breaking news
Movie News
-
దళపతి చివరి సినిమాలో ముగ్గురు స్టార్ దర్శకులు?
తమిళ స్టార్ దళపతి విజయ్.. రీసెంట్గానే మధురైలో భారీ బహిరంగ సభ పెడితే ఏకంగా లక్షలాది మంది అభిమానులు వచ్చారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్న విజయ్.. మరోవైపు తన చివరి చిత్రాన్ని పూర్తి చేసే పనిలోనూ ఉన్నాడు. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే నటి పెళ్లి.. ఏడాది తిరిగేలోపు కూతురు)విజయ్ 'జన నాయగన్'... తెలుగు చిత్రం 'భగవంత్ కేసరి' రీమేక్ అని ప్రచారం అయితే ఉంది కానీ నిజమేంటి అనేది మూవీ రిలీజైతే తప్ప తెలియదు. అయితే ఇది విజయ్ చివరి చిత్రమని ప్రచారం నడుస్తోంది కాబట్టి ఇందులో పలు సర్ప్రైజులు ఉండబోతున్నాయట. తమిళ స్టార్ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్, లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారట. సోషల్ మీడియాలో ఈ రూమర్ గట్టిగానే వినిపిస్తుంది.ఈ ముగ్గురు దర్శకులు కూడా విజయ్తో సినిమాలు తీశారు. అట్లీ, లోకేశ్ తలో రెండేసి చిత్రాలు చేయగా.. నెల్సన్ ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. అలా విజయ్పై అభిమానం దృష్ట్యా.. ఇతడి చివరి చిత్రమైన 'జన నాయగన్'లో జర్నలిస్టులుగా చిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇకపోతే ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. 'ప్రేమలు' మమిత బైజు కీలక పాత్ర చేస్తోంది. హెచ్. వినోద్ దర్శకుడు కాగా అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
20 ఏళ్లకే నటి పెళ్లి.. ఏడాది తిరిగేలోపు కూతురు
సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఒకవేళ అలా చేస్తే ఎక్కడ తమ కెరీర్ డ్యామేజ్ అవుతుందోనని కంగారుపడుతుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు అలా ఓ నటి.. 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు ఏడాది తిరిగేలోపు ఓ అమ్మాయికి తల్లి కూడా అయిపోయింది. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఎవరా నటి?(ఇదీ చదవండి: కొత్త కారు కొన్న తెలుగు నటుడు.. రేటు ఎంతో తెలుసా?)ఓటీటీ ప్రియులకు 'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎల్ అలియాస్ ఎలెవన్ అనే లీడ్ రోల్ చేసిన మిల్లీ బాబీ బ్రౌన్.. పలు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఐదో సీజన్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే మిల్లీ గత కొన్నాళ్లుగా జేక్ బొంగియోవి అనే యువకుడితో డేటింగ్ చేసింది. గతేడాది అక్టోబరులో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. వివాహం జరిగేటప్పటికి మిల్లీ వయసు 20 ఏళ్లు. దీంతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏడాది లోపే ఓ పాపకు తల్లి కూడా అయినట్లు స్వయంగా మిల్లీనే ప్రకటించింది. అయితే పాపని దత్తత తీసుకున్నామని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Millie Bobby Brown (@milliebobbybrown) -
బీచ్ వెకేషన్లో టిల్లు బ్యూటీ.. క్యూట్ అనన్య
మాల్దీవులు టూర్లో టిల్లు బ్యూటీ నేహాశెట్టివిడాకుల రూమర్స్.. బీచ్ ట్రిప్లో హన్సికక్యూట్ ఎక్స్ప్రెషన్స్తో మాయ చేస్తున్న అనన్యఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న శ్రియవైట్ డ్రస్సులో డిఫరెంట్గా ప్రణీత View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) -
కొత్త కారు కొన్న తెలుగు నటుడు.. రేటు ఎంతో తెలుసా?
ర్యాపర్, నటుడు, రచయిత.. ఇలా పలు టాలెంట్స్ ఉన్న నోయెల్ సీన్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. ప్రస్తుతానికైతే నటుడిగా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. కుదిరినప్పుడు షోల్లోనూ పాల్గొంటున్నాడు. అలాంటి ఇప్పుడు ఖరీదైన కొత్త కారు కొనేశాడు. అందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ కారు రేటు ఎంత?హైదరాబాద్కి చెందిన నోయెల్.. 2006లో 'సంభవామి యుగేయుగే' అనే మూవీతో కెరీర్ ఆరంభించాడు. తర్వాత మంత్ర, మగధీర, ఈగ తదితర చిత్రాల్లో కనిపించి కనిపించని పాత్రలు చేశాడు. అయితే 'కుమారి 21 ఎఫ్' మూవీలో విలన్గా చేసి ఆకట్టుకున్నాడు. అప్పటినుంచి కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)బిగ్బాస్ 4వ సీజన్లోనూ పాల్గొన్నాడు కానీ ఆరోగ్య కారణాల రీత్యా మధ్యలోనే బయటకొచ్చేశాడు. ప్రస్తుతానికైతే నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మహీంద్ర కంపెనీకి చెందిన బీఈ6 మోడల్ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేశాడు. దీని ధర మార్కెట్లో రూ.20 లక్షల వరకు ఉంది. ఈ కారుని తల్లి చేతుల మీదుగా కొనుగోలు చేశాడు. ఆ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.వ్యక్తిగత విషయానికొస్తే.. నోయెల్ 2019లో హీరోయిన్ ఎస్తర్ నోరాన్హాని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏడాదిలోనే వీళ్లిద్దరూ విడిపోయారు. నోయెల్లానే ఎస్తర్ కూడా ఒకటి అరా సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: తండ్రయిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటో వైరల్) -
ఆసక్తికరంగా 'బ్యూటీ' టీజర్
మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీకి, ఫాదర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ టచ్ ఇస్తూ తీసిన సినిమా 'బ్యూటీ'. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించారు. జె.ఎస్.ఎస్.వర్ధన్.. మాటలు, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు వచ్చాయి.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. 'కూతురు అడిగింది కొనిచ్చేప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను' అనే ఎమోషనల్ డైలాగ్ ఈ మూవీ కథ ఏంటో చెప్పకనే చెప్పేస్తుంది. టీజర్లో విజయ్ బుల్గానిన్ సంగీతం అలరిస్తోంది. ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం తదితర చిత్రాలతో ఆకట్టుకున్న అంకిత్.. 'బ్యూటీ' చిత్రంతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు.(ఇదీ చదవండి: తండ్రయిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటో వైరల్) -
తండ్రయిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటో వైరల్
టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టా.. గుడ్ న్యూస్ చెప్పేశాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోని షేర్ చేశాడు. రెండు నెలల క్రితం తన భార్య ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టిన ఇతడు.. గత నెలలో సీమంతం వీడియోని పోస్ట్ చేశాడు. ఇప్పుడు తన భార్య ప్రసవించిందని చెప్పి ఆనందం వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న మహేశ్ విట్టా.. తర్వాత టాలీవుడ్లోకి వచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు. బిగ్బాస్ షోలోనూ రెండుసార్లు పాల్గొన్నాడు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్బాస్ హౌసులో ఉండగానే తన ప్రేమ సంగతి చెప్పాడు. అదే ఏడాది శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు.మహేశ్ విట్టా చెల్లెలి ఫ్రెండ్ శ్రావణి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మహేశ్ భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. దళపతి విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?) View this post on Instagram A post shared by Mahesh Vitta (@maheshvitta) -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మరోవైపు చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ ఓటీటీలోకి వస్తే మాత్రం టైమ్ పాస్ కోసం అలా చూస్తుంటారు. ఇప్పుడు సినీ ప్రేమికుల కోసం అలాంటి ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు ఏడాది తర్వాత స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా?గతేడాది ఆగస్టు 23న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'. గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలోకి వచ్చినప్పుడు పర్లేదనిపించే రెస్పాన్స్ అందుకుంది. మరోవైపు స్టార్స్ ఎవరూ లేకపోవడంతో దీనికి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయొచ్చు.(ఇదీ చదవండి: అనిరుధ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్)'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో' విషయానికొస్తే.. చైత్ర (స్రవంతి బెల్లంకొండ) అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. తాను ఇష్టపడటం కంటే తనని ప్రేమించే కుర్రాడు తనకు భర్తగా రావాలని కోరుకుంటుంది. సూర్యలో (సూర్య శ్రీనివాస్) అలా కనిపించేసరికి అతడితో ప్రేమలో పడుతుంది. గౌతమ్ (గురుచరణ్) ఓ జులాయి. ఇతడి తండ్రి పట్టాభి పోలీస్ కానిస్టేబుల్. తన కళ్ల ఎదుట తప్పు జరిగితే గౌతమ్ సహించలేడు.ఓ సందర్భంలో బ్రహ్మవరం ఎస్ఐని ఎదురించిన గౌతమ్.. అతడికి శత్రువుగా మారుతాడు. అనుకోకుండా ఓ రోజు బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఓ శవం దొరుకుతుంది. ఆ కేసు సంచలనంగా మారుతుంది. దీంతో పోలీసులు విచారణ మొదలుపెడతారు. సరిగ్గా అదే సమయంలో గౌతమ్ని కలవడం కోసం చైత్ర, అమెరికా నుంచి స్వదేశానికి వస్తుంది. ఆ శవానికి చైత్ర, గౌతమ్లకు సంబంధమేంటి? హంతుకుడు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?) -
రెండు బ్రేకప్స్.. మగవాడి తోడు అవసరం లేదు: హీరోయిన్
గతంలో రెండు బ్రేకప్స్ జరిగాయంటోంది బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా (Daisy Shah). అందులో తనను బాగా ఇబ్బంది పెట్టిన రిలేషన్షిప్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఓ అబ్బాయితో చాలా ఏళ్లు రిలేషన్లో ఉన్నాను. మొదటి నాలుగేళ్ల సమయంలో అసలు పెళ్లి ఆలోచనే రాలేదు. తర్వాత నాకు ఆ ఆలోచనే రాకుండా చేశాడు. ఏడో సంవత్సరంలో ఉండగా.. నేను సంతోషంగా లేనన్న విషయాన్ని గ్రహించి బ్రేకప్ చెప్పాను. రెండో రిలేషన్లో పరిస్థితి మరీ దారుణం. నేనెక్కడికి వెళ్తున్నా?.. అబ్బాయిలతో కలిసి పని చేస్తున్నానా? ఇలా ప్రతీది గుచ్చిగుచ్చి అడిగేవాడు. ఇక్కడ ఆశ్చర్యకర విషయమేంటంటే.. అతడు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒకసారి మేమిద్దరం పార్టీలో ఉన్నాం. ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నాం. ఇంతలో ఒకరు నా వెనక నుంచి వచ్చి చేయి పట్టుకుని లాగి తనతో డ్యాన్స్ చేయమని అడిగాడు.నా తప్పేముంది?అందులో తప్పేముంది? దానికి నాపై కోప్పడాల్సిన అవసరం లేదుకదా! కానీ అతడు మాత్రం వేరే అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ తనను అర్థం చేసుకోమన్నాడు. అతడి పద్ధతి నాకు చిరాకు తెప్పించేది. నన్నెప్పుడూ కంట్రోల్ చేయాలని చూసేవాడు. దానివల్ల మరింత ఫ్రస్టేట్ అయ్యేదాన్ని. బలమైన అమ్మాయిలను చూసి మగవాళ్లు అస్సలు ఓర్వలేరు. అలాంటివాళ్లను చాలామందిని చూశాను. ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదు. పైగా నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నా పోషణ కోసం ఒక మగవాడి తోడు అవసరం లేదు. అయితే నా స్నేహితురాలి సలహాతో అండాలు భద్రపరిచాను అని చెప్పుకొచ్చింది.కెరీర్డైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టింది. భద్ర అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా మారింది. సల్మాన్ ఖాన్తో చేసిన 'జై హో' మూవీతో మంచి గుర్తింపు అందుకుంది. ఈమె చివరగా మిస్టరీ ఆఫ్ ద టాటూ మూవీ చేసింది. గతేడాది వచ్చిన రెడ్ రూమ్ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. మరో రెండు రోజుల్లో (ఆగస్టు 25న) డైసీ షా 41వ వయసులోకి అడుగుపెట్టనుంది.చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం -
2026 లో మెగా ఫ్యాన్స్ కి పండగే..!
-
'కింగ్డమ్' నుంచి బ్రదర్స్ సాంగ్ వీడియో విడుదల
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నాదమ్ములుగా నటించిన చిత్రం 'కింగ్డమ్' (Kingdom).. వారిద్దరి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన 'అన్నా అంటూనే' సాంగ్ను వీడియో వర్షన్ను తాజాగా విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని అనిరుధ్ పాడారు. ఆపై సంగీతం కూడా ఆయనే అందించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని నిర్మాత నాగవంశీ నిర్మించారు. ఇందులో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ మొదటిరోజు భారీ కలెక్షన్స్ వచ్చినప్పటికీ సినిమాపై నెగటివ్ టాక్ రావడంతో ఆ తర్వాత పెద్దగా అనుకున్నంత రేంజ్లో రాబట్టలేకపోయింది. అయితే, ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో నిర్మాత నాగవంశీ మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు. -
తెరపైకి మరోసారి స్టార్ హీరో విడాకుల వివాదం
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందపై కొన్ని నెలలుగా విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే చాలా సార్లు ఆయన భార్య సునీతా అహుజా క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కలిసే ఉన్నామని.. ఎవరూ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి గోవిందా తరఫు లాయర్ లలిత్ బింద్రా కూడా స్పందించారు. వారిద్దరి విడాకులకు సంబంధించి ఎలాంటి కేసు లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు కావాలనే పాత విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారని తెలిపారు. వినాయకచవితి పండగనాడు వారిద్దరినీ జంటగా చూడొచ్చని లాయర్ లలిత్ చెప్పారు. గోవింద, సునీత 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు.నటుడు గోవింద మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే సునీతా అహుజా విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆరోపించినట్టు పలు కథనాలు వచ్చాయి. 30 ఏళ్ల ఓ మరాఠీ నటితో గోవిందా దగ్గరగా ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె వల్లనే సునీతతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. -
రేవంత్.. సినీ కార్మికుల సమ్మెపై చొరవకు ధన్యవాదాలు: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిల్మ్ చాంబర్ , ఫెడరేషన్ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమస్యకు ముగింపు పలకాలని సూచించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చొరవకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా కేతిరెడ్డి ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి.. తన చొరవతో సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సమ్మె సంక్షోభం ఎట్టి పరిస్థితుల్లో 24 గంటలలో ముగింపు పలకలని అధికారులను ఆదేశించి, తన పరిపాలన దక్షతను చాటుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎవ్వరు చెడగొట్టాలని ప్రయత్నించినా సహించేది లేదన్న సంకేతం ఇచ్చారు. హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సినిమా హబ్ చేయాలన్న తన కోరికకు ఈ సమ్మె ఒక అడ్డంకిగా ఉందని ఇటీవల బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తదితరులతో కూడా ముఖ్యమంత్రి చర్చించారు.అదేవిధంగా ఎన్నో రోజులుగా సతమతమవుతున్న సినీ కార్మికుల సమస్యలు, చిత్రపురి కాలనీ వ్యవహారంలో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సినిమాలో ఉన్న ట్రేడ్ యూనియన్ల పేరుతో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. సొసైటీస్ రిజిస్టర్ వద్ద లెక్కలు సమర్పించకుండా ఉన్న వారిపై, దొంగ సభ్యులను చేర్చుకొని వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వాటిని సొసైటీస్ రిజిస్టర్ వద్ద సమర్పించని ట్రేడ్ యూనియన్ సంఘాలపై విచారణ చేపట్టాలన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
విజయ్ విమర్శలకు శరత్కుమార్ కౌంటర్
మహానాడు వేదికగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రచ్చకెక్కాయి. తాను సింగిల్గానే 2026లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే కూటమి వర్గాలపై విమర్శలు చేశారు. దీంతో అక్కడి అన్ని పొలిటికల్ పార్టీలు విజయ్పై ముప్పెట్ట దాడి చేసేందుకు దిగాయి.విజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, నటుడు శరత్కుమార్ రియాక్ట్ అయ్యారు. సిద్ధాంత పరంగా విజయ్ వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మిస్టర్ పీఎం అంటూ ప్రధాని నరేంద్ర మోదీని సంబోధించే స్థాయికి ఇంకా ఎదగలేదన్నారు. ముందుగా పాసిజం అంటే ఏమిటో తెలుసుకుని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆపై అన్నాడీఎంకే నేతలు కూడా ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో అందరూ ఎంజీఆర్, జయలలితలు కాలేరని ఎద్దేవాచేశారు.దివంగత నటుడు విజయకాంత్ ఆశీస్సులు విజయ్కి ఉంటాయని ఆయన సతీమణి ప్రేమలత అన్నారు. విజయ్ తమ ఇంటి బిడ్డ అని ఆమె అన్నారు. విజయ్ వ్యాఖ్యలు కూడా విజయకాంత్ను గుర్తుచేస్తున్నాయని డీఎండీకే నేత ప్రేమలత అన్నారు. ప్రస్తుతం విజయ్కి సపోర్ట్గా విజయకాంత్ సతీమణి రావడం అభిమానులు సంతోషిస్తున్నారు. -
నేనే గనుక నిర్మాతనైతే ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది: ఆండ్రియా
ఆండ్రియా( Andrea Jeremiah) అంటే నటి మాత్రమే కాదు.. అంతకు మించి. గాయని, రచయిత్రి.. వీటన్నింటికీ మించి బోల్డ్ నటి. ఏ తరహా పాత్రనైనా చేయడానికి వెనుకాడని డేరింగ్ బ్యూటీ అంటూ కోలీవుడ్లో గుర్తింపు ఉంది. ఈమె పలు భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న ఆండ్రియా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ భామ అన్నది గమనార్హం. ఈమె 2014లో నటించిన పిశాచు చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్కు దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు విజయ్సేతుపతి క్యామియో పాత్రను పోషించిన ఈ చిత్రంలో నటి పూర్ణ, సంతోష్ ప్రతాప్, నమితా కృష్ణమూర్తి, అజ్మల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రాక్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మురుగానందం నిర్మించిన ఈ చిత్రం చాలా కాలం క్రితమే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని సమస్యల కారణంగా విడుదలలో ఆలస్యం జరుగుతోంది. పైగా పిశాచు–2 చిత్రంలో ఆండ్రియా నటన ఆదుర్స్ అంటూ దర్శకుడు మిష్కిన్ ప్రచారం చేశారు. అయితే గత మూడేళ్లుగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కాగా ఈ చిత్రం విడుదల గురించి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి ఆండ్రియాను అడగ్గా తాను నటించడం మాత్రమే చేయగలను కానీ చిత్రాన్ని రిలీజ్ చేయగలనా? అని ప్రశ్నించారు. అలాగే తానే నిర్మాతనైనే పిశాచు చిత్రాన్ని ఎప్పుడో విడుదల చేసేదాన్ని అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా నటి ఆండ్రియా నటించిన మనుషీ చిత్రం కూడా వివాదాల్లో చిక్కుంది. ప్రస్తుతం ఈ భామ నో ఎంట్రీ, మాస్క్ చిత్రాల్లో నటిస్తున్నారు.పిశాచు–2 ఆలశ్యానికి కారణం ఏంటిఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ అనే సంస్థ ‘పిశాచి–2’ విడుదలను అడ్డుకుంది. సినిమా హక్కుల విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ రాక్ఫోర్ట్ బ్యానర్ వారు తమకు రూ. 4.85 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చట్టపరమైన వివాదాలతో పాటు ఈ సినిమాలో ఆండ్రియా నగ్నంగా నటించినట్లు దర్శకుడు మిష్కిన్ వెల్లడించారు. అయితే, ఈ సన్నివేశాలను పూర్తిగా చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు చెప్పారు. ఈ అంశం కూడా సినిమాపై వివాదాన్ని పెంచింది. -
కీ రోల్కి సై
విశాల్ హీరోగా రవి అరసు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్పై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు. విశాల్ కెరీర్లో 35వ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి కీ రోల్లో నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ‘‘అంజలి ప్రస్తుతం ఆచితూచిపాత్రలను ఎంచుకుంటున్నారు.ఈ క్రమంలో విశాల్ 35 కథ నచ్చి, ఆమె ఓకే చెప్పారు. ‘మద గద రాజా’ చిత్రంలో అంజలి, వరలక్ష్మిలతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్ తెలిపింది. -
పెళ్లి పీటలెక్కిన బిగ్బాస్ బ్యూటీ.. రాఖీ సావంత్ మాజీ బాయ్ఫ్రెండ్ సందడి!
ప్రముఖ నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ సబా ఖాన్ పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. సభా ఖాన్ హిందీ బిగ్బాస్ సీజన్-12లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. కానీ ఈ సీజన్ టైటిల్ను బుల్లితెర నటి దీపికా కక్కర్ గెలుచుకుంది.'బిగ్ బాస్ 12' ఫేమ్ సబా ఖాన్ వ్యాపారవేత్త వసీంను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిలో రాఖీ సావంత్ మాజీ భాయ్ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ సందడి చేశారు కాగా.. ఆదిల్.. సబా ఖాన్ సోదరి సోమి ఖాన్ను వివాహం చేసుకున్నాడు. కాగా.. సబా ఖాన్ భర్త వసీం జోధ్పూర్కు చెందిన నవాబ్ కుటుంబానికి చెందినవాడు. ఈ పెళ్లికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. View this post on Instagram A post shared by Saba Khan (@sabakhan_ks) -
రజినీకాంత్ కూలీ.. మాస్ సాంగ్ వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 14న థియేర్లలో విడుదలైన కూలీ తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా లియో రికార్డ్ను కూలీ అధిగమించింది. కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందితాజాగా ఈ మూవీ నుంచి కొక్కి అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను అమోగ్ బాలాజీ పాడగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ మాస్ రజినీకాంత్ను ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు.Electrifying & Addictive #Kokki lyric video is out now!🖤🔥 #Coolie▶️ https://t.co/XC6UiW0qcZ #Coolie ruling in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja… pic.twitter.com/Sxn6Xu4Xe7— Sun Pictures (@sunpictures) August 22, 2025 -
అచ్చొచ్చిన ప్లేస్లో భాగ్యశ్రీ.. జపాన్ బీచ్లో మీనాక్షి
జపాన్ బీచ్లో ఎంజాయ్ చేస్తున్న మీనాక్షిఆగస్టు జ్ఞాపకాలు షేర్ చేసిన దీపికా పిల్లిఅచ్చొచ్చిన ప్లేస్ గురించి చెప్పిన భాగ్యశ్రీ బోర్సేజమ్ము కశ్మీర్ టూర్లో యామీ గౌతమ్రెడ్ శారీలో అందాలతో కవ్విస్తున్న కృతి కర్బందామట్టి పాత్రలు చేస్తూ బిజీబిజీగా అనికా సురేంద్రన్బిగ్బాస్ అగ్నిపరీక్ష కోసం శ్రీముఖి రెడీ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
ఓటీటీకి పరదా హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాల చూసే తీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్కు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగానే ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్తోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక మలయాళ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలకు ఓటీటీల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. పరదాలో నటించిన దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ను తెరెకెక్కించారు. క్రిషంద్ దర్శకత్వంలో వస్తోన్న ఈ 4.5 గ్యాంగ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.ట్రైలర్ చూస్తే క్రైమ్, కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ను తిరువనంతపురంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. పరదా సినిమా హీరోయిన్ దర్శన రాజేంద్రన్ కీలక పాత్ర పోషించడంతో ఈ సిరీస్పై ఆసక్తి నెలకొంది. ఆమె లేడీ విలన్గా కనిపించనుంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. -
అధికారిక ప్రకటన.. 'వాల్తేరు వీరయ్య' కాంబో మరోసారి
'భోళా శంకర్' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆలోచనలో పడిపోయిన చిరంజీవి రూట్ మార్చారు. 'విశ్వంభర' మొదలుపెట్టారు. అయితే ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో లేట్ అవుతూ వస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలానే శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ మూవీ కమిట్ అయ్యారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.(ఇదీ చదవండి: లండన్ నుంచి చెన్నై వచ్చి..దళపతి విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?)రెండో ఇన్నింగ్స్లో చిరు సినిమాలు చేస్తున్నారు గానీ సరైన ఫలితాలు రావట్లేదు. ఈ క్రమంలోనే వచ్చి మంచి కమర్షియల్ హిట్ అయిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇప్పుడు మరోసారి చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ బాబీ అందుకున్నాడు. యష్ 'టాక్సిక్', దళపతి విజయ్ 'జననాయగన్' చిత్రాల్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. చిరు-బాబీ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.'మెగా 158' పేరుని ఈ ప్రాజెక్టుకి వర్కింగ్ టైటిల్గా నిర్ణయించారు. నెత్తురు-గొడ్డలిని పోస్టర్లో చూపించారు. చూస్తుంటే ఇది యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. మరి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు. హీరోయిన్, సంగీత దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తారేమో?(ఇదీ చదవండి: చిరంజీవి లుక్లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి)It’s the #ChiruBobby2 STATEMENT that sends shivers down the spine 🔥‘The Blade that set the BLOODY BENCHMARK 💥’A MEGASTAR @KChiruTweets hysteria in @dirbobby’s presentation ❤️Produced by @KvnProductions & @LohithNK01 ✨#HBDMegastarChiranjeevi #MEGA158#ABC - AGAIN' BOBBY… pic.twitter.com/yCLmtNcRzX— KVN Productions (@KvnProductions) August 22, 2025 -
ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్
ఇండస్ట్రీలో అవకాశలెప్పుడూ ఒకేలా ఉండవు. వయసు పెరిగేకొద్దీ నటీనటులకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా యాక్ట్రెస్లకు అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. కానీ, బాలీవుడ్ నటి ఉషా నదకర్ణి (Usha Nadkarni) మాత్రం ఎప్పుడూ షూటింగ్స్తో బిజీగా ఉంటోంది. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె గతంలో పవిత్ర రిష్తా సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించిన అంకిత లోఖండే.. తాజాగా నటి ఉషాను ఇంటర్వ్యూ చేసింది.గ్లిజరిన్ లేకుండా..ఈ సందర్భంగా ఉషా గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ఉషాతో తాను అంత సన్నిహితంగా ఉండేదాన్ని కాదని, అయినా ఆమె తనకు చాలా విషయాలను దగ్గరుండి నేర్పించిందని తెలిపింది. గ్లిజరిన్ లేకుండా ఏడ్చేస్తుందని, ఎక్కువ మేకప్ వేసుకోదని పేర్కొంది. ఇప్పటికీ ఒంటరిగా ధైర్యంగా జీవిస్తోందని తెలిపింది. ఆ మాటతో ఉషా భావోద్వేగానికి లోనైంది. నాకంటూ ఎవరూ లేరు'అవును, ఒంటరిగా బతుకుతున్నా.. కానీ నాకూ ఎమోషన్స్ ఉంటాయి. ఒక్కోసారి భయమేస్తుంటుంది. సడన్గా స్లిప్ అయి కిందపడిపోతే ఎవరికీ తెలియదు. నన్ను చూసేందుకు ఎవరూ రారు. నా కొడుకు విదేశాల్లో నివసిస్తున్నాడు. ఓ సోదరుడిని ఈ మధ్యే కోల్పోయాను. ఇక్కడ నాకోసం ఎవరూ లేరు' అని భావోద్వేగానికి లోనైంది. అంకిత వెంటనే లేచి ఉషను హత్తుకుని నీకోసం నేనున్నానంటూ మాటిచ్చింది. ఏ అవసరమొచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చేస్తానంది. నేను చనిపోతే..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం తన ఒంటరితనం గురించి మాట్లాడింది. 1987 నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను. మొదట్లో భయమేసింది. ఎవరైనా తలుపు తీసుకుని వచ్చి నాపై దాడి చేస్తారేమోనని భయపడేదాన్ని. కానీ, ఇప్పుడా భయం లేదు. ఎవరి మరణం ఎలా రాసిపెట్టుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ నేను నిద్రలోనే చనిపోతే పక్కింటివాళ్లు డోర్ కొడతారు, ఎంతకూ తలుపు తీయకపోతే చనిపోయానని వాళ్లే అర్థం చేసుకుంటారు అని చెప్పుకొచ్చింది.చదవండి: వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య -
మెగాస్టార్-బాలయ్య కాంబోలో సినిమా.. అనిల్ రావిపూడి ఏం చెప్పారంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చేశారు. బుధవారం విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇవాళ అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చారు. మెగా 157 టైటిల్ను రివీల్ చేశారు. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.ఈ ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రాబోయే రోజుల్లో మెగాస్టార్- బాలయ్యతో కలిసి సినిమా చేస్తారా అని? మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అనిల్ రావిపూడి స్పందించారు. వెంకటేశ్, చిరంజీవితో మన ప్రయాణం మొదలైంది.. బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో చిరంజీవిగారే మైకులో చెప్పారని అనిల్ తెలిపారు. ఇద్దరు కూడా ఎవరికీ వారు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న హీరోలు.. వారికి తగిన కథ సెట్ అయితే తప్పకుండా చేస్తానన్నారు. అలాంటి కథ కుదిరితే ఎవరు చేసినా బాగుంటుందని అనిల్ రావిపూడి అన్నారు. -
ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
దళపతి విజయ్.. తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఓ హీరో. ఓవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. సొంతంగా టీవీకే అనే పార్టీ పెట్టి, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నాడు. తాజాగా మధురైలో పార్టీ మీటింగ్ పెడితే లక్షలాది జనం తరలివచ్చారు. ఇలా విజయ్ గురించి చాలానే తెలుసు. కానీ ఈ హీరో ప్రేమ వివాహం చేసుకున్నాడని, ఓ సినిమా చూసి ఇతడిని, భార్య సంగీత పెళ్లి చేసుకుందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు?దళపతి విజయ్ భార్య పేరు సంగీత సోమలింగం. భర్త ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఈమె ఎందుకనో మీడియా అట్రాక్షన్ కోరుకోలేదు. ఈమె గురించి మీడియాలో, సోషల్ మీడియాలోనూ పెద్దగా ప్రస్తావన ఉండదు. సంగీత విషయానికొస్తే.. ఈమె ఓ శ్రీలంకన్ తమిళియన్. తండ్రి యూకేకి వలస వెళ్లి బిజినెస్మ్యాన్ అయిపోయాడు. అలా యూకేలో తండ్రితో కలిసి నివసిస్తున్నప్పుడు అనుకోకుండా విజయ్ 'పూవే ఉనక్కాగ' సినిమా చూసిన సంగీత.. అతడితో వన్ సైడ్ ప్రేమలో పడిపోయింది. నేరుగా చెన్నైలో వాలిపోయింది.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)ఓసారి షూటింగ్లో విజయ్ని కలిసిన సంగీత.. కొన్ని గంటలపాటు మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నది కాస్త డిన్నర్ డేట్ వరకు వెళ్లింది. తర్వాత దాదాపు మూడేళ్ల పాటు విజయ్-సంగీత డేటింగ్ చేసుకున్నారు. అలా కొన్నాళ్ల తర్వాత సంగీత తల్లిదండ్రులని విజయ్ కలవడం, వాళ్లకు ఇతడు నచ్చడంతో పెళ్లికి అంగీకారం తెలిపారు. అలా 1999లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహ వేడుక జరిగింది. తర్వాత జేసన్, దివ్య అని ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.హీరోగా విజయ్.. ఇన్నేళ్ల పాటు తన క్రేజ్ అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నాడు. మరోవైపు సంగీత కూడా రూ.400 కోట్లకు ఆస్తిపరురాలని కొన్ని ఆర్టికల్స్లో ప్రస్తావించారు. అలా భర్త ఎంత సెలబ్రిటీ అయినా సరే మీడియా అటెన్షన్ పడకుండా లో-ప్రొఫైల్ మెంటైన్ చేయడం అంటే విచిత్రమనే చెప్పాలి.(ఇదీ చదవండి: చిరంజీవి లుక్లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి) -
'అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబో.. మీ ఊహకు మించి ఉంటుంది'
ఈ రోజు మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి సినిమాల అప్డేట్స్ రావడంతో డబుల్ ఎనర్జీతో పుట్టినరోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ను కూడా రివీల్ చేశారు. టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరు గురించి మాట్లాడారు.చిరంజీవి సినిమాల్లో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు అంటే తనకు చాలా ఇష్టమన్నారు. రీ ఎంట్రీలో చిరంజీవి స్వాగ్ను చూపించాలకున్నట్లు తెలిపారు. చివరగా నాకు ఆ అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి ఉంటుందని అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మీకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తానని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా లేడీ సూపర్స్టార్ నయనతార నటిస్తోంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్లో ప్రజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. -
అక్కినేని ఫ్యాన్స్ కి పండగే..! నాగ్ 100 నాటౌట్..!
-
చిరంజీవి లుక్లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి
గతంలో సినిమాని సినిమాగా చూసి ఎంటర్టైన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రాఫిక్స్, లాజిక్కులు, హీరో లుక్.. ఇలా అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఏ మాత్రం తేడా అనిపించినా సరే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రీసెంట్ టైంలో హరిహర వీరమల్లు, వార్ 2 చిత్రాలు ఇలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నాయి. గతేడాది 'విశ్వంభర' కూడా టీజర్తో చాలానే విమర్శలు ఎదుర్కొంది.అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి.. తన కొత్త సినిమా విషయంలో ముందే జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ డైరెక్టర్.. చిరంజీవితో ఓ కామెడీ మూవీ చేస్తున్నాడు. చిరు బర్త్ డే సందర్భంగా తాజాగా టైటిల్ రివీల్ చేశారు. 'మన శంకర వరప్రసాద్ గారు' అని టైటిల్ పెట్టినట్లు చెబుతూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సిగరెట్ తాగుతూ సూట్ వేసుకుని చిరంజీవి స్టైలిష్గా కనిపించారు.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)అయితే చిరు లుక్పై ట్రోల్స్ వస్తాయని భయపడ్డాడో ఏమో గానీ అనిల్ రావిపూడి.. 'చిరంజీవి సూట్లో ఎలా ఉంటారో చూడటం నాకు చాలా ఇష్టం. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి. చిరంజీవి లుక్కి VFX ఏమి లేదు.. 95 శాతం ఒరిజినల్' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కోసం జిమ్కి వెళ్లి సన్నబడ్డారని చెప్పుకొచ్చాడు. అనిల్ స్పీచ్ చూస్తుంటే ట్రోల్స్ వచ్చి తర్వాత క్లారిటీ ఇవ్వడం కంటే ముందే జాగ్రత్తపడుతున్నాడేమో అనిపిస్తుంది.ఈ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా భీమ్స్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం చిరంజీవి 'విశ్వంభర' ఈ మూవీ కంటే ముందు రిలీజ్ కావాలి. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ) -
ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ
అనుపర పరమేశ్వరన్ వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'పరదా'.. ఈ రోజే(ఆగస్టు 22) థియేటర్లలోకి వచ్చింది. మరో మూడు వారాల్లో 'కిష్కిందకాండ' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇకపోతే కొన్నిరోజుల క్రితం ఈమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా.. పలు వివాదాల్లో చిక్కుకుంది. తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా?(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)కోర్ట్ రూమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన 'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ'.. గతవారం ఓటీటీలోకి వచ్చింది. అయితే మలయాళ, కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. దీంతో తెలుగు ఆడియెన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు వారం లేటుగా తెలుగు వెర్షన్ తీసుకొచ్చేశారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ' విషయానికొస్తే.. జానకి విద్యాధరన్(అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తుంటుంది. పండగ జరుపుకొనేందుకు కేరళలోని సొంతూరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లినప్పుడు ఈమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో పోలీసులని ఆశ్రయిస్తుంది. ఈ న్యాయ పోరాటంలో జానకి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? ఈ కేసులో అడ్వకేట్ డేవిడ్(సురేశ్ గోపి) ఎవరివైపు నిలిచారు? తన ప్రమేయం లేకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డని ప్రభుత్వమే చూడాలనే జానకి విజ్ఞప్తిపై కేరళ హైకోర్ట్ ఎలా స్పందించింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)JSK – Janaki V/s State of Kerala is now streaming on ZEE5. A powerful courtroom drama where truth takes the spotlight. Watch it now in Telugu! 🎬⚖️Don’t miss it!"#JanakiVsStateOfKeralaOnZEE5@TheSureshGopi @anupamahere @jsujithnair @DreamBig_film_s#PravinNarayanan pic.twitter.com/375xPZL7lm— ZEE5 Telugu (@ZEE5Telugu) August 22, 2025 -
బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'కె ర్యాంప్', 'చెన్నై లవ్ స్టోరీ' అనే సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్గానే తండ్రిగానూ ప్రమోషన్ పొందాడు. గతేడాది ఆగస్టులో పెళ్లి జరగ్గా.. ఏడాదిలోనే తండ్రి అయిపోయాడు. ఈ క్రమంలోనే పెళ్లిరోజు రావడంతో భార్యకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. అలానే కిరణ్ భార్య రహస్య కూడా పోస్ట్ పెట్టింది. కానీ పెళ్లి నాటి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)కిరణ్-రహస్య ప్రేమ వివాహాం చేసుకున్నారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో వీళ్లిద్దరూ టాలీవుడ్కి పరిచమయ్యారు. తర్వాత కిరణ్ వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోగా.. రహస్య మాత్రం నటన పక్కనబెట్టేసి ఉద్యోగం చేసుకుంది. స్నేహితులుగా మొదలైన వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో గతేడాది ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు.ఈ క్రమంలోనే తొలి పెళ్లిరోజు సందర్భంగా కిరణ్ భార్య రహస్య పోస్ట్ పెట్టింది. 'పెళ్లికి సరిగ్గా గంటముందు నాకు చాలా ఆందోళనగా ఉంది. నా గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అప్పుడు నా దగ్గరికి వచ్చిన కిరణ్ ఈ నోట్ ఇచ్చాడు. దీంతో ప్రశాంతంగా ధైర్యంగా అనిపించింది. ఏం జరిగినా సరే ఇతడు చూసుకుంటాడులే అనిపించింది. ఇదే నాకు దక్కిన బెస్ట్ గిఫ్ట్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కిరణ్ అబ్బవరం' అని రహస్య రాసుకొచ్చింది. ఈమె షేర్ చేసిన ఫొటోలు.. కిరణ్ 'నన్ను భర్తగా కోరుకున్నందుకు థ్యాంక్యూ. నా జీవితంలోకి స్వాగతం. బాగా చూసుకుంటా' అని రాసిచ్చిన నోట్ చూడొచ్చు.(ఇదీ చదవండి: మంచు విష్ణు డేర్.. రూ. 100 కోట్ల పెట్టుబడితో బిగ్ ప్లాన్) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
మంచు విష్ణు డేర్.. రూ. 100 కోట్ల పెట్టుబడితో బిగ్ ప్లాన్
'కన్నప్ప' (Kannappa) సినిమాను నిర్మించడం కోసం మంచు విష్ణు పెద్ద సాహసమే చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఆయన రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో మంచు విష్ణు మరో అడుగు ముందుకువేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఒక ప్రాజెక్ట్ కోసం ఆయన ఏకంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.కన్నప్ప విజయం తర్వాత నటుడు, నిర్మాత విష్ణు మంచు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు. అతను మైక్రోడ్రామాలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని ఇండస్ట్రీ వర్గలు చెబుతున్నాయి. విష్ణు తన సొంత డబ్బుతో పాటు కొందరి భాగస్వామ్యంతో వినోద రంగంలో సంచలనానికి తెరలేపనున్నారు. ఈ వార్త టాలీవుడ్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.మైక్రోడ్రామాలు అంటే ఏమిటి?మైక్రోడ్రామాలు అంటే చిన్న పరిమాణంలో, తక్కువ వ్యవధిలో, పరిమిత పాత్రలతో, గాఢమైన భావోద్వేగాలను వ్యక్తపరచే నాటకాలు. ఇవి సాధారణంగా 1 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఉంటాయి. ఒకే సంఘటన లేదా భావన చుట్టూ తిరుగుతాయి. సాధారణ సోషల్ మీడియా రీల్స్ మాదిరిగా కాకుండా.. ఈ కథలు ప్రొఫెషనల్ దర్శకత్వంతో పాటు అధిక-నాణ్యత నిర్మాణం ఆపై బలమైన కథ చెప్పడం వంటి అంశాలతో ఉంటాయి. విష్ణు కొత్త ప్రాజెక్ట్ భారతీయ వినోదంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేయనున్నాడని కొందరు అంటున్నారు. విష్ణు నిర్ణయం వల్ల నటన, రచన, దర్శకత్వం వంటి అంశాల్లో కొత్త వారికి భారీగా ఛాన్సులు దొరుకుతాయి. ఆపై కంటెంట్ కూడా ఎక్కువగా సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఉటుందని కొందరు చెబుతున్నారు. ఇది భారతీయ వినోద రంగంలో గేమ్-చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. -
బిగ్బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఎన్కౌంటర్లో నిందితుడు అరెస్ట్
హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. ఆ సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, తాజాగా ఆ కాల్పులకు తెగబడిన వారిలో ఒకరిపై పోలీసులు ఎన్కౌంటర్ జరిపారు.గురుగ్రామ్లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులకు పాల్పడింది ఇషాంత్ అలియాస్ ఇషు గాంధీ (19)గా పోలీసులు గుర్తించారు. ఫరీదాబాద్లోని జవహర్ కాలనీకి చెందిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతని సమాచారం అందడంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో అతనికి సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ గ్యాంగ్లోని కొందరిని కలిసేందుకు ఇషాంత్ వెళ్తుండగా పోలీసులు వెంబడించారు. దీంతో పోలీసు బృందంపై ఆటోమేటిక్ పిస్టల్తో ఇషాంత్ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో పోలీసుల టీమ్ కూడా అతని కాలిపై గన్తో కాల్చడంతో కిందపడిపోయాడు. గాయాలతో ఉన్న ఇషాంత్ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. -
సంచలన దర్శకుడు, నటుడితో 'కీర్తి సురేష్' సినిమా
నటి కీర్తి సురేష్ చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు పలు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన బ్యూటీ, తమిళంలో మంచి విజయాన్ని సాధించిన తెరి చిత్ర హిందీ రీమేక్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ బేబీ జాన్గా విడుదలైన ఆ చిత్రంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే హిందీలో మరో అవకాశం మాత్రం రాలేదు. అదే సమయంలో తన చిరకాల మిత్రుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఏ భాషలోనూ మరో చిత్రంలో నటించలేదు. ఇది ఆమె కావాలని తీసుకున్న బ్రేకా లేక అవకాశాలు రాక అన్నది తెలియదు గానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని మరి అందమైన ఫోటోలను తీయించుకొని వాటిని సామాజిక మాధ్యమాలలో విడుదల చేస్తూ అభిమానుల్ని ఆనంద పరుస్తున్నారు. కాగా తాజాగా తమిళంలో కొత్త చిత్రానికి కమిట్ అయినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే సంచలన దర్శకుడు, నటుడు మిష్కిన్తో కలిసి ఈ కొత్త చిత్రంలో నటించడానికి కీర్తి సురేష్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రానికి ఆయన కథ మాత్రమే అందించడమే కాకుండా కీర్తి సురుష్తో కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. డిటెక్టివ్, పిశాచి వంటి హిట్ సినిమాలకు దర్శకుడిగా ఆయన పనిచేశారు. రీసెంట్గా వచ్చిన డ్రాగన్ సినిమాలో ప్రోఫెసర్గా మిస్కిన్ నటన తెలుగువారికి కూడా నచ్చింది.ఆపై చాలా సినిమాల్లో నటుడిగా మెప్పించారు. కాగా వారిద్దరి కలిసి నటించనున్న క్రేజీ చిత్రానికి దర్శకుడు ఎవరు ? కథ ఎలా ఉంటుంది? ఏ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం ఎవరు ? వంటి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉందన్నారు. కాగా ఈ భామ ఇంతకుముందే నటించడానికి అంగీకరించిన రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ రెండు ఉమెన్ సెంట్రిక్ కథాచిత్రాలు అన్నది గమనార్హం. -
టాలీవుడ్ వివాదానికి ఎండ్ కార్డ్.. రేపటి నుంచి షూటింగ్స్ ప్రారంభం!
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ వర్కర్క్ ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదానికి పుల్స్టాప్ పడింది. ఇవాళ జరిగిన చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి యథావిధిగా సినిమా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. దాదాపు 18 రోజుల తర్వాత టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలు కానుంది. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది.కాగా.. కొన్ని రోజులుగా తమ వేతనాలు ముప్పై శాతం పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత 16 రోజులుగా తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ చాంబర్ అటు నిర్మాతలతో, ఇటు కార్మికులతో చర్చలు జరిపింది. కార్మికులు కోరినట్లుగా 30 శాతం జీతాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. కార్మికులు సైతం మొట్టు దిగడం లేదు. పలు దఫాల చర్చల అనంతరం తాము పెట్టిన కండీషన్లకు ఒప్పుకుంటే రూ. 2 వేలలోపు జీతాలు ఉన్న వారికి పర్సంటేజీల ప్రకారం పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా వీటిపై చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి షూటింగ్స్ షురూ కానున్నట్లు తెలుస్తోంది. -
కచ్చా బాదమ్ సాంగ్ ఫేమ్.. ఇప్పుడేంటి ఇలా బార్ డ్యాన్సర్గా!
'కచ్చా బాదామ్' సాంగ్తో అప్పట్లో ఫేమస్ అయిన నటి అంజలి అరోరా. ఆ తర్వాత పలు రియాలిటీ షోలు, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో ది లవ్ ఈజ్ ఫరెవర్, దివాళియాన్, డెలియాన్ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో నటించిన అంజలి అరోరా పబ్ డ్యాన్స్లు చేయడమేంటని నోరెళ్లబెడుతున్నారు.తాజాగా అంజలి అరోరా థాయ్లాండ్లోని ఓ పబ్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సినిమా అవకాశాలు తగ్గడంతో ఇలా డ్యాన్స్ ప్రదర్శనలు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గౌరవంగా బతకడం కోసం తన వృత్తిని కొనసాగిస్తోందని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. కాగా... అంజలి అరోరా ఇటీవల ఎంఎంఎస్ లీక్, వీడియో లీక్ వంటి వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ పబ్లిసిటీతో ఆమె కోట్లలో డబ్బు సంపాదించిందని కూడా ఆరోపణలొచ్చాయి. ఒకప్పుడు స్టార్గా ఉన్న అంజలి ఇప్పుడు పట్టాయాలో క్లబ్ డ్యాన్సర్గా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.Anjali Arora, Insta dancers ki ‘role model’, Pattaya ke club mein apni ‘talent’ dikhate hue dikhin full jhatka thumka mode on. Wah, reel se deal tak ka asli startup model shayad isi ko kehte hain. pic.twitter.com/2FSwGAQ8QV— NoLawForMen (@MenTooRHuman) August 21, 2025Kacha Badam fame Anjali Arora seems to have made dancing in posh clubs her career.Here she is dancing in a club in Pattaya, Thailand.It is better to earn money than to ask for money. pic.twitter.com/6WzMFJUJrd— Param Choudhary (@Param_117_) August 21, 2025Anjali Arora of Kachcha Badam fame has taken up dancing in posh clubs as a career it seems.Here she is dancing at a Club in Pattaya, Thailand. pic.twitter.com/RXgWZit44Z— Sensei Kraken Zero (@YearOfTheKraken) August 21, 2025 -
తమిళంలో హిట్.. బన్ బటర్ జామ్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
బన్ బటర్ జామ్ మూవీ తమిళంలో ఆల్రెడీ సక్సెస్ అయింది. నేటి యువతకు తగ్గట్టుగా, ట్రెండ్ను ఫాలో అవుతూ తీసిన చిత్రంగా ‘బన్ బటర్ జామ్’ మూవీకి మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ఈ మూవీని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ శుక్రవారమే ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. మరి తెలుగు ఆడియెన్స్ను ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఓ సారి చూద్దాం.కథ ఏంటంటే?లలిత (శరణ్య), ఉమ (దేవ దర్శిని) ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదర్చిన వివాహాలు ఏవీ కూడా నిలబడటం లేదని తెలుసుకుంటారు. ఇంటర్ చదువుతున్న తమ బిడ్డల్ని ఒకటి చేయాలని లలిత, ఉమలు అనుకుంటారు. లలిత తన కొడుకు చంద్రు ((రాజు జయమోహన్)ని, ఉమ తన కూతురు మధుమిత (ఆద్య ప్రసాద్)ని ఒకే దగ్గర ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో లలిత ఇంటి పక్కనే ఓ ఇళ్లు అద్దెకు తీసుకుంటుంది ఉమ. అయితే చంద్రు ఏమో నందిని (భవ్య త్రికా)తో, మధు మిత ఏమో ఆకాష్ (వీజే పప్పు)తో ప్రేమలో ఉంటారు. చివరకు వీరి ప్రేమ కథలు ఒడ్డుకు ఎలా చేరతాయి? చంద్రుకి తన ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్)కి దూరం ఎందుకు పెరుగుతుంది? చివరకు హీరో హీరోయిన్ల తల్లులు వేసిన ప్లాన్ బెడిసి కొడుతుందా? సక్సెస్ అవుతుందా? అన్నదే కథ.ఎలా తీశారంటే?బన్ బటర్ జామ్ అనే చిత్రం ప్రస్తుతం ఉన్న తరానికి, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్టుగా ఉన్నట్టు కనిపిస్తోంది. సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్లు అని తేడా లేకుండా అన్నీ విడాకులకే దారి తీస్తున్నాయి. ఇదే పాయింట్ మీద దర్శకుడు కథను రాసుకున్నాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వివాహా బంధం నిలబడాలంటే ఏం చేయాలి? అసలు ప్రేమ ఎలా ఉండాలి? ఎలాంటి ప్రేమను ఇవ్వాలి? ఎలా ప్రేమించాలి? అన్న పాయింట్ల చుట్టూ కథను అల్లుకున్నాడు.ప్రేమలో ఓడిపోతే జీవితం పోయినట్టు కాదు అనే పాయింట్ను చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రేమ, స్నేహం అనే వాటి చుట్టూ కథను చక్కగా అల్లుకున్నాడు. ఇక ఇప్పుడు ఎక్కువగా వినిపించే బెస్టీ అనే ట్రెండ్ను కూడా ఇందులో వాడుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాలేజ్ ఎపిసోడ్స్, ప్రేమ చిగురించే సీన్లు, హీరో హీరోయిన్ల తల్లులు చేసే ఫన్తో నడుస్తుంది. ఇక సెకండాఫ్కు కథ వెళ్లే సరికి కాస్త ఎమోషనల్గా మారుతుంది.ప్రేమంటే ఏంటి? ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? ముందుకు ఎలా సాగాలి? నిజమైన ప్రేమకు అర్థం ఏంటి? అని సెకండాఫ్లో చూపిస్తాడు. క్లైమాక్స్ ఊహకందేలానే సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు కథను సాగదీసినట్టుగా అనిపిస్తుంది. గతం గత: అనే పాయింట్ను చెప్పేందుకు చాలానే ల్యాగ్ చేశాడనిపిస్తుంది. గతాన్ని వదిలి.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. వర్తమానాన్ని ఆస్వాధించాలని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది.సాంకేతికంగా చూసుకుంటే..బన్ బటర్ జామ్ మూవీకి ఇచ్చిన పాటలు తెలుగు వారికి అంతగా ఎక్కకపోవచ్చనిపిస్తుంది. ఆర్ఆర్ సీన్లకు తగ్గట్టుగా ఉంటుంది. ఇక డైలాగ్స్ కొన్ని చోట్ల గుండెను తాకేలా ఉంటాయి. విజువల్స్ చక్కగా కుదిరాయి. ఎడిటింగ్ బాగుంటుంది. ఓ గ్రాండ్ ఫిల్మ్ చూసినట్టుగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.ఎవరెలా చేశారంటే..బన్ బటర్ జామ్ సినిమాలో చంద్రు పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మాయిలు అంటేనే భయపడిపోయే చంద్రు పాత్ర అందరినీ మెప్పిస్తుంది. చంద్రు పాత్రలో రాజ్ ఎంతో సహజంగా నటించారు. ఇక నందిని పాత్రకు అయితే నేటి యువతులు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. రీల్స్, ఇన్ స్టా, ఇన్ ఫ్లూయెన్సర్ అంటూ హల్చల్ చేసే ఆ పాత్ర ఎక్కువగా రిలేట్ అవుతుంది. శరణ్య, దేవ దర్శిని పాత్రలు ట్రెండి మామ్స్ అన్నట్టుగా సాగుతాయి. మధుమిత, శివ, శ్రీనివాస్, ఆకాష్ ఇలా అన్ని పాత్రలు బాగానే కుదిరాయి. -
హృతిక్ రోషన్ ప్రియురాలి మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్!
బాలీవుడ్ నటి, హృతిక్ రోషన్ ప్రియురాలు సబా ఆజాద్ నటించిన తాజా చిత్రం సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్. ఈ చిత్రాన్ని కశ్మీర్కు చెందిన ప్రముఖ సింగర్ రాజ్ బేగం జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డానిష్ రెంజు దర్శకత్వం వహించారు. ఆపిల్ ట్రీ పిక్చర్స్ ప్రొడక్షన్, రెంజు ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేకర్స్. ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో సోనీ రజ్దాన్ కీలక పాత్రలో కనిపించారు.సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రం ద్వారా కాశ్మీర్కు చెందిన దిగ్గజ సింగర్ రాజ్ బేగం జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కశ్మీర్ లోయ నుంచి సంగీతంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళగా రాజ్ బేగం నిలిచింది. తన కెరీర్లో ఆమెకు ఎదురైన అడ్డంకులు, తను ఎలా విజయం సాధించన్నదే సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ కథ. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
థియేటర్లలో పరదా..ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పోటీలో లేవు. అనుపమ పరమేశ్వరన్ పరదా, సత్యరాజ్, ఉదయభాను ప్రధానపాత్రల్లో వచ్చిన త్రిబాణధారి బార్బరిక్ లాంచి సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. దీంతో ఈ వారంలో వీకెండ్లో పరదా మూవీ కోసం మాత్రమే సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సినిమాలు సందడి చేస్తుంటాయి. ఎప్పటిలాగే ఈ వారంలో కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో తమిళ చిత్రం సార్ మేడమ్, బాలీవుడ్ మూవీ మా, మారీషన్ లాంటి డబ్బింగ్ సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. ఫ్రైడే ఒక్క రోజులోనే దాదాపు 16 చిత్రాలు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. అమెజాన్ ప్రైమ్సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22నెట్ఫ్లిక్స్అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22మా (హిందీ సినిమా) - ఆగస్టు 22మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23జియో హాట్స్టార్ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22పీస్ మేకర్ -సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22జీ5ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22ఆపిల్ ప్లస్ టీవీఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - ఆగస్టు 22ఆహాకొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) - ఆగస్టు 22సన్ నెక్ట్స్కపటనాటక సూత్రధారి (కన్నడ సినిమా) - ఆగస్టు 22కోలాహాలం(మలయాళ సినిమా)- ఆగస్టు 22లయన్స్ గేట్ ప్లేఉడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22 -
మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఈ ఏడాది కూడా అక్కడేనా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈనెల 22న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే రెడీ అయిపోయారు. దీంతో ఒక్కరోజు ముందుగానే అభిమానులకు విశ్వంభర బిగ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ చిరు 70వ బర్త్డే మరింత గ్రాండ్గా జరుపుకోనున్నారు.తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం చిరంజీవి ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. తన ఫ్యామిలీతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఎప్పటిలాగే బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో శ్రీజ కూతురు, తన మనవరాలితో మెగాస్టార్ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. చిరువెంట ఆయన భార్య సురేఖతో పాటు చిన్నకూరుతు శ్రీజ సైతం విమానాశ్రయంలో కనిపించారు. ఈ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసనతో పాటు.. వీరి కుమార్తె క్లీంకారా కూడా పాల్గొననున్నారు.ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
చిరంజీవి బర్త్డే ట్రీట్.. విశ్వంభర గ్లింప్స్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) ప్రధాన పాత్రలో నటిస్తున్న అడ్వెంచర్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష కథానాయికగా నటించగా ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. రేపు (ఆగస్టు 22) చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంభర గ్లింప్స్ వదిలారు. ఊపిరి పోసేవాడి కోసం ఎదురుచూపులు'ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈరోజైనా చెప్తావా?' అన్న పిల్లాడి డైలాగ్తో వీడియో ప్రారంభమైంది. 'ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకున్న ఓ సమూహం తాలూకు నమ్మకం.. అలిసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడు ఒకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాలపాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచూస్తోంది..' అంటూ మెగాస్టార్ను చూపించారు. విలన్లను చిత్తు చేస్తున్నట్లు యాక్షన్ సీన్స్ జత చేశారు. ఇది చూసిన అభిమానులు.. గ్లింప్స్ బాగున్నాయ్.. అని కామెంట్లు చేస్తున్నారు.వచ్చే ఏడాది రిలీజ్సినిమా విషయానికి వస్తే.. విశ్వంభర ఈ ఏడాది జనవరిలోనే రిలీజవ్వాల్సింది. కానీ, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్లో ఉండటంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో సినిమా రావడం కష్టమేనని స్వయంగా మెగాస్టారే వెల్లడించారు. 2026 సమ్మర్లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చదవండి: కార్తీకదీపం సీరియల్ నటి కూతురి పెళ్లి -
క్యూట్ జాన్వీ కపూర్.. సితార-నమ్రత ఫ్యామ్ జామ్
జాన్వీ కపూర్ క్యూట్ గ్లామరస్ పోజులుఫ్యామిలీ గెట్ టూ గెదర్లో సితార-నమ్రతఅందంగా ముస్తాబైన హీరోయిన్ రష్మికఅద్దాన్ని చూస్తూ అనన్య ఫన్నీ ఎక్స్ప్రెషన్స్చీరలో అందాలన్నీ చూపిస్తూ ప్రియాంక జవాల్కర్ఓరకంట చూస్తూ మైమరిపిస్తున్న కావ్య కల్యాణ్ రామ్ View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) -
రజినీకాంత్ కూలీ.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 14న థియేర్లలో విడుదలైన కూలీ తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా లియో రికార్డ్ను కూలీ అధిగమించింది.కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ బుధవారం అన్ని భాషల్లో కలిపి రూ.6.50 కోట్లు వసూలు చేసిందని సాక్నిల్క్ సైట్ వెల్లడించింది. ఈ మూవీ ఇండియాలో మొదటి రోజే రూ.65 కోట్ల నెట్ వసూలు చేసింది. అయితే రెండో రోజే రూ. 54.75 కోట్లు మాత్రమే రాబట్టింది. తొలివారంలో రూ.200 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు పరిశీలిస్తే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే రెండో వారంలో రూ.500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. -
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ అప్డేట్
స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్న హీరో రామ్.. మాస్ పక్కనబెట్టేశాడు. క్లాస్ సినిమా చేశాడు. అదే 'ఆంధ్ర కింగ్ తాలుకా'. ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్. ఇదివరకే ఓ మెలోడీ పాట రాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రిలీజ్ తేదీని ప్రకటించారు.ఈ ఏడాది ఇప్పటికే చాలావరకు సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాయి. వచ్చే రెండు నెలల్లో రవితేజ 'మాస్ జాతర', తేజ సజ్జా 'మిరాయ్', అనుష్క 'ఘాటీ', పవన్ కల్యాణ్ 'ఓజీ', రిషభ్ శెట్టి 'కాంతార' తదితర చిత్రాలు రాబోతున్నాయి. డిసెంబరులో 'రాజాసాబ్' లైనులో ఉంది. దీంతో కొత్త సినిమాలొచ్చినా సరే అన్ సీజన్లోనే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు రామ్ చిత్రం కూడా నవంబర్ 28న షెడ్యూల్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు: డిస్కో శాంతి) అయితే 'ఆంధ్ర కింగ్ తాలుకా' సినిమాకు చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇదొచ్చిన వారానికి 'రాజాసాబ్' రిలీజ్ కానుంది. ఒకవేళ ఇది సంక్రాంతికి వాయిదా పడినా, అదే తేదీకి 'అఖండ 2' రావొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రెండింటిలో ఏది రిలీజైనా సరే రామ్ చిత్రానికి కలెక్షన్స్ పరంగా ఇబ్బంది ఉండొచ్చు.'ఆంధ్ర కింగ్ తాలుకా' చిత్రం హీరోలని అభిమానించే ఫ్యాన్ బయోపిక్ అని చెప్పారు. ఇందులో భాగ్య శ్రీ హీరోయిన్. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడే రామ్-భాగ్యశ్రీ ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం డేటింగ్ కూడా చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్)Dear MEGA,LION,KING,VICTORY, POWER,SUPER,REBEL,TIGER,MEGAPOWER,STYLISH,REAL,RAJINI,KH…fans of all the other Stars.& My Dearest Fans,Have you ever watched yourself in a movie? Get Ready to Relive Your Life on the BIG Screen this year! #AndhraKingTaluka on 28-11-25 pic.twitter.com/8Ycscf1vuC— RAm POthineni (@ramsayz) August 21, 2025 -
ఇంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడే అనుకున్నా.. దత్తత తీసుకోవాలని!
35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్గానే ఉంది బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin). పెళ్లి సంగతేమో కానీ కూతురు కావాలంటోందీ ముద్దుగుమ్మ. తప్పకుండా ఓ పాపను దత్తత తీసుకుంటానని గతంలోనే చెప్పింది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన జాస్మిన్.. మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించింది. అసలు పాపను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? అన్న అభిమాని ప్రశ్నకు ఇలా స్పందించింది.అందుకే దత్తత ఆలోచననేను ఇల్లు వదిలి వచ్చేసినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడే అనుకున్నా.. నాకంటూ మంచి జీవితం సంపాదించుకున్నప్పుడు కచ్చితంగా మరొకరికి లైఫ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఓ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేను. అలాంటి పెళ్లయితే చేసుకోనుఒకవేళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకపోయినా పర్వాలేదు. మంచి మనిషి దొరికితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే ఏదో ఒకర్ని మ్యారేజ్ చేసుకుని తర్వాత విడిపోవాల్సి రావడం నాకైతే ఇష్టం లేదు. ఇకపోతే ఒక చిన్నారిని దత్తత తీసుకుని తనకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను అని తెలిపింది. దిల్సే దిల్ తక్, నాగిన్ 4 వంటి సీరియల్స్తో జాస్మిన్కు పాపులారిటీ వచ్చింది. అర్ధ సర్బత్ దే భలే దీ, వార్నింగ్ 2, బద్నాం వంటి పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. ద ట్రేటర్స్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది.చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు -
హన్సికపై విడాకుల రూమర్స్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే!
ఇటీవల హీరోయిన్ హన్సిక మోత్వానిపై వ్యక్తిగత జీవితంపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. ఆమె త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నెల ఆగస్టు 9న తన పుట్టినరోజు సందర్భంగా చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ అని..ఎన్నో పాఠాలు నేర్పిందంటూ ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసింది. కాగా సోహల్కు ఇది రెండో పెళ్లి కావడంతో మనస్పర్థలు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.(ఇది చదవండి: విడాకుల బాటలో హన్సిక.. కారణం ఇదేనా?)తాజాగా హన్సికి మోత్వానీ ఇండోనేషియాలోని బాలిలో చిల్ అవుతూ కనిపించింది. తన ఫ్రెండ్తో కలిసి వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్పై వస్తున్న వార్తలు చూసి నవ్వుతూ కనిపించింది. తన వ్యక్తిగత జీవితంపై నెటిజన్స్ కామెంట్స్ చూస్తూ నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. నా జీవితంపై ప్రజల అభిప్రాయాన్ని నేను చదివినప్పుడు అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోతో తనపై వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టేసినట్టే కనిపిస్తోంది. అయితే విడాకుల రూమర్స్పై ఇప్పటివరకు హన్సిక కానీ, ఆమె భర్త సోహెల్ కూడా స్పందించలేదు. తన ఇన్స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి.కాగా.. 2022 డిసెంబర్లో హన్సిక తన ప్రియుడు సోహైల్ని వివాహం చేసుకుంది. సోహల్కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. వీరి వివాహాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్గా కూడా విడుదల చేశారు. -
బిగ్బాస్ గౌతమ్.. బాబాయిగా ప్రమోషన్
త్వరలో బిగ్బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఎవరొస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు గత సీజన్లలో పాల్గొన్న వాళ్లు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. అలా గత రెండు సీజన్లలోనూ పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నాడు. తమ కుటుంబంలోకి లిటిల్ ఏంజెల్ వచ్చిందని పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)తెలంగాణకు చెందిన గౌతమ్ స్వతహాగా డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో ఒకటి రెండు సినిమాలు చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్లో పాల్గొనే అవకాశం రావడంతో కాస్త ఫేమ్ వచ్చింది. 7వ సీజన్లో అశ్వద్ధామ అంటూ సందడి చేసిన గౌతమ్.. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయాడు. గత సీజన్లో వైల్డ్ కార్డ్గా పాల్గొన్నాడు. రన్నరప్గా నిలిచాడు.కొన్నాళ్ల క్రితమే 'సోలో బాయ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్గానే వీరజవాన్ మురళినాయక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించాడు. వీటి సంగతి పక్కనబెడితే తాను బాబాయిగా ప్రమోషన్ పొందినట్లు గౌతమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. తన అన్నకు కూతురు పుట్టిందని ఈ మేరకు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు) View this post on Instagram A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna) -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇండస్ట్రీలోనూ చాలామంది ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి గియా మానెక్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సాత్ నిభాన సాథియా', 'జీనీ ఔర్ జుజు' సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నటుడు వరుణ్ జైన్ను పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.గియా తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆ దేవుడు, మా గురువుల దయతో, మీరు కురిపించిన ప్రేమతో మేము ఈ రోజు వివాహాబంధంలోకి అడుగుపెట్టాము. మేము ఇద్దరు స్నేహితులం.. కానీ ఈ రోజు చేయి చేయి కలిపి హృదయపూర్వకంగా మేము భార్యాభర్తలం అయ్యాం. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా చేసిన మా ప్రియమైన వారందరి ప్రేమ, ఆశీర్వాదాలకు మా కృతజ్ఞతలు. ఎల్లప్పుడు నవ్వుతూ మిస్టర్ అండ్ మిసెస్గా జీవితాంతం కలిసి ఉండటానికి ఇదే మా మొదటి అడుగు." అంటూ పోస్ట్ చేసింది.కాగా.. గియా మానెక్, వరుణ్ జైన్ జంటగా తేరా మేరా సాత్ రహే సీరియల్లో నటించారు. అప్పుడు సహనటులుగా ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరోపైపు గియా మానెక్ సీరియల్స్కతో పాటు సినిమాల్లోనూ నటించింది. కామ్ చాలు హై, నా గర్ కే.. నా ఘాట్ కే లాంటి చిత్రాల్లో కనిపించింది. View this post on Instagram A post shared by Gia Manek (@gia_manek) -
తిరుమల శ్రీవారి సేవలో అక్కినేని జంట
అక్కినేని జంట నాగచైతన్య-శోభిత.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో చైతూ-శోభిత.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో నాగచైతన్య దంపతులని పండితులు ఆశీర్వదించారు. ఈ క్రమంలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)కెరీర్ విషయానికొస్తే నాగచైతన్య.. ఈ ఏడాది 'తండేల్'తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం కార్తిక్ వర్మ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ హారర్ మూవీ చేస్తున్నాడు. ఇది కాకుండా కొరటాల శివతోనూ కొత్త సినిమా చేయబోతున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు శోభిత మాత్రం పెళ్లి తర్వాత కొత్త చిత్రాల్లో నటిస్తున్నట్లు లేదు. చాలారోజుల తర్వాత వీళ్లు మరోసారి జంటగా కనిపించడంతో అభిమానులు ఆనందపడిపోతున్నారు.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) శ్రీవారిని దర్శించుకున్న హీరో నాగచైతన్యతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల గురువారం ఉదయం దర్శించుకున్నారు. #NagaChaitanya pic.twitter.com/SQTZM6wKde— Milagro Movies (@MilagroMovies) August 21, 2025Yuvasamrat @chay_akkineni garu & our dear Sobhita garu spotted at the sacred Tirumala 🙏#NagaChaitanya #Sobhita pic.twitter.com/4j2THXMQde— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 21, 2025 -
ఆకట్టుకునేలా 'అర్జున్ చక్రవర్తి' ట్రైలర్
అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి ఓ సినిమానే 'అర్జున్ చక్రవర్తి'. కొన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే మరోవారంలో థియేటర్లలోకి మూవీ రానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)విజయ్ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని కబడ్డీ నేపథ్య నిజజీవిత కథతో తెరకెక్కించారు. విక్రాంత్ రుద్ర దర్శకుడు. 'ఖాళీ చేతులతో, కాలే కడుపుతో చేసేదే అసలైన యుద్ధం' అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. జాతీయ స్థాయిలో కబడ్డీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి.. తర్వాత కాలంలో తాగుబోతుగా ఎందుకు మారాల్సి వచ్చింది. దీనికి దారితీసిన పరిస్థితులేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఈ నెల 29న థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నారు.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) -
కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్
టాలీవుడ్లో సినిమాలు చేస్తూ ఎంత గుర్తింపు తెచ్చుకున్నా సరే కొందరు చిన్న నటుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అవకాశాలు రాకపోతే రోజు కూడా గడవదు. అలాంటిది ఏదైనా రోగమొచ్చి మంచం పడితే అంతే సంగతులు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే 'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర ఇప్పుడు మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పక్షవాతానికి గురయ్యాడు. ఇంతకీ అసలేమైంది?కమెడియన్ రామచంద్ర అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ చూస్తే గుర్తుపడతారు. జూ. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో ఇతడు నటుడిగా మారాడు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్లో 100కి పైగా చిత్రాల్లో నటించాడు. అలాంటిది ఇప్పుడు ఇతడి ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)తను పక్షవాతానికి గురైనట్లు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ వీడియోలో మాట్లాడిన రామచంద్ర.. '15 రోజుల క్రితం ఓ డెమో షూట్ కోసం వెళ్లాను. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాళ్లు లాగేసినట్లు అనిపించాయి. దీంతో డాక్టర్ దగ్గరకెళ్లి పరీక్షలు చేయించుకుంటే బ్రెయిన్లో రెండు క్లాట్స్ ఉన్నట్లు తెలిసింది. దీంతో నా ఎడమ చేయి, కాలు పడిపోయాయి. ప్రస్తుతం మందులు వాడుతున్నాను. కనీసం రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. నా గురించి మొత్తం నా సోదరుడే చూసుకుంటున్నాడు. రెండు నెలల పాటు ఉద్యోగానికి సెలవు కూడా పెట్టేశాడు' అని తన పరిస్థితి గురించి వివరించాడు.తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని రామచంద్ర చెప్పాడు. తోటి ఆర్టిస్టులకు తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించాలని, వాళ్ల ద్వారా ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఈ విషయం చేరుతుందనే ఆశతో ఉన్నాడని అన్నాడు. ఇప్పటికైతే టాలీవుడ్ నుంచి ఎవరూ తనకు ఫోన్ చేసి ఎలా ఉందని అడగలేదని తెలిపాడు. అయితే రామచంద్ర పరిస్థితి చూసిన సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైద్య పరంగా ఎవరైనా సినీ ప్రముఖులు సాయం చేయాలని కోరుతున్నారు.(ఇదీ చదవండి: సినీ కార్మికులు రోడ్డున పడ్డారు) -
అనుపమ 'పరదా' సినిమా రివ్యూ
'రివ్యూలు నచ్చితేనే మా సినిమా చూడండి'.. రీసెంట్గా ప్రమోషన్లలో హీరోయిన్ అనుపమ చెప్పిన మాట ఇది. చాలా నమ్మకంతో ఆగస్టు 22న రిలీజ్ పెట్టుకుని, రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. ఆ చిత్రమే 'పరదా'. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్తో తీసిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించింది. సంగీత, మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?పడతి అనే గ్రామంలో ఈడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల ముఖానికి పరదా కప్పుకొని తిరుగుతుంటుంది. దానికి ఓ కారణం ఉంటుంది. పొరపాటున ఎవరైనా పరదా తీస్తే వాళ్లు.. గ్రామదేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదే ఊరిలో ఉండే సుబ్బు(అనుపమ), రాజేశ్ (రాగ్ మయూర్) ప్రేమలో ఉంటారు. వీళ్లకీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. సరిగ్గా నిశ్చితార్థం రోజున సుబ్బు ఫొటో కారణంగా.. ఈమె ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. తన తప్పు లేదని చెబుతున్నా సరే వినరు. దీంతో అనుకోని పరిస్థితుల మధ్య సుబ్బు తన ఊరి దాటి ధర్మశాల వెళ్లాల్సి వస్తుంది. ఈమెకు తోడుగా రత్న(సంగీత), అమిష్ట(దర్శన రాజేంద్రన్) కూడా వెళ్తారు. ఇంతకీ ధర్మశాల ఎందుకు వెళ్లారు? చివరకు సుబ్బు.. పరదా తీసిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?గత కొన్నాళ్లలో హీరో సెంట్రిక్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కాస్త తగ్గాయని చెప్పొచ్చు. ఆ లోటుని భర్తీ చేసేందుకు వచ్చిన చిత్రమే 'పరదా'. ఇందులో హీరోహీరోయిన్లు అంటూ ఎవరూ ఉండరు. కథే మెయిన్ హీరో.పడతి గ్రామంలో జ్వాలమ్మ జాతరతో సినిమా మొదలవుతుంది. ఈ ఊరిలోని ఈడొచ్చిన అమ్మాయిలు, మహిళలు ఎందుకు పరదా కప్పుకోవాల్సి వచ్చిందనేది మొదటి పది నిమిషాల్లోనే తోలుబొమ్మలాట కథతో చెప్పేస్తారు. తర్వాత సుబ్బు, రాజేశ్ ప్రేమ.. నిశ్చితార్థం.. అనుకోని అవాంతరం వల్ల అది ఆగిపోవడం.. ఇలా కథలో సంఘర్షణ ఏర్పడుతుంది. తన తప్పు లేదని చెబుతున్నా సరే సుబ్బుని ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు ఆదేశించడం.. తర్వాత అనుకోని పరిస్థితుల్లో సుబ్బు.. మరో ఇద్దరు మహిళలతో కలిసి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వెళ్లాల్సి రావడం జరుగుతుంది. తర్వాత ఏమైంది? ఈ ప్రయాణంలో ఏం తెలుసుకున్నారనేది తెలియాలంటే మూవీ చూడాలి.ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిల్లో చైతన్యం పెరిగింది. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా భిన్న రంగాల్లో రాణిస్తున్నారు. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాల పేరుతో మహిళలని ఇబ్బంది పెడుతున్నారు. ఆచారం, సంప్రదాయం అని చెప్పి బయట ప్రపంచం చూడనీయకుండా చేస్తున్నారు. అలాంటి ఓ ఊరికి చెందిన అమ్మాయి.. తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఎలాంటి సాహసం చేసింది? మూఢనమ్మకాలపై ఎలా పోరాడింది అనే కల్పిత కథతో తీసిన చిత్రమే ఇది.సినిమా ప్రారంభంలో జెయింట్ వీల్ ఎక్కడానికే సుబ్బు చాలా భయపడుతుంది. కానీ పరిస్థితుల కారణంగా ఎత్తయిన ఎవరెస్ట్ వరకు వెళ్తుంది. తనలో భయాన్ని పోగొట్టుకుంటుంది. మూవీ అంతా సుబ్బు పాత్ర పరదా కప్పుకొని ఉంటుంది. ఆమె పూర్తిగా పరదా తీసేసే సీన్లో సీతాకోక చిలుక రిఫరెన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సుబ్బుతో పాటు జర్నీ చేసే రత్న ఓ గృహిణి, ఆమిష్ట ఓ ఇంజినీర్. ఈ పాత్రల్ని ప్రారంభించిన తీరు, ముగించిన తీరు కూడా మెచ్చుకునేలా ఉంటుంది. సెకండాఫ్ మొదలవగానే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వస్తుంది. ఉన్నది కాసేపే అయినా.. ఆయన చెప్పే ఓ స్టోరీ, డైలాగ్స్ మంచి ఎమోషనల్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లో సుబ్బు పాత్ర.. దేవుడికి కట్టిన వస్త్రాల్ని తగలబెట్టే సీన్, ఊరి ప్రజల కళ్లు తెరిపించింది అనేలా విజువల్గా చూపించడం బాగుంది.అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. సినిమా అంతా కూడా మహిళలు, వారి చైతన్యం అనేలా సాగుతుంది. రెగ్యులర్ ప్రేక్షకులందరికీ ఇది నచ్చకపోవచ్చు. కానీ అమ్మాయిలు మాత్రం తప్పకుండా ఈ మూవీ చూడాలి. చూస్తున్నంతసేపు కచ్చితంగా ఎమోషనల్ అవుతారు.ఎవరెలా చేశారు?సుబ్బు పాత్రలో అనుపమ అద్భుతంగా నటించింది. ఈ పాత్ర ప్రారంభంలో బిడియం, భయం, ప్రేమ లాంటి అంశాలతో చలాకీగా కనిపిస్తుంది. తర్వాత సీరియస్ టోన్లోకి మారుతుంది. చివరకొచ్చేసరికి ఫియర్లెస్ ఉమన్గా మారడం లాంటి మార్పు కిక్ ఇస్తుంది. రత్నగా చేసిన సంగీత క్యారెక్టర్ కూడా చాలామంది గృహిణులకు కనెక్ట్ అవుతుంది. ఓ సీన్లో ఈమె తన భర్త క్యారెక్టర్తో చేసే కామెడీ భలే నవ్విస్తుంది. పెళ్లి, పిల్లలు వద్దు అంటూ ఇండిపెండెంట్గా ఉండే మహిళలకు దర్శన రాజేంద్రన్ చేసిన అమిష్టా క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. లీడ్ రోల్స్ చేసిన ఈ ముగ్గురు కూడా బాగా చేశారు. రాగ్ మయూర్, 'బలగం' సుధాకర్ రెడ్డి.. ఇలా మిగిలిన వాళ్లు కూడా తమ వంతు న్యాయం చేశారు.టెక్నికల్ టీమ్ కూడా సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ కాస్త లౌడ్గా అనిపించింది కానీ మిగతా చోట్ల సెట్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గురించి చెప్పుకోవాలి. గతంలో సినిమా బండి, శుభం అని సినిమాలు తీశాడు. అవి మోస్తరుగా అనిపించాయి కానీ ఈ మూవీతో తనలో చాలానే విషయం ఉందని నిరూపించాడు. ఫిమేల్ సెంట్రిక్ తరహా సినిమాలంటే ఇష్టముంటే మాత్రం 'పరదా' మిస్ కావొద్దు.- చందు డొంకాన -
పదిహేను కోట్ల ఇంట్లో...
‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్నగర్ టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.ఇప్పటికే మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట... ఇలా అన్నీ హైలెట్గా మారాయి. తాజాగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూ పాయలతో ఎన్టీఆర్ ఇంటి సెట్ని నిర్మించారనే వార్తలు వస్తున్నాయి. ఈ భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్తో కొత్త షెడ్యూల్ని ప్రారంభిస్తారట.సినిమాలో ఈ ఇంటి సెట్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుందట. కళా ఖండాలు, వాల్ హ్యాంగింగ్... ఇలా ఈ సెట్కి సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారట మేకర్స్. అందుకే సెట్కే దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్కి చిన్న విరామం ఇచ్చిన ఎన్టీఆర్ వినాయక చవితి తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్లో పాల్గొంటారని టాక్. ఈ కొత్త షెడ్యూల్ నెల పాటు జరగనుందని తెలి సింది. ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. -
చాయ్వాలా ప్రేమకథ
‘‘చాయ్వాలా’ సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా తమ తండ్రితో కాసేపు మాట్లాడతారు. ఈ చిత్రం చూశాక థియేటర్ నుంచి ఓ మంచి భావోద్వేగంతో బయటికొస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని శివ కందుకూరి తెలి పారు. ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చాయ్వాలా’. శివ కందుకూరి, తేజు అశ్విని జోడీగా నటించారు. రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మించారు. బుధవారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ ప్రయాణంలో నాకు ప్రమోద్ మంచి స్నేహితుడిగా మారిపోయారు.నిర్మాత వెంకట్గారికి సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ ఉంది. మా చిత్రం ప్రేక్షకులందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చె΄్పారు. ‘‘చాయ్వాలా’ ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. ప్రమోద్ హర్ష మాట్లాడుతూ– ‘‘నేను రాసుకున్న పాత్రలు, కథ నుంచే ‘చాయ్వాలా’ టైటిల్ను తీసుకున్నాను. ప్రతి మనిషి జీవితంలో జరిగే ఘటనలే మా చిత్రంలో ఉంటాయి’’ అని చెప్పారు.‘‘మా సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. ఇదొక సున్నితమైన ప్రేమకథ’’ అని వెంకట్ ఆర్. పాపుడిప్పు పేర్కొన్నారు. ‘‘తెలుగులో ‘చాయ్వాలా’ నా మొదటి చిత్రం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు తేజు అశ్విని. ‘‘ఈ కథ వినోదాత్మకంగా, అలాగే భావోద్వేగంగా ఉంటుంది. మా ‘చాయ్వాలా’ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని నటుడు రాజీవ్ కనకాల తెలి పారు. నటుడు రాజ్కుమార్ కసిరెడ్డి మాట్లాడారు. -
ప్రభాస్ వింటేజ్ లుక్ లీక్.. ‘ఫౌజి’ టీమ్ హెచ్చరిక!
ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి వింటేజ్ లుక్లో కనిపిస్తున్న ప్రభాస్ లుక్ లీక్ అయింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఆ ఫొటో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు షేర్ చేశారు. ప్రభాస్ లుక్ ట్రెండింగ్లోకి రావడంతో మూవీ టీమ్ సీరియస్గా స్పందించింది.‘‘మా సినిమా గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీకు అద్భుతమైన విజువల్స్ అందించేందుకు యూనిట్ ఎంతో కష్టపడుతోంది. చిత్రీకరణ సమయంలో సెట్స్ నుంచి ఓ ఫొటో లీక్ అయిన విషయం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి లీక్లు మా విశ్వసనీయత, నైతికతను దెబ్బతీస్తాయి. అనధికారికంగా ఎవరైనా ప్రభాస్ లుక్ లీక్ చేసినా, షేర్ చేసినా వాళ్ల ఐడీలు బ్లాక్ చేయడంతో పాటు సైబర్ క్రైమ్ నేరం కింద పరిగణించి కేసులు పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
మాల్దీవుస్లో నేహా శెట్టి చిల్.. బాలిలో ఎంజాయ్ చేస్తోన్న హన్సిక!
మాల్దీవుస్లో చిల్ అవుతోన్న నేహా శెట్టి..వైట్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ బ్యూటీ సోనియా ఆకుల..బాలిలో ఎంజాయ్ చేస్తోన్న హన్సిక మోత్వాని..బ్లూ డ్రెస్లో ఆండ్రియా జెరెమా బ్యూటీఫుల్ లుక్..మిస్ యూనివర్స్తో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) -
అనుష్క శెట్టి పాన్ ఇండియా మూవీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
అనుష్కశెట్టి లీడ్ రోల్లో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా నుంచి దస్సోరా అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రేజీ సాంగ్కు సాగర్ నాగవెల్లి కంపోజ్ చేయగా.. ఈఎస్ మూర్తి లిరిక్స్ అందించారు. ఈ పాటను గీతా మాధురి, సాకేత్, శ్రుతి రంజని ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆమె అంటే నాకు పిచ్చి.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఛావా సినిమాపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే స్వరభాస్కర్ తాజాగా అలాంటి కామెంట్లతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.తన భర్త ఫహద్ ఆహ్మద్తో కలిసి పతి పత్ని ఔర్ పంగా - జోడియోం కా రియాలిటీ చెక్ అనే రియాలిటీ షోకు హాజరైన బాలీవుడ్ భామ లైంగిక జీవితంపై సంచలన కామెంట్స్ చేసింది. ప్రతి ఒక్కరూ బై సెక్సువల్ అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా తనకు సమాజ్వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ అంటే క్రష్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలే ఆమెను కలిశానని కూడా తెలిపింది.జెండర్ అనేది వేల ఏళ్లుగా మనపై బలవంతంగా రుద్దబడిన భావజాలమంటూ స్వర భాస్కర్ మాట్లాడింది. ఇవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు ఆమెపై మండిపడుతున్నారు. దీంతో తన మాటలతో మరోసారి వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారింది స్వర భాస్కర్. కాగా.. స్వర భాస్కర్ హిందీలో తను వెడ్స్ మను, రాంఝనా, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది."Everyone is Bisexual. I have a crush on Dimple Yadav"Swara Bhaskar 💀Now I am feeling bad for Akhilesh Yadav and Swara's husband 🤣pic.twitter.com/JVc1z12w7n— Sunanda Roy 👑 (@SaffronSunanda) August 18, 2025 -
బుల్లితెర నటి రెండో ప్రెగ్నెన్సీ.. గ్రాండ్గా సీమంతం వేడుక!
బాలీవుడ్ భామ గౌహర్ ఖాన్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ ఏడాది ప్రారంభంవో సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. తాజాగా సీమంతం వేడుక సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వేడుకను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా.. గౌహర్ ఖాన్ 2020లో సంగీత స్వరకర్త ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు జైద్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట మే 2023లో తమ మొదటి బిడ్డను స్వాగతించారు. ఆ తర్వాత ఏప్రిల్ 2025లో సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. ఇక కెరీర్ విషయానికొస్తే గౌహర్ ఖాన్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఆమె ఇటీవల ఇషా మాల్వియాతో కలిసి లవ్లీ లోల్లాలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
సాఫ్ట్వేర్ అమ్మాయి.. రైతుగా అబ్బాయి.. ఈ ప్రేమకథ ట్రైలర్ చూశారా?
శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా నటించిన చిత్రం కన్యాకుమారి. ఈ సినిమాకు సృజన్ అట్టాడ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు.ట్రైలర్ చూస్తే బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ అవ్వాలనుకుంటున్న అమ్మాయి, ఊర్లోనే వ్యవసాయం చేసుకునే అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథే ఈ కన్యాకుమారి. ట్రైలర్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. పక్కా గ్రామీణ ప్రేమకథ కావడంతో ప్రేమికులకు ఫుల్గా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
రజనీతో మంచి పాత్రకి నో..విలన్ పాత్రకి సై
విమర్శలు, ప్రశంసలకు అతీతంగా కూలీ సినిమా కలెక్షన్ల రికార్డ్స్ సృష్టిస్తోంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నాగార్జున(Nagarjuna Akkineni) తొలిసారిగా స్టైలిష్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్కు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనూహ్యమైన కాంబినేషన్లను సెట్ చేయడం ద్వారా సినిమాపై పెంచిన ఆసక్తి కలెక్షన్ల వర్షంలో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో సైమన్ అనే కోల్డ్ బ్లడెడ్ విలన్ విలన్ పాత్రలో నాగార్జున కనిపించడం కూడా కలెక్షన్ల జోరుకి బాగా దోహదం చేసినట్టు కనిపిస్తోంది. దక్షిణాదితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రతీ చోటా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజున రూ. 17 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో తెలుగు వెర్షన్ 1.3 మిలియన్ డాలర్లను సంపాదించింది, ఇది జూ.ఎన్టీయార్, హృతిక్ రోషన్ల వార్ 2 తెలుగు వెర్షన్ కంటే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.నాగార్జున విలన్ పాత్రను పోషించడంపై ఆ పాత్రను మలచిన తీరు ఆయన వీరాభిమానులకు అంతగా రుచించనప్పటికీ... మొదటి నుంచీ నాగార్జున వైవిధ్య భరిత పాత్రల ఎంపికను ప్రశంసించే వారికి మాత్రం సంతృప్తినే అందించింది. వీటికి అతీతంగా మరోవైపు నాగార్జున మాత్రం ఈ విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆయన అనుభవం నుంచి తామెన్నో నేర్చుకున్నామని, సినిమా యూనిట్లో ప్రతీ ఒక్కరితో ఆయన ప్రవర్తించే తీరు, సినిమా పూర్తి అయిన వెంటనే అందరికీ గిఫ్ట్ బాక్స్లు ఇచ్చి వారిని ఆదరించిన విషయాలు నాగార్జున గుర్తు చేసుకుంటూ కొనియాడడం తెలిసిందే. రజనీకాంత్ తో కలిసి నటించాలని తాను ఎంత కోరుకున్నారో తన మాటల ద్వారా చెప్పకనే చెబుతున్నారు నాగ్.అయితే రజనీతో చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న విధానం చూస్తుంటే గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ సందర్భంగా దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి సంఘటనలు గుర్తుకు తెస్తున్నారు. అప్పట్లో రజనీకాంత్ హీరోగా దళపతి అనే సినిమా తీశారు దర్శకుడు మణిరత్నం. ఆ సమయంలోనే సెన్సేషనల్ స్టార్ కాంబినేషన్కి ఆయన ప్లాన్ చేశారు. అందులో భాగంగా మళయాళ మెగాస్టార్ మమ్ముట్టిని కూడా ఆ సినిమాలో తీసుకున్నారు. తెలుగులో సినిమాకి ఊపు తెచ్చేలా మరో పాత్రకి నాగార్జున తీసుకోవాలని ఆయన భావించారు. ఈ విషయంపై కొన్ని రోజుల పాటు సంప్రదింపులు జరిగాయి. అయితే రజనీకాంత్తో, మణిరత్నంతో సినిమా చేయాలని ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ నాగార్జున ఎందుకో గాని ఆ పాత్రకి అంగీకరించలేదు. దాంతో ఆ పాత్ర కోసం అప్పట్లో కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన అరవింద్ స్వామిని తీసుకున్నారు. నిజానికి ఆ సినిమాలో రజనీ, మమ్ముట్టి పాత్రలకు పూర్తి భిన్నంగా అరవింద్ స్వామిది చాలా పాజిటివ్ పాత్ర. రౌడీయిజం, దాడులు,ప్రతిదాడులను అణచివేయాలనే జిల్లా కలెక్టర్ పాత్ర అరవింద్ స్వామికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్న సినీ వర్గాలు...అప్పట్లో రజనీ తో కలిసి మంచి పాత్ర చేయని నాగ్...ఇప్పుడు విలన్ పాత్ర చేయడం విశేషమంటూ గుర్తు చేసుకుంటున్నారు. -
పవన్ కల్యాణ్ మూవీలో సాంగ్.. ఆ కారణంతో చేయనని చెప్పా: ఉదయభాను
టాలీవుడ్లో యాంకర్ గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. నటిగానూ రాణించింది. పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్లోనూ మెప్పించిన ఉదయభాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బార్బరిక్ త్రిబాణధారి మూవీతో మరోసారి అభిమానులను పలకరించేందుకు వస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఉదయభాను కొన్ని సినిమాల్లో పాటలు చేయడానికి నో చెప్పానని తెలిపింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో పార్టీ సాంగ్కు నో చెప్పేశానని వెల్లడించింది. నాకు స్క్రిప్ట్ నచ్చకపోతే డైరెక్టర్తోనే నేరుగా వేరేవాళ్లను తీసుకోమని చెప్పానన్నారు. అందుకే త్రివిక్రమ్ మూవీలోనూ సాంగ్ చేయనని చెప్పానని ఉదయభాను తెలిపారు. అయితే ఆ సాంగ్ చేసేందుకు భయపడ్డానని.. అంత పెద్ద స్టార్స్ మధ్య పార్టీ సాంగ్ కావడంతో చేసేందుకు వెనకడుగు వేశానని ఉదయభాను పేర్కొంది.కాగా.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2013లో రిలీజైన సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. -
ప్రభాస్ ఈ రేంజ్కు వెళ్తాడని అస్సలు ఊహించలేదు: హీరోయిన్
టాలీవుడ్లో ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్లో మెప్పించిన కోలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్ కుమార్. అంతకుముందే తమిళంలో చాలా చిత్రాలు చేసిన శ్రీదేవి.. రుక్మిణి మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. టాలీవుడ్లోనూ చాలా సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. తెలుగులో చివరిసారిగా వీర చిత్రంలో కనిపించిన శ్రీదేవి.. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. నారా రోహిత్ హీరోగా వస్తోన్న సుందరకాండ మూవీలో కనిపించనుంది.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటని.. తొలి సినిమాతోనే మాస్ హీరోగా మెప్పించారని అన్నారు. ఆ సినిమా సమయంలోనే ప్రభాస్ స్టార్ అవుతాడని మేము అనుకున్నామని తెలిపింది. కానీ ఈ రేంజ్కు వెళ్తాడని ఎవరు కూడా ఊహించలేదని శ్రీదేవి వెల్లడించింది. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని.. ఒకరికి చెడు జరగాలని అస్సలు అనుకోరని అన్నారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వమని శ్రీదేవి పేర్కొంది.కాగా. సుందరకాండ చిత్రాన్ని వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో శ్రీదేవి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో వృతి వాఘాని హీరోయిన్గా నటించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.We all know that #Prabhas is definitely going to be a Big Star but yiii range ki veltharu ani evvaru expect cheyyaledhu 😎💥I think he deserves all this success.. - #SrideviVijayakumar about #PRABHAS pic.twitter.com/3MleMOPE6I— Prabhas RULES (@PrabhasRules) August 19, 2025 -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. మాస్ సాంగ్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. రగిలే రగిలే అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట విజయ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అభిమాని.. వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు కాలర్ ఎగరేస్తారు.. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి భారత సినీ ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయింది. ఏకంగా ఆయన పేరుతో అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు అయ్యాయి అంటే ఎవరికైనా అర్థం అయిపోతుంది. తారక్ నటించిన పలు సినిమాల్లోని పాటలకు జపాన్లోని హీరో మునిరు, అశాహి ససాకీలతో పాటు అభిమానులు డ్యాన్సులు చేశారు. వాటికి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అయితే, ఇప్పుడు వార్2 సినిమా చూసేందుకు జపాన్ నుంచి తారక్ అభిమాని ఇండియాకు వచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.జపాన్కు చెందిన 'క్రిసో' వార్2 చిత్రాన్ని చూసేందుకు భారత్ వచ్చింది. ఢిల్లీ ఎయిపోర్ట్లో తారక్ ఫోటోతో ఉన్న టీ షర్ట్ ధరించి ఆమె కనిపించింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఆమెను పలకరించారు. ఇండియా ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే.. ఆమె ఇలా చెప్పింది. ' నేను ఎన్టీఆర్కు చాలా పెద్ద అభిమానిని, ఆయన సినిమా చూసేందుకే ఇండియా వచ్చాను. ఆయన నటించిన సినిమా ఏదైనా సరే భారత్లో చూడాలని ఇక్కడికి వస్తుంటాను. గతంలో కూడా వచ్చాను.' అని పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.జపాన్లో జూనియర్ ఎన్టీఆర్కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్లు, యాక్షన్ సీన్స్కి అక్కడి ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారు. ‘బాద్షా’ సినిమాకే జపాన్లో ఫ్యాన్స్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయనకు గ్లోబల్ రేంజ్లో గుర్తింపు వచ్చింది. దేవర సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి తన అభిమానులను కలుసుకున్నారు. View this post on Instagram A post shared by ARS CineVerse | ARS ప్రయాణ ప్రపంచం (@arflyerar) -
సరికొత్త పెద్ది
‘పెద్ది’ సినిమా కోసం రామ్చరణ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో రామ్చరణ్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి రామ్చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలోని మరొక లుక్ కోసం రామ్చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అలీం హకీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, రామ్చరణ్ను సరికొత్త లుక్లో ప్రజెంట్ చేయనున్నారు. ‘‘ఈ లుక్లో రామ్చరణ్ స్టైల్, స్వాగ్ వినూత్నంగా, ఆడియన్స్ను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
నారాయణ మూర్తి అందమైన హీరో: బ్రహ్మానందం
‘‘యూనివర్సిటీ పేపర్ లీక్’ సినిమాలో కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగం, అలాగే తండ్రి కోసం కొడుకు చేసిన త్యాగం... ఇలాంటి భావోద్వేగాలను ఒక చోటకు తీసుకొచ్చి, మానవ భావోద్వేగాలతో ఈ సమాజం ఎలా ఆడుకుంటుందో చెప్పే ప్రయత్నం చేశారు నారాయణ మూర్తి’’ అని ప్రముఖ నటుడు బ్రహ్మానందం అన్నారు. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ ఈ నెల 22న విడుదల కానుంది.ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘మీ దృష్టిలో అందమైన హీరో ఎవరు?’ అని ఎవరైనా నన్ను అడిగితే నారాయణ మూర్తి పేరు చెబుతాను. అందం అంటే... గ్లామర్, 6 ఫీట్స్ హైట్, కర్లింగ్ హెయిర్... వంటి అందం కాదు. మదర్ థెరిస్సాని ‘మీకు అందంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరమ్మా?’ అని అడిగితే.. ఎవరి మనస్సులో సేవాభావం, ఎవరి కళ్లల్లో దయా గుణం ఉంటాయో ఆ వ్యక్తి, ఆ జీవి అందంగా ఉంటుంది’ అని చెప్పారు.నలభై ఏళ్లుగా నారాయణ మూర్తి నిరంతరం ప్రజలు, పేదవాళ్ల పక్షాన ఉంటూ సినిమాలు తీస్తున్నారు. ఇవాళ మన దేశం, మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది? అనే అంశాలపై అధ్యయనం చేసి, ‘యూనివర్సిటీ’ తీశారు. డబ్బు కోసం కాకుండా ప్రజల కోసం నిజాయతీగా తీసిన ‘యూనివర్సిటీ’ సినిమాని చూసి, ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీస్తాడు’’ అన్నారు. ‘‘బ్రహ్మానందంగారు మహానటుడు, మహా జ్ఞాని. అన్నింటినీ మించి మాస్టరు. అందుకే నా ‘యూనివర్సిటీ’ లోగోని ఆయనతో ఆవిష్కరింపజేశాను. మా చిత్రాన్ని చూడండి... ఏమాత్రం బాగున్నా ఆదరించి, మరిన్ని సినిమాలు తీసే శక్తిని ప్రసాదించండి’’ అని కోరారు ఆర్. నారాయణ మూర్తి. -
నలభై ఏళ్లకు...
హీరోలు రజనీకాంత్, కమల్హాసన్ కలిసి ఇరవై సినిమాలకు పైగా నటించారు. కానీ ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ (1979) సినిమా తర్వాత రజనీ–కమల్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. తాజాగా వీరిద్దరినీ కలిపి ఓ భారీ సినిమా చేసేందుకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. అయితే లోకేశ్ నెక్ట్స్ సినిమాగా కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కాల్సి ఉంది.ఈ నేపథ్యంలో రజనీ–కమల్ సినిమాని ఎప్పుడు ఆరంభిస్తారనే చర్చ జరుగుతోంది. మరి... నాలుగు దశాబ్దాల తర్వాత రజనీ–కమల్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే... లోకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీకాంత్ ‘కూలీ’, కమల్హాసన్ ‘విక్రమ్’ సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఫరియా అబ్దుల్లా డార్క్ కామెడీ థ్రిల్లర్.. లిరికల్ సాంగ్ రిలీజ్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'గుర్రం పాపిరెడ్డి'. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ఈ మూవీని డార్క్ కామెడీ కథగా దర్శకుడు మురళీ మనోహర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా.. లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ పాడారు. కృష్ణ సౌరభ్ ఈ సాంగ్ను కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమకాు కృష్ణ సౌరభ్ సంగీతమందిస్తున్నారు. -
నాగార్జున వందో సినిమా.. ఆ డైరెక్టర్తోనే ఫిక్స్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. అంతకుముందే కుబేర మూవీతో హిట్ కొట్టిన నాగ్.. కూలీ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.ఈ మూవీ తర్వాత నాగార్జున చేయబోయే ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ సినిమా ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలవనుంది. తన రాబోయే చిత్రం నాగార్జున వందో చిత్రంగా కానుంది. ఈ ప్రత్యేక మూవీకి సంబంధించిన కింగ్ నాగ్ హింట్ ఇచ్చేశాడు. తాజాగా జగపతిబాబు టాక్ షోకు హాజరైన డైరెక్టర్ పేరును కూడా రివీల్ చేశాడు. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.తన వందో సినిమాపై దాదాపు ఆరేడు నెలలుగా వర్క్ జరుగుతోందని టాక్ షోలో నాగార్జున తెలిపారు. ఏడాది క్రితమే డైరెక్టర్ రా కార్తీక్ తనకు కథ చెప్పారని అన్నారు. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది.. కూలీ రిలీజ్ కాగానే మొదలు పెడదామని చెప్పానని తెలిపారు. యాక్షన్తో పాటు ఫ్యామిలీ డ్రామాగా ఉండనుందని కింగ్ నాగార్జున పంచుకున్నారు. ఈ సినిమాలో నేనే లీడ్ రోల్ చేస్తున్నానని వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు కింగ్ 100 నాటౌట్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా.. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఇప్పటికే ఆకాశం, నితమ్ ఓరువానం లాంటి చిత్రాలను తెరకెక్కించారు."#Nagarjuna100 film will be with Ra.Karthik (NithamOruVaanam) who is Tamil Director🤝. It's a very grand film, we are starting this film now, as #Coolie released💥. It's a nice action, Family, Drama film & I'm the protagonist in that😂"- #Nagarjuna pic.twitter.com/Jz0k9EwXQr— AmuthaBharathi (@CinemaWithAB) August 19, 2025 -
బిగ్బాస్ రియాలిటీ షో.. స్పెషల్ గెస్ట్గా స్టార్ హీరోయిన్!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్. ఈ షోకు ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో మరో సీజన్ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరనేది దాదాపు ఖరారు కాగా.. ఈనెల 24 బిగ్బాస్ సీజన్-19 షురూ కానుంది. ఈ ఏడాది కూడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సీజన్లో స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే గెస్ట్గా వస్తారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాను హోస్ట్గా వ్యవహరిస్తోన్న కొత్త రియాలిటీ షో 'పతి పత్నీ ఔర్ పంగా' ప్రమోషన్స్ కోసం బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోనాలి బింద్రే, సల్మాన్ ఖాన్తో 'హమ్ సాత్ సాత్ హై' చిత్రంలో హీరోయిన్గా నటించింది. దాదాపు 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలవనున్నారు. దీంతో సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 1999లో సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ హమ్ సాత్ సాత్ హై చిత్రంలోలో సోనాలి, సల్మాన్ ఖాన్ జంటగా నటించారు. ఈ చిత్రంలో టబు, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, అలోక్ నాథ్, రీమా కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు సల్మాన్ ఖాన్ బిగ్బాస్ రియాలిటీ నాలుగో సీజన్ నుంచి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఆగస్టు 24 నుంచి జియో హాట్స్టార్, కలర్స్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. -
పెళ్లి కూతురిలా శ్రీలీల.. కాజల్ వన్నె తగ్గని అందం
పెళ్లి కూతురిలా ముస్తాబైన శ్రీలీలవన్నె తగ్గని అందంతో మెరిసిపోతున్న కాజల్బ్లాక్ చుడీదార్లో క్యూట్ అండ్ స్వీటుగా శ్రుతి హాసన్వైట్ ఫ్రాక్లో వయ్యారంగా బిగ్బాస్ దివిఅందమైన కుందనపు బొమ్మలా జ్యోతిరాయ్హెబ్బా పటేల్ బ్లాక్ అండ్ వైట్ లుక్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Malavika_Manoj (@malavika_manojj) -
మెగాస్టార్తో అనిల్ రావిపూడి.. టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న చిత్రంపై టాలీవుడ్ ఫ్యాన్స్తో పాటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ కోసం సినీ ప్రియులు ఎప్పుడెప్పుడొస్తుందా అనుకుంటున్నారు. ఈనెలలోనే మెగాస్టార్ బర్త్ డే రానుండడంతో ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాకు టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు.అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ మూవీ టైటిల్ ఈనెల 21 రివీల్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీ ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడి మెగా మూవీ టైటిల్ అప్డేట్ గురించి ప్రశ్నించగా.. నిజమేనని స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ టైటిల్లో సంక్రాంతి అనే పదం లేదని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే 157వ చిత్రంగా నిలవనుంది. -
సడన్ సర్ప్రైజ్.. ఓటీటీలోకి 'వీరమల్లు'
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు'.. థియేటర్లలో ఫ్లాప్ అయింది. సోషల్ మీడియాలో సీన్లపై బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీని సడన్ సర్ప్రైజ్ అన్నట్లు వదిలారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఈ సినిమా రానుంది? ఏంటి సంగతి అనేది ఇప్పుడు చూద్దాం.దాదాపు ఐదేళ్ల పాటు అష్టకష్టాలు పడి థియేటర్లలోకి వచ్చిన సినిమా 'హరిహర వీరమల్లు'. గత నెల 24న థియేటర్లలోకి వచ్చింది. అయితే అప్పుడు కూడా రిలీజ్ అవుతుందా లేదా అనుకున్నారు గానీ ఎలాగోలా విడుదలైంది. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓటీటీలోకి రావడంపై గత కొన్నిరోజులుగా పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.'హరిహర వీరమల్లు' సినిమాని 20వ తేదీ అంటే రేపటి(బుధవారం) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ వదిలారు. మరి థియేటర్లలో వచ్చినప్పుడు అంతలా ట్రోల్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇంకెంత ట్రోల్స్కి గురవుతుందో ఏంటో?'హరిహర వీరమల్లు' విషయానికొస్తే.. 16వ శతాబ్దంలో నదిలో కొట్టుకొచ్చిన ఓ పిల్లాడు ఓ అగ్రహారం వాసులకి దొరుకుతాడు. వాళ్లు ఆ బాలుడికి వీరమల్లు అని పేరు పెడతారు. పెద్దయ్యాక వజ్రాల దొంగ అవుతాడు. మచిలీపట్నంలో తాను చేసిన దొంగతనం గురించి విని దొర (శరత్ ఖేదేకర్).. ఓ వజ్రాల దొంగతనం కోసం తనని పిలిపిస్తాడు. ఆ దొర దగ్గర పంచమి (నిధి అగర్వాల్) ఉంటుంది. ఆమె వీరమల్లు ప్రేమలో పడుతుంది. వీరమల్లు కూడా ఆమెని ఇష్టపడతాడు. దొర చెప్పిన వజ్రాలని దొంగిలించడంతో పాటు పంచమిని తీసుకెళ్లిపోయే క్రమంలో గోల్కండ నవాబుకి వీరమల్లు చిక్కుతాడు. ఆ నవాబు (దలిప్ తాహిల్) వీరమల్లుకి ఓ పని అప్పజెబుతాడు. కొల్లూరులో దొరికి అలా అలా చేతులు మారి ఔరంగజేబు దగ్గరకు చేరిన కోహినూర్ వజ్రాన్ని తీసుకురమ్మని. మరి వీరమల్లు ఆ వజ్రాన్ని తీసుకొచ్చాడా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
'బిగ్బాస్ 9' అగ్నిపరీక్ష ప్రోమో.. నవదీప్కి పెళ్లిచూపులు
ఇప్పటివరకు బిగ్బాస్ తెలుగు షో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. వచ్చే నెల 7 నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి సామాన్యులకు ఎక్కువగా తీసుకునే ఉద్దేశంతో అగ్నిపరీక్ష పేరుతో పోటీ పెడుతున్నారు. రెండు వారాల పాటు సాగనున్న ఈ పోటీలో పలు గేమ్స్ పెట్టి చివరగా ముగ్గురు సామాన్యులని ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలోనే తొలి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్)అగ్నిపరీక్ష షోకి శ్రీముఖి యాంకర్ కాగా.. గత సీజన్లలో పాల్గొన్న అభిజిత్, నవదీప్, బింధుమాధవి జడ్జిలుగా వ్యవహరిస్తారు. మొత్తం 45 మంది సామాన్యులకు పలు పోటలు పెట్టి చివరగా ముగ్గురుని ఎంపిక చేస్తారు. తొలి ఎపిసోడ్ ప్రోమో బట్టి చూస్తుంటే ఇది కూడా ఎంటర్టైనింగ్గానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా యాంకర్, జడ్జిలని చూసేసరికి చాలామంది కాస్త మొహమాటపడుతుంటారు. అగ్నిపరీక్షలో మాత్రం జడ్జిలతో మాట్లాడుతూ, యాంకర్ శ్రీముఖికి కౌంటర్స్ ఇస్తూ సామాన్యులు బాగానే ఫన్నీగా ఉన్నారు. ఈ ప్రోమోలో ఇద్దరమ్మాయిలు, ఓ అబ్బాయి వచ్చాడు. వాళ్లతో శ్రీముఖి-నవదీప్-బింధుమాధవి చేసిన సందడి ప్రోమోలో చూడొచ్చు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 5 వరకు ఈ అగ్నిపరీక్ష గేమ్ షో ఉండనుంది.(ఇదీ చదవండి: సల్మాన్తో అంత ఈజీ కాదు.. డైరెక్టర్ మురుగదాస్) -
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. స్టాలిన్ ట్రైలర్ వచ్చేసింది!
మెగాస్టార్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న చిరంజీవి 70వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ స్టాలిన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.మరోవైపు ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్ వచ్చే అవకాశముంది. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడితోనూ చిరంజీవి జతకట్టారు. పుట్టినరోజు ఈ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.Power. Rage. Madness. 💥#Stalin4K Re Release Trailer OUT NOW 🔥▶️https://t.co/so8S9I4W91#StalinOn22Aug #StalinReRelease pic.twitter.com/LDdBimikIj— Anjana Productions (@Anjana_Prod) August 19, 2025 -
కొత్తగా పెళ్లైన జంటలా రష్మిక-విజయ్.. ఆ వీడియోపై క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్లో లవ్ బర్డ్స్గా పేరున్న జంట రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ. కొన్నేళ్లుగా వీరిద్దరిపై చాలా సార్లు డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. అయినప్పటికీ వీరిద్దరు చాలాసార్లు వేకేషన్స్, ఫెస్టివల్స్లో సందడి చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలతో నెటిజన్లకు ఈజీగా దొరికిపోవటం వీరిద్దరి స్పెషాలిటీ.తాజాగా ఈ జంట ఓకే వేదికపై అఫీషియల్గా మెరిశారు. అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇది చూసిన నెటిజన్స్ మరోసారి క్రేజీ కామెంట్స్ చేశారు.అయితే ఈ పరేడ్కు సంబంధించిన మరో వీడియో నెట్టంట వైరల్గా మారింది. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ షేర్ చేసిన ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మరింత సన్నిహితంగా కనిపించారు. పెన్నుతో విజయ్ దేవరకొండను పిలుస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇది చూసిన ఫ్యాన్స్ వీరిద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్లైన వధూవరుల మాదిరి కనిపిస్తున్నారంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ జంటను కెమిస్ట్రీ న్యూ వెడ్డింగ్ కపుల్ వైబ్ను తలపిస్తోందంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.These two giving off some serious newlywed energy. 😍 The chemistry is unreal ❤️☺️They are giving major newly husband-wife vibes. Just saying.😉❤️#RashmikaMandanna ❤️#VijayDeverakonda ❤️ pic.twitter.com/0WsTeobHDZ— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) August 18, 2025 -
సల్మాన్తో అంత ఈజీ కాదు.. డైరెక్టర్ మురుగదాస్
ఏఆర్ మురుగదాస్.. ఈ పేరు చెప్పగానే గజిని, తుపాకీ, కత్తి లాంటి హిట్ సినిమాలు గుర్తొస్తాయి. తెలుగులో చిరంజీవి, మహేశ్ బాబుతో స్టాలిన్, స్పైడర్ తదితర చిత్రాలు చేసిన అనుభవముంది. అప్పట్లో స్టార్ డైరెక్టర్గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు గానీ గత కొన్నాళ్లలో మాత్రం తీసినవన్నీ ఘోరమైన ఫ్లాప్స్. ఈ ఏడాది బాలీవుడ్లో 'సికిందర్' తీస్తే భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీ వచ్చి చాలా నెలలే అయిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి దాని గురించి మాట్లాడాడు. సల్మాన్ ఖాన్ వల్ల ఆ సినిమా రిజల్ట్ అలా జరిగింది అన్నట్లు మురుగదాస్ పరోక్షంగా చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు కూతురికి తప్పని 'ఫేక్' కష్టాలు)'ఓ స్టార్ హీరోతో సినిమా చేయడం అంత సులభం కాదు. పగలు తీయాల్సిన సన్నివేశాలు ఉంటాయి. కానీ అతడు మాత్రం రాత్రి 8 గంటల తర్వాతే సెట్స్కి వస్తాడు. కాబట్టి మేం రాత్రి మాత్రమే చిత్రీకరణ చేయాల్సి వచ్చేది. మేం తెల్లవారుజామున షూటింగ్ చేయడానికి అలవాటు పడ్డాం కానీ అక్కడ పరిస్థితులు అలా ఉండవు. ఓ సీన్లో నలుగురు పిల్లలుంటే.. వాళ్లు స్కూల్ నుంచి తిరిగొస్తున్న సీన్ తీయాలన్నా సరే వేకువజామున 2 గంటలకు షూటింగ్ చేయాల్సి వచ్చేది. ఆ టైంకి ఆ పిల్లలు నిద్రపోతారు' అని మురుగదాస్ చెప్పుకొచ్చాడు.అలానే 'సికిందర్' షూటింగ్ టైంలో చాలామంది జోక్యం చేసుకోవడం కూడా సినిమా వైఫల్యానికి కారణమని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. గతంలో విజయ్, సూర్య, ఆమిర్ ఖాన్, చిరంజీవి, మహేశ్ బాబు.. ఇలా చాలామంది స్టార్లతో మురుగదాస్ పనిచేశాడు. కానీ ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మరి ఇప్పుడు సల్మాన్ ఖాన్పై మాత్రమే ఎందుకు కామెంట్స్ చేస్తున్నాడా అనేది సస్పెన్స్. మురుగదాస్ తీసిన 'మదరాసి'.. సెప్టెంబరు 5న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై కూడా ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవ్. మరి ఈ మూవీతో హిట్ కొట్టి మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్) -
థగ్ లైఫ్ డిజాస్టర్.. నాన్న మూవీపై శృతిహాసన్ రియాక్షన్!
కోలీవుడ్ భామ శృతి హాసన్ తాజాగా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున అక్కినేని కీలక పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శృతి హాసన్ తన తండ్రి మూవీ థగ్ లైఫ్పై స్పందించింది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడింది.తన తండ్రికి డబ్బు ముఖ్యం కాదని శృతి హాసన్ తెలిపింది. సినిమా సక్సెస్ కావడానికి కేవలం కలెక్షన్ నంబర్స్ ప్రామాణికం కాదని వెల్లడించింది. నేను కూడా ఒక నటిగా ఆ విషయం గురించి ఎప్పుడు ఆలోచించలేదు.. ఇది రూ. 200 కోట్ల సినిమానా, రూ.300 కోట్ల సినిమానా అని తాను కూడా పట్టించుకోనని పేర్కొంది. నాకు చివరి విడత చెల్లింపులు వచ్చాయన్నదే మాత్రమే చూస్తానని తెలిపింది.నాన్న సంపాదించిన డబ్బునంతా సినిమాల్లో పెట్టేందుకు వెనకాడని మనస్తత్వం ఉన్న వ్యక్తి అని శృతిహాసన్ అన్నారు. సినిమాల్లో వచ్చిన డబ్బును ఆయన రెండో ఆస్తిగానో.. లేదంటే మూడో కారు కొనేందుకో ఖర్చు చేయలేదని తెలిపారు. తన తండ్రి డబ్బు అంతా తిరిగి సినిమాల్లోనే పెట్టారని వెల్లడించారు. మీరు ఊహించిన విధంగా బాక్సాఫీస్ నంబర్స్ ఆయనను ఎలాంటి ప్రభావితం చేస్తాయని తాను అనుకోవడం లేదన్నారు.కాగా.. దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు. నాయకన్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానులు సైతం భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రంలో శింబు, త్రిష కృష్ణన్, నాజర్, జోజు జార్జ్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల కంటే తక్కువ వసూళ్లు సాధించి డిజాస్టర్గా మిగిలిపోయింది. -
కాంతార ప్రీక్వెల్.. మరో స్టార్ నటుడు అరంగేట్రం!
కాంతార మూవీతో పాన్ ఇండియావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు ముందు పెద్దగా పరిచయం లేని ఆయన.. ఈ ఒక్క మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్-1 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ మూవీలో కులశేఖర పాత్రలో మెప్పించనున్నారు. దాదాపు ఏడు భాషల్లో గుల్షన్ దేవయ్య పోస్టర్ రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా గుల్షన్ దేవయ్య శాండల్వుడ్ అరంగేట్రం చేయనున్నారు.ఈ చిత్రంలో మరో నటి రుక్మిణి వసంత్ కనకవతి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె రోల్ రివీల్ చేస్తూ పోస్టర్ను విడుదల చేశారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 2న కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
మహేశ్ బాబు కూతురికి తప్పని 'ఫేక్' కష్టాలు
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అన్ని రకాల ఫ్లాట్ఫామ్స్లో కనిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల మంచి ఉన్నట్లే చెడు కూడా బోలెడంత ఉంది. ఫేక్ అకౌంట్ల బాధ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు, వాళ్ల పిల్లలు వీటి బారిన పడుతుంటారు. ఇప్పుడు మహేశ్ బాబు కూతురు సితారకు కూడా అలాంటి అనుభవమే ఎదురైనట్లు ఉంది. దీంతో ఓ పోస్ట్ పెట్టింది. క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్)'నా పేరు మీద పలు ఫేక్ అకౌంట్స్ ఉన్నట్లు దృష్టికి వచ్చింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. నాకు ఇన్స్టాగ్రామ్లో మాత్రమే అకౌంట్ ఉంది. ఇదే నా అఫీషియల్. ఏదైనా చెప్పాలనుకుంటే దీని ద్వారా చెబుతా. వేరే ఏ సోషల్ మీడియాలోనూ నాకు ఖాతా లేదు' అని సితార ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి సితారకు ఈ మధ్య కాలంలో ఫేక్ అకౌంట్స్ వల్ల ఏదైనా సమస్య ఎదురైందేమోనని అనిపిస్తుంది. లేదంటే సడన్గా ఇప్పుడెందుకు ఈ పోస్ట్ పెడుతుంది?సితార విషయానికొస్తే క్లాసికల్ డ్యాన్స్ లాంటివి నేర్చుకుంటుంది. ప్రస్తుతానికైతే టీనేజర్. నటి అవుతానని గతంలో ఓసారి చెప్పింది. మరి ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి? మహేశ్ బాబు విషయానికొస్తే రాజమౌళితో సినిమా చేస్తున్నారు. పదిరోజుల క్రితం మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురుచూశారు కానీ నవంబరులోనే అలాంటివి ఉంటాయని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) -
ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్
మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ పెద్దగా బయట కనిపించడు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉంటాడు. రిలీజ్ టైంలో, అది కూడా సమయం దొరికితేనే ప్రమోషన్లలో పాల్గొంటూ ఉంటాడు. ప్రభాస్ గురించి రూమర్స్ వస్తుంటాయి గానీ అవి నిజమో కాదో అనేది కూడా పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన విషయం మాత్రం వైరల్ అవుతోంది. ప్రభాస్.. తమకు రూ.50 కోట్ల తిరిగొచ్చాడని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతూ వచ్చాయి. 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలకు కలెక్షన్స్తో పాటు కొంతమేర నష్టాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చాడు. 'రాధేశ్యామ్' మూవీకిగానూ ప్రభాస్.. రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని, కానీ సినిమా ఆడకపోయేసరికి రూ.50 కోట్లు నిర్మాతకు ఇచ్చాడని, ఈ మొత్తాన్ని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వమని కోరాడని వైరల్ అవుతున్న వీడియోలో సదరు డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు.(ఇదీ చదవండి: దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?)మరి ఇది ఎప్పటి వీడియోనో తెలియదు గానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాస్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇప్పటి జనరేషన్లో చాలామంది హీరోలు.. పారితోషికం ఎక్కువగానే తీసుకుంటున్నారు గానీ ఫ్లాప్ అయిన నష్టాలొస్తే మాత్రం తిరిగి ఇచ్చేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లతో పోలిస్తే ప్రభాస్ డిఫరెంట్ అని చెప్పొచ్చు.ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. 'రాజాసాబ్' చివరిదశ పనుల్లో ఉంది. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ సంక్రాంతికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు 'ఫౌజీ'(వర్కింగ్ టైటిల్) షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇది వచ్చే వేసవికి రిలీజ్ కావొచ్చని అంటున్నారు. వీటితోపాటు సెప్టెంబరు చివర్లో సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' షూటింగ్లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)-#Prabhas remuneration for #Radheshyam was 100 Cr he returned 50 Cr to the producer to compensate for the loss incurred to the distributors as it underperformed. That's the level of integrity Prabhas holds ❤️ pic.twitter.com/XbrMcU4AR4— Ace in Frame-Prabhas (@pubzudarlingye) August 18, 2025 -
దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్లో దూసుకుపోతున్న రష్మిక.. వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె హిందీలో చేసిన లేటెస్ట్ మూవీ 'థామా'. 'స్త్రీ' యూనివర్స్లో భాగంగా వస్తున్న నాలుగో మూవీ ఇది. ఇంతకుముందు భేడియా, స్త్రీ, ముంజ్య చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు 'థామా' పేరుతో ఈ మూవీలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. తాజాగా టీజర్ని 'వరల్డ్ ఆఫ్ థామా' పేరుతో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)గతంలో రష్మిక చెప్పినట్లు అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ సినిమాగా 'థామా' తీశారు. టీజర్లో రష్మిక.. ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి పాత్రలో కనిపించింది. బోల్డ్గా కనిపిస్తూనే భయపెట్టింది కూడా. ఇందులో రష్మిక, దెయ్యంగానూ యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆదిత్య సర్పోట్దర్ దర్శకుడు. హారర్ స్టోరీ అయినప్పటికీ.. ప్రేమకథని కూడా చూపించబోతున్నారు. ఈ దీపావళికి మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు యంగ్ హీరో.. భార్యకు సీమంతం) -
యానిమే మూవీ 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్' రిలీజ్కి రెడీ
ప్రపంచవ్యాప్తంగా యానిమే చిత్రాలు, సిరీస్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జానర్లో లేటెస్ట్గా రాబోతున్న సినిమా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్'. వచ్చే నెల అంటే సెప్టెంబరు 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ సమ్మె.. ‘మెగా’ ప్రయత్నం ఫలించేనా?)కథ విషయానికి వస్తే.. టాంజిరో కామాడో అనే పిల్లోడి ఫ్యామిలీని ఓ రాక్షసుడు చంపేస్తాడు. అతని చెల్లెలు నెజుకో రాక్షసిగా మారుతుంది. ఆమెను మళ్లీ మాములు మనిషిలా తిరిగి మార్చాలనే సంకల్పంతో టాంజిరో డీమన్ స్లేయర్ కార్ప్స్లో చేరతాడు. ఈ సిరీస్, మనుషులు, రాక్షసుల మధ్య జరిగే విషాదగాథ, కత్తి యుద్ధాలు, ఆకట్టుకునే కారక్టర్స్, కామెడీ సీన్స్తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని జపాన్ మరియు కొన్ని ఆసియా దేశాల్లో తప్ప ప్రపంచవ్యాప్తంగా క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్లు రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: నందమూరి కుటుంబంలో విషాదం) -
ఒక తల్లిగా ఆందోళనగా ఉంది.. ఐశ్వర్య రాయ్ వ్యాఖ్యలపై ప్రశంసలు
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ కోసం చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో సోషల్ మీడియా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు యూత్ను ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈమేరకు ఆమెపై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుర్తింపు కోసం సోషల్మీడియా మాయ ప్రపంచంలో చిక్కుకుంటున్నారని.. ఈ అంశం తనకు ఎక్కువ ఆందోళన కలిగిస్తుందంటూ ఐశ్వర్య వ్యాఖ్యలు చేశారు.సోషల్మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్ మన జీవితాలను నిర్ణయించలేవని ఐశ్వర్య రాయ్ చెప్పుకొచ్చారు. 'నేటి సమాజంలో మన విలువను ఎవరూ నిర్ణయించలేరు. చాలామంది సోషల్మీడియా ట్రాప్లో పడుతున్నారు. వారు చేసే పోస్ట్లకు వచ్చే లైక్స్, కామెంట్లు, షేర్లు చూసుకొని సంబరపడుతుంటారు. వాటిలో ఎవీ కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రపంచానికి చూపలేవు. కానీ, నువ్వు నీలా ఉంటే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. మీకు కావాల్సిన ఆత్మగౌరవం కోసం ఇంటర్నెట్లో వెతకొద్దు. ఒక్కసారి దానిని దాటి ముందుకు రండి మీకు దక్కాల్సిన గౌరవం తప్పకుండా దొరుకుతుంది. సోషల్మీడియా అంశంపై ఒక మహిళగా, తల్లిగా నాకు ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు.. దయచేసి అందులో నుంచి బయటపడండి.' అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు. దీంతో ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి యూత్కు కావాల్సిన మెసేజ్ను అందించారని కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలో సగం మంది ఆమె చెప్పేది అర్థం చేసుకుంటే బాగుండు అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఈ యుగంలో చాలా అవసరమైన సందేశాన్ని అందించారంటూ చాలామంది ఆమెను ప్రశంసించారు. -
నందమూరి కుటుంబంలో విషాదం
నందమూరి ఇంట విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె ఈ తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన చెల్లెలు ఆపై హీరో నందమూరి చైతన్య కృష్ణకు తల్లి అని తెలిసిందే.సుమారు రెండేళ్ల క్రితం చైతన్యకృష్ణ హీరోగా బ్రీత్ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తన తండ్రి జయకృష్ణ నిర్మిచారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. కేవలం రూ. 5 లక్షలు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. -
భారీగా రోడ్డెక్కిన సినీ కార్మికులు.. స్తంభించిన టాలీవుడ్
టాలీవుడ్ సినీ కార్మికులు 16వ రోజు కూడా సమ్మెలో పాల్గొన్నారు. తమ వేతనాలు పెంచాలంటూ ఇందిరానగర్లో పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. సినీ కార్మికుల ఐక్యవేదిక పేరుతో 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన కార్మికులు నిరసనకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తమ వేతనాల పెంపు అంశాన్ని ఫెడరేషన్ నాయకులు చిరంజీవికి వివరించారు. ఈరోజు సాయింత్రం జరిగే ఫిలిం ఛాంబర్, కార్మికుల ఫెడరేషన్ చర్చలతో సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 16వ రోజు సమ్మెతో టాలీవుడ్ ఇప్పటికే స్తంభించింది. షూటింగ్స్ లేక సగటు కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమావేశం అనంతరం నేడు మరోసారి ఫెడరేషన్ నాయకులతో పాటు నిర్మాతలు కూడా చిరంజీవిని కలవనున్నారు. నిర్మాతలు పెట్టిన మొత్తం నాలుగు కండిషన్స్లలో రెండు కండిషన్స్ దగ్గర మాత్రమే పేచీ ఏర్పడింది. కార్మికులకు ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్.. ఆపై రెండో ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజుల్లో మాత్రమే డబుల్ పేమెంట్ వంటి అంశాలను కార్మిక సంఘాలు వ్యతిరేఖిస్తున్నాయి. -
భార్యతో ఉంటూనే మరో మహిళతో బిడ్డను కన్నాడు.. నటుడిపై సంచలన ఆరోపణ
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్పై తన సోదరుడు ఫైసల్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిరోజులుగా ఆమిర్పై ఆయన పలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 1990 నాటి సంఘటనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఫైసల్ ఖాన్ చేసిన కామెంట్లు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రిటిష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్ అనే అమ్మాయితో ఆమిర్ రిలేషన్ షిప్ ఉన్నాడని ఫైసల్ అన్నారు. వారిద్దరికి జన్మించిన ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి భార్య రీనాతో కలిసి ఉన్నప్పుడే జెస్సికాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆమిర్పై సంచలన ఆరోపణ చేశారు. రీనాతో విడాకులు తీసుకున్న ఆమిర్.. ఎక్కువగా జెస్సికాతోనే ఉండేవాడన్నారు. అయితే, వారిద్దరూ పెళ్లి చేసుకోలేదని కేవలం లివింగ్ రిలేషన్లో ఉన్నారని చెప్పారు. అయితే, కొంతకాలం తర్వాత కిరణ్ రావును ఆమిర్ పెళ్లి చేసుకున్నాడని అప్పటికీ కూడా జెస్సికాతో టచ్లో ఉండేవాడని చెప్పుకొచ్చారు.1990లలో, ఆమిర్ ఖాన్, జెస్సికా హైన్స్ కలిసి ఉన్నారని, వారి మధ్య వ్యక్తిగత సంబంధం ఉందని కొన్ని మీడియా కథనాలు చాలారోజుల క్రితమే పేర్కొన్నాయి. జెస్సికా హైన్స్కు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు జాన్ (Jaan) అని ఆ కథనాలు తెలిపాయి. కానీ, ఆమిర్ ఖాన్ ఈ విషయాన్ని ఎక్కడా కూడా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, జెస్సికా మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని పరోక్షంగా సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె కూడా స్పష్టంగా ఈ రిలేషన్ గురించి ఏమీ చెప్పలేదు. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) -
మిస్ యూనివర్స్ ఇండియాగా రాజస్థాన్ బ్యూటీ
మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు. గత ఏడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటం అలంకరించారు. తాజాగా జైపుర్ వేదికగా జరిగిన ఈ పోటీలో ఆమె గెలుపొందారు. ఈ ఏడాదిలో థాయ్లాండ్లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మణిక విశ్వకర్మ బరిలొకి దిగనున్నారు. భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఆమె పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమె NCC క్యాడెట్ కూడా.. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి ADHD వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తున్నారు. మణిక విశ్వకర్మ అందం, ప్రతిభ, సేవా భావనతో మిస్ యూనివర్స్ వేదికపై భారత్కు గర్వకారణంగా నిలవనున్నారు. -
స్టార్ హీరో సినిమా.. ఆసుపత్రి పాలైన 100 మంది
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) నటిస్తున్న చిత్రం 'ధురంధర్'.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లడఖ్ ప్రాంతంలో జరుగుతుంది. అయితే, తాజాగా ఈ చిత్ర యూనిట్ నుంచి సుమారు 100 మందకి పైగా ఆసుపత్రిపాలయ్యారు. వారందరూ లేహ్లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.లడఖ్లోని లేహ్ జిల్లాలో కొద్దిరోజులుగా ధురంధర్ సినిమా షూటింగ్ జరుగుతుంది. సెట్స్లో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. అకస్మాత్తుగా సెట్లోని చాలా మందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వచ్చింది. వారిని లేహ్లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స అందించిన వైద్యులు ఇది సామూహిక ఫుడ్ పాయిజనింగ్ కేసుగా గుర్తించారు. సినిమా సెట్స్లో దాదాపు 600 మంది భోజనం చేశారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే, కొందరు మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారిస్తున్నారు.దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ‘ధురంధర్’ సినిమాలో రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇదే ఏడాది డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ ఫోటోలు నాకు మంచి జ్ఞాపకాలు: శ్రీదేవి విజయ్కుమార్
‘‘సుందరకాండ’ మంచి వినోదాత్మక చిత్రం. కథ వినగానే షాక్ అయ్యాను. ఈ చిత్రంలో నేను చాలా మంచి బలమైనపాత్ర చేశాను. అందరూ థియేటర్స్కి వెళ్లిచూడొచ్చు’’ అని హీరోయిన్ శ్రీదేవి విజయ్కుమార్ తెలిపారు. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా నటించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీదేవి విజయ్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై నన్ను నేను చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకుని, ఓపాపకి జన్మనిచ్చాను. ఆ తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పుడు నా కుమర్తె స్కూల్కు వెళుతోంది. సో.. నేను మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాను.ఈ సినిమాలో నేను స్కూల్ డ్రెస్లో కనిపించే సన్నివేశం ఉంది. ఈ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. డైట్ ఫాలో అయ్యాను. నా కుమార్తె, నేను స్కూల్ డ్రెస్లో ఉన్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి.. ఇవి నాకు మంచి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ప్రభాస్గారి తొలి సినిమా ‘ఈశ్వర్’లో నేను హీరోయిన్ గా చేశాను.. తను పెద్ద స్టార్ అవుతాడని మేం అప్పుడే ఊహించాం.. మేం ఊహించినదాని కన్నా పెద్ద స్టార్ అయ్యారు’’ అని చెప్పారు. -
దీపావళికి థామా
‘థామా’లో తడ్కాపాత్రలో తన తడాఖా చూపిస్తానంటున్నారు రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హారర్, మిస్టరీ అండ్ లవ్స్టోరీ మూవీ ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ ‘థామా’ ఈ దీపావళికి రిలీజ్ కానుంది.కాగా అతీంద్రియ శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలోని ప్రధానపాత్రధారుల ఫస్ట్లుక్స్తోపాటుగా, ఈ సినిమాలోని వారిపాత్రల పేర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా, యాక్షసాన్ గా నవాజుద్దీన్ , రామ్ బజాజ్ గోయెల్గా పరేశ్ రావల్ నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కాగా ‘థామా’కి చెందిన తాజా వీడియో ‘థామా వరల్డ్’ పేరుతో నేడు విడుదలవుతోంది. -
తెలుగు యంగ్ హీరోపై కేసు పెట్టిన భార్య
తెలుగులో రెండు సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేశ్పై పోలీస్ కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం తనని వేధిస్తున్నాడని ఇతడి భార్యనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం)సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేశ్.. 2019లో గౌతమి అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ బాబు కూడా ఉన్నాడు. గతంలో ఓసారి ఇతడిపై వరకట్న వేధింపుల ఆరోపణలు రావడంతో.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి భార్యని ఇదే విషయమై వేధింపులకు గురిచేస్తుండటంతో వ్యవహారం కేసుల వరకు వెళ్లింది.సినిమా ఛాన్సులు పెరగడంతో తన భర్త జల్సాలకు అలవాటు పడ్డాడని, ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఇతడి భార్య.. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపైన ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకటి రెండు చిత్రాలతో కాస్తోకూస్తో గుర్తింపు తెచ్చుకుంటున్న క్రమంలో ఇలా పోలీసు కేసుల వరకు వెళ్లడం హాట్ టాపిక్గా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
ఆ టాపిక్ తీయకండి.. నేను మీ టాపిక్ తీస్తా: శ్రీలీల
ఈ మధ్య కాలంలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రీలీల. యాక్టింగ్ పరంగా ఈమెకు ఓ మాదిరి మార్కులు పడతాయి గానీ డ్యాన్సుల్లో మాత్రం ఇరగదీసేస్తోంది. కొన్నిరోజుల క్రితం తెగ హల్చల్ చేసిన 'వైరల్ వయ్యారి' పాటలోనూ శ్రీలీల మాస్ స్టెప్పులతో ఊపుఊపేసిందని చెప్పొచ్చు. అలాంటి ఈమె.. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న టాక్ షోలో పాల్గొంది. ఆసక్తికర సంగతుల్ని కొన్ని బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగానే రిలీజైంది.'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ఈ షో.. గత వారమే లాంచ్ అయింది. తొలి ఎపిసోడ్ గెస్ట్గా హీరో నాగార్జున వచ్చారు. తన వ్యక్తిగత విషయాలు బోలెడన్ని పంచుకున్నారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్ కోసం యంగ్ సెన్సేషన్ శ్రీలీలని తీసుకొచ్చారు. ఆ ప్రోమోనే ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం)శ్రీలీలని షోకి ఆహ్వానించిన జగపతిబాబు.. 'మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం. నువ్వు యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావ్' అని అన్నారు. దీంతో గతుక్కుమన్న శ్రీలీల.. సార్ తిట్టారా పొడిగారా అంటూ అమాయకంగా ఫేస్ పెట్టింది. 'గుంటూరు కారం' చేసేటప్పుడు లెఫ్ట్లోనో రైట్లోనో నీ ఫేస్ కొంచెం తేడా ఉండేది అని జగపతిబాబు అనగా.. 'ఆ టాపిక్ తీస్తే నేను మీ టాపిక్ తీసుకొస్తా సర్' అని శ్రీలీల చెప్పింది. 'మీ హీరోయిన్ గారు.. మీరు..' అంటూ వేలు చూపిస్తూ నవ్వేసింది.'ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేశావ్' అని శ్రీలీలని ఉద్దేశించి జగపతిబాబు అనగానే.. 'దూల తీరిపోతుంది సార్' అంటూ శ్రీలీల తన బాధని నవ్వుతూనే బయటపెట్టింది. 'నీ మీద ఓ కంప్లైంట్ ఉందమ్మా' అంటూ జగ్గూ భాయ్ అనగానే.. శ్రీలీల తల్లి వెనక నుంచి ఈమెని సర్ప్రైజ్ చేసింది. 'మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్ సార్' అని శ్రీలీల చెప్పగానే.. జగపతిబాబు అలా చూశాడు. శ్రీలీల ముసిముసిగా నవ్వింది. దీంతో 'నువ్వెందుకు అంతగా సిగ్గు పడుతున్నావ్' అని జగపతిబాబు అనేసరికి అందరూ నవ్వేశారు. ఈ శుక్రవారం ఓటీటీలో ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం
మరో తెలుగు హీరో తండ్రి కాబోతున్నాడు. అయితే అతడు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. 'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్.. ఈ శుభకార్యానికి వెళ్లింది. కాబోయే తల్లిదండ్రులకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. అలా ఈ గుడ్ న్యూస్ అందరికీ తెలిసింది. దీంతో సదరు హీరోకి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, మసూద, పరేషాన్, మోక్షపటం సినిమాలు చేశాడు. పర్లేదనిపించేలా గుర్తింపు తెచ్చుకున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఇప్పుడు తిరువీర్ భార్య కల్పన ప్రెగ్నెన్సీతో ఉంది. సోమవారం నాడు సీమంతం వేడుక చేశారు. ఈ ఫొటోలని కావ్య కల్యాణ్ రామ్ షేర్ చేసింది. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?) -
సిజ్లింగ్ దిశా పటానీ.. రెడ్ డ్రస్సులో 'దృశ్యం' పాప
రెడ్ హాట్ మిర్చిలా మారిపోయిన దిశా పటానీచీరలో మరింత అందంగా అమలాపాల్పరమ్ సుందరి ప్రమోషన్లలో జాన్వీ బిజీ బిజీరెడ్ డ్రస్సులో వయ్యారంగా దృశ్యం పాప ఎస్తర్మెల్బోర్న్లో ఫారిన్ బ్యూటీలా అదితీ రావు హైదరీకీర్తి సురేశ్ జూలై జ్ఞాపకాలు.. భలే ఫన్నీబీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న ఇవానా View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) -
రెమ్యునరేషన్ లేకుండానే స్టార్ హీరో కొత్త సినిమా!
తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. దళపతి విజయ్, రజినీకాంత్, సూర్య లాంటి వాళ్లతో పోలిస్తే ఇతడి మార్కెట్ చాలావరకు తమిళానికే పరిమితం. అయినా సరే వరస సినిమాలు చేస్తూ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే అజిత్ నటించిన రెండు చిత్రాలు రిలీజ్ కాగా.. అవి రెండు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. ఇప్పుడు ఓ కొత్త మూవీని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)తనతో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లాంటి క్రేజీ సినిమా తీసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్తోనే.. అజిత్ తన కొత్త మూవీ చేయబోతున్నాడు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఇందులో 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ అని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం తొలుత ఓ నిర్మాణ సంస్థ ముందుకు రాగా.. అజిత్ రూ.200 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేశారని టాక్. దీంతో సదరు సంస్థ స్వచ్ఛందంగా తప్పుకొందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే అజిత్ నటించిన పలు సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన రాహుల్ అనే వ్యక్తి.. ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చాడని సమాచారం. అయితే రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఓ డీల్ మాట్లాడుకున్నాడని తెలుస్తోంది. రెగ్యులర్గా ఇచ్చే పారితోషికం బదులు ఓటీటీ, శాటిలైట్ హక్కుల్ని హీరో అజిత్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్. ఇవన్నీ కూడా రీసెంట్గా ఫైనల్ అయ్యాయని.. 'AK64' పేరుతో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?) -
నాన్న చివరి కోరిక నెరవేర్చిన నాగార్జున.. అదేంటంటే?
టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) తాజాగా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.151 కోట్లు రాబట్టిన కూలీ.. కోలీవుడ్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.అయితే తాజాగా ఓ టాక్ షోకు హాజరైన నాగార్జున పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాన్న అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో అడిగిన కోరికను నెరవేర్చారు. మనం సినిమాలో తన పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించవద్దని అడిగారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. అలా చేస్తే అస్సలు ఊరుకోను అన్నారని వెల్లడించారు. ఆయన కోరిక మేరకే బెడ్ మీద నుంచే డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారని తెలిపారు. నా జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేదని.. కానీ మనం సినిమా గురించి రాత్రిళ్లు నిద్రలేకుండా ఆలోచించేవాడినని నాగార్జున పేర్కొన్నారు. అప్పటికే ఆయనకు సినిమా చూపిస్తే.. చాలా బాగుందిరా అని అన్నారని నాగ్ పంచుకున్నారు.నాగార్జున మాట్లాడుతూ..'మనం సినిమా మాకు చాలా స్పెషల్. ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్రేమ్లో కనిపించాం. ఇది నాన్నగారి చివరి చిత్రమని మాకు షూటింగ్లోనే తెలిసిపోయింది. ఆయనకు క్యాన్సర్ రావడంతో అదే చివరి సినిమా అని మా అందరికీ తెలుసు. నాకు లైఫ్లో ఎలాంటి ఒత్తిడి లేదు.. కానీ రాత్రిళ్లు నిద్రపోకుండా ఆలోచించింది మాత్రం ఈ ఒక్క సినిమానే. డబ్బింగ్ వేరేవాళ్లతో చెప్పిస్తే ఊరుకోను.. నేనే చెప్తా అన్నారు. ఇంట్లో ఏర్పాటు చేసిన ఐసీయూ బెడ్ మీద నుంచే సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆయన పాత్రకు తన సొంత వాయిస్తోనే డబ్బింగ్ చెప్పుకున్నారు. అప్పటికే నాన్నకు సినిమా చూపిస్తే చాలా బాగుందిరా అన్నారని' గుర్తు చేసుకున్నారు. -
అవును.. నాకు ముడతలు ఉన్నాయి: టాలీవుడ్ హీరోయిన్
సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే అనర్థాలు కూడా ఉన్నాయి. చాలామంది అదేపనిగా నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. సెలబ్రిటీలు వీటి బారిన ఎక్కువగా పడుతుంటారు. కొందరు వీటిని లైట్ తీసుకుంటే మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తుంటారు. ఇప్పుడు అలానే 'మన్మథుడు' హీరోయిన్ కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్లకు అదిరిపోయే రిప్లై ఇచ్చింది.'ఇద్దరు పిల్లల తల్లివి, కాస్త పద్ధతిగా ప్రవర్తించు.. 20 ఏళ్ల పిల్లవేం కాదు నువ్వు.. సర్జరీ చేసుకోకముందే బాగుండేదానివి, ఇప్పుడు బక్కపలుచగా ఉన్నావ్. ఇలాంటి కామెంట్స్ పెట్టే బదులు వేరే ఏదైనా పని చూసుకోండి. ఎందుకంటే వీటి వల్ల మీరు ఎలాంటి వాళ్లో అర్ధమవుతోంది. అవును నాకు ముడతలు ఉన్నాయి. ఇప్పటివరకు సర్జరీలు చేసుకోలేదు. ఫిల్లర్స్ కూడా పెట్టించుకోలేదు. బొద్దుగా ఉన్నప్పుడు నాకే ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు ఓకే కదా? జీవితంలో ఏం చేయడానికైనా టైమ్ అంటూ లేదు. కలలు కనండి. మీకు సంతోషాన్ని కలిగించే పని మాత్రమే చేయండి' అని అన్షు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)యూకేలో పుట్టి పెరిగిన అన్షు.. 15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చింది. నాగార్జున 'మన్మథుడు' సినిమాతో పరిచయమైంది. తొలి మూవీతో హిట్ కొట్టింది. కానీ తర్వాత చేసిన రాఘవేంద్ర, మిస్సమ్మ చిత్రాలు ఫెయిలవడంతో తిరిగి యూకే వెళ్లిపోయింది. సైకాలజీలో మాస్టర్స్ చేసి సొంతంగా క్లినిక్ పెట్టుకుంది. 2011లో 24 ఏళ్ల వయసులోనే సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే చాన్నాళ్ల తర్వాత తెలుగులో 'మజాకా' మూవీతో అన్షు రీఎంట్రీ ఇచ్చింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్షు రీఎంట్రీ సినిమా రిలీజ్ కాగా హిట్ కాలేదు. దీంతో ఈమె తిరిగి యూకే వెళ్లిపోయింది. అయితే గత కొన్నిరోజులుగా తన ఇన్ స్టా పోస్టుల్లో వస్తున్న నెగిటివ్ కామెంట్స్పై ఇప్పుడు సెటైరికల్గా స్పందిస్తూ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
అఫీషియల్ ప్రకటన.. ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు, సిరీస్లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ జోనర్లో వచ్చే సిరీస్లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు, సిరీస్లు చాలా వరకు సూపర్ హిట్గా నిలిచాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.రాఖ్ (Raakh) పేరుతో ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ను ప్రొసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ను రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్లో సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ నిర్మిస్తున్నారు. JUSTICE will rise from the ashes 🔥#RaakhOnPrime, New Original Series, Coming 2026#AliFazal #SonaliBendre @prosit_roy @EndemolShineIND @anusha_nkumar #AyushTrivedi #AamirBashir @sandeepsaket83 @deepak30000 @NegiR @sunandagj @BhaDiPa pic.twitter.com/mLulmaXj8X— prime video IN (@PrimeVideoIN) August 18, 2025 -
పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?
ఈ ఏడాది తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి వాటిలో హీరో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ ఒకటి. మార్చిలో రిలీజైన ఈ చిత్రం.. హిట్ టాక్తో పాటు అద్భుతమైన కలెక్షన్ కూడా అందుకుంది. ఈ చిత్రంతో వైజాగ్ కుర్రాడు రామ్ జగదీశ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మూవీ వచ్చిన ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.(ఇదీ చదవండి: సింగర్ 'రాహుల్ సిప్లిగంజ్' నిశ్చితార్థం)దర్శకుడు రామ్ జగదీశ్ పెళ్లి వైజాగ్లో ఆదివారం రాత్రి జరిగింది. కార్తీక అనే అమ్మాయిని వివాహమాడాడు. ఈ వేడుకకు 'కోర్ట్' మూవీ యాక్టర్స్ రోషన్, శ్రీదేవి, శివాజీతో పాటు నిర్మాత ప్రశాంతి కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.రామ్ జగదీశ్ పెళ్లి.. పెద్దల కుదిర్చినట్లు తెలుస్తోంది. కార్తీక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే కాదు. ప్రస్తుతానికైతే ఆమె పేరు మాత్రమే బయటకొచ్చింది. ఇకపోతే రామ్ జగదీశ్ తన తర్వాతి సినిమాని కూడా నాని నిర్మాణంలో తీయబోతున్నాడనే టాక్ కొన్నిరోజుల క్రితం వచ్చింది. ఈసారి మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ మూవీ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) View this post on Instagram A post shared by Neeha (@cinema_ammayi) -
రజినీకాంత్ కూలీ.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కావడంతో తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో కోలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది. కూలీ విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.410 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా పోస్ట్ చేశారు. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొలి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది.మరోవైపు దేశవ్యాప్తంగా కూలీ మూవీ దూసుకెళ్తోంది. ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.194.25 కోట్లు నికర వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన కూలీ.. రెండు వందల కోట్ల మార్క్ దిశగా ప్రయాణిస్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్ల నికర వసూళ్ల మార్క్ చేరుకోనుంది. ఈ చిత్రంలో నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్, సత్యరాజ్, చార్లీ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.ఇండియాలో నెట్ కలెక్షన్స్..1వ రోజు: రూ.65 కోట్లు2వ రోజు: రూ.54.75 కోట్లు3వ రోజు: రూ.39.5 కోట్లు4వ రోజు: రూ.35 కోట్లుమొత్తం: రూ.194.25 కోట్లు #Coolie 's 1st extended weekend WW gross will be around 410 Crs.. This is All-time No.1 opening for a Kollywood movie.. 🔥 #SuperstarRajinikanth pic.twitter.com/qBlhtFQZR3— Ramesh Bala (@rameshlaus) August 18, 2025 -
'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అరెస్ట్.. పోలీస్ స్టేషన్కు ముజీబ్
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి వారసుడిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోఘ ఆ పార్టీపై కూడా తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఇప్పటికే అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. అయితే, నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులను పలుచోట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్లపైకి వచ్చి ఎలాంటి విధ్వంసం చేయరాదని హెచ్చరించారు. దీనిని ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. మా అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టి మా మీదే కేసులు పెడుతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే మదనపల్లిలోని ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. అభిమానులు రాష్ట్రం మొత్తం ఎక్కడ ధర్నాలు, ర్యాలీలు ప్రెస్మీట్లు పెట్టకూడదని వారు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లను పోలీస్స్టేషన్ వద్దకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదోనిలోని పోలీస్స్టేషన్కు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏపీ కన్వీనర్ ముజీబ్ అహ్మద్ కూడా వెళ్లారు. కుప్పంలో కూడా పోలీసుల ఒత్తిడి వల్ల ధర్నాలు, ర్యాలీలను ఎన్టీఆర్ అభిమానులు క్యాన్సిల్ చేసుకున్నారు. తప్పు చేసిన వాళ్లను వదిలేసి కేవలం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒక తల్లి గురించి నోటికొచ్చిన మాటలు మాట్లాడిన వారి మీద కేసులు పెట్టరా..? అంటూ ఫైర్ అవుతున్నారు.తారక్ గురించి నీచంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేఒక ఫోన్ కాల్లో ఎన్టీఆర్ గురించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇలా మాట్లాడారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డా ఫకీర్.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. -
'మా సినిమాకు ఏ అవార్డులు వద్దు.. ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్'
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా ఓ మాల్లో నిర్వహించిన మూవీ ప్రమోషన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడియన్స్ను ఉద్దేశించి ఎమోషనల్గా మాట్లాడారు.మా సినిమా అవార్డులు అక్కర్లేదని.. డబ్బులు వస్తే చాలని అన్నారు. మలయాళ సినిమాలు ఇక్కడ హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ కావాలన్నారు. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయాలని డైరెక్టర్ ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. మీరు ట్వీట్ చేస్తే కనీసం కొంతమంది ప్రేక్షకులైనా మా మూవీ చూస్తారని దర్శకుడు అన్నారు.ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ..'ప్రతి కథ హీరో చుట్టే తిరగాలని లేదు. అనుపమ కూడా పెద్ద స్టార్. నా సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. మా సినిమాకు అవార్డులు వద్దు. డబ్బులు కావాలి. కచ్చితంగా ఈ చిత్రంపై నాకు నమ్మకముంది. ఇక్కడ లేడీ ఓరియంటెడ్ కాదు.. మెన్ ఓరియంటెండ్ కాదు.. ఇది కేవలం సినిమా అంతే. మన దగ్గర మలయాళ చిత్రాలు హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమాలు అక్కడ బ్లాక్బస్టర్ కొట్టాలి. అందుకే మలయాళ నటులను పెట్టాను. సినిమా బాగుంటేనే చూడండి. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్. మీవల్ల ఎంతోమంది మా చిత్రం చూస్తారు.' అని ఆడియన్స్ను కోరారు. కాగా.. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
LCU లోకి సమంత అడుగు పెట్టనుందా..?
-
'ప్రతి రోజు చెబుతా'.. ట్రోలర్స్కు జాన్వీకపూర్ స్ట్రాంగ్ కౌంటర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఇక సినిమా సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరైంది. ఈ సందర్భంగా ఉట్టికొట్టే సమయంలో భారత్ మాతా కీ జై అంటూ నినాదం చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఇదేమీ ఇండిపెండెన్స్ డే కాదంటూ జాన్వీని ట్రోల్ చేశారు.తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్కు జాన్వీ కపూర్ స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అక్కడ ఉన్నవారంతా నాకంటే ముందు భారత్ మాతాకీ జై అని అన్నారని తెలిపింది. ఆ తర్వాత నేను కూడా చెప్పానని.. వారి వీడియోను కట్ చేసి నా మాటలను మాత్రమే వైరల్ చేస్తున్నారని ట్రోలర్స్కు కౌంటరిచ్చింది. నా దేశాన్ని పొగిడేందుకు ప్రత్యేకంగా రోజంటూ లేదని రాసుకొచ్చింది. శ్రీ కృష్ణా జన్మాష్టమి నాడు మాత్రమే కాదు.. ప్రతిరోజూ భారత్ మాతాకీ జై అని చెబుతా అని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో మరాఠీలో మాట్లాడిన జాన్వీ కపూర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రంలో కేరళ అమ్మాయిగా జాన్వీ కనిపించనుంది. ఢిల్లీ అబ్బాయితో ప్రేమలో పడిన మలయాళీ అమ్మాయి కథగా పరమ్ సుందరిని తెరకెక్కించారు.. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా కూడా కీలక పాత్రలు పోషించారు. -
ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన
సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తర్వాత ఎక్కువగా వినిపించే మాట రెమ్యునరేషన్. హీరోకు ఎన్ని కోట్లు, హీరోయిన్కు ఎంత అనే చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక్క సినిమాకు డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో స్టార్ హీరోలైతే కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటున్నారు. కొందరు డైరెక్టర్స్ సైతం హీరో రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇంత భారీ మొత్తంలో కోట్ల రూపాయలు తీసుకుంటున్న సినీ ఇండస్ట్రీలో సింగర్స్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెబుతోంది ప్రముఖ గాయని కనికా కపూర్. ఇండియాలో కొంతమంది సింగర్స్కు కనీస పారితోషికం కూడా దక్కడం లేదని అన్నారు.బేబీ డాల్, చిట్టియాన్ కలైయాన్ లాంటి హిట్ సాంగ్స్తో ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ సింగర్ కనికా కపూర్. ఇండియాలో సింగర్స్ రెమ్యునరేషన్పై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్న ఆమె బాలీవుడ్లో సింగర్స్ ఎందుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి మాట్లాడింది. తనకు సరైన పారితోషికం లభించడం లేదని తెలిపింది. నాతో పాటు స్టార్ హోదా గాయకుల పరిస్థితి కూడా ఇదేనన్నారు. సింగర్స్ లైవ్ కన్సర్ట్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించే అవకాశముందని వెల్లడించారు.కనికా కపూర్ మాట్లాడుతూ.. " బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్స్కు తగిన పారితోషికం లభించదు. నాకు ఓ కాంట్రాక్ట్లో కేవలం రూ. 101 చెల్లించారు. అది కూడా ఈ డబ్బులతో మీకు సాయం చేస్తున్నామని నాతో గొప్పగా చెప్పారు. కేవలం నాకే కాదు.. స్టార్ హోదా ఉన్నవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భారతదేశంలో పెద్ద సింగర్ తన ఐకానిక్ పాటలకు చాలా వరకు డబ్బు పొందుతాడని నేను అనుకోవడం లేదు. సింగర్స్కు లైవ్ కన్సర్ట్స్ మాత్రమే డబ్బు సంపాదించే ఏకైక మార్గం. మీరు ప్రదర్శన ఇవ్వగలిగినంత వరకు సంపాదిస్తూనే ఉంటారు. అలాగే మాకు ఏదైనా జరిగితే పెన్షన్ పథకం కూడా లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.కాగా.. కనికా కపూర్ 'రాగిణి ఎంఎంఎస్- 2'లోని 'బేబీ డాల్'పాటతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సాంగ్తో ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. ఆ తర్వాత లవ్లీ 'హ్యాపీ న్యూ ఇయర్', దేశీ లుక్ 'ఏక్ పహేలి లీలా', బీట్ పె బూటీ 'ఎ ఫ్లయింగ్ జాట్' వంటి వరుస హిట్ సాంగ్స్తో బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇటీవల బాలీవుడ్లో 'మేరే హస్బెండ్ కి బివి' చిత్రంలోని 'గోరీ హై కలైయాన్' పాటను పాడారు. -
నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా ఇదే: అనుపమ ఎమోషనల్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా నిర్వహించిన పరదా ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా ఇదేనని అన్నారు.అనుమప పరమేశ్వరన్ మాట్లాడుతూ.. 'నేను ఈ సినిమా ఈవెంట్లో ఫస్ట్ ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా పరదానే. ఆగస్టు 22న మీరు కూడా ఇదే మాట చెబుతారని నాకు నమ్మకముంది. అందరూ చెప్పినట్లు మీరు సినిమా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కు కూడా చెప్పండి. రివ్యూస్ చూసే పరదా మూవీకి వెళ్లండి' అని మాట్లాడారు.కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన పరదా ఈవెంట్లో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పూర్తి చేసిన సినిమా పరదా. దయచేసి ఈ సినిమాకు సపోర్ట్ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
'హే భగవాన్' అంటూ నవ్విస్తున్న సుహాస్
ఉప్పు కప్పురంబు, ఓ భామ అయ్యో రామ వంటి చిత్రాల తర్వాత సుహాస్ మరో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాడు. 'హే భగవాన్' అంటూ తను నటిస్తున్న కొత్త సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపి తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్గా శివానీ నగరం నటిస్తుండగా నరేశ్, వెన్నెల కిషోర్, సుదర్శన్ వంటి వారు నటిస్తున్నారు. త్రిశూల్ విజనరీ బ్యానర్పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది. -
ఒకప్పుడు నా కుటుంబానిది కూడా అదే పరిస్థితి: రాఘవ లారెన్స్ ఎమోషనల్
కోలీవుడ్ హీరోలు సమాజ సేవలో ఎప్పుడు ముందుంటారు. కొన్నేళ్లుగా సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. తన వంతా సాయం చేస్తూ పేద విద్యార్థులను డాక్టర్స్, ఇంజినీర్స్ను చేస్తున్నారు. అదే బాటలో మరో స్టార్ హీరో లారెన్స్ కూడా దూసుకెళ్తున్నారు. ఎక్కడా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాను స్థాపించిన మాత్రం ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సాయమందిస్తున్నారు. తాజాగా ఓ పేద విద్యార్థిని కష్టాలు చూసిన ఆయన చలించిపోయారు.ఓ తండ్రి తన కూతురి చదువుకోసం తన భార్య(లేట్) మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టడం తనను ఎమోషనల్గా కదిలించిందని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు. ఎందుకంటే నా కుటుంబం కూడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొందని గుర్తు చేసుకున్నారు. అందుకే ఆ మంగళసూత్రాన్ని అతనికి వెనక్కి ఇప్పించి.. ఆ కుటుంబానికి అండగా నిలిచానని ట్వీట్లో రాసుకొచ్చారు. అది కేవలం బంగారం మాత్రమే కాదని.. అతని భార్య విలువైన జ్ఞాపకం అని రాఘవ లారెన్స్ పోస్ట్ చేశారు. ఈ రోజు తన హృదయం చాలా సంతోషంతో నిండిపోయిందన్నారు. Hi everyone! I came across a story about a father who had pawned his late wife’s thali to pay for his daughter’s education. This touched me deeply, because my own family once went through a similar struggle. Through Maatram, i was able to retrieve the thali and return it to… pic.twitter.com/25VMi8fRHS— Raghava Lawrence (@offl_Lawrence) August 17, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అనుపమ పరమేశ్వరన్ 'పరదా', 'మేఘాలు చెప్పిన ప్రేమకథ', 'త్రిబాణధారి బార్బరిక్' తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లో 31కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. సార్ మేడమ్, మిషన్ ఇంపాజిబుల్- ద ఫైనల్ రికనింగ్, మా, మారిషన్, కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మరేవైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్లు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)అమెజాన్ ప్రైమ్మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 18సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22నెట్ఫ్లిక్స్కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18ఎక్స్టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18అమెరికాస్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20రివర్స్ ఆఫ్ ఫేట్ (పోర్చుగీస్ సిరీస్) - ఆగస్టు 20డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21ఫాల్ ఫర్ మీ (జర్మన్ సినిమా) - ఆగస్టు 21గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) - ఆగస్టు 21హోస్టేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21వన్ హిట్ వండర్ (తగలాగ్ సినిమా) - ఆగస్టు 21ద 355 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 21అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22మా (హిందీ సినిమా) - ఆగస్టు 22మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23హాట్స్టార్స్టాకింగ్ సమంత (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22జీ5ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22సోదా (కన్నడ సిరీస్) - ఆగస్టు 22ఆపిల్ ప్లస్ టీవీఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22ఆహాకొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు మూవీ) - ఆగస్టు 22సన్ నెక్స్ట్కపటనాటక సూత్రధారి (కన్నడ మూవీ) - ఆగస్టు 22లయన్స్ గేట్ ప్లేవుడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష.. ప్రోమో రిలీజ్) -
తమిళ దర్శకులు ఎడ్యుకేటర్స్: మురుగదాస్
తమిళ చిత్రాలు ఇప్పటివరకు రూ.1000 క్లబ్లోకి చేరలేదు. అయితే ఇతర భాషా చిత్రాలు రూ. 1000 కోట్ల క్లబ్ను దాటి చాలా కాలమే అయ్యింది. తాజాగా రజనీకాంత్ కథానాయకుడు నటించిన కూలీ చిత్రం ఆ రికార్డును బ్లాక్ చేస్తుందనే ప్రచారం విడుదలకు ముందు జరిగింది. అయితే ఆ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్లో చేరకపోవడం గురించి సీనియర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఒక వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇటీవల వరుసగా అపజయాలను చవిచూస్తూ వచ్చారు.. కాగా తాజాగా ఈయన శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం మదరాసీ. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెపె్టంబర్ 5వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. విచిత్ర ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఒక వ్యక్తి రోడ్లో వేగంగా వెళ్తున్నారంటే అది ఇంతకుముందే చేయబడిన బాట అని, అదే ప్రత్యేక బాటలో వెళ్లాలంటే అంత సులభం కాదన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడు శంకర్ ,మణిరత్నం వంటి వారు ప్రత్యేక బాటను వేస్తే అందులో ఎత్తు పల్లాలే ఎదురవుతాయన్నారు. ఇతర భాషా చిత్రాలు రూ.1000 కోట్ల పైగా వసూలు చేస్తున్నాయని చెబుతున్నారని, ఇతర దర్శకులు ఎంటర్టైనింగ్ మాత్రమే చేస్తున్నారని, తమిళ దర్శకులు మాత్రం ఎడ్యుకేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది తమిళ దర్శకులు ఎడ్యుకేషన్ చేస్తున్నారని అన్నారు. అందువల్లే ఇతర చిత్ర పరిశ్రమలకు, తమిళ చిత్ర పరిశ్రమకు చాలా వ్యత్యాసం ఉందని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేర్కొన్నారు. -
ఓ ఆటగాడి కథ
విజయ రామరాజు టైటిల్ రోల్లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా యాంథమ్ని విడుదల చేశారు. చిత్ర సంగీతదర్శకుడు విఘ్నేష్ భాస్కరన్ స్వరపరచిన ఈపాటకు విక్రాంత్ రుద్ర సాహిత్యం అందించారు.దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్, విఘ్నేష్పాయ్ ఆలపించారు. విజయ రామరాజు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన విజువల్స్ ఈపాటలో కనిపిస్తాయి. ఓ కబడ్డీ ప్లేయర్ నిజ జీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘‘ఎమోషనల్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
హలగలి... ఓ చిరస్మరణీయపోరాటం
‘‘హలగలి (కర్ణాటకలోని ఓ గ్రామం) అనేది కర్ణాటకలో ఓ గొప్ప ఎమోషన్. ఈ కథ వినగానే ఈ సినిమాలో నటించాలనిపించింది. ఈ సినిమా చేయడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని డాలీ ధనంజయ అన్నారు. డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధానపాత్రధారులుగా సుకేష్ నాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్ మూవీ ‘హలగలి’. 1857లో జరిగిన ఓ వాస్తవ సంఘటనతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పణలో కల్యాణ్ చక్రవర్తి ధూళిపాళ్ల నిర్మిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకేష్ మాట్లాడుతూ – ‘‘ఇది ఒక్క భాగంలో చెప్పే కథ కాదు. ఈ కథ వెనకాల గొప్ప చరిత్ర ఉంది. అందుకే రెండు భాగాలుగా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘చరిత్రలో హలగలి అనేది ఒక అధ్యాయం. బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన చిరస్మరణీయపోరాటం. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు కల్యాణ్ చక్రవర్తి. ‘‘హలగలి’ మన నేల కథ’’ అని తెలిపారు సప్తమి గౌడ. -
డబుల్ బొనాంజ
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. మాళవికా మోహనన్, రిద్ది కుమార్ ఇతర హీరోయిన్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 17) నిధీ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘ది రాజాసాబ్’లోని ఆమె కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది.దసరాకి టైటిల్: నిధీ అగర్వాల్ లీడ్ రోల్లో నటించనున్న కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈ దసరా పండగకి రానుంది. ఎన్. నిఖిల్ కార్తీక్ దర్శకత్వంలో పుప్పల అప్పలరాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ ఎవరూ ఊహించని కొత్తపాత్రలో కనిపిస్తారు. ఈపాత్రలో ఆమె కనబరిచే నటన ఆమె కెరీర్లో మైల్స్టోన్లా నిలిచిపోతుంది’’ అని పుప్పల అప్పలరాజు పేర్కొన్నారు. ఇలా రెండు సినిమాల అప్డేట్స్తో ఫ్యాన్స్కు డబుల్ బొనాంజ ట్రీట్ ఇచ్చారు నిధీ అగర్వాల్. -
థ్రిల్లర్ జానర్కి సై?
‘నిన్ను కోరి’ (2017), ‘మజిలీ’ (2019), ‘ఖుషి’ (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శివ నిర్వాణ కాస్త రూట్ మార్చి ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకున్నారు. ఇటీవల ఈ స్టోరీని హీరో రవితేజకు వినిపించగా ఆయన ఈ సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. ఈ థ్రిల్లర్ జానర్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని ఫిల్మ్నగర్ సమాచారం.అయితే ప్రస్తుతం రవితేజ చేతిలో కిశోర్ తిరుమల దర్శకత్వంలోని ‘అనార్కలి’ (వర్కింగ్ టైటిల్), భాను భోగవరపు డైరెక్షన్లోని ‘మాస్ జాతర’ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు పూర్తయిన తర్వాత శివ నిర్వాణతో చేయాల్సిన సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్ కూడా ఓ సూపర్ హీరో జానర్లో రవితేజకు కథ వినిపించారు. మరి... రవితేజ ఏ దర్శకుడితో ముందుగా తన సినిమాను సెట్స్కు తీసుకువెళ్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. -
ఆ సినిమా కోసం నెలపాటు మణిరత్నం వెంటపడ్డా: నాగార్జున
'కూలీ' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున.. తొలిసారి విలన్గా చేసి ఆకట్టుకున్నాడు. రెండు నెలల క్రితం 'కుబేర'లో వైవిధ్యమైన సహాయ పాత్రలో కనిపించి మెప్పించాడు. అయితే ఇప్పుడంటే నాగ్ వెంటపడి దర్శకులు సినిమాలు తీస్తున్నారు. కానీ స్వయంగా నాగార్జున.. డైరెక్టర్ మణిరత్నం వెంటపడి ఓ సినిమా చేశారని మీలో ఎందరికీ తెలుసు. అవును ఆ సంగతులు నాగ్ ఇప్పుడు బయటపెట్టాడు.జగపతిబాబు హోస్ట్గా ఓ టాక్ షో ప్రారంభమైంది. అందులో నాగార్జున తొలి గెస్ట్గా వచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో సంగతులు పంచుకున్న నాగ్.. తన యాక్టింగ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మణిరత్నం వెంటపడి 'గీతాంజలి' సినిమా చేసిన అనుభవం గురించి బయటపెట్టారు.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)'నేను చేసిన ప్రారంభ సినిమాలని నాగేశ్వరరావు అబ్బాయి అనే ఉద్దేశంతోనే ప్రేక్షకులు చూశారు. కొందరికి నా యాక్టింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదు. తర్వాత కూడా ఆరేడు మూవీస్ చేశా. అలా 'మజ్ను' నాకు బ్రేక్ ఇచ్చింది. కమర్షియల్ చిత్రాల్లో అయితే 'ఆఖరి పోరాటం' హిట్ అయింది. అయితే అందులో నేను బొమ్మలా ఉన్నానంతే. డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరోయిన్ శ్రీదేవి వల్ల మూవీ సక్సెస్ అయింది''మణిరత్నం తీసిన 'మౌనరాగం' సినిమా నాకు బాగా నచ్చింది. దీంతో ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని అనుకున్నాను. ఆయన వాకింగ్కి వెళ్లే పార్క్ వివరాలు తెలుసుకుని, దాదాపు నెలరోజులు ఆయన వెంటపడ్డాను. పది నిమిషాలు కలిసి నడిచిన తర్వాత ఆయన టెన్నిస్ ఆడేందుకు వెళ్లిపోయారు. చివరకు ఎలాగోలా ఒప్పించాను. అలా 'గీతాంజలి' మూవీ వచ్చింది. దాన్ని తమిళంలోనే తీయాలనుకున్నారు. కానీ తెలుగు మార్కెట్ కూడా పెంచుకోండి అని సలహా ఇవ్వడంతో నాతో సినిమాకి ఒప్పుకొన్నారు. అనుకున్నట్లే హిట్ అయింది' అని నాగార్జున చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ) -
బిగ్బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష.. ప్రోమో రిలీజ్
బిగ్బాస్ 9 తెలుగు సీజన్.. వచ్చే నెల 7న ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందే ఈసారి సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష' పేరుతో ఓ పోటీ పెడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుకాగా.. ఎంపిక ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ గేమ్ షోకు శ్రీముఖి యాంకర్ కాగా.. బిందుమాధవి, అభిజిత్, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే తొలి ప్రోమోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ)అగ్నిపరీక్షలో 45 మంది సామాన్యులు పాల్గొనబోతున్నారు. వీళ్లలో యువతీ యువకులు, సోషల్ మీడియాలో కాస్త ఫేమ్ ఉన్న వాళ్లు, ముసలి వాళ్లు, కాళ్లు లేని దివ్యాంగులు, ముఖానికి మాస్క్ పెట్టుకున్న వ్యక్తులు, హిజ్రా.. ఇలా అన్ని రకాల వ్యక్తులు భాగం కానున్నారు. వీళ్ల నుంచి చివరగా ముగ్గురుని ఎంపిక చేసి, వాళ్లని సీజన్లో ఆడిస్తారు.ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 5 వరకు బిగ్బాస్ అగ్నిపరీక్ష షో జరగనుంది. ప్రతిరోజు గంట పాటు ప్రసారం చేస్తారు. ఇందులో భాగంగా పాల్గొన్న సామాన్యులకు పోటీలు పెట్టి చివరకు విజేతల్ని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రోమోలోనే 'నేను ఆడ నవదీప్ని' అని మహిళా బాడీ బిల్డర్ అనడం.. వయసు తట్టుకుంటా.. ఉపవాసం ఉంటా.. ఏది పెట్టినా తింటా.. ఎలిమినేట్ చేయాలని చూస్తే ఊరుకోను అని ఓ ముసలామె అనడం ఆసక్తికరంగా ఉన్నాయి.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత) -
గ్లామరస్ 'ఓజీ' బ్యూటీ.. కిరాక్ కేతిక శర్మ
ఓజీ బ్యూటీ ప్రియాంక మోహన్ గ్లామరస్ పోజులుకిరాక్ పుట్టించేస్తున్న అదిదా కేతిక శర్మవజ్రాలు లాంటి డ్రస్సులో జాన్వీ కపూర్జీన్ షార్ట్తో తెగ హ్యాపీగా యువనటి దీపికా పిల్లిజపాన్లో తిరిగేస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరిఎర్రని చీరలో ఒయ్యరాలు పోతున్న అనసూయజిమ్లో వర్కౌట్ చేస్తున్న బిగ్బాస్ దివి View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) -
'కూలీ'తో ఓవర్ నైట్ స్టార్డమ్.. ఎవరీ బ్యూటీ?
-
22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ
సినిమా సెలబ్రిటీలకు ప్రేమ, పెళ్లి, రిలేషన్ లాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదా అనే సందేహం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన మూడేళ్లకే విడిపోయారు లాంటివి వింటూనే ఉంటాం. అలానే లేటు వయసులోనూ కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అని హింట్స్ కూడా ఇస్తుంటారు. ఇప్పుడు 'కెవ్వు కేక' బ్యూటీ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. ఐటమ్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ గబ్బర్ సింగ్ సినిమాలో 'కెవ్వు కేక' పాటలో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతానికి సినిమాలేం చేయట్లేదు గానీ వ్యక్తిగత విషయాల్లో ఏదో ఒకలా వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా తనకు రెండో పెళ్లిపై ఆసక్తి ఉందని కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా, మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. 'నేను చాలా రొమాంటిక్ మనిషిని. ప్రేమపై నాకు ఎంతో నమ్మకముంది. సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే' అని చెప్పుకొచ్చింది. అలానే ప్రస్తుతం వివాహం చేసుకుంటున్న యువత.. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని, అయితే భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనని అందరూ స్వార్థపరురాలిగా చూశారని, కానీ విడాకుల తీసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నానని మలైకా చెప్పుకొచ్చింది.హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని మలైకా అరోరా.. 1998లో పెళ్లి చేసుకుంది. అయితే దాదాపు 19 ఏళ్ల పాటు సంసారం చేసిన తర్వాత వీళ్లిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ చేసింది. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. మరి ఏమైందో ఏమో గానీ అర్జున్-మలైకా విడిపోయారు. ఈమెకు అర్హాన్ ఖాన్ అని 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు రెండో పెళ్లిపై మనసు మళ్లడం చూస్తుంటే.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) -
చిరంజీవికి మా సమస్యలు తెలుసు: ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్
టాలీవుడ్లో గత కొన్నిరోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే తమకు 30 శాతం వేతనాలు పెంచాలని వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుండగా.. నిర్మాతలు మాత్రం దీనికి అంగీకరించట్లేదు. తమ షరతులకు ఒప్పుకొంటేనే వేతనాల పెంపు ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ సమస్య ఎటు తేలకుండా అలానే ఉంది. మెగాస్టార్ చిరంజీవి.. ఆదివారం పలువురు చిన్న నిర్మాతలు కలిశారు. సోమవారం ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఈ క్రమంలోనే ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ప్రెసిడెంట్ తమ సాధకబాధలు చెప్పుకొచ్చారు.'రోజూ ఉదయం 5 గంటలకు వస్తేనే మా బతుకు. పెద్ద పెద్ద సినిమాలు తీసిన అప్పటి నిర్మాతలు మా కష్టాన్ని పట్టించుకునేవారు. కానీ ఇప్పటి నిర్మాతలకు మా గోడు పట్టడం లేదు. మాకు వచ్చే డబ్బులు.. మాకొస్తున్న జబ్బులకు సరిపోతుంది. కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా మమ్మల్ని దూషిస్తున్నారు. కార్మిక చట్టాల బట్టి అంటున్నారు మరి మీరు 8 గంటల వర్క్ చేయించుకుంటున్నారా ?? 12-14 గంటలు మేము పనిచేస్తున్నాం. 9 నుంచి 9 గంటల వరకు అని కొందరు నిర్మాతలు అంటున్నారు కానీ అది అయ్యే పనికాదు. షూటింగ్స్కి రావాలి అంటే మేము 9 గంటలకు కాకుండా మా వర్కర్స్ని 7 గంటలకే రమ్మనాలి. రాత్రి 9 గంటలకే షూట్ ముగిస్తారా అంటే అది చేయరు. మేము షూటింగ్ ముగించుకుని వచ్చేపాటికి రాత్రి ఒంటి గంట అయిపోతుంది'(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)'12 గంటలు అంటారు కానీ మేము 15-16 గంటలు వర్క్ చేస్తున్నాం. కార్మిక చట్టాలు ప్రకారం వెళ్దామని కొందరు నిర్మాతలు అంటున్నారు మాకు అభ్యంతరం లేదు. చట్ట ప్రకారమే మాకు 8 గంటలు పని గంటలు ఉంటాయి. డొనేషన్ తీసుకుంటున్న డబ్బులతో ఆ కుటుంబానికి అండగా ఉంటున్నాం. యూనియన్ ఎప్పడు కార్మికుడికి అండగా ఉంటుంది నిర్మాతలు ఉండటం లేదు. మా గురువు గారు దాసరి.. అప్పుడు చెప్పిన పద్ధతి లోనే మేము వెళ్తున్నాం. నిర్మాతలు మా పై చేస్తున్న దుష్ప్రచారాలను మానండి. చిరంజీవి గారికి మా సమస్యలు తెలుసు. మా సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం' అని ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకట కృష్ణ చెప్పారు.సినీ కార్మికుల మహిళా యూనియన్ ప్రెసిడెంట్ లలిత మాట్లాడుతూ.. మేము షూటింగ్లో ఎంతో కష్ట పడతాం. మాకు టాయిలెట్స్ కూడా ఉండవు. వాటర్ కేన్స్ కూడా భుజాన మోసుకొని వెళ్ళాలి. మా బాధలు నిర్మాతలు అర్థం చేసుకొవాలి. సండే కట్ చేస్తాం అంటున్నారు అలా చేస్తే మా పొట్ట కొట్టినట్టే. ప్రభుత్వం తరఫున మీటింగ్ పెడితే మా కష్టాలు తెలియ చేస్తాం అని అన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) -
మీనాక్షి చౌదరి జపాన్ టూర్.. ఫుల్ ఎంజాయ్ (ఫొటోలు)
-
ఆ సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత
పాన్ ఇండియా స్థాయికి మన ఇండస్ట్రీ ఎదిగిపోయింది అని అనుకుంటున్నాం కానీ నిర్మాతల పరిస్థితి ఘోరంగానే ఉంది. ఒకప్పటితో పోలిస్తే సినిమాల్లో సరైన కంటెంట్ ఉండట్లేదు. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చి చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దానికి తోడు స్టార్ హీరోలు కూడా రీమేక్స్ చేయడం, అవి డిజాస్టర్ కావడం అడపాదడపా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఓ నిర్మాత.. తను తీసిన ఓ రీమేక్ వల్ల ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు.అప్పట్లో దూకుడు, లెజెండ్, వన్ నేనొక్కడినే తదితర సినిమాలు తీసిన అనిల్ సుంకర.. గత కొన్నాళ్లలో మాత్రం ఘోరమైన నష్టాల్ని చవిచూశారు. మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ తదితర చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈయనకు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం నిర్మాణాన్ని పక్కనబెట్టి 'షో టైమ్' పేరుతో ఓ రియాల్టీ షో తీస్తున్నారు. దీని లాంచ్ శనివారం జరగ్గా.. ఇందులోనే మాట్లాడుతూ చిరంజీవితో తీసిన 'భోళా శంకర్' గురించి పరోక్షంగా కామెంట్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) 'ఏదైనా ఫ్లాప్ సినిమా రాగానే అసలు కథ వినే తీశారా? అని నన్ను అడుగుతుంటారు. కథలు వినకుండా మూవీస్ ఎందుకు చేస్తారు అని కూడా అడుగుతారు. ఓసారి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే.. అక్కడ పనిచేస్తున్న ఓ క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు. ఎందుకండీ స్టోరీ లేని సినిమాలు చేస్తున్నారు అని అన్నాడు. నేను తీసింది రీమేక్ అని చెప్పినా అతడికి అర్థం కాలేదు. రీమేక్ ఆడలేదు నేనేం చేస్తాను? అని చెప్పాను. ఈ పాటికే మీకు సినిమా ఏంటనేది అర్థమై ఉంటుంది కదా!' అని తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని బయటపెట్టారు.మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన 'భోళా శంకర్'లో చిరంజీవి హీరోగా నటించారు. అనిల్ సుంకర నిర్మించారు. తమిళంలో హిట్ అయిన 'వేదాళం' అనే మూవీ రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. అయితే రిలీజ్కి ముందే విమర్శలు ఎదుర్కొన్న 'భోళా శంకర్'.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మరిన్ని ట్రోల్స్కి గురైంది. చిరంజీవి ఇలాంటి మూవీ ఎందుకు చేశారా? అని అందరూ మాట్లాడుకున్నారు. అలాంటిది ఇప్పుడు స్వయంగా నిర్మాతనే పరోక్షంగా ఈ సినిమాని మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క.. పిల్లి కోసం స్పెషల్గా..) -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలంటే అంతంత మాత్రంగానే వర్కౌట్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. అలా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ హాలీవుడ్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించింది. రిలీజై దాదాపు నెలన్నర కావొస్తున్న ఇప్పటికీ ప్రేక్షకుల్ని రప్పిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?హాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు చూసినా సరే నటుడు బ్రాడ్ పిట్ కాస్త పరిచయం ఉండే ఉంటాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్ 1'. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మన ఆడియెన్స్ కూడా చూసి ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'ఎఫ్ 1' విషయానికొస్తే.. ఫార్ములా వన్ రేసులో డ్రైవర్గా అదరగొట్టిన సన్నీ హెయస్ (బ్రాడ్ పిట్).. కెరీర్కి రిటైర్మెంట్ ఇచ్చి, వ్యాన్ డ్రైవర్ పనిచేస్తుంటాడు. అలా వయసు పైబడిన సన్నీకి ఏపీఎక్స్జీపీ (APXGP) అనే టీమ్లో రేసర్గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. అయితే రేసింగ్ నుంచి తప్పుకొని చాలారోజులు అయిపోవడంతో సన్నీకి ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా తన జట్టులోని యువకుడైన జోషువా పియర్స్ (డామ్సన్ ఐడ్రీస్) దూకూడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అవమానాలు భరించడం కష్టంగా ఉంటుంది.అసలు స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ.. ఎందుకు రేసింగ్ నుంచి తప్పుకొన్నాడు? మళ్లీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పైకి వచ్చిన సన్నీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు విజేతగా నిలిచాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
అఖిల్ మూవీలో జగపతిబాబును వద్దన్న నాగార్జున
గత కొంతకాలంగా విజయాల్లేక తడబడుతున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ ఏడాది వరుస హిట్లు వచ్చాయి. నాగచైతన్య తండేల్ సినిమాకు వంద కోట్లు రాగా, నాగార్జున (Nagarjuna Akkineni) కుబేర చిత్రానికి రూ.132 కోట్లు వచ్చాయి. అలా తండ్రీకొడుకులిద్దరూ ఈసారి సెంచరీ కొట్టారు. అఖిల్ అక్కినేని మాత్రం ఈ రేసులో ఎక్కడో ఆగిపోయాడు. ఏజెంట్తో డిజాస్టర్ అందుకున్న ఇతడు ప్రస్తుతం లెనిన్ మూవీ చేస్తున్నాడు.టాక్ షోలో నాగ్దీన్ని నాగవంశీతో కలిసి నాగార్జున నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలో అఖిల్కు తండ్రిగా కనిపించనున్నారన్న టాక్ కూడా వినిపించింది. ఈ మూవీలో నటించేందుకు జగపతిబాబుకు ఆఫర్ ఇస్తే.. దానికి నాగ్ ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని ఆయన జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో వెల్లడించాడు. ఈ షోకు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అవును, రిజెక్ట్ చేశా..జగ్గూ భాయ్ మాట్లాడుతూ.. అఖిల్ (Akhil Akkineni) రీసెంట్ సినిమా(లెనిన్)లో ఏదో చిన్న పాత్రకు నన్ను అడిగారట! ఇంత చిన్న క్యారెక్టర్కు ఆయన్ను అడగడమేంటి? మేం కలిసేదే తక్కువ. ఇలాంటివి చేస్తే మా స్నేహమే చెడిపోతుంది అన్నావంట కదా అని అడిగాడు. అందుకు నాగ్.. అవును, ఆ చిన్న పాత్రకు నువ్వెందుకని తిరస్కరించాను అని చెప్పాడు. దీంతో జగపతిబాబు థాంక్యూ చెప్తూ.. నిజానికి నీకసలు సంబంధం లేదు. ఆ సినిమాకు నీతోపాటు మరో నిర్మాత కూడా ఉన్నారు. ముందు మనం ఫ్రెండ్స్నువ్వు విలువల్ని పాటిస్తావు.. అది నాకెంతో ఇష్టం అన్నాడు. అది వినగానే నాగ్.. వీటన్నింటికంటే ముందు మనమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు. లెనిన్ విషయానికి వస్తే.. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ కిరణ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత -
బిగ్బాస్ విన్నర్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు
హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. గురుగ్రామ్లో ఉన్న ఆయన ఇంటి వద్దకు ముగ్గురు యువకులు ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో చేరుకుని కాల్పులు జరిపారు.దాడి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. కాల్పులు జరిగినప్పుడు ఎల్విష్ యాదవ్ తన నివాసంలో లేడు. వివాదాస్పద యూట్యూబర్గా ఆయన పేరుంది. బహుళ అంతస్తులతో నిర్మించిబడిని ఆయన ఇంటి కింది అంతస్తులలో బుల్లెట్లు దూసుకుపోయాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 'ఈ సంఘటన ఈరోజు ఉదయం 5.30 మరియు 6 గంటల మధ్య జరిగింది. బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సెక్టార్ 57లోని యాదవ్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. దాడి జరిగినప్పుడు అతని కేర్ టేకర్, కొంతమంది కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు. కానీ ఎవరికీ గాయాలు కాలేదు.' అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన వారు విచారణ ప్రారంభించారు.2024లో నోయిడా పోలీసులు ఎల్విష్ను రేవ్ పార్టీలో పాము విషం సరఫరా కేసులో అరెస్టు చేశారు. అతడి దగ్గర 9 పాములతో పాటు 20ml పాము విషం స్వాధీనం చేసుకున్నారు. ఆపై కాశీ విశ్వనాథ ఆలయ సముదాయంలో ఫోటోలు, వీడియోలు తీసినందుకు ఎల్విష్పై కేసు నమోదైంది. జైపూర్లోని ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తిని ఎల్విష్ యాదవ్ చెంపపగలగొట్టిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా పలు వివాదాలు ఆయన చుట్టూ ఉన్నాయి. -
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ రివ్యూ.. వివాదాల సినిమా ఎలా ఉందంటే?
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి (Suresh Gopi), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala).. కోర్ట్రూమ్ డ్రామా కాన్సెప్ట్తో దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించారు. అయితే, టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీతాదేవి మరో పేరు జానకి కావడం.. ఈ మూవీలో దాడికి గురైన మహిళా పాత్రకు ఆ పేరు పెట్టడంతో సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో టైటిల్లో చిన్న మార్పు చేసి (‘వి’ యాడ్ చేశారు) (Janaki v vs State of Kerala) కేవలం మలయాళంలో మాత్రమే జులైలో విడుదల చేశారు. అయితే, తాజాగా 'జీ 5'లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగులో త్వరలో విడుదల కావచ్చు. అయితే, సబ్టైటిల్స్తో చూసే ఛాన్స్ ఉంది.థ్రిల్లర్ కథాంశంతో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ రూపొందింది. న్యాయం కోసం పోరాడే యువతి కథే ఈ చిత్రం. జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ.. పండగ కోసం కేరళలోని తన సొంత ఊరికి వస్తుంది. అయితే, అక్కడ ఆమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. కానీ, నిందితుల తరఫున డేవిడ్ అనే ప్రముఖ లాయర్ (సురేశ్ గోపి) వాదిస్తాడు. దీంతో కేసు ఓడిపోవడం, తండ్రిని కోల్పోవడం, గర్భం దాల్చడం వంటి సంఘటనలు ఆమె జీవితాన్ని కుదిపేస్తాయి. జానకి ప్రభుత్వాన్ని తన బిడ్డను చూసుకోవాలని కోరుతుంది. దీనిపై కేరళ హైకోర్టు ఎలా స్పందించింది..? అనే అంశం కథలో కీలకం. ఒక కానిస్టేబుల్ సహాయంతో కేసు తిరిగి ఓపెన్ చేయడంతో కథ కొత్త మలుపులు తిరుగుతుంది. జానకి చేసిన న్యాయ పోరాటంలో ఫైనల్గా ఎవరు గెలిచారు..? నిందితుల పక్షాన సురేశ్ గోపి ఎందుకు వాదించాల్సి వచ్చింది. జానకికి జన్మించిన బిడ్డ బాధ్యతను చివరగా ఎవరు తీసుకుంటారు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఈ చిత్రం న్యాయ వ్యవస్థ, మహిళల హక్కులు, సామాజిక బాధ్యతలపై ప్రశ్నలు వేస్తూ.. భావోద్వేగంగా సాగుతుంది. మీరు లీగల్ డ్రామా సినిమాలు ఇష్టపడితే, ఇది తప్పక చూడవచ్చు. కథలో చెప్పిన అంశం చిన్నదైనా సరే చాలామందిని ఆలోచింపచేస్తుంది. అయితే, ఇలాంటి కథలు వెండితెరపై చాలానే కనిపించాయి. కానీ, ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించిన ఈ చిత్రం కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎక్కువ సమయం సాగదీశారనిపిస్తుంది. ఇలాంటి కథలకు కోర్టు రూమ్ ఎపిసోడ్స్ చాలా బలంగా ఉండాలి. కానీ, చాలా పేలవంగా దర్శకుడు చూపించాడు. అడ్వకేట్గా సురేశ్ గోపి వంటి స్టార్ నటుడు ఉన్నప్పటికీ బలమైన డైలాగ్స్ చెప్పించలేకపోయాడు.జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ స్టోరీ ప్రారంభం నుంచే నెమ్మదిగా సాగుతుంది. జానకి విద్యాధరన్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చాలా బాగా నటించింది. అయితే, ఆమె పాత్రను ఇంకా బలంగా చూపించాల్సి ఉంది. మరోవైపు జానకి కేసులో నిందితుల తరఫున వాదించేందుకు డేవిడ్ (సురేశ్ గోపి) ముందుకు రావడంతో కథలో కాస్త స్పీడ్ అందుకుంటుంది. అక్కడక్కడ జానకిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలతో ఆయన విసిగించినా ప్రేక్షకులకు నచ్చుతుంది. గర్భం దాల్చకుండానే ఆమె ఇలాంటి నేరం జరిగిందని ఆరోపణలు చేస్తుందా అనే ఫీల్ కలిగించేలా కొన్ని సీన్లు ఉంటాయి. అవి బాగానే కనెక్ట్ అవుతాయి. డేవిడ్ వంటి లాయర్ ఎంట్రీ ఇవ్వడంతో జానకి కేసును కోర్టు కొట్టివేస్తుంది. అయితే, ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలౌతుంది. తండ్రిని కోల్పోయి ఆపై లైంగికి దాడికి గురై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు సాయంగా కానిస్టేబుల్ ఫిరోజ్ (అస్కర్ అలీ) ఎంట్రీ ఇస్తాడు. అతను చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠను రేకిత్తిస్తుంది. ఆ సమయంలో కేసును వాదించేందుకు డేవిడ్ కూతురు అడ్వకేట్ నివేదిత (శృతి రామచంద్రన్) రంగంలోకి దిగుతుంది. ఫైనల్గా కోర్టు రూమ్ డ్రామాలో జానకికి ఎలాంటి న్యాయం జరిగింది అనేది పెద్దగా ఉత్కంఠత లేకుండానే దర్శకుడు కథ ముగిస్తాడు. కానీ, కోర్టు డ్రామా సినిమాలు చూసేవారికి తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుంది. జీ5లో అందుబాటులో ఉంది. అయితే, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం సబ్టైటిల్స్తో చూడొచ్చు. త్వరలో తెలుగులో కూడా విడుదల కావచ్చు. వీకెండ్లో కుటుంబంతో కలిసి చూసేయండి. ఎలాంటి అశ్లీలత లేదు. -
బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్
తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకొని స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న నటి కీర్తిసురేష్( Keerthy Suresh). మలయాళంలో బాల తారగా కెరీర్ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత కథానాయకిగా అవతారమెత్తి మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రలో జీవించి జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. అదేవిధంగా తక్కువ కాలంలోనే ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే తన బాల్య స్నేహితుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈమె చేతిలో రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు ఉన్నాయి. అయితే వివాహానంతరం కీర్తిసురేష్ కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు. అయినా ఖాళీగా లేరు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. కాగా వివాహానంతరం ఈ అమ్మడు కాస్త బరువెక్కారనే కామెంట్స్ను ఎదుర్కొన్నారు. అలాంటి కామెంట్స్పై స్పందించిన కీర్తిసురేష్ పెళ్లి తర్వాత బరువు పెరిగిన విషయం నిజమేనన్నారు.. అయితే బరువు తగ్గడానికి కార్డియో కసరత్తులు చేసి స్లిమ్గా మారడానికి పోరాడానన్నారు. వారానికి 300 నిమిషాలు ప్రకారం ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు 9 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. తీవ్ర ప్రయత్నం, ఆహారపు కట్టుబాట్లు కలిస్తే ఫలితం సాధ్యమేనని కీర్తి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నూతన చిత్రాలకు సంబంధించిన కథలు వింటున్నానని, త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని ఆమె తెలిపారు. -
అల్లు అర్జున్ సినిమా.. పవర్ఫుల్ పాత్రలో శివగామి
శక్తిమంతమైన పాత్రల్లో రమ్యకృష్ణ ఏ స్థాయిలో విజృంభించగలరో చెప్పడానికి ‘రాజమాత శివగామి’ పాత్ర ఒక ఉదాహరణ. ‘బాహుబలి’లోని ఆ పాత్రను రమ్యకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఆమె నటించారు. ఇప్పుడు ఈ పాత్ర ప్రస్తావన ఎందుకంటే... మరోసారి ఈ తరహా పవర్ఫుల్ రోల్లో రమ్యకృష్ణ కనిపించనున్నారట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రంలోని ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటూ రమ్యకృష్ణను సంప్రదించారట అట్లీ. రమ్యకృష్ణ కూడా తన అంగీకారం తెలి పారని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని భోగట్టా. అలాగే మొత్తం ఐదుగురు కథానాయికలు ఉంటారని సమాచారం. హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఇంకా మృణాల్ రాకూర్, రష్మికా మందన్నా, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక భారీ ఎత్తున వీఎఫ్ఎక్స్ ఉన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. -
కథ విన్నారా?
హీరో నాగచైతన్య, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ కథను రెడీ చేసి, నాగచైతన్యకు వినిపించారట. ఈ కథ నాగచైతన్యకు నచ్చిందని, దీంతో ఈ కథకు మరింత మెరుగులుదిద్దే పనిలో దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారని టాక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అలాగే దర్శకులు బోయ పాటి శ్రీను, శివ నిర్వాణ కూడా నాగచైతన్యకు కథలు వినిపించారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగచైతన్య ఏ దర్శకుడితో తన కొత్త సినిమాను ముందుగా సెట్స్కు తీసుకువెళ్తారనే సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. ఇక ప్రస్తుతం ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలోని ‘వృషకర్మ’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో నాగచైతన్య బిజీగా ఉన్నారు. -
ప్రశాంతమైన కన్మణి
పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్మోహన్ పోషించిన కన్మణి పాత్ర ఫస్ట్ లుక్ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ‘‘ఓజీ’లో పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారు.ప్రతి తు పానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంకా అరుళ్మోహన్ కన్మణి పాత్ర. మా సినిమా నుంచి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘ఫైర్ స్టార్మ్..’కు విశేష స్పందన లభించింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్న ఈ సినిమాకి సంగీతం ఎస్. తమన్, కెమెరా: రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస. -
వీరీ వీరీ గుమ్మడిపండు ఈ సినిమా వచ్చేదెప్పుడు?
ఒకప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని, థియేటర్స్ దొరికితే చాలు... సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నాన్–థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు, బాక్సాఫీస్పోటీ, ఓటీటీ సంస్థల నిబంధనలు... ఇలా ఓ సినిమా రిలీజ్ కావడానికి, కాకపోవడానికి చాలా కారణాలే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇంకా విడుదల వాయిదా పడుతూ వస్తున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ఈ సెప్టెంబరు 5న చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అనుష్కా శెట్టి ‘ఘాటి’, రష్మికా మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’, తేజ సజ్జా ‘మిరాయ్’, ‘ది బెంగాలీ ఫైల్స్’, శివకార్తికేయన్ ‘మదరాసి’ వంటి సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అయితే ఇన్ని సినిమాలు ఒకే తేదీకి రిలీజ్ కావడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో వీటిలో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని, ఈ వాయిదా పడే చిత్రాల్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఉండొచ్చనే టాక్ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు సెప్టెంబరు 5న రిలీజ్ కావాల్సిన విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ చిత్రం సెప్టెంబరు 19కి వాయిదా పడింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను అరుణ్ ప్రభు దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ – స్పిరిట్ మీడియా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. 200 కోట్ల రూ పాయల భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ ‘భద్రకాళి’ సినిమా కథనం సాగుతుంది.సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్?నిర్మాతలు–సినీ కార్మికుల మధ్య వేతనాల పెంపు విషయమై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు జరగడం లేదు. ఈ ప్రభావం సంక్రాంతి రిలీజ్కు రెడీ అవుతున్న సినిమాలపై పడొచ్చు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆగస్టు 5 నుంచి మొదలు కావాల్సిన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ మొదలు కాలేదు. దీంతో షూటింగ్కు ఆలస్యమౌతోంది. సమ్మె కారణంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంకా రవితేజ ‘అనార్కలి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ చిత్రబృందాలు తమ సినిమాలను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించాయి. కానీ సినీ కార్మికుల ప్రస్తుత సమ్మె కారణంగా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తోంది. అలాగే డిసెంబరులో రిలీజ్కు సిద్ధమౌతున్న అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రంపై కూడా ఈ సమ్మె ప్రభావం కాస్త గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.సత్యలోకానికి పయనం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘విశ్వంభర’ సినిమా ఇంకా థియేటర్స్లోకి రాలేదు. సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా విడుదల కాకపోవడంతో సమ్మర్కి థియేటర్స్లోకి వస్తుందని ఆడియన్స్ ఊహించారు. కానీ సమ్మర్లో కూడా థియేటర్స్లోకి రాలేదు. ఆ మాటకొస్తే... ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత లేదు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మించిన ఈ ‘విశ్వంభర’ ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు గ్రాఫిక్స్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో క్వాలిటీ పరంగా చిత్ర యూనిట్ రాజీ పడకుండాపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయిస్తోందని సమాచారం. గ్రాఫిక్స్ కోసమే రూ. 25 కోట్లకుపైగా బడ్జెట్ను మేకర్స్ కేటాయించారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే.ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా టీజర్ విడుదల కావొచ్చని, ఈ సినిమా విడుదల తేదీపై అప్పుడు ఓ స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక పద్నాలుగు లోకాలను దాటి, హీరో సత్యలోకం వెళ్లి, అక్కడ హీరోయిన్ను ఎలా కలుసుకుంటాడు? అనే నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో విశ్వంభర అనే పుస్తకం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ పుస్తకంలోని అంశాల ఆధారంగానే హీరో సత్యలోకానికి వెళ్తాడని, ఈ క్రమంలో హీరోకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో రావు రమేశ్ నటించారని టాక్.ఆలస్యంగా రాజాసాబ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్, కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్, వీటీవీ గణేశ్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావడం లేదని, సంక్రాంతికి ఈ విడుదలయ్యే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం ‘ది రాజాసాబ్’ విడుదల వాయిదాకు ప్రధాన కారణమట. పైగా ఈ సినిమా కోర్టు కేసులో ఇరుక్కుందనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘ది రాజాసాబ్’ చిత్రం ప్రధానంగా తాత–మనవడి అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్య పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు ఆడియన్స్కు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో ‘రాజా డీలక్స్’ అనే భవనం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ భవనం లోపలే ప్రధాన కథ జరుగుతుందని తెలిసింది.పండక్కి రానట్లే! రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల మళ్లీ జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ ఆగస్టు 27న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ విడుదల వాయిదా పడిందని భోగట్టా.ఇంకా రెండు పాటల చిత్రీకరణ ఉందని, అలాగేపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కి కూడా ఇంకా సమయం పట్టేట్లు ఉందని... ఈ కారణాల వల్లే ‘మాస్ జాతర’ ఈ వినాయకచవితి పండక్కి థియేటర్స్లోకి వచ్చే అవకాశం లేదనే టాక్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను తొలుత ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే 9కి వాయిదా వేశారు. ఇటీవల ఆగస్టు 27న రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆగస్టు 27న కూడా ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే రైల్వేపోలీస్ ఆఫీసర్గా రవితేజ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రైల్వేస్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందట. అలాగే హీరో రవితేజ–విలన్ నవీన్చంద్ర కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్ను అలరించేలా ఉంటాయని తెలిసింది.సంబరాలు ఎప్పుడు? సాయి దుర్గా తేజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. రూ. 125 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ చైతన్యా రెడ్డి, కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.కానీ ఆ తర్వాత ఈ సెప్టెంబరు 25నే పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్ డ్రామా ‘ఓజీ’, బాలకృష్ణ మైథలాజికల్ అండ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ రిలీజ్కు రెడీ అయ్యాయి. దీంతో సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ విడుదల వాయిదా పడుతుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 80 శాతంపైనే పూర్తయింది. కానీ విడుదల తేదీపై మేకర్స్ నుంచి మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబరు 25న ‘ఓజీ’, ‘అఖండ 2’ సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి కాబట్టి ఈ తేదీకి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా రాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి అతి త్వరలోనే ఓ స్పష్టత రావొచ్చు. ఇక రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని తెలిసింది.స్వయంభూ నిఖిల్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా, సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఓ దశలో ఈ దసరాకు ‘స్వయంభూ’ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారట మేకర్స్. కానీ భారీ వీఎఫ్ఎక్స్, యుద్ధ సన్నివేశాలు ఉండటంతోపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు మరింత సమయం పడుతుందని, ఈ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. శక్తికి, ధర్మానికి చిహ్నమైన సెంగోల్ (బంగారు రాజదండం) నేపథ్యంలో ‘స్వయంభూ కథనం సాగుతుందట. మరో విషయం ఏంటంటే... ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నారని సమాచారం.ఓం శాంతి శాంతి శాంతిః తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అ΄్పాజీ) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణ, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బా, వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్ నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఆ మధ్య ఈ సినిమాను ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఆగస్టు 1న ఈ సినిమా విడుదల కాలేదు. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక మలయాళంలో సూపర్డూపర్ బ్లాక్బస్టర్గా నిలిచిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు తెలుగు రీమేక్గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రూపొందిందని తెలిసింది. భార్యాభర్తల నేపథ్యంలో ‘జయ జయ జయ జయహే’ సినిమా కథనం సాగుతుంది. మహిళలంటే చులకన భావం ఉన్న ఓ భర్తకు అతని భార్య ఏ విధంగా బుద్ధి చెప్పిందన్నదే ఈ సినిమా కథనం.భార్యాభర్తల కథ లావణ్యా త్రి పాఠి, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. భార్యాభర్తల అనుభందం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి)’ చిత్రాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్ను విడుదల చేశారు. అయితే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఇలా ఈ ఏడాదిలో రిలీజ్కు సిద్ధం అవుతూ, ఇంకా విడుదల తేదీని కన్ఫార్మ్ చేసుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
కార్మికుల సమ్మె.. అక్కడివరకు పరిస్థితి రానివ్వొద్దు: నారాయణమూర్తి
గత కొన్నిరోజులుగా టాలీవుడ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు ఇచ్చే వేతనాలు 30 శాతం మేర పెంచాలని వర్కర్స్ కోరగా.. నిర్మాతలు వైపు నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు. పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ.. ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు. ఇలాంటి టైంలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి స్పందించారు. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు..(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్)'సినీ కార్మికులు.. నిర్మాతలు కలసి చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. కార్మికులు అడుగుతున్న వేతనాలు నిర్మాతలు పెంచాలి. కార్మికులను గౌరవిస్తూ వాళ్ల హక్కులను కాపాడాలి. మూడు యూనియన్లకు వేతనాలు పెంచకుండా మిగతా యూనియన్లకు పెంచడం ఏమిటి? అందరితోపాటు వాళ్లకు పెంచాలి. నిర్మాతలు కోరుతున్న ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ 9 నుంచి 9 గంటల విషయమై కార్మికులు కూడా ఆలోచించాలి. ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో 6 నుంచి 6 గంటల వరకు నిర్మాతలకు ఇబ్బంది అవుతోంది అందుకే ఫెడరేషన్ కూడా ఆలోచించాలి''త్వరగా ఇరువురు సమ్మె విరమించి మళ్లీ షూటింగ్స్తో కళకళ లాడాలి. కార్మికులు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే నిరాహారదీక్ష చేస్తాం అని ఫెడరేషన్ సంఘాలు అంటున్నాయి. అక్కడివరకు పరిస్థితి రాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలి' అని నారాయణమూర్తి చెప్పారు. మరి ఇండస్ట్రీలోని ఈ సమస్యకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: అన్నా నేనే హీరోయిన్.. శ్రుతి హాసన్కి వింత అనుభవం) -
అన్నా నేనే హీరోయిన్.. శ్రుతి హాసన్కి వింత అనుభవం
సెలబ్రిటీలకు అప్పుడప్పుడు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. వెంటనే అవి కాస్త వైరల్ అవుతుంటాయి. తాజాగా హీరోయిన్ శ్రుతి హాసన్కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏమైంది? శ్రుతి హాసన్ ఎందుకు బతిమాలాడుకోవాల్సి వచ్చింది.తమిళ బ్యూటీ అయిన శ్రుతి హాసన్.. రీసెంట్ టైంలో ఆడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు 'కూలీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే రిలీజ్ నాడే మూవీ చూద్దామని చెన్నైలో ఓ థియేటర్కి వెళ్లగా అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఈమె ఉన్న కారుని ఆపేశాడు. దీంతో శ్రుతి హాసన్ అవాక్కయింది.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ)దీంతో సదరు సెక్యూరిటీ గార్డ్తో.. 'నేను సినిమాలో ఉన్నాను. దయచేసి నన్ను లోపలికి అనుమతించండి అన్నా. నేనే హీరోయిన్ సార్' అని శ్రుతి హాసన్ బతిమలాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని తమిళ ర్యాపర్ యుంగ్ రాజా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోని చూసి నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.'కూలీ' విషయానికొస్తే.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. కానీ తొలిఆటకే మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు మాత్రం ఎంతొచ్చింది ఏంటనేది చెప్పలేదు. రూ.85 కోట్ల మేర వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే ఇప్పటివరకు రూ.240 కోట్ల మేర వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్)#ShrutiHaasan 😂😂#Cooliepic.twitter.com/LIB7LlfhBc— Prakash Mahadevan (@PrakashMahadev) August 15, 2025 -
చీరలో జాన్వీ అలా.. జపాన్లో మీనాక్షి ఇలా
లేత గులాబీ చీరలో జాన్వీ అందాల జాతరజపాన్ టూర్ వేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరిఎండలో బిగ్ బాస్ దివి స్మైలీ పోజులుమెల్బోర్న్లో అవార్డ్ అందుకున్న అదితీ రావ్ హైదరీవావ్ అనిపించేలా బ్యూటీ దిశా పటానీ స్టిల్స్ట్రాన్స్పరెంట్ చీరలో అనన్య నాగళ్ల గ్లామర్ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
మంచిరోజు చూసి గుడ్ న్యూస్ చెప్పిన నితిన్
టాలీవుడ్ హీరో నితిన్.. గతేడాది సెప్టెంబరులోనే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అయితే అప్పటినుంచి కొడుకు ఫొటోలు, వీడియోలు లాంటివి పెద్దగా బయటపెట్టలేదు. అలానే పేరు ఏం పెట్టారనేది కూడా చెప్పలేదు. ఇప్పడు మంచిరోజు చూసుకుని మరీ గుడ్ న్యూస్ చెప్పాడు. తన కుమారుడికి ఏం పేరు పెట్టామనేది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: 'కూలీ' vs 'వార్ 2'.. రెండు రోజుల కలెక్షన్ ఎవరికెంత?) 2020లో నితిన్.. షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ తొలుత ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది సెప్టెంబరు 6న తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని నితిన్ బయటపెట్టాడు. ఇప్పుడు దాదాపు 11 నెలల తర్వాత కృష్ణాష్టమి సందర్భంగా తన కుమారుడికి 'అవ్యుక్త్' అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.నితిన్ సినిమాల విషయానికొస్తే.. గత కొన్నేళ్లలో వరసపెట్టి తీస్తున్న మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో 'రాబిన్ హుడ్' చిత్రంతో రాగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. గత నెలలో 'తమ్ముడు' అని పలకరించాడు. ఇది కూడా ఘోరమైన డిజాస్టర్గా మిగిలింది. ప్రస్తుతానికైతే 'బలగం' దర్శకుడు వేణు తీయబోయే 'ఎల్లమ్మ' అనే మూవీ చేయాల్సి ఉంది. మరి ఇది ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్ షాహిర్) View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) -
'కూలీ' vs 'వార్ 2'.. రెండు రోజుల కలెక్షన్ ఎవరికెంత?
స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ సందర్భంగా రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే రెండు కూడా పూర్తిస్థాయిలో హిట్ అనిపించుకోలేకపోయాయి. కొందరికి ఈ మూవీస్ నచ్చితే.. మరికొందరు మాత్రం ఓకే ఓకే ఉన్నాయని అంటున్నారు. ఏదైతేనేం లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో ప్రేక్షకులు.. థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా బాగానే కనిపిస్తుంది. ఇంతకీ రెండు రోజుల్లో ఈ చిత్రాలకు ఎంతెంత వచ్చాయి? ఎవరు ముందున్నారు?'కూలీ' గురించి ముందుగా మాట్లాడుకుంటే.. తొలిరోజు రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. తమిళంలో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన సినిమాగా రికార్డ్ కూడా సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. అయితే మొదటిరోజుతో పోలిస్తే రెండోరోజు నంబర్లు కాస్త డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఓవరాల్గా రూ.86 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. అంటే రెండు రోజుల్లో కలిపి దగ్గరదగ్గర రూ.240 కోట్ల వసూళ్లు వచ్చినట్లు టాక్.(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్ షాహిర్)'కూలీ' రెండో రోజ వసూళ్లలో తమిళం నుంచి రూ.34 కోట్లు రాగా, తెలుగు-హిందీల నుంచి వరసగా రూ.13.5 కోట్లు, రూ.7.5 కోట్లు వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్లోనూ తమిళంతో పాటు తెలుగు నుంచి ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయని దీనిబట్టి అంచనా వేయొచ్చు. రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్.. ఇలా స్టార్స్ ఉండటం ఈ మూవీకి ఓ రకంగా బాక్సాఫీస్ దగ్గర ప్లస్ అవుతోంది.మరోవైపు 'వార్ 2' విషయానికొస్తే.. నిర్మాతలు అధికారికంగా వసూళ్ల లెక్కలు ప్రకటించలేదు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండు రోజుల్లో కలిసి రూ.115 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రెండోరోజు రూ.56.5 కోట్ల నెట్ వచ్చినట్లు వినిపిస్తోంది. మొదటిరోజుతో పోలిస్తే రెండోరోజే కాస్త పెరుగుదల కనిపించింది. ఓవరాల్గా హిందీలో రూ.75 కోట్ల నెట్ రాగా, తెలుగు నుంచి రూ.40 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే 'కూలీ'నే ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి వీకెండ్ అయ్యేసరికి అధికారిక నంబర్లు ప్రకటిస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
నాగార్జున, చిరంజీవితో చేసిన హీరోయిన్.. ఈమెని గుర్తుపట్టారా?
తెలుగు సినిమాల్లో హీరోయిన్ అనగానే ముంబై నుంచి లేదంటే కేరళ కుట్టీలు ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ కర్ణాటక నుంచి ఈమె తెలుగులో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. మొన్నటికి మొన్న నాగార్జునతో మూవీ చేసింది. ఇప్పుడు చిరంజీవితో చేస్తోంది. మరి ఇంతలా చెప్పాం కదా! ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)పైన ఫొటోలో కనిపిస్తున్న పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఆమెనే ఆషికా రంగనాథ్. కర్ణాటకలోని తుమకూరులో పుట్టింది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే 2014 టైంలోనే మిస్ ఫ్రెష్ ఫేస్ అనే అందాల పోటీలో పాల్గొని రన్నరప్గా నిలిచింది. కానీ మహేశ్ బాబు అనే దర్శకుడి దృష్టిలో పడి, అతడు తీసిన 'క్రేజీ బాయ్' సినిమాతో హీరోయిన్గా మారింది.2016 నుంచి సినిమాలు చేస్తున్న ఆషిక.. కన్నడ స్టార్ హీరోలైన శివరాజ్ కుమార్, సుదీప్, పునీత్ రాజ్ కుమార్ చిత్రాల్లో నటించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోకి కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది కానీ నటిగా ఈమెకు మంచి మార్క్స్ పడ్డాయి. నాగార్జునతో చేసిన 'నా సామి రంగ' కూడా ఈమెలో గ్లామర్, యాక్టర్ని అందరికీ పరిచయం చేసింది.(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్ షాహిర్)'నా సామి రంగ'లో ఆషికని చూసిన 'విశ్వంభర' టీమ్.. తమ చిత్రంలో కీలక పాత్ర కోసం అవకాశమిచ్చింది. చిరు చేస్తున్న 'విశ్వంభర'లో ఆషికా.. అతిలోక సుందరి తరహా పాత్ర చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగానూ ప్రకటించింది. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే గనక ఆషికకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ.ఇకపోతే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన చిన్నప్పుడు జెండా పట్టుకుని దిగిన ఓ ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. దాన్ని చూసిన నెటిజన్లు.. చిన్నప్పుడు ఆషిక ఇలా ఉందా? ఇప్పుడు మాత్రం చాలా అందంగా ఉందే అని మాట్లాడుకుంటున్నారు. వ్యక్తిగత జీవితానికొస్తే.. కొన్ని నెలల క్రితం ఈమె అక్క అనుష పెళ్లి చేసుకుంది. మరి ఆషిక ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: విజయ్తో రొమాంటిక్ స్టిల్.. ‘చాలా స్పెషల్’ అంటూ రష్మిక పోస్ట్) -
'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు
రీసెంట్గా వచ్చిన 'కూలీ' సినిమా.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. వీకెండ్ కావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే ఈ చిత్రంలో అందరికంటే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. యాక్టింగ్లో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. తనదైన నటనతో కట్టిపడేశాడు. అలా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఇతడు.. ఇప్పుడు కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొనేశాడు. ఇంతకీ దీని ధర ఎంతంటే?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)ఓటీటీల్లో మలయాళ డబ్బింగ్ సినిమాలు చూసే తెలుగు ఆడియెన్స్కి సౌబిన్ చాలా ఏళ్లుగా పరిచయమే. అప్పుడెప్పుడో వచ్చిన 'ప్రేమమ్' నుంచి గతేడాది రిలీజైన 'మంజుమ్మల్ బాయ్స్' వరకు ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు 'కూలీ' సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించాడు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే సినిమాలో తన సక్సెస్ని ముందే అంచనా వేశాడో ఏమో గానీ ఈ మధ్యే బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కారుని కొనుగోలు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ కారు విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.3.30 కోట్లు వరకు ఉంది. తన కుటుంబంతో కలిసి సౌబిన్.. కారులో షికారుకి వెళ్లాడు. ఆ విజువల్స్ వీడియోలో చూడొచ్చు. 'కూలీ'తో అటు తమిళం, ఇటు తెలుగు దర్శకుల దృష్టిలో సౌబిన్ పడ్డాడు. మరి రాబోయే రోజుల్లో తెలుగు మూవీస్లోనూ ఇతడికి అవకాశాలు రావడం గ్యారంటీలానే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Roadway Cars (@roadwaycars) -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'కూలీ', 'వార్ 2'కి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వీకెండ్, సెలవులు కలిసి రావడంతో జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో చాలా వరకు డబ్బింగ్ చిత్రాలే ఉన్నాయి. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా రెండు తెలుగు మూవీస్ కూడా స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. ఇంతకీ ఏంటవి? ఎందులో చూడొచ్చు?గత నెల తొలివారం థియేటర్లలోకి వచ్చిన 'వర్జిన్ బాయ్స్' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. కాకపోతే ఐఫోన్, డబ్బులు గిఫ్ట్స్ అనే ప్రమోషన్లతో వార్తల్లో నిలిచింది. అడల్ట్ కాన్సెప్ట్, యువతని టార్గెట్ చేసుకుని తీసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోకి అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: విజయ్తో రొమాంటిక్ స్టిల్.. ‘చాలా స్పెషల్’ అంటూ రష్మిక పోస్ట్)మరోవైపు ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన 'సూర్యాపేట్ జంక్షన్' అనే తెలుగు సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. అర్జున్ (ఈశ్వర్) కాలేజీలో చదువుతూ స్నేహితులతో జాలీ లైఫ్ గడుపుతుంటాడు. జ్యోతితో(నైనా సర్వర్) ప్రేమలో పడతాడు. మరోవైపు నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు.అయితే అర్జున్ స్నేహితుల్లో ఒకడైన శీను.. ఓ రోజు హత్యకు గురవుతాడు. శీనుని ఎవరు చంపారు? ఆ ఘటన వెనకున్న రాజకీయ కుట్ర ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఈ రెండు సినిమాలతో పాటు వీకెండ్ ఓటీటీల్లో రిలీజైన వాటిలో 'జానకి.వి vs స్టేట్ ఆఫ్ కేరళ', 'గ్యాంబ్లర్స్', 'సూపర్ మ్యాన్' తదితర చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. (ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ) -
విడాకులతో సంతోషాన్ని వెతుక్కున్నా.. తప్పేముంది?: మలైకా
బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) ప్రేమలో ఓడిపోతూనే ఉంది. మలైకా.. 1998లో నటుడు అర్బాజ్ ఖాన్ను పెళ్లాడింది. వీరికి 2002లో కుమారుడు అర్హాన్ ఖాన్ జన్మించాడు. మొదట్లో బాగానే ఉన్న దంపతులు తర్వాత దూరంగా ఉండటం మొదలుపెట్టారు. 2017లో విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లాడి బాధ్యతను మాత్రం ఇద్దరూ తీసుకున్నారు. అనంతరం మలైకా.. నటుడు అర్జున్ కపూర్తో ప్రేమలో పడింది. దంపతులుగా విడిపోయినా..ఏళ్ల తరబడి రిలేషన్లో ఉన్న వీరు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని అంతా అనుకున్నారు. అంతలోనే ఈ ప్రేమప్రయాణానికి ఫుల్స్టాప్ చెప్తూ బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా మలైకా కో పెరింటింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినా పిల్లాడి కోసం తల్లిదండ్రులుగా నిలబడ్డాం. ఇప్పుడు వాడికి 22 ఏళ్లు. తల్లి దగ్గర ఏం మాట్లాడాలి? తండ్రి దగ్గర ఎలా ఉండాలి? అనేది బాగా తెలుసు. కోరుకున్నవన్నీ జరగవుకాబట్టి ఇప్పుడు పరిస్థితులు అంత జటిలంగా లేవు. ఎవరి హద్దుల్లో వాళ్లం ఉన్నాం. విడాకుల వల్ల నా కొడుకు ఎఫెక్ట్ అవకూడదనుకున్నాను. అందుకే ఇద్దరం బాధ్యతలు తీసుకున్నాం. కానీ విడాకులు ప్రకటించగానే చాలామంది ఇలా చేస్తావా? ఇలా ఉండకూడదు అంటూ నాకు నీతులు చెప్పారు. నేనేమంటానంటే కొన్నిసార్లు బంధాలనేవి జటిలంగా ఉంటాయి. నా వివాహబంధం కొనసాగాలనే కోరుకున్నాను. కానీ, అది జరగలేదు. దానికి నేనేం చేయగలను?అమ్మ కష్టాలుఅలా అని నేను ప్రేమపై విశ్వాసాన్ని కోల్పోయానని కాదు. ఏదో ఘోర తప్పిదం చేశాననీ కాదు. అందరూ తప్పంతా నాదే అన్నట్లు నావైపే వేలు చూపించారు. సెల్ఫిష్గా ఆలోచించానన్నారు. మీకలా అనిపించుండొచ్చు. కానీ, నేను ఆనందంగా ఉండాలనుకున్నాను. అందుకే ఆ బంధం నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇకపోతే నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. అమ్మ రోజంతా పని చేస్తూ బిజీగా ఉండేది. మాకోసం అహర్నిశలు శ్రమించింది. తన దగ్గరున్న వస్తువులమ్మేసి మరీ స్కూల్ ఫీజు కట్టేది. డబ్బు విలువ బాగా తెలుసుఅప్పుడు చెల్లిని నేనే చూసుకునేదాన్ని. కుటుంబం కోసం 17 ఏళ్లకే పని చేయడం మొదలుపెట్టాను. డబ్బు సంపాదించడమే నా లక్ష్యం. ఫ్రెండ్స్తో పార్టీలంటూ బయటకు వెళ్లేదాన్ని కాదు. ఇప్పటికీ డబ్బు విషయంలో నేనలాగే ఉంటాను. ప్రతి ఖర్చు పుస్తకంలో రాసుకుంటాను. మరీ ఖరీదైనవాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడను అని చెప్పుకొచ్చింది. కాగా 'చయ్య చయ్య' పాటతో ఫేమస్ అయిన మలైకా.. రాత్రైనా నాకు ఓకే (అతిథి), కెవ్వు కేక (గబ్బర్ సింగ్) పాటలతో టాలీవుడ్కు దగ్గరైంది.చదవండి: అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్బాస్ వాయిస్ తేడాగా ఉందే! -
'కూలీ' సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు: స్టార్ హీరో
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'... ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇందులో భారీ తారాగణమే ఉంది. అయితే, సినిమా క్లైమాక్స్లో ఆమిర్ ఖాన్ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సుమారు 10 నిమిషాలకు పైగా ఉన్న ఆ సీన్ కోసం ఆయన ఏకంగా రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా ఆమిర్ రియాక్ట్ అయ్యారు.కూలీ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన ఆమిర్ ఖాన్ తన రెమ్యునరేషన్ గురించి తాజాగా రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రం కోసం తాను డబ్బు తీసుకోలేదని చెప్పాడు. కేవలం రజనీకాంత్ కోసం మాత్రమే ఇందులో నటించానని తెలిపాడు. ఆపై కూలీ చిత్ర యూనిట్ మీద ఉన్న ప్రేమ వల్ల జీరో రెమ్యునరేషన్తో తన రోల్ పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ మీద ఉన్న ప్రేమ వల్ల కూలీ సినిమా కథ కూడా వినకుండా ఓకే చెప్పానని ఆమిర్ఖాన్ గుర్తుచేశాడు. తన కెరీర్లో చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి స్క్రిప్ట్ వినకుండా ఒక సినిమాకు ఓకే చెప్పానన్నాడు.భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. మొదటిరోజు ఏకంగా రూ. 151 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండురోజుల్లో రూ. 230 కోట్ల గ్రాస్ దాటినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్తో పాటు నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రచితా రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
మారణహోమం తలపించేలా 'బెంగాల్ ఫైల్స్' ట్రైలర్
‘ది కశ్మీర్ ఫైల్స్’(2022) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri). ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'బెంగాల్ ఫైల్స్'.. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు అందరినీ ఆకర్షించాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో బెంగాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను దేశ ప్రజలకు చూపించేలా ఈ చిత్ర కథనం ఉంటుంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. -
అందుకే నో కిస్ నిబంధనలను వదిలేశాను: తమన్నా
సినిమా ఆశల పల్లకి, గ్లామర్ వలయం. అంతకు మించి ప్రతిభతోపాటు అదృష్టం కూడా ఉండాల్సిన రంగం. ఈ అన్నింటిని అందిపుచ్చుకున్న బ్యూటీ తమన్నా. ఈ ఉత్తరాది భామ కథానాయకిగా దక్షిణాదిలోనే సాధించారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదు. అంతే కాదు ఐటమ్ సాంగ్స్ తనకు తానే సాటి అనిపించుకున్న ఈ బ్యూటీ.. రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయకిగా రాణించారు. అయితే, తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇందుకు వ్యక్తిగత విషయాలు కూడా ఒక కారణం కావచ్చు. మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందడం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అందు కోసం కసరత్తు చేస్తూ స్లిమ్గా తయారవుతున్నారు. ఇటీవల ఒక భేటీలో తమన్నా మాట్లాడుతూ తాను కసరత్తు చేయడం ప్రారంభించి చాలా కాలం అయ్యిందన్నారు. అయితే ఆహారం, పని, లేక వ్యక్తిగత ఇష్టాలు ఏవైనా తన ఏం చెబుతుందో అదే చేస్తానని చెప్పారు. ఏదీ బలవంతంగా చేయనని అన్నారు. తనకు అలసటగా ఉన్నా.. సరిగ్గా నిద్ర లేకపోయినా, కసరత్తులు చేయకుండా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తానని చెప్పారు. విరామ సమయాల్లో ఏదైనా ప్రశాంత ప్రదేశానికి వెళ్తానని, అక్కడ అన్నీ మరిచి ధ్యానం చేస్తానని చెప్పారు. అదే విధంగా దేవాలయాలకు వెళ్లడానికి ఇష్టపడతానన్నారు. అది మనసుకు ప్రశాంతతను ఇవ్వడంతోపాటు మంచి అనుభవాన్నిస్తుందన్నారు. సమీప కాలంలో కాశీ పయనాన్ని మరచిపోలేనన్నారు. కాశీ గొప్ప ఆధ్యాత్మిక నగరం అని పేర్కొన్నారు. అది తన మనసును ఎంతగానో ఆకట్టుకుందన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా కుటుంబంతో కలిసే వెళ్లతానన్నారు. దేవాలయాలకు మెట్ల దారి ద్వారా పయనించడంతో చరిత్రను తెలుచుకోగలుగుతామన్నారు. కాశీలో వివరించలేని ప్రశాంతత ఉంటుందన్నారు. తనకు గ్లామరస్ నటిగా ముద్ర వేశారని, అయితే ఆరంభంలో నటిగా కొన్ని కట్టుబాట్టు విధించుకోవడంతో ఛాలెంజ్తో కూడిన, శక్తివంతమైన కథా చిత్రాలను కోల్పోయాననే భావన కలిగిందన్నారు. అందువల్ల తనకు తానే విధించుకున్న నో కిస్ నిభంధనలను పక్కన పెట్టేశానన్నారు. ఆ తరువాతనే గ్లామరస్ పాత్రల్లో నటించడం మొదలెట్టానని నటి తమన్నా చెప్పారు. -
చిరంజీవి బర్త్డే గిఫ్ట్స్.. అభిమానులకు పండగే
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వంభర’ నుంచి మరో టీజర్ విడుదల కానుంది. ఈమేరకు షోషల్మీడియాలో వైరల్ అవుతుంది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది... కానీ కుదర్లేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. అయితే, ఈ మూవీకి సంబంధించి విడుదలై మొదటి టీజర్ గ్రాఫిక్స్ వర్క్పై విమర్శలు వచ్చాయి. ఆ సమయం నుంచి పెద్దగా అప్డేట్స్ మాత్రం బయటకు రావడం లేదు.విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్పై విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠి పలు జాగ్రత్తలు తీసుకున్నారట. మరింత సమయం తీసుకున్నా సరే సినిమా హిట్ కావాలనే సంకల్పంతో పనిచేశాడట. ఈ క్రమంలోనే ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు వస్తుండటంతో అభిమానులు విశ్వంభర నుంచి ఏదైనా గిఫ్ట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీజర్ను సిద్ధం చేసింది చిత్ర బృందం. ఆపై విడుదల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు అనిల్ రావిపూడి కూడా చిరు పుట్టినరోజుకు కానుక ఇవ్వాలని చూస్తున్నారట. సినిమా టైటిల్ ప్రకటించాలని ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.విశ్వంభర అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో త్రిష హీరోయిన్గా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఇదే ఏడాది చివర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. -
శ్రీకృష్ణుడి యుద్ధం
చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించనున్నట్లు ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ చిత్రబృందం ప్రకటించింది. ముకుంద్ పాండే కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో అభయ్ చరణ్ ఫౌండేషన్–శ్రీజీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ టైటిల్ను ప్రకటించారు. ‘‘ఇస్కాన్–ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ ‘జితామిత్ర ప్రభు శ్రీ’ ఆశీస్సులతో ఈ చిత్రం రూపొందుతోంది.11–12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించేలా ఈ సినిమా ఉంటుంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికతను కలగలుపుతుంది. నటీనటులు, సాంకేతిక బృందంతో పాటు పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: అనిల్ వ్యాస్. -
ఇద్దరు దేవదాసులు!
కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో రూపొందిన చిత్రం ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటించారు. తోట రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతంపోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది.‘‘పార్వతి దేవదాసుల ప్రేమకథకు ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పుడు ‘ఒక పార్వతి... ఇద్దరు దేవదాసులు’ టైటిల్తో ఓ విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాం. ముఖ్యంగా యువతీ యువకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. రఘుబాబు, కశి రెడ్డి రాజ్కుమార్, వీరశంకర్, గౌతం రాజు తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: మోహిత్ రహమానియాక్, కెమెరా: శ్రీనివాసరాజు. -
అడవుల్లో సాహసం
సాహసం చేయడానికి సై అంటూ కథానాయిక సంయుక్త అడవి బాట పట్టారు. దట్టమైన అడవుల్లో ఆమె ట్రెక్కింగ్కి వెళ్లారు. అందులోనూ వర్షం కురుస్తుండగా ధైర్యంగా ఈ సాహస యాత్ర చేశారు సంయుక్త. ఈ సాహస యాత్రకి సంబంధించిన ఫొటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారామె. ‘‘దట్టమైన పచ్చని అడవిలో ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్ అంటే సాహసమే.పైగా వర్షం కురుస్తుండగా ట్రెక్కింగ్కి వెళ్లడం ఎంతో మధురానుభూతి. ఈ ట్రెక్కింగ్లో ఎన్నో చెప్పలేనన్ని సంతోషాలు, థ్రిల్కి గురిచేసే అంశాలున్నాయి. ఇలాంటి గొప్ప అనుభవాలు మీకు ఎదురయ్యాయా?’’ అంటూ రాసుకొచ్చారు సంయుక్త. ఇక ఆమె నటిస్తున్న తాజా సినిమాల విషయానికొస్తే... తెలుగులో ‘అఖండ 2, స్వయంభు, నారీ నారీ నడుమ మురారి, విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హిందీ, తమిళ, మలయాళ సినిమాలు చేస్తున్నారు. -
హిందుస్తాన్... హిందుస్తాన్...
మేజర్ కుల్దీప్ సింగ్గా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ వెండితెరపైకి మళ్లీ వస్తున్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బోర్డర్ 2’. వరుణ్ ధావన్, దిల్జీత్ సింగ్, అహన్ శెట్టి, మేధా రాణా, మోనా సింగ్, సోనమ్ బజ్వా ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మేజర్ కుల్దీప్ సింగ్ పాత్రలో కనిపిస్తారు సన్నీ డియోల్. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘బోర్డర్ 2’ సినిమాలోని సన్నీ డియోల్ పాత్ర తాలూకు మోషన్పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.‘హిందుస్తాన్... హిందుస్తాన్... మేరీ జాన్ హిందుస్తాన్’ అనే పాటతో ఈ మోషన్పోస్టర్ సాగుతుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో భూషణ్ కుమార్, క్రిషణ్కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 22న విడుదల కానుంది. అయితే ఈ సినిమాను తొలుత జనవరి 23న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఒకరోజు ముందుగా... జనవరి 22న విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.ఇక 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘బోర్డర్’ (1997) సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ రూపొందింది. ‘‘27 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఓ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఓ సైనికుడు తిరిగి వస్తున్నాడు’’ అంటూ ఈ సినిమాను ప్రకటించిన సమయంలో ఈ చిత్రబృందం పేర్కొంది. -
'డియర్ స్టూడెంట్స్' అంటూ క్లాస్ తీసుకుంటున్న నయనతార
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న కొత్త సినిమా 'డియర్ స్టూడెంట్స్' నుంచి టీజర్ విడుదలైంది. మలయాళ కథానాయకుడు నివిన్ పౌలీ నటిస్తున్న ఈ చిత్రాన్ని జార్జ్ ఫిలిప్ రాయ్, సందీప్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో నివిన్, నయన్ కాంబినేషన్లో వచ్చిన ‘లవ్ యాక్షన్ డ్రామా’ మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఆసక్తిగానే ఉంది.నయనతార, శింబు లీడ్ రోల్స్లో నటించిన ‘వల్లభ’ (2006) సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో స్టూడెంట్ వల్లభ (శింబు),ప్రోఫెసర్ స్వప్న (నయనతార) ప్రేమించుకుంటారు. ఇప్పుడు ‘వల్లభ’ సినిమా ప్రస్తావన ఎందుకంటే ఈ తరహాలోనే తనకంటే చిన్న వయస్కుడితో ప్రేమలో పడే కథలా డియర్ స్టూడెంట్ ఉంది. -
అమ్మవారి ఆలయంలో పాపులర్ నటి.. ఎవరో తెలుసా?
తెలుగింటికి చెందిన కోమలి ప్రసాద్ ( Komalee Prasad) తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆమె దర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.డాక్టర్ నుంచి యాక్టర్గా మారిని ఈ బ్యూటీ తాజాగా హిట్ 3 సినిమాతో పాపులారిటీ పెంచుకుంది. ఇక త్వరలోనే ‘శశివదనే’ చిత్రంతో తెరపైకి రాబోతుంది. వైజాగ్కు చెందిన కోమలి ప్రసాద్లో నటి మాత్రమే కాకుండా జాతీయస్థాయి అథ్లెట్, క్లాసికల్ నృత్య కళాకారిణి అంటూ పలు రంగాల్లో ప్రతిభ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈమె రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ కళాకారిణి కూడా. విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి.ఇప్పటికే తెలుగులో నెపోలియన్,హిట్2, రౌడీ బాయ్స్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి పలు చిత్రాల్లో నటించిన కోమలి ప్రసాద్ హిట్–3 చిత్రంలో ఏఎస్పీ వర్షాగా చాలా కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈపాత్ర కోసం జాతీయస్థాయి బాక్సర్ అనిల్ వద్ద శిక్షణ పొందారు. View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) -
'మహావతార్ నరసింహ' సినిమాపై చాగంటి కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తాజాగా 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని చూశారు. ఎవరూ ఊహించని రీతిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ యానిమేషన్ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. ఆధ్యాత్మికత మార్గంలో యావత్ ప్రపంచాన్నే నడిపించే చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్తో పాటుగా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.పురాణాలకు చాలా దగ్గరగానే 'మహావతార్ నరసింహ' చిత్రం ఉందని చాగంటి అన్నారు. భక్త ప్రహ్లాద వంటి సినిమా ఇప్పటికీ ప్రజల మదిలో ఉండిపోయింది. మనుషులతో కాకుండా కేవలం బొమ్మలతో సినిమా తీసినా నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి సన్నివేషం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని సూచించారు.శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా చాగంటి కోటేశ్వరరావుతో సినిమా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు. వారిద్దరూ కలిసి 'మహావతార్ నరసింహ' సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలిపిన వీడియోను గీతా ఆర్ట్స్ షోషల్మీడియాలో షేర్ చేసింది.జులై 25న విడుదలైన 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అయితే, ఇప్పటి వరకు ఈ మూవీ సుమారు రూ. 230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా.. హోంబలే ఫిల్మ్స్తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.Chaganti Koteswara Rao garu and K.I. Vara Prasad Reddy garu share their thoughts on #MahavatarNarsimha, applauding the team for delivering a truly divine experience. Witness the divine saga at theatres near you. 🔥pic.twitter.com/qtHfd7XsJw— Geetha Arts (@GeethaArts) August 15, 2025