ సెట్స్లో చాలా హెల్ప్ ఫుల్గా ఉంటారు. శరత్ కుమార్గారి లాంటి సినియర్తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి అభ్యంకర్ మ్యూజిక్ మా సినిమాకి బిగ్ ఎసెట్. నవీన్ , రవిశంకర్గార్లు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్గా తీశారు. మా చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
జోక్యం చేసుకోలేదు: జైన్స్ నాని
‘‘సినిమాలంటే చిన్నప్పటి నుంచే నాకు ప్యాషన్. కిరణ్ అబ్బవరంతో ఏడాదిన్నర ప్రయాణం చేశాను. ‘కె–ర్యాంప్’ చిత్ర కథ రాసుకుంటున్న సమయంలో తనకు అనిపించింది నాతో షేర్ చేసుకునేవారాయన. అంతేకానీ నా కథ, స్క్రిప్ట్ విషయంలో కిరణ్ ఎక్కడా జోక్యం చేసుకోలేదు’’ అని డైరెక్టర్ జైన్స్ నాని చెప్పారు. కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజ జోడీగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్పై రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 18న రిలీజ్ అవుతోంది.ఈ సందర్భంగా జైన్స్ నాని మాట్లాడుతూ–‘‘మాది నెల్లూరు. మద్రాస్ ఐఐటీలో చదువుకున్నా. అక్కడ కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. ఇండస్ట్రీకి వెళతానన్నప్పుడు మా నాన్నగారు.. ‘ఉద్యోగమా? డైరెక్టరా? అన్నది నువ్వే నిర్ణయించుకో?’ అని ప్రోత్సహించారు. ‘కె–ర్యాంప్’ లో హీరో క్యారెక్టర్ పేరు కుమార్. కథకు, హీరో పాత్రకి సరి పోయేలా ‘కె–ర్యాంప్’ అనే టైటిల్ పెట్టాం. పక్కాగా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా మాది.ఈ మూవీ ద్వారా కిరణ్, యుక్తి తరేజాకి మంచి పేరొస్తుంది. ఫ్రెష్ నెస్ కోసమే కేరళ నేపథ్యం తీసుకున్నాం. 47 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. ఫైనల్ కాపీ చూశాక రాజేష్, శివగార్లు నన్ను అభినందించారు. దీ పావళికి తెలుగులో బాగా పోటీ ఉంది. అయితే అన్ని సినిమాలూ హిట్ కావాలి. మా చిత్రం ఇంకొంచెం పెద్ద హిట్ కావాలి. నాకు ఎనర్జీతో ఉండే వినోదాత్మక చిత్రాలంటే ఇష్టం’’ అని చెప్పారు. -
అబ్బాయిగారు 60 ప్లస్
హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లోని ఈ 77వ సినిమాకు ‘ఆనంద నిలయం, వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం’.. వంటి టైటిల్స్ను మేకర్స్ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమాకు ‘అబ్బాయిగారు 60 ప్లస్’ అనే టైటిల్ను కూడా యూనిట్ పరిశీలిస్తోందనే టాక్ తెరపైకి వచ్చింది. వెంకటేశ్ కెరీర్లో ఆల్రెడీ ‘అబ్బాయి గారు’ అనే సూపర్హిట్ ఫిల్మ్ ఉండటం, త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ ఎక్కువగా ‘అ, ఆ’ అక్షరాలతో మొదలయ్యే సంప్రదాయం ఉండటంతో ‘అబ్బాయిగారు 60 ప్లస్’ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.హిందీలో సంక్రాంతికి వస్తున్నాం?వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై, సూపర్ హిట్ అయింది. కాగా, ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని ‘దిల్’ రాజు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
మిత్రమండలి అలరిస్తుంది: శ్రీ విష్ణు
‘‘మిత్రమండలి’ మూవీ సీక్వెన్స్ బాగున్నాయి. ఫ్రెండ్స్తో కలిసి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది. ఇది నా ప్రామిస్’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం జంటగా నటించిన సినిమా ‘మిత్ర మండలి’. ఎస్. విజయేందర్ దర్శకత్వంలో బన్నీ వాసు సమర్పణలో కల్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరై, ‘తెల్లకోడి నల్లకోడి కళ్లముందే జోడి కూడి..’ పాటను విడుదల చేశారు. దర్శకులు వివేక్ ఆత్రేయ, కల్యాణ్, ఆదిత్యా హాసన్ , అనుదీప్ అతిథులుగా హాజరై, సినిమా విజయాన్ని ఆకాంక్షించారు.అనంతరం ప్రియదర్శి మాట్లాడుతూ–‘‘మిత్రమండలి’ హిట్ కాక పోతే నా నెక్ట్స్ సినిమా చూడొద్దు. ‘కోర్ట్’ సినిమా టైమ్లో నాని అన్న చెప్పిందే కాపీచేసి, ‘మిత్రమండలి’ కోసం నేను చెబుతున్నాను’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిత్రమండలి’. ఈ దీ పావళికి రిలీజ్ అయ్యే నాలుగు సినిమాలూ హిట్ కావాలి. అందరితో పాటుగా మనం కూడా ఎదగాలని కోరుకునే వ్యక్తిని నేను. డబ్బులు పెట్టి పక్క సినిమాపై ట్రోలింగ్ చేసి ఎదుగుదాం అనుకుంటే మాత్రం... పైన దేవుడు ఉన్నాడు.. చూసే ప్రేక్షకులు ఉన్నారు. వాళ్లే చూసుకుంటారు.సినిమా బాగుంటే చూస్తారు. లేక పోతే నీదైనా, నాదైనా.. ఏ సినిమానైనా ఆడియన్స్ పక్కన పెడతారు. ఎంతమంది ఏం చేసినా నేను పరిగెడుతూనే ఉంటాను. అదే నా విజయం అని నమ్ముతాను’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. హిట్ కొడుతున్నాం అని ప్రోత్సహించిన కల్యాణ్ మంతెన, భాను, విజయేందర్, సోమరాజుగార్లకి థ్యాంక్స్’’ అన్నారు ఎస్. విజయేందర్.‘‘మా సినిమా ట్రైలర్కి మంచి స్పందన లభిస్తోంది. కానీ, కొంతమంది హేటర్స్ కూడా ఉన్నారు. వాళ్లు మా సినిమా ప్రీమియర్స్కి కూడా వస్తారని తెలుసు. వాళ్లకు మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ హాయిగా నవ్వించడం’’ అన్నారు నిర్మాత భాను ప్రతాప. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత విజయేందర్. ఈ వేడుకలో చిత్రయూనిట్ పాల్గొంది. -
ఆ పదం బూతు అని నిజంగా తెలియదు.. రాశీ ఖన్నా క్యూట్ కామెంట్స్!
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా. ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 17 థియేటర్లలోకి రానుంది.అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లకు హాజరైన రాశి ఖన్నా ఓ బూతు పదాన్ని మాట్లాడింది. ఆమె మాట్లాడిన ఆ పదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. మూవీ ప్రచారంలో భాగంగా పిచ్చి ము..ని కాదంటూ కామెంట్స్ చేసింది. అయితే తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ రాశీ ఖన్నా దీనిపై క్లారిటీ ఇచ్చింది. అది బూతు పదమని తనకు తెలియదని చెప్పుకొచ్చింది. అదొక క్యూట్ వర్డ్ అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దీనిపై హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆ పదాన్ని బామ్మ క్యారెక్టర్కు వాడినట్లు వివరించారు. రాశీని బామ్మ అలానే పిలుస్తుందని అన్నారు. అది క్యూట్ వర్డ్ అనుకొని మాట్లాడేశానని రాశీ ఖన్నా తెలిపింది. కానీ ఆ తర్వాత అది బూతు పదమని తెలిసిందని వెల్లడించింది. ప్రస్తుతం రాశీ ఖన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. I'm not laughing like a pichi munda.:- #RaashiKhannapic.twitter.com/yBHxJGldHs— Milagro Movies (@MilagroMovies) October 11, 2025 "నాకు అది బూతు అని తెలియదు..I thought it was a Cute Word."– #RaashiiKhanna | #TelusuKada pic.twitter.com/vdwYblQgqy— Whynot Cinemas (@whynotcinemass_) October 13, 2025 -
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
పాలక్ తివారీ బర్త్ డే సెలబ్రేషన్.. బంగారంలా మెరిసిపోతున్న విష్ణుప్రియ!
బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న పాలక్ తివారీ.. బంగారం లాంటి శారీలో మెరిసిపోతున్న విష్ణుప్రియ.. దివాళీ మూడ్లో హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ సన్నింగ్ లుక్.. ఎల్లో డ్రెస్లో ఇంద్ర బ్యూటీ సోనాలి బింద్రే..కలర్ఫుల్ శారీలో అనసూయ బ్యూటీ లుక్స్... View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
విక్రమ్ వారసుడి మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఫుట్బాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు. In a Land of Chaos, rises a Believer! #BisonKaalamaadan 🦬 காளமாடன் வருகை Trailer Out Now ▶️ https://t.co/mwDlHRrJqx 4 Days to go until his last Raid 🔥#BisonKaalamaadanFromDiwali #BisonKaalamaadanOnOct17 🎆@applausesocial @NeelamStudios_ #SameerNair @deepaksegal… pic.twitter.com/kDLfnFWBcQ— Anupama Parameswaran (@anupamahere) October 13, 2025 -
టాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
చిత్రం శ్రీను , సుష్మ , రామ్ బండారు హీరో, హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం మేఘన. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు సుధాకర రెడ్డి వర్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ శివ సాయి ఫిలిమ్స్ బ్యానర్పై నంది వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్తో టీజర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈ సినిమా హీరో చిత్రం శ్రీనివాస్ మాట్లాడుతూ..'మంచి కంటెంట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది. నా ఖాతాలో మరో హిట్ పడుతుందని నమ్మకం ఉందియ నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు' అని అన్నారు. హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ.. 'ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి మా యూనిట్లోని ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సహకరించారు. ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్న చనిపోయి మూడేళ్లు అవుతోంది. ఆ తర్వాత నేను ఎప్పుడూ బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. కానీ ఈ సినిమా ప్రెస్మీట్ సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ మూవీ నా జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురాబోతుంది' అని అన్నారు.దర్శకుడు సుధాకర రెడ్డి వర్ర మాట్లాడుతూ.. 'చిన్న ప్రొడక్షన్ అయినా పెద్ద కలలతో ఈ సినిమా చేశాం. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, కేవలం రెండేళ్లలోనే చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. కథలో మానవ సంబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెంకట్ రమణ, మౌనిక , సౌమ్య , మల్లేశ్వరి ,,యం.నగేష్ బాబు , రోశిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డ్రమ్స్ రాము సంగీతమందిస్తున్నారు. -
సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'కాంతార 1'లో ఇంత పొరపాటు ఎలా చేశారు?
ఎంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, ట్రోల్ చేద్దామా అని చూస్తుంటారు. రాజమౌళి లాంటి దర్శకులు దీనికి భయపడి ఏళ్లపాటు సినిమాని ఫెర్ఫెక్ట్గా వచ్చే వరకు తీస్తుంటారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు 'కాంతార 1'లో చాలా పెద్ద పొరపాటుని నెటిజన్లు బయటపెట్టారు. ఆ సంగతి ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.2022లో వచ్చిన 'కాంతార' సినిమాని ప్రస్తుతం జరుగుతున్నట్లు తీశారు. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1'ని మాత్రం 16వ శతాబ్దంలో జరిగే కథగా తెరకెక్కించారు. అందుకు తగ్గట్లే అడవిలో సెట్ వర్క్ గానీ, పాత్రధారుల కాస్ట్యూమ్స్ గానీ ప్రతిదీ చాలా చక్కగా చూపించారు. కానీ ఒక్కచోట మాత్రం మూవీ టీమ్ దొరికిపోయింది. అందరూ దీన్ని కనిపెట్టకపోవచ్చు గానీ కొందరు నెటిజన్లు మాత్రం తప్పుని పట్టేశారు.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)సెకండాఫ్లో 'బ్రహ్మకలశ' అనే పాట ఉంటుంది. గూడెంలో ఉండే దేవుడిని రాజు ఉండే చోటుకి తీసుకొచ్చే సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఈ పాటలో కాంతార అలియాస్ రిషభ్ శెట్టి తమ దేవుడిని తలపై పెట్టుకుని తీసుకురావడం, తర్వాత స్నానమాచరించి పూజలు చేయడం.. ఇలా అంతా చూపించారు. అయితే అందరూ కలిసి కింద కూర్చుని భోజన చేస్తున్న సన్నివేశంలో మాత్రం ఓ చోట 20 లీటర్ల ప్లాస్టిక్ క్యాన్ కనిపించింది. షూటింగ్ చేస్తున్నప్పుడు దీన్ని అక్కడి నుంచి తీయడం మర్చిపోయినట్లున్నారు. అది ఇప్పుడు మూవీలో, రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన వీడియో సాంగ్లో కనిపించింది.వీడియో సాంగ్లో సరిగ్గా 3:06 నిమిషాల ఈ పొరపాటుని మీరు గమనించొచ్చు. దీన్ని మరీ అంతలా ట్రోల్ చేయడం లేదు గానీ ఫన్నీగానే 16వ శతాబ్దంలో వాటర్ క్యాన్ ఎలా వచ్చిందబ్బా అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: Bigg Boss 9: వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్) -
'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు
మొన్నటివరకు సినిమా అంటే కచ్చితంగా నటీనటులు ఉండాలి, భారీ బడ్జెట్ పెట్టాలనేది అందరికీ తెలిసిన విషయం. కానీ 'మహావతార్ నరసింహా'.. దీన్ని బ్రేక్ చేసింది. సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టింది. మొత్తం యానిమేషన్తో తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ తరహా యానిమేషన్తో ఇప్పుడు మహాభారతంలోని కురుక్షేత్ర ఘట్టానికి దృశ్యరూపం ఇచ్చారు. అలా 'కురుక్షేత్ర' పేరుతో వెబ్ సిరీస్గా ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: Bigg Boss 9: వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్)ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఉజాన్ గంగూలీ దర్శకుడు. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని 18 ఎపిసోడ్స్గా తెరకెక్కించారు. ఛాప్టర్-1 పేరుతో ఇప్పుడు తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా.. ఈనెల 24న మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్ విడుదల చేయనున్నారు. మరి 'కురుక్షేత్ర' తొలి సీజన్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.'కురుక్షేత్ర' కథేంటి?అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత పాండవులకు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు.. రాజ్యంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాట తప్పుతారు. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఓపిగ్గానే ఉంటారు. సంజయుడితో కౌరవులకు రాయబారం పంపిస్తారు. కానీ అది విఫలమవుతుంది. కౌరవులు.. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్నారనే విషయం పాండవులకు తెలుస్తుంది. దీంతో కృష్ణుడు, అర్జునుడు వైపు.. కృష్ణుడి సైన్యం దుర్యోధనుడికి దక్కుతుంది. అలా 'కురుక్షేత్రం' మొదలవుతుంది. ఆయుధాలే పట్టనని అనుకున్న అర్జునుడు.. కృష్ణుడి గీతోపదేశం తర్వాత ఎలా మారాడు? ఈ యుద్ధంలో అసలేం జరిగిందనేది అసలు కథ?ఎలా ఉందంటే?మహాభారతం అంతులేని సబ్జెక్ట్. ఎంత చెప్పినా అస్సలు తరగదు. దీనిపై ఇప్పటికే పలు సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. జనాలని అలరించాయి. నెట్ఫ్లిక్స్ మాత్రం 18 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని మాత్రమే తీసుకుని ఈ 'కురుక్షేత్ర' సిరీస్ తీసింది. ఒక్కముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. ముందే యానిమేటెడ్ సిరీస్ అని చెప్పేశారు కాబట్టి ఓ అంచనా ఉంటుంది. దాన్ని అందుకోవడంలో ఏ మాత్రం తగ్గలేదు. గ్రాఫిక్స్, తెలుగు డబ్బింగ్, కథని చెప్పే విధానం.. ఇలా ప్రతిదీ టాప్ రేంజులో ఉన్నాయి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))అయితే ఉన్నది ఉన్నట్లు చెబితే చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టొచ్చు. అందుకే ఓవైపు యుద్ధాన్ని చూపిస్తూనే మరోవైపు ఫ్లాష్ బ్యాక్స్ కూడా చూపిస్తూ ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. కౌరవుల దగ్గరకెళ్లి సంజయుడి రాయబారం చేసే సీన్స్తో తొలి ఎపిసోడ్ మొదలవుతుంది. రెండో ఎపిసోడ్కి యుద్ధం ప్రారంభమైపోతుంది. అక్కడి నుంచి భీష్ముడి మరణం, పద్మవ్యూహంలో బంధించి అభిమన్యుడిని కౌరవులు చంపడం, జయద్రధుడిని అర్జునుడు సంహరించే సీన్.. ఇలా గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలతో ఆద్యంతం అలరించేలా తీశారు.మహాభారతంలో పాత్రలు చాలా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈ సిరీస్లో చాలా సులభంగా గుర్తుపెట్టుకునేలా అన్ని పాత్రల్ని తీర్చిదిద్దారు. ఎలాంటి సాగదీత లేకుండా క్లియర్ కట్గా సీన్స్ అన్ని చూపించారు. కాస్ట్యూమ్స్ గానీ కోటలు, రాజభవనాలు గానీ.. యుద్ధ సన్నివేశాలు గానీ ప్రతిదీ టాప్ క్వాలిటీతో తెరకెక్కించారు. తెలుగు డబ్బింగ్ కూడా ఫెర్ఫెక్ట్గా ఉంది. ఇప్పటి జనరేషన్కి మహాభారతం, కురుక్షేత్రం గురించి అస్సలు తెలియకపోవచ్చు. వాళ్లు గానీ ఈ సిరీస్ చూస్తే థ్రిల్ కావడంతో పాటు చాలా విషయాలు తెలుసుకుంటారు కూడా!ఈ సిరీస్లో మిగిలిన పాత్రల సంగతేమో గానీ కర్ణుడు పాత్ర చూస్తున్నప్పుడు మాత్రం ప్రభాస్ పోలికలు కనిపిస్తాయి. మరి మేకర్స్ కావాలని పెట్టారా లేదంటే అలా కుదిరేసిందో? ఏదేమైనా రీసెంట్ టైంలో 'మహాభారతం' ఆధారంగా సినిమాలు గానీ సిరీస్లు గానీ రాలేదు. ఓ రకంగా ఈ విషయం ఈ సిరీస్కి చాలా ప్లస్ పాయింట్. టైమ్ ఉంటే మాత్రం ఓటీటీలో ఉన్న ఈ జెమ్ని అస్సలు మిస్ కావొద్దు- చందు డొంకాన(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా) -
కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ జోరు.. జైలర్, లియో రికార్డ్స్ బ్రేక్!
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలను రికార్డ్స్ తుడిచిపెట్టిన ఈ మూవీ అరుదైన మార్క్ చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 11 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్లో చేరింది. రెండో వారంలోనూ కలెక్షన్స్ పరంగా తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే కన్నడలో కేజీఎఫ్-2 తర్వాత రెండో స్థానంలో కాంతార చాప్టర్-1 నిలిచింది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం మరింత కలిసి రానుంది.కాంతారా చాప్టర్ 1 ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.615 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో రజినీకాంత్ జైలర్(రూ.605 కోట్లు), విజయ్ లియో(రూ.606 కోట్లు) లాంటి బ్లాక్బస్టర్ హిట్స్ను అధిగమించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీకంటే విక్కీ కౌశల్, రష్మిక నటింటిన ఛావా (రూ.808 కోట్లు) తొలిస్థానంలో ఉంది. అయితే త్వరలోనే ఈ రికార్డ్ను సైతం బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే రూ.439 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.525 కోట్ల గ్రాస్ రాబట్టింది.అంతేకాకుండా ఓవర్సీస్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 2022 బ్లాక్బస్టర్ కాంతారకు ప్రీక్వెల్గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. -
వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఈసారి నామినేషన్స్లో ఎవరంటే?
ఆదివారం ఎపిసోడ్తో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మాధురి, రమ్య మోక్ష, ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస సాయి ఉన్నారు. వస్తూవస్తూనే వీళ్లకు పవర్స్ ఇచ్చిన బిగ్బాస్.. ఈ వారం నామినేషన్లోనూ అదిరిపోయే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఈసారి గట్టిగానే వాదోపవాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆరోవారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'జగద్ధాత్రి' సీరియల్ నటి)వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఈ వారం నామినేట్ చేసే అవకాశం లేదు. అయితే 'ఫైర్ బాల్' అనేది ఏర్పాటు చేసిన పైపు నుంచి పడుతుంది. బజర్ మోగే సమయానికి అది ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లలో ఒకరికి ఇవ్వొచ్చు. అలా బాల్ అందుకున్న కంటెస్టెంట్.. పాతవాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా తనూజ.. సుమన్ శెట్టి, రాము.. పవన్ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు.అయితే 'ఫైర్ బాల్' పోటీలో పికెల్స్ పాప రమ్య గట్టిగానే పోరాడింది. అలానే నిఖిల్ కూడా బాల్ అందుకున్నాడు. అలా ఈసారి భరణి, తనూజ, పవన్, దివ్య, రాము, సుమన్ శెట్టి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వీళ్లలో సుమన్ శెట్టి గతవారం డేంజర్ జోన్లో ఉన్నాడు. చివరవరకు వచ్చినప్పటికీ శ్రీజ ఎలిమినేట్ కావడంతో సేవ్ అయిపోయాడు. ఈసారైనా గేమ్స్ ఆడి సేఫ్ జోన్లోకి వస్తాడా? లేదంటే బయటకొచ్చేస్తాడా అనేది చూడాలి. లేదంటే మాత్రం దివ్యపై వేటు పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఈ వారం నామినేట్ అయినోళ్లుభరణిపవన్దివ్యరాముసుమన్తనూజ(ఇదీ చదవండి: ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!) -
సినిమాల్లో బోల్డ్ సీన్స్.. ఆ విషయంలో భయపడ్డా..: హీరోయిన్
బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పంజాబీ ముద్దుగుమ్మ సోనమ్ బజ్వా. ప్రస్తుతం ఏక్ దీవానే కి దీవానియాత్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనమ్.. బాలీవుడ్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.బాలీవుడ్లో తాను చాలా సినిమాలు తిరస్కరించినట్లు సోనమ్ బజ్వా తెలిపింది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్, ముద్దు సన్నివేశాలకు నో చెప్పానని వెల్లడించింది. అయితే ఆ అవకాశాలు వదిలేసుకున్నందుకు తానిప్పుడు చింతిస్తున్నట్లు పేర్కొంది. తన సొంత రాష్ట్ర పంజాబ్లో ప్రజలు, తమ కుటుంబం ఆ సీన్స్ చూస్తే ఎలా స్పందిస్తారోనని భయపడ్డానని రివీల్ చేసింది.సోనమ్ మాట్లాడుతూ..'బాలీవుడ్లో చాలా సినిమాలకు నేను నో చెప్పాను. ఎందుకంటే తన సొంత రాష్ట్రం పంజాబ్ ఇలాంటి వాటిని అంగీకరిస్తుందా భయపడ్డాను. మా కుటుంబాల మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. అందుకే అప్పట్లో సినిమాల్లో ముద్దు సన్నివేశం చేయడానికి చాలా భయపడ్డాను. నన్ను అలా చూస్తే ప్రజలు ఎలా స్పందిస్తారు? నన్ను నేనుగా మార్చిన వ్యక్తులు ఏమనుకుంటారు? ఇదంతా సినిమా కోసమేనని నా కుటుంబం అర్థం చేసుకుంటుందా?' అని నా మనసులో నేనే బాధపడ్డా' అని పంచుకుంది.అయితే తన తల్లిదండ్రుల మద్దతు ఇచ్చారని సోనమ్ వెల్లడించింది. ఈ రెండేళ్ల క్రిత దాని గురించి మా అమ్మానాన్నలతో మాట్లాడా.. అది కేవలం సినిమా కోసం అయితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అది నేను కూడా షాక్ అయ్యా.. ఈ విషయం గురించి మొదట వారితో ఎందుకు మాట్లాడలేదని బాధపడ్డా.. దీని గురించి నా తల్లిదండ్రులతో చర్చించడానికి చాలా సిగ్గుపడ్డానని తెలిపింది.ఇక సోనమ్ కెరీర్ విషయానికొస్తే 2013లో బెస్ట్ ఆఫ్ లక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పంజాబ్ 1984 మూవీతో ఫేమ్ తెచ్చుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా నిక్కా జైల్దార్, క్యారీ ఆన్ జట్టా 2, అర్దాబ్ ముతియారన్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా బాబు బంగారం, సుశాంత్ నటించిన ఆటాడుకుందాం రా చిత్రంలో కనిపించింది. 2019లో బాలా మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత స్ట్రీట్ డాన్సర్ 3డీ, హౌస్ఫుల్ 5 సినిమాలు చేసింది. ప్రస్తుతం ఏక్ దీవానే కి దీవానియాత్తో పాటు టైగర్ ష్రాఫ్తో బాఘి 4లో కనిపించినుంది. -
ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ నటి
తెలుగు సీరియల్ నటి గుడ్ న్యూస్ చెప్పేసింది. ఆమెనే 'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నె. పదిరోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈమె.. ఇప్పుడు ప్రియుడిని పరిచయం చేసింది. ఇద్దరు జంటగా, రొమాంటిక్గా దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తోటీ నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ దీప్తి ప్రియుడు ఎవరు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)తెలుగులో సీరియల్స్ అనగానే కన్నడ నటులే గుర్తొస్తారు. అలాంటి వాళ్లలో దీప్తి మన్నె ఒకరు. బెంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ తొలుత కన్నడలో సీరియల్స్, సినిమాలు చేసింది. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గత కొన్నేళ్లలో 'రాధమ్మ కూతురు', 'జగద్ధాత్రి', 'పద్మావతి' తదితర సీరియల్స్ చేసింది. ఇక సెలవ్ అనే తెలుగు మూవీతో పాటు యెవన్, దేవదాస్ బ్రదర్స్, కర్త, హింగ్యాకే, నమ్మూర హైక్లు అనే కన్నడ చిత్రాల్లో నటించింది.ప్రస్తుతం తాను రోహన్తో ప్రేమలో ఉన్నానని దీప్తి.. ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఇతడికి ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు తెలుస్తోంది. 'డియర్ రోహన్. నీ కోసమే ఇన్నాళ్లుగా నేను ఎదురుచూస్తున్నాను. నాకు దక్కిన మరపురాని బహుమతి నువ్వు. నన్ను కోరుకున్నందుకు థ్యాంక్యూ. ఐ లవ్ యూ' అని ప్రియుడి గురించి దీప్తి చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే పరిచయం చేసింది. త్వరలో నిశ్చితార్థం, పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. బహుశా ఈ ఏడాది పూర్తయ్యేలోపు శుభకార్యాలు చేస్తారేమో!(ఇదీ చదవండి: నిజ జీవితంలో అమ్మాయిల పిచ్చి ఉందా?.. సిద్ధు షాక్!) -
హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సిద్ధు 'తెలుసు కదా' ట్రైలర్ రిలీజ్
'డీజే టిల్లు' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'తెలుసు కదా'. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు కాగా.. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం(అక్టోబరు 17) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)ట్రైలర్లో అయితే స్టోరీ ఏంటనేది అస్సలు రివీల్ చేయలేదు. ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి. ప్రేమించిన వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు అనుకునే మనస్తత్వం. అలాంటిది ఇద్దరమ్మాయిలతో రిలేషన్లోకి వెళ్తాడు. వాళ్లిద్దరూ కలిసి అంటే ముగ్గురు జర్నీ చేస్తారు? ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగింది? అనేదే తెలియాలంటే మూవీ చూడాలి. చూస్తుంటే రెగ్యులర్ లవ్ స్టోరీలా అయితే అనిపించట్లేదు. మరి సిద్ధు ఈసారి ఏం చేస్తాడో చూడాలి?ఈ సినిమాతో పాటు ఇదే వీకెండ్లో మరో మూడు మూవీస్ కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. అవే 'మిత్రమండలి', 'డ్యూడ్', 'కె ర్యాంప్'. ఈ చిత్రాల ట్రైలర్స్ ఇప్పటికే రిలీజ్ కాగా, ఇవి కూడా బాగానే అనిపించాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుంది? ప్రేక్షకుల మనసు ఏది గెలుచుకుంటుందనేది చూడాలి? గత నెలలో టాలీవుడ్కి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు రాబోయే సినిమాల బట్టి ఈనెల కూడా కలిసొస్తుందా లేదా అనేది తేలుతుంది.(ఇదీ చదవండి: సాయంత్రం 6 గంటలకే వచ్చాడుగా ఏమైంది? మురుగకి సల్మాన్ కౌంటర్) -
సాయంత్రం 6 గంటలకే వచ్చాడుగా ఏమైంది? మురుగకి సల్మాన్ కౌంటర్
ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు తీసే దర్శకనిర్మాతలు.. స్టార్ హీరోల గురించి, సినిమాల ఫెయిల్యూర్స్ గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం అసందర్భంగా ఇలాంటి విషయాలు బయటపడుతుంటాయి. కొన్నిరోజుల క్రితం తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్.. సల్మాన్పై నేరుగా కౌంటర్స్ వేశాడు. 'సికిందర్' ఫ్లాప్ కావడానికి అతడే బాధ్యుడు అన్నట్లు మాట్లాడాడు. దీంతో సల్మాన్ ఫ్యాన్స్తో పాటు చాలామంది షాకయ్యారు.'మదరాసి' సినిమా ప్రమోషన్లలో టైంలో దర్శకుడు మురుగదాస్.. సల్మాన్ ఖాన్పై ఈ కామెంట్స్ అన్నీ చేశాడు. రాత్రి 9 గంటల తర్వాత హీరో షూటింగ్కి వచ్చేవాడని, పిల్లల్ని స్కూల్కి పంపే సీన్స్ కూడా అర్థరాత్రి 2-3 గంటలకు తీశామని మురుగదాస్ అన్నాడు. అప్పటినుంచి సైలెంట్గానే ఉన్న సల్మాన్.. ఇప్పుడు బిగ్బాస్-19 వీకెండ్ ఎపిసోడ్లో ఈ విషయమై స్పందించాడు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ మురుగదాస్పై అదిరిపోయే పంచులు వేశాడు.(ఇదీ చదవండి: Bigg Boss 9: ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!)'విపరీతమైన గాయాల వల్ల నేను షూటింగ్గా ఆలస్యంగా వస్తే దాన్ని మరోలా చెప్పుకొని నెగిటివ్ చేశారు. ముందు నిర్మాత సాజిత్ నడియావాలా తప్పుకొంటే.. తర్వాత సౌత్ సినిమా మదరాసి తీయడానికి మురుగదాస్ వెళ్లిపోయారు. అక్కడి యాక్టర్ సాయంత్రం ఆరు గంటలకే సెట్కి వచ్చావాడు. అందుకే అది సికిందర్ కన్నా చాలా పెద్ద బ్లాక్బస్టర్ అయింది' అని సల్మాన్ ఖాన్ సెటైరికల్గా గట్టిగానే కౌంటర్స్ వేశాడు.ఇన్ని చెప్పిన మురుగదాస్.. 'మదరాసి' సినిమాతో ఘోరమైన ఫలితాన్ని అందుకున్నాడు. తెలుగులో ఇది డిజాస్టర్ అయితే, తమిళంలో యావరేజ్గా నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్ల టైంలోనే తెలుగు సినిమాలకు రూ.1000 కోట్ల కలెక్షన్స్ వస్తుండటంపైనా విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. తమిళంలో ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేసే చిత్రాలు తీస్తామని అందుకే అన్ని కోట్ల కలెక్షన్స్ రావని అన్నాడు. దీంతో 'మదరాసి' చిత్రంతో మురుగదాస్.. ప్రేక్షకులకు ఏం విలువలు నేర్పించాడో చెప్పాలని రిలీజ్ టైంలో కౌంటర్స్ గట్టిగానే పడ్డాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
పెద్ది తర్వాత నీల్ తో .. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్
-
అటు కళ్యాణి.. ఇటు కృతి శెట్టి బెల్లీ డ్యాన్స్ అదరగొట్టారుగా..!
-
టాలీవుడ్కి షాక్ ఇస్తోన్న హీరో ధనుష్
-
'కె. ర్యాంప్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరోయిన్
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్గా గుర్తింపు పొందిన వారు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే జెనీలియా, భూమిక, అన్షు, లయ, రంభ, మీనా, విజయశాంతి,సంగీత వంటి హీరోయిన్లు రీఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొంతమంది మెప్పించారు కూడా. అయితే, తాజాగా ముంబై బ్యూటీ కామ్న జెఠ్మలానీ( Kamna Jethmalani) టాలీవుడ్లోకి మరో ఛాన్స్ కోసం వచ్చేసింది. కిరణ్ అబ్బవరం సినిమా కె.ర్యాంప్తో ప్రేక్షకులను పలకరించనుంది.2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణంతో బాగా పాపులర్ అయింది. అయితే, ఆ తర్వాత కింగ్, సైనికుడు వంటి సినిమాల్లో కనిపించినా పెద్దగా ప్రభావం చూపించలేదు. 2013లో చివరిగా శ్రీ జగద్గురు ఆది శంకర మూవీలో మాత్రమే కనిపించింది. సుమారు 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వెండితెరపైకి కామ్నా జెఠ్మలానీ రానుంది.కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ను వివాహం చేసుకుంది. సినిమా ఛాన్సుల కోసం ఈ విషయాన్ని కూడా ఆమె కొంత కాలం దాచింది. అయినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆమె కె.ర్యాంప్తో వస్తుంది. అయితే, ఎంతమాత్రం విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.రీసెంట్గా జూనియర్ సినిమాతో జెనీలియా మెప్పించింది. కానీ, తమ్ముడు సినిమాలో లయ పాత్ర అంతగా క్లిక్ కాలేదని చెప్పాలి. మరోవైపు సంగీత మాత్రం రీఎంట్రీలో చాలా సినిమాలతో అదరగొట్టేస్తుంది. అయితే.., భూమిక, మీరా జాస్మిన్, సదా వంటి స్టార్స్ ఇప్పటికే గట్టిపోటీ ఇచ్చేందుకు రేసులో ఉన్నారు. -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు
వచ్చేవారం మొదట్లోనే దీపావళి పండగ ఉంది. దీంతో ఈ వీకెండ్ నాలుగు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ చిత్రాలు ఉన్నాయి. వీటన్నింటిపైనా కాస్తోకూస్తో బజ్ ఉండనే ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ 24 వరకు కొత్త మూవీస్-వెబ్ సిరీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలోనూ చూడదగ్గ చిత్రాలు కొన్ని ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోయే వాటిలో కిష్కింధపురి, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్, సంతోష్ చిత్రాలతో పాటు ఆనందలహరి అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇవి కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజులు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 13 నుంచి 19 వరకు)హాట్స్టార్హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 13ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - అక్టోబరు 16స్ట్రైకింగ్ రెస్క్యూ (చైనీస్ మూవీ) - అక్టోబరు 16నెట్ఫ్లిక్స్ఎవ్రిబడి లవ్స్ మూవీ వెన్ ఐయామ్ డెడ్ (థాయ్ సినిమా) - అక్టోబరు 14ఇన్సైడ్ ఫ్యూరియోజా (పోలిష్ మూవీ) - అక్టోబరు 15బ్యాడ్ షబ్బోస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 16ద టైమ్ దట్ రిమైన్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 16ద ట్విట్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 1627 నైట్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబరు 17గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) - అక్టోబరు 17గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) - అక్టోబరు 17షీ వాక్స్ ఇన్ డార్క్నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 17ద ఫెర్ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 17అమెజాన్ ప్రైమ్కల్ప నేస్ట్రా (స్పానిష్ మూవీ) - అక్టోబరు 16ఆహాఆనందలహరి (తెలుగు సిరీస్) - అక్టోబరు 17జీ5కిష్కింధపురి (తెలుగు సినిమా) - అక్టోబరు 17భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) - అక్టోబరు 17ఎలుమలే (కన్నడ సినిమా) - అక్టోబరు 17మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) - అక్టోబరు 17అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) - అక్టోబరు 17సన్ నెక్స్ట్ఇంబమ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 17ఆపిల్ ప్లస్ టీవీలూట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 15లయన్స్ గేట్ ప్లేసంతోష్ (హిందీ సినిమా) - అక్టోబరు 17వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17(ఇదీ చదవండి: నాలుగేళ్లుగా శ్రీనివాస్తోనే.. నరకం చూడని రోజంటూ లేదు: మాధురి) -
ఓటీటీలో ‘జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ’ ఫైనల్ స్ట్రీమింగ్
జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఫైనల్ సిరీస్ "జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ" ఓటీటీలో విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ యానిమేటెడ్ సిరీస్గా నెట్ఫ్లిక్స్లో నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్ డైనోసార్లు మనుషుల ప్రపంచంలోకి వచ్చిన తర్వాత జరిగే సంఘటనల గురించి తెలియజేస్తుంది. మొదటి సీజన్లో, బ్రూక్లిన్, సోయోనా శాంటోస్ వంటి పాత్రలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇందులో కూడా వారు కొనసాగనున్నారు. ఈ సిరీస్ ప్రధానంగా వినోదం, స్నేహం, డైనోసార్ల గురించి ఉంటుంది. "జురాసిక్ పార్క్" ఫ్రాంచైజీలో భాగం, డ్రీమ్వర్క్స్ యానిమేషన్ ద్వారా ఈ సిరీస్ను తెరకెక్కించారు. -
పెళ్లి కోసం 15ఏళ్లు ఆగాము.. ఎందుకంటే: కీర్తి సురేశ్
కీర్తి సురేశ్(Keerthy Suresh) తాను ప్రేమించిన ఆంథోనీ తటిల్తో గతేడాది వివాహం అయింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొచ్చి, చెన్నైలలో ఆంథోనికి వ్యాపారాలున్నాయి. కాలేజీ రోజుల్లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. అలా 15 ఏళ్ల పాటు రహస్యంగా ఉన్న వారి ప్రేమ.. పెళ్లితోనే ప్రపంచానికి చెప్పారు. అయితే, పెళ్లి కోసం అంత సమయం ఎందుకు ఆగాల్సి వచ్చిందో తాజాగా కీర్తి చెప్పింది.ప్రముఖ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ఒక టాక్ షోలో కీర్తి సురేశ్ తన పెళ్లి, ప్రేమ గురించి ఇలా చెప్పింది. 'పెళ్లి విషయంలో మేము కావాలనే సమయం తీసుకున్నాం. కాలేజీ రోజుల్లోనే (2010) ప్రేమలో పడ్డాం. కానీ, ముందు నా చదువు పూర్తి కావాలని ఆలోచించాను. కెరీర్ పరంగా ఎటువైపు అనేది కూడా ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేదు. కానీ, జీవితంలో ఇద్దరం స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే, గత ఆరేళ్లుగా నేను సినిమాలతో బిజీగా ఉన్నాను. తను ఖతార్లో ఉన్నాడు. అక్కడ ఆయిల్ పరిశ్రమలో వ్యాపారం చూసుకునే వాడు. ఇప్పుడు ఓకే పెళ్లి గురించి ఇంట్లో చెబుదామని అనుకున్నాం. కానీ, ఇంట్లో రిలీజియన్ (మతం)గురించి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయని కూడా భయపడ్డాను. అయినప్పటికీ ఒకరోజు మా నాన్న దగ్గరికి వెళ్లి ఆంథోనీ గురించి చెప్పాను. ఆ సమయంలో నాన్న నుంచి ఎలాంటి వ్యతిరేఖత రాలేదు. సింపుల్గానే పెళ్లికి ఒప్పుకున్నారు. నాలుగేళ్ల క్రితమే తన ప్రేమ విషయాన్ని నాన్నతో చెప్పాను.' అని కీర్తి గుర్తు చేసుకుంది. -
ఫిలింఫేర్ అవార్డ్స్: రికార్డు సృష్టించిన లాపతా లేడీస్.. ఏకంగా..
ఫిలింఫేర్ అవార్డుల్లో (Filmfare Awards 2025) లాపతా లేడీస్ సినిమా విజయ ప్రభంజనం మోగించింది. ఏకంగా 13 విభాగాల్లో పురస్కారాలు ఎగరేసుకుపోయింది. ఎక్కువ ఫిలింఫేర్లు అందుకున్న సినిమాగా ఇప్పటివరకు గల్లీ బాయ్ పేరిట (13 పురస్కారాలతో) రికార్డు ఉంది. ఇప్పుడు లాపతా లేడీస్ (Laapataa Ladies Movie) ఆ రికార్డును సమం చేసింది. అహ్మదాబాద్లో శనివారం జరిగిన 70వ ఫిలింఫేర్ వేడుకకు షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ యాంకర్స్గా వ్యవహరించారు.'ఐ వాంట్ టు టాక్' మూవీకి గానూ అభిషేక్ బచ్చన్, 'చందు: ఛాంపియన్' సినిమాకుగానూ కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. జిగ్రా చిత్రానికిగానూ ఆలియా భట్ (Alia Bhatt) ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. లాపతా లేడీస్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులు అందించారు.అవార్డు విజేతలు వీళ్లే..ఉత్తమ దర్శకుడు: కిరణ్ రావు (లాపతా లేడీస్)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): ఐ వాంట్ టు టాక్ (డైరెక్టర్ సుజిత్ సర్కార్)ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): రాజ్కుమార్ రావ్ (శ్రీకాంత్ మూవీ)ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్): ప్రతిభ (లాపతా లేడీస్)ఉత్తమ సహాయ నటుడు: రవి కిషన్ (లాపతా లేడీస్)ఉత్తమ సహాయ నటి: ఛాయా కదమ్ (లాపతా లేడీస్)ఉత్తమ డెబ్యూ నటుడు: లక్ష్య (కిల్)ఉత్తమ డెబ్యూ నటి: నితాన్షి గోయెల్ (లాపతా లేడీస్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: కునాల్ కెమ్ము (మడగావ్ ఎక్స్ప్రెస్), ఆదిత్య సుహాస్ జంబలే (ఆర్టికల్ 370)ఉత్తమ యాక్షన్: సీయాంగ్ ఓ, పర్వేజ్ షైఖ్ (కిల్)ఉత్తమ స్క్రీన్ప్లే: స్నేహ దేశాయ్ (లాపతా లేడీస్)ఉత్తమ కథ: ఆదిత్య ధర్, మోనాల్ టక్కర్ (ఆర్టికల్ 370)ఉత్తమ సంభాషణలు: స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: రామ్ సంపత్ (లాపతా లేడీస్)ఉత్తమ లిరిక్స్: ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్)ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (లాపతా లేడీస్)ఉత్తమ గాయని: మధుబంతి బగ్చి (స్త్రీ 2)ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: రితేశ్ షా, తుషార్ షీతల్ జైన్ (ఐ వాంట్ టు టాక్)ఉత్తమ సౌండ్ డిజైన్: సుభాష్ సాహో (కిల్)ఉత్తమ నేపథ్య సంగీతం: రామ్ సంపత్ (లాపతా లేడీస్)ఉత్తమ వీఎఫ్ఎక్స్: రీడిఫైన్(ముంజ్యా)ఉత్తమ కొరియోగ్రఫీ: బోస్కో-సీజర్ (బ్యాడ్ న్యూస్ మూవీలో తాబ తాబ పాట)ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పానికర్ (కిల్)ఉత్తమ కాస్ట్యూమ్: దర్శన్ జలన్ (లాపతా లేడీస్)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మయూర్ శర్మ (కిల్)ఉత్తమ సినిమాటోగ్రఫీ: రఫీ మహ్మద్ (కిల్)ప్రత్యేక అవార్డులుజీవిత సాఫల్య పురస్కరం: శ్యామ్ బెనగల్ (మరణానంతరం), జీనత్ అమన్ఆర్డీ బర్మన్ పురస్కారం: అచింత్ టక్కర్ (జిగ్రా, మిస్టర్ అండ్ మిసెస్ మహి)చదవండి: నేను కూర్చుంటే లేచి వెళ్లిపోయేవారు.. పవన్-రీతూల లవ్ట్రాక్ ఫేక్! -
అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. కారణం సంధ్య థియేటర్ ఘటనేనా?
టాలీవుడ్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. చిరు మినహా మిగిలిన అందరికీ వారసత్వంగా ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా సొంతంగా తన అభిమానుల సైన్యాన్ని రెడీ చేసుకోనున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చాలామందిని ఉత్సుకతను రేకెత్తించింది.ఇప్పటివరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మెగా అభిమాన సంఘాల ద్వారానే పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ, మెగా ప్యాన్స్ పలుమార్లు ఇప్పటికీ కూడా బన్నీ సినిమాలతో పాటు ఆయన్ను కూడా ట్రోల్స్ చేయడం జరుగుతూనే ఉంది. దీంతో బన్నీ అభిమానులు కూడా తమ శక్తికి మించి వారికి కౌంటర్స్ ఇస్తున్నారు. ఇప్పడు తమకంటూ ఒక ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండాలని వారు భావించినట్లు ఉన్నారు. అందుకే "Allu Arjun Fans Association" పేరుతో ఒక సంఘం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా కమిటీ సభ్యులను ఎన్నుకుంది.సంధ్య థియేటర్ ఘటనతో మార్పుఅల్లు అర్జున్కు టాలీవుడ్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఉన్న యూత్లో ఎక్కువ మంది ఆయన్ను అభిమానించే వారే ఉన్నారని చెప్పవచ్చు. కానీ, పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తనకు అండగా ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. ఈ కేసులో అరెస్టు అయినప్పుడు అల్లు అర్జున్ సరైన అభిమానుల సంఘం అవసరాన్ని గ్రహించాడని కొందరు చెబుతారు. పెద్ద సంఖ్యలో వ్యవస్థీకృత అనుచరులతో కూడిన ఒక టీమ్ తనకు అవసరమని ఆయన గుర్తించినట్లు ఇండస్ట్రీలోని తన సన్నిహితులు చెబుతున్నారు. ఆ సమయంలో బన్నీకి అధికారికంగా అభిమానుల సంఘం లేదు. దీంతో అతని తరుపున ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని సమర్థవంతంగా రీచ్ చేసేవారు లేరు. ఈ సంఘటనను ఛాన్స్గా తీసుకున్న కొందరు అతనిపై సోషల్మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. దీంతో ట్రోల్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. అదే టైమ్లో తనకు కూడా ఒక బలమైన సంఘం ఉండుంటే ఇలా జరిగేది కాదని చెబుతారు. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా అల్లు అర్జున్ కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ప్లాన్ ఉన్నట్లు సమాచారం. తనను అభిమానించే వారి కుటుంబాలకు తనవంతుగా సాయం చేసేందుకు ముందు వరుసలో ఉండాలనే ప్లాన్తో ఆయన ఉన్నారట.ఎన్టీఆర్ కోసం యుద్ధమే చేసిన అభిమాన సంఘాలుసినిమా హీరోలకు ఏదైనా సమస్య వస్తే మొదటి బలంగా గొంతు ఎత్తేది అభిమాన సంఘాలే... రీసెంట్గా ఎన్టీఆర్- అనంతపురం అర్బన్ ఎమ్మేల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదం గురించి చెప్పవచ్చు. తారక్ గురించి అతను చేసిన వ్యాఖ్యలకు ఆయన అభిమానులు విరుచుకుపడ్డారు. ఇప్పటికీ కూడా ఆ ఎమ్మేల్యే స్వేచ్ఛగా తిరగలేకుండా ఉన్నారు. అలా కొన్ని సందర్భాల్లో తమ హీరో కోసం వారు అండగా నిలబడుతారు.We are delighted to officially launch and announce the Allu Arjun Fans Association!Presenting the list of elected committee members of both AP & TS States who will serve for the upcoming term.Hearty congratulations and best wishes to all the members – may your journey ahead… pic.twitter.com/Ca2cJjg0Pr— Allu Arjun Fans Association (@AAFAOnline) October 12, 2025 -
'నువ్వే కావాలి'@25.. ఒక ట్రెండ్ సెట్టర్.. కానీ, వదిలేసిన స్టార్ హీరో
తెలుగు సినిమా చరిత్రలో ‘నువ్వే కావాలి’ సినిమా చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2000 సమయంలోని యూత్కు ఈ సినిమాతో ఎన్నో తీపి గుర్తులు తప్పకుండా ఉంటాయని చెప్పవచ్చు. ఆ సమయంలో యూత్ను బాగా ఆకర్షించిన చిత్రాల్లో నువ్వే కావాలి ముందు వరుసలో ఉంటుంది. కె.విజయభాస్కర్ దర్శకత్వానికి త్రివిక్రమ్ రచనా శైలి మరింత బలాన్ని ఇచ్చింది. ఆపై కోటి అందించిన అద్భుతమైన సంగీతం ఇప్పటి తరం యూత్ను కూడా మెప్పిస్తుంది.తరుణ్ బాల నటుడిగా దాదాపు 30 సినిమాలు చేశాడు. కానీ, హీరోగా ఆయనకు ఇదే తొలి సినిమా.. హీరోయిన్గా రిచా నటించగా మరో కీలకమైన పాత్రలో సాయి కిరణ్ నటించారు. మలయాళంలో భారీ విజయం సాధించిన ‘నిరం’ చిత్రానికి రీమేక్గా నువ్వే కావాలి తెలుగులో విడుదలైంది. అయితే, ఈ మూవీ ఇక్కడ కూడా కొన్ని థియేటర్స్లలో 400 రోజులు కూడా ఆడింది. 20 సెంటర్స్కు పైగానే 200రోజులు పాటు రన్ అయింది. ఆరు సెంటర్స్లలో 365రోజులు ప్రదిర్శించారు.ఈ చిత్రం అక్టోబరు 13, 2000న విడుదలైంది. మొదట్లో ఈ చిత్రానికి తక్కువ థియేటర్లే దక్కాయి. హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండి ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు. సుమారు మూడు కోట్లమందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసినట్లు ఒక అంచనా. రూ. 1.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్ర విజయంతో స్రవంతి రవికిషోర్ ఆర్థిక కష్టాలు కూడా తీరిపోయాయని చెబుతారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు.ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ మహేష్ బాబు ఈ సినిమా హీరో ఎంపిక ఎలా జరిగిందో గతంలో నిర్మాత రవికిషోర్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ఒక మంచి యువ నటుడితో బడ్జెట్లో సినిమా తీసి లాభాలు అందుకోవాలని రవికిషోర్ ఆలోచన. అప్పుడే మహేష్ బాబు కథానాయకుడిగా ప్రవేశించారు. రాజకుమారుడు సినిమా విడుదలై యువరాజు షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలోనే 'నిరం' చిత్రం చూడమని మేకర్స్ ప్రింట్ పంపించారు. రెండు నెలలయినా ఆయన నుంచి స్పందన రాలేదు. రెండో ప్రత్యామ్నాయంగా సుమంత్ అనుకున్నారు. కానీ సుమంత్ అప్పటికే యువకుడు, పెళ్ళిసంబంధం చిత్రాల్లో నటిస్తూ ఖాళీ లేకుండా ఉన్నాడు. తర్వాత రాం గోపాల్ వర్మ హిందీ సినిమా మస్త్లో నటిస్తున్న ఆఫ్తాబ్ శివదాసానీని కూడా పరిశీలించారు. అయితే, తమ బడ్జెట్లో అయ్యేలా కనిపించలేదు. చివరగా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని రవికిషోర్ నిర్ణయించుకున్నాడు. బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ పెద్దయిన తర్వాత ఒక వ్యాపార ప్రకటనలో కనిపించాడు. తరుణ్ కుటుంబం కూడా అతన్ని కథానాయకుడిగా ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే రవికిషోర్ తమ సినిమాను గురించి చెప్పి అతన్ని ఒప్పించారు. ఆ సినిమాకు తరుణ్ పారితోషికం రూ. 3 లక్షలు. కథానాయిక కోసం చాలా వెతుకులాట జరిగింది. చివరికి వద్దనుకున్న ఫోటోల్లో మళ్ళీ వెతుకుతుంటే రిచా సరిపోతుందనిపించింది. రెండో కథానాయకుడిగా గాయకుడు రామకృష్ణ కొడుకు సాయికిరణ్ను ఎంచుకున్నారు.సినీ ట్రెండ్ సెట్టర్: ఈ చిత్రం తెలుగు ప్రేమకథా చిత్రాల ధోరణిని మార్చిన సినిమా. వాస్తవికత, సహజమైన సంభాషణలు, యువతరాన్ని ఆకట్టుకునే కథనంతో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఈ సినిమా తరుణ్, త్రివిక్రమ్, విజయభాస్కర్, కోటి వంటి ప్రతిభావంతుల కెరీర్కు మైలురాయిగా నిలిచింది. హిందీ రీమేక్: ఈ సినిమా తుఝే మేరీ కసమ్ అనే పేరుతో హిందీలో పునర్నిర్మించబడింది, ఇందులో జెనీలియా, రితేష్ దేశ్ముఖ్ నటించారు.‘నువ్వే కావాలి’ సినిమాకు జాతీయ అవార్డు లభించింది. ఇది 2000 సంవత్సరానికి ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది.నంది అవార్డులు:- ఉత్తమ కథానాయకుడు – తరుణ్- ఉత్తమ కథానాయిక – రిచా పల్లోడ్- ఉత్తమ దర్శకుడు – కె. విజయభాస్కర్- ఉత్తమ రచయిత – త్రివిక్రమ్ శ్రీనివాస్- ఉత్తమ సంగీత దర్శకుడు – కోటి- ఉత్తమ చిత్రం – ఉషాకిరణ్ మూవీస్ -
ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేస్తే..!
అనీష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఓటీపీ’. ‘ఓవర్... టార్చర్... ప్రెజర్’ అనేది ఉపశీర్షిక. జాన్విక, స్వరూపిణి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించగా, రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్.‘ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేశానండి...’, ‘అంటే... ఒకరికి తెలియకుండా మరొకరిని...’, ‘అరె... మామ బ్రేకప్ అనగానే ఊపిరాడట్లేదురా నాకు’ అనే డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘ఈ చిత్రంలో తండ్రీకొడుకుల ఎమోషన్ కొత్తగా ఉంటుంది. మా ‘లవ్ ఓటీపీ’ సినిమాతో ఎవరూ ఊహించని ఎంటర్టైన్మెంట్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం’’ అని చెప్పారు నిర్మాత విజయ్ .యం రెడ్డి. -
మా అమ్మ కల నిజమైంది: నిర్మాత మల్లికార్జున
రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్ ప్రధాన పాత్రధారులుగా నటించిన సినిమా ‘మటన్ సూప్’. రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో మల్లికార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. ఈ సందర్భంగా మల్లికార్జున ఎలికా మాట్లాడుతూ– ‘‘మటన్ సూప్’కి నేను ఓ కో డైరెక్టర్గా వచ్చాను. రామచంద్ర ప్యాషన్ చూసి, ఈ సినిమా నిర్మించాను.ప్రేక్షకుల స్పందన చూస్తుంటే మేం పడ్డ కష్టాన్ని ఇట్టే మర్చిపోయాం. మా సినిమా స్క్రీన్ ప్లే చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నా దర్శకత్వంలో ఓ హారర్ మూవీ చేస్తున్నాను. అలాగే రామచంద్రతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నేను సినిమాలు చేయాలని, స్క్రీన్పై నా పేరు కనిపించాలని మా అమ్మగారు కలలు కన్నారు. ‘మటన్ సూప్’తో ఆ కల నిజమైంది. కానీ ఇప్పుడు ఇది చూడటానికి మా అమ్మగారు లేకపోవడం చాలా బాధగా ఉంది’’ అని చెప్పారు. -
ఆలోచింపజేసేలా...
రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఒక మంచి ప్రేమకథ’(Oka Manchi Prema Katha) . ఈ సినిమాకు కథ, మాటలు, పాటలను ఓల్గా అందించగా, అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించారు. హిమాంశు పోపూరి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రోహిణి ముల్లేటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పాత్రను చూస్తే, ఆడియన్స్ కోప్పడతారు’’ అని అన్నారు.‘‘ఇరవైఏళ్ల క్రితం కుటుంబరావు, ఓల్గాగార్లు ఓ సినిమా కోసం నన్ను అ్రపోచ్ అయ్యారు. అప్పుడు అది కుదర్లేదు. ఇప్పుడు ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నా మనసుని హత్తుకుంది’’ అని పేర్కొన్నారు రోహిణి హట్టంగడి. ‘‘అందరిలోనూ ఓ ఆలోచనను రేకెత్తించేలా ఈ సినిమాను తెరకెక్కించాను. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆడియన్స్ను నవ్విస్తూ, ఏడిపించేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని తెలిపారు అక్కినేని కుటుంబరావు.‘‘ఈ సినిమాలో నేను కూడా ఓ రోల్ చేశాను. అందరికీ నచ్చే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు హిమాంశు. ‘‘మంచి సినిమా రావాలని కోరుకునే ఆర్టిస్టులు మాకు దొరకడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఓల్గా. సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్, ఈటీవీ విన్ ప్రతినిధులు సంధ్య, నితిన్ మాట్లాడారు. -
ఫిల్మ్ఫేర్ అవార్డ్ వేడుక.. డిజైనర్ డ్రస్లో ప్రియమణి (ఫొటోలు)
-
హీరో నితిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
లక్స్ పాప ఇమేజితో బిగ్బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయింది. ఐదో వారంలో బయటకొచ్చేసింది. అయితే ఈమెతో పాటు రీతూ కూడా ఎవిక్షన్ రూంలో ఉన్న టైంలో.. రీతూ నిజంగా ఎలిమినేట్ అయిపోతానేమోనని భయంతో తెగ ఏడ్చేసింది. కానీ ఫ్లోరా బయటకొచ్చేయడంతో రీతూ ఊపిరి పీల్చుకుంది.తొలివారం సంజనతో గొడవపడి కాస్త హడావుడి చేసిన ఫ్లోరా.. తర్వాత వారం నుంచి మాత్రం చాలా సైలెంట్ అయిపోయింది. గేమ్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోకపోవడం, అలానే హౌస్మేట్స్తోనూ పెద్దగా ఇంటరాక్ట్ కాకపోవడం లాంటి కారణాలతో ప్రతివారం నామినేట్ అవుతూ వస్తున్నప్పటికీ సేవ్ అవుతూనే వచ్చింది. కామనర్స్ మనీష్, ప్రియ, హరీశ్.. వరస వారాల్లో ఎలిమినేట్ కావడం ఈమెకు కాస్త ప్లస్ అయింది. ఐదో వారం మాత్రం తప్పించుకోలేకపోయింది.(ఇదీ చదవండి: బర్త్ డే నైట్ మేమిద్దరం మాత్రమే.. అల్లు స్నేహా పోస్ట్ వైరల్)రెమ్యునరేషన్ విషయానికొస్తే.. వారానికి రూ.2.1 లక్షల చొప్పున ఫ్లోరా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐదు వారాలు ఉన్నందుకుగానూ రూ.10.5 లక్షల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇన్నిరోజులు ఉన్నప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినప్పటికీ.. రెమ్యునరేషన్ పరంగా బాగానే సంపాదించినట్లు కనిపిస్తుంది.ఇక వెళ్తూవెళ్తూ సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్, శ్రీజకి థమ్ అప్ ఇచ్చింది. భరణి, తనూజకి థమ్స్ డౌన్ ఇచ్చింది. సుమన్ శెట్టిని మాత్రం అటుఇటుకి మధ్యలో పెట్టింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) -
కాంతార చాప్టర్ 1.. రజినీకాంత్ కూలీ రికార్డ్ బ్రేక్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఛాప్టర్-1 రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా పదో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తోంది. సెకండ్ వీకెండ్ కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో ఇండియన్ మూవీగా నిలిచింది. పదో రోజు శనివారం ఒక్క రోజే రూ.37 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా రూ. 396.65 నెట్ వసూళ్లు రాగా.. రూ.476 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే రజనీకాంత్ కూలీ, సైయారా, వార్-2 లాంటి రీసెంట్ హిట్ సినిమాలను అధిగమించింది.మొదటి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేయనుంది. అయితే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ఛావా కంటే వెనకే ఉంది. కాంతారా చాప్టర్ -1 ప్రపంచవ్యాప్తంగా చూస్తే పది రోజుల్లోనే రూ.560 నుంచి రూ.590 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన కూలీ(రూ.518 కోట్లు), టైగర్ జిందా హై (రూ.558 కోట్లు), ధూమ్ 3 (రూ.558 కోట్లు) సైయారా (రూ.570 కోట్లు), పద్మావత్ (కూ.585 కోట్లు), సంజు (రూ.589 కోట్లు) లాంటి లైఫ్టైమ్ గ్రాస్ కలెక్షన్స్ కూడా దాటేసినట్లే అవుతుంది. దీంతో ఈ సినిమా త్వరలోనే ఆరు వందల మార్క్ చేరుకునే అవకాశముంది.ఈ మూవీని 2022లో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ కాంతారకు ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
బిగ్బాస్ 9 తెలుగు.. 'వైల్డ్ కార్డ్' ఎపిసోడ్ హైలైట్స్
బిగ్బాస్ 9వ సీజన్లో అప్పుడే ఐదు వారాలు గడిచిపోయింది. ప్రతిసారిలానే ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఏకంగా ఆరుగురు హౌస్లోకి కొత్తగా అడుగుపెట్టబోతున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఆదివారం ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది లైవ్ అప్డేట్స్లో చూద్దాం. -
సీరియల్ నటితో రెండో పెళ్లి.. తండ్రి కాబోతున్న నటుడు (ఫోటోలు)
-
అమ్మాయిల్ని ఇంటికి తీసుకొస్తా.. పేరెంట్స్ అర్థం చేసుకుంటారు
బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ (Farah Khan) ఈ మధ్య యూట్యూబ్ వ్లాగ్స్పై స్పెషల్ ఫోకస్ చేసింది. ఎప్పుడూ ఏదో ఒక యాక్టర్ ఇంటికి వెళ్లి చిట్చాట్ చేస్తూ వీడియోలు తీస్తోంది. అలా తాజాగా హిందీ నటుడు కరణ్ టక్కర్ (Karan Tacker) ఇంటికి వెళ్లింది. ఎప్పటిలాగే తన వంటమనిషి దిలీప్ను తోడుగా తీసుకెళ్లింది. ఫరాఖాన్ చేసే వీడియోల పుణ్యమా అని దిలీప్ ఎక్కువ ఫేమస్ అయిపోయాడు. ఫ్యామిలీ హౌస్.. కానీ!కరణ్ ఇంటికి వెళ్లగా.. అక్కడున్న మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఫరాఖాన్కు బదులుగా దిలీప్ను గుర్తుపట్టి హాయ్ చెప్పింది. అది చూసి అవాక్కైన ఫరా.. ఆమె నాకు బదులుగా నీకు హాయ్ చెప్పింది అని ఆశ్చర్యపోయింది. అందుకు దిలీప్ మురిసిపోతూ ఈ మధ్య నాకు ఆడవాళ్ల ఫాలోయింగ్ పెరిగిపోయిందన్నాడు. ఇక మెయిన్ డోర్ నుంచి అడుగుపెడుతూనే ఇదెవరి ఇల్లు అని అడిగింది ఫరా. అందుకు కరణ్.. మా కుటుంబానిది అని బదులిచ్చాడు. అలాగైతే కచ్చితంగా ఇది నీది కాదు, నీ తల్లిదండ్రుల ఇల్లే! అది సరే, మరి అమ్మాయిలను ఇంటికి ఎలా తీసుకొస్తావ్? అని సరదాగా అడిగింది. నాకింకా పెళ్లవలేదుఅందుకు కరణ్ వెంటనే.. మా ఇంట్లో అందరూ అర్థం చేసుకునేవాళ్లే! మా అభిరుచులకు అనుగుణంగా ఈ ఇల్లు కట్టారు. నాకింకా పెళ్లి కాలేదు కాబట్టి రెండు లివింగ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి మా పేరెంట్స్ కోసం, మరోటి నాకోసం! ఎప్పుడైనా ఎవరినైనా ఇంటికి తీసుకొస్తే మా ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్ చేస్తాను. అప్పుడు వాళ్లు వారి లివింగ్ రూమ్ దాటి ఇటుపక్క రారు. నా పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పుకొచ్చాడు.సీరియల్స్.. రియాలిటీ షోలుకరణ్ టక్కర్.. లవ్ నే మిలాది జోడి, ఏక్ హజారూ మే మేరి బెహ్నా హై వంటి పలు సీరియల్స్లో నటించాడు. డ్యాన్స్ రియాలిటీ షో 'జలక్ దిక్లాజా 7'వ సీజన్లో పార్టిసిపేట్ చేయగా ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. 'ద వాయిస్', 'నాచ్ బలియే 8' వంటి పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. స్పెషల్ ఆప్స్, ఖాకీ వంటి వెబ్ సిరీస్లలో యాక్ట్ చేశాడు. తన్వి: ద గ్రేట్ సినిమాలోనూ నటించాడు. View this post on Instagram A post shared by Karan Tacker (@karantacker) చదవండి: గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు -
'మీ అందానికి సీక్రెట్ ఏంటని అడిగా'.. డ్రాగన్ హీరో ప్రదీప్
డ్రాగన్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. మరో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్గా కనిపించనుంది. వీరిద్దరు జంటగా వస్తోన్న యూత్ ఎంటర్టైనర్ డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా యూత్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు హీరో ప్రదీప్. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో తన అందానికి సంబంధించిన ఓ సీక్రెట్ను పంచుకున్నారు. మొదటిసారి శరత్ కుమార్ సార్ను కలిసినప్పుడు మీ వయస్సు ఎంత సార్ అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. దాదాపు 71 ఏళ్ల వయసులోనూ కేవలం 40 ఏళ్ల యువకుడిలా కనిపించారని అన్నారు. ఆయనతో సార్ అసలు మీరు ఏం తింటారు? ఇంత అందంగా, యంగ్గా ఫిజిక్ ఉండడానికి కారణమని ఏంటని అడిగినట్లు తెలిపారు. దీనికి నేను రోజు ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగుతానని శరత్ సార్ నాతో చెప్పారని వెల్లడించారు. బీట్ రూట్ జ్యూస్ తాగితే అందంగా తయారు అవుతారేమో అనుకుని రోజు తాగేవాడినని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆరోగ్యపరంగానే కాకుండా.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించారు.కాగా.. డ్యూడ్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 17న థియేటర్లలో విడుదల కానుంది. -
బర్త్ డే నైట్ మేమిద్దరం మాత్రమే.. అల్లు స్నేహా పోస్ట్ వైరల్
'పుష్ప 2' సినిమాతో ఇతర దేశాల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ముంబైలో షూటింగ్ జరుగుతోంది. అయితే కొన్నిరోజుల క్రితం బ్రేక్ తీసుకున్న బన్నీ.. భార్య స్నేహాతో కలిసి ఫారిన్ ట్రిప్ వేశాడు. అక్కడ స్నేహా పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోల్ని ఇప్పుడు ఈమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) సెప్టెంబరు 29న స్నేహా పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఈమె తన భర్త అల్లు అర్జున్తో కలిసి ఆమ్స్టర్ డామ్ దేశానికి వెళ్లిపోయింది. అక్కడే బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఆ దేశంలో తిరుగుతున్న కొన్ని ఫొటోలని స్నేహా పోస్ట్ చేసింది. ఇప్పుడు పుట్టినరోజుని బన్నీ, తాను మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి కొన్ని ఫొటోలని షేర్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. డేరింగ్ సీన్ లీక్!
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం చెర్రీ సరసన బాలీవుడ్ భామ, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పుణెలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఓ బ్యూటీఫుల్ సాంగ్ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. పర్వత ప్రాంతంలో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. చెర్రీ ఓ రాయిపై నిలబడి డ్యాన్స్ చేయడంపై డేరింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్ డేరింగ్ డ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్ షూట్ సీన్ లీక్ కావడం టాలీవుడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట విజువల్ ట్రీట్గా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే పర్వత ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. View this post on Instagram A post shared by IWMBuzz (@iwmbuzz) -
గాంధీపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన నటుడు శ్రీకాంత్
గత వారం రోజులుగా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ వార్తల్లో ఉంటూ వచ్చాడు. మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన ఇతడు.. తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. గాంధీ మహాత్ముడేమీ కాదని, భారత దేశానికి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారి వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీని తర్వాత మరో వీడియోలో వర్ణించడానికి వీల్లేని విధంగా కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) అయితే శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్లో శనివారం ఫిర్యాదు చేశారు. అలానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇతడు నటించిన 'అరి' సినిమా ప్రదర్శనని అడ్డుకున్నారు. థియేటర్ బయట శ్రీకాంత్ దిష్టిబొమ్మని కూడా పలువురు వ్యక్తులు దహనం చేశారు. ఆదివారం.. మా అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. శ్రీకాంత్ తీరు గురించి ఫిర్యాదు చేశారు.దీంతో ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలుగులో నోటికొచ్చినట్లు మాట్లాడిన ఇతడు.. ఇప్పుడేమో ఇంగ్లీష్లో క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలానే మూవీ రివ్యూయర్లపై దారుణమైన కామెంట్స్ చేశాడు. నటుడిగా ఇతడు బాగా చేస్తుండొచ్చు గానీ అప్పుడప్పుడు ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) View this post on Instagram A post shared by Shrikanth Krishnaswamy (@shrikanth_bharat) -
కమెడియన్ కూతురి 'హాఫ్ ఇయర్' బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి
బిగ్బాస్ 9వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఆరుగురు హౌస్లోకి వెళ్లబోతున్నారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ మాధురి అనే కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో గట్టిగానే డిస్కషన్ నడుస్తోంది. దానికి తోడు ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే తన ఎంట్రీ గురించి ఈమె బయటపెట్టేసింది. వైల్డ్గా ఉండేవాళ్లే వైల్డ్ కార్డ్గా వెళ్తారని, హౌస్లోకి వెళ్లిన తర్వాత నేనేంటో చూపిస్తానని ఛాలెంజ్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!)'వైల్డ్గా ఉండేవాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఇలా వెళ్తున్నా. బిగ్బాస్ నుంచి కాల్ రాగానే ముందు వద్దని అనుకున్నా, కానీ చాలామంది ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్లు వచ్చాయి. ప్లీజ్ మేడమ్ మిమ్మల్ని షోలో చూడాలనుకుంటున్నాం అని చాలామంది అనడం వల్ల వెళ్దామని నిర్ణయం తీసుకున్నాను. అనుభవం, జనాలకు ఇంకా చేరువ కావాలి అనే ఉద్దేశం కూడా నాకు ఉంది' అని మాధురి చెప్పుకొచ్చింది.'హౌస్లో ఉన్నవాళ్లందరూ మాస్క్లు వేసుకుని ఉన్నారు. అందరూ యాక్టింగ్ చేస్తున్నారు. ఫేక్ రిలేషన్స్ మెంటైన్ చేస్తూ ఫేక్గా ఉంటున్నారు. కొద్దోగొప్పో ఇమ్మాన్యుయేల్ బెటర్గా అనిపిస్తున్నాడు. ఉన్నవాళ్లలో ఎవరూ నాకు టఫ్ ఫైట్ ఇస్తారని అనుకోవట్లేదు. ఇకపోతే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కామనర్స్ ఓవరాక్షన్ చేస్తున్నారు. అందుకే ఎలిమినేట్ అయి బయటకొచ్చేస్తున్నారు. ఎన్నిరోజులు ఉంటారనే ప్రశ్నకు బదులిస్తూ.. 'ఒక రోజులో బయటకొచ్చేసినా పశ్చాత్తపపడను. టాప్-5కి వెళ్లినా ఏం అనుకోను. కప్ గెలుచుకున్నా సరే పొంగిపోను. అన్ని టాస్కులు ఆడగలను నేను. నా ఆట నచ్చితే ఓట్లు వేయండి లేదంటే వద్దు' అని షోపై మాధురి తన అభిప్రాయాన్ని చెప్పింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రైలర్.. రిలీజ్లో ట్విస్ట్!
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada). ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఈనెల 12 వైజాగ్ ఈవెంట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఊహించని విధంగా ట్రైలర్ రిలీజ్ తేదీపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని పోస్టర్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 13న ఉదయం 11 గంటల 34 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సిద్ధు ఫ్యాన్స్ కాస్తా డిస్సాపాయింట్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.UNAPOLOGETICALLY RADICAL 💥💥#TelusuKadaTrailer out tomorrow at 11.34 AM. Love will be unhinged ❤🔥#LoveU2#TelusuKada in cinemas worldwide from October 17th!STAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @harshachemudu @vishwaprasadtg… pic.twitter.com/EwAIC1yWyI— People Media Factory (@peoplemediafcy) October 12, 2025 -
అభిషేక్ బచ్చన్కు ప్రతిష్టాత్మక అవార్డ్.. హాజరు కాని ఐశ్వర్య రాయ్!
బాలీవుడ్ హీరో, బిగ్బీ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో తొలిసారి ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన 'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి గానూ ఈ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఈవెంట్లో అవార్డ్ అందుకున్నారు. చందు ఛాంపియన్ సినిమాకు గాను కార్తీక్ ఆర్యన్ సైతం అవార్డ్ అందుకున్నారు. తొలిసారి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకున్న సందర్భంగా అభిషేక్ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ 83వ పుట్టినరోజు కావడం మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.అభిషేక్ మాట్లాడుతూ.. "ఈ ఏడాదితో సినిమా ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. నాకు అవకాశాలు ఇచ్చిన అందరు దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. ఈ ఘనత రావడం అంత సులభం కాదు. నా లైఫ్లో విలువైంది. ఈ అవార్డు కోసం నేను ఎన్నిసార్లు స్పీచ్ ఇచ్చేందుకు ప్రాక్టీస్ చేశానో గుర్తులేదు. ఇది ఒక కల. ఈ అవార్డ్ వచ్చినందుకు చాలా వినయంగా ఉన్నా. నా కుటుంబం ముందు అవార్డ్ అందుకోవడం మరింత ప్రత్యేకం. ఇక్కడ నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కార్తీక్ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. తమ డ్రీమ్ కోసం ప్రతి ఒక్కరూ నమ్మకంతో పనిచేయండి. నిరంతరం కృషి చేయండి' అని పంచుకున్నారు.(ఇది చదవండి: సతీమణి బాటలో అభిషేక్ బచ్చన్.. 24 గంటల్లోనే కోర్టుకు!)సతీమణి ఐశ్వర్య గురించి అభిషేక్ మాట్లాడుతూ.."ఐశ్వర్య, ఆరాధ్యలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను బయటకు వెళ్లి నా కల నిజం చేసుకునే అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ అవార్డు రావడానికి వారి త్యాగాలే కారణం. ఈ అవార్డును ఇద్దరు చాలా ప్రత్యేకమైన వ్యక్తులకు అంకితం చేయాలనుకుంటున్నా. నా తండ్రితో పాటు కుమార్తెకు అంకితం చేయాలనుకుంటున్నా." అని అన్నారు.ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ గైర్హాజరు..అయితే అభిషేక్ బచ్చన్ ఈ అవార్డ్ను తల్లి జయ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్, మేనకోడలు నవ్య నవేలి నందా సమక్షంలో అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు భార్య ఐశ్వర్య రాయ్ , కుమార్తె ఆరాధ్య హాజరు కాలేదు. కాగా.. గతంలో ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు పలుసార్లు జంటగా కనిపించడంతో విడాకుల వార్తలకు చెక్ పడింది. -
నెట్ఫ్లిక్స్లో ఉన్న టాప్ 10 మూవీస్ ఇవే.. ట్రెండింగ్లో పాత చిత్రం!
ఒటీటీల క్రేజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. థియేటర్స్ వెళ్లి సినిమా చూసేవారి కంటే..ఓటీటీలో చూసేవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో టాప్ 1లో ఉన్న ఓటీటీ ఫ్లాట్ఫార్మ్ నెట్ఫ్లిక్స్. టాలీవుడ్, బాలీవుడ్తో పాటు అన్ని ప్రాంతాల హిట్ సినిమాలు ఎక్కువగా ఇందులోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఉన్న టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేద్దాం.ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి నటించిన యాక్షన్ చిత్రం వార్2. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ హిందీ వెర్షన్ టాప్ 10లో మొదటి స్థానంలో ఉండగా.. తెలుగు వెర్షన్ టాప్ 5లో ఉంది.ఇక టాప్లో 2లో మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార చిత్రం హిందీ వెర్షన్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ థియేటర్స్లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. రిషబ్ శెట్టి ఖాతాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.ఇక టాప్ 3లో యానిమేషన్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహా’ ఉంది. థియేటర్స్లో రూ.320 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీల్లోనూ అదరగొడుతోంది.నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ గా రిలీజ్ అయిన ‘ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10’ మూవీ టాప్ 4లో కొనసాగుతుంది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్. సైమన్ స్టోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరా నైట్లీ, గై పీర్స్, డేవిడ్ అజాలా కీలక పాత్రలు పోషించారు.టాప్ 6లో సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రం ఉంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు మృణాల్ ఠాకూర్, రవి కిషన్, రోష్ని వాలియా, విందు దారా సింగ్, దీపక్ దోబ్రియాల్, కుబ్రా సైట్, సంజయ్ మిశ్రా, చుంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. ఈ ఏడాది ఆగస్ట్లో థియేటర్స్లో రిలీజై అయిన ఈ చిత్రం.. అపజయాన్ని మూటగట్టుకుంది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లలో సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నివారాలుగా ఈ చిత్రం టాప్ 10లో కొనసాగడం గమనార్హం. టాప్ 7లో దడక్ 2 ఉంది. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ నేపథ్యంలో సాగే ఈ కథలో అత్యంత సున్నితమైన కుల వివక్షను చూపించారు.టాప్ 8లో బ్లాక్ బస్టర్ మూవీ సయ్యారా కొనసాగుతుంది. ఇక టాప్ 9 లో క్రైమ్ థ్రిల్లర్ ఇన్స్పెక్టర్ జెండె ఉంది. ఒకప్పటి నొటోరియస్ బికినీ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ కేసును ఛేదించిన ఓ పోలీసు ఆఫీసర్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ మనోజ్బాజ్పాయూ లీడ్ రోల్లో నటించారు. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఓడుం కుతిర చాదుం కుతిర’టాప్ 10లో కొనసాగుతుంది. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, రేవతి పిళ్లై హీరోయిన్లుగా నటించారు. -
యూత్ని ఏడిపించిన మూవీ తీసిన డైరెక్టర్.. అప్పట్లో ఇలా
హీరోహీరోయిన్లు గానీ డైరెక్టర్స్ గానీ సెలబ్రిటీలు అయిపోయిన తర్వాత కానీ మీడియాలో ఎప్పుడుపడితే అప్పుడు కనిపిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు మాత్రం వీళ్లకు సంబంధించిన పాత ఫొటోలు లేదంటే చిన్ననాటి చిత్రాలు బయటపడుతుంటాయి. అప్పట్లో ఇలా ఉండేవారా అని నెటిజన్ల ఆశ్చర్యపోవడం గ్యారంటీ. ఇప్పుడు అలానే ఓ తెలుగు డైరెక్టర్.. తన టీనేజీ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి ఇతడెవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్నది డైరెక్టర్ సాయి రాజేశ్. ఇలా చెబితే కొందరు గుర్తుపడతారు గానీ 'బేబి' మూవీ తీసిన దర్శకుడు అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ అంతా ఈ మూవీ చూసి తెగ ఫీలయిపోయారు. కొందరైతే థియేటర్లలోనే ఏడ్చేశారు కూడా! అయితే సాయి రాజేశ్కి ఇదే తొలి చిత్రం కాదు.. గతంలో రెండు తీశాడు కాకపోతే అవి కామెడీవి కావడంతో పెద్దగా రిజిస్టర్ కాలేదు.(ఇదీ చదవండి: అట్లీతో సినిమా.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!)నెల్లూరుకి చెందిన సాయి రాజేశ్.. టాలీవుడ్లో తీసిన తొలి సినిమా 'హృదయ కాలేయం'. సంపూర్ణేశ్ బాబుని హీరోగా పెట్టి తీశాడు. కానీ తన పేరు మాత్రం స్టీఫెన్ శంకర్ అని వేసుకున్నాడు. తర్వాత ఇదే సంపూర్ణేశ్ బాబుతో 'కొబ్బరిమట్ట' అనే చిత్రం తీశాడు. ఈ రెండూ బాగానే ఆడాయి కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో రూట్ మార్చాడు. 'కలర్ ఫొటో' అనే చిత్రానికి స్టోరీ అందించిన సాయి రాజేశ్.. నిర్మాతగానూ వ్యవహరించాడు. నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. 'బేబి'కి కూడా జాతీయ సినీ అవార్డ్ రావడం విశేషం.'బేబి'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేశ్.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. చాన్నాళ్ల నుంచి ముందుకు కదట్లేదు. మరోవైపు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ'కి స్టోరీ అందిస్తున్నాడు. మరి సాయి రాజేశ్ నుంచి తర్వాత సినిమా ఎప్పుడొస్తుందో ఏంటో?(ఇదీ చదవండి: నా తండ్రి ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు: ప్రదీప్ రంగనాథ్) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh)