Movie News
-
బాలయ్య వారసుడికి బిగ్ షాక్
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ, సడెన్గా ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడిపోయింది. కొన్ని గంటల్లో క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించాలని ఏర్పాట్లు కూడా చేశారు. అందుకోసం సుమారు రూ. 30 లక్షలు ఖర్చు కూడా పెట్టారు. అయితే, మోక్షజ్ఞకు ఆరోగ్యం బాగోలేదంటూ చివరి నిమిషంలో ప్రశాంత్ వర్మకు బాలకృష్ణ కాల్ చేయడంతో ఈ ప్రాజెక్ట్కు బ్రేక్ పడింది. ఆ సమయం నుంచి మళ్లీ ఈ కాంబినేషన్ గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. అయితే, తాజాగా సమాచారం ప్రకారం మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా లేనట్లే అని తెలుస్తోంది. కొద్దిరోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చు.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మోక్షజ్ఞ మూవీ రానుందని ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమా నుంచి ప్రశాంత్ దాదాపు తప్పుకున్నట్లే అని తెలుస్తోంది. రేపోమాపో ప్రకటన రావడమే ఇక మిగిలి ఉంది. త్వరలో ప్రభాస్తో ఒక భారీ ప్రాజెక్ట్ చేసేపనిలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు పక్కా సమాచారం ఉంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ టెస్ట్ లుక్ కూడా చేయనున్నారని సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. ప్రభాస్తో మూడు పెద్ద ప్రాజెక్ట్లు నిర్మిస్తామని ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ క్రమంలో సలార్2 కూడా లైన్లో ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్గా ప్రభాస్ చిత్రం రానుంది.మోక్షజ్ఞ నిర్మాతకు మరో ఆఫర్ ఇచ్చిన బాలయ్యమోక్షజ్ఞ తొలి సినిమా ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ మూవీ కోసం మోక్షజ్ఞ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అయితే, పూజా కార్యక్రమం రోజే సినిమాకు ఫుల్స్టాప్ పడిపోయింది. లెజెండ్ ప్రొడక్షన్స్తో కలిసి ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నట్లు తెలిపారు. అయితే, సినిమా ఉంటుందని వారు చెబుతున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్పై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ, మోక్షజ్ఞ ప్రాజెక్ట్కు బదులుగా నిర్మాత సుధాకర్ చెరుకూరికి బాలయ్య మరో ఆఫర్ ఇచ్చారట. తన తర్వాతి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో ఉంది. ఈ సినిమాను ఆయనకే అప్పజెప్పారని సమాచారం. -
ఆ సమయంలో నా తండ్రి పేరు చెప్పుకోలేదు: శృతిహాసన్
సినిమాల్లో మారువేషాలు మారుపేరులు కలిగిన పాత్రను చూస్తుంటాం. అయితే నటి శృతిహాసన్ నిజ జీవితంలోనూ మారుపేరుతో తిరగడం విశేషం. సలార్ చిత్రం తర్వాత ఈ బ్యూటీ ఇప్పటివరకు తెరపై చూడలేదు. అయినప్పటికీ ఈమె పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నారన్నది గమనార్హం. అందులో ఒకటి రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ.. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో నటి శృతిహాసన్ చాలా ముఖ్యపాత్రను పోషిస్తున్నారు .అదేవిధంగా విజయ్ సేతుపతికి జంటగా ట్రైన్ చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. అయితే, విజయ్ దళపతి 69వ చిత్రం జననాయకన్లో కూడా ఈ బ్యూటీ కీలకపాత్రలో మెరవబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా శృతిహాసన్ ఏదో ఒక సంచలన ఘటనలనో, లేక ఆసక్తికరమైన విషయాలనో అభిమానులతో పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి కమల్ హాసన్ లెగిసీని వాడుకోకపోయినా ఆయన గొప్పతనాన్ని తరచూ వ్యక్తం చేస్తూనే ఉంటారు. కాగా తాజాగా తను సినీ రంగ ప్రవేశం చేయకముందు జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల ఓ భేటీలో తెలిపారు. తాను కమల్ వారసురాలని బయట తెలిస్తే.. స్నేహితులతో తిరగడానికి ఇబ్బంది కలుగుతుందని భావించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.సినీ రంగ ప్రవేశం చేయకముందు నకిలీ పేరుతో కొన్ని రోజులు చాలా స్వేచ్ఛగా తిరిగానని పేర్కొంది. నటుడు కమలహాసన్ కూతురు అని పరిచయం చేసుకుంటే ఎవరితో మాట్లాడిన వాళ్లు పూర్తిగా తన తల్లిదండ్రుల గొప్పతనం గురించే మాట్లాడుతారని, అందుకే తాను నకిలీ పేరు చెప్పి పరిచయం చేసుకునేదానినని, అలా వారితో ఎలాంటి సంశయం లేకుండా కోరుకున్న విధంగా నేను నాలా మాట్లాడగలిగేదాన్ని శృతిహాసన్ చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడైతే చిత్రాల్లో నటించడం ప్రారంభించానో అప్పటి నుంచి ఆ నకిలీ పేరును వాడే అవకాశం లేకపోయిందని ఈ భామ పేర్కొన్నారు. -
పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న ఓటీటీ నటి
ఓటీటీలో 'మిస్ మ్యాచ్డ్' సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి కమ్ యూట్యూబర్ పెళ్లి చేసుకుంది. దాదాపు పదకొండేళ్లుగా ప్రేమలో ఉన్న వాడితోనే ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు సమక్షంలో మంగళవారం ఈ పెళ్లి వేడుక జరిగింది.(ఇదీ చదవండి: ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?)2015లో యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రజక్త కోలీ.. మోస్ట్లీ సేన్ పేరుతో అందరికీ పరిచయమే. యూట్యూబ్ లో ఎంతో పేరు తెచ్చుకున్న ఈమె.. జగ్ జగ్ జీవో, నియాత్ సినిమాల్లో నటించింది. కానీ నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన 'మిస్ మ్యాచ్ డ్' వెబ్ సిరీస్ తో హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ఈ సిరీస్ నుంచి మూడో సీజన్ కూడా రిలీజైంది.మరోవైపు యూట్యూబర్ కాకముందే వృషాంక్ అనే కుర్రాడితో ప్రేమలో ఉంది. దాదాపు 11 ఏళ్లపాటు వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ బంధంలో ఎన్ని ఇబ్బందులొచ్చినా సరే నిలబడుతూ వచ్చాయని ప్రజక్త చెప్పుకొచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలోని కర్తాజ్ లోని ఓ ఫామ్ హౌసులో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ప్రియుడితో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు అందరూ విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: శివరాత్రికి జాగారమా? ఈ సినిమాలు చూస్తూ భక్తి పారవశ్యం) View this post on Instagram A post shared by Prajakta Koli (@mostlysane) -
నా సినిమాల్లో విలువలు ఉండేలా చూసుకుంటాను: దర్శకుడు నక్కిన త్రినాథరావు
