breaking news
Movie News
-
‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: ధురంధర్: ద రివేంజ్నటీనటులు: రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులుసంగీతం: శాశ్వత్ సచ్దేవ్సినిమాటోగ్రఫీ: వికాల్ నోవ్లఖాఎడిటర్: శివకుమార్ వి పనికర్రచన-దర్శకత్వం: ఆదిత్య ధర్నిర్మాతలు: జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్నిడివి: 229 నిమిషాలువిడుదల తేదీ: 19 మార్చి 2026గతేడాది డిసెంబరులో ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా 'ధురంధర్'. సీక్వెల్ గురించి అప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే మాటపై నిలబడి 'ధురంధర్: ద రివేంజ్'ని థియేటర్లలోకి తీసుకొచ్చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? తొలి భాగాన్ని మించిపోయిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఒక జైలు ఖైదీని సీక్రెట్ ఏజెంట్గా పాకిస్తాన్కి పంపడం అనే కొత్త పాయింటే ధురంధర్ విజయానికి కారణం అయింది. ఇంతవరకు వచ్చిన స్పె యాక్షన్ సినిమాలకు ధురంధర్కు మత్య ఉన్న తేడా అదే. దానికి తోడు యాక్షన్ సన్నివేశాలు, బీజీఎం అదిరిపోవడంతో రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్ : ది రివెంజ్ కూడా అదే రేంజ్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్కి కూడా పెద్ద పీట వేశారు. పార్ట్ 1 చూసిన వాళ్లు సినిమా ప్రారంభం నుంచే ధురంధర్ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. చూడనివారికి కూడా కథను చాప్టర్ల వారిగా విడగొట్టి.. అర్థమయ్యేలా తెరపై చూపించాడు దర్శకుడు. అయితే పార్ట్ 1 చూస్తేనే కొన్ని పాత్రలకు తాలుకు పవర్ తెలిసి..తర్వాత ఏం జరుగుతుందో ఊహించొచ్చు.చివరిలో వచ్చే కొన్ని ట్విస్టులను మాత్రం ఊహించలేం. అవి థ్రిల్కి గురి చేస్తాయి. పార్ట్1 కంటే నిడివి ఎక్కువైనా.. ఎక్కడా బోర్ కొట్టదు.హమ్జా పాత్ర ప్లాష్బ్యాక్తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై హీరో పగ తీర్చుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు అయితే ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. అక్కడ నుంచి మొదలు సినిమా ఎండింగ్ వరకు యాక్షన్ సీన్స్ను ఓ రేంజ్తో తీర్చిదిద్దారు. ల్యారీ పీఠం దక్కించుకునేందకు హమ్జా ఆడే మైండ్ గేమ్ అదిరిపోతుంది. ఉగ్రవాదులకు అంతం చేసేందుకు వేసే ఎత్తులు థియేటర్స్లో చప్పట్లు కొట్టించేలా ఉంటాయి. 2016లో జరిగిన నోట్ల రద్ధు ఘటనను కూడా ఈ కథలో ప్రస్తావించారు. నోట్ల రద్దు సరైన నిర్ణయం అనేలా ఈ చిత్రంలో చూపించారు. అలాగే మాఫీయా డాన్ దావూద్ని కూడా ఈ కథకు ముడిపెట్టడం ఆసక్తిరేకెత్తించే అంశం. ఫస్టాఫ్ వరకు కాస్త స్లోగా అనిపించినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ద్వితియార్థంలో ఏం జరుగుందా అనే ఆసక్తిని ప్రేక్షకులను కలిగించేలా ఇంటర్వెల్ కట్ చేశారు. ఇక సెకండాప్ మొత్తం కథనం పరుగులు పెడుతుంది. హమ్జాపై ఎన్సీ అస్లాం చౌదరిపై అనుమానం రావడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. హమ్జా భారత ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 30 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. క్లైమాక్స్ ఎమోషనల్గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే..సీక్రెట్ ఏజెంట్ హమ్జా పాత్రలో రణ్వీర్ సింగ్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్గా అర్జున్ రాంపాల్ అద్భుతంగా నటించాడు. ఎస్పీ చౌదరిగా నటించిన సంజయ్ దత్ నిడివి కాస్త తక్కువే. ఆయన పాత్ర ముగింపు బాగుంటుంది. ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్గా మాధవన్ తెరపై కనిపించేది తక్కువే అయినా.. గుర్తిండిపోయేలా నటించాడు. జమీల్ జమాల్గా నటించిన రాకేశ్ బేడి నవ్వులు పూయించడంతో పాటు థ్రిల్లింగ్కి కూడా గురిచేశాడు. సారా అర్జున్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మిగిలినవారంతా బాగానే చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. శాశ్వత్ సచ్దేవ్ బీజీఎం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పోరాట ఘట్టాలు వాస్తవికంగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కర్లింగ్ హెయిర్తో బిగ్బాస్ దివి..ఆరెంజ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి..!
కర్లింగ్ హెయిర్తో బిగ్బాస్ బ్యూటీ దివి..రెస్టారెంట్లో ఆరగిస్తున్న హీరోయిన్ మన్నారా చోప్రా..ఆరెంజ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి హోయలు..కల్లు తాగుతూ చిల్ అవుతోన్న హేమ, సురేఖావాణి..బీచ్లో ఎంజాయ్ చేస్తోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by @natasastankovic__ -
టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెలుగులోనూ ప్రీమియర్స్
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దురంధర్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడగా.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేవలం హిందీలో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే తెలుగు ఆడియన్స్ కూడా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దురంధర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రీమియర్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ వెల్లడించారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం రేపటి నుంచి మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే ప్రీమియర్స్ ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.గతేడాది రిలీజైన దురంధర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. -
దురంధర్-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్ను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ప్రదర్శించారు.ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ మూవీపై తన రివ్యూ రాసుకొచ్చారు. దురంధర్-2 ఒక మాస్టర్ పీస్ అని పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దురంధర్-2 ఫస్ట్ హాఫ్ బ్లాక్బస్టర్ అంటూ ఆడియన్స్ ట్వీటిర్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఖాయమని ప్రేక్షకులు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. It's a stunning interval now✅Finally watched the Bade Saab 🔔Wait here for the complete #Dhurandhar2Review .#Dhurandhar2 #DhurandharTheRevenge . pic.twitter.com/8zk7CEhmkA— Always Bollywood (@AlwaysBollywood) March 18, 2026 BLOCKBUSTER 🔥#Dhurandhar2 #Dhurandhar2Review#DhurandharTheRevenge pic.twitter.com/j14czkhBWh— ◔‿◔ (@KhusshRaho) March 18, 2026 RANVEER SINGH 🫡Radiant-Relentless-Roaring-Resilient-Raw 👑🔥#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar2Review @RanveerOfficial @AdityaDharFilms pic.twitter.com/65jgu2Bmy4— Shikhar Negi (@ImshikharNegi) March 18, 2026 #Dhurandhar2 crushing cringe Bollywood #DhurandharTheRevenge #Dhurandhar2review pic.twitter.com/Hy83od6XCR— Viral (@drviral1123) March 18, 2026 Ohhh mannnBLOCKBUSTER 1ST HALFThis is not going to stop soonThe opening sequence Jassi's back storyAnd many things Don't want to spoil it for u guyzzBut this is a Box office Tsunami#DhurandharTheRevengePremiere#Dhurandhar2Review Bgm is a hit miss because we are spoiled— Aarav jain (@sanidhya_jain18) March 18, 2026 -
కేడీ సాంగ్ వివాదం.. సింగర్ మంగ్లీ పోస్ట్ వైరల్
కేడీ మూవీ సాంగ్ వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. హిందీ వర్షన్ లిరిక్స్పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఏకంగా సాంగ్నే యూట్యూబ్ నుంచి తొలగించారు. కన్నడ హీరో ధృవ సర్జా హీరోగా కేడీ చిత్రానికి సంబంధించి సర్కే చునార్ తేరి సర్కే అనే పాటను ఇటీవలే రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ను సింగర్ మంగ్లీ పాడారు. తాజాగా ఈ సాంగ్ వివాదంపై సింగర్ మంగ్లీ స్పందించారు. ప్రజల మనోభావాలను తాను ఎప్పుడు గౌరవిస్తానని అన్నారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వివాదం పట్ల బాధగా ఉందని.. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదన్నారు. లిరిక్స్లో మార్పు చేశారని.. అప్డేట్ అయిన సాంగ్ త్వరలో విడుదల చేస్తారని మంగ్లీ రాసుకొచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని హామీ ఇస్తున్నా తన నోట్లో ప్రస్తావించారు.కేడీ: ది డెవిల్ మూవీ సాంగ్ను అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. అయితే కేవలం హిందీ వర్షన్ లిరిక్స్పై మాత్రమే తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్లో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
కల్లు తాగుతూ టాలీవుడ్ తారల చిల్.. వీడియో వైరల్!
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో హేమ, సురేఖవాణి ముందువరుసలో ఉంటారు. పలు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. ఎప్పుడు సినిమా వర్క్ లైఫ్లో బిజీగా ఉండే వీరిద్దరు సమ్మర్లో చిల్ అవుతూ కనిపించారు.తాజాగా ఓ గ్రామానికి వెళ్లిన హేమ, సురేఖవాణి ఫుల్గా చిల్ అయ్యారు. ఈత చెట్టు నుంచి కల్లు తీస్తూ కనిపించారు. ఇద్దరు కలిసి సరదాగా కల్లు తాగుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
తిలక్ వర్మకు గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. అదేంటంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి, రైరై రారా అంటూ సాంగ్స్ ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.తాజాగా పెద్ది మూవీ సెట్స్లో వరల్డ్ కప్ హీరో, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. మూవీ షూటింగ్ సెట్స్కు వెళ్లిన తిలక్ వర్మ.. రామ్ చరణ్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మకు రామ్ చరణ్ ఓ బ్యాట్ను గిఫ్ట్గా ఇచ్చారు. పెద్ది మూవీ షూట్లో వాడిన పాత బ్యాట్ను తిలక్ వర్మకు బహుమతిగా అందించారు. అంతేకాకుండా వరల్డ్ కప్లో తిలక్ వర్మ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పెద్ది మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. T20 World Cup champion @TilakV9 visited the sets of #Peddi ❤🔥He caught a glimpse of the film’s sports sequences and was thoroughly impressed.#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/Csyce4KCNH— Vriddhi Cinemas (@vriddhicinemas) March 18, 2026 -
'ఒత్తిడిలో మెడిసిన్లా ఈ సినిమా..' డైరెక్టర్పై నాగార్జున ప్రశంసలు
మేడ్ ఇన్ కొరియా మూవీపై టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్ఏ కార్తీక్ను అభినందించారు. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడే చూశానని.. పూర్తిగా అస్వాదించానంటూ ట్వీట్ చేశారు. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి సినిమా మంచి మెడిసిన్గా పనిచేస్తుందని నాగ్ కొనియాడారు. ఈ సినిమాలో మెప్పించిన ప్రియాంక మోహన్ను ప్రత్యేకంగా అభినందించారు.కొరియన్ కాన్సెప్ట్తో తీసిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీలో ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించింది. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో నంబర్వన్గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రశంసించారు. Congratulations to my director @Rakarthik_dir for this uplifting film feel good #MadeinKorea on Netflix!! Totally enjoyed it 😊the right medicine for these stressful times💐 special shout out to @priyankaamohan https://t.co/vV5Kqa3Pdq— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2026 -
విజయాల పాట...వివాదాల బాట
భారతీయ సినిమాల్లో మాత్రమే కనిపించే పాటలు ఓ రకంగా ఇక్కడి సినిమా విజయాలకు అత్యంత కీలకం అని తెలిసిందే. అయితే అవే పాటలు వివాదాలకు కేంద్రబిందువవుతూ ఒక్కోసారి నిషేధాలను కూడా ఎదుర్కుంటున్న పరిస్థితికి కూడా పాటకు ఉన్నంత చరిత్ర ఉంది. ఓ వైపు సినిమా సంగీతం ప్రేక్షకులను అలరించడంలో కీలక పాత్ర పోషిస్తూనే, కొన్ని కొన్ని పాటలు మళ్లీ ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చాయి. తాజాగా విడుదలైన సర్కే చునర్ తెరి సర్కే కూడా తీవ్రవివాదంలో ఇరుక్కుంది. ఈ ‘సర్కే చునర్ తెరి సర్కే’ అనే పాటలో నోరా ఫతేహి, సంజయ్దత్లు ప్రధానంగా కనిపిస్తారు. అయితే ఇందులో ఉన్న అసభ్యకర మైన సాహిత్యం నృత్య భంగిమలు ఉన్నట్టుగా ప్రేక్షకుల నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటను ‘‘చీప్’’గా అభివర్ణిస్తూ పలువురు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, చివరికి యూట్యూబ్ నుంచి ఈ పాటను తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఈ చిత్ర నిర్మాత, పాట రచయిత తదితరులపై కేసులు కూడా నమోదవడం జరిగింది. ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన పాటలను పరిశీలిస్తే...‘టటేరీ’ పాటతో బాద్షా వివాదాల బాట..ఇదే ఏడాదిలో మ్యూజిక్ ఇండస్ట్రీని కుదిపేసిన మరో వివాదం టటేరీ...ఈ పాటను ప్రముఖ ర్యాపర్ బాద్షా రూపొందించారు. పాటలోని అసభ్యకర కంటెంట్, మహిళలను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యల కారణంగా తీవ్ర పాట తీవ్ర విమర్శలకు గురైంది. విమర్శల దాడి తీవ్రతరం కావడంతో చివరకు హర్యానా స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. పలు కేసులు నమోదయ్యాయి. చివరికి బాద్షా క్షమాపణలు చెప్పి పాటను డిజిటల్ వేదికల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.నేటి ఖల్ నాయక్ నాటి ఖల్నాయక్...ఇలాంటి వివాదాలు మరీ కొత్తవేమీ కావు. గతంలో అంటే దాదాపు 3దశాబ్ధాల క్రితమే 1993లో విడుదలైన ఖల్నాయక్ సినిమాలోని చోలీకే పీఛే క్యాహై పాట కూడా పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. ఈ పాటలో ద్వందార్థ పదాలు శృతిమించాయంటూ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఛోళీ కే పీఛే క్యా హై పాట హిట్ అయినప్పటికీ, దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోలో నిషేధించారు. ఈ పాటలో నాటి బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మాధురీ దీక్షిత్ నర్తించగా,ఆ పాటలోనూ డాన్గా నటించింది సంజయ్ దత్ కావడం విశేషం. మరో విచిత్రం ఏమిటంటే... సర్కే చునర్ తెరి సర్కే పాటలో కూడా ఖల్ నాయక్ ప్రస్తావన ఉండడం. అదేవిధంగా, 1994లో వచ్చిన సెక్సీ సెక్సీ సెక్సీ ముఝే లోగ్ బోల్తీ పాట కూడా వివాదానికి గురైంది. ఇందులో ‘సెక్సీ’ అనే పదం వాడటం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పాట లిరిక్స్ను ‘‘బేబీ బేబీ బేబీ’’గా మార్చాల్సి వచ్చింది.అశ్లీలం ఒకటే కాదు ఇతర కారణాలు కూడా పాటలకుచిక్కులు తెచ్చిపెడుతున్న వైనం కనిపిస్తుంది. గత 2007లో విడుదలైన ఆజా నాచ్లే టైటిల్ ట్రాక్ కూడా వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాటలోని ఒక లైన్ కులవివక్షను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు రావడంతో ఈ పాటను మన తెలుగులో కూడా తరచుగా పాటలు వివాదస్పదం అవుతున్నాయి. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలోని దబిడి దబిడి పాట కూడా నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. కాలం మారినా, వివాదాస్పద పాటల చరిత్ర మాత్రం కొనసాగుతూనే ఉంది. కానీ ఒక స్పష్టమైన మార్పు ఏమిటంటే ఇప్పుడు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా వెంటనే స్పందిస్తూ కంటెంట్పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఫలితంగా, చిత్రసీమ కూడా మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది భవిష్యత్తులో మరింత నాణ్యమైన, బాధ్యతాయుతమైన కంటెంట్కు దారితీయొచ్చునని ఆశించవచ్చు. -
'అలా చేయడం చాలా అసహ్యాంగా ఉంది'.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. పాలిటిక్స్లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంటుందని అన్నారు. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే కాదని.. ఎక్కడ జరిగినా సమంజసం కాదన్నారు. నటులు ఉంటే కేవలం రాజకీయాల్లో పావుగా వాడుకునే వస్తువులు కాదని ట్వీట్ చేశారు. వారికి కుటుంబం, గౌరవం, పర్సనల్ లైఫ్ అనేవి కూడా ఉంటాయన్నారు. ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని సూచించారు. మన భారతీయ సంస్కృతి, దాని మూలాల్లోనే మహిళలను శక్తిగా గౌరవిస్తామని రాసుకొచ్చారు. అలాంటి శక్తిగా భావించే మహిళలను వారిని వార్తా శీర్షికల కోసం అవమానించేలా ఉండకూడదని పోస్ట్ చేశారు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దామని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.విజయ్- త్రిష ఎపిసోడ్పైనే..ఇటీవల కోలీవుడ్లో విజయ్-త్రిష వ్యవహారం అనూహ్యంగా తెరపైకొచ్చింది. విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో త్రిష గురించి చర్చ నడుస్తోంది. త్రిష- విజయ్ల మధ్య రిలేషన్ ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిషకు అండగా పలువురు కోలీవుడ్ నటీనటులు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. అది వారి వ్యక్తిగత జీవితమని.. మనం కేవలం సినిమాల గురించి మాత్రమే చర్చించాలని ఓ సీనియర్ నటుడు అన్నారు. తాజాగా మంచు విష్ణు సైతం ఈ విషయంతో త్రిషకు మద్దతుగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Reading about the political campaigns in my Tamil Nadu. Felt It’s in extremely poor taste to drag actresses into political narratives. Not just in TN but anywhere. Actors are not political punching bags. They are individuals with families, dignity, and a life beyond the…— Vishnu Manchu (@iVishnuManchu) March 17, 2026 -
స్టార్ హీరోయిన్ బయోపిక్ లో సాయిపల్లవి?
-
త్వరలోనే విజయతో పెళ్లి.. హింట్ ఇచ్చిన త్రిష తల్లి
-
నా భార్య రెండు ఇండక్షన్ స్టవ్స్ ఆర్డర్ చేసింది: హీరో
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్లో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. దీంతో ఇప్పటికే అనేక హోటళ్లు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి, కరెంట్ స్టవ్లమీద వంట చేస్తున్నాయి. అటు ప్రజలు సైతం సిలిండర్లు సమయానికి రావకపోవడంతో ఇండక్షన్ స్టవ్లు ఎగబడి మరీ కొంటున్నారు. రెండు ఆర్డర్..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా అదే పని చేశాడు. ఓ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. నా భార్య (ట్వింకిల్ ఖన్నా) నిన్నగాక మొన్న రెండు ఇండక్షన్ స్టవ్స్ ఆర్డర్ పెట్టింది. అదింకా డెలివరీ అయిందో, లేదో నాకు తెలీదు. ఎందుకైనా మంచిది, మీరు కూడా ఒకటి కొనుక్కుంటే బెటర్ అన్నాడు. సినిమాప్రస్తుతానికి తమ ఇంట్లో వంటగ్యాస్ కొరత లేదని, కాకపోతే బ్యాకప్ కోసం ఇండక్షన్ స్టవ్ రెడీ చేసుకుంటున్నట్లు తెలిపాడు. అక్షయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ చిత్రం భూత్ బంగ్లా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇది కాకుండా ఆయన చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయి.చదవండి: చికిరి చికిరి పట్టించుకోలేదు.. ఈ పాట వల్లే అభాసుపాలు: గేయరచయిత -
ఆ 'చికిరి చికిరి' పట్టించుకోలేదు.. ఈ పాట వల్ల తీవ్ర అవమానం!
తమిళ హీరో ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "కేడీ: ద డెవిల్". బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, శిల్పాశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటం సాంగ్లో మెరిసింది. ఇటీవలే కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆ ఐటం సాంగ్ను విడుదల చేశారు.బూతు పాటఅయితే హిందీలో ఆ పాట లిరిక్స్ పచ్చిబూతులతో అసభ్యంగా ఉంది. డ్యాన్స్ కూడా అశ్లీలంగా ఉండేసరికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో కేంద్రం.. ఈ పాటను తొలగించాలని ఆదేశించింది. అలా హిందీ వర్షన్ను యూట్యూబ్ నుంచి తీసేశారు. తాజాగా ఈ వివాదంపై హిందీలో 'సర్కే చునర్' పాటకు లిరిక్స్ అందించిన గేయరచయిత రఖీబ్ ఆలం స్పందించాడు. నేను సొంతంగా రాయలేదుఆ లిరిక్స్ సొంతంగా తాను రాసినవి కావన్నాడు. కన్నడలో దర్శకుడు ప్రేమ్ రాసిన లిరిక్స్నే యథాతథంగా హిందీలో అనువదించాను. నిజానికి ఈ పాటను హిందీలో రాయమన్నప్పుడే నేను తిరస్కరించాను. ఇలాంటివి సెన్సార్ ఒప్పుకోవు, వర్కవుట్ కాదన్నాను. కన్నడ వర్షన్ను అచ్చుగుద్దినట్లుగా హిందీలో మార్చమని అప్పగించారు. చాలా డబుల్ మీనింగ్ లైన్స్ ఉన్నాయి. కానీ అదంతా ఒక మద్యం సీసా గురించి అని వారు చిట్టచివర్లో బయటపెట్టారు. అవేవీ గుర్తించలేదుఅయితే అది తెలిసేవరకు ఆ లైన్స్ అన్నీ అసభ్యకరంగానే అనిపిస్తాయి. అదే విషయం నేనూ చెప్పాను. అసలు ఇలాంటి పాటలు రాయాల్సిన అవసరం నాకేంటి? నేను మంచి పాటలు రాసినప్పుడు ప్రజలు వాటిని పట్టించుకోరు. రామ్చరణ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాటకు హిందీలో నేనే సాహిత్యాన్ని అందించాను. పుష్ప మూవీలోని అన్ని పాటలు హిందీలో నేనే రాశాను. అవేవీ గుర్తించలేదు.. కొత్త వర్షన్ వస్తుందికానీ సర్కే చునర్ సాంగ్ వల్ల అభాసుపాలయ్యాను, ఎంతో అవమానకరంగా ఉంది. నేను చెప్పినట్లే పాటపై అభ్యంతరాలు వచ్చాయి. దాంతో మేకర్స్ ఎటువంటి అసభ్యతకు చోటు లేకుండా కొత్త వర్షన్ రాయమని అడిగారు. అది ఆల్రెడీ రాసి పంపాను. త్వరలోనే చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పి కొత్త లిరిక్స్తో ఉన్న పాట రిలీజ్ చేస్తుంది అని రఖీబ్ చెప్పుకొచ్చాడు.చదవండి: సినిమాపై భయం.. అబ్బాస్కు మంచి కమ్బ్యాక్: జీవీ ప్రకాశ్ కుమార్ -
ఈ స్థాయికి హ్యాపీ: రాశీ ఖన్నా
‘‘చిత్ర పరిశ్రమలో నాకెలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నప్పటికీ ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఏ స్థాయి నుంచి వచ్చాను? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను? అన్నది చూసుకుంటే సంతోషంగా ఉంటుంది. దాదాపు 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇన్నేళ్ల నా కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా చెప్పా రు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నా పాత్ర పేరు శ్లోక. చాలా మోడ్రన్ అమ్మాయి. మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీలో నాకు ఒక మాస్ సాంగ్ ఉంది.నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ పాట చిత్రీకరణని చాలా ఎంజాయ్ చేశాను. తెలుగువారి పండగైన ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వస్తోంది. ఈ మూవీ చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి థియేటర్లో చూడొచ్చు. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్గారితో ఒక సినిమా, అలాగే ‘ఫర్జీ 2’ షో చేస్తున్నాను. అమెజాన్ సిరీస్లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందులో నా డైలాగ్స్ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్లో ‘రౌడీ అండ్ కో’ మూవీలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కథలు వింటున్నాను’’ అని చెప్పా రు. -
చాంద్ దేఖ్ లేనా..
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాతృభూమి’. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సల్మాన్ సైనికాధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘చాంద్ దేఖ్ లేనా..’ పాట టీజర్ను రిలీజ్ చేసి, త్వరలోనే పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.హిమేష్ రేష్మియా స్వరపరచిన ఈ పాటకు సమీర్ అంజాన్ సాహిత్యం అందించగా, నిహాల్ టౌరో–అంకోనా ముఖర్జీ పాడారు. ఈ సినిమాకు తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే టైటిల్ను అనుకుని, ఇటీవల ‘మాతృభూమి’గా మార్చారు. అలాగే ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడిందని, ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావొచ్చని బాలీవుడ్ టాక్. -
మార్చిందిరా...
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ రాజ్’. ఈ చిత్రంలో శ్రీగౌరీ ప్రియ హీరోయిన్గా నటించారు. దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన రాజా ఇళంజెళియన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జైవర్ద నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా ఈ నెల 27న ఈ ‘హ్యాపీ రాజ్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.మంగళవారం ఈ చిత్రంలోని ‘అద్దిరా లెక్క..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పక్షిలాగా ఉండే నన్ను చెట్టు లాగా మార్చింది రా... సాదాసీదా పిల్లోణ్ణి నేను... మహాస్మార్టుగా చేసేసిందిరా..’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ స్వరకల్పనలో ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా, గోవింద్ ప్రసాద్ ఆలపించారు. -
త్వరలోనే విజయ్తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!
టీవీకే పార్టీని స్థాపించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్కి ఆయన సతీమణి సంగీత భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విజయ్తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం.. ఒక నటితో ఆయన సహజీవనం చేస్తున్నాడని ఆరోపించడంతో త్రిష పేరు బయటకు వచ్చింది. విజయ్ సహజీవనం చేస్తున్నది త్రిషతోనే అని తమిళ మీడియా కోడై కూసింది. అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు. అప్పటి నుంచి విజయ్, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా పుకార్లే అని అంతా భావిస్తున్న తరుణంలో త్రిష తల్లి చేసిన ఓ పని.. మరోసారి వీరిద్దరి పెళ్లిపై చర్చకు దారి తీసింది.అలా హింట్ ఇచ్చిందా?త్రిష,విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైనప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై నెట్టింట రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కొంతమంది అయితే ఏఐని ఉపయోగించి పెళ్లి వీడియో క్రియేట్ చేసి..సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలా విజయ్ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీతో విజయ్, త్రిషల పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరైనట్లు వీడియో క్రియేట్ చేశాడు. అది నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ వీడియోకి త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టారు. దీంతో విజయ్తో పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ..ఆమె లైక్ కొట్టిన పోస్ట్ని వైరల్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత పెళ్లివిజయ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తమిళనాడు ఎన్నికలపైనే పెట్టాడు. పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నా.. ఈ సారి ఒంటరిగానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై ఇరు కుటుంబాలలో చర్చలు కూడా జరిగాయట. ఇక సంగీత విషయానికొస్తే.. ఓ అభిమానిగా పరిచయం అయితే ఈమెను.. విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1999లో వీరిద్ద వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా విజయ్, సంగీత వేరు వేరుగా ఉంటున్నారు. -
విజయ్- త్రిష ఎపిసోడ్పై మరో కొత్త పుకారు!
కోలీవుడ్లో విజయ్- త్రిష ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్ ఉమా కృష్ణన్ ఆ వీడియోను లైక్ కొట్టింది.ఈ రీల్కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్కు లైక్స్ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. -
'ఇతరుల జీవితాల్లోకి చూడడమే వారి పని'.. త్రిష వ్యవహారంపై ఖుష్బు కామెంట్స్
కోలీవుడ్లో విజయ్- త్రిష వ్యవహారం హాట్టాపిక్గా మారింది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత అందరి దృష్టి ఒక్కసారిగా త్రిషపై పడింది. అంతేకాకుండా వీరిద్దరు జంటగా ఓ వివాహా వేడుకకు హాజరు కావడంతో మరించ చర్చకు దారితీసింది. ఆ తర్వాత తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ త్రిషను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారు. అతని కామెంట్స్పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత క్షమాపణలు కోరాడు. అయితే తాజాగా విజయ్, త్రిషలపై వస్తోన్న వార్తలపై నటి ఖుష్బూ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె త్రిష గురించి మాట్లాడారు. ఆమె చాలా హుందాగా ఉంటుందని తెలిపారు. త్రిష గురించి తెలియనివారు చేసే కామెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారికి మనం స్పందించాల్సిన పనిలేదని తెలిపారు. నాకు త్రిష గురించి బాగా తెలుసని.. తను చాలా సెన్సిటివ్ పర్సన్ అని ఖుష్బూ వెల్లడించారు. దురదృష్టవశాత్తూ మనం తుమ్మినా కూడా నిందించే రోజుల్లో ఉన్నామని అన్నారు. తనకు తెలిసిన వారిలో త్రిష అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి అని ఖుష్బూ తెలిపారు. పెళ్లికి కలిసి వెళ్లడం అనేది వారి వ్యక్తిగతమని.. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆమె అన్నారు.ఖుష్బూ మాట్లాడుతూ.. 'దురదృష్టవశాత్తు మనం తుమ్మినా కూడా నిందను మరొకరిపై వేయాలనుకునే కాలంలో ఉన్నాం. నాకు తెలిసినంత వరకు త్రిష అత్యంత హుందాగా ఉండే మహిళ. అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి. కొందరు తమ సమస్యలను పట్టించుకోకుండా.. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ఆనందించే వ్యక్తులు ఉంటారు. ఇతరులపై కామెంట్స్ చేస్తూ ఒక రకమైన వికృత ఆనందాన్ని పొందుతారు. వారిలో 99.9 శాతం మంది ఎవరో కూడా మనకు తెలియదు. ఎవరైనా సరే ఇతరులు చేసే వ్యాఖ్యలకు మనం బాధ్యులు కాదు. వాటికి స్పందిస్తూ మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఎయిర్పోర్టుల్లో ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కల్చర్ ముంబయిలో మాత్రమే ఉండేదని.. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు చెన్నైకి కూడా పాకిపోయింది" అని అన్నారు.Trisha is most DIGNIFIED WOMEN I've ever met & most GENTLEST SOUL:- Actress #Kushboo #Trisha #Trishakrishnan pic.twitter.com/BVZHqZPYJK— Milagro Movies (@MilagroMovies) March 17, 2026 -
రిలీజ్కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. కాంతార-2, ఛావా సినిమాలను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్గా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దురంధర్ ది రివెంజ్ పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అడ్వాన్స్ బుకింగ్స్లో దూకుడు..ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్తో కలిసి ఏకంగా రూ.123 కోట్లు వసూలు చేసింది. రిలీజ్కు ముందే సరికొత్త రికార్డులతో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. మరిన్ని షోల బుకింగ్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నందున.. రాబోయే రెండు రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.దేశవ్యాప్తంగా మార్చి 18న 'ధురందర్ 2' ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్స్ ద్వారా రూ.38.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్తో ఓజీ, బాహుబలి-2 ప్రీమియర్ షోల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇండియాలో మొదటి రోజు 13 వేల షోల ద్వారా ఈ చిత్రం రూ. 24.50 కోట్ల దేశీయ వసూళ్లు రాబట్టింది. ప్రీ సేల్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో సుమారు రూ. 60 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రీ బిజినెస్ రూ. 123 కోట్లకు చేరుకుంది. -
సినీ నటీనటులు వెబ్సిరీస్ల్లో నటించకూడదు
తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా తమిళ సినీ నిర్మాతల మండలి ఇటీవల చైన్నెలో సమావేశమైంది. తమిళ సినీ యాక్టివ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు టీజీ త్యాగరాజన్, తమిళనాడు సినీ థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రహ్మణ్యం, తమిళనాడు సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు ఆరుళ్పతి ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా ‘‘ నటీనటులు గానీ, దర్శకులు, ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు ఓ నిర్మాత నుంచి అడ్వాన్స్ పొంది ఉంటే ముందుగా ఆయన చిత్రాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత నివ్వాలి. సినిమాల్లో నటించే నటీనటులు, దర్శకులు, సాంకేతిక వర్గం వెబ్ సిరీస్లో నటించడం గానీ, దర్శకత్వం వహించడం గానీ చేయరాదని తీర్మానించారు. అలా కాని పక్షంలో వారికి సినిమాల్లో పనిచేయడానికి సహకరించబోమని స్పష్టం చేశారు. ప్రముఖ నటులు రెవెన్యూ షేర్ విధానంలో చిత్రాల్లో నటించడానికి సహకరించాలి. చిత్రాలు విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని ఈ విధానాన్ని తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ అమలు పరిచేలా ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. ఈ తీర్మానాన్ని అమలు పరచడానికి డిస్టిబూటర్లు, థియేటర్లతో కలిపి ఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలకు చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని సంఘాలు కట్టుబడి ఉండాలని తీర్మానం చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్వాహకులు స్పష్టం చేశారు. -
నటనా ‘కోట’కు ఆస్కార్ నీరాజనం
కంకిపాడు: పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీనటుడు కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడు. తన హావభావాలు, నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, తనకంటూ సినీ జగత్తులో కొన్ని పేజీలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన నటనకు మంత్ర ముగ్ధులు కాని వారు లేరంటే అతిశయోక్తికాదు. సోమవారం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ సభలో ఇటీవల మరణించిన భారతదేశ సినీరంగ ప్రముఖులను స్మరించుకున్న నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కోట శ్రీనివాసరావును స్మరించటం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావించొచ్చు. కంకిపాడు నుంచే అన్నీ.. గతేడాది జూలైలో కోట శ్రీనివాసరావు ఆకస్మికంగా మృతి చెందటం కళాభిమానులను కలచివేసింది. అయితే ఆస్కార్ వేదికగా దక్కిన అరుదైన గౌరవానికి ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కోట పుట్టింది, పెరిగింది, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది కంకిపాడు నుంచే. చిన్న నాటి నుంచి ఇక్కడి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది. పట్టణంలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్వస్థలం ఉంది. ఇక్కడే ఆయన నివాసం కూడా ఉంది. కోట తండ్రి సీతారామాంజనేయులు లాకురోడ్డులోని గాంధీ బొమ్మ సెంటరులోని ఓ ఇంటి వద్ద వైద్యుడిగా క్లినిక్ నడిపేవారు. వైద్యుడిగా అందరికీ సుపరిచితులు. కోట శ్రీనివాసరావు ఆయన సోదరులు నరసింహారావు, శంకర్రావు నాటకరంగం నుంచి సినీరంగం వరకూ ఎదిగి అందరి మన్ననలు పొందటం తెలిసిందే. స్థానికంగా ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను అభ్యసించిన కోట.. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. కంకిపాడు, విజయవాడ, హైదరాబాద్లోని ఎస్బీఐ బ్రాంచిల్లో ఉద్యోగిగా పనిచేస్తూ సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలి నాళ్లలో నాటకరంగంలో ప్రవేశించినా.. అంతటి ప్రాచుర్యం దక్కలేదు. అయితే సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగి, విలక్షణ నటుడిగా గుర్తింపు సాధించారు. ఆయన ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించి గౌరవించారు. అరుదైన గౌరవం.. కోట సీతారామంజనేయులు కుటుంబం అందరికీ సుపరిచితం. తండ్రి వైద్య రంగంలో, కుమారులు కళారంగానికి వన్నె తెచ్చారు. మా ఇంటి పక్కనే నివాసం ఉండే వారు. వీలు దొరికినప్పుడల్లా ఆ కుటుంబంతో గడిపేవాళ్లం. ఆయన మరణం చాలా బాధించింది. అయితే ఆస్కార్ వేదికగా మా కంకిపాడు వాసికి గౌరవం దక్కటం సంతోషంగా ఉంది. – గాదంశెట్టి పరమేశ్వరరావు, కంకిపాడుసమయం చిక్కినప్పుడల్లా.. కోట ఎంత బిజీగా ఉన్నా.. ఏ కొంత సమయం చిక్కినా కంకిపాడుకు వచ్చేవారు. ఆయన స్వస్థలంలో ఉన్న నివాసానికి వచ్చి గ్రామస్తులతో ఇష్టాగోష్టి జరిపేవారు. సినీ అభిమానులు ఆయన్ను కలుసుకుని ఆశీర్వాదం పొందేవారు. కళారంగానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ కళాభిమానుల్ని ప్రోత్సహించేవారు. -
పెళ్లి పీటలెక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే?
అరుంధతి మూవీతో జేజమ్మగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న బ్యూటీ అనుష్క శెట్టి. ఆ తర్వాత బాహుబలి మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ప్రభాస్ సరసన నటించిన ముద్దుగుమ్మ.. తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే అప్పుడప్పుడు వీరిద్దరిపై పెళ్లి రూమర్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ బోలెడు కథనాలొచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్గానే మిగిలిపోయాయి.తాజాగా ఈ స్వీటీ అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఓ బిజినెస్మెన్ను పెళ్లాడనుందని సమాచారం. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్న అనుష్క బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని.. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అబ్బాయి కన్నడ కుటుంబానికి చెందినవారని.. వీరిద్దరి వివాహ నిశ్చయానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో అనుష్క పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి పీటలెక్కే ఛాన్స్ ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది ఘాటీ మూవీతో అభిమానులను మెప్పించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మలయాళంలో కథనార్ అనే భారీ బడ్జెట్ సినిమాలో అనుష్క నటిస్తున్నారు. -
'ఎవరికైనా అమ్మాయే టార్గెట్.. తన బాధ ఎవరికీ పట్టదు'.. రీతూ చౌదరి షాకింగ్ పోస్ట్
బిగ్బాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. గతేడాది బిగ్బాస్ సీజన్లో మెరిసింది. అయితే ఈ సీజన్లో మరో కంటెస్టెంట్ డీమాన్ పవన్తో కాస్తా సన్నిహితంగా మెలగడంతో డేటింగ్ రూమర్స్ వినిపించాయి. అయితే వీటిపై ఎవరూ కూడా స్పందించలేదు. తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. అమ్మాయిల జీవితం ఇంతేనంటూ తన లైఫ్లో జరిగిన బాధను వ్యక్తం చేసింది.ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉన్న రీతూ.. రెండేళ్ల క్రితం శ్రీకాంత్ అనే ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వారిద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. తాజాగా అమ్మాయిల లైఫ్ గురించి పోస్ట్ చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.రీతూ చౌదరి తన స్టోరీలో రాస్తూ.. "ఈ సమాజం అమ్మాయిలను సులభంగా జడ్జ్ చేస్తారు. ఆమెకు గతంలో ఏం జరిగిందో ఎవరూ అడగరు. తన ప్రేమ, కేరింగ్, నిజాయతీ గురించి ఎవరికీ అక్కర్లేదు. కానీ చివరకు మోసపోయేది ఒక అమ్మాయే. రిలేషన్ షిప్ బ్రేకప్, డిప్రెషన్లో ఉన్న తన ఫ్యామిలీ కోసం, కెరీర్ కోసం నవ్వుతూ ఉంటుుంది. కానీ సమాజం తన బాధని చూడదు. అందరూ రూమర్స్, ఆరోపణలే చూస్తారు. నిజం ఏంటో తెలియకుండా అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ తను అమాయకురాలు అయితే ఎందుకు సైలెంట్గా ఉంది అంటారు' అని ఆవేదన వ్యక్తం చేసింది.'ఒక అమ్మాయి హార్ట్ బ్రేకప్ చేసి ఆ అబ్బాయి ముందుకు వెళ్లిపోతాడు. అతను చాలా ఈజీగా మరో అమ్మాయితో వెళ్లిపోతాడు. అన్ని తెలిసినా కూడా సైలెంట్గానే ఉంటుంది ఆ అమ్మాయి. కొన్ని సందర్భాల్లో స్నేహం కూడా ఆయధంగా మారింది. ఒక అమ్మాయి డబ్బు కోసం, చీప్ అటెన్షన్ కోసం మరో అమ్మాయిపై ఆరోపణలు చేస్తుంది. సమాజం ముందు బ్యాడ్ చేసింది. ఒక అమ్మాయి మరో అమ్మాయిని నాశనం చేస్తుందని తెలిసినా కూడా ఆ అమ్మాయి సైలెంట్గానే ఉంటుంది. అది తన బలహీనత కాదు..అదంతా తన కర్మ అని.. దేవుడిని నమ్ముతుంది. తన గురించి నిజాలు తెలియని ఈ సమాజం జడ్జ్ చేస్తున్నా కూడా సైలెంట్ ఆ బాధని భరిస్తుంది' అంటూ తన స్టోరీలో రాసుకొచ్చింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రీతూ చెప్పింది అంతా తన గురించేనా? అని చర్చించుకుంటున్నారు. అసలు ఆ అబ్బాయి ఎవరు? తనని నెగిటివ్ చేసిన అమ్మాయి ఎవరు? అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్టోరీ తనదేనా లేదంటే తన ఫ్రెండ్ గురించేనా? అనేది తెలియాలంటే రీతూ క్లారిటీ ఇవ్వాల్సిందే. -
సాయి పల్లవి మొదటి సినిమా.. అందుకేనా టెన్షన్..!
ఎవరికైనా తొలి చిత్రం రిజల్ట్స్ కోసం ఆసక్తి ఉంటుంది. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటీనటులకు కూడా తమ కొత్త సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో అన్న టెన్షన్ ఉంటుంది. నటి సాయిపల్లవి కూడా ఇప్పుడు అలాంటి టెన్షన్లోనే ఉన్నట్లు సమాచారం. ఏమిటీ తొలి చిత్రం అని ఆశ్యర్యంగా ఉందా? డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన తమిళనాడు, నీలగిరి ప్రాంతానికి చెందిన భామ సాయిపల్లవి.నటనపై ఆసక్తితో నాట్యాన్ని కూడా నేర్చుకున్న ఈమె మొదట్లో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అలా మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రం సాయిపల్లవి దశను మార్చేసింది. ఆ చిత్ర విజయం ఈ అమ్మడిని దక్షిణాది చిత్రపరిశ్రమలో పాపులర్ చేసింది. అలా తెలుగులో నటించిన పలు చిత్రాలు హిట్ అవ్వడం, తమిళంలోనూ అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ అయ్యారు.ఇటీవల సాయిపల్లవి తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సాయిపల్లవి నటన పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్కు జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ విషయాన్ని పక్కన పెడితే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్న సాయిపల్లవి ఏక్దిన్ అనే చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దీని తరువాత రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. ఏక్ దిన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే నెలలో తెరపైకి రానుంది. ఇది థాయ్లాండ్ భాషలో రూపొందిన ఒన్ డే చిత్రానికి రీమేక్ అని తెలిసింది. ఇందులో అమీర్ఖాన్ వారసుడు జునైద్ఖాన్ హీరోగా నటించారు.జునైద్ ఖాన్ ఈయన ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అవీ పెద్దగా ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో ఏక్దిన్ నటి సాయిపల్లవికి.. నటుడు జునైద్ఖాన్లకు చాలా ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ఫలితాలపై నటి సాయిపల్లవి చాలా ఆతృతగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర ఫలితం తన కెరీర్పై చాలా ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
ఊహించని కాంబో.. స్టార్ డైరెక్టర్తో రానా దగ్గుబాటి..!
సినీ ఇండస్ట్రీలో ఒక రేర్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైవిద్య భరితమై కథా చిత్రం తెరకెక్కింది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తరువాత ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం రానా కేవలం నటుడు మాత్రమే కాకుండా నిర్మాత కూడా రాణిస్తున్నారు. ఈయన 2005లోనే స్పిరిట్ మీడియా పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే దుల్కర్ సల్మాన్తో కలిసి కాంత చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.అయితే కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గురించి తెలియని వారు ఉండరు. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా.. కార్తీక్ సుబ్బరాజ్కు చెందిన స్టోన్బెంట్ సంస్థ కలిసి నీళిరా అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించాయి. దీనికి శ్రీలంక తమిళుడు సోమిధరన్ దర్శకత్వం వహించారు. ఇందులో నటుడు నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్న ట్లు యూనిట్ వర్గాలు ఎక్స్ మీడియాలో పేర్కొ న్నారు. ఆ చిత్ర టైటిల్తో కూడిన పోస్టర్ను పోస్ట్ చేశారు. -
'అలా చేయడం సిగ్గుచేటు'.. ఆస్కార్ నివాళిపై హేమ మాలిని ఆగ్రహం..!
ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్లోని డాల్బీ థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచారు.అయితే తాజాగా ధర్మేంద్రకు ఆస్కార్ నివాళి అర్పించడంపై ఆయన భార్య హేమ మాలిని స్పందించారు. ఆస్కార్ వేదికపై ప్రసారం చేసిన మెమోరియంలో ధర్మేంద్ర ఫోటోలు లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ఇలా ప్రదర్శించడం ఆ అవార్డుల వేడుకకే సిగ్గు చేటని హేమ మాలిని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గౌరవించకపోయినా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని ఆమె అన్నారు. కేవలం అవార్డులు మాత్రమే ఆయన కెరీర్ను నిర్ణయించలేవని తెలిపారు.హేమ మాలిని మాట్లాడుతూ.. 'ఆయన తన జీవితకాలంలో ఎప్పుడూ ఎక్కువ అవార్డులు పొందలేదు. అలాంటప్పుడు ఆయన ఆస్కార్ల గురించి ఎందుకు పట్టించుకోవాలి? మా ఇద్దరికీ మన దేశంలో లభిస్తున్న ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. లాల్ పత్తర్, మీరా చిత్రాలలో నా ఉత్తమ నటనకు కూడా ఎటువంటి అవార్డు రాలేదు' అని తెలిపింది.అయితే ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా డయాన్ కీటన్, కేథరీన్ ఓహారా, రాబర్ట్ రెడ్ఫోర్డ్, ఉడో కీర్, రాబ్ రైనర్, రాబర్ట్ డువాల్, జీన్ హాక్మన్, వాల్ కిల్మర్లతో లాంటి అంతర్జాతీయ సినీ ప్రముఖులకు మాత్రమే అకాడమీ నివాళులర్పించింది. ఆ తర్వాత ధర్మేంద్రతో పాటు మరో నటుడు మనోజ్ కుమార్లను అధికారిక ఆస్కార్ వెబ్సైట్లో ఇన్ మెమోరియం జాబితాలో చేర్చారు. కాగా.. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్తో సత్కరించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుకు సైతం ఆస్కార్ అకాడమీ నివాళులర్పించింది. -
అనుబంధాలకే ఆస్కారం
ఎన్ని గ్రాఫిక్స్ వచ్చినా, ఎన్ని ఏఐ విప్లవాలు వచ్చినా, ‘ఈ జనరేషన్ కథ’ అనుకోవడానికి ఎన్ని ఫీట్లు చేసినా... గత, వర్తమాన, భవిష్యత్లలో తిరుగులేని కాలాతీత కథా వస్తువు... కుటుంబం, అనుబంధాలు, త్యాగాలు... మొదలైనవి. ‘నాది పాత స్కూలు’ అని చెబుతుంటారు డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్. సెంటిమెంట్, భావోద్వేగాలు అనే ఆ పాత స్కూల్ సబ్జెక్ట్తోనే ఆస్కార్ బరిలో సంచలనం సృష్టించారు. అతడి ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఆరు ఆస్కార్ అవార్డులు గెల్చుకుంది. ఈ ఏడాది ‘ఉత్తమ చిత్రం’గా ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంటోంది...‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అనే ప్రసిద్ధ మాట ఉన్నప్పటికీ... ఆర్థికం ఒక్కటే కాదు అనేకానేక సంబంధాలు అనుబంధాలను నిర్ణయిస్తాయి అని చెప్పుకోవడానికి ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ను ఉదాహరణగా చెపొ్చచ్చు. ‘సాగర సంగమం’ సినిమాలో పితృ సమానుడైన బాలు (కమల్ హాసన్)ను శైలు అకారణంగా ద్వేషిస్తుంటే ‘అయ్యో!’ అనిపిస్తుంది. ఆ అమ్మాయి కళ్లు తెరుచుకొని ‘మాతృదేవోభవ పితృదేవోభవ’ అని పాడుతుంటే ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. అలాంటి బలమైన భావోద్వేగాలు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’లో చాలా ఉన్నాయి.ఇదీ కథ...విప్లవ సంస్థ ‘ఫ్రెంచ్ 75’లో సభ్యులైన ΄్యాట్ కల్వాన్ (లియోనార్డో డికాప్రియో), పెర్పిడియో బెవర్లీ హిల్స్ (టెయన్ టేలర్) ప్రేమికులు. ఒక డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించబడిన వలసదారులను బయటకు తీసుకువచ్చే క్రమంలో కమాండింగ్ ఆఫీసర్ స్టీవెన్ను అవమానిస్తుంది పెర్పిడియో. దీంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు స్టీవెన్. ఒక కేసులో పెర్పిడియోను అరెస్ట్ చేసిన స్టీవెన్, తన కోరిక తీర్చితే వదిలేస్తానని చెబుతాడు. అతడి డిమాండ్కు ఆమె అంగీకరించడంతో వదిలేస్తాడు.పెర్పిడియా ‘చార్లీన్’ అనే బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తరువాత విప్లవ కార్యకలాపాలు కొనసాగించడానికి అజ్ఞాతంలోకి వెళుతుంది. బ్యాంకు దోపిడి సమయంలో సెక్యూరిటీ గార్డ్ను హత్య చేసినందుకు పెర్పిడియో అరెస్ట్ అవుతుంది. స్టీవెన్ ఆమెను జైలు నుంచి తప్పించుకునేలా చేస్తాడు. అయితే ఇది ఆమె మీద ప్రేమతో చేసింది కాదు. ‘ఫ్రెంచ్ 75’ సభ్యుల సమాచారాన్ని తెలుసుకోవాలనే కుట్రతో చేస్తాడు.పెర్పిడియో ఇచ్చిన సమాచారంతో ఆమె సహచరులను వెంటాడి, ఉరి తీస్తాడు. పదహారేళ్ల తరువాత.... చార్లీన్కు తానే తండ్రి అని తెలుసుకున్న స్టీవెన్ ఆమెను చంపేందుకు కుట్రలు చేస్తాడు. ఇన్నాళ్లు చార్లీన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ΄్యాట్ ఎలా స్పందించాడనేది కథ. తనను వదిలేసి వెళ్లిపోయిన తల్లిపై చార్లీన్కు కోపం, పెంపుడు తండ్రి (΄్యాట్)పై అనుమానం. ΄్యాట్ ఆమె నమ్మకాన్ని ఎలా గెలుచుకున్నాడనేది అసలు సిసలు కథ.వైన్ల్యాండ్ స్ఫూర్తితో...‘వైన్ల్యాండ్’ నవలను స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్ పాల్ థామస్ ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ తీశారు. థామస్ పిన్చాన్ 1990లో రాసిన పోస్ట్ మోడర్న్ నవల... వైన్ల్యాండ్. అమెరికా అధ్యక్షుడిగా రోనాల్డ్ రీగన్ తిరిగి ఎన్నికైన సంవత్సరం నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. 1960 నుంచి 1980 వరకు అమెరికన్ సమాజంలో జరిగిన రకరకాల సంఘటనలను కళ్లకు కడుతుంది.తీయలేనేమో... లేదు తీయాల్సిందే!‘ఈ నవలను సినిమాగా తీయగలనా?’ అనే సందేహం మొదట్లో పాల్ థామస్కు వచ్చింది. నవలను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఏదైనా కాన్సెప్ట్ అనుకొని తీయాలనుకున్నాడు. అప్పుడు అతడి మదిలోకి వచ్చిన ఆలోచనలు...యాక్షన్ కార్–చేజ్ మూవీ, మరొకటి... ఒక విప్లవకారిణి కథ. తండ్రి–కూతురు అనుబంధంతో పై రెండు కాన్సెప్ట్లను కలిపి సినిమా తీయాలనుకున్నారు.కారు ఛేజింగ్లు, షూటౌట్లతో యాక్షన్–హెవీ కథనం ఉండాలి. అదే సమయంలో బలమైన భావోద్వేగాలు ఉండాలనుకున్నారు. డ్రాఫ్ట్ల మీద డ్రాఫ్ట్లు రాశారు. ఎన్నోసార్లు తిరగరాసుకున్నాకగానీ తనకు స్క్రిప్ట్ సంతృప్తిగా అనిపించలేదు. అలా సినిమా తెర మీదికి వచ్చింది. ఆండర్సన్ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రానికి అయిన బడ్జెట్ చా...లా ఎక్కువ!ఒక తల్లి కథవిప్లవకారిణి, ప్రేమికురాలు, అన్యాయానికి గురైన మహిళ, ఒక బిడ్డకు తల్లిగా... రకరకాల షేడ్స్తో తన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు టెయన్ జాక్వెలిన్ టేలర్. సింగర్, సాంగ్ రైటర్, మోడల్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, మ్యూజిక్ వీడియో డైరెక్టర్గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది.డైనమిక్ డాటర్‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’లో కూతురిగా ప్రధాన పాత్ర పోషించింది అమెరికన్ నటి చేజ్ ఇన్ఫినిటి పేన్. పదేళ్ల వయసులో స్కూలులో జరిగిన సంగీత కార్యక్రమానికి ఎంపిక కావడం ద్వారా ఆమె మ్యూజిక్ జర్నీ మొదలైంది. హైస్కూల్ రోజుల్లోనే మ్యూజిక్, థియేటర్ ప్రోగ్రామ్స్తో బిజీబిజీగా గడిపేది. ‘కె–పాప్ కవర్ డ్యాన్స్ గ్రూప్’ కో–ఫౌండర్లలో ఇన్ఫినిటీ ఒకరు. ఫ్రెంచ్ బాగా వచ్చు.గతం విషయం ఎలా ఉన్నా... ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’తో ‘ఈ అమ్మాయి ఎవరు?’ అని ప్రపంచ ప్రేక్షకులు ఆరా తీసేలా నటించింది. ‘కెమెరా టెస్ట్ల తరువాత ఆండర్సన్ సినిమాకు ఎంపిక కావడం మాట ఎలా ఉన్నా, లియో డికాప్రియోతో కలిసి నటిస్తున్నాననే ఊహ భయపెట్టింది. అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెబితే, నా కంటే ఎక్కువ భయభ్రాంతులకు గురయ్యారు! ఇదొక గొప్ప అవకాశం. భయపడకూడదు’ అనుకొని చేశాను’ అంటుంది ఇన్ఫినిటీ పేన్. -
ఆమెదే ఆస్కార్!
ఆస్కార్లో ఆమె నిలిచింది... చరిత్ర సృష్టించేలా గెలిచింది... కెమెరాలో ‘ఆమె’, క్యాస్టింగ్లో ‘ఆమె’, సాంగ్లో ‘ఆమె’, కాస్ట్యూమ్స్లో ‘ఆమె’, యానిమేషన్ నిర్మాణంలో ‘ఆమె’... ఇలా సాంకేతిక విభాగాల్లో పురుషులతో పోటీ పడి ‘ఆమె’ ఆస్కార్ దక్కించుకుంది. 98వ ఆస్కార్ అవార్డ్స్లో ‘ఆమె’ తన సత్తా చాటింది. ప్రతిభతో ‘ఆస్కార్ ఆమెదే’ అని నిరూపించింది. టోటల్గా ఈసారి ‘ఫిమేల్ డామినేషన్’ కనిపించింది. ఇంకా ఆస్కార్ అవార్డులు సాధించిన విజేతలు, ఇతర విశేషాల్లోకి...⇒ ‘‘ఈ రోజు నేను ఆస్కార్ వేదికపై ఉన్నానంటే ఇందుకు కారణం సిడ్నీ పోయిటియర్, డెంజెల్ వాషింగ్టన్, హాలీ బెర్రీ, జేమీ ఫాక్స్, ఫారెస్ట్ విటేకర్, విల్ స్మిత్ (జోర్డాన్ కంటే ముందు ఆస్కార్ అవార్డులు అందుకున్న నల్లజాతి నటులు). ఈ దిగ్గజాల బాటలో నిలబడటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నాకు అండగా నిలుస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న నా తల్లికి, నా కోసం ఘనా నుంచి ఇక్కడకు వచ్చిన నా తండ్రికి ధన్యవాదాలు. – ఉత్తమ నటుడు మైఖేల్ బి. జోర్డాన్⇒ ఈ సినిమా కథను నా పిల్లల (పెర్ల్, లూసిల్లే, జాక్, మిన్నీ) కోసమే రాశాను. మనం వాళ్లకు ఓ గందరగోళ ప్రపంచాన్ని అందిస్తున్నాం. ఇందుకు వారికి మనం ముందుగా క్షమాపణలు చె΄్పాలి. అదే సమయంలో మనల్ని మనం కూడా సరిదిద్దుకోవాలని, మానవత్వాన్ని తిరిగి ఇచ్చేయాలనే ఓ ఆశతో కూడా ఈ కథ రాశాను. నా ప్రయాణంలో భాగమైన నా భార్య మాయా రుడాల్ఫ్కు థ్యాంక్స్. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందించిన అకాడమీకి థ్యాంక్స్. – ఉత్తమ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్⇒ ఒక్క షాట్తో క్రికెటర్ సిక్సర్ కొట్టినట్లు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఆస్కార్ వేదికపై సిక్సర్ కొట్టింది. ఆరు అవార్డులు సాధించి, హాట్ టాపిక్గా నిలిచింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో డాల్బీ థియేటర్ వేదికగా మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం) హాలీవుడ్ హాస్య నటుడు కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు.పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన అమెరికన్ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా ఆరు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, అడాప్టెడ్ స్క్రీన్ప్లే, ఎడిటింగ్, క్యాస్టింగ్) సిక్సర్ కొట్టింది. ఆస్కార్ చరిత్రలోనే అత్యధికంగా 16 నామినేషన్స్ను దక్కించుకుని, అందరి దృష్టినీ ఆకర్షించిన అమెరికన్ హారర్ ఫిల్మ్ ‘సిన్నర్స్’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఒరిజినల్ స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) మాత్రమే అవార్డులు సాధించింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘ఫ్రాంకైన్ స్టీన్’కు మూడు అవార్డులు లభించాయి. ‘కే పాప్ డిమాన్ హంటర్స్’ చిత్రాన్ని రెండు అవార్డులు వరించాయి.‘వెపన్స్, అవతార్: ఫైర్ అండ్ యాష్, ఎఫ్1, సెంటిమెంటల్ వేల్యూ’ చిత్రాలు ఒక్కో అవార్డును గెలుచుకున్నాయి. ఉత్తమ నటుడిగా మైఖేల్. బి. జోర్డాన్, నటిగా జెస్సీ బక్లీ, సహాయ నటి విభాగంలో ఎమీ మాడిసన్ తొలిసారి ఆస్కార్ అవార్డులు అందుకోగా, ఉత్తమ సహాయ నటుడు విభాగంలో సీన్ పెన్కు మూడో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా పాల్ థామస్ ఆండర్సన్ అవార్డును అందుకున్నారు. 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు ఆటం డ్యూరాల్డ్ అర్కాపా. అలాగే ఈ ఏడాది తొలిసారి ప్రవేశపెట్టిన బెస్ట్ క్యాస్టింగ్ విభాగంలో కాసాండ్రా కులుకుండిస్ అవార్డు అందుకుని, ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా, తొలి మహిళగా నిలిచారు.ఆరో నల్ల జాతీయుడు... తొలి ఐరిష్ మహిళ‘సిన్నర్స్’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి, అద్భుతమైన నటన కనబరిచిన మైఖేల్ బి. జోర్డాన్కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఆస్కార్ అవార్డు సాధించిన ఆరో నల్ల జాతీయుడిగా మైఖేల్ రికార్డు సృష్టించారు. అంతేకాదు... ఉత్తమ నటుడు విభాగంలో తొలిసారి లభించిన నామినేషన్తోనే మైఖేల్ ఆస్కార్ అవార్డును ముద్దాడటం విశేషం. ఇక ‘హామ్నెట్’లో ఆగ్నేస్ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. జెస్సీకి ఇదే తొలి ఆస్కార్ అవార్డు. అలాగే ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి ఐరిష్ మహిళగా కూడా ఆమె రికార్డులకెక్కారు.⇒ ముచ్చటగా మూడు: దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ ఆస్కార్ కల నెరవేరింది. 98వ ఆస్కార్ అవార్డులకు ముందు ఆయనకు పదకొండు ఆస్కార్ నామినేషన్స్ ఉన్నాయి. కానీ ఒక్క అవార్డు కూడా రాలేదు. కాగా 98వ ఆస్కార్ అవార్డ్స్లో ఆయన (ఉత్తమ చిత్రం, దర్శకుడు, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే) విభాగాల్లో నామినేషన్స్ సాధించారు. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు లభించాయి.సీన్... అన్సీన్!‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు గెలుచుకున్న సీన్ పెన్ వేడుకకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. సీన్... అన్సీన్ అని గుసగుసలు వినిపించాయి. అతను ఉక్రెయిన్లో ఉండటం వల్ల హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక యాక్టింగ్ విభాగంలో మూడు ఆస్కార్ అవార్డులు సాధించిన ఎనిమిదో వ్యక్తిగా సీన్ పెన్ నిలిచారు.‘‘ఇక్కడ ఉన్న అద్భుతమైన మహిళలందరికీ ధన్యవాదాలు. మీ ప్రతిభ నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఇక ఫ్రెడ్ (భర్తని ఉద్దేశించి)... నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు అద్భుతమైన నాన్నవి... నా బెస్ట్ ఫ్రెండ్వి. ఇక మా చిన్న అమ్మాయి ఇస్లా వయసు ఎనిమిది నెలలు. ఏం జరుగుతుందో తనకు తెలియదు. బహుశా పాలు కావాలని కలలు కంటూ ఉంటుంది.నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ నీ తల్లిగా ఉండటానికి ఇష్టపడతాను. నా ఐరిష్ కుటుంబం ఇక్కడ ఉంది. కలలు కనడం, వాటిని సాకారం చేసుకునేలా అండగా నిలబడటం నుంచి అన్ని నేర్పించినందుకు ధన్యవాదాలు అమ్మానాన్న. ఈ రోజు యూకేలో మదర్స్ డే. ఈ వారం మా పాపకి ఒక పన్ను వచ్చింది. ఈ రోజు ఉదయం నా గుండెలను హత్తుకుని నిద్రపోయింది. ఈ తల్లి సాధించిన అవార్డుని నీ అందమైన హృదయానికి అంకితం చేయాలనుకుంటున్నాను’’. – నటి జెస్సీ బక్లీఆస్కార్ ఇన్ మెమోరియమ్లో కోటఆస్కార్ అవార్డు వేడుకలో భాగంగా ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సినీరంగం కోసం కృషి చేసిన గొప్ప కళాకారులను స్మరించుకుంటూ వీడియోను ప్రదర్శించారు. ఆస్కార్ కమిటీ నివాళులర్పించిన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కోట శ్రీనివాసరావు, బాలీవుడ్కి చెందిన ధర్మేంద్ర, మనోజ్ కుమార్, దక్షిణాది తార బి. సరోజాదేవి వంటి దిగ్గజాలు ఉన్నారు.అయితే వీరి గురించి వేదికపై ప్రస్తావించినప్పుడు ధర్మేంద్రను చూపించకపోవడం భారతీయ ప్రేక్షకులను ఆగ్రహానికి గురి చేసింది. ధర్మేంద్ర అభిమానులు ఆస్కార్ ప్రతినిధులపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని... ఆ తర్వాత అందరి పేర్లను ఆస్కార్ అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచారని టాక్.⇒ ‘‘నేత కార్మికులకు, కళాకారులకు, నా టీమ్కి, మా పనిని గుర్తించిన అకాడమీకి ధన్యవాదాలు’’ అంటూ కన్నీళ్లు ఆపుకోవడానికి కష్టపడుతూనే కాస్ట్యూమ్ విభాగంలో ‘ఫ్రాంకైన్స్టైన్’ సినిమాకి అవార్డు అందుకున్న ఆనందాన్ని పంచుకున్నారు కేట్ హాలే. అలాగే తాను చేసే సరదా పనులు, చిరాకు పెట్టే పనులను భరిస్తున్న తన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారామె.⇒ ‘‘అవార్డ్స్లో కొత్తగా క్యాస్టింగ్ కేటగిరీని చేర్చినందుకు అకాడమీకి థ్యాంక్స్. ఒక సినిమాకి నటీనటులను సెట్ చేయడానికి అవిశ్రాంతంగా పోరాడుతున్న క్యాస్టింగ్ డైరెక్టర్లకు థ్యాంక్స్. సినిమాలో తమ పేరు కూడా రాని క్యాస్టింగ్ డైరెక్టర్లకు ఈ అవార్డుని అంకితం చేస్తున్నా’’.– కాసాండ్రా కులుకుండిస్⇒ ‘వెపన్’ సినిమాలోని నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఎమీ మాడిగన్ తొలిసారి ఆస్కార్ అవార్డును సాధించారు. కాగా 1986లో జరిగిన 58వ ఆస్కార్ అవార్డుల్లో ఇదే విభాగంలో అవార్డు కోసం ‘ట్వైస్ ఇన్ ఏ లైఫ్టైమ్’ అనే చిత్రంలోని నటనకు గాను ఎమీ మాడిగన్కు నామినేషన్ దక్కినా, అవార్డు రాలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆమెకు 98వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటి విభాగంలోనే నామినేషన్ లభించి, అవార్డు రావడం విశేషం. ఇలా ఒక ఆస్కార్ నామినేషన్కి, మరో ఆస్కార్ నామినేషన్కు మధ్య 40 ఏళ్ల గ్యాప్ ఉండి, అవార్డు సాధించిన ఘనత మాత్రం ఎమీ మాడిగన్కే దక్కుతుంది.కెమెరా... ఆమె మూడో కన్నుఉత్తమ సినిమాటోగ్రఫీకి అకాడమీ అవార్డు గెల్చుకున్న తొలి మహిళగా, శ్వేతజాతియేతర తొలి మహిళగా చరిత్ర సృష్టించారు అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఆటం డ్యూరాల్డ్ అర్కాపావ్. ‘సిన్నర్స్’ సినిమాకు ఆస్కార్ అందుకున్నారు. కాలేజీ చదువు పూర్తయిన తరువాత ఆటం కొంతకాలం ప్రకటనల రంగంలో పని చేశారు. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగు పెట్టి, కెమెరా అసిస్టెంట్గా పని చేశారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్లో సభ్యురాలిగా చేరారు.2025 చిత్రం ‘సిన్నర్స్’ సినిమాను ఐమాక్స్15–పెర్ఫ్ అండ్ అల్ట్రా పానా విజన్ 70 కెమెరాలను ఉపయోగించి 65 ఎంఎం ఫిల్మ్పై చిత్రీకరించారు.‘నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. నా బాల్యం, కుటుంబంపై ప్రభావం చూపిన వ్యక్తి’ అని పోరాట యోధుడైన తన తాత పాగన్ బటిస్టా గురించి చెబుతుంటారు ఆటం. ‘నేను ఇక్కడ నిలబడడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఇంకా ఎంతోమంది మహిళలు ఇక్కడ నిలబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకుండా నేను ఇక్కడకి రాలేను అని నాకు తెలుసు’ అంటూ చిత్రపరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు ఆస్కార్ వేడుకలో కృతజ్ఞతలు తెలియజేశారు ఆటం.ఆస్కార్ విజేతలు ⇒ ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ∙దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ నటుడు: మైఖేల్ బి. జోర్డాన్ (సిన్నర్స్) ∙నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్) ∙సహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ∙సహాయ నటి : ఎమీ మాడిగన్ (వెపన్స్) ∙సినిమాటోగ్రఫీ: ఆటం డురాల్డ్ అర్కపా (సిన్నర్స్) ⇒ ఎడిటింగ్: యాండీ జుర్గెన్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ఒరిజినల్ స్కోర్: లుడ్విగో గోరాన్సన్ (సిన్నర్స్)⇒ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ సాంగ్ (కె–పాప్ డిమాన్ హంటర్స్) ⇒ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వేల్యూ (నార్వే) ⇒ సౌండ్: గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ. రిజో, జాన్ పెరల్ట (ఎఫ్ 1) ⇒ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం: మిస్టర్ నోబడీ ఎగైన్స్ట్ పుతిన్ ⇒ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎమ్టీ రూమ్స్ ⇒ విజువల్ ఎఫెక్ట్స్: జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ (అవతార్: ఫైర్ అండ్ యాష్)⇒్రపొడక్షన్ డిజైన్: టమరా డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకైన్స్టీన్) ∙ఒరిజినల్ స్క్రీన్ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)⇒ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్స్టీన్) ⇒ కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్స్టీన్) ⇒ క్యాస్టింగ్: కాసాండ్రా కులుకుండిస్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హు క్రైడ్ పాల్స్ ⇒ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కె–పాప్ డిమాన్ హంటర్స్⇒ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్ ఎక్సే ్చంజింగ్ సలైవా.⇒ ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, రిలయన్ ్స అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ భర్త ఆనంద్ పిరమాల్తో కలిసి ఆస్కార్ వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ ఇటలీ డిజైనర్ వాలెంటినో ఫాల్/వింటర్ వింటేజ్ కలెక్షన్ గౌను, చోకర్ స్టైల్ డైమెండ్ నెక్లెస్లో ఈషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించడంతో పాటు ఇండియన్ సినిమాకు మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈషా అంబానీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆస్కార్ వేడుకలో పాల్గొనడం ఆమెకు ఇదే తొలిసారి⇒ 98వ ఆస్కార్ అవార్డ్స్లో భారతీయ నటి ప్రియాంకా చోప్రా సందడి చేశారు. స్పానిష్ నటుడు జేవియర్ బార్డెమ్తో కలిసి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో అవార్డు సాధించిన నార్వేజియన్ డ్రామా ‘సెంటిమెంటల్ వేల్యూ’ సినిమా యూనిట్కు అవార్డు అందించారామె. ఈ విభాగంలో అవార్డు సాధించిన తొలి నైజీరియన్ ఫిల్మ్గా ‘సెంటిమెంటల్ వేల్యూ’ నిలిచింది. అవార్డును ప్రదానం చేసే సమయంలో ‘యుద్ధం వద్దు... పాలస్తీనాకు స్వేచ్ఛ కావాలి’ అన్నట్లుగా జేవియర్ నినాదం చేయగా, ప్రియాంకా చోప్రా మద్దతు ఇస్తున్నట్లుగా హావభావాలు పలికించారు. ఆస్కార్ వేదికపై ఇది చర్చనీయాంశమైంది.⇒ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో టై అవడం విశేషంగా నిలిచింది. ఈ విభాగంలోని అవార్డుకు ‘టూ పీపుల్ ఎక్సే ్చంజ్ సలైవా’, ‘ది సింగర్స్’ చిత్రాలు పోటీపడ్డాయి. ఈ రెండు సినిమాల్లో ఏ మూవీకి అవార్డు వస్తుందోననే ఆసక్తి నెలకొంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘టూ పీపుల్ ఎక్సే ్చంజ్ సలైవా’, ‘ది సింగర్స్’ విజేతలుగా నిలిచాయి. ఈ జాబితా టై అయింది’ అని ప్రజెంటర్ కుమాయిల్ నంజియాని తెలిపారు. ఈ విభాగంలోని రెండు చిత్రాల విజేతలకు నటుడు కుమాయిల్ నంజియాని అవార్డు అందించారు. కాగా 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇలా టై అవడం ఇది ఏడోసారి అట.ఈ అవార్డు కొరియన్ల కోసమే... ‘కేపాప్ డిమాన్ హంటర్స్’ సినిమాకు యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, ఒరిజినల్ సాంగ్ (‘గోల్డెన్’ పాటకు) విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వచ్చాయి. యానిమేషన్ విభాగంలో డిస్నీ, పిక్సార్ సంస్థలు నిర్మించిన సినిమాలు కాకుండా వేరే యానిమేటెడ్ సినిమాకు రెండు ఆస్కార్ అవార్డులు రావడం ఇదే తొలిసారి. సౌత్ కొరియన్ సాంగ్ రైటర్లు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డులు సాధించారు. ‘కేపాప్ డిమాన్ హంటర్స్’ చిత్రాన్ని మాగీ కాంగ్, క్రిస్ అపెల్హాన్స్ ద్వయం దర్శకత్వంలో మిచెల్లీ వాంగ్ నిర్మించారు.యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును స్వీకరించే సమయంలో మాగీ కాంగ్ మాట్లాడుతూ – ‘ఈ అవార్డు కొరియా కోసం... ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొరియన్ల కోసం’ అంటూ కాస్త ఉద్వేగంగా మాట్లాడారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును స్వీకరిస్తూ కిమ్ యున్–జే భావోద్వేగానికి లోనయ్యారు. ‘నన్ను తక్కువగా చూసేవారి మధ్య పెరిగాను. ఇప్పుడు వారందరూ మా పాటలు పాడుతున్నారు. అంతటా కొరియన్ లిరిక్స్ వినిపిస్తున్నాయి. ఇది సక్సెస్ మాత్రమే కాదు. ధైర్యానికి స్ఫూర్తి’ అన్నారు. -
శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్.. హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక
ఆస్కార్ వేడుక పిక్స్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా..శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్ అందాలు..బ్లూ డ్రెస్లో టాలీవుడ్ నటి వితికాశేరు పిక్స్..ఈవెంట్లో మెరిసిన టాలీవుడ్ భామ మెహరీన్..హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
'నా జుట్టు రంగు ఇంకా మారలేదు'.. హల్దీ వేడుకపై రష్మిక పోస్ట్
రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఫిబ్రవరి 26న ఈ వివాహా వేడుకలో అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత విజయ్- రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యారు. వీరిద్దరి వెడ్డింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పెళ్లి తర్వాత అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.పెళ్లి తర్వాత రష్మిక తాజాగా మరో పోస్ట్ చేసింది. ఉదయ్పూర్లో జరిగిన హల్దీ వేడుక ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. హల్దీ ప్లస్ హోలీ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ వేడుకలో మేము ఎంతగా తడిసిపోయామో.. ఇప్పటికీ నా జుట్టు రంగు ఇంకా ఎర్రటి రంగులోనే ఉందన్నారు. ఇంతటి మధురమైన క్షణాల వేళ.. నా బ్రైడ్ టీమ్తో కలిసి ఆ రోజు అన్ని ఆటలను గెలిచానంటూ సంతోషం వ్యక్తం చేసింది. అయితే విజ్జూ కూడా ఆ రోజు టీమ్ బ్రైడ్ అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. రష్మిక షేర్ చేసిన హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మృతి.. జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైంది. అతనితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రాస్తూ..'సినిమా సెట్లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లం. వానిటీ వ్యాన్లో ప్రవేశించిన ప్రతిసారీ కేవలం 20 నిమిషాలు మాత్రమే టైమ్ ఉందని ఆటపట్టించేదాన్ని. నీతో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించేది. నీతో కలిసి పనిచేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇక నుంచి నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతాను. గత రెండు సంవత్సరాలుగా నా సృజనాత్మక ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు నీ ముఖాన్ని చూడటం నా జీవితంలో గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి. లవ్ యూ.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా…' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.అసలు మార్స్ పెడ్రోజో ఎవరు?మార్స్ పెడ్రోజో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హెయిర్స్టైలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది స్టార్స్తో కలిసి పనిచేశారు. ఫిల్మ్ షూటింగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్తో గుర్తింపు పొందారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోని సృజనాత్మక నిపుణులతో కలిసి పనిచేశాడు, అతని నైపుణ్యాలు, సెట్లో తన వర్క్తో మరింత ఫేమస్ అయ్యాడు. అతని మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు పెడ్రోజోను గుర్తుచేసుకున్నారు. వరుణ్ ధావన్, నోరా ఫతేహి లాంటి స్టార్స్ పరిశ్రమకు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమకథ.. ఆసక్తిగా టీజర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన టీజర్ చూస్తుంటే 20 ఏళ్ల అమ్మాయితో 40 ఏళ్ల వ్యక్తి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దగా ఉన్న వ్యక్తితో హీరోయిన్ ప్రేమలో పడడం ఈ చిత్రం ఆసక్తిని మరింత పెంచుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. -
విజయ్ జన నాయగన్.. ఈ సారైనా మోక్షం లభించేనా?
కోలీవుడ్ స్టార్ దళపతి హీరోగా నటించిన చిత్రం జన నాయగన్. రాజకీయల్లో ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. దీంతో ఈ మూవీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా వ్యవహారం కోర్టుకు చేరడంతో రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.ఈ మూవీని సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రివ్యూ చేయాల్సి ఉంది. ఈనెల 9న జరగాల్సిన రివైజింగ్ కమిటీ ప్రదర్శన వాయిదా పడింది. బోర్డ్ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాను మార్చి 17న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం తప్పకుండా స్క్రీనింగ్ జరుగుతుందని సీబీఎఫ్సీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడం జరగనుంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్కు స్క్రీనింగ్కు సంబంధించి అధికారిక మెయిల్ అందినట్లు తెలుస్తోంది.జన నాయగన్ను జనవరి 9న గ్రాండ్గా విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. కానీ ఈ చిత్రం ఒక వర్గం ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ను నిలిపివేసింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని చూసిన ఒక సభ్యుడు సైన్యానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆ తర్వాత, జన నాయగన్ నిర్మాతలు జనవరి 6న కోర్టును ఆశ్రయించారు. సెన్సార్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ చర్యలతో జన నాయగన్ మేకర్స్, సెన్సార్ బోర్డ్కు మధ్య నెల రోజుల పాటు వివాదం కొనసాగింది. అయితే మూవీ టీమ్ తమ కేసును ఉపసంహరించుకోవడంతో ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపడానికి సెన్సార్ బోర్డ్ అంగీకరించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని రాజకీయ సందేశాలు ఉన్నందున.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతిస్తుందో లేదో చూడాల్సిందే. -
బాలీవుడ్ బ్యూటీ బర్త్ డే.. శ్రీనివాస మంగాపురం టీమ్ స్పెషల్ వీడియో
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతో నటి రాషా థడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో మంగ అనే పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఇప్పటికే 'ఉయి అమ్మ' అనే సాంగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది.ఇవాళ బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ మూవీ సెట్లో రషా నటన, హవభావాలతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. అందరూ కలిసి రషాకు హ్యాపీ బర్త్ డే విష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు ఇందులో ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్నిచందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. Your smile is simple, but the magic is unforgettable ❤️🔥Happiest Birthday #RashaThadani 💐❤️🤩#SrinivasaMangapuram #JayaKrishnaGhattamaneni @themohanbabu @AshwiniDuttCh @gemini_kiran @gvprakash @CKPicturesoffl @VyjayanthiFilms @SwapnaCinema @AnandiArtsOffl pic.twitter.com/yrDAkbA3Ye— Ajay Bhupathi (@DirAjayBhupathi) March 16, 2026 -
నాలాగా మోసపోకండి.. నటుడి పోస్ట్ వైరల్
ప్రతి మనిషిలోనూ జాలి, కరుణ, దయ అనేది ఉంటుంది. ఇవే ఇప్పుడు మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. సెంటిమెంట్తోనూ ‘కొట్టేస్తున్నారు’. తాజాగా నటుడు, దర్శకుడు దేవీప్రసాద్ కూడా ఇలానే మోసపోయాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ ఓ వ్యక్తి ఫోన్ చేస్తే.. రూ. 6వేలు ట్రాన్స్ఫర్ చేశాడట. ఆ తర్వాత కూడా పదే పదే డబ్బులు అడగడంతో అనుమానంతో ఆరా తీస్తే.. అతనో మోసగాడని తెలిసిందంట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. తనలాగా ఇంకెవరు మోసపోవద్దని దేవీప్రసాద్ కోరాడు.అసలేం జరిగింది?గత నెలలో దేవిప్రసాద్కు ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ‘నమస్తేసర్. నేను లింగా... గుర్తున్నానా సర్’ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడట. శ్రీరంగనీతులు సినిమాలో మీతో కలిసి నటించాను అంటూ.. సెంటిమెంట్ డ్రామా స్టార్ట్ చేశాడట. ‘ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు సర్.కొన్నిరోజులుగా మలక్పేట యశోదాహాస్పిటల్ లో మా అమ్మగారు సీరియస్గా ఉన్నారు.మా దగ్గర డబ్బులు అయిపోయాయి .ఆరోగ్యశ్రీలాంటి కార్డులేవీలేవు. తెలిసినవాళ్ళు బెంగుళూరు షిఫ్ట్ చేస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తామన్నారు. అంబులెన్స్ కి 16 వేలు అడిగారు.పదివేలు దొరికాయి.6 వేలు తక్కువయ్యింది.టైమ్ లేదుసర్.ఏంచేయాలో అర్ధంకాక మీకు కాల్ చేశాను’ అని దీనంగా అడుగుతూ..ఆక్సిజన్ మాస్క్ఉన్న పెద్దావిడ ఫోటో,హాస్పిటల్లో ఓ ప్రదేశం ఫోటోలు పెట్టడంతో నిజమే అనుకొని దేవీప్రసాద్ రూ. 6 వేలు గూగుల్ పే ద్వారా పంపించారట.అలా దొరికిపోయాడుమరుసటి రోజు కూడా మళ్లీ కాల్ చేసి ఆపరేషన్ కోసం కొంత డబ్బులు కావాలని అడగడంతో దేవీప్రసాద్కి అనుమానం వచ్చిందట. శ్రీరంగనీతులు సినిమాకి పనిచేసినవాళ్ళకు కాల్ చేసి లింగారెడ్డి గురించి అడిగితే.. ఆ పేరుతో ఉన్నవాళ్లెవరు ఈ సినిమాలో పని చేయలేదని చెప్పారట. అంతేకాదు ఆ సినిమా పేరుచెప్పి రెండునెలలక్రితం హీరోని కూడా ఇలానే డబ్బులు అడిగారని చెప్పడంతో దేవికి అసలు విషయం తెలిసిపోయింది. మూడు రోజుల తర్వాత అవే ఫోటోలను పంపించి భాషా అనే నటుడి దగ్గర కూడా అలానే చెప్పాడట. అయితే దేవిప్రసాద్ ద్వారా భాషాకు ముందే అతని గురించి తెలియడంతో లొకేషన్ పెట్టమని అడిగాడట. అతను హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్కి మూడు వీధుల అవతలున్న ఓ లొకేషన్ పెట్టాడట. వెంటనే దేవిప్రసాద్ ఫోన్ చేసి ఇప్పుడెక్కడున్నారు అని అడిగితే బెంగుళూరులో జయదేవ్ హాస్పిటల్లో ఉన్నాం, ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పాడట. దీంతో దేవిప్రసాద్ అతనిపై సీరియస్ అయ్యాడట. ఇలా తల్లిసెంటిమెంట్తో తనని మోసం చేశాడని.. తనలాగా ఎవరూ మోసపోవద్దనే ఈ పోస్ట్ పెడుతున్నానంటూ జరిగిన విషయం మొత్తం రాసుకొచ్చాడు. -
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావు ఫోటో.. ఎందుకంటే?
ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్లోని డాల్బీ థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచారు.వెండితెరపై తమదైన నటన, హావభావాలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న వీరికి ఘనంగా నివాళులర్పించింది ఆస్కార్ వేదిక. తెలుగు వెండతెరపై దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ కలిగిన కోట శ్రీనివాసరావు గతేడాది జులై 13న మరణించారు. ఆ తర్పాత 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. గతేడాది నవంబర్ 24న ఆయన మరణించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్తో సత్కరించింది.అయితే ఆస్కార్ వేడుక ప్రారంభంలో గతేడాది మరణించిన హాలీవుడ్ ప్రముఖులకు నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు.సినీ రంగానికి వారి సేవలను స్మరించుకుంటూ వారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో ధర్మేంద్రను చూపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ నెట్టింట అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని.. ఆ తర్వాత అందరి పేర్లను అఫీషియల్ సైట్లో ఉంచామని హాలీవుడ్ మీడియా క్లారిటీ ఇచ్చింది. -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వీక్లో పెద్ద సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దురంధర్ బాక్సాఫీస్ను షేర్ చేయగా సీక్వెల్గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికొస్తే టాలీవుడ్లో మాత్రమే కాస్తా బజ్ ఉంది. అంతకుమించి ఈ మూవీపై పెద్ద అంచనాల్లేవు.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే చాలా సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. వీటిలో టాలీవుడ్ నుంచి సీతాపయనం, జటాధర, బాలీవుడ్ మూవీ బోర్డర్-2 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జటాధర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తాజాగా జీ5లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు చిరాయ, ల్యాండ్ లార్డ్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ(వెబ్ సిరీస్)- మార్చి 18ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20ది రైజ్ ఆఫ్ ది రెడ్హాట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20 ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20అమెజాన్ ప్రైమ్..ఇన్విసిబుల్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 18ది హౌస్మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20 అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్): మార్చి 20జీ5..ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19కాసర్గడ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20జటాధర(తెలుగు సినిమా)- మార్చి 20జియో హాట్స్టార్..చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20యాపిల్ టీవీ..ఇమ్పర్ఫెక్ట్ ఉమెన్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ).. మార్చి 18సోనీ లివ్..జజ్ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19సన్ నెక్ట్స్..సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20 -
సల్మాన్ ఖాన్ దేశభక్తి సినిమా పేరు మారింది.. కారణం?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా దేశభక్తి చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’పేరు మారింది. ఈ సినిమాకు‘మాతృభూమి’ అని టైటిల్ మార్చినట్లు సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ప్రకటించారు. అయితే పేరు మార్పుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నట్లు సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ చిత్ర టీజర్ను విడుదల చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. అయితే చైనా మీడియా మాత్రం చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ ఆరోపించింది. సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది. ఈ పరిణామాల వేళ తాజాగా సినిమా పేరును మార్చడం గమనార్హం. ఆగస్ట్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. May War Rest In Peace #Maatrubhumi@LakhiaApoorva @IChitrangda #HimeshReshammiya #CchintanShah @SKFilmsOfficial @SKF_Music @ShamiraahN pic.twitter.com/8eE4VgNhAK— Salman Khan (@BeingSalmanKhan) March 16, 2026 -
నాని & వెంకీ మూవీ ఫిక్స్..!
-
కంటతడి పెట్టించిన చిత్రానికి ‘ఆస్కార్’.. ఏ ఓటీటీలో ఉందంటే?
ఒక సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు.కేవలం భారీ బడ్జెట్, హంగులు ఉంటే సరిపోదు,ఆ సినిమా వెనుక ఒక బలమైన ఆత్మ ఉండాలి. సమాజానికి అవసరమైన సందేశం, మనుషుల మధ్య సంబంధాలు, సామాజిక అసమానతలు లేదా మానవీయ విలువల చుట్టూ తిరిగే కథలకే ఆస్కార్ టీమ్ ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. 98వ అకాడమీ అవార్డుల్లోనూ అదే జరిగింది. తండ్రి, కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. అంతేకాదు ఉత్తమ దర్శకుడు(పాల్ థామస్ అండర్సన్), ఉత్తమ సహాయ నటుడు(షాన్ పెన్), ఎడిటింగ్(యాండీ జుర్గెన్సన్ ), కాస్టింగ్(కసాండ్రా కులుకుందిస్), అడాప్టెడ్ స్క్రీన్ప్లే (పాల్ థామస్ అండర్సన్ )తో పాటు మొత్తం ఆరు ఆస్కార్ అవార్డులు అందుకొని ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ రికార్డు సృష్టించింది.‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ కథేంటి?బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమే ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’. మాజీ విప్లవకారుడు బాబ్ పాత్రలో ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో నటించాడు. బాంబ్, పెర్ఫిడియా బేవర్లీ హిల్స్ (టియానా టేలర్) కలిసి సహజీవనం చేస్తుంటారు.పెర్ఫిడియా బేవర్లీ హిల్స్కి విప్లవ భావజాలం ఎక్కువ. ఓసారి వలసదారులను విడిపించే క్రమంలో అక్కడి కమాండింగ్ అధికారి స్టీవెన్ని ఆమె అవమానిస్తుంది. దీంతో పెర్ఫిడియాపై స్టీవెన్ పగపెంచుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కేసులో ఆమెను పట్టుకొని..తనతో గడిపితే వదిలేస్తానని ఆఫర్ ఇస్తాడు. దీనికి పెర్ఫిడియా ఒప్పుకుంటుంది. అతని కారణంగా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ కోసం తండ్రి పోరాటంకొన్నాలకు ఆ చిన్నారితో పాటు తన జీవిత భాగస్వామి బాబ్ని వదిలేసి విప్లవ బాట పడుతుంది. దీంతో ప్యాట్ ఒంటరి చిన్నారి చార్లీన్ను పెంచుతాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు. కొన్నాళ్ల తర్వాత స్టీవెన్కు ఆ చిన్నారి తన కూతురే అనే విషయం తెలుస్తుంది. ఈ విషయం బయటకు వస్తే కెరీరేకే ఇబ్బంది అవుతుందని తెలిసి..ఆమెను చంపేందుకు కుట్రలు పనఉనతాడు. ఈ విషయం బాబ్కి తెలుస్తుంది. తన కూతురిని కాపాడుకునేందుకు బాబ్ ఏం చేశాడు? స్వార్థం తన పరిస్థితులను ఎలా మార్చేసింది? అన్నదే ఈ సినిమా కథ. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ అండ్ పొలిటికల్ డ్రామా. తన బిడ్డను కాపాడుకునేందుకు తండ్రి పడే తపన తెరపై చూస్తుంటే కన్నీళ్ల ఆగవు.థామస్ పించన్ రాసిన 'వినైల్యాండ్' (Vineland) నవల ఆధారంగా దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గతేడాది సెప్టెంబరు 26న వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది. 175 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 209.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్.. అదే ఆయన స్పెషాలిటీ
98వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ నిలిచాడు. సిన్నర్స్ చిత్రంలోని నటనకు ఆయనను ఈ అవార్డు వరించింది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో వహించిన సిన్నర్స్ చిత్రంలో జోర్డాన్ ద్విపాత్రాభినయంలో కనిపించి కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు. ఒకే చిత్రంలో కవలలుగా నటించి ఆస్కార్ గెలుచుకున్న తొలి నటుడిగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే, ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న ఆరో నల్లజాతీయుడిగా నిలిచారు.బుల్లితెర టు వెండితెరచిత్ర పరిశ్రమలో రాణించడం అంతా ఈజీ కాదు. స్టార్ హోదా సంపాదించాలంటే చాలానే కష్టపడాలి. ఈ విషయంలో మైఖేల్ బీ జోర్డాన్ సినీ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం అని చెప్పాలి. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి..వెండితెరపై రాణిస్తున్నాడు. చిన్నప్పుడు మోడలింగ్తో మొదలుపెట్టి, 'ది వైర్' (The Wire), 'ఫ్రైడే నైట్ లైట్స్' (Friday Night Lights) వంటి టీవీ సిరీస్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో వచ్చిన 'ఫ్రూట్వేల్ స్టేషన్' ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఆస్కార్ గెలిచిన 'సిన్నర్స్' దర్శకుడు ర్యాన్ కూగ్లర్తో ఆయనకు ఇది మొదటి సినిమా. ఇందులో మైఖేల్ నటనకు హాలీవుడ్ ఫిదా అయింది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కమర్షియల్ సక్సెస్ మాత్రం 'క్రీడ్' చిత్రంతో వచ్చింది. ఇక మార్వెల్ చిత్రం బ్లాక్ పాంథర్ లో ఆయన పోషించిన 'కిల్మాంగర్' పాత్ర హాలీవుడ్ చరిత్రలోనే అత్యుత్తమ విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది.అదే ఆయన ప్రత్యేకతసామాజిక సందేశాన్నిచ్చే చిత్రాల్లో నటిస్తూ.. వైవిధ్యమైన పాత్రలు పోషించడం ఆయన స్పెషల్. హీరోగానే కాకుండా.. పాత్ర నచ్చితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు. హీరోగా బిజీ ఉన్న సమయంలోనే 'బ్లాక్ పాంథర్’లో విలన్గా నటించాడు.నటుడిగానే కాకుండా దర్శకుడిగాను రాణించాడు. 'క్రీడ్ III' చిత్రంతో ఆయన దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా కథా గమనాన్ని నడిపించడంలోనూ ఆయనది ప్రత్యేక. -
ఆస్కార్ గెలిచిన సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?
సినీప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. మార్చి 16న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు వేదికగా నిలిచింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా ఏకంగా ఆరు అవార్డుల(ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, కాస్టింగ్, అడాప్టెడ్ స్క్రీన్ప్లే ఎడిటింగ్ విభిగాల్లో)ను కైవసం చేసుకుంది. తర్వాత నాలుగు (ఉత్తమ నటుడు, స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) పురస్కారాలతో సిన్నర్స్ రెండో స్థానంలో ఉంది. మరి ఆస్కార్ (Oscars 2026) గెల్చుకున్న సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో చూసేద్దాం..వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ : జియో హాట్స్టార్సిన్నర్స్ : జియో హాట్స్టార్ఫ్రాంకెన్స్టీన్ : నెట్ఫ్లిక్స్F1 : యాపిల్ టీవీఅవతార్: ఫైర్ అండ్ యాష్ : ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు.వెపన్స్: జియో హాట్స్టార్కెపాప్ డిమాన్ హంటర్స్ : ఈ యానిమేటెడ్ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.సెంటిమెంటల్ వాల్యూ : అద్దె ప్రాతిపదికన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో అందుబాటులో ఉంది.హామ్నెట్ : యాపిల్ టీవీలో అద్దెకి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.ఆస్కార్ 2026: విజేతల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘ఆస్కార్ 2026’లో అరుదైన ఘటన.. 14 ఏళ్ల తర్వాత తొలిసారి..
సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మక భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో అంగరంగ వైభవంగా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యహరించాడు. భారత కాలమానం ప్రకారం మార్చి 16న ఉదయం 4:30 గంటలకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం అయింది. అయితే ఈ సారి అస్కార్ వేదికపై అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓకే కేటగిరీలో ఇద్దరు విజేతలుగా నిలిచారు. 14 ఏళ్ల తర్వాత ఇలా ‘టై’ చోటు చేసుకోవడం గమనార్హం.ఏ కేటగిరీలో?ఒక్కో కేటగిరీ విజేతలకు ఒక్కో గెస్ట్తో అవార్డులను అందించారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలోని విజేతలకు అవార్డులను అందించాల్సిందిగా నటుడు కుమాయిల్ నంజియాను స్టేజ్పైకి పిలిచారు. ఆయన వెళ్లి..తనకిచ్చిన ఎన్వలప్ ఓపెన్ చేసి ఏం మాట్లాడలేదు. దీంతో కాసేపు వేదికంతా సైలెంట్ అయిపోయింది. ఆయన ఎందుకలా సైలెంట్ అయిపోయాడో తెలియదు. కొన్ని క్షణాల తర్వాత.. . ఈ జాబితా టై అయిందని చెప్పడంతో డాల్బీ థియేటర్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఈ అవార్డుకు ‘ది సింగర్స్’, ‘టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా’ చిత్రాలు ఎంపికైనట్లు ఆయన ప్రకటించడంతో అందరు గట్టిగా అరిచేశారు. ఈ సందర్భంగా నంజియా ఓ కామెడీ పంచ్ కూడా వేశాడు. ‘షార్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వడానికి రెట్టింపు సమయం పడుతుంది’అని ఆయన అనడం.. దానికి కొనసాగింపుగా ‘ఈ టై వల్ల బెట్టింగ్ చేసినవారి పరిస్థితి ఏంటో’ అని హోస్ట్ కోనన్ ఓబ్రియన్ చమత్కరించడంతో థియేటర్లో కాసేపు నవ్వులు పూశాయి.ఏడు సార్లు ‘టై’ఆస్కార్ చరిత్రలో ఇప్పటి వరకు ఏడు సార్లు వివిధ కేటగిరీలో ‘టై’ అయింది. తొలిసారి 1932లో ఉత్తమ నటుడు విభాగంలో (వాలెస్ బిరీ, ఫ్రెడ్రిక్ మార్చ్) టై అయింది. చివరిగా 14 ఏళ్ల క్రితం అంటే.. 2012లో ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో స్కైఫాల్, జీరో డార్క్ థర్టీ చిత్రాలకు అవార్డులను అందించారు. అలాగే 1994లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్గా లైవ్ యాక్షన్, ఫ్రాంక్ కాఫ్కాస్ ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్, ట్రెవర్ చిత్రాలు నిలిచాయి. అంతకు ముందు 1986లో ఉత్తమ ఫీచర్ డాక్యుమెంటరీ విభాగాల్లో ఆర్టీ షా: టైమ్ ఈజ్ ఆల్ యూ హావ్ గాట్, డౌన్ అండ్ అవుట్ ఇన్ అమెరికా చిత్రాలకు అవార్డులు లభించాయి. ఇక 1968లో ఉత్తమ నటి విభాగంలో (కేథరిన్ హెప్బర్న్, బార్బరా స్ట్రీసాండ్), 1949లో ఉత్తమ డ్యాక్యుమెంటరీ కేటగిరీ (ఏ ఛాన్స్ టు లివ్, సో మచ్ ఫర్ సో లిటిల్)లో ‘టై’అయింది. -
చెప్పీ చెప్పనట్లుగా...
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ఎపిక్’ ఒకటి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆదివారం (మార్చి 15) ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ప్రోమోను విడుదల చేశారు.ఈ ప్రోమోలో హీరో తన ఫ్రెండ్స్తో కలిసి లండన్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, ఇండియాలో ఉన్న అతని తల్లిదండ్రులు ఫోన్ చేసి, శుభాకాంక్షలు చెప్పడం చూపించారు. అయితే తండ్రి మాత్రం చెప్పీ చెప్పనట్లుగా కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెçప్పడం కనిపిస్తుంది. ‘బేబీ’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ఇది. -
బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్.. బ్లూ శారీలో త్రిష అందాలు..!
యోగాసనాలు చేస్తోన్న నటి పూనమ్ బజ్వా..బీచ్లో చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్..ఫ్యామిలీతో అనసూయ వాకింగ్ టైమ్..బిగ్బాస్ దివి లేటేస్ట్ గ్లామరస్ లుక్..బ్లూ శారీలో హీరోయిన్ త్రిష అందాలు... View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
బిగ్బాస్ అశ్విని శ్రీకి గాయాలు.. అసలేం జరిగిందంటే?
బిగ్బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అశ్విని శ్రీ. బిగ్బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్తో అదరగొట్టేసింది. ఈ షో ద్వారా టాలీవుడ్లో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది.తాజాగా అశ్విని శ్రీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తన మొహానికి గాయాలైనట్లు వెల్లడించింది. ఉదయాన్నే కుక్కను వాకింగ్కు తీసుకెళ్తుంటే కిందపడ్డానని బిగ్బాస్ బ్యూటీ తెలిపింది. ఇలా గాయాలతో మీ ముందుకు వస్తానని ఎప్పుడు అనుకోలేదని అశ్విని బాధను వ్యక్తం చేసింది. ఫేస్కు తగలడంతో చాలా నొప్పిగా ఉందని తన బాధను పంచుకుంది. మీరంతా నాకోసం ప్రార్థిస్తున్నారని ఆశిస్తున్నా అంటూ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న ఓజీ హీరోయిన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ మూవీపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్ ప్రమఖులు ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ట్వీట్ చేశారు. మనసుకు నచ్చే అద్భుతమైన కథనం, దృశ్యాలు, ప్రియాంక మోహన్ పాత్రలోని అమాయకత్వం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రియాంక మోహన్ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. డైరెక్టర్తో పాటు చిత్రబృందానికి అభినందనలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేశారు.నంబర్వన్గా ట్రెండింగ్..ఈనెల 12న స్ట్రీమింగ్ వచ్చేసిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నంబర్వన్గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. #MadeInKorea… Such a Warm, feel-good storytelling with lovely visuals. The small-town innocence of @priyankaamohan’s character stands out.. she delivered a beautiful performance… @Rakarthik_dir keeps it simple and engaging! Congratulations to the entire team 🫶 @NetflixIndia… pic.twitter.com/a3jKrMKep1— Naga Vamsi (@vamsi84) March 15, 2026 -
తమ్ముడి బర్త్ డే.. అన్న విజయ్ దేవరకొండ స్పెషల్ విషెస్
ఆనంద్ దేవరకొండ, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఎపిక్. ఈ మూవీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో చిత్ర బృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. ఈ మూవీలోని ఓ వీడియోను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్తో చేసిన వీడియో ఆనంద్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక వీడియోను అన్న విజయ్ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ బాయ్ అంటూ తమ్ముడిపై బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతకుముందే రష్మిక సైతం డ్యాన్స్ చేస్తూ ఆనంద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. Happy Birthday to my fav boy ❤️May this year be EPICCCC for all of you 🤗😘#EPIC ~ First Semester#AnandDeverakonda #AdityaHasan @vamsi84 @HeshamAWMusic @Iamvaishnavi04 pic.twitter.com/kY9OfDRDhn— Vijay Deverakonda (@TheDeverakonda) March 15, 2026 -
ఆనంద్ దేవరకొండ బర్త్ డే.. వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్
ఇటీవలే టాలీవుడ్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో ఈ లవ్ బర్డ్స్ ఒక్కటయ్యారు. ఇరువురి సంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే సందడి చేశారు.తాజాగా ఇవాళ విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బర్త్ డే కావడంతో వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్ తెలిపింది. మరిది ఆనంద్ దేవరకొండతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత ఆనంద్ జరుపుకుంటోన్న తొలి పుట్టనరోజు కావడం మరో విశేషం. A sweet and joyful birthday wish from #RashmikaMandanna to #AnandDeverakonda!🥳🫶#TFNReels #TeluguFilmNagar pic.twitter.com/AOXFsiogYv— Telugu FilmNagar (@telugufilmnagar) March 15, 2026 -
అసలు ఈ సుయోధన ఎవడు?.. ఆసక్తిగా టీజర్
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం సుయోధన. ఈ సినిమాకు వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అసలు ఈ స్టోరీ నీకు ఎక్కడ దొరికింది? అనే డైలాగ్తో టీజర్ మొదలైంది. టీజర్ చూస్తుంటే దుర్యోధనుడిలా కనిపించే ఓ వ్యక్తి వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
'ఆయన గురించి పవన్ కల్యాణ్కు తెలియకపోయినా..'.. సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్
ప్రముఖ కోలీవుడ్ గేయ రచయిత వైరముత్తుకు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు అభినందనలు చెప్పడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో విమర్శలు చేస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ ట్వీట్ చేయడంపై చిన్మయి మండిపడింది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తుకు అభినందనలు చెప్పడంపై చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు.తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంవో ఆఫీస్ నుంచి వైరముత్తుకు అభినందనలు రావడంపై కూడా చిన్మయి స్పందించింది. అసలు పవన్ కల్యాణ్ గారికి ఆ కవి గురించి ఏమీ తెలియదని నాకు కచ్చితంగా తెలుసు.. ఎంతోమంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆయనకు డిప్యూటీ సీఎంవో కార్యాలయం నుంచి అభినందనలు తెలపడం విచిత్రంగా ఉందని ట్వీట్ చేసింది. అసలు ఒక సినిమా పాటల రచయితకు ఇంతమంది రాజకీయ నాయకులు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదంటూ చిన్మయి తన పోస్ట్లో రాసుకొచ్చింది.కాగా.. మీటూ ఉద్యమ సమయంలో ప్రముఖ లిరిసిస్ట్ అయిన వైరముత్తుపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. చిన్మయితో పాటు పలువురు మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ చిన్మయి తన వాదన వినిపిస్తూనే ఉంది.With due respect - I am pretty sure Pawan Kalyan Garu has no idea about the poet - His office needs to tell him he is wishing "Complete health and happiness" to a molester named by several women.What is the need for so many politicians to wish a film song lyricist, I don't… https://t.co/RuABQDEJ1Z— Chinmayi Sripaada (@Chinmayi) March 15, 2026 -
‘ఆస్కార్ 2026’ లైవ్..భారత్లో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్ (Oscar Awards 2026) అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఉన్న డాల్బీ థియేటర్ ఈ వేడుకకు వేదికైంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ రోజు(మార్చి 15) సాయంత్రం ఈ వేడుక జరుగుతుంది.టైమ్ జోన్ వ్యత్యాసం కారణంగా, ఇండియాలో మనం మార్చి 16 (సోమవారం) ఉదయం చూడాల్సి ఉంటుంది. రెడ్ కార్పెట్ ఈవెంట్ సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రధాన అవార్డుల వేడుక ఉదయం 4:30 గంటలకు మొదలవుతుంది.లైవ్ ఎక్కడ చూడొచ్చు?టీవీలో లేదా మొబైల్లో ఆస్కార్ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఓటీటీ విషయానికొస్తే.. జియోస్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టెలివిజన్ ప్రసారం విషయానికి వస్తే... ఈ అవార్డుల వేడుకను స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, కలర్స్ ఇన్ఫినిటీ ఛానళ్లలో ప్రసారం చేయనున్నారు. ఒకవేళ మీరు ఉదయాన్నే లైవ్ మిస్ అయితే, అదే రోజు (సోమవారం) రాత్రి 9 గంటలకు కు ఈ ఛానెల్లలో మళ్లీ ప్రసారం చేస్తారు.హోస్ట్ ఎవరు?ప్రముఖ కమెడియన్ కోనన్ ఓ'బ్రియన్ (Conan O'Brien) ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియా నుంచి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ ఏడాది అవార్డు ప్రజెంటర్లలో ఒకరుగా పాల్గొంటున్నారు.ఇండియాకు నిరాశే..98వ ఆస్కార్ అవార్డ్సులో భారత్కు నిరాశే ఎదురైంది. మనదేశం నుంచి ఒక్క చిత్రం కూడా అవార్డు రేసులో నిలవలేదు. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్బౌండ్’ను పంపింది. కానీ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఇక ఈ సారి ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్ డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరా పోటీ పడుతున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నాయి. -
నభా నటేశ్ నాగబంధం.. నమోరే సాంగ్ రిలీజ్
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధానపాత్రల్లో వస్తోన్న తాజా నాగబంధం. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. నమో రే నమోరే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్ అందించగా.. జునైద్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ను సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరిఆలపించారు. ఈ మూవీని ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన నమో రే పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ ఆధ్యాత్మిక పాటకు వెయ్యి మంది డ్యాన్సర్స్ పాల్గొనగా.. భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించేలా అద్భుతమైన విజువల్స్తో ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. -
పురుషులే అసలైన బాధితులు.. హీరో భార్య కౌంటర్
ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి దూరడం వల్లే ఈ విడాకులు ఎక్కువవుతున్నాయి. తమ విడాకుల వ్యవహారానికి కూడా మూడో మనిషే (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్) కారణమని తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆర్తి. తమిళ స్టార్ జంట రవి మోహన్- ఆర్తి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో కనసాగుతోంది.పురుషులే అసలైన బాధితులుఇదిలా ఉంటే రవి ఇటీవల ఓ పోస్ట్ పెట్టాడు. అందులో మహిళలే కరెక్ట్ అని అందరూ అనుకుంటారు, కానీ పురుషులే అసలైన బాధితులు. అది మన న్యాయవ్యవస్థకు కూడా అర్థమవుతోంది. నేను ప్రేమించినవారికోసం ఏం చేశాను? నా మనసేంటి? అనేది ఏదో ఒకరోజు మీక్కూడా అర్థమవుతుంది. దయచేసి ప్రశాంతంగా బతకనివ్వండి.. మీ వికారమైన ఆలోచనలను మీదగ్గరే ఉంచుకోండి అని రాసుకొచ్చాడు.పిల్లల్ని ఎవరు పెంచారు?అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కరుత్తు కన్నమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులు మంజూరవకముందే మరో అమ్మాయితో తిరుగుతున్న ఈయన సుద్దపూసలా మాట్లాడుతున్నాడు. ఇంతకూ పిల్లల్ని నువ్వే పెంచావా? లేదా ఆ బాధ్యతను ఆర్తిపై వేశావా? న్యాయవ్యవస్థ గురించి మాట్లాడేముందు పిల్లల్ని ఎవరు పెంచారో చెప్పు.. భరణం గురించి కాదు!ఎందుకీ దొంగ ఏడుపు?నువ్వేమో మరో అమ్మాయితో దర్జాగా తిరుగుతున్నావు. నీ భార్య మాత్రం నీ పిల్లలను చూసుకోవడంలోనే మునిగిపోయింది. పైగా నువ్వే అసలైన బాధితుడివి అని ఏడుస్తున్నావ్. నువ్వు చేసిన పని నీ భార్య చేసుంటే? విడాకులు ఫైనలైజ్ కాకముందే మరో మగాడితో ఆర్తి బయట తిరుగుతే ఈ ప్రపంచం ఊరుకుంటుందా? అదే పని ఆర్తి చేస్తే..ఒకవేళ తిరిగిన తర్వాత కూడా నేనే అసలైన బాధితురాలిని అని చెప్తే అందరూ నమ్ముతారా? లేదు కదా.. నువ్విలా విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం చాలా చెండాలంగా ఉంది అని ఆగ్రహించింది. ఈ పోస్ట్ను ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నిశ్శబ్ధంగా ఉండటానికి బదులుగా నిజాయితీగా గొంతెత్తి ప్రశ్నించినందుకు గర్వంగా ఉంది.. అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది. View this post on Instagram A post shared by Karuththu Kannammaa (@karuththu_kannammaa2015) చదవండి: వారి కాళ్లకు నమస్కరించడం తప్ప ఏం చేయగలం?: మోహన్బాబు -
హన్సిక విడాకులు.. మాజీ వదిన షాకింగ్ పోస్ట్!
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తన భర్త సోహైల్ నుంచి ఆమె విడాకులు తీసుకోవడమే ఈ చర్చకు కారణం. 2022లో సోహైల్ను పెళ్లి చేసుకున్న ఆమె నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేసి..ఇటీవల విడిపోయారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత హన్సిక పర్సనల్ లైఫ్పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్సిక మాజీ వదిన ముస్కాన్ నాన్సీ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదంతా ఒక నకిలీ ప్రపంచం అంటూ చేసిన వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.ముస్కాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. ‘దయచేసి నన్ను ఇతరుల జీవితాల్లో జరిగే డ్రామాల్లోకి లాగవద్దు. నాకు ఎలాంటి పెయిడ్ పీఆర్ టీమ్స్ లేవు. ఎవరిదో ఫేక్ ప్రపంచంతో నన్ను ముడిపెట్టడం ఆపేయండి. కాలమే అన్ని నిజాలను బయటపెడుతుంది. అంతా సమయమే నిర్ణయిస్తుంది. సబ్ సమయ్ కా ఖేల్ హై. పీస్, లవ్ అండ్ కర్మ’ అని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఎవరి పేరు నేరుగా చెప్పకపోయినా, ఈ పోస్ట్ హన్సిక విడాకులను ఉద్దేశించేనని నెటిజన్లు అంటున్నారు.వాస్తవానికి హన్సికకు, ముస్కాన్కు మధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.వీరిద్దరి జోక్యం వల్లే తన కాపురం కూలిపోయిందని, మానసిక ఒత్తిడి కారణంగా తనకు 'బెల్స్ పాల్సీ' కూడా వచ్చిందని ఆమె గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులోనే ఉంది.ఈ కేసును కొట్టివేయాలని హన్సిక వేసిన పిటిషన్ను గత సెప్టెంబర్లో బాంబే హైకోర్టు తిరస్కరించడం గమనార్హం.ముస్కాన్ నాన్సీ విషయానికొస్తే.. ఈమె ఒక బుల్లితెర నటి. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో పాల్గొంది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. 2020లో హన్సిక సోదరుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే విబేధాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది. -
‘ధురంధర్’తో ఆ విషయం అర్థమైయింది :అక్షయ్ కుమార్
ప్రేక్షకులు అభిరుచి ప్రతి రెండు,మూడేళ్లకు ఓసారి మారుతుందని, అందుకు ‘ధురంధర్’ మంచి ఉదాహరణ అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్లో మారుతున్న ట్రెండ్ గురించి అక్షయ్ మాట్లాడుతూ.. ‘ధురంధర్’ సినిమాను తీసుకోండి. ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. సినిమా మొత్తంలో యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు చప్పట్లు కొడుకున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఆడియన్స్ యాక్షన్ సినిమాలను ఇష్టపడుతున్నారనే విషయం అర్థమవుతుంది.ఇలా రెండు, మూడేళ్లకు ఒకసారి ప్రేక్షకుల అభిరుచి మారుతూనే ఉంటుంది. ఐదారేళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది.అప్పుడు సామాజిక సందేశాత్మక చిత్రాలను ఆదరించారు. నేను చేసిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి సినిమాలు అప్పుడు సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు అలాంటి సినిమాలు తీస్తే.. ఆడుతాయో లేదో తెలియదు. ప్రేక్షకుల కోరికలు ట్రెండ్కు తగ్గట్లుగా మారుతుంటాయి. ప్రస్తుతం హారర్ కామెడీలకూ ఆదరణ లభిస్తోంది. తర్వాత ఆడియన్స్ దేనిని ఇష్టపడతారో మనం ఎప్పటికీ ఊహించలేం’ అని అన్నారు. ధురంధర్ విషయానికొస్తే.. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్గా ధురంధర్ 2 రాబోతుంది. మార్చి 19న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
మాటే మెసేజ్, జూ.ఎన్టీయార్కు సాటిలేని ఇమేజ్..
జనం మనసుల్ని గెలుచుకున్న సెలబ్రిటీల మాటలకు చాలా విలువ ఏర్పడుతుంది. అయితే ఆ విలువను పెంచుకునేలా మాట్లాడడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. విలువ పెంచుకోవడం మాట దేవుడెరుగు కనీసం తమ వయసుకు, సామాజిక హోదాకు తగ్గట్టుగా కూడా మాట్లాడలేకపోతున్న రోజులవి.. పారేసుకున్న నోరుని,సారీలతో కడుక్కోలేక అవస్థలు పడుతున్న నోటిదూల రాయుళ్ల కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లో... తప్పకుండా ప్రస్తావించుకోవాల్సిన టాప్ సెలబ్రిటీ జూనియర్ ఎన్టీయార్.‘‘మహిళల్ని గౌరవించండి అంటూ ఇంకా స్కూల్స్లో కాలేజీల్లో చెప్పడం కాదు... అలాంటివి నేర్పడం ఇంటి దగ్గరే ప్రారంభం కావాలి’’ అంటూ ఆయన ఇటీవల ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నారాయన. అంతేకాదు తన పిల్లల్ని మహిళలకు గౌరవం ఇచ్చేలా పెంచుతానని మాట ఇస్తున్నానంటూ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. ఇదొక్కటే కాదు గత కొంత కాలంగా జూ.ఎన్టీయార్ రకరకాల సందర్భాల్లో మాట్లాడిన మాటలు గమనిస్తే నలుగురికి మంచి చెప్పాలనే ఆయన తాపత్రయం కనిపిస్తుంది. #NTRInBengaluruNTR (@tarak9999) shared his heartfelt wishes on #HappyWomensDay and highlighted the invaluable role and importance of women. 👌👏🏻❤️#NTR #Bangalore pic.twitter.com/oq2VVEZmmY— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 8, 2026‘‘ ఆపరేషన్ ధియేటర్లో మృత్యువుతో పోరాడుతున్న రోగి లాంటిది సినిమా విడుదల సమయం.. ఆ రోగి ప్రాణం నిలుస్తుందా లేదా అని సంబంధీకులు అందరూ టెన్షన్ పడుతుంటారు. అలాంటి సమయంలో ఆపరేషన్ కాకుండానే, రోగిని చంపేయకండి’’ అంటూ ఆయన బాధ్యతా రహితంగా రివ్యూలు రాసి పారేసే సినిమా సమీక్షకుల్ని అభ్యర్ధించిన తీరు చాలా మందికి ఎప్పటికీ గుర్తుంటుంది. ఓ సినిమా కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ఈ మాటలు పలువురు రివ్యూయర్లను సూటిగా తాకాయి. అలాగే అరవింద సమేత సినిమా కార్యక్రమంలో ‘జీవితం అంటే కొట్టుకోవడం జీవితం అంటే తిట్టుకోవడం కాదు జీవితం అంటే బతకడం’’ అంటూ మాట్లాడి ఆకట్టుకున్నారు.. ‘‘గెలిచినా ఓడినా..... ఏది జరిగినా పదిమందికీ సమాధానం చెప్పాల్సిందే. మనదైన రోజున గెలుస్తాం కాని రోజున ఓడిపోతాం కానీ ప్రతీ రోజూ ప్రయత్నిస్తూనే ఉండాలి’ అంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాటలివి. ‘‘ప్రకృతితో కలిసి జీవించడం మాత్రమే కాదు దానిని గౌరవించడం కూడా నేర్చుకోవాలి..ఎందుకంటే అది లేకపోతే మనం నథింగ్’’అంటూ ఓ అవార్డ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడిన మాటలు అతిరధ మహారధుల హర్షధ్వానానాలను అందుకున్నాయి.‘‘గొప్ప కల కనడానికి ధైర్యం ఉండాలి దానిని నిజం చేసుకోవడానికి కఠినమైన క్రమశిక్షణ దానితో పాటే భయం కూడా ఉండాలి’’ అంటూ ఓ యువ హీరో చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా అంటాడు యంగ్ టైగర్. ‘‘ నెగిటివిటీ చాలా శక్తివంతమైనది. అది ఒక్కసారిగా వచ్చి మీదపడిపోతుంది. అదే పాజిటివిటీ అలా కాదు చాలా నిదానంగా మనలో పుట్టి పెరుగుతుంది. మన పిల్లల్లాగా మనం దాన్ని పెంచుకుంటూ పోవాలి’ అంటూ మరో సందర్భంగా చెబుతాడు. ‘‘గెలుపోటములకు ఎవరూ అతీతులు కారు. నువ్వు కిందకు పడితేనే కదా లేవాలని అనుకుంటావు. ప్రతీ చర్యకూ ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఎంత వేగంగా కిందకు పడిపోతే అంతకు రెట్టింపు వేగంతో పైకి లేస్తావు’’ ‘‘విజయం ఆత్మవిశ్వాసం ఇస్తుంది ఓటమి కూడా తర్వాత విజయం సాధిస్తాననే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అందుకే జయాపజయాల కన్నా, ఆత్మవిశ్వాసమే ముఖ్యం’’అంటూ ప్రతీ ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపే ఆయన ప్రయత్నం అభినందనీయం అనకుండా ఉండగలమా? ‘‘నాలెడ్జ్ అంటే పాఠశాలల్లో , కళాశాలల్లో నేర్పేది కాదు.. అది మనం సంపాదించుకునేది. మన ప్రయాణించే దారిలో చూసిన సంఘటనలు ఎదుర్కున్న ఆటుపోట్లు అందిస్తాయి చూడండి అదే నాలెడ్జ్’’ అంటూ నేర్చుకోవాల్సింది ఏమిటో నేర్పుగా చెబుతాడు.పెద్ద ఎన్టీయార్లాగా తెరపై డైలాగులను దంచడంలో దిట్ట... తెరబయట పదిమంది మంచి కోరి మాట్లాడగల సామర్ధ్యం కూడా జూ. ఎన్టీయార్ స్వంతం. అందుకే ఆయన గత కొంత కాలంగా విభిన్న సందర్భాల్లో మాట్లాడిన మాటలు నెట్టింట్లో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ‘‘ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండబోవడం లేదు. శాశ్వతంగా ఉండేది మంచి పేరు మాత్రమే’’ అంటూ తరచుగా చెబుతారు జూ.ఎన్టీయార్. ఒక వ్యక్తిలో ఉన్న టాలెంట్కు జనం జై కొడతారు అంతమాత్రానే కళ్లు నెత్తికెక్కి నోరు పారేసుకుంటే అదే జనం ఛీ కొడతారు. తారలు అని కీర్తించినంత మాత్రాన వారు తాము ఉంటున్న ఆకాశం అనుకోకూడదు.. ఇది తమకు వచ్చిన అవకాశం అనుకోవాలి. మంచిగా ఉండేందుకు, ప్రతీ ఒక్కరిలో మంచిని పెంచేందుకు ...మంచి అవకాశం అని భావించాలి. అప్పుడే ప్రతీ సెలబ్రిటీ మాట మంత్రం అవుతుంది. పదిమంది అనుసరించే సూత్రంగా మారుతుంది. -
ఆస్కారం ఎవరికి?
హాలీవుడ్లో ఆస్కార్ సందడి మొదలైంది. 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఈ నెల 15న జరగనున్న సంగతి తెలిసిందే. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 ఉదయం జరుగుతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డు సాధించే ఆస్కారం ఎవరికి మెండుగా ఉంది? అనే చర్చ జరుగుతోంది. ఆస్కార్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించి, అత్యధికంగా 16 నామినేషన్స్ దక్కించుకున్న ‘సిన్నర్స్’ సినిమాకు ఫైనల్గా ఎన్ని అవార్డులు వస్తాయి? అనేది ప్రస్తుతం హాలీవుడ్లో హాట్ టాపిక్.అలాగే 13 నామినేషన్స్ దక్కించుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా ‘సిన్నర్స్’ సినిమాను డామినేట్ చేసి, ఎక్కువ అవార్డులు దక్కించుకునే అవకాశం లేకపోలేదని హాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ‘ఫ్రాకింగ్స్టన్, మార్టీ సుప్రీం, సెంటిమెంటల్ వాల్యూ’ చిత్రాలకు తొమ్మిది నామినేషన్స్ లభించగా, ‘హామ్నెట్’ చిత్రానికి 8 నామినేషన్స్ దక్కాయి. మరి... ఈ చిత్రాల్లో ఏ చిత్రం ఎన్ని అవార్డులు దక్కించుకుంటుంది? అనే చర్చ జరుగుతోంది. ఇక ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు... ఈ ప్రధాన విభాగాల్లో హాలీవుడ్ కథనాల ప్రకారం అవార్డు దక్కే ఆస్కారం ఎవరికి ఉందనే విషయం తెలుసుకుందాం...జోస్యం నిజమవుతుందా?ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్ డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరా పోటీ పడుతున్నారు. అయితే ఈ ఐదుగురిలోనూ తిమోతి చాలమేట్ (‘మార్టీ సుప్రీం’ సినిమాకుగానూ)కే ఉత్తమ నటుడు అవార్డు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. కానీ ఈ ఏడాది జరిగిన 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును ‘ది సీక్రెట్ ఏంజెంట్’ చిత్రానికిగానూ వాగ్నర్ మౌరా గెలుచుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి బ్రెజిలియన్ యాక్టర్గా వాగ్నర్ నిలిచారు.అది మాత్రమే కాదు... ఉత్తమ నటుడిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ వాగ్నర్ మౌరా అవార్డును గెలుచుకున్నారు. మరోవైపు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ అందించే అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచున్నారు మైఖేల్ బి. జోర్డాన్. పైగా ఆస్కార్లోనే అత్యధిక నామినేషన్స్ను దక్కించుకున్న ‘సిన్నర్స్’ సినిమాలో నటించిన యాక్టర్ కాబట్టి మైఖేల్ బి. జోర్డాన్పై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ‘బ్లూ మూన్’ సినిమాలో ఈథన్ హాక్, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రంలో లియోనార్డ్ డికాప్రియో సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.దీంతో ఈ ఏడాది పోటీ కాస్త గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే... మెజారిటీ మాత్రం తిమోతి చాలమేట్కే అవార్డు వస్తుందని అంచనా వేస్తున్నారు. పైగా 30 ఏళ్ల వయసులోనే మూడుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన అతి పిన్న వయస్కుడిగా తిమోతి పేరిట రికార్డు ఉంది. 97వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు విభాగంలో ‘ఏ కంప్లీట్ అన్నోన్’ సినిమాకుగాను తిమోతికి నామినేషన్ దక్కినప్పటికీ అవార్డు రాలేదు. ఈ మూడో ప్రయత్నంలో తిమోతికి అవార్డు ఖాయం అని హాలీవుడ్ జోస్యం చెబుతోంది..పాతికేళ్ల తర్వాత... గత ఏడాది జరిగిన 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందించారు. అయితే ఈ ఏడాది జరగనున్న 98వ అవార్డ్స్ ప్రదానోత్సవంలో కొత్తగా ‘బెస్ట్ క్యాస్టింగ్’ అనే విభాగాన్ని ఆస్కార్ అకాడమీ కమిటీ ప్రవేశపెట్టింది. 2001లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ పాతికేళ్లకు ‘బెస్ట్ క్యాస్టింగ్’ పేరుతో మరో విభాగాన్ని చేర్చారు.ఇలా 98వ ఆస్కార్ అవార్డ్స్లో మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉత్తమ క్యాస్టింగ్ విభాగంలో నీనా గోల్డ్ (‘హామ్నెట్’ సినిమా), జెన్నిఫర్ వెండెట్టి (మార్టీ సుప్రీం), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కాసాండ్రా కులుకుండిస్), గాబ్రియేల్ డొమింగ్యూస్ (ది సీక్రెట్ ఏజెంట్), ఫ్రాన్సిన్ మైస్లర్ (సిన్నర్స్) మధ్య పోటీ నెలకొంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధాన పోటీ ‘సిన్నర్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రాల మధ్య ఉన్నట్లే, ఈ కొత్త విభాగంలోనూ ప్రధాన పోటీ ఫ్రాన్సిన్ మైస్లర్ (సిన్నర్స్), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కాసాండ్రా కులుకుండిస్)ల మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది.ఎందుకంటే యాక్టింగ్ విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు నాలుగు నామినేషన్స్ దక్కగా, ‘సిన్నర్స్’కు మూడు నామినేషన్స్ దక్కాయి. అయితే ఈ విభాగంలో ‘సిన్నర్స్’కే అవార్డు రావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే... ఆస్కార్ చరిత్రలోనే అత్యధికంగా నామినేషన్స్ దక్కించుకున్న రికార్డు ‘సిన్నర్స్’కే దక్కింది కాబట్టి ఈ సినిమాకే ఈ విభాగంలో అవార్డు వస్తుందంటున్నారు హాలీవుడ్ సినీ నిపుణులు. అలాగే జెన్నిఫర్ వెండెట్టి (మార్టీ సుప్రీం) అవార్డు అందుకునే చాన్స్ లేకపోలేదంటున్నారు.సిన్నర్స్ వర్సెస్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నాయి. ఆస్కార్ హిస్టరీలోనే అత్యధికంగా 16 నామినేషన్స్ను దక్కించుకుని, చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. అలాగే 13 నామినేషన్స్ దక్కించుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి కూడా ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ ఉంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధానంగా ఈ రెండు చిత్రాల మధ్యనే పోటీ ఉంటుందనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. నామినేషన్స్ పరంగా ‘సిన్నర్స్’దే పై చేయి అయినప్పటికీ ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు రావచ్చొనే టాక్ హాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.ఈ ఏడాది జరిగిన బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డు (బాఫ్తా), గోల్డెన్ గ్లోబ్, ్ర΄÷డ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ చిత్రంగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. ఈ కారణంగానే ఆస్కార్లోనూ ఉత్తమ చిత్రం విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కు అవార్డు దక్కుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కానీ ‘సిన్నర్స్, హామ్నెట్’ చిత్రాలను కూడా తేలికగా తీసివేయలేమని హాలీవుడ్ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రాలను దాటుకుని ఈ విభాగంలో బరిలో ఉన్న ‘బగోనియా, ఎఫ్1, ఫ్రాంకిన్స్టన్, మార్టీ సుప్రీం, ది సీక్రెట్ ఏజెంట్, ట్రైన్ డ్రీమ్స్’ వంటి సినిమాల్లో ఏదైనా సర్ప్రైజింగ్గా ఉత్తమ చిత్రంగా నిలుస్తుందా? అనే విషయం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.ఈ ఇద్దరిలో ఎవరు?ఉత్తమ నటి విభాగంలో ‘హ్యామ్నెట్’ చిత్రానికిగాను జస్సీ బక్లీ, ‘బగోనియా’ చిత్రానికిగాను ఎమ్మా స్టోన్, ‘సెంటిమెంటల్ వేల్యూ’ చిత్రానికి రెనాటా రైన్సావా, ‘ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ ఉడ్ కిక్ యు’ చిత్రానికి నురోజ్ బర్న్, ‘సాంగ్ సంగ్ బ్లూ’ మూవీకి గాను కేట్ హడ్సన్లు నామినేషన్స్ దక్కించుకున్నారు. అయితే ‘క్రిటిక్స్ చాయిస్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, బాఫ్తా అవార్డ్స్’లో నటిగా అవార్డు గెలుచుకుని, ఉత్తమ నటి విభాగంలోని ఆస్కార్ అవార్డు కోసం రేసులో ముందు వరుసలో ఉన్నారు జస్సీ బక్లీ. కాగా రెనాటా రైన్సావా, రోజ్లు తమ కెరీర్లో తొలిసారి ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నారు.అలాగే గతంలో ‘ఆల్మోస్ట్ ఫేమస్’ అనే చిత్రంలో సహాయ నటిగానూ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు కేట్ హడ్సన్. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె మళ్లీ ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నారు. కానీ ఈసారి ఉత్తమ నటి విభాగంలో కేట్ హడ్సన్కు నామినేషన్ దక్కింది. కేట్, రెనాటా... ఈ ఇద్దరిలో ఆస్కార్ అదృష్టం ఎవర్ని వరిస్తుంది అనేది చూడాలి.భారత్కు నిరాశ ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్ అవార్డ్స్లో మన దేశానికి నిరాశే ఎదురైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్బౌండ్’ను పంపింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కోసం షార్ట్ లిస్ట్ అయింది కానీ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో బ్రెజిల్ దర్శకుడు క్లెబర్ మెండోన్సా ఫిల్హో తీసిన ‘ది సీక్రెట్ ఏజెంట్’, ఫ్రాన్స్ దర్శకుడు జాఫర్ పనాహి తెరకెక్కించిన ‘ఇట్ వాజ్ జస్ట్ ఎ యాక్సిడెంట్’, నార్వే డైరెక్టర్ జోచిమ్ ట్రైయర్ తీసిన ‘సెంటిమెంటల్ వేల్యూ’, స్పెయిన్ డైరెక్టర్ ఆలివర్ లాక్సే రూపొందించిన ‘సిరాట్’, ట్యూనిషియా డైరెక్టర్ కౌథర్ బెన్ హనియా దర్శకత్వం వహించిన ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ సినిమాలు నామినేషన్ దక్కించుకున్నాయి.ఇంకా ఆస్కార్ కన్సిడరేషన్ విభాగంలో ‘మహావతార్ నరసింహా, కాంతార: ఏ లెజెండ్ చాప్టర్1, తన్వీ: ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిస్టర్ మిడ్నైట్’ వంటి సినిమాలు పరిశీలన జాబితాలో ఉన్నప్పటికీ నామినేషన్ను దక్కించు కోవడంలో విఫలమయ్యాయి. అయితే ఆస్కార్ అవార్డుల ప్రజెంటర్స్లో భారతీయ నటి ప్రియాంకా చో్రపా కూడా ఉండటం అనేది భారతీయ ప్రేక్షకులను ఆనందపరిచే విషయం.పద్నాలుగో సారైనా అవార్డు వస్తుందా?దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఇప్పటికి 14 సార్లు ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క అవార్డు వచ్చింది లేదు. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి గాను పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. పైగా ఈ ఏడాది జరిగిన బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా, క్రిటిక్స్ చాయిస్ అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ దర్శకుడి అవార్డు పాల్ థామస్కే దక్కింది.దీంతో ఆస్కార్ అవార్డు కూడా ఆయనకే రావొచ్చన్నది హాలీవుడ్ బలమైన నమ్మకం. మరోవైపు రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్), ట్రియర్ (సెంటిమెంటల్ వేల్యూ), జాష్ షాఫ్టీ (మార్టీ సుప్రీం), క్లోయి జావ్ (హ్మామ్నెట్) లను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే...ఈ చిత్రాలకు ప్రధాన విభాగాల్లో నామినేషన్స్ దక్కింది. ఇంకా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) అమీ మాడిగన్ (వెపన్స్), బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) విభాగంలో లుడ్విగ్ గోరాన్సన్ వంటి వారు అవార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ అవార్డుని ఏ స్టార్ చేజిక్కించుకుంటారు? ఉత్తమ చిత్రం అవార్డు ఏ సినిమాకి దక్కుతుంది? అనే సస్పెన్స్ మరికొన్ని గంటల్లో వీడిపోతుంది. – ముసిమి శివాంజనేయులు -
కొరియాలో కనకరాజు
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ని కొరియాలో ప్రారంభించినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ స్టోరీ టెల్లింగ్, యువీ క్రియేషన్స్–ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది.హారర్, కామెడీ ట్విస్ట్లతో ఇండియన్, కొరియన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ని సౌత్ కొరియాలో ప్రారంభించాం. వారం పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో పాటలు, కథలో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తాం. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనగా కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో ఈ షూట్ ప్లాన్ చేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని. -
అక్షయ్ ఖన్నా బట్టతల ట్రామాతో కుంగిపోయారు: ఫరా ఖాన్
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నెగిటివ్ రోల్స్లో వరుసగా హిట్స్ అందుకుంటూ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. 'ధురంధర్', ‘చావా' వంటి సినిమాలతో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో పాల్గొని అక్షయ్ ఖన్నా గురించి చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో ‘ఆతిష్ కపూర్’ పాత్ర కోసం మొదట షర్మాన్ జోషిని సంప్రదించానని, ఆయన తిరస్కరించడంతో చివరికి అక్షయ్ ఖన్నానే లాస్ట్ ఛాయిస్గా ఎంపికయ్యారని ఫరా వెల్లడించారు. ఫరా ఖాన్ మాటల్లో 90వ దశకంలో అక్షయ్ ప్రవర్తన అంతగా బాగాలేదు. ఆయన చాలా చిరాకుగా ఉండేవారు. చేతిలో వున్న వస్తువులు విసిరేసేవారు. డైలాగుల విషయంలో గొడవపడేవారు. ఆ సమయంలో బట్టతల సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అదే ఆయన కోపానికి కారణమని తెలిపారు. తాల్ సినిమాలో వర్షం పాటలో కూడా టోపీ ధరించి నటించారని గుర్తుచేశారు. 'దిల్ చాహ్తాహై’ సినిమా తర్వాత అక్షయ్ పూర్తిగా మారిపోయారు. తన లుక్, బట్టతల గురించి స్పష్టత వచ్చి, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. 'కోయి కహే కెహతా రహే' పాటలో ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇటీవల 'ధురంధర్' సినిమాలో అక్షయ్ నటన చూసి ఫిదా అయ్యాను. వెంటనే ఆయనకు ఫోన్ చేసి అలీబాగ్లోని ఇంటికి వెళ్లి అభినందించాను. అక్షయ్కు అనవసర హడావిడి, షో ఆఫ్ చేయడం అంటే నచ్చదు. తన నటనపై మాత్రమే దృష్టి పెడతారని ఆమె అన్నారు. మొత్తానికి గతంలో హీరోగా ఉన్నప్పుడు కూడా రాని క్రేజ్ ఇప్పుడు నెగిటివ్ రోల్స్తో అక్షయ్ ఖన్నా సంపాదించుకోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన భామ కృతి శెట్టి.. హీరోయిన్ రెజీనా లేటేస్ట్ లుక్..!
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హోయలు..టాలీవుడ్ భామ విష్ణు ప్రియ స్టన్నింగ్ లుక్స్..నగలతో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ త్రిష..శారీలో దిల్ రాజు సతీమణి అందాలు..బ్లూ డ్రెస్లో హీరోయిన్ రెజీనా అందాలు.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
'ఆ డైరెక్టర్ తీరు నచ్చలేదు.. నాపై తప్పుడు ప్రచారం'.. లావణ్య త్రిపాఠి
మెగా కోడలు లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్స్ చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్కు గురైనట్లు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన లావణ్య తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను ఓ తమిళ సినిమా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సమయంలో దర్శకుడి తీరుతో చాలా అసౌకర్యానికి గురయ్యానని వివరించింది. అందువల్లే ఆ సినిమాకు నేను నో చెప్పేశానని లావణ్య త్రిపాఠి పేర్కొంది.ఆ సమయంలో నాకు ఎవరూ కూడా సపోర్ట్ కూడా లేదని లావణ్య తెలిపింది. ఆ తర్వాత నన్ను టార్గెట్గా చేసి వేధించారని అన్నారు. నాపై కేసు పెట్టడమే కాకుండా.. తప్పుడు కథనాలు కూడా రాసుకొచ్చారని ఆవేదన వ్యక్తం తెలిసింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఏడ్చేశానని లావణ్య త్రిపాఠి వివరించింది.లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ..'ఒకప్పుడు నేను ఒక తమిళ సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ఆ దర్శకుడి తీరు నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకు అక్కడ సౌకర్యంగా లేదని అనిపించింది. అందుకే ఆ సినిమాకు నో అని చెప్పా. ఆ తర్వాత వారు నా గురించి వార్తాపత్రికల్లో తప్పుడు కథనాలను ప్రచురించడం మొదలుపెట్టారు' అని చెప్పుకొచ్చింది. “There was a time when I was supposed to do a Tamil film, but I felt something was not right with the DIRECTOR and I didn't feel Comfortable, so I said NO.After that, they were started putting wrong articles about me in newspaper."– Actress #LavanyaTripathi | #Kollywood pic.twitter.com/QvEZ39watH— Whynot Cinemas (@whynotcinemass_) March 14, 2026 -
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ట్రైలర్ రిలీజ్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్సింగ్. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. -
వివాదాస్పద లిరిసిస్ట్పై ప్రశంసలు.. కమల్ హాసన్కు చిన్మయి చురకలు..!
వివాదాస్పద లిరిసిస్ట్ వైరముత్తును ఏకంగా జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. దీంతో ఆయనకు తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలతో ముంచెత్తుతున్నారు. సీఎం స్టాలిన్, హీరో కమల్ హాసన్ సైతం వైరముత్తుకు అభినందనలు తెలిపారు. దేశంలోని సాహిత్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారమే జ్ఞానపీఠ్ అవార్డు. ఈ అవార్డ్తో జ్ఞాన్పీఠ్ అవార్డ్ అందుకున్న మూడో తమిళ వ్యక్తిగా వైరముత్తు నిలిచాడు.చిన్మయి చురకలు..వైరముత్తుకు జ్ఞాన్పీఠ్ అవార్డ్ రావడంపై సింగర్ చిన్మయి స్పందించింది. కమల్ హాసన్ వైరముత్తును ప్రశంసించడంపై ట్విటర్ వేదికగా మండిపడింది. కమల్ హాసన్ కూడా వైరముత్తును అభినందించారని ఎద్దేవా చేసింది. సినిమాల్లో ఉన్న మగవాళ్లు రాజకీయాలకు మారడం, తన మామ-గురువు తమను లైంగికంగా వేధించాడని చెప్పిన మహిళలను పూర్తిగా పట్టించుకోకపోవడం ఆయనకే చెల్లుతుందని పోస్ట్ చేసింది. పురుషులు ఎప్పటికీ మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తు పెట్టుకోవాలని సూచించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన సొంత పార్టీలోని మహిళ బహిరంగంగా కవి పేరును ప్రస్తావించినా పట్టించుకోకపోవడం మరి దారుణమని చిన్మయి తెలిపింది. చివరగా పురుషులు కేవలం సోదరులు, మామలు, నాన్నలు, స్నేహితులు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారని.. మహిళలను ఎవరు పట్టించుకోరని వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో సింగర్ చిన్మయి శ్రీపాద ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వైరముత్తుకు భారతీయ సాహిత్యానికి చేసిన కృషికి జ్ఞానపీఠ్ అవార్డు రావడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. For God’s sake 🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️P.S.: Men in such power in cinema transitioning to politics completely turning a deaf ear to women who come on record to say they were molested by “his uncle-mentor” must remind women who vote - that men will never be on our side.The weirdest thing -… https://t.co/KB7VNAevu5— Chinmayi Sripaada (@Chinmayi) March 14, 2026 -
సూర్య లేటేస్ట్ మూవీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈనెల 16న సాయంత్రం 04:06 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ను సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. A journey filled with heart. ❤️The teaser of #VishwanathAndSons is on its way.🥳Sanjay Vishwanath arrives on March 16th @ 04:06 PM! 😎In cinemas from this JULY 2026. 🤩@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/FKoOht3Oz0— Sithara Entertainments (@SitharaEnts) March 14, 2026 -
హీరో రాజశేఖర్కు గోటీల బిజినెస్.. ఆయన ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న బైకర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన సాంగ్ ఆడియన్స్ను మెప్పించింది.అయితే ఈ సినిమా సంగతి పక్కనపెడితే హీరో రాజశేఖర్పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. గతంలో ఆయన గోటీల బిజినెస్ ప్రారంభించారని నెట్టింట మీమ్స్ వైరలయ్యాయి. ఈ వ్యాపారంలో ఆయన కోట్లు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కొందరైతే ఏకంగా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు వచ్చాయంటూ మరీ హాస్యంగా పోస్టులు పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ ఇదంతా నిజమేనా అని ఆరా తీయడం మొదలెట్టారు.తాజాగా తనపై వచ్చిన మీమ్స్పై హీరో రాజశేకర్ స్పందించారు. ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి వ్యాపారాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. తనకు గోటీల ఫ్యాక్టరీ ఉందని అందరు మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కొందరు అది నిజమే అనుకుని నాకు కాల్ చేసి అడిగారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూడగానే నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా? అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. -
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
గంపెడాశలతో ఇండస్ట్రీలో అడుగుపెడదామని వస్తున్న ఎంతోమంది తప్పుదారి పడుతున్నారంటోంది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. అవకాశాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నవారిని కొన్ని అదృష్య శక్తులు నిలువునా ముంచేస్తున్నాయంటోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో తనుశ్రీ దత్తా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో మొదట అందానికి ప్రాధాన్యతనిస్తారు. వారికి టాలెంట్ ఉందా? లేదా? అనేది ఆలోచించరు. అందాన్ని చూసి పొగడ్తలు కురిపిస్తారు. కానీ అది విని మీరు బోల్తా కొట్టకూడదు. ముందు పొగడ్తలునా చిన్నతనంలో నా తల్లి అపరిచితులతో మాట్లాడకూడదని, వారిచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని చెప్పేది. ఇండస్ట్రీలో అలాంటి అపరిచితులు, వారిచ్చే చాక్లెట్లు చాలా రకాలుగా ఉంటాయి. వారి కోరిక తీర్చుకునేందుకు ముందు మిమ్మల్ని పొగుడుతారు. తర్వాత మీ కలల్ని, ఆశయాల్ని ఆసరా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటారు. ఈ క్రమంలో అవకాశాలు అందుకుని ముందడుగు వేసిన కొందరు విజయం సాధిస్తారు, మరికొందరు బాధతో ఇంటికి తిరిగెళ్లిపోతారు. నన్ను నేను అమ్ముకోనుఇంకొంతమందైతే ముందుకు వెళ్లలేక, వెనక్కూ వెళ్లలేక వ్యభిచారంలోకి నెట్టబడతారు. ఇలాంటి రహస్యాలు బయటకు ఎప్పుడూ రావు. ఎందుకంటే సక్సెస్ స్టోరీలు మాత్రమే బయటకు వస్తాయి, వాటి గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే నా మాటల వల్ల నలుగురు అలర్ట్ అయి వారిని వారు కాపాడుకున్నా అదే నాకు సంతోషం. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ సాధారణమే అని ఓ నటి అన్నందుకు ఆమెతో స్నేహాన్నే తెంచుకున్నాను. నేను ఆర్టిస్ట్ను.. ఒకరికి నా జీవితాన్ని అమ్ముకునేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది.మీటూమీటూ ఉద్యమం సమయంలో తను కూడా బాధితురాలినేనంటూ మీడియా ముందుకు వచ్చింది తనుశ్రీ దత్తా. నానాపటేకర్ లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమాలోని ఓ పాట షూటింగ్లో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. అయితే ఘటన జరిగిన మూడేళ్లలోపు ఫిర్యాదు చేస్తేనే విచారిస్తామని, ఇది పదేళ్ల కిందటినాటి ఘటన కావడంతో విచారణ కుదరదని న్యాయస్థానం కేసు కొట్టివేసింది. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన తనుశ్రీదత్తా.. తెలుగులో వీరభద్ర చిత్రంలో యాక్ట్ చేసింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.చదవండి: తెలుసు కదా.. షూటింగ్లోనే తేడా కొట్టింది: రాశీ ఖన్నా -
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దురంధర్ మూవీ హిట్ కావడం చాలామందిని భయపెట్టిందన్నారు. ఆదిత్య ధర్కు ఆదరణ పెరగడం కొందరికీ నచ్చడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారని అన్నారు. ఆదిత్య ధర్, ఆయన సతీమణి యామీ గౌతమ్ పతనం కోసం సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జీవీ దురంధర్ డైరెక్టర్పై ప్రశంసలు కురిపించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతిని మార్చిందని అన్నారు. ఆయన వల్ల సినీ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లంతా పునరాలోంచించేలా చేసిందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆదిత్య ధర్, యామి గౌతమ్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాలని సూచించారు.ఆర్జీవీ మాట్లాడుతూ..' తెరపై కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్ ఆదిత్య ధర్ పూర్తిగా మార్చేశారు. మన సినిమాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఇక్కడ నేను హిందీ మాత్రమే కాకుండా అన్ని భాషల గురించి మాట్లాడుతున్నా. తెలుగులో రాబోయే అనేక పెద్ద-బడ్జెట్ యాక్షన్ చిత్రాలు భారీ రీ షూటింగ్కు రెడీ అవుతున్నాయి. దీనివల్ల నిర్మాతలపై అదనపు భారం తప్పదు. ఆదిత్య ధర్ వల్లే ఇలా చేయాల్సి రావడం పరిశ్రమలోని కొందరికి నచ్చడం లేదు. అందుకే వారంతా అతన్ని ద్వేషిస్తారు. ఆయన అందరిని కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు తీసుకొచ్చేలా చేశాడు. అందుకే ఆదిత్య ధర్ ఫెయిల్యూర్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారని' అన్నారు. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తోన్న దురంధర్-2 ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. -
సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఇకపై అవీ తప్పనిసరి..!
ఇండియన్ సినిమాలపై సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్ టైటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ఇండియన్ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంతో వినికిడి లోపం ఉన్నవారికి సినిమా అర్థం చేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. అయితే ఈ మార్పులు థియేటర్లలో ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై నెట్టింట చర్చకు దారితీసింది.ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు..సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను అన్ని రకాల ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ నిర్ణయం మొదటి అడుగుగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలతో సినిమాపై ప్రేక్షకుడి దృష్టిని మరల్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఓకే కానీ.. మన హిందీ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఎందుకని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. కింద ఉన్న పదాలు ప్రేక్షకుడి దృష్టిని మరల్చడం, కొన్నిసార్లు నటీనటులు మాట్లాడనప్పుడు కూడా సబ్ టైటిల్స్ వస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ కొత్త నియమం అన్ని భారతీయ భాషలు, ప్రాంతాలలోని చిత్రాలకు వర్తిస్తుందని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. -
సినిమా టికెట్ల విషయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు వివరాలు ప్రభుత్వం 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్లో ఉంచాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ దాఖలు చేసిన పిటిషన్ను బెంచ్ శుక్రవారం విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు రాష్ట్రంలో విడుదల కాబోయే అన్ని సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఎస్.నిరంజన్రెడ్డిలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల అమలును సుప్రీం ధర్మాసనం నిలిపివేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. -
కేవలం రూ.33 వేలతో సినిమా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
ఈ రోజుల్లో సినిమా తెరకెక్కించాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. చిన్న సినిమాలకు సైతం ఐదారు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అలాంటిది కేవలం రూ. 33 వేల బడ్జెట్తో సినిమాను తెరకెక్కించాడు ఓ దర్శకుడు. ఇది నమ్మశక్యంగా లేకున్నా.. వందశాతం నిజం. షార్ట్ ఫిలిమ్స్ సైతం లక్షల బడ్జెట్తో తీస్తున్న ఈ రోజుల్లో..దర్శకుడు రాహి అనిల్ ఈ ప్రయోగం చేశాడు. కేవలం 33 వేలతోనే 80 నిమిషాల నిడివి ఉన్న సినిమాను తెరకెక్కించాడు. రాహి అనిల్ ఎవరో కాదు.. తుంబాడ్, మంఝా, మాయాసభ లాంటి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది ఈ దర్శకుడే. ఇప్పుడు మన్ పిశాచ్ పేరుతో రూపొందిన సైకాలజికల్ హారర్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. మార్చి 18న ఈ మూవీ యూట్యూబ్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ని విడుదల చేశారు.ఈ మూవీలో కేవలం ఇద్దరు నటులు(యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే) మాత్రమే ఉన్నారు. ఐఫోన్ కెమెరాతో వీడియో తీసి.. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అతి తక్కువ బడ్జెట్తో ఈ మూవీని తీర్చిదిద్దారు. ‘ఇది నా కొత్త ప్రయోగం. సాంకేతికత ఎలా సినిమాలను మారుస్తుందో చూపించాలని కోరాను’ అని డైరెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ప్రభావం సినిమా రంగంపై ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పడానికి ఈ సినిమా ఓ మంచి ఉదాహరణ. -
అభిమానికి ముద్దు పెట్టిన తమన్నా..వీడియో వైరల్
సినీతారలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. కొంతమంది అయితే వాళ్లను పిచ్చిగా ప్రేమిస్తారు కూడా. వాళ్లను చూసేందుకే ఎంతో దూరం నుంచి వస్తారు. హాయ్ చెబితే చాలు.. ఆనందంతో పొంగిపోతారు. ఇక షేక్ హ్యాండ్ ఇస్తే.. దాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటిది స్టార్ హీరోయిన్ తమన్నా ఏకంగా ఓ అభిమానికి ముద్దు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.తమన్నా..ఒకప్పుడు టాలీవుడ్లో బిజియెస్ట్ హీరోయిన్. ఎన్టీఆర్, రామ్ చరణ్తో పాటు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. ఒకనొక దశలో అత్యధిక పారితోషికంగా తీసుకున్న దక్షిణాది నటిగానూ పేరు సంపాదించుకుంది. కొన్నాళ్ల తర్వాత బాలీవుడ్కి తన మకాం మార్చింది. అయితే అక్కడ నటిగా కంటే..ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్య ఆమె ఎక్కువగా స్పెషల్ సాంగ్సే చేస్తోంది. అవి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటిన తమన్నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె ఓ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వెళ్లింది. అక్కడ ఓ డ్యాన్స్ గ్రూప్.. స్త్రీ 2 మూవీలో తమన్నా చేసిన ఆజ్కి రాత్ పాటకి డ్యాన్స్ చేసింది. వారి డ్యాన్స్కి ఫిదా అయిన తమన్నా..వెంటనే స్టేజ్పైకి వెళ్లి వాళ్లతో కలిసి కాళ్లు కదిపింది. ఆ గ్యాంగ్లో తమన్నాను బాగా ఇష్టపడే ఓ యువతి కూడా ఉంది. అభిమాన నటి.. తనతో కలిసి స్టెప్పులేస్తుంటే..ఆనందంతో ఉబ్బితబ్బిపోయింది. ‘మేడం ప్లీజ్..ఒక కిస్ చేసుకోవచ్చా? అని ఆ యువతి అనగానే..తమన్నా ఓకే అన్నట్లుగా తల ఊపింది. ఇంకేముంది సదరు యువతి తమన్నా బుగ్గలపై ముద్దుపెట్టి గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయింది. అభిమాని ప్రేమకు ఫిదా అయిన తమన్నా..నవ్వుతూ.. ఆ యువతి బుగ్గపై ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఓ సాధారణ అభిమానికి ప్రేమగా ముద్దు పెట్టడం పట్ల నెటిజన్స్ తమన్నాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. A lady Fan kissed Tammy and she kissed back. Such a pure soul she is🤌🤌🤌💕💕💕#Tamannaah #TamannaahBhatia pic.twitter.com/g0chNWIkbO— Miss B fan(Tammu fan😘❣️) (@MissB_Fan) March 13, 2026 -
దర్శకుడిగా శేఖర్ మాస్టర్.. నిజమెంత?
టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ నటుటలతో పాటు ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్చరణ్ లాంటి స్టార్ హీరోల వరకు అందరికి ఆయన కొరియోగ్రఫీ చేశాడు. హుక్ స్టెప్పుల స్పెషలిస్ట్గానూ పేరుపొందాడు. ఆయన కొరియోగ్రఫీ అందించిన చాలా పాటలు నెట్టింట వైరల్గా మారాయి. ఒకవైపు సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ అందిస్తూనే..మరోవైపు పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు.ఇలాంటి సమయంలో ఆయనకు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. త్వరలోనే ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. అందులో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా హీరోగా నటించబోతున్నాడట. ఈ వార్త గత రెండు, మూడు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే వాస్తవం ఏంటంటే.. ఆయన ఇప్పట్లో మెగా ఫోన్ పట్టే అవకాశమే లేదట. తన దర్శకత్వంలో ప్రభుదేవా కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్నారనే వార్తలో ఎలాంటి నిజం లేదని శేఖర్ మాస్టర్ ‘సాక్షి’కి తెలిపారు. -
పైసా తీసుకోని మ్యూజిక్ డైరెక్టర్.. మెచ్చుకున్న హీరో
సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్. అసురన్, విడుదలై వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు పొందాడు. అలాగే హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ దృష్టిలో పడ్డాడు. అంతేకాకుండా వెట్రిమారన్ సహాయ దర్శకుడిగానూ మారాడు. అలాంటి కెన్ తాజాగా ఒకేసారి హీరోగా, దర్శకుడిగా అవతారమెత్తి చేసిన మూవీ యూత్. రిలీజ్ ఎప్పుడంటే?పర్వతా ఎంటర్టైన్మెంట్ పతాకంపై కరుప్పయ్య సి.రామ్, కౌసల్యకుమార్ నిర్మించిన ఈ చిత్రంలో అనిష్మా, మీనాక్షి, ప్రయాన్సీ, ప్రియదర్శిని యాదవ్ హీరోయిన్లుగా నటించారు. నళిని, దేవదర్శిని, సురాజ్ వెంజారముడు ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, విక్కీ చాయాగ్రహణం అందించారు. కళాశాల నేపథ్యంలో సాగే ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఈనెల 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. వాళ్లే కారణంశుక్రవారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెట్రిమారన్, ధనుష్ పాల్గొన్నారు. తాను నటుడిగా, దర్శకుడిగా మారడానికి వెట్రిమారన్, ధనుష్లే కారణం అని కెన్ కరుణాస్ ఈ వేదికపై పేర్కొన్నారు. ధనుష్ మాట్లాడుతూ.. కెన్ ఈ స్థాయికి చేరుకోవవానికి కారణం ఆయన తల్లి దండ్రులేనన్నారు. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం అని పేర్కొన్నారు. ఆయన ఈ చిత్రానికి పారితోషికం తీసుకోకుండా పనిచేయడం విశేషం అన్నారు. -
నిర్మాత అర్జున రాజు కన్నుమూత
ప్రముఖ నిర్మాత ఎం. అర్జున రాజు కన్నుమూశారు. వయోభారం వల్ల శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఎం. రంగరాజు, సీతాయమ్మ దంపతుల కుమారుడు అర్జున రాజు. వెస్ట్ గోదావరి జిల్లా కోరుకొల్లు ఆయన స్వస్థలం. రోజా ఆర్ట్స్ అధినేతల్లో ఒకరైన శివ రామరాజు భాగస్వామ్యంతో ఎన్టీఆర్తో ‘వేటగాడు’ (1979), ‘కొండవీటి సింహం’ (1981) వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు అర్జున రాజు. రోజా ఆర్ట్ ప్రోడక్షన్స్ , రోజా ఎంటర్ప్రైజెస్ బ్యానర్ల మీద కూడా పలు సినిమాలు తీశారాయన.అలాగే కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా రూ పొందిన ‘అడవి సింహాలు’, శోభన్ బాబు హీరోగా నటించిన ‘కోడెత్రాచు’ చిత్రాలకు ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. చిరంజీవి హీరోగా ‘జేబుదొంగ’, నాగార్జున హీరోగా ‘బావ నచ్చాడు’, కృష్ణంరాజు, శ్రీకాంత్లతో ‘మా నాన్నకు పెళ్ళి’ వంటి సినిమాలను అర్జున రాజు నిర్మించారు. అలానే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘జాబిలి’, ‘అల్లరి’ నరేశ్తో ‘మా అల్లుడు వెరీగుడ్’ మూవీస్ నిర్మించారు.జగపతిబాబు హీరోగా నటించిన ‘జగపతి’ (2005) చిత్రం తర్వాత అర్జున రాజు సినిమాలు నిర్మించలేదు. హిందీలో ‘నిషానా, జానీ దోస్త్, ఫర్జ్ ఔర్ కానూన్’ వంటి ఆరు చిత్రాలు నిర్మించారు. ఆయనకి భార్య సీతాదేవి, కుమారుడు రామలింగ రాజు, కుమార్తె కుమారి ఉన్నారు. నేడు హైదరాబాద్లో అర్జున రాజు అంత్యక్రియలు జరుగుతాయి. -
'ఆయా షేర్' కోసం ఇంత కష్టమా?.. మేకింగ్ విశేషాలివే!
‘ఆయా షేర్..’ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లోని ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ని షేక్ చేస్తోంది. నాని వేసిన హుక్ స్టెప్కి చిన్న, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నారు. సాహిత్యంపై పట్టున్నవాళ్లు లిరిక్స్పై, డ్యాన్స్పై అవగాహన ఉన్నవాళ్లు..నాని స్టెప్పులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ పాటలో కనిపించిన విజువల్స్ మరోఎత్తు. ఈ పాటలో హీరోని మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. హీరోను మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సెట్ను నిర్మించారట. ఇందులో ప్రధాన ఆకర్షణగా హీరో హౌస్ (కమాన్ సెట్) నిలిచింది. దీన్ని 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు, 25 అడుగుల లోతుతో నిర్మించారట. అంతేకాదు ఇందులో చూపించిన ఇళ్లను నిజంగానే నిర్మించారట. సాధారణంగా సినిమాల్లో ఇళ్ల సెట్లు అంటే డమ్మీ స్ట్రక్చర్స్ వాడుతుంటారు. కానీ ఈ సాంగ్లో వాటర్ బాడీ విలేజ్ సెట్ కోసం 60 అసలైన ఇళ్లను నిర్మించినట్లు మేకర్స్ తెలిపారు. దాదాపు 50 మంది పనివారు 30 రోజుల పాటు శ్రమించి ఈ విలేజ్ సెట్ను రూపొందించారు. ఇక ఈ పాటలో కనిపించే భారీ బిర్యానీ బౌల్ని రెడీ చేయడానికి ఏడు మంది దాదాపు ఐదు రోజుల పాటు కష్టపడ్డారట. దీనికి పాత కాలపు లుక్ రావడం కోసం ప్రత్యేకమైన 'ఏజింగ్ టెక్నిక్స్' వాడటం విశేషం. సినిమాలోని సహజత్వం కోసం 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో ఒక డంప్ యార్డ్ సెట్ను కూడా వేశారు. దీనికోసం 25 మంది సభ్యులు 30 రోజుల పాటు పనిచేశారు. ఇక్కడ నీటి కొలను సృష్టించడానికి 100 ట్యాంకర్ల నీటిని వినియోగించారు. ఇది నిండటానికే ఏడు రోజుల సమయం పట్టిందంటే సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక పాట కోసమే ఈ రేంజ్లో సెట్ వేశారంటే..ఇక సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చదు. సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్గా నటిస్తున్నాడు. తనికెళ్ల భరణి,కిల్' ఫేమ్ రాఘవ్ జూయెల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
థాంక్యూ రేవంతన్న.... బన్నీ ఎమోషనల్
-
పూరి జగన్నాధ్ కూతురును చూశారా.. ఎంతలా మారిపోయిందో?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్కు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలంతా ఒక్కసారైనా ఈయనతో సినిమా చేయాలని భావిస్తారు. ముఖ్యంగా మాస్, యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాలంటే పూరీతో సినిమా చేయాల్సిందే. ఆయనలా సీన్స్, డైలాగులు రాసే డైరెక్టర్స్ ఇండియాలోనే లేరు అని ప్రభాస్ లాంటి స్టార్ హీరోనే చెప్పాడంటే.. పూరీ పెన్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేకున్నా..యువతలో పూరీకి ఉన్న క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు.ప్రస్తుతం పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్, టబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పూరీ ఫోకస్ అంతా ఈ మూవీపైనే పెట్టాడు. ఇదిలా ఉంటే.. పూరీ ఇప్పటికే తన వారసుడిని సినిమాల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొడుకు ఆకాష్ పూరిని చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం చేసి..ఆ తర్వాత హీరోగా మార్చాడు. అయితే ఆకాశ్ పూరీకి కూడా ఈ మధ్య సరైన హిట్ లేదు. తండ్రి కొడుకులిద్దరు ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు పూరీ తనయ పవిత్ర సైతం సినిమాల్లోకి రాబోతుందనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. బుజ్జిగాడు సినిమాలో పూరి కూతురు పవిత్ర చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు. కానీ ఆమె సినిమాల్లోకి రాబోతుందనే వార్తలు మాత్రం తరచూ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ సారి ఆమె నటిగా కాకుండా.. నిర్మాతగా వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’లో పవిత్ర కూడా నిర్మాతగా చేర్చాబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే వీటిల్లో నిజమెంత అనేది తెలియదు కానీ..తాజాగా పవిత్రకు సంబంధించిన ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Pavithra Puri (@pavithrapuri_) -
66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే?
సెలబ్రిటీలు ఎలా రెడీ అవుతున్నారు? బరువు పెరిగారా? తగ్గారా? ముఖం కళకళలాడుతోందా? కళ తప్పిందా? హుషారుగా ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఇలా ప్రతీది కళ్లతోనే స్కానింగ్ చేస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్స్. వారి కంటికి ఏదైనా ఫోటో, వీడియో కనిపిస్తే చాలు.. ఏవేవో ఊహించుకుంటున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా విషయంలోనూ అలాగే అతిగా ఊహించుకున్నారు.విరోష్ రిసెప్షన్లో..ఇటీవల హైదరాబాద్లో జరిగిన విరోష్ (విజయ్ దేవరకండ- రష్మిక మందన్నా) రిసెప్షన్కు నీనా గుప్తా, భర్త వివేక్తో కలిసి హాజరైంది. స్టైలిష్గా తెల్ల చీర కట్టుకున్న ఆమె మెడకు బంగారు నెక్లెస్ ధరించింది. కాకపోతే కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. ఇంకేముంది సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. 66 ఏళ్ల వయసులో నీనా గర్భం దాల్చిందా? ఇది నిజమేనా? అని ఆరా తీస్తున్నారు.ప్రెగ్నెన్సీ రూమర్స్పై క్లారిటీదీంతో ఈ రూమర్స్పై తాజాగా నీనా గుప్తా స్పందించింది. ఇదేమైనా బదాయి హో సినిమా (ఈ మూవీలో లేటు వయసులో ఓ మహిళ తల్లవుతుంది) అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. నేను గర్భవతిని కాదు. చీర కాస్త బరువుగా ఉంది. అందువల్లే నేను కూడా మీకు లావుగా కనిపించానంతే! ఏదేమైనా ఈ ప్రచారం నన్ను బాధపెట్టడానికి బదులుగా ఆశ్చర్యపరిచింది. ఈ వయసులో ప్రెగ్నెంట్ అనుకున్నారంటే మన దేశం ముందుకు పోతున్నట్లే అని పేర్కొంది. నీనా చివగా వధ్ 2 మూవీలో యాక్ట్ చేసింది.ప్రేమ- పెళ్లినీనా గుప్తా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ను ప్రేమించింది. అయితే అప్పటికే అతడికి భార్యాబిడ్డలున్నారు. అయినప్పటికీ నీనాతో ప్రేమాయణం సాగించాడు. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా గుప్తా జన్మించింది. కానీ నీనా- రిచర్డ్స్ మాత్రం పెళ్లి బంధం వరకు వెళ్లకుండానే విడిపోయారు. దాంతో నీనా.. సింగిల్ పేరెంట్గా మసాబాను పెంచి పెద్ద చేసింది. 2008లో వివేక్ మెహ్రాను పెళ్లాడింది. Is Neena Gupta pregnant? pic.twitter.com/AlCeWzpvlG— Sapna Madan (@sapnamadan) March 5, 2026 చదవండి: గుండె ముక్కలు.. హీరో బ్రేకప్ పోస్ట్ -
పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 6న తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఈ జంట తమకు పుట్టబోయే పిల్లల గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. పుట్టబోయే పిల్లలను తెలుగులో మాట్లాడేలా పెంచాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్స్టోరీ గురించి వివరించాడు.అత్తయ్యకు దొరికిపోయాం..మేమిద్దరం ప్రేమలో ఉన్న విషయం మొదట మా అత్తయ్య(చిరంజీవి సతీమణి సురేఖ)కు తెలిసింది. మేమిద్దరం ఓ రోజు కాఫీ తాగేందుకు బయటకు వెళ్లాం. కాఫీ షాపులో మా అత్తయ్యకు తెలిసివాళ్లు కూడా ఉన్నారు. అది మాకు తెలియదు. మేము కాఫీతాగి బయటకు రాగానే.. వాళ్లు మా అత్తయ్యకు ఫోన్ చేసి చెప్పారు. అలా మా ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. నేను కూడా నయనికను ప్రేమిస్తున్నానే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.నయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు ఇష్టంనయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయానైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. నచ్చకపోతే ముఖం మీదనే నచ్చలేదని చెప్పెస్తుంది. నా సినిమాల్లో నచ్చిన విషయాలను షేర్ చేసుకునేది. పెళ్లికి ముందే మేము పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నాం. మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలనేది నా కోరిక. దీనిపై మేమిద్దరం చర్చించుకున్నాం’ అని శిరీష్ చెప్పుకొచ్చాడు. -
క్రిష్ 4 పక్కన పెట్టేసిన హృతిక్.. బాబీతో హాలీవుడ్ రేంజ్ మూవీ కన్ఫర్మ్..?
-
బీ-టౌన్ డిజైనర్ల ఫేవరెట్ ఐకాన్గా అల్లు అర్జున్!
ఇది నిజంగా అరుదైన విషయమే అని చెప్పాలి. ఒక టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్లకు ఫేవరెట్ గా మారడం అనేది అంత ఈజీ కాదు. రజనీకాంత్ రోబో దగ్గర నుంచి గత కొంతకాలంగా మన దక్షిణాది సినిమాలు మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయి కలెక్షన్లు సాధిస్తుండవచ్చు గాక. కానీ మన టాలీవుడ్ హీరోలలో ఎవరూ బాలీవుడ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మొన్నటి హృతిక్ రోషన్, జాన్ అబ్రహాంలతో మొదలుకుని నిన్నటి రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్...తదితర టాప్ స్టార్స్ వెంటే క్యూ కట్టే సంప్రదాయం బాలీవుడ్ డిజైనర్స్ ది. అలాంటిది తొలిసారిగా ఉత్తరాది ఫ్యాషన్ పరిశ్రమ ఒక టాలీవుడ్ స్టార్ అంటే అమితాసక్తి చూపిస్తోంది. అతడే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.ఆరంభం నుంచే తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అల్లు అర్జున్ తొలిదశలోని దేశముదురు, హ్యాపీ, ఆర్య, ఇద్దరమ్మాయిలతో...వంటి సినిమాల్లో బన్నీ స్టైల్స్కు కుర్రకారు ఫిదా అయిపోయారు. అలా తన సినిమాల ద్వారా స్టైలిష్ స్టార్ అనే సరికొత్త కిరీటాన్ని కూడా అయితే తెలుగులో ఆయన్ను స్టైలిష్ స్టార్గా చేసిన సినిమాలన్నింటిలోనూ బన్నీ.. అత్యాధునిక స్టైల్స్ చూపాడు కాబట్టి ఓకే.. అయితే కాస్త వంకరగా నడుస్తూ, ఊర మాస్ డ్రెస్సులు వేసుకున్న పుష్పరాజ్ గా ఆయన బాలీవుడ్ డిజైనర్లకు ఫేవరెట్గా మారడం విశేషం.ఇటీవల పలు సందర్భాల్లో అల్లు అర్జున్ ధరిస్తున్న డ్రెస్లు అన్నీ టాక్ ఆఫ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ షెర్వానీ లాంటివి బాలీవుడ్ స్టార్స్ కనుబొమలు ఎగరేసేలా చేశాయి. నీహారిక కొణిదెల డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం దాదాపు రూ.3లక్షలు విలువ చేసే ఈ ఎత్నిక్ వేర్ను అల్లు అర్జున్ ధరించాడు. ఈ డ్రెస్ తో బన్నీ స్టైల్ వైరల్గా మారిపోయింది. అలాగే ఇటీవలి కాలంలో స్టార్ డిజైనర్గా దూసుకొచ్చిన అశ్విన్ మావ్లే కూడా పలు ప్రత్యేక సందర్భాల్లో బన్నీకి డిజైన్స్ క్రియేట్ చేశాడు. తాజాగా తన వెడ్డింగ్ యానివర్సరీ, అల్లు శిరీష్ పెళ్లి వేడుకల సందర్భంగా బన్నీ డ్రెస్సింగ్ స్టైల్స్ నెట్టింట్ సెన్సేషన్ గా మారాయి.దాంతో దేశంలోని టాప్ డిజైనర్లు అందరికీ అల్లు అర్జున్ స్పెషల్ ఇంట్రెస్ట్గా మారాడు. మరోవైపు బాలీవుడ్ మేగ్జైన్స్, వెబ్సైట్స్ అక్కడి స్టార్స్తో సమానంగా ఇంకా చెప్పాలంటే వారికన్నా మిన్నగా అల్లు అర్జున్ స్టైల్స్కి పెద్ద పీట వేస్తున్నాయి. ఇటీవలే తరుణ్ తహిల్యానీ, శంతను నిఖిల్, సబ్యసాచి తదితర టాప్ ఫ్యాషన్ డిజైనర్స్ హైదరాబాద్లోనూ బొటిక్స్ ప్రారంభించిన నేపధ్యంలో దక్షిణాదిలో ప్రమోషన్స్ కోసం చూస్తున్న వీరందరికీ అల్లు అర్జున్ బెస్ట్ ఛాయిస్గా కనిపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో ఐకాన్స్టార్ నేషనల్ స్టైలిష్ స్టార్గా కిరీటం దక్కించుకోవడం తధ్యంగా కనిపిస్తోంది -
ఆశను కోల్పోవద్దు.. విడాకుల తర్వాత హన్సిక
సౌత్ ఇండియా ప్రముఖ నటి హన్సిక మోత్వాని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2022లో సోహైల్ను పెళ్లి చేసుకున్న ఆమె సుమారు నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. అయితే, విడాకుల తర్వాత తొలిసారి సోషల్మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేసింది. 'చర్ది కలా' ఆల్వేస్ అని పంజాబీ భాషలో కొటేషన్ షేర్ చేసింది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికటీ ధైర్యంగా ముందుకు సాగాలని అర్థం వచ్చేలా తెలిపింది. ఎలాంటి పరిస్థితిలు వచ్చినా సరే ఆశను కోల్పోవద్దని పేర్కొంది.ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను రాజస్థాన్లో హన్సిక పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్గా జరిగింది. సోషల్మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే, వివాహం అయిన ఆరు నెలల నుంచే వారిద్దరి మధ్య వబేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది ఆమె వారి పెళ్లి ఫోటోలను ఇన్స్టా నుంచి తొలగించడంతో విడాకుల నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఫైనల్గా ఈ ఏడాది మార్చి 11న వారికి విడాకులు కోర్డు మంజూరు చేసింది. -
ఓటీటీలో బోర్డర్-2 సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
బాలీవుడ్ హిట్ ప్రాంఛైజీ చిత్రం బోర్డర్-2 ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలోకి వచ్చింది. 1997లో రిలీజై భారీ హిట్ అందుకున్న బోర్డర్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. 1971 ఇండో-పాక్ యుద్ధం తీవ్రతను, భారత సాయుధ దళాల వీరత్వాన్ని ఈ సినిమా చూపిస్తుంది. అందరిలో దేశభక్తిని రగిల్చేలా ఈ చిత్రం ఉంటుంది.బోర్డర్ 2(Border 2) మూవీ మార్చి 20 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే, హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సుమారు రూ. 275 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 485 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. బోర్డర్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూ మరో చిత్రాన్ని కూడా మేకర్స్ ప్రకటించారు.పార్ట్-1 మాదిరే ‘బోర్డర్ 2’ కూడా దేశభక్తిని పెంచేలా ఉంటుంది. భారత్ను దొంగదెబ్బ కొట్టేందుకు పాకిస్థాన్ 1971లో ఎలాంటి కుట్రలు చేసిందో ఈ చిత్రంలో చూడొచ్చు. భారత్పై భూ, జల, వాయు మార్గాల ద్వారా కశ్మీర్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల ద్వారా భారీ దాడులకు దిగుతుంది. అయితే, భారత ప్రభుత్వం దీనిని ముందే గ్రహించి సైనికులను యుద్ధ రంగంలోకి దింపుతుంది. పాక్ సైన్యాన్ని ఎలా మట్టికరిపించారో ఇందులో చూపించారు. -
ఉస్తాద్ ఆశలన్నీ ట్రైలర్ మీదే.. తేడా వస్తే గల్లంతే
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఏర్పడనుంది. ఉస్తాద్ భగత్సింగ్ నుంచి ఇప్పటికే భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా కాలరే ఎత్తరా... అంటూ సాగే పాటని విడుదల చేశారు.ధురంధర్ స్పీడ్ఇప్పటికే ధరుంధర్-2 టికెట్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దీంతో సరైన ప్లానింగ్తో పద్ధతి ప్రకారం చిత్ర యూనిట్ ముందుకెళ్తుంది. అయితే, ఉస్తాద్ భగత్సింగ్ మేకర్స్ ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేశారు. దేఖ్లెంగే సాలా సాంగ్ అభిమానులను ఆకట్టుకుంది. సోషల్మీడియాలో మంచి స్పందన కూడా వచ్చింది. అయితే, ఆ తరువాతి రెండు పాటలు ఆరా ఆఫ్ ఉస్తాద్, కాలరే ఎత్తరా... చుట్టూ హైప్ ఉన్నప్పటికీ అనుకున్నంత రేంజ్లో బజ్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యాయి.ముఖ్యంగా, తాజాగా విడులైన కాలరే ఎత్తరా... పాటలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చూస్తారని హరీష్ శంకర్ పదే పదే సూచించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సాంగ్ మేకింగ్ రిఫ్రెషింగ్గా ఉన్నప్పటికీ, ఈ పాట చాలా మంది అభిమానులకు ఊహించినంత హైప్ని అందించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.మొత్తంమీద, ఉస్తాద్ భగత్సింగ్ నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చాలా యావరేజ్గా ఉందని అంటున్నారు. ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, బజ్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యారు. ఇక అందరి చూపు మార్చి 14న విడుదల కానున్న ట్రైలర్ మీదనే ఆశలు ఉన్నాయి. సినిమాలో బలమైన కంటెంట్తో పాటు భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలిపేలా ట్రైలర్ కట్ ఉంటేనే సినిమాకు బలం పెరుగుతుంది. ఇప్పుడు అందరి చూపు ట్రైలర్పైనే ఉంది. ఇక్కడ కూడా సరైన కంటెంట్ లేకుండా విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవు. ఆపై ధురంధర్-2 వంటి హిట్ ప్రాంఛైజ్ని తట్టకుని ఉస్తాద్ ఎంతమేరకు నిలబడుతాడో చూడాల్సి ఉంది.ట్రైలర్తో తేలిపోతుంది.తమిళ్ హిట్ సినిమా తేరి రీమేక్గా ఉస్తాద్ భగత్సింగ్ చిత్రాన్ని తెరకెక్కించారని విమర్శలు ఉన్నాయి. అయితే, దర్శకుడు హరీశ్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందులో ఎలాంటి నిజంలేదని చెప్పారు. ఉస్తాద్ సరికొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల కానున్నడంతో అసలు విషయం ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ తేరి రీమేక్ అయితే మాత్రం ఉస్తాద్ భగత్సింగ్ను ఎవరూ కాపాడలేరనేది వాస్తవం. -
Allu Cinemas: ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా..డాడీ అరవింద్: అల్లు అర్జున్
హైదరాబాద్లోని కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ప్రసంగం అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు తన తండ్రి అల్లు అరవింద్ దూరదృష్టిని ప్రశంసించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా రేవంతన్న అని సంబోధిస్తూ తమ కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.తన ప్రసంగంలో తండ్రి గురించి మాట్లాడుతూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. “నాన్న కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు.. ఆయన నాకు దేవుడు” అంటూ గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం వ్యాపార ప్రయోజనాల కోసం కాదని, తెలుగు సినిమా పరిశ్రమ తమకు ఇచ్చిన గౌరవానికి ప్రతిఫలంగా తిరిగి ఏదైనా గొప్పగా ఇవ్వాలనే అభిరుచితో చేసిన ప్రయత్నమని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ లాభాల కంటే సినిమాపై ఉన్న ప్రేమే అల్లు సినిమాస్ రూపంలో సాకారమైందని పేర్కొన్నారు.అల్లు అరవింద్ను టెక్నాలజీ పయనీర్గా బన్నీ అభివర్ణించారు. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన సాంకేతిక మార్పులను గుర్తుచేశారు. పరిశ్రమలో స్టీరియో సౌండ్ మాత్రమే ఉన్న రోజుల్లోనే ‘మాస్టర్’ సినిమాతో 5.1 సరౌండ్ సౌండ్ను పరిచయం చేసిన ఘనత అరవింద్ గారిదేనని చెప్పారు. టెక్నాలజీని ఎంటర్టైన్మెంట్ రంగంలో ముందుగానే తీసుకురావడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. సినిమాలు ఫిలిం రీల్స్ ద్వారా ప్రదర్శించబడుతున్న సమయంలోనే ప్రపంచం డిజిటల్ వైపు వెళ్తోందని గుర్తించి.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను డిజిటల్ వ్యవస్థలోకి మార్చడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారని బన్నీ తెలిపారు. అందుకే ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో “ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా” అని పిలవొచ్చని వ్యాఖ్యానించారు.అదే విధంగా ప్రాంతీయ ఓటీటీ రంగంలో కూడా ముందడుగు వేసి ఆహా (Aha) అనే తెలుగు ఓటీటీ ప్లాట్ఫారమ్ను ప్రారంభించడం ఆయన ముందుచూపుకు నిదర్శనమని అన్నారు. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా చెప్పబడుతున్న డాల్బీ విజన్ థియేటర్ను హైదరాబాద్కు అందించడం ద్వారా మరో మైలురాయి సృష్టించారని చెప్పారు. తన తండ్రి నెలకొల్పిన ఈ ఘనమైన వారసత్వాన్ని మరింత గర్వంగా ముందుకు తీసుకెళ్తానని బన్నీ తెలిపారు. హైదరాబాద్ను ప్రపంచ ఎంటర్టైన్మెంట్ మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. -
డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో...
రామ్చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, రామ్చరణ్ కొత్త ఫొటోను విడుదల చేశారు.‘‘యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘పెద్ది’. ఈ మూవీని అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో కూడా విడుదల చేస్తున్నాం. రామ్చరణ్ మాస్ రగ్డ్ అవతార్ను డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో చూడడం ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతి దక్కేలా చేస్తుంది. అలాగే ‘పెద్ది’ వంటి భారీ యాక్షన్, ఎమోషన్ కలిగిన ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్లో చూడడం వల్ల ప్రేక్షకులు పూర్తిగా సినిమాలో లీనమయ్యే అవకాశం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మహేష్ ఫ్యాన్స్ కోసమే కామెంట్స్ ఓపెన్ చేశాను: హరీశ్ శంకర్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోపానికి గురైన దర్శకుడు హరీశ్ శంకర్ తన పొరపాటును బహిరంగంగా ఒప్పుకున్నారు. “BoB రికార్డులు మళ్లీ లేపరా” అంటూ వచ్చిన ఒక పోస్టుకు హరీశ్ శంకర్ ‘తథాస్తు’ అని రిప్లయ్ ఇవ్వడం మహేష్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే ట్వీట్ను డిలీట్ చేసినప్పటికీ, అభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గలేదు. “నేను అంత స్పీడ్గా రియాక్ట్ కాకుండా, ట్వీట్ పూర్తిగా చదివి రెస్పాండ్ అవ్వాల్సింది. 30 సెకన్లలోనే డిలీట్ చేశాను. ‘బీ..వో’ అనే పదాలు కనిపించడంతో తొందర్లో బాక్సాఫీస్ అనుకున్నాను. అది పొరపాటు. అయినప్పటికీ కర్మను నమ్ముతాను. అందుకే క్షమాపణలు చెబుతూ నోట్ పెట్టిన తర్వాత కామెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేశాను. ఎంతయినా తిట్టండి అని అనుమతించాను” అని హరీశ్ తెలిపారు. “గద్దలకొండ గణేశ్ సినిమా బాగుందని మహేష్ బాబు స్వయంగా ట్వీట్ చేసి నన్ను అభినందించారు. నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం లేని వ్యక్తి అయినా, మనస్ఫూర్తిగా అభినందించారు. అలాంటి వ్యక్తి గురించి పొరపాటున నేను తప్పుగా ట్వీట్ చేయడం మహాపాపం. నేను ధర్మబద్ధంగా బతికే వ్యక్తిని, అధర్మం పనులు చేయను. ఇది తప్పు కాదు, పొరపాటు మాత్రమే” అని హరీశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా అన్ని రికార్డులను బద్దలుకొడుతుందని తాను కూడా నమ్ముతున్నానని హరీశ్ ప్రకటించారు. -
క్యాన్సర్ చివరి స్టేజ్.. చావు తథ్యమని ఏడ్చిన నటుడు
చిన్నాపెద్ద తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుర్తింపు సంపాదించుకున్నారు నర్రా వెంకటేశ్వరరావు. వెండితెరపైనే కాకుండా, రియల్ లైఫ్లోనూ ఠీవీగా ఉండే ఆయన జీవిత చరమాంకంలో మాత్రం బిగుసుకుపోయాడు. చావును ముందే గ్రహించి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. 2009 డిసెంబర్ 27న క్యాన్సర్తో కన్నుమూశాడు.ఆలస్యంగా బయటపడ్డ క్యాన్సర్తాజాగా నటుడి ఫ్యామిలీ ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా నర్రా కూతురు వాసంతి ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నాన్నకు క్యాన్సర్ చాలా ఆలస్యంగా బయటపడింది. ఆయన బరువు తగ్గిపోతుంటే షుగర్ వల్లేమో అనుకున్నాం.. ఎందుకైనా మంచిదని టెస్టులు చేయిస్తే పెద్ద పేగు క్యాన్సర్ ఉందని తేలింది. అది కూడా చివరి స్టేజ్.. 25 కిలోలు తగ్గిన నటుడుకొన్ని నెలలు మాత్రమే బతుకుతాడన్నారు. కీమోథెరపీ, సర్జరీలు చేయించడం వల్ల నాలుగేళ్లు బతికారు. క్యాన్సర్ వల్ల దాదాపు 25 కిలోలు తగ్గిపోయారు. కాకపోతే మొదటి సర్జరీ అయ్యాక పవిత్ర బంధం అని ఓ సీరియల్ చేశారు. ఇంట్లో ఉంటే ఏదో జబ్బుతో మంచానపడినట్లుందని పనితో బిజీ అయ్యారు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఒంట్లో ఓపిక లేక షూటింగ్కు వెళ్లలేదు. చివరి రోజుల్లో కంటతడిమనవళ్లతో ఎంజాయ్ చేయాలనుకున్న సమయంలో ఇలా ఆరోగ్యం దెబ్బతినేసరికి చాలా నిరాశపడ్డాడు. ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉందా? కనుక్కున్నారా? అని అడిగేవారు. మరోపక్క రేపు ఏదైనా జరిగినా నిన్ను పిల్లలు చూసుకుంటారు అని అమ్మకు ధైర్యం చెప్పేవారు. ఇక ఆయన చావుకు దగ్గరైనప్పుడు ఎంతో ఏడ్చారు. నాన్న చాలా ధైర్యవంతుడు, అలాంటి ఆయన్ను అలా చూడటం అదే మొదటి, ఆఖరిసారి! సినిమాహీరో శోభన్బాబు ఇచ్చిన సలహా వల్లే నాన్న సంపాదించిన ప్రతి పైసాలో సగం భూమి మీదే పెట్టేవాళ్లు. అలా ఎక్కువ ఆస్తులు సంపాదించాడు. కాగా నర్రా వెంకటేశ్వరరావు.. కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ, నేటి భారతం, తొలి ప్రేమ, పౌర్ణమి వంటి పలు చిత్రాలతో గుర్తింపు పొందాడు. ఎక్కువగా విలన్ తరహా పాత్రల్లో నటించాడు. దాదాపు మూడు దశాబ్దాల్లో 500కి పైగా సినిమాలు చేశాడు. చదవండి: నాన్న ప్రతి ఆదివారం అవే ఆర్డర్ పెడతాడు: నాగచైతన్య -
'జన నాయగన్' రూ. 120 కోట్ల ఢీల్ రద్దు
విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’కు సెన్సార్ చిక్కులు చిక్కులు తప్పడం లేదు. ముందుగా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో వడ్డీల రూపంలో నిర్మాత వెంకట్ కె.నారాయణకు భారీ నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఓటీటీ ఢీల్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో చట్టపరమైన సమస్యలు రావడంతో ఈ సినిమా గత మూడు నెలలుగా ల్యాబ్కే పరిమితమైంది.జన నాయగన్ సెన్సార్ సర్టిఫికెట్ కోసం సీబీఎఫ్సీ రివైజ్ కమిటీ మరోసారి సినిమా చూడాల్సి ఉంది. అయితే, ఈ కమిటీలో ఓ సభ్యుడి అనారోగ్య కారణంగా చివరి నిమిషంలో స్క్రీనింగ్ వాయిదా పడిన విషయం తెలిసింది. ఇలా పలు కారణాలతో రివైజ్ కమిటీ దాటవేస్తుండటంతో వ్యాపారం పరంగా భారీ నష్టం తప్పడం లేదు. కనీసం ఎప్పుడు చూస్తారో కూడా వారు చెప్పకపోవడంతో విడుదలపై అనిశ్చిత నెలకొంది. దీంతో అమెజాన్తో కుదుర్చకున్న ఓటీటీ ఢీల్ రూ. 120 కోట్లు రద్దు అయినట్లు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో జన నాయగన్ చివరి సినిమా అని ప్రకటించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి. -
ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు
నటుడు, తమిళ వెట్రి కళగం(టీవీకే) అధినేత కుమారుడు జాసన్ సంజయ్ తన తండ్రి ఇంటి పేరు తొలగించుకున్నాడు. ఇప్పుడు ఈ అంశం తమిళనాట హాట్ టాపిక్గా మారింది. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి విజయ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ ఇటీవల చెంగలపట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు పిల్లలకు జీవన భృతి చెల్లించేలా విజయ్ను ఆదేశించాలని కోరారు. కాగా విజయ్, సంగీత దంపతులకు జాసన్ సంజయ్, దివ్యషా పిల్లలు ఉన్నారనే విషయం తెలిసిందే.జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సిగ్మా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం టైటిల్ కార్డులో తన తండ్రి విజయ్ ఇన్షియల్( ఇంటి పేరు)ను తొలగించడంతో పాటూ తన తల్లి పేరు సంగీత ఇన్షియల్ వచ్చే విధంగా ఎస్ను చేర్చుకున్నారు. ఇంతకు ముందే తన ఇన్ స్ట్రాగామ్లో తండ్రి విజయ్ ఫాలోవర్స్ నుంచి వైదొలిగారు. ఇప్పుడీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
రాజేంద్ర ప్రసాద్ గారు.. సారీ చెప్పండి : విశాల్ ట్వీట్
తమిళుల ఆరాధ్య దైవం, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో సంచలనంగా మారాయి. ‘కత్తి కాంతారావు జాతీయ అవార్డు’ ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన.. కాంతారావు నటనను పొగిడే క్రమంలో ఎంజీఆర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంతారావుని చూసి ఎంజీఆర్ భయపడ్డారంటూ రాయడానికి వీల్లేని ఓ పదాన్ని వాడారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ స్పందించారు. ఎంజీఆర్పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు విని దిగ్భ్రాంతికి గురయ్యానని చెబుతూ..వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని కోరుతూ ట్వీట్ చేశారు.తెలుగు సినిమా పరిశ్రమలోని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను చూసి, విని దిగ్భ్రాంతికి గురయ్యాను. తమిళనాడులో ఒక దిగ్గజ నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా పేరుగాంచిన దివంగత దిగ్గజ నటుడు ఎంజీఆర్ గురించి మీరు చేసిన ప్రసంగాన్ని ఖండిస్తూ ఈ ట్వీట్ రాస్తున్నాను.దిగ్గజ నటుడు శ్రీ కాంతారావు గారు గురించి మీరు చేసిన ప్రసంగం బాగుంది. కానీ ఆయనను పొగిడేందుకు మరొక దిగ్గజ నటుడు ఎంజీ రామచంద్రన్ గారిని కించపరచడం తగదు. ఆయన్ను ఆరాధించే ప్రజల మనోభావాలను గాయపరచడం మంచిది కాదు. ఈ సమయంలో ఏది తప్పనిసరి, ముఖ్యమైనదో మీకు బాగా తెలుసు. ఈ వివాదానికి మీరు ముగింపు పలకాలని అభ్యర్థిస్తున్నాను. మీరు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నందుకు మన్నించండి. ఎవరైనా మీ స్థాయి నటుల గురించి భవిష్యత్తులో చెడుగా మాట్లాడితే... నటుడిగా నేను కూడా అలాగే చేస్తాను. కాబట్టి మీరు ఈ విషయంపై క్షమాపణ చెబుతున్నారని చెప్పడానికి సారీ చెబుతున్నాను. మిమ్మల్ని ఆ దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను'అని విశాల్ ట్వీట్ చేశాడు. Shocking and repelling to see and hear the recent comments of senior actor Shri Rajendra Prasad, senior actor of our Telugu film industry at a recent function. Dear Sir, with utmost regards and at the same time with a heavy heart, I pen down this tweet condemning your speech…— Vishal (@VishalKOfficial) March 12, 2026 -
52 ఏళ్ల మలైకాతో డేటింగ్.. 32 ఏళ్ల కుర్రాడు ఏమన్నాడంటే..
బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలైకా అరోరా.. వ్యక్తిగత జీవితంపై ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకొని.. 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసి.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ల పాటు కలిసి సహజీవనం చేసిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితమే విడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న మలైకా..ఇటీవల మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. ఆ కుర్రాడు మలైకా కంటే 20 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. అతని పేరు సోరబ్ బేడి. మోడల్, టీవీ నటుడు. మలైకా వయసు 52 ఏళ్లు అయితే.. సోరబ్ వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ పార్టీలో హగ్ చేసుకొని సెల్ఫీ దిగడంతో డేటింగ్ రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్ని సోరబ్ కొట్టి పడేశాడు. మలైకా, తాము మంచి స్నేహితులం మాత్రమే అని..అంతకు మించి తమ మధ్య ఏమీ లేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మలైకాతో స్నేహం ఎలా ఏర్పడిందో వివరించాడు.అలా పరిచయం.. డెల్నాజ్ దారువాలా, వాహ్బిజ్ మెహతా అనే ఇద్దరు వ్యక్తులు నా మోడలింగ్ రోజుల్లో ర్యాంప్పై నడిచే అవకాశం ఇచ్చారు. నేను వారితో స్నేహం చేశాను. వారితో కలిసి పార్టీలకు వెళ్లడం ప్రారంభించాను. ఒక పార్టీలో, నేను నా గురువుల ద్వారా మలైకాను కలిశాను. ఆమె డెల్నాజ్, వాహ్బిజ్లకు కూడా సన్నిహితురాలు. అందువల్ల, మలైకా, నేను స్నేహితులమయ్యాం. అంతకు మించి మా మధ్య ఏమి లేదు’ అని సోరబ్ చెప్పుకొచ్చాడు.మలైకాతో పార్టీ.. తొలిసారి కాదుఒక అమ్మాయి గురించి మాట్లాడే ముందు వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇలాంటి రూమర్స్ వల్ల వాళ్లు మానసికంగా ఇబ్బంది పడతారు. ట్రోల్ చేసే ప్రతిఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి. అయినా మలైకాతో పార్టీ చేసుకోవడం నాకు ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇద్దరం కలిసి పార్టీలకు వెళ్తున్నాం. ఇంతకు ముందు కూడా మలైకాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అప్పుడు నేను ఫేమస్ కాదు. ఎవరికీ తెలియకపోవడంతో అవి వైరల్ కాలేదు. ఇప్పుడు నేను కూడా తెలిసిన ముఖం కావడంతో డేటింగ్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం కూడా ఉండొచ్చు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. కానీ కొంతమంది దాన్ని భిన్నంగా చూస్తున్నారు’ అని సోరబ్ మండిపడ్డారు.మలైకా..స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్90వ దశకంలో బాలీవుడ్లో మలైకా తన హవాను కొనసాగించింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్కి స్పెషలిస్ట్గా పేరు సంపాదించుకుంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది.. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథిలో ప్రత్యేక గీతంతో తెలుగువారిని పలకరించింది. అలాగే గబ్బర్ సింగ్లో కెవ్వు కేక పాటకు స్టెప్పులేని కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా రాణిస్తోంది. -
డబ్బులిచ్చి మరీ నాపై ట్రోలింగ్.. స్టార్ హీరోయిన్ ఆవేదన
దక్షిణాది చిత్ర పరిశ్రమలో వేగంగా ఎదిగిన కథానాయకి ప్రియాంక మోహన్. ఈ కన్నడ భామ డాక్టర్ చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత సూర్య, ధనుష్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ప్రత్యక పాటలో మెరిసి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఆమెకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.కాగా ఈమె తాజాగా నటించిన మేడిన్ కొరియా చిత్రం శుక్రవారం నుంచి నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను చాలా విషయాలను ఎదుర్కొంటున్నానని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మోహన్ పేర్కొన్నారు. విమర్శలతో పాటూ చాలా ట్రోలింగ్లు చేయడానికే ఓ టీమ్ పని చేస్తోందని ఆవేదనను వ్యక్తం చేశారు. తనపైనే కాకుండా పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు గురించి ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. డబ్బులిచ్చి మరీ ఇలా ట్రోలింగ్ ఎందుకు చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.తాను జీవితంలో చాలా విషయాలు జరిగాయని, వాటి గురించి ఇప్పుడు పూర్తిగా వివరించడం ఇష్టం లేదన్నారు. అయితే అలాంటి విషయాలతో చాలా నేర్చుకుంటూ, తనను తాను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. తనవరకు అయితే సినిమా ఇండస్ట్రీ అనేది స్థిరత్వం లేని పరిశ్రమ అన్నారు. ఇక్కడ ఏదైనా, ఎవరికై నా జరుగుతుందన్నారు. ఇక్కడ అణగదొక్కడానికి కొందరు ఉంటారని, అయితే జీవితంలో కిందపడితే అది ఒక మెట్టు పైకి ఎక్కడానికే అని తాను భావిస్తానని అన్నారు. ఇలా చాలా విషయాలను నేర్చుకుంటూ దాన్ని తన పనిలోనూ, జీవితంలోనూ ఉపయోగించుకుంటున్నానని ప్రియాంక మోహన్ పేర్కొన్నారు. -
‘ఆయా షేర్...’కి వారం పట్టింది.. ‘జడల్’ లో ఎమోషన్ ఉంది: కాసర్ల శ్యామ్
‘‘ది ప్యారడైజ్’ సినిమాలోని ‘ఆయా షేర్...’ పాట ప్రోమో మంచి బజ్ క్రియేట్ చేసింది. పాట రిలీజ్ తర్వాత అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతోంది. నా సాహిత్యానికి అనిరుధ్గారు జనాలకి రీచ్ అయ్యే విధంగా ట్యూన్ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు. నా కెరీర్లో ఈ పాట ఇచ్చినంత కిక్కు ఏ పాటా ఇవ్వలేదు’’ అని పాటల రచయిత కాసర్ల శ్యామ్ చెప్పారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి విడుదల చేసిన తొలి పాట ‘ఆయా షేర్...’కి మంచి స్పందన వస్తోందని యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా ఈ పాట రచయిత కాసర్ల శ్యామ్ విలేకరలతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నానీగారి చేస్తున్న జడల్ క్యారెక్టర్లో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ జడల వెనుక మంచి కథ ఉంది. ఇప్పుడు అందరూ జడలు వేసుకుని రీల్స్ చేస్తున్నారు. ఆ సంస్కృతిని గుర్తు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘ఆయా షేర్...’ జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తినిచ్చే క్రమంలో వచ్చే పాట. ఈ పాట రాయడానికి వారం పట్టింది. ఈ చిత్ర కథ 80 దశకాల్లో జరిగే నేపథ్యం కాబట్టి అప్పుడు ఉర్దూ ప్రభావం ఉంటుంది. అందుకే ఇందులో చాలావరకు ఉర్దూ పదాలు ఉపయోగించాను. నేను ఉపయోగించిన భాష, యాసకి సోషల్ మీడియాలో అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో సర్వస్వం కోల్పోయానని బాధపడిన ఓ వ్యక్తి.. నా పాటతో కొత్త స్ఫూర్తి పొందానని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. ఇక ఈ మధ్య ‘లెనిన్, మా ఇంటి బంగారం, ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాల్లో పాటలు రాశాను’’ అని చెప్పారు. -
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లోని ఒక ప్రత్యేక స్క్రీన్లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. -
పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా.. వరుడు ఎవరంటే?
కుంభమేళా సమయంలో పూసలమ్ముకుంటూ ఫేమస్ అయిన యువతి మోనాలిసా భోస్లే ప్రేమ వివాహం చేసుకుంది. కేరళలోని పూవార్ అరుమనూర్లో ఉన్న నైనార్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. కేరళ మంత్రి వి. శివన్కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ ఈ వేడుకకు హాజరైనట్లు కేరళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఫేస్బుక్ ద్వారా ప్రేమలో.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. మతాలు వేరు కావడంతో మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా షూటింగ్ కోసం మోనాలిసా కేరళకు రాగా, తండ్రి కూడా అక్కడకు వెళ్లి ఆమెతో గొడవకు దిగారు. దీంతో ప్రాణహాని ఉందని భయపడిన ఈ జంట, తమ ప్రేమను కాపాడుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే తను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మోనాలిసా ఫిర్యాదులొ పేర్కొంది. పోలీసుల సమక్షంలో పెళ్లి..తాను మేజర్ని అని..ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మోసాలిసా చెప్పడంతో భద్రత కలిపించామని పోలీసులు చెప్పారు. శారీరకంగా ఆమెకు ఎలాంటి వేధింపులు జరగలేదని కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదన వల్లే పోలీసులు జోక్యం కోరుకుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మోనాలిసా పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. Viral #KumbhMela fame #Monalisa Bhosle has reportedly married her boyfriend Farman Khan at a temple in Thiruvananthapuram. The couple has sought protection from #Kerala Police amid family opposition to their relationship.Monalisa from Indore, Madhya Pradesh, shot to fame after a… pic.twitter.com/P41vBSCLZs— Ashish (@KP_Aashish) March 11, 2026മോനാലിസക്ക് കേരളത്തിൽ കല്യാണം ❤️ #Monalisa pic.twitter.com/TIe52jPOAq— Unni Rajendran (@unnirajendran_) March 11, 2026 -
Ek Din: సాయి పల్లవి తొలి హిందీ మూవీ ట్రైలర్ వచ్చేసింది
సాయి పల్లవి నటించిన తొలి హిందీ సినిమా ‘ఏక్ దిన్’. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీట్రైలర్ని బుధవారం (మార్చి 11) విడుదల చేశారు. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రోహన్ పాత్రలోజునైద్ ఖాన్, మీరా పాత్రలో సాయిపల్లవి నటించారు. మీరాను ఇష్టపడే రోహన్ తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతూ ఉంటాడు. అయితే కనీసం ఒక రోజు అయినా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని అతడు కలలు కంటాడు. ఆ కల నిజమైందా? అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా కథ ముందుకు సాగుతుంది. సరదాగా మొదలైన ట్రైలర్ తర్వాత ఎమోషనల్గా సాగింది. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
ఎవరు అడ్డుపడినా చంపేస్తా.. ఆసక్తికరంగా ‘వదలా’ గ్లింప్స్!
జగపతి బాబు, లయ, హృతిక ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘వదలా’. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ను విడుదల చేశారు. ‘నీ ఫ్యామిలీ నుంచి నేను ఒకరిని తీసేసుకుంటా.. ఎవరు అడ్డుపడినా చంపేస్తా’ అంటూ ఓ లేడీ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా గ్లింప్స్లో చూపించారు. మరి ఆ లేడి ఎవరు? ఎవరిని, ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుంది అనేది తెలియాలంటే సినిమా చూల్సిందే. మొత్తంగా ఒక వ్యక్తి చుట్టూ తిరిగే కథగా ఇది రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. -
మూడు వారాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నా.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
పాత్రకు తగ్గట్లుగా తన శరీరాన్ని మార్చుకొనే అతి కొద్దిమంది నటుల్లో మంచు మనోజ్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటాడు. బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉన్నా సరే.. ఆయన నటనకు మాత్రం ఎప్పుడూ నెగెటివ్ కామెంట్స్ రాలేదు. గతకొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమైన మనోజ్.. మిరాయ్ సినిమాతో గట్టి కమ్బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన శక్తివంతమైన విలన్ పాత్ర అయిన మహాబీర్ లామా..‘బ్లాక్ స్వోర్డ్’గా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా మనోజ్ చేసిన పవర్ఫుల్ పెర్ఫామెన్స్కు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి.ఇప్పుడు మంచు మనోజ్ మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అదే డేవిడ్ రెడ్డి. తన కెరీర్లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ఇది రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం మనోజ్ తన లుక్ని మార్చేస్తున్నాడు. యోధుడిలా కనిపించేందుకు మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానంటూ వర్కౌట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.ఆ పోస్ట్లో మనోజ్ తన తీసుకున్న నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకులు వెతకకుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. “మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవలం కష్టం మాత్రమే,” అని ఆయన రాశారు. ఇదే క్రమంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ నటించలేరు. ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు,” అని ఆయన అన్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) ఇకపై కేవలం లుక్ కోసం కాకాకుండా..శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం “ ధృడమైన వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్డేట్ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియజేశారు.డేవిడ్ రెడ్డి విషయానికొస్తే.. 1897 - 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది. -
ఆ రోజే థియేటర్స్లో ఆల్ఫా
ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆల్ఫా’. అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రైవల్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో ఆలియా, శార్వరీ స్పై రోల్స్లో నటించారు. ‘ఆల్ఫా’ చిత్రాన్ని తొలుత గత ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్కు ప్లాన్ చేశారు. కానీ ఈ చిత్రం రిలీజ్ను మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమాను ఈ ఏడాది జూలై 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. ‘యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థలో ఆలియా చేసిన తొలి సినిమా ఇది. పూర్తి స్థాయి ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ సినిమా. ఆలియా, శార్వరీల యాక్షన్ సీక్వెన్స్లు ఆడియన్స్ను అలరిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
డ్రాగన్... మళ్లీ యాక్షన్!
మళ్లీ యాక్షన్ మోడ్లోకి వెళ్లి పోయాడు డ్రాగన్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ జోర్డాన్లో ముగిసింది. ఎన్టీఆర్, టోవినో థామస్ పాల్గొనగా కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది.కొత్త షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా కోసం మూడు పెద్ద సెట్స్ను క్రియేట్ చేశారని, ఇందులో విలన్ ఇంటి సెట్ కూడా ఉందని, ఈ సెట్స్లోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుందని తెలిసింది. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులకు పైనే ఉంటుందని సమాచారం. ఇక్కడ షూట్ పూర్తి చేసిన తర్వాత ‘డ్రాగన్’ టీమ్ శ్రీలంక వెళ్లనుందనే టాక్ వినిపిస్తోంది. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్. -
ఇరుముడి సినిమాలో..?
‘ఇరుముడి’ సినిమాలో తమన్నా భాగమయ్యారనే టాక్ వినిపిస్తోంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, ఆమె కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు.కాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ తమన్నాను సంప్రదించారని, కథ, పాత్ర నచ్చడంతో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్నగర్ సమాచారం. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా 2015లో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో తమన్నా ఓ హీరోయిన్గా నటించారు.మళ్లీ పదేళ్ల తర్వాత రవితేజతో తమన్నా స్క్రీన్ షేర్ చేసుకుంటారా? మరి... ‘ఇరుముడి’ చిత్రంలో తమన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
ఊహించని ఓ మలుపు
పూర్ణ, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) విధార్థ్, సుభాశ్రీ రాయగురు ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా ‘డార్క్ నైట్’. జీఆర్ ఆదిత్య ఈ సినిమాకు కథ రాసి, దర్శకత్వం వహించారు. పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పీ19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.ఈ సందర్భంగా సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ– ‘‘నాలుగు ప్రధాన పాత్రలు, వారి జీవితాల చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. వారి పాత్రల మధ్య ఉన్న సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి. అతీంద్రియ అంశాలతో కూడిన ఊహించని ఓ ట్విస్ట్ ఈ కథను కొత్త మలుపు తిప్పి, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మిస్కిన్, సహ–నిర్మాతలు: శ్రీనివాస్ మేదరమెట్ల, జె. కొండలరావు. -
Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ
హైదరాబాద్లోని కోకాపేట్లో మార్చి 12న కొత్తగా ప్రారంభం కానున్న అల్లు సినిమాస్ ఇప్పుడు సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్ ఒక సినిమా హాల్ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ సినిమా ఎక్స్పీరియన్స్ మరో లెవెల్లో ఉండనుంది.ఈ మల్టీప్లెక్స్లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకమైన డాల్బీ విజన్ స్క్రీన్. ఇది 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతానికి ఇండియాలో కేవలం మూడు డాల్బీ విజన్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి పూణేలో 55 అడుగుల స్క్రీన్, రెండవది బెంగళూరులో 65 అడుగుల స్క్రీన్, ఇప్పుడు హైదరాబాద్లో 75 అడుగుల స్క్రీన్ రూపంలో అల్లు సినిమాస్. ఈ ప్రత్యేకత వల్ల అల్లు సినిమాస్ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయన్నది సినీప్రియులలో పెద్ద చర్చగా మారింది. పూణేలోని డాల్బీ స్క్రీన్లో టికెట్ రేట్లు సాధారణ రోజుల్లో రూ.500 లోపు, పెద్ద సినిమాల వీకెండ్స్లో రూ. 900 వరకు ఉంటాయి. ఇక బెంగళూరులోని డాల్బీ స్క్రీన్లో టికెట్ రేట్లు క్యాపింగ్ సిస్టమ్కు ముందు గరిష్టంగా రూ.1000 వరకు ఉంటాయి. దాంతో హైదరాబాద్లోని అల్లు సినిమాస్ టికెట్ రేట్లు కూడా సాధారణ రోజుల్లో రూ.500, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సీటింగ్ బట్టి రూ.1000 వరకు ఉండే అవకాశం. తెలంగాణలో ప్రత్యేక టెక్నాలజీ, పరిమిత సీటింగ్ సామర్థ్యం ఉన్న స్క్రీన్లకు అధిక ధరలు వసూలు చేయడానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. అల్లు సినిమాస్ అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్ సెగ్మెంట్లోకి వస్తుంది. దాంతోడాల్బీ విజన్ స్క్రీన్కు భారీగా టికెట్ రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్లోని అల్లు సినిమాస్ ప్రీమియం మల్టీప్లెక్స్లకు కొత్త బెంచ్మార్క్గా నిలవబోతున్నాయి. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలు ప్రదర్శించబడుతాయి. -
లేటు వయసులో తండ్రైన హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్
బాలీవుడ్ హీరో రణ్దీప్ హుడా 50 ఏళ్ల వయసులో తండ్రయ్యారు. ఆయన భార్య లిన్ లైస్రామ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు, అభిమానులు అభినందలు చెబుతున్నారు. హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లోనూ మెప్పించిన రణ్దీప్ గతేడాది వీర్ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్గా అలరించాడు. ఈరోజు నేను తండ్రి అయినందుకు మా నాన్న పట్ల నా కృతజ్ఞత మరింత పెరిగిందని రణ్దీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ముఖ్యంగా నన్ను తండ్రిని చేసినందుకు.. మన చిన్న అమ్మాయిని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చినందుకు నా భార్య లిన్కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఈ జంటకు మొదటి బిడ్డగా పాప పుట్టడంతో ఆనందం మరింత రెట్టింపైంది.కాగా.. 2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్సూన్ వెడ్డింగ్'తో నటుడిగా పరిచయమైన రణ్దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్స్టర్, జన్నత్ 2, రిస్క్, కర్మ ఔర్ హోలీ, కాక్టైల్, జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. కాగా.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్ని మణిపురి సంప్రదాయంలో రణ్దీప్ పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
విజయ్-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
గతకొన్ని రోజులుగా నటుడు, టీవీకే అధినేత విజయ్ , నటి త్రిషకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లడంతో ఆ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ అంశంపై సీనియర్ నటి,రాజకీయ నాయకురాలు ఖుష్భూ సుందర్ స్పందించారు. అది వాళ్ల పర్సనల్ విషయం అని, అది ప్రజలను ప్రభావితం చేయనంతవరకు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా ఆమె ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ఈ అంశం(త్రిష-విజయ్ల రిలేషన్)తో ప్రజలకు ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. అది ప్రభావితం చేస్తే, మనం దాని గురించి మాట్లాడవచ్చు. వారి వ్యక్తిగత జీవితానికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారు? వారు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. దాని వల్ల ప్రజలు ఏ విధంగానూ ప్రభావితం కారు’ అని ఖుష్భూ అన్నారు.త్రిష అంశం విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావితం చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు బదులుగా.. ‘ప్రజలు తెలివైన వాళ్లు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. పర్సనల్ లైఫ్ దానిని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఆయన నాయకుడైనా కాకపోయినా.. మనలాగే ఒక మనిషి. ప్రజల వ్యక్తిగత జీవితంతో అతనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు’ అని ఖుష్భూ చెపుకోచ్చింది. -
ఓటీటీకి మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్కడ సూపర్ హిట్ అయినా సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన మూవీ పెన్నుమ్ పోరాట్టమ్.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 13 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.ఈ సినిమాకు రాజేశ్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజేశ్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ గ్రామంలోని రూల్స్ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్గా తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Watch Pennum Porattum on Netflix, out 13 March, in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada#PennumPorattumOnNetflix@dawn1720 @ArunCThampi22 @stkframes @binugeorgealex@akhilvishnu_vs— Netflix India South (@Netflix_INSouth) March 10, 2026 -
ప్రియదర్శి ‘సుయోధన’.. రిలీజ్ ఎప్పుడంటే..
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ మంచి కదా కదానాలతో అత్యత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ప్రియదర్శి సాయికుమార్ ద్రిషిక చందర్ , సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. జై క్రిష్ సంగీత దర్శకత్వం వహించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ను అందించారు . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 27 న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాము. త్వరలో ఈ సినిమా టీజర్ ట్రైలర్ మరియు పాటలను రిలీజ్ చేస్తాము అన్నారు. -
మహేశ్ బాబు మెచ్చిన సినిమా.. 8 నెలల తర్వాత ఓటీటీకి..!
గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయనని అమిర్ ఖాన్ అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్ డీల్ను అమిర్ ఖాన్ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేశారు.అయితే తాజాగా అమిర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.మహేశ్ బాబు ప్రశంసలు...ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్బాబు ప్రశంసలు కురిపించాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
పుష్ప డైలాగ్ నాదే.. అందుకే చాలా ఫీలయ్యా: మంచు లక్ష్మీ
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ నటించిన తాజా చిత్రం లేచింది మహిళా లోకం. ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన మంచు లక్ష్మీ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ సినిమా పుష్ప-2 రిలీజ్కు కంటే పూర్తి చేశామని మంచు లక్ష్మీ తెలిపింది. పుష్ప చిత్రంలో వాడినా ఫ్లవర్ కాదు.. ఫైర్ అనే డైలాగ్ తాను ఈ చిత్రంలో వాడానని వెల్లడించింది. అయితే నా డైలాగ్ బయటికి రాలేదని పేర్కొంది. కానీ సుకుమార్ గారు ఈ డైలాగ్ను పుష్పలో వాడేశారని తెలిపింది. పుష్ప చూసినప్పుడు ఈ డైలాగ్ చూసి చాలా ఫీలయ్యానని మంచు లక్ష్మీ అన్నారు. ఆ డైలాగ్ ముందే వచ్చిందన్న విషయం అందరికీ తెలియజేస్తున్నానని మాట్లాడింది. కాగా.. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్, హరితేజ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 26నే థియేటర్లలో సందడి చేయనుంది. #Pushpa2 release avvak mundhe ee cinema shooting complete ayipoyindi. Sukumar garu “Fire… Wild Fire” dialogue nenu first ee cinemalo vadanu.:- Actor మంచు లక్ష్మీ #LakshmiManchu #Alluarjun pic.twitter.com/ws6A0BODDb— Milagro Movies (@MilagroMovies) March 9, 2026 -
మరోసారి నోరుజారిన రాజేంద్ర ప్రసాద్.. తమిళ తంబీలు ఫైర్!
ఇటీవల పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్ మరోసారి నోరు జారారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా.. రాజేంద్రప్రసాద్పై తమిళ సినీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ఇటీవల రాజేంద్రప్రసాద్కు కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డును ప్రకటించారు. సోమవారం ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ తన జర్నీతో పాటు కాంతారావు గొప్పదనాన్ని తెలియజేస్తూ ప్రసంగించారు. అయితే కాంతారావు నటనను పొగిడే క్రమంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎంజీఆర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కాంతరావు పేరు చెబితేనే భయపడిపోయేవాడుజానపద చిత్రాలతో దూసుకెళ్తున్న కాంతారావుని చూసి ఎంజీఆర్ భయపడిపోయాడు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ‘తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్ కూడా కాంతారావుని చూసి ఉ** పోసుకున్నాడు. కాంతరావు పేరు చెబితేనే ‘అమ్మ బాబోయ్..’ అనేవాడు. కారణం జానపదాలు. కాంతరావుగారి జానపదాలు చూసి.. ‘వాడెవడురా బాబోయ్..ఇండియన్ సినిమాలను లేపుకెళ్లిపోతున్నాడు’ అని ఉ** పోసుకునేవాడు’ అని పదే పదే ఎంజీఆర్పై రాయడానికి వీల్లేని పదాన్ని వాడడంతో రాజేంద్రప్రసాద్పై తమిళులు ఫైర్ అవుతున్నాడు. తాము దేవుడిగా కొలిచే గొప్ప నటుడిని పబ్లిక్ ప్లేస్లో ఇలా అవమానించేలా మాట్లాడడం సరికాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ గొప్ప నటుడిని ప్రశంసించడానికి ఓ రాష్ట్రం అంతా దైవం కన్నా మిన్నగా ఆరాధించే ఎమ్జీఆర్ను ఇలా చులకనగా చేసి మాట్లాడడం సబబు కాదంటూ సీరియస్ అవుతున్నారు. తమిళుల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎంజీఆర్ గారిని దారుణంగా అవమానించిన టీడీపీ మద్దతుదారుడు నటుడు రాజేంద్ర ప్రసాద్ వీరికి పద్మశ్రీ ఇచ్చిన ప్రభుత్వానికి 🙏🏻#TDP supporter #RajendraPrasad insults Greatest of all times #MGR. சின்னத்திரை எம்ஜிஆரை அவமதித்த தெலுங்கு தேசம் கட்சி… pic.twitter.com/Nr1s54pFlU— UttarandhraNow (@UttarandhraNow) March 10, 2026 -
నాన్న నాకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అదే: సుస్మిత కొణిదెల
మెగా డాటర్ సుస్మిక కొణిదెల నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్గారు మూవీతో బ్లాక్బస్టర్ను సొంతం చేసుకుంది. ఈ మూవీతో నాన్నకు సూపర్ హిట్ అందించిన కూతురిగా ఘనత సాధించింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్లో పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇవాళ సుస్మిత బర్త్ డే కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ ఆదివారం మహిళ దినోత్సవం సందర్భంగా ఈ ఇంటర్వ్యూకు హాజరైన సుస్మిత పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. మా ఇంట్లో మహిళలకు ప్రత్యేకమైన రోజు అవసరం లేదని.. ఎప్పుడూ గౌరవం, ప్రోత్సాహం ఎల్లప్పుడు లభిస్తూనే ఉంటాయని తెలిపింది. ప్రతి బర్త్ డేకు నాన్న చిరంజీవి, రామ్ చరణ్ తనకు గిఫ్ట్స్ ఇస్తారని వెల్లడించింది. కానీ ఆ బహుమతుల కంటే తనపై వారు పెట్టుకున్న నమ్మకమే అతిపెద్ద గిఫ్ట్ అని పేర్కొంది. తాను ఏ పని అయినా చేయగలననే విశ్వాసం వారికి ఉందని సుస్మిత సంతోషం వ్యక్తం చేసింది. తనకు కుటుంబం మద్దతు కలిగి ఉండడం నా జీవితంలో గొప్ప బహుమతి అన్నారు. -
బిగ్బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం
టాప్-3 బిగ్బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట విషాదం నెలకొంది. ఈ విషయాన్ని పవన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీ నాన్న నీతో లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ధైర్యం చెప్పారు. బిగ్బాస్ షో సమయంలో కూడా తన తండ్రి ఆరోగ్యం బాగలేదని డీమాన్ పవన్ చెప్పారు. వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇంతలోనే ఆ కుటుంబంలో ఈ విషాదం నెలకొంది. అయితే పవన్ తండ్రి నోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.కాగా.. బిగ్బాస్ 9 నుంచి డీమాన్ పవన్ టాప్-3లో నిలిచాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన టాలెంట్తో అదరగొట్టేశాడు. రెండుసార్లు కెప్టెన్ కూడా అవ్వడమే కాకుండా తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్ను తొక్కేసిన బిగ్బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. -
పర్సనల్ లైఫ్ జడ్జ్ చేయడానికి మీరెవరు?.. విజయ్- త్రిష వివాదంపై స్టార్ డైరెక్టర్
కోలీవుడ్లో విజయ్- త్రిష పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా త్రిష పేరు తెరపైకొచ్చింది. ఇటీవల వీరిద్దరు జంటగా ఓ వివాహానికి కూడా హాజరు కావడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే త్రిషపై కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత దర్శకుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.తాజాగా విజయ్- త్రిష వివాదంపై ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ స్పందించారు. మనం కేవలం నటీనటుల సినిమాల గురించి మాత్రమే చర్చించాలని సూచించారు. వారి వ్యక్తిగత జీవితాలపై చర్చించే హక్కు.. వారిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వివాదం కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హాట్ టాపిక్గా మారింది..విక్రమ్ భట్ తన పోస్ట్లో రాస్తూ.. ' విజయ్- త్రిషల వ్యక్తిగత జీవితాలపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ నిజమో, కాదో నాకు తెలియదు. ఒకవేళ అవి నిజమైతే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వారిద్దరూ ఎంతో హుందాగా ఉన్నారు. ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదు. ఇప్పుడు వాళ్లను ఎంతోమంది జడ్జ్ చేస్తున్నారు. ఆ ఇద్దరి గురించి మాట్లాడేవారంతా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నటీనటుల సినిమాలు మాత్రమే మనం చూడాలి. వారి పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు' అని రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల రూ.30కోట్ల చీటింగ్ కేసు విషయంలో విక్రమ్ భట్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విక్రమ్, అతడి భార్య శ్వేతాంబరి భట్లకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ దంపతులు దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
'ఈ రోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది' మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి తన కూతురికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల బర్త్ డే సందర్భంగా చిరు విష్ చేశారు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి.. నేడు ఒక బలమైన, బాధ్యయుతమైన మహిళగా ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. నా సినిమాలు చూడటం.. ఇప్పుడు సినిమా నిర్మించడం.. నాకు చిరస్మరణీయమైన బ్లాక్బస్టర్ను అందించడం అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఒకటని ఆనందం వ్యక్తం చేశారు. తండ్రిగా నన్ను గర్వపడేలా చేశావని సుస్మితను కొనియాడారు.మెగాస్టార్ తన ట్వీట్ రాస్తూ..' నా ప్రియమైన సుస్మితకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి నుంచి.. నేడు మీరు బలమైన, అందమైన బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగావ్. ఒక తండ్రిగా నాకు అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఇది ఒకటి. మీరు నా సినిమాలు చూడటం.. ఇప్పుడు ఏకంగా సినిమా నిర్మించడం, నాకు చిరస్మరణీయమైన బ్లాక్బస్టర్ను అందించడం.. నిజంగా నన్ను గర్వపడేలా చేసింది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, అంతులేని విజయం కలగాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ ఇలా ప్రకాశిస్తూ ఉండు నా ప్రియమైన హనీ పాపా. నీకు ఎల్లప్పుడూ నా ప్రేమ, ఆశీస్సులు ఉంటాయి' అని పోస్ట్ చేశారు. కాగా..ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మనశంకర వరప్రసాద్గారు చిత్రానికి సుస్మిత నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 'Happy Birthday my precious @sushkonidela ❤️From the little girl who once held my finger and walked beside me, to the strong, graceful and responsible woman you are today.One of the most special moments for me as a father was seeing you watching my films, now producing a film,… pic.twitter.com/Z8FwhsXUrQ— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2026 -
సినిమా టైటిల్.. ‘ఇంకా ఏం అనుకోలేదు’
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు నిర్మాత వంశీ నందిపాటి. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘హే బల్వంత్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన..తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించారు. ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి ‘ఇంకా ఎం అనుకోలేదు’ అనే టైటిల్ని ఖరారు చేశారు. సంగీతాన్ని సింజిత్ ఎర్రమిల్లి అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రేహాన్ షేక్ నిర్వహిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ అనౌన్స్మెంట్ వీడియోపై, టైటిల్పైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణ ప్రమోషన్ విధానాన్ని కాకుండా, వినూత్నంగా మీమ్స్తో నిండిన సరదా వీడియో ద్వారా టైటిల్ను ప్రకటించారు. ఇందులో వ్యంగ్యంతో పాటు పాత ఈటీవీ థీమ్ను గుర్తుచేసే అంశాలు, హాస్యభరితమైన శైలి కనిపించాయి.వీడియోలో వివిధ మీమ్ రిఫరెన్స్లు, చమత్కారమైన పంచ్లు వినోదాన్ని పెంచాయి. ఇంటర్నెట్ స్టైల్ కామెడీతో రూపొందిన ఈ క్లిప్ ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే ఈ ప్రకటనలో నటీనటుల వివరాలను మేకర్స్ వెల్లడించకుండా ఉంచడం ఆసక్తిని మరింత పెంచింది. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ బ్రోమాంటిక్ కామెడీ చిత్రానికి రమణా రెడ్డి, సమీర్ కన్ను సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. -
'జైలర్-2'లో పోలీస్ ఆఫీసర్గా బాలీవుడ్ కింగ్
జైలర్-2 సినిమాలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ముత్తువేల్ పాండియన్గా మరోసారి రజనీకాంత్ సందడి చేయనున్నారు. 2023లో విడుదలైన జైలర్ సినిమాకు సీక్వెల్గా పార్ట్-2ను దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇదే ఏడాదిలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే, ఇప్పుడీ సీక్వెల్కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.జైలర్-2లో ప్రత్యేక పాత్రలో షారుఖ్ ఖాన్ నటిస్తున్నట్లు బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించేందుకు ఆయన ఓకే అన్నట్లు సమాచారం. ఏడు నుండి ఎనిమిది రోజుల పాటు చిత్రీకరించబడే అతని సన్నివేశాలతో సినిమా ముగుస్తుందని భావిస్తున్నారు. మార్చి చివరి వారంలో జైలర్-2 సెట్స్లోకి షారుఖ్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.‘జైలర్’లో శివరాజ్కుమార్, మోహన్లాల్ వంటి స్టార్ నటులు సినిమాను మలుపుతిప్పే అతిథి పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా అలాంటి పాత్రలోనే కనిపిస్తారని సమాచారం. ఇందులో ఎస్.జె. సూర్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ కోడలు శ్వేతా పాండియన్ పాత్ర పోషించిన నటి మిర్నా కూడా ఈ సీక్వెల్లో కీలక పాత్ర పోషించనుందని వర్గాలు చెబుతున్నాయి. -
48 గంటల్లో 312 మిలియన్స్ వ్యూస్.. ‘ధురంధర్ 2’ రికార్డు
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్ 2’. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అంతేకాదు రిలీజ్కి ముందే ఈ సినిమా రికార్టులను కొల్లగొడుతోంది. యూట్యూబ్లో ఈ మూవీ ట్రైలర్కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం 48 గంటల్లో అంటే రెండో రోజుల్లేనే 312 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ మధ్యకాలంలో ఒక మూవీ ట్రైలర్కు ఈ స్థాయి వ్యూస్ వచ్చిన దాఖలాలు లేవు.ట్రైలర్లో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతూ, అనేక రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్కు ప్రేరణగా మారింది. ఇదే సమయంలో గూగుల్ ట్రెండ్స్లో కూడా ఈ సినిమా, నటీనటులపై సెర్చ్లు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. తండ్రిని కోల్పోయిన యువతికి సాయం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిన కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి సాయం అందించారు. కడింపల్లి దుర్గ పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేశారు.ఈ అగ్ని ప్రమాదంలో ఆమె తండ్రి కడింపల్లి ధనరాజు మరణించగా.. ఆమె తల్లి చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు. అయితే, ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులను వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ తెలిపారు. Hero #AlluArjun once again showed his big heart ❤️After learning about the tragic fire accident at a fireworks factory in Kakinada district that claimed her father’s life, he extended support to mentally challenged girl Kadimpalli Durga.He announced that ₹7,500 will be… pic.twitter.com/34q252I8FN— Milagro Movies (@MilagroMovies) March 10, 2026 -
గిరిజన యువతిగా క్రేజీ హీరోయిన్.. ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్ నటి రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించింది. హీరో గోపీచంద్ ప్రతిష్టాత్మక చిత్రంలో ఆమె అలరించేందుకు సిద్ధమయింది. ప్రస్తుతానికి టైటిల్ ఖరారు కాని ఈ మూవీని దర్శకుడు సంకల్ప్రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఘాజీ, ఐ.బి 71, అంతరిక్షం చిత్రాలతో భిన్నమైన చిత్రాలతో మెప్పించిన సంకల్ప్ రెడ్డి... ఈసారి భారతదేశ చరిత్రలో మరిచిపోయిన ఓ కీలకఘట్టాన్ని వెండతెరపై చూపించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా రీతూ వర్మ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. (Gopichand 33) పేరుతో ప్రారంభమైనే ఈ ప్రాజెక్ట్లో సత్యవతి అనే గిరిజన యువతిగా రీతూ వర్మ పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో ఆమె అత్యంత కీలకమైన పాత్రలోనే నటిస్తున్నట్లు పోస్టర్ సూచిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ దీనిని సమర్పిస్తున్నారు. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నారు.భారతదేశ చరిత్రలో అందరూ మరిచిపోయిన ఓ కీలకఘట్టాన్ని ఈ చిత్రంతో తెరపై చూపించనున్నారు. ఇప్పటివరకూ ఎక్కడా కూడా చర్చల్లోలేని ఈ కథను చెప్పబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మణికందన్ ఎస్ (హిట్ 1, హిట్ 2, గీత గోవిందం, సైంధవ్), ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా, యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ మాస్టర్ ఉన్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. View this post on Instagram A post shared by Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl) -
విశాఖపట్నంపై మహేష్ బాబు గురి
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూనే మల్టీఫ్లెక్స్ థియేటర్ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్లో ఏషియన్ సినిమాస్తో సంయుక్తంగా ఏఎంబీ సినిమాస్ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ను విస్తరింపచేయాలని ఆయన ఉన్నారు. హైదరాబాద్లో మొదలైన ఏఎంబీ సినిమాస్ రీసెంట్గా బెంగళూరులో తొమ్మిది స్క్రీన్లతో అత్యాధునిక సదుపాయాలతో మల్టీఫ్లెక్స్ ప్రారంభించారు. అయితే, ఇప్పుడు విశాఖలో కూడా తన వ్యాపారాన్ని విస్తరింపచేయాలని మహేష్ చూస్తున్నట్లు సమాచారం.బెంగుళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మాణానికి మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గోవా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఏఎంబీ మల్టీఫ్లెక్స్ను ప్రారంభించాలని మహేష్ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో కూడా ఒక భారీ మల్టీప్లెక్స్ను నిర్మించాలని ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విశాఖలో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అతిపెద్ద షాపింగ్మాల్తో పాటు మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. -
వేధిస్తున్నారు.. ఫిర్యాదు చేసిన మెగా కోడలు లావణ్య
సినీ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల సైబర్క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్మీడియా ద్వారా తమ పరువుకు భంగం కలిగించేలా కొందరు వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్లో ఫిర్యాదు చేశారు. సోషల్మీడియా వేదికగా అదేపనిగా తనతో పాటుగా తన కుటుంబ సభ్యులపై అసభ్యంగా పోస్టులు చేయడం ఆపై తప్పుడు కామెంట్లతో దూషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.కొంతకాలంగా తమపై ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని లావణ్య వాపోయారు. తన వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నారని తెలిపారు. కామెంట్ల రూపంలో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని చెప్పారు. ‘పర్పుల్ క్రెయాన్00’ ఇన్స్టాఖాతాకు సంబంధించిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో పోలీసులు సెక్షన్ 67తో పాటుగా భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్)78, 79 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని పట్టుకుంటామని తెలుపుతున్నారు. -
హిట్ సినిమాకు సీక్వెల్.. విడుదలపై ప్రకటన
ప్రేమిస్తే మూవీతో పాపులర్ అయిన నటుడు భరత్ హీరోగా నటించిన కాళిదాస్ చిత్రం 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో దానికి సీక్వెల్గా ఇప్పుడు కాళిదాస్–2 చిత్రం రూపొందింది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన శ్రీసెంథిల్నే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భరత్ కథానాయకుడిగా నటించిన ఇందులో మరో కీలక పాత్రను అజయ్కార్తీ పోషించారు.పూవే ఉనక్కాగ(poove unakkaga) చిత్రం ఫేమ్ సంగీత చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. ఆమెతో పాటు భవానిశ్రీ, అపర్ణ నటించారు. తొలి భాగం తరహాలోనే కుటుంబ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.ఈ చిత్రాన్ని స్కై పిక్చర్స్ అధినేత ఫైవ్స్టార్ కె.సెంథిల్, డా. యోగేశ్వరన్ కలసి నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి స్పందన వస్తోందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం అన్నివర్గాలను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, సురేశ్బాలా చాయాగ్రహణం అందించారు. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కావచ్చని సమాచారం. -
'ఆర్ఆర్ఆర్'కి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్!
ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు-నాటు' పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఈ పాట. అది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైంది. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి మరోసారి అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో ఓ ప్రత్యేకమైన డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ పాటను లాటిన్ స్టయిల్లో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారని సీనియర్ కొరియోగ్రాఫర్ శంకర్ వెల్లడించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటపై తెరకెక్కనున్న ఈ పాట కోసం వందలమంది లాటిన్ డాన్సర్లను తీసుకురావాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.నాటు-నాటు తరహాలోనే, వారణాసిలో లాటిన్ స్టయిల్లో సాగే ఈ పాట కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలతో అంచనాలు మరింత పెరిగాయి. జార్జియాలోని షెడ్యూల్ను పూర్తి చేసుకొని మహేష్ బాబు హైదరాబాద్కి తిరిగొచ్చాడు. ఎయిర్పోర్టులో ఆయన కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. వారణాసి అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందనుంది. -
జన నాయగన్కు మరో షాక్.. స్క్రీనింగ్ వాయిదా..!
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వస్తోన్న మూవీ జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ బోర్డ్ వివాదంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో జన నాయగన్ రిలీజ్ మరింత ఆలస్యమవుతోంది. అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ ఈ మూవీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా జన నాయగన్ రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ వాయిదా పడింది. కమిటీలోని ఓ సభ్యుడు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ప్రదర్శన రద్దు చేశారు. దీని వల్ల సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న జన నాయగన్ మేకర్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దీనిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే స్క్రీనింగ్ కోసం మరో తేదీని కేటాయిస్తారో? లేదో తెలియాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో మమిత బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, పూజా హెగ్డే, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సిన ఉన్నా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే గతేడాది రివ్యూ చేసిన సెన్సార్ బోర్డ్ కొన్ని సవరణలు సూచించింది. అయినప్పటికీ కొన్ని మతపరమైన అంశాలు, సాయుధ దళాల లోగోలను ఉపయోగించడంపై సెన్సార్ కమిటీ సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూవీని మరోసారి సెన్సార్ చేయాలని రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్కు పంపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. -
డేంజర్ లో కియారా అద్వానీ కెరీర్..
-
రణ్వీర్ సింగ్ దురంధర్-2.. ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం హిందీలోనే రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ ఖరారైంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రైలర్లోనే వెల్లడించారు. థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. కాగా.. ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.పోటీ నుంచి తప్పుకున్న టాక్సిక్..ఈ మూవీతో మార్చి 19న యశ్ హీరోగా వస్తోన్న టాక్సిస్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ పోటీ నుంచి యశ్ తప్పుకున్నారు. గీతు మోహన్దాస్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్టర్ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
లైంగిక వేధింపుల కేసు.. మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్కు ఊరట
మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరానికి ఊరట లభించింది. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఆయన బెయిల్ లభించింది. కొన్ని కఠినమైన షరతులతో ఎర్నాకుళం జిల్లా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2022లో దర్శకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్పై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో కొచ్చిలోని ఒక అపార్ట్మెంట్లో చిత్రనిర్మాత తనతో అనుచితంగా ప్రవర్తించాడని మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది అయితే చిదంబరం మంజుమ్మెల్ బాయ్స్ తెరకెక్కించే సమయంలో ఆమెను కలిశానని.. కేవలం ఆమెను ఒక పాత్ర కోసం మాత్రమే పరిగణించారని చెప్పారు. ఆమె ప్రవర్తన తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో చిదంబరం తరఫున వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
ఇంతలా భావోద్వేగానికి ఎప్పుడు గురికాలేదు: రష్మిక
ఇటీవలే విజయ్ దేవరకొండను పెళ్లాడిన హీరోయిన్ రష్మిక తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్కు స్పందించింది. విజయ్- రష్మిక ప్రేమ, పెళ్లి, వాళ్లద్దరి ప్రయాణం గురించి ఓ కథనం రాసుకొచ్చారు. ఇది చూసిన రష్మిక ఆ ఆర్టికల్కు రిప్లై ఇచ్చారు. చాలా రోజులుగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంతగా భావోద్వేగానికి గురి కాలేదని తెలిపింది.రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' చాలా కాలంగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంత భావోద్వేగానికి గురి కాలేదు. నేను చెప్పాలనుకున్నది చాలా ఉంది.. కానీ మాటలు రావడం లేదు. ఇప్పుడు నేను ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఆనందంగా ఉన్నా. నా ప్రయాణం గుర్తించినందుకు ధన్యవాదాలు. ప్రేమ గురించి నేను చెప్పగలిగేది ఒక్కటే. మిమ్మల్ని స్వేచ్ఛగా ఉంచే ప్రేమను వెతకండి' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఫిబ్రవరి 26న విజయ్- రష్మిక పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వేడుక ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగింది. I have never become so emotional reading something written about me this much in a long long time.. There is so much I want to say but so little I can say. I am finding my own room and that’s a journey I am so grateful for.. Thankyou for recognising it..❤️About love all I… https://t.co/f7W5vv0UJ5— Rashmika Mandanna (@iamRashmika) March 8, 2026 -
థియేటర్లలో మళ్లీ కాంచన.. రీ రిలీజ్ ఎప్పుడంటే?
తమిళ స్టార్, దర్శకుడు రాఘవ లారెన్స్ స్వీయ డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం కాంచన(ముని-2). 2011లో రిలీజైన ఈ హీరర్ థ్రిల్లర్ అభిమానులను ఓ రేంజ్లో భయపెట్టేసింది. ముని సిరీస్లో వచ్చిన రెండో చిత్రమే కాంచన. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీ రాయ్, దేవదర్శిని, శ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సరికొత్త 4కె వర్షన్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 13న కాంచన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హార్రర్- కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.7 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. ఈ మూవీ రీ రిలీజ్కు సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. #Kanchana4K Grand Re - Releasing on March 13th 🔥More Details SoonTHE FIRST EVER HORROR RE-RELEASE MOVIE IN TELUGU🤕BOOKING OPENING TODAY..#ThamanS@offl_Lawrence @iamlakshmirai @MusicThaman @D_films09 #nellore @DayaArjun2 @NelloreSSMBFC_ pic.twitter.com/uHuDVYCvld— rkfilmsnlr (@rkfilmsnlr) March 9, 2026 -
టీమిండియా వరల్డ్ కప్ విన్.. పెద్ది సాంగ్ వీడియో వైరల్
టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ను ముద్దాడింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా.. న్యూజిలాండ్ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ఇండియా క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ విజయాన్ని ప్రతి ఒక్కరు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ గెలుపును తమకు నచ్చినట్లుగా పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా ఈ విజయాన్ని పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సనా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవల రిలీజైన పెద్ది సెకండ్ సింగిల్ రైరా రారా అంటూ సాగే పాటతో టీమిండియా వీడియోను షేర్ చేశారు. రైరా రారా అంటూ సాగే ఈ పాటకు టీమిండియా ఆటగాళ్లతో వీడియోను రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.🔥🔥🔥🔥🔥 pic.twitter.com/xLVcvmd1yM— BuchiBabuSana (@BuchiBabuSana) March 8, 2026 -
రిలీజ్కు ముందే రికార్డులు.. దురంధర్-2 ప్రభంజనం..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు కావడం చూస్తుంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 18.11 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ తెలిపింది.ఈనెల 19న దురంధర్ ది రివెంజ్ థియేటర్లలోనే సందడి చేయనుంది. అంతకుముందు రోజే ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ షోల కోసం మేకర్స్ ముందుగానే బుకింగ్లు ప్రారంభించడంతో చాలా థియేటర్లలో టిక్కెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో మొదటి రోజే టికెట్ ధర ప్రస్తుతం రూ. 450-500 మధ్య ఉంది. ఈ మూవీ రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. -
ముక్కలైనా జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా.. టాలీవుడ్ నటి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ అభిమానులను అలరించిన నటీమణుల్లో హంసానందిని ఒకరు. మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2004లో 'ఒక్కటవుదాం' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, ఈగ తదితర చిత్రాల్లో నటించింది. 'మిర్చి'లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత హంస నందిని.. భాయ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, జై లవకుశ చిత్రాల్లోని ప్రత్యేక గీతాలతో అలరించింది. 2018లో చివరగా గోపీచంద్ 'పంతం'లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.తాజాగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన జీవితం ముక్కలైనా.. మళ్లీ నిర్మించుకున్నానని తెలిపింది. క్యాన్సర్తో పోరాడి తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకున్న ప్రయాణం గుర్తు చేసుకుంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది. తన లైఫ్లో ఎదుర్కొన్న అనుభవాలను తలచుకుని ఎమోషనలైంది.క్యాన్సర్ బారిన పడి..అయితే హంస నందిని సినిమాల్లో కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి మర్చిపోయారు. ఆ తర్వాత 2021 చివర్లో ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడింది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
రష్మికకు గద్దర్ అవార్డ్.. ఆమె భర్త ఏమని పొగిడారంటే?
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో ఈ జంట ఒక్కటయ్యారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు.అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్స్ అవార్డ్స్లో తన భార్య రష్మికకు ఉత్తమ నటిగా ఎంపికైంది. ది గర్ల్ఫ్రెండ్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఆమె భర్త విజయ్ దేవరకొండ స్పందించారు. తనకు అవార్డ్ రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. హ్యాపీ అండ్ ప్రౌడ్ అంటూ తన ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన రష్మిక భర్త పోస్ట్కు రిప్లై ఇచ్చింది. విజ్జు.. నీకు గర్వంగా ఉందని చెప్పడాన్ని ప్రేమిస్తా అంటూ పోస్ట్ చేసింది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి ఒకరినొకరు అభినందించుకోవడం విశేషం. -
త్రిషపై అనుచిత కామెంట్స్.. సారీ అంటూ పోస్ట్
కోలీవుడ్ స్టార్ విజయ్ విడాకుల వివాదం తెరపైకి వచ్చాక అనూహ్యంగా హీరోయిన్ త్రిష పేరు వైరలవుతోంది. విజయ్కు అమెతో రిలేషన్ ఉందంటూ ఆయన భార్య సంగీత ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇదిలా ఉండగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు త్రిషపై అనుచిత కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్లో పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.ఇది కోలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై హీరోయిన్ త్రిష కూడా అదేస్థాయిలో ఇచ్చిపడేసింది. ఆ నటుడికి అసలు బుర్రనే లేదంటూ ఎద్దేవా చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పార్తిబన్ స్పందించారు. ఈ మేరకు ఆయన క్షమాపణలు కోరారు. ఇప్పుడు జరిగిన దానికి నేనే సారీ చెప్పడం తప్ప వేరే మార్గం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదానికి ఇకపై ఫుల్స్టాప్ పడినట్లే.అసలేం జరిగిందంటే..తాజాగా ఓ మూవీ ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. -
2009లో రోడ్డు ప్రమాదం.. నా ప్రాణాలు కాపాడింది వారిద్దరే: ఎన్టీఆర్
బెంగళూరులో ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవం కోసం ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు. ఆయన ఎయిర్ పోర్టు దిగినప్పటి నుంచి అభిమానుల తాకిడి మామూలుగా లేదు. సిటీ మొత్తం ఎక్కడ చూసినా సరే వాల్లే కనపించారు. తారక్ను దగ్గరగా చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. తారక్ ఆసుపత్రి వద్దకు చేరుకోగాని భారీగా అభిమానులు గుమికూడారు.. వాళ్లను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. మొత్తానికి ఎలాగోలా రిబ్బన్ కట్ చేసి వేదికపై కొన్ని మాటలు పంచుకున్నారు. ఈ క్రమంలో 2009లో తనకు జరిగిన రోడ్ ప్రమాదం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఎలా ప్రాణాలతో బయటపడ్డారో తెలిపారు.2009లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనను ప్రాణాలతో కాపాడింది కిమ్స్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు భాస్కర్ రావు, ప్రముఖ వైద్యులు ఎ.వి. గురవారెడ్డి అని ఆయన గుర్తు చేసుకున్నారు. వారిద్దరికీ ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. 2009 మార్చి 26న జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వెళుతుండగా, రాత్రి వేళ మోతె మండలకేంద్రం సమీపంలోని తిరుతమ్మగుడి మూలమలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జూనియర్ ఎన్టీఆర్తో సహా పలువురికి గాయాలు కాగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో తారక్ కూడా తీవ్రంగానే గాయపడ్డారు. -
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. సినీ అభిమానులకు అత్యాధునిక సదుపాయాలతో లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, ఐమ్యాక్స్ స్థాయి విజువల్స్ వంటి ప్రపంచ స్థాయి సాంకేతికతతో అల్లు అరవింద్ దీనిని నిర్మించారు. అయితే, ఈ థియేటర్కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్ పాత్ర ఐకానిక్గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.అయితే, ‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవం మాత్రం మార్చి 12న జరగనుందని తెలుస్తోంది. ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నట్లు సమాచారం. సీఎం చేతులమీదుగా అల్లు సినిమాస్ ప్రారంభం కానుందని ఇప్పటికే సోషల్మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో మొదటి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ప్రదర్శించబడుతాయి. ఈ మల్టీఫ్లెక్స్లో మొత్తం నాలుగు స్క్రీన్లు ఉన్నాయి. ప్రతి స్క్రీన్లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ స్క్రీన్ను ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.పుష్ప-2 విడుదల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత వారిద్దిరూ గద్దర్ అవార్డ్స్ వేదికపై కలుసుకోవడంతో వాటికి బ్రేక్ పడింది. అల్లు శిరీశ్ పెళ్లి సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మరోసారి కలిసిని విషయం తెలిసిందే.. వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా ఆలింగనం కూడా చేసుకున్నారు. కొంత సమయం పాటు ఒకే సోఫాలో కూర్చొని సరదాగా మాట్లాడుతూ కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అలా అల్లు ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడటంతో అల్లు సినిమాస్ ప్రారంభోత్సవానికి సీఎం తప్పకుండా వెళ్తారని బన్నీ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. -
గాయపడ్డ సింహం అలరిస్తుంది: తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రంలో మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించగా, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించిన ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. తాజాగా ‘పాదం కదిలే కానీ... తీరం కనలే...’ అంటూ మొదలయ్యే ఈ సినిమా థీమ్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్.ర్యాపర్ అసుర లిరిక్స్ అందించిన ఈపాటను ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తీపాడారు. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న కశ్యప్ శ్రీనివాస్ అసలైన హీరో. ఆయన కష్టపడ్డ సింహం. నేను అదృష్టమైన సింహం. ‘గాయపడ్డ సింహం’ ప్రేక్షకులను అలరిస్తుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడండి’’ అన్నారు.‘‘త్వరలోనే ఈ సినిమా రిలీజ్ని చేస్తాం. తరుణ్ తన పెర్ఫార్మెన్స్తో అందర్నీ ఎంటర్టైన్ చేస్తారు’’ అని చెప్పారు కశ్యప్. ‘‘ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఏప్రిల్లో రిలీజ్ ΄్లాన్ చేశాం’’ అని నిర్మాత భాను కిరణ్ తెలిపారు. ‘‘ఈ సినిమా చాలా క్రేజీగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు లిరిక్ రైటర్ ర్యాపర్ ప్రమోద్ అసుర. ‘‘హీరో అమెరికన్ డ్రీమ్ ఒక్కసారిగా ఎలా తలకిందులవుతుందో ఈపాట చూపిస్తుంది. అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన డిపోర్టేషన్ నిర్ణయం తర్వాత హీరో జీవితంలో ఏర్పడే గందరగోళ పరిస్థితులను ఈపాటలో సరదాగా చూపించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
ప్రతి సీన్కి చప్పట్లు కొడుతున్నారు: వరలక్ష్మి
‘‘సరస్వతి’ కేవలం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కాదు. థ్రిల్లర్, యాక్షన్, ఎమోషన్, లవ్... అన్నీ ఉన్నాయి. ఈ చిత్రం బాగుందని చాలామంది మెసేజ్లు పంపారు. ‘సరస్వతి’ లాంటి మంచి సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. మీ ప్రేమకి ధన్యవాదాలు’’ అని వరలక్ష్మీ శరత్కుమార్ చెప్పారు. ఆమె లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సరస్వతి’. పూజా శరత్ కుమార్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 6న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో వరలక్ష్మీ శరత్కుమార్ మాట్లాడుతూ– ‘‘మా మూవీ ప్రదర్శితమవుతున్న చాలా థియేటర్స్కి వెళ్లాను.ప్రతి సీన్కి, డైలాగ్స్కి ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. క్లైమాక్స్ చూసి చాలా సర్ర్పైజ్ అయ్యారు’’ అని పేర్కొన్నారు. పూజా శరత్కుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు అద్భుతమైన స్పందనని కనబరిచారు. ఈ మూవీని థియేటర్స్లోనే చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సరస్వతి’ లాంటి సినిమాలు తీయాలన్నా, ఇలాంటి కథ చెప్పాలన్నా ధైర్యం కావాలి. ఒక సినిమా మనసుని కదిలిస్తే అది సక్సెస్ అయినట్లే. ‘సరస్వతి’ అలా మనసుల్ని కదిలించిన సినిమా’’ అని వరలక్ష్మి భర్త నికోలాయ్ సచ్దేవ్ పేర్కొన్నారు. -
రహస్య పోలీస్
‘ఆంబళ, మద గద రాజా’ చిత్రాల తర్వాత హీరో విశాల్, దర్శకుడు సుందర్ .సి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘మొగుడు’. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, సంపత్, అజయ్ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేశ్, యోగిబాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డా. ఏసీ షణ్ముఖం ఆశీస్సులతో అరుణ్ కుమార్, ఖుష్బూ సుందర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది.కోల్కత్తా, గోవా, చెన్నై లొకేషన్స్లో తదుపరి షెడ్యూల్స్ జరగనున్నాయి. ఇక ఇటీవల ‘మొగుడు’ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమోలో ఓ సాధారణ భర్తలా ఇంట్లో అన్ని పనులు చేస్తూనే, ఓ అండర్కవర్ పోలీస్లా రౌడీలను చితక్కొట్టేశారు విశాల్. ఈ సినిమాకు సంగీతం: హిప్ హాప్ తమిళ. -
స్క్రీన్ప్లేకి అవార్డు రావడం హ్యాపీగా ఉంది: దర్శకుడు అనిల్ రావిపూడి
‘‘ప్రతి సినిమాకి ఆడియన్స్ ఇస్తున్న సక్సెస్తో ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. అయితే ప్రతి సినిమాకు భయం కూడా కచ్చితంగా ఉంటుంది. లేకపోతే ప్రతి సినిమాకి అంత నిజాయితీతో పని చేయలేం. ఆడియన్స్ ఇచ్చే ఎనర్జీనే ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే ఈ (అవార్డు) క్రెడిట్ మొత్తం ఆడియన్స్కి ఇస్తాను’’ అని చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రానికి గాను బెస్ట్ స్క్రీన్ప్లే, బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి పంచుకున్న విశేషాలు... ⇒ గద్దర్ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. కమర్షియల్గా బాక్సాఫీస్ విక్టరీ, అలాగే అవార్డ్స్ కూడా రావడం అంటే ఒక దర్శకుడికి అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్. ఎంటర్టైన్మెంట్తోపాటు ఒక చిన్న సందేశాన్ని చెబుతూ డిఫరెంట్ జానర్లో నేను ప్రయత్నించిన సినిమా ఇది. ‘భగవంత్ కేసరి’ వంటి సీరియస్ డ్రామా తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేశాను. అది బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. నా కెరీర్కి మంచి బూస్ట్ ఇచ్చింది. ⇒ నా తర్వాతి సినిమాను వెంకటేశ్గారితోనే చేస్తున్నాను. ఈ సమయంలో నేను ఆయనతో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు అవార్డు రావడం అనేదిపాజిటివ్ వైబ్లా అనిపించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో క్యారెక్టర్స్కు, సీన్స్ మధ్య స్క్రీన్ప్లే చక్కగా కుదిరింది. స్క్రీన్ప్లే విభాగంలో అవార్డు రావడం అనేది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ‘దిల్’రాజు, శిరీష్గార్లతో నేను ఆరు సినిమాలు చేశాను. వాళ్లను నా ఫ్యామిలీలా ఫీలవుతాను. వాళ్ల బ్యానర్లో నేను చేసిన సినిమాకు గద్దర్ అవార్డు రావడం ఆనందాన్నిచ్చింది. ∙నా తర్వాతి సినిమాలో వెంకటేశ్, కల్యాణ్రామ్గార్లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కొంచెం కష్టమైన స్క్రిప్ట్. రెండు నెలల సమయం పడుతుంది. జూన్లో షూటింగ్ స్టార్ట్ చేసి, నవంబరులో పూర్తి చేసి, సంక్రాంతికి రిలీజ్ చేస్తాం. -
చట్టాన్ని నమ్ముతుంది
ఒకవైపు బొగ్గుతో నిండిన రైలు దూసుకెళుతోంది... మరోవైపు బాంబు పేలిన దృశ్యం. మైనింగ్ ప్రాంతంలో సంయుక్త గన్ పట్టుకుని గురి చూస్తున్నారు. మరి... ఆమె ఆపరేషన్ ఏంటి? అనేది ‘ది బ్లాక్ గోల్డ్’లో చూడాలి. సంయుక్త లీడ్ రోల్లో ఈ హీరోయిన్ సెంట్రిక్ మూవీ రూపొందుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని మైనింగ్ ఏరియాలో యాక్షన్ మోడ్లో ఉన్న సంయుక్త పోస్టర్ని విడుదల చేశారు.ఈ పోస్టర్లో ‘ఆమె చట్టాన్ని నమ్ముతుంది.... తుపాకీని కాదు’ అనే క్యాప్షన్ ఉంది. ఈ చిత్రాన్ని యోగేష్ కేఎంసి దర్శకత్వంలో మాగంటి పిక్చర్స్తో కలిసి రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ‘‘పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ వేసవిలో విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
మీ దగ్గర ఆధారాలున్నాయా?.. నెటిజన్కు రష్మీ స్ట్రాంగ్ కౌంటర్
టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ ఓ నెటిజన్కు ఇచ్చిపడేసింది. తన క్యారెక్టర్ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు నీ వద్ద ప్రూఫ్స్ ఉంటే బయటపెట్టాలని అతనికి గడ్డిపెట్టింది. నాకు రిలేషన్స్ ఉన్నా.. లేకపోయినా.. నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదని మండిపడింది. ఒక వేళ నేను పెళ్లి చేసుకునే వరకు ఎంతమందితో తిరిగినా అది మీ సమస్య కాదంటూ హితవు పలికింది. మహిళ దినోత్సవం రోజే యాంకర్ రష్మి వేధింపులకు గురికావడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.రష్మీ గౌతమ్ తన ట్వీట్లో రాస్తూ..'ముందు రుజువులు చూపించు. రెండోది.. నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా.. నాపై వేధింపులు పాల్పడే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్ను లేదా మీ తండ్రిని లేదా మీ కొడుకును వివాహం చేసుకునే వరకు ఎంతమందితో తీరిగినా అది మీ సమస్య కాదు. అలాగే నాకు ఎవరితో లింక్ ఉందో దయచేసి వాలా పేర్లు ప్రూఫ్తో సహా చెప్పండి. నా ఒక్క పేరు ఎందుకు. మీరు ఎవరి క్యారెక్టర్నైనా కించపరచాలనుకుంటే ఇద్దరి పేర్లు బయట పెట్టండి. అది న్యాయం' నెటిజన్కు ఫుల్గా గడ్డిపెట్టేసింది.First and foremost show the proofSecondly no matter how many relationships I have or not No one has the right to abuse me And until and unless I’m getting married to you or or your father or your son Neenu yetha mandi tho teerigina aadi mee problem kadu Also naku yevari… https://t.co/RPYQ8fZj50— rashmi gautam (@rashmigautam27) March 8, 2026 -
తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య
తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులుగా వీఎన్ ఆదిత్య ఎన్నికయ్యారు. ఇవాళ హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్గా సముద్ర ఎంపిక కాగా.. ప్రధాన కార్యదర్శిగా రామారావు.. ట్రెజరర్గా దర్శకుడు సాయి రాజేశ్ గెలిచారు.ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతన అధ్యక్షులు వి ఎన్ ఆదిత్య తెలిపారు. మేము చేసిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అసోసియేషన్ సభ్యులకు ఆరోగ్య భద్రత, సినిమా నిర్మాణంలో సహాయం చేస్తామని వెల్లడించారు. మా ప్యానెల్లో 18మంది పోటి చేస్తే 16 మంది గెలిచారని అన్నారు. నన్ను డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. -
నేను చెప్పేది అదొక్కటే.. మా కుటుంబంలా మీకు జరగ్గకూడదు: ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల గురించి మాట్లాడారు. బెంగళూరులో ఓ ఆస్పత్రి కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ తన ఫ్యాన్స్కు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించారు. నా కుటుంబంలో జరిగినట్లుగా ఎవరికీ జరగకూడదని అన్నారు. ఇంతలా నాకు ప్రేమ అందించిన మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నా కోసం వచ్చిన అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మా ఇంట్లో జరిగిన దుర్ఘటన మీకెవరికీ జరగకూడదని కోరుకుంటున్నా. ఈ ప్రేమని నాకు అందించినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటా. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా' అని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే జోర్డాన్లో పూర్తి చేశారు. ఈ షూట్లో ఎన్టీఆర్పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. అమెరికా- ఇరాన్ యుద్ధానికి ముందే డ్రాగన్ టీమ్ ఇండియాకు చేరుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ డ్రాగన్ లుక్లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అభిమానుల గురించి #NTR ❤️ ఈ ప్రేమని నాకు అందించినందుకు ఆజన్మాంతం రుణపడి ఉంటా! 🙏నా అభిమానులందరికీ చెప్పేది ఒక్కటే...జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి...😊Follow 👉 @tupaki_official#JrNTR #PES #KIMSHospitals #NTRInBengaluru #LatestNews #Tupaki pic.twitter.com/93Ts08a971— Tupaki (@tupaki_official) March 8, 2026 -
'రాయుడు గారి తాలూకా’ తో మరోసారి అది రుజువైంది: ఉలిశెట్టి శ్రీనివాస్
ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రాయుడు గారి తాలూకా’. మార్చి 6న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ చిత్రానికి ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా కథ, కథనం, మాటలను అందించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. సినిమాకు వస్తున్న ఆదరణ చూసి చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. సక్సెస్ మీట్లో పాల్గొన్న టీం సభ్యులు మాట్లాడుతూ.. "మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. మార్చి 6 నుంచి అన్ని సెంటర్లలో వస్తున్న పాజిటివ్ టాక్ మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది" అని తెలిపారు. -
పదేపదే అలా చెప్పడం నాకు నచ్చదు : ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గౌరవంపై స్టార్ హీరో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే చెప్పడం తనకు నచ్చదని, ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలని అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం కోసం బెంగళూరు వెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళల గౌరవంపై ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే మహిళలను గౌరవించే సంస్కారం ఉండాలని అన్నారు. ‘నా ఇద్దరు కొడుకులను (అభయ్ రామ్, భార్గవ్ రామ్) మహిళలను గౌరవిస్తూ పెరిగేలా నేను కచ్చితంగా చూసుకుంటాను’ అని ఆయన పేర్కొన్నాడు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతో హుందాగా వ్యవహరించే ఎన్టీఆర్, మహిళా భద్రత, గౌరవం గురించి ఇంత గొప్ప వ్యాఖ్యలు చేయడం పట్ల నందమూరి అభిమానులతో పాటు సామాన్యులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.‘డ్రాగన్’ లుక్ వైరల్కాగా, ఎన్టీఆర్ బెంగళూరుకు వస్తున్నాడని తెలిసి.. స్థానిక అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.వారిని అభివాదం చేయడానికి ఎన్టీఆర్ కారులోంచి బయటికి వచ్చాడు. కారు మీదికి ఎక్కి అభిమానులకు అభివాదం చేశాడు. గాగుల్స్ పెట్టుకుని.. గుబురు గడ్డంతో కనిపించిన తారక్ సూపర్ స్టైలిష్గా కనిపించాడు.ప్రశాంత్ నీల్తో చేయబోతున్న డ్రాగాన్(వర్కింగ్ టైటిల్) సినిమా కోసమే ఎన్టీఆర్ ఈ లుక్లోకి మారాడు. ఇన్నాళ్లు తన లుక్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్న తారక్..ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్గా మారింది.