‘‘నా సినిమాల్లో ఎంత ఫన్ ఉన్నా విలువలు ఉండేలానూ జాగ్రత్తలు తీసుకుంటాను. ‘సినిమా చూపిస్త మావ, నేను.. లోకల్, హలో గురూ ప్రేమకోసమే, ధమాకా!’... ఇలా నా చిత్రాల్లో డైలాగ్స్ రూపంలోనో, సీన్స్ రూపంలోనో విలువలు ఉండేలా చూసుకుంటాను. ఇక ప్రతి మగాడికీ ఓ మహిళ తోడు ఎంత అవసరమో ‘మజాకా’లో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన(Nakkina Trinadha rao). సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్పై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో నక్కిన త్రినాథరావు చెప్పిన విశేషాలు.⇒ ఇద్దరు మగాళ్లు మాత్రమే ఉన్న ఆడ దిక్కులేని ఓ ఇంట్లో ఓ మహిళ పని చేసేందుకు భయపడుతుంటుంది. అందుకే ఆ తండ్రీకొడుకులు తమకో ఫ్యామిలీ కావాలనుకుంటారు. వాళ్లు పడే తపన, చేసే ప్రయత్నాల సమాహారమే ‘మాజాకా’ కథ. ఈ సినిమా వినోదాత్మకంగా సాగుతుంది. కానీ చివరి 20 నిమిషాలు ఎమోషనల్గా ఉంటుంది. చిన్నప్పట్నుంచి అమ్మ ఎమోషన్ను అనుభూతి చెందని ఓ వ్యక్తి ఆ ఎమోషన్కు కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది? ఈ తండ్రీకొడుకులు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను సినిమాలోనే చూడాలి. ⇒ ప్రసన్నకుమార్ మంచి కథలు ఇస్తున్నారు. అందుకే ఆయనతో సినిమాలు చేస్తున్నాను. నా సొంత కథలతో చేయనని కాదు... నా సొంత కథలతో చేసిన సినిమాలూ ఉన్నాయి. ఇటీవల రైటర్ శ్రీనివాస్ ఓ కథ చెప్పాడు... నచ్చింది. ‘మజాకా’ రిలీజ్ తర్వాత ఆలోచిస్తాను.⇒ నా ప్రొడక్షన్లోని ‘చౌర్యపాఠం’ సినిమాని ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలనుకుంటున్నాను. అలాగే ‘అనకాపల్లి’ అనే సెమీ పీరియాడికల్ లవ్స్టోరీ ఫిల్మ్ చేస్తున్నాను. ‘మజాకా’కు సీక్వెల్గా ‘డబుల్ మజాకా’ ఉంది. ‘ధమాకా’కు సీక్వెల్గా ‘డబుల్ ధమాకా’ అనుకుంటున్నాం. రవితేజగారితో చేస్తే బాగానే ఉంటుంది. మా ప్రయత్నం కూడా ఇదే... చూడాలి. -
మహిళ గొప్పతనం చాటేలా...
‘‘నేనెక్కడున్నా’ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ మూవీలో అందరూ గొప్పగా నటించారు. మా నాన్న మిథున్ చక్రవర్తిగారిలా నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అని మిమో చక్రవర్తి అన్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, సాషా చెత్రి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘నేనెక్కడున్నా’(Nenekkadunna). మాధవ్ కోదాడ దర్శకత్వంలో కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యామ్ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాథ్ రెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘మిథున్ చక్రవర్తిలా మిమో చక్రవర్తి కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘పత్రికా రంగంలోని వ్యక్తికి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆ సమస్యలను వారు ఎదుర్కోవడం అవసరమా? అనే ప్రశ్నకు జవాబు ఈ సినిమా’’ అని గోపీనాథ్ రెడ్డి చె΄్పారు. ‘‘మహిళల గొప్పతనం చాటి చెప్పేలా జర్నలిజం నేపథ్యంలో ఈ సినిమా చేశాం’’ అని చె΄్పారు మాధవ్ కోదాడ. -
శివ శివ శంకరా...
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నప్పపాత్రను విష్ణు మంచుపోషించగా, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. మోహన్బాబు, మోహన్లాల్, కాజల్ అగర్వాల్ తదితరులు ముఖ్యపాత్రలుపోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘శివ శివ శంకరా...’ అనేపాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్గా నిలిచినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ– ‘‘శివ శివ శంకరా’పాటని ఇప్పటికే 80 మిలియన్ల (8 కోట్లు) మంది వీక్షించారు. ఇన్స్టాగ్రామ్లో రెండు లక్షలకు పైగా రీల్స్ చేశారు ప్రజలు ఈపాటని ఆదరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈపాట ట్రెండ్ అవుతుందని మేం ఊహించలేదు. శివరాత్రి సందర్భంగా ఈ సాంగ్ మరింతగా చేరువ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. -
ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది: హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్
‘‘నాకు ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది. నా యంగ్ ఏజ్లో నేను ఎక్కువగా ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాను. ఇండియాలో గడిపిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ‘ఎల్2ఈ ఎంపురాన్’(L2E Empuraan) సినిమాలో నటించడంతో మళ్లీ నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది’’ అని ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ (Jerome Flynn)(‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిర్రర్’ ఫేమ్) తెలిపారు.మోహన్లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘లూసిఫర్’ (2019)కి సీక్వెల్గా ‘ఎల్2ఈ ఎంపురాన్’ మూవీ రూపొందింది. సీక్వెల్లోనూ మోహన్లాల్ హీరోగా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జెరోమ్ ఫ్లిన్ చేసిన బోరిస్ ఆలివర్పాత్రని రివీల్ చేశారు. జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ– ‘‘ఖురేషి (మోహన్లాల్పాత్ర పేరు) ప్రయాణంలో బోరిస్ ఆలివర్ది ఒక ముఖ్యమైనపాత్ర. ఈ క్యారెక్టర్ని ప్రేక్షకులు ఇష్టపడతారు’’ అని పేర్కొన్నారు. మార్చి 27న మలయాళం, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
వారి వల్ల ప్రతిసారి ఫోటోలు షేర్ చేస్తూనే బతుకుతున్నాం: రవీందర్
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ‘డ్రాగన్’ (Dragon) సినిమాతో నటుడు రవీందర్ పేరు మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ఫేక్ సర్టిఫికెట్లు సరఫరా చేసే వ్యక్తిగా ఆయన కనిపించాడు. ఆయన గతంలో పలు సినిమాలకు నిర్మాతగా కూడా ఉన్నారు. డ్రాగన్ సినిమా తనకు చాలా పేరు తీసుకొచ్చిందని సంతోషంలో ఉన్నారు. తాజాగా ఆయన సతీమణి మహాలక్ష్మితో పాటు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో పలు విషయాలను రవీందర్ పంచుకున్నాడు. తనకు పెళ్లి అయిన తర్వాత చాలామంది హేళన చేశారని వాపోయాడు. ఇంత అందమైన అమ్మాయితో పెళ్లి ఏంటి అంటూ కొందరు మెసేజ్లు కూడా చేశారని ఇలా చెప్పుకొచ్చాడు.మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత చాలా విమర్శలు వచ్చినా కూడా భరించాము. కొద్దిరోజుల తర్వాత మేమిద్దరం విడాకులు తీసుకున్నామని, విడిపోయామని కూడా వార్తలు వచ్చాయి. అది చూసి నవ్వుకున్నాం. ఇంత అందమైన స్త్రీ ఇంత శరీరాకృతి ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది..? ఈ పెళ్లి ఎన్ని రోజులు ఉంటుందిలే అంటూ అందరూ హేళన చేసే వాళ్లే కనిపించారు. కొందరైతే మేము విడాకులు తీసుకుని విడిపోయి వేరువేరుగా ఉంటున్నామని ప్రచారం చేశారు. ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారీ.. మేం కలిసి ఉన్నాము అంటూ ఫోటోలు పోస్ట్ చేస్తూ రూమర్స్కు ముగింపు పలుకుతున్నాం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. కొందరి చేస్తున్న హేళన తట్టుకోలేక ఎన్నోసార్లు ఫోటోలు షేర్ చేస్తూ బతుకుతున్నాం. చాలామందికి వారి జీవితం ఏమౌతుందో అనే కంటే ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.' అని ఆయన అన్నారు. వెన్నుపోటు పొడిచారు: మహాలక్ష్మిఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న మహాలక్ష్మి చెప్పుకొచ్చారు. 'నమ్మిన వ్యక్తులే మాకు వెన్నుపోటు పొడిచారు. మాతో సన్నిహితంగా ఉంటూనే అలాంటి పనిచేశారు. ఎప్పుడైతే మనం ఇతరులను సర్వస్వం అని నమ్ముతామే వాళ్లే వెన్నుపోటు పొడుస్తారు. శత్రువు కూడా అలాంటి పనిచేయడు. మనతో పాటు ఉన్నవాడు, మనకు బాగా తెలిసినవాడు మాత్రమే మన వెన్నులో పొడవగలడు. మన జీవితంలో అమ్మ, నాన్న, భర్త, పిల్లలు తప్ప ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఉందని' ఆమె చెప్పింది. అయితే, వారికి నష్టం చేసిన వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు. కొద్దిరోజుల క్రితం ఆర్థిక లావాదేవీల విషయంలో రవీందర్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. నమ్మిన వ్యక్తి వల్లే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమె గతంలో కూడా ఒకసారి చెప్పింది.కోలీవుడ్లో సన్ మ్యూజిక్లో హోస్ట్గా చేసిన మహాలక్ష్మి ఆపై సీరియల్స్తో మరింత పాపులర్ అయింది. ఆమెకు అనిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. తదనంతరం, నిర్మాత రవీందర్ని ప్రేమించి ఆమె పెళ్లి చేసుకుంది. -
నెట్టింట వైరల్ అవుతున్న 'మంగ్లీ' సాంగ్
తెలంగాణలో బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే.. అంతలా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది శివుడి పాటలు పాడి అందరి ఇంట్లో తన గొంతును వినిపిస్తున్నారు. అయితే, తాజాగా ఆమె ఈ శివరాత్రి కోసం 'భం.. భం.. భోళా' అంటూ అదిరిపోయే సాంగ్ను ఆలపించారు. చరణ్ అర్జున్ రచించిన ఈ పాటు మంగ్లీ సిస్టర్స్ పాడటమే కాకుండా తనదైన స్టైల్లో స్టెప్పులు కూడా వేశారు. శివభక్తుల్లో మంచి జోష్ నింపేలా సాంగ్ ఉండటంతో నెట్టింట వైరల్ అవుతుంది.కోయంబత్తూర్లోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్యాత్మిక కేంద్రం ఈషా ఫౌండేషన్లో ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా శివభక్తులు వస్తుంటారు. అక్కడ కూడా మంగ్లీ పాటలు పాడుతారు. కొన్నేళ్లుగా ఆమె సద్గురుతో పాటు శివరాత్రి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
శివరాత్రికి జాగారమా? ఈ సినిమాలు చూస్తూ భక్తి పారవశ్యం
శివరాత్రి వచ్చేసింది. దీంతో ఇప్పటికే శివాలయాలన్నీ కళకళలాడిపోతున్నాయి. శివుడి భక్తిలో మునిగిపోయేందుకు, రాత్రంతా జాగారం చేసేందుకు కోట్లాది మంది భక్తులు సిద్ధమైపోతున్నారు. రాత్రంతా గుడిలో ఉండలేం కానీ జాగారం చేస్తాం అనుకునే వాళ్లు.. తమ మనసు మరోచోటకు వెళ్లకూడదనుకుంటే శివుడి సినిమాలు చూస్తూ ఈ శివరాత్రిని పూర్తిచేయొచ్చు.(ఇదీ చదవండి: ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?)మరి తెలుగులో ఇప్పటివరకు శివుడు, ఆయనకు సంబంధించి చాలానే సినిమాలు వచ్చాయి. చిరంజీవి, ఎన్టీఆర్, కృష్ణంరాజు తదితరలు నటించిన పాత చిత్రాలతో పాటు రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ లోనూ శివుడి రిఫరెన్స్ ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఇంతకీ వాటిని ఎక్కడెక్కడ చూడొచ్చంటే?శివరాత్రి స్పెషల్ మూవీస్శ్రీ మంజునాథ (యూట్యూబ్)అంజి (యూట్యూబ్)ఎన్టీఆర్ 'భూ కైలాస్' (యూట్యూబ్)ఖలేజా (అమెజాన్ ప్రైమ్ - సన్ నెక్స్ట్)ఢమరుకం (అమెజాన్ ప్రైమ్ - సన్ నెక్స్ట్)అఖండ (యూట్యూబ్ - హాట్ స్టార్)మహాభక్త సిరియాళ (హాట్ స్టార్)భక్త శంకర (హాట్ స్టార్)భక్త కన్నప్ప (యూట్యూబ్-అమెజాన్ ప్రైమ్)శివకన్య (యూట్యూబ్- అమెజాన్ ప్రైమ్)మహాశివరాత్రి (జీ5 - యూట్యూబ్)శివరాత్రి మహత్యం (జియో సినిమా- యూట్యూబ్)వీటితోపాటు భక్త మార్కండేయ, దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీశంకరుల కథ, కాళహస్తి మహత్యం, జగద్గురు ఆదిశంకర, మావూళ్లో మహాశివుడు, కార్తికేయ సినిమాల్ని కూడా చూస్తూ శివరాత్రి జాగారం చేసేయొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?) -
'గం గం.. గణేశా' సినిమా నిర్మాత మృతి
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్లో మరణించారు. అయితే, ఆయన మరణానికి కారణాలు తెలియడం లేదు. తెలుగులో 'గం గం.. గణేశా' మూవీని కేదార్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం గతేడాదిలో విడుదలైంది. అయితే, కేదార్ సెలగంశెట్టి మరణ వార్తను తెలుసుకున్న ఆయన మిత్రులు సంతాపం తెలుపుతున్నారు. కేదార్ సెలగంశెట్టికి ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. అల్లు అర్జున్, నిర్మాత బన్నీవాస్, విజయ్ దేవరకొండలకు ఆయన అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.కేదార్ సెలగంశెట్టిని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అల్లు అర్జున్ అని తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్నేహితులను ఇండస్ట్రీకి అల్లు అర్జున్ పరిచయం చేశారు. ఈ క్రమంలో కేదార్ను కూడా బన్నీనే సపోర్ట్ చేశారు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్పై పలు చిత్రాలను నిర్మించాలని కేదార్ సెలగంశెట్టి ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక మూవీని కూడా వారు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆయన హఠాత్తుగా మరణించారని వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ఆయన స్నేహితులు కూడా షాక్ అవుతున్నారు. -
అప్సర రాణి 'బ్లడ్ రోజస్' ఫస్ట్ లుక్ రిలీజ్
రంజిత్ రామ్, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్లడ్ రోజస్. ఎంజిఆర్ దర్శకుడు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో హరీష్ కె నిర్మాతగా వ్యవహరించారు. మహా శివరాత్రి సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?)క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ కథతో ఈ సినిమాని తీశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది.(ఇదీ చదవండి: 38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!) -
ఓటీటీలో 'మద్రాస్కారణ్' తెలుగు వర్షన్.. రొమాంటిక్ సాంగ్లో నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల తమిళ సినిమా తెలుగులో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న 'మద్రాస్కారణ్' చిత్రం కోలీవుడ్లో విడుదలైంది. ఈ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్ హీరోలుగా నటించారు. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే తమిళ్ వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వర్షన్ను మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బి.జగదీష్ నిర్మించారు. తమిళ్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు కాస్త క్రేజ్ తగ్గింది. శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న 'ఆహా'లో 'మద్రాస్కారణ్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే, కోటి లోపే వసూళ్లను రాబట్టడంతో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.ఏడేళ్ల తర్వాత రొమాంటిక్ పాత్రతో రీఎంట్రీసుమారు ఏడేళ్ల తర్వాత 'మద్రాస్కారణ్' సినిమాతో తమిళ్లో నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. 2018లో విజయ్ సేతుపతి నటించిన ఒక సినిమాతో ఆమె కోలీవుడ్కు పరిచయం అయింది. అయితే, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు మద్రాస్కారణ్ మూవీలో మీరా అనే యువతిగా గ్లామర్ రోల్లో నిహారిక కనిపించింది. ఒక రొమాంటిక్ సాంగ్లో కూడా ఆమె నటించింది. ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇందులోని సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోయారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి! ఈ సినిమాతో హీరోయిన్గా హిట్టు కొట్టాలని నిహారిక ప్లాన్ చేసుకుంది. కానీ, ఫలితం మరోలా వచ్చింది. -
జ్యోతిక గ్లామర్.. మంచులో బాపుబొమ్మ చిల్!
మంచులో చిల్ అవుతున్న హీరోయిన్ ప్రణీతగ్లామరస్ జ్యోతిక.. వయసు తగ్గించేస్తుందేమో!చీరలో చూడముచ్చటగా నటి ధన్య బాలకృష్ణస్టేడియం వీడియో షేర్ చేసి నేహా శర్మబీచ్ ఒడ్డున బికినీలో స్మైలీ పోజులతో హంస నందినిమెరుపు తీగలా నాజుగ్గా మెరిసిపోతున్న రాధికా ఆప్టేమోడ్రన్ డ్రస్సులో జిగేలుమనేలా షారుక్ కూతురు View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Megha Chowdhury (@megha.chowdhury) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Akanksha Sharma (@akanksharmaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో
థియేటర్లలో అంటే సెన్సార్ ఇబ్బందులు ఉంటాయి. కానీ ఓటీటీలో మాత్రం ఇబ్బందులు ఉండవు. దీంతో బోల్డ్, రియలస్టిక్ పేరిట బూతులు, రొమాన్స్ కాస్త గట్టిగానే చూపించేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ కామెడీ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. డేట్ ప్రకటించడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)ఆహా ఓటీటీలో 2022లో తమిళంలో రిలీజైన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. మహత్ రాఘవేంద్ర, మానస చౌదరి, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో హిట్ అయిన ఈ సిరీస్ ని ఇప్పుడు తెలుగులో ఫిబ్రవరి 28 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.లవ్ చేసుకున్న ఓ యువతీయువకుడు అనుకోని విధంగా విడిపోతారు. ఆ కుర్రాడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. కొన్నిరోజులకు మాజీ లవర్ మళ్లీ ఇతడి జీవితంలోకి వస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. టీజర్ చూస్తే మాత్రం బోల్డ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)Love, passion, and destiny. Will they find their way back? #Emoji Premiering February 28th, only on Aha#EmojionAha @Maanasa_chou @Devu_devika77 @Mahatofficial pic.twitter.com/XTqPqfAOPU— ahavideoin (@ahavideoIN) February 25, 2025 -
ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా సినిమాలు, వేల కోట్ల వసూళ్లు, ఇంటర్నేషనల్ క్రేజ్.. ఇలా చాలా గుర్తొస్తాయి. కానీ ప్రభాస్ పేరు మీద ఓ ఊరు ఉందని, అది కూడా మనకు పక్కనే ఉండే నేపాల్ లో అని మీలో ఎంతమందికి తెలుసు?రీసెంట్ టైంలో తెలుగు కుర్రాళ్లు చాలామంది యూట్యూబ్ వీడియోలు, మోటో వ్లాగింగ్ చేస్తున్నారు. అలా ఓ తెలుగు యువకుడు.. నేపాల్ లో పర్యటిస్తున్నాడు. అక్కడ అనుకోకుండా ప్రభాస్ పేరుతో ఉన్న ఓ ఊరి బోర్డ్ కనిపించింది. ఇంకేం వెంటనే ఓ వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఇప్పుడది వైరల్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)అయితే ఈ ఊరికి మొదటి నుంచి ప్రభాస్ పేరు ఉందని తెలుస్తోంది. ఏదేమైనా డార్లింగ్ హీరో ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన హీరో పేరుపై ఏకంగా నేపాల్ లో ఊరు ఉందని తెగ మురిసిపోతున్నారు.ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలో సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' చేస్తాడు. దీనిపై అంచనాలు గట్టిగానే ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: 38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!) -
38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!
ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు అనేది చాలా కామన్. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా ఏళ్ల పాటు కలిసున్న కొందరు స్టార్ కపుల్స్ విడిపోతున్నారు. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాశ్, హీరో జయం రవి.. ఇలా తదితరులు ఏళ్లకు ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో సీనియర్ నటుడు చేరినట్లు తెలుస్తోంది.అప్పట్లో బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్న గోవిందా.. ప్రస్తుతం పెద్దగా లైమ్ లైట్ లో లేడు. ఇతడే తన 38 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడట. గోవిందా, ఇతడి భార్య సునీత అహుజా.. గత కొన్ని రోజుల నుంచి వేర్వురుగా ఉంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)కొంతకాలంగా గోవిందా దంపతుల మధ్య విబేధాలు నడుస్తున్నాయని, దీంతో ఇక విడాకులు తప్పనిసరి అనుకున్నారని తెలుస్తోంది. మరోవైపు గోవిందా.. ఓ మరాఠీ నటితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని, భార్య నుంచి విడిగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. ఇప్పటివరకైతే ఈ జంట.. విడాకుల అంశంపై స్పందించలేదు. కానీ మీడియాలో మాత్రం టాక్ గట్టిగా వినిపిస్తోంది.కొన్నాళ్ల క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత కూడా.. భర్త గోవిందాతో మాట్లాడి చాలా రోజులైందని చెప్పింది. ప్రస్తుతం తన కూతురు, కొడుకుతో కలిసి మాత్రమే ఉంటున్నానని పేర్కొంది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే విడిగా ఉంటున్నారని అర్థమైంది. త్వరలో విడాకుల విషయాన్ని అధికారికంగ ప్రకటిస్తారేమో చూడాలి. 1987లో వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోగా.. 1988లో కూతురు పుట్టిన తర్వాతే పెళ్లి విషయాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
గ్రామీణ నేపథ్యంలో ‘ప్రేమకు జై’
అనిల్ బురగాని, ఆర్.జ్వలిత జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకు జై’. మల్లం శ్రీనివాస్ దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు దర్శక–నిర్మాత సాయి వెంకట్ అతిథిగా హాజరై, ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘గ్రామీణ నేపథ్యంలో ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశాం. హీరో అనిల్ బురగాని, హీరోయిన్ జ్వలిత చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్స్ కృషి, సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత ఎంతో సహకరించారు. 'ప్రేమకు జై' సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం." అని అన్నారు.కో ప్రోడ్యూసర్: మైలారం రాజు మాట్లాడుతూ.. యూత్ కు నచ్చే సబ్జెక్టును దర్శకుడు చాలా బాగా తెరకేక్కించారు. వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానున్న 'ప్రేమకు జై' సినిమాను చూసి ప్రతి ఒక్కరూ జై కొడతారని ఆశిస్తున్నాము." అని అన్నారు.హీరోహీరోయిన్లు అనిల్ బురగాని, ఆర్ జ్వలిత మాట్లాడుతూ.. ఇంత మంచి సినిమాలో తమకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఙతలు తెలిపారు. సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.'ప్రేమకు జై' ఫ్రీరిలీజ్ వేడుకలో నటుడు అధిరే అభి, నిర్మాత ఎమ్ ఆర్ చౌదరి వడ్లపట్ల, నిర్మాత చందర్ గౌడ్, దర్శకుడు లారెన్స్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
పరోటా మాస్టర్గా శిక్షణ తీసుకున్న విజయ్ సేతుపతి
కోలీవుడ్ నటుడు విజయ్సేతుపతి ఇటీవల నటించిన చిత్రం మహారాజా. ఈయన నటించిన 50వ చిత్రం ఇది. ఆ మధ్య తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం విజయ్సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యామీనన్ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. (సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 10th ఎడిషన్: మీ అభిమాన తారలను నామినేట్ చేయండి)సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. ఇకపోతే ఇందులో నటుడు విజయ్సేతుపతి పరోటా మాస్టర్గా నటిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం ఆయన కొంత శిక్షణ పొందినట్లు సమాచారం. కాగా ఇంతకు ముందు నటుడు సూర్య హీరోగా ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ఈటీ ) చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజా చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇకపోతే నటుడు విజయ్సేతుపతి ఈ చిత్రంతో పాటూ ఎస్, గాంధీ టాకీస్, మిష్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మొదలగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ఈ నెల 7న థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ కూడా అందుకుంది. తాజాగా టీమ్ అంతా కలిసి సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. తండేల్ మూవీ రిలీజ్ రోజే పైరసీకి గురైంది. దీనిపై నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతానికి థియేటర్లలో సినిమా రన్ అవుతోంది. కానీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై బజ్ వినిపిస్తోంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.(ఇదీ చదవండి: సింగర్ పై 19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!)తండేల్ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో 'పుష్ప 2' తప్పితే చాలా సినిమాల్ని ఈ ఓటీటీ సంస్థ.. నెల రోజులకు అటు ఇటుగా స్ట్రీమింగ్ చేసేస్తోంది. అలానే ఈ సినిమాని కూడా నెలకే ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మార్చి 6 నుంచే తండేల్.. ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే మార్చి 14న రావొచ్చని మాట్లాడుకుంటున్నారు.తండేల్ విషయానికొస్తే.. శ్రీకాకుళంలోని మత్సలేశం అనే ఊరికి చెందిన కొందరు జాలర్లు.. గుజరాత్ తీరంలో చేపలు పడుతుండగా, అనుకోకుంగా పాకిస్థాన్ నేవి చేతికి చిక్కారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. తర్వాత పాకిస్థాన్ జైల్లో కొన్నాళ్ల పాటు ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో తిరిగి ఇళ్లకు చేరారు. ఈ స్టోరీకి ప్రేమకథని జోడించిన డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
సాహో మూవీతో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor). ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే గతేడాది విడుదలైన స్త్రీ-2 మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించారు.రైటర్తో డేటింగ్..అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మపై కొన్ని రోజులుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ సినీ రచయిత రాహుల్ మోదీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అంతేకాదు వీరిద్దరు చాలాసార్లు ఈవెంట్లలో జంటగా కనిపించారు. అప్పటి నుంచే ఈ జంట రిలేషన్లో ఉన్నారంటూ బీటౌన్లో టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది శ్రద్ధాకపూర్. తమ రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా దీన్ని బట్టి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని అర్థమవుతోంది.పెళ్లిలో జంటగా..తాజాగా తన ప్రియుడిగా భావిస్తోన్న రాహుల్ మోదీతో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరైంది ముద్దుగుమ్మ. గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగిన స్నేహితుల పెళ్లిలో బాయ్ఫ్రెండ్తో కలిసి సందడి చేసింది. ఇద్దరు కలిసి నూతన వధూవరులతో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ సైతం పెళ్లికి హాజరైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు శ్రద్దాకపూర్, రాహుల్ విమానంలో ఎకానమీ క్లాస్లో ప్రయాణించారు. కాగా.. గతేడాది జామ్నగర్లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్లో శ్రద్ధా కపూర్, రాహుల్ జంటగా కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత వైరలయ్యాయి. Shraddha Kapoor and Rahul Mody at a friend's wedding in Ahmedabad last night ♥️ pic.twitter.com/PBRanqJeoR— 𝒔𝒉𝒓𝒂𝒅𝒅𝒉𝒂__𝒎𝒚__𝒋𝒂𝒂𝒏🦋 (@shraddhasmehnaz) February 22, 2025 -
దేవర ప్రమోషన్లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. గతేడాది దసరా ముందు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.అయితే గతంలో మన తెలుగు చిత్రాలు చాలా వరకు జపాన్లో కూడా విడుదలై ఘన విజయం సాధించాయి. మన టాలీవుడ్ సినిమాలకు జపాన్లోనూ మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్తో పాటు పలు చిత్రాలు సైతం జపాన్ భాషలో కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీని కూడా ఈ ఏడాది అక్కడ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే దేవర ప్రమోషన్స్ ప్రారంభించారు యంగ్ టైగర్.జపాన్ అభిమానులు, అక్కడి మీడియాతో వర్చువల్ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను దేవర టీమ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. మూవీ ప్రమోషన్లతో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే నెల మార్చి 22న జపాన్లో పర్యటించనున్నారని తెలిపింది. ఈ సినిమాను మార్చి 28న జపాన్లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు. Man of Masses @Tarak9999 has kick started #Devara promotions with interviews for Japanese media ahead of his visit on March 22nd 🌊The countdown begins for the grand release in Japan on March 28th. pic.twitter.com/UwPJLNrQ1I— Devara (@DevaraMovie) February 25, 2025 -
19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్.. లేటు వయసులో లేని పోని చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటికి మొన్న ఓ ప్రోగ్రామ్ లో పాట పాడుతూ మహిళా అభిమానికి లిప్ కిస్ ఇచ్చి కాంట్రవర్సీకి కారణమయ్యాడు. ఇప్పుడు మొదటి భార్య వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఏమైందంటే?(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?)తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఎన్నో హిట్ పాటలు పాడిన ఉదిత్ నారాయణ్.. 69 ఏళ్లొచ్చినా ఇంకా తనదైన శైలిలో అలరిస్తూనే ఉన్నారు. సినిమా సాంగ్స్ కూడా పాడుతున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఈయన మొదటి భార్య రాంజన ఇప్పుడు ఈయనపై కోర్టులో కేసు వేసింది. ఉదిత్ నారయణ్.. తనకు సంబంధించిన భూమిని తనకు చెప్పకుండా అమ్మేశాడని, అందులో తనకు దక్కాల్సిన రూ.11 లక్షల్ని తీసేసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి తనకు ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇందులో భాగంగానే ఉదిత్.. ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)ఉదిత్ వ్యక్తిగత విషయానికొస్తే.. 1985లో దీప అనే సింగర్ ని పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలైపోయాడు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. దీపని పెళ్లి చేసుకోవడానికి ముందే ఉదిత్.. తనని పెళ్లి చేసుకున్నాడని రాంజన అనే మహిళ బయటకొచ్చింది. తొలుత బుకాయించాడు గానీఆమె, కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకొన్నాడు. అదే ఏడాది న్యాయబద్ధంగా ఉదిత్-రాంజన విడాకులు కూడా తీసుకున్నారు.విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద.. ఇల్లు, కొంత బంగారం, నెలకు రూ.15 వేల మొత్తాన్ని రాంజనకు ఇచ్చేలా బిహార్ మహిళా కమిషన్ ముందు ఉదిత్ ఒప్పుకొన్నాడు. అవి చెల్లిస్తున్నాడు కూడా. తాజాగా రాంజన మరోసారి కోర్టు మెట్లక్కెడంతో ఉదిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?) -
నాని వయొలెన్స్.. దెబ్బకు విజయ్ దేవరకొండ రికార్డ్ బ్రేక్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'హిట్-3'. హిట్ సిరీస్లో వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాని బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయగా యూట్యూబ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో హిట్-3 టీజర్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు 21 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించింది. ఈ చిత్రంలో నాని మునుపెన్నడు కనిపించని పాత్రలో నటించారు. టీజర్లో సన్నివేశాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. ఇంతకుముందెన్నడు చేయని మోస్ట్ వయొలెంట్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు.అయితే ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ మూవీకి 24 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఎన్టీఆర్ వాయిస్ అందించిన ఈ టీజర్కు ఇప్పటి వరకు 15 మిలియన్ల వీక్షణలు సాధించింది. కానీ నాని మూవీ హిట్-3 టీజర్ కేవలం 24 గంటల్లోనే కింగ్డమ్ వ్యూస్ రికార్డ్ను అధిగమించింది. దీంతో హీరో నాని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వేసవి కానుకగా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. -
'అలాంటి వ్యక్తి దొరకాలి.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటా': సుస్మితా సేన్
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్(Sushmita Sen) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిసారిగా తాలీ వెబ్ సిరీస్లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకుముందు ఆర్య వెబ్ సిరీస్తో అభిమానులను అలరించింది ఈ 49 ఏళ్లు బాలీవుడ్ భామ. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా దానిపై స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా? అని వెల్లడించింది.తన అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరిగదు కదా. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది సుస్మితా సేన్. కాగా.. గతంలో నటుడు రోహ్మన్ షాల్తో ప్రేమాయణం కొనసాగించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: మూడేళ్లుగా సింగిల్గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు)దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. -
'మీ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను'.. అమిర్ ఖాన్తో డ్రాగన్ హీరో
జీవితం ఊహించలేనిది.. ఇలా అన్నది ఎవరో తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందుగా యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాలి. ఈయన కోమాలి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టారు. ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అందురూ ఎదురు చూశారు. అలాంటిది హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తరువాత ఈయనకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.అలా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఓ మై గాడ్ చిత్రం ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ నెల 21వ తేదీన తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం వైపు పరుగులు తీస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్ను కలవడం ఆసక్తిగా మారింది. ప్రదీప్ రంగనాథన్ తమిళంలో నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. దీనికి ప్రదీప్ రంగనాథన్ సహ నిర్మాత కావడం గమనార్హం. అందులో అమీర్ఖాన్ వారసుడు జునైత్ ఖాన్, శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదన్నది గమనార్హం.ఇలాంటి పరిస్థితిలో ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్ను చెన్నైలో కలవడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఒక వేళ డ్రాగన్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనతో ఆయన్ని కలిశారా? లేక మరోదైన విషయం కోసం కలిశారా? అన్న చర్చ జరుగుతోంది. అయితే అమీర్ఖాన్ ప్రస్తుతం నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.అదే విధంగా అనారోగ్యానికి గురైన ఆయన తల్లి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను పరామర్శించడానికి ప్రదీప్ రంగనాథన్ వెళ్లారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా అమీర్ఖాన్తో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసిన ప్రదీప్ రంగనాథన్ అందులో.. జీవితం ఊహించలేనిది అని నేను ఎప్పుడూ చెబుతాను.. మీ అద్భుతమైన మాటలకు ధన్యవాదాలు అమిర్ ఖాన్ సార్.. జీవితాంతం దాన్ని గుర్తుంచుకుంటాను అని పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈయన విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంలో నటిస్తున్నారు. Life is unpredictable as i always say :) Thankyou for your wonderful words #aamirkhan sir . Will cherish it for life ❤️ pic.twitter.com/HPjpJLvDN2— Pradeep Ranganathan (@pradeeponelife) February 23, 2025 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న డ్రాగన్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
లవ్ టుడే మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యంగ్ హీరో ప్రదీప్రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Movie)తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు 'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కాయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల మార్క్ను దాటేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేశారు హీరో ప్రదీప్ రంగనాథన్. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్గా రూ.50.22 కోట్ల వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.డ్రాగన్ మూవీ కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్గా మారిపోయి బీటెక్లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. #Dragon Opening pic.twitter.com/BJyckrx1FA— Pradeep Ranganathan (@pradeeponelife) February 24, 2025 -
మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి టాలీవుడ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం అర్జున ఫల్గుణ. ఈ మూవీ 2021 డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.అయితే తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈనెల 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో విడుదలైన దాదాపు మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి తీసుకొచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో నరేశ్, సుబ్బరాజు, మహేశ్, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ సంగీతం అందించాడు. A heist, a twist, and a whole lot of laughs! 🎭💰 Don't miss #ArjunaPhalguna, now streaming on @PrimeVideoIN! 🤩#ArjunaPhalgunaOnPrime ▶️ https://t.co/zqJeq98baa@sreevishnuoffl @Actor_Amritha @DirTejaMarni @MatineeEnt #TeluguFilmNagar pic.twitter.com/wUFnuSfpD1— Telugu FilmNagar (@telugufilmnagar) February 24, 2025 అర్జున ఫల్గుణ అసలు కథేంటంటే..?డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటున్న ఐదుగురు స్నేహితులు అర్జున్(శ్రీవిష్ణు), రాంబాబు(రాజ్ కుమార్), తాడి(‘రంగస్థలం’మహేశ్), ఆస్కార్(చైతన్య గరికిపాటి), శ్రావణి(అమృత అయ్యర్)ల చూట్టూ ‘అర్జున ఫల్గుణ’కథ సాగుతుంది. వీరంతా చిన్నప్పటి నుంచి బెస్ట్ఫ్రెండ్స్. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే వ్యక్తిత్వం వాళ్లది. వీరంతా ఊర్లోనే సోడా సెంటర్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. దాని కోసం బ్యాంకు లోన్కు ట్రై చేస్తారు. రూ. 50 వేలు ఇస్తే లోన్ వస్తుందని చెప్పడంతో.. డబ్బుకోసం వీళ్లు ప్రయత్నాలు చేస్తారు. ఈక్రమంలో ఈ ఐదుగురు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడతారు. అక్కడి నుంచి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? సరదాగా ఊర్లో తిరిగే వీళ్లు గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కేసు నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ. -
భార్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన రాకింగ్ రాకేశ్.. పోస్ట్ వైరల్
గతేడాది కేశవ చంద్రా రమావత్ (కేసీఆర్) మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్. ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవితం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేశ్. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సుజాతను పెళ్లాడిన రాకేశ్..అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే యాంకర్ జోర్దార్ సుజాతను ఆయన పెళ్లాడారు. 2023 ఫిబ్రవరి 24న తిరుమలలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. జోర్దార్ సుజాత టాలీవుడ్ రియాలిటీ షో బిగ్బాస్ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్బాస్తో గుర్తింపు వచ్చిన తర్వాత జోర్దార్ సుజాత ఒక కామెడీ షోలో నటించింది. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్తో జంటగా ఆమె కొన్ని ప్రొగ్రామ్స్ చేసింది. అలా వారి ప్రేమకు తొలి అడుగులు పడ్డాయి.పెళ్లి రోజు శుభాకాంక్షలు..అయితే తాజాగా ఈ టాలీవుడ్ బుల్లితెర జంట తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు రాకింగ్ రాకేశ్. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా వారి పెళ్లి ఫోటోను పంచుకున్నారు.ట్విటర్లో రాకింగ్ రాకేశ్ రాస్తూ..'పెళ్లిరోజు ఓ మధుర జ్ఞాపకం.. ప్రేమగా మొదలై.. బంధంగా ముడిపడి.. బాధ్యతగా జీవితంలో సగభాగంగా అన్ని తనై నడిపిస్తూ మా ఇంటి మహాలక్ష్మికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.. మీ అందరి ఆశీస్సులతో మా పెళ్లి బంధానికి రెండు సంవత్సరాలు' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాతకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. గతేడాది అక్టోబర్లో ఈ జంటకు కుమర్తె జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లిరోజు ఓ మధుర జ్ఞాపకం❤️ప్రేమగా మొదలై బంధంగా ముడిపడి బాధ్యతగా జీవితంలో సగభాగంగా అన్ని తనై నడిపిస్తూ మా ఇంటి మహాలక్ష్మికి మా పెళ్లి బంధానికి రెండు సంవత్సరాలు శుభాకాంక్షలు మీ అందరి ఆశీస్సులతో🙏🌹 pic.twitter.com/Lfs9N1kWZz— RockingRakesh (@RockingrakeshJB) February 24, 2025 -
భారత్-పాక్ మ్యాచ్లో టాలీవుడ్ సినీతారలు.. అంబటి రాయుడు వివాదాస్పద కామెంట్స్!
భారత్- పాక్ మ్యాచ్ అంటే చాలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ప్రతి బాల్కు నరాలు తెగే ఉత్కంఠగా ఉంటుంది. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ప్రపంచ క్రికెట్లో పాక్- ఇండియా పోరు మాత్రమే. ఇలాంటి మ్యాచ్ను లైవ్లో చూడాలని ఎవరూ కోరుకోరు. ఆ అదృష్టం రావాలే కానీ ఎంతైనా సరే టికెట్ కొని మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి ప్రాముఖ్యత ఉన్న ఇలాంటి మ్యాచ్కు మన టాలీవుడ్ సినీతారలు పెద్దఎత్తున హాజరయ్యారు. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్ కూడా ఉన్నారు.అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరాలు మన సినీ తారలను హైలెట్ చేస్తూ టీవీల్లో చూపించారు. మన డైరెక్టర్ సుకుమార్ను సైతం కెమెరాల్లో చాలాసేపు చూపించారు. తెలుగు సినిమా ప్రైడ్ డైరెక్టర్ సుకుమార్ అని కామెంట్రీ చెబుతున్న వ్యక్తి అన్నాడు. ఇలాంటి మ్యాచ్లు సప్లై తక్కువ.. డిమాండ్ ఎక్కువ అని వ్యాఖ్యనించాడు.కానీ ఇదే సమయంలో అక్కడే తెలుగు కామెంట్రీ బాక్స్లో ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం వివాదాస్పద రీతిలో మాట్లాడారు. సప్లై కాదు.. ఇలాంటి మ్యాచ్ అంటే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా.. ఇతర మ్యాచ్ల్లో కనిపించడం చాలా తక్కువ.. పబ్లిసిటీ స్టంట్ అది..' అంటూ అంబటి రాయుడు మాట్లాడారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అంబటి రాయుడిపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడిపై మండిపడుతున్నారు. మన తెలుగు సినిమా గొప్ప దర్శకుడిని అలా ఎలా అంటారని అంబటిని ప్రశ్నిస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్ అంటూ హేళన చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. Chiranjeevi , Sukumar cricket match ki vellatam oka Publicity Stunt :- Ambati Rayudu @KChiruTweets @SukumarWritings pic.twitter.com/ztbCgHBJES— Songs Lover (@Songs_Lover_) February 23, 2025 -
టాలీవుడ్ అందాల తారలు.. తళుక్కున మెరిశారు!
సినిమాలో కథానాయకలుగా రాణించడం అంత సులభం కాదు. అందం ఉండాలి, ప్రతిభ ఉండాలి. అంతకు మించి అవకాశాలు రావాలి. ఇవన్నీ కలగలిపిన తారలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోతారు. అలాంటి వారిలో నటి మీనా, రోజా, రంభ వంటి 1990 క్రేజీ కథానాయకలుగా గుర్తింపు పొందారు. నటి మీనా బాల నటిగా రంగప్రవేశం చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో కథానాయకిగా అగ్రస్ధానంలో రాణించారు. ఇక నటి రోజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించిన తార.అదే విధంగా అందాలకు చిరునామాగా మారిన నటి రంభ. వీరందరూ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి పేరు గడించిన బ్యూటీలే. కాగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తరుణంలోనే నటి మీనా విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలా ఆనందమయంగా సాగుతున్న మీనా జీవితంతో విధి ఆడుకుంది. ఆమె భర్త అనారోగ్యం కారణంగా కన్ను మూశారు. ఆ సంఘటన నుంచి బయట పడటానికి నటి మీనా చాలా కాలం పట్టింది.కాగా ఇటీవలే మళ్లీ బయట ప్రపంచంలోకి వస్తున్న మీనా ఆదివారం సాయంత్రం చెన్నైలో నటి రోజా, రంభ, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి వంటి స్నేహితురాళ్లను కలిశారు. వీరితో పాటు డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, నటుడు భరత్ తదితరులు ఉన్నారు. వీరంతా మాటా ఆట పాటలతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలను నటి మీనా తన ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేశారు. అందులో ప్రేమ, ఆదరణ, గత మధుర జ్ఞాపకాలతో ఒక అందమైన సాయం సమయం అని పేర్కొన్నారు. కాగా ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
కోర మీసాలతో...
‘‘కోర కోర మీసాలతో.. కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె చెనుకులతో..’ అంటూ మొదలవుతుంది ‘కొల్లగొట్టినాదిరో..’ పాట లిరికల్ వీడియో. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu): స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమాలోనిది ఈ పాట. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’.నిధీ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాబీ డియోల్, నాజర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి పార్టు ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మార్చి 28న రిలీజ్ కానుంది.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘కొల్లగొట్టినాదిరో..’ పాట లిరికల్ వీడియోను సోమవారం రిలీజ్ చేశారు మేకర్స్. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవీ కన్నన్, సుదీప్ కుమార్, అరుణ మేరీ పాడారు. ఈ సాంగ్కి బృందా, గణేష్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. -
డబుల్ మజాకా ఉంటుంది: రాజేష్ దండా
‘‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత త్రినాథరావుగారి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మజాకా’. ఈ సినిమాని ఆయన బాగా తీశారు. ఆయనతో మరో సినిమా చేయాలని ఉంది. ‘మజాకా’ కి సీక్వెల్ చేయాలనే ఆలోచనతో ఈ మూవీ చివరలో ‘డబుల్ మజాకా’ అనే టైటిల్ కూడా వేస్తున్నాం’’ అని నిర్మాత రాజేష్ దండా తెలిపారు. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీలో అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా నిర్మించారు.బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం రేపు(బుధవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజేష్ దండా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘త్రినాథరావు, రైటర్ ప్రసన్నగారి శైలిలో ఉండే మాస్ ఎంటర్టైనర్ ‘మజాకా’. భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం కూడా ఉంటుంది. మా మూవీ రిలీజ్ డేట్కి తక్కువ సమయం ఉండటంతో ప్రమోషన్స్ కొత్తగా ΄్లాన్ చేయాలనుకున్నప్పుడు అనిల్ సుంకరగారు లైవ్ షూటింగ్ ఐడియా చెప్పారు.ఆయనతో నా భాగస్వామ్యం కొనసాగుతుంది. వచ్చే ఏడాది మా కాంబినేషన్లో ఓ స్టార్ హీరోతో బిగ్ మూవీ చేయబోతున్నాం. ‘అల్లరి’ నరేశ్, సందీప్ కిషన్లతో నా అనుబంధం ప్రత్యేకమైనది.. వారితో మళ్లీ సినిమాలు చేస్తాను. ఇకపై వినోదాత్మక సినిమాలే చేస్తాను. ‘సామజవరగమన’ సినిమాకి సీక్వెల్ ఉంటుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో ఓ సినిమా, హీరోయిన్ సంయుక్తతో ఓ చిత్రం చేస్తున్నాను’’ అని చెప్పారు. -
ఇంగ్లిష్లో టాక్సిక్
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో యశ్(yash). ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్(toxic): ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని కన్నడతో పాటు గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇంగ్లిష్లోనూ చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ– ‘‘విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యంలో రాబోతున్న ‘టాక్సిక్’ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాదించేలా రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇంగ్లిష్లో చిత్రీకరిస్తున్న మొదటి భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లోకి ఎక్కింది. మా సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ అవుతుంది’’ అని వెంకట్ కె.నారాయణ తెలిపారు. -
భలే చాన్స్?
‘వేర్ ఈజ్ ద పార్టీ.. బాసూ వేర్ ఈజ్ ద పార్టీ..’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela). చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని ‘వేర్ ఈజ్ ద పార్టీ..’ అంటూ సాగే ప్రత్యేక పాటలో ఆడిపాడారామె. ఆ తర్వాత ‘ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో అలరించారు.ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్రంలో ఊర్వశి ఓ కీలక పాత్ర చేయడంతో పాటు ‘దిబిడి దిబిడి’ పాటలో తనదైన డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘ఎన్టీఆర్ నీల్’(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటించే భలే చాన్స్ని ఊర్వశీ రౌతేలా అందుకున్నారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఓ కీలక పాత్ర పోషించనున్నారట. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తర్వాతి షెడ్యూల్లో ఆమె పాల్గొంటారని టాక్. -
చరిత్రలో మరిచిపోలేని జలియన్ వాలాబాగ్ ఉదంతం.. ట్రైలర్ చూశారా?
భారతీయుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని దారుణ ఉదంతం జలియాన్ వాలాబాగ్ ఊచకోత. అప్పటి బ్రిటీశ్ పరిపాలన కాలంలో 1919 ఏప్రిల్ 13న ఈ మారణహోమం జరిగింది. ఈ అత్యంత పాశవిక ఘటన ఆధారంగా వెబ్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ది వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ పేరుతో రామ్ మాద్వానీ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు.తారుక్ రైనా, నిఖితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ వచ్చేనెల మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. యధార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Find out the conspiracy behind the Jallianwala Bagh massacre, as a nation awakens. Creator | Director Ram Madhvani brings to you a show inspired by true events #TheWakingOfANation, Streaming on 7th March on Sony LIV pic.twitter.com/Q5qM8ZN8Cn— Sony LIV (@SonyLIV) February 24, 2025 -
'26 ఏళ్లుగా ఈ ట్రెండ్ను అధిగమిస్తున్నాం'.. భార్యకు అజయ్ దేవగణ్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. తాజాగా ఈ జంట తమ 26వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు అజయ్ దేవగణ్ మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో దిగిన పాత ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '26 ఏళ్లుగా ఈ ట్రెండ్ను అధిగమిస్తున్నాం.. మనిద్దరికీ హ్యాపీ యానివర్సరీ' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు స్టార్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మొదట వీరిద్దరు 1995లో వచ్చిన హల్చల్ అనే మూవీ సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో జంటగా కనిపించారు. అదేక్రమంలోనే అజయ్, కాజోల్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 1999లో ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు ఇష్క్, ప్యార్ తో హోనా హి థా, యు మే ఔర్ హమ్, తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్ లాంచి చిత్రాలలో జంటగా నటించారు. వీరిద్దరి నైసా దేవగణ్, యుగ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే కాజోల్ చివరిసారిగా దో పట్టిలో కనిపించింది. మరోవైపు అజయ్ దేవగణ్ చివరిసారిగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం ఎగైన్లో కనిపించారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్.. ఆర్జీవీ శారీ హీరోయిన్ లేటేస్ట్ పోజులు!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్..బార్బీ లుక్లో మెరిసిపోతున్న డార్లింగ్ బ్యూటీ నభా నటేశ్..శ్వేతబసు ప్రసాద్ లేటేస్ట్ ఫోటోషూట్ పిక్స్...బ్లాక్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ హోయలు..ఎలిఫెంట్స్తో చిల్ అవుతోన్న సురేఖవాణి, కూతురు సుప్రీత..ఆర్జీవీ శారీ హీరోయిన్ లేటేస్ట్ లుక్.. View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
ఆర్య హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్.. తెలుగు టీజర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ఎక్స్'. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. గూఢచారుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.భారతీయ గూఢచర్య వీరుల జీవితాల ఆధారంగా ఈ కథను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. దేశాన్ని కాపాడటం మన పని మాత్రమే కాదు.. అది మన బాధ్యత.. అంటూ అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. శత్రువుల నుంచి మనదేశాన్ని కాపాడే నేపథ్యంలో ఈ కథను రూపొందించారు. ప్రధానంగా ఓ న్యూక్లియర్ డివైజ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్లోనే తెలుస్తోంది. కాగా.. ఈ స్పై థ్రిల్లర్ సినిమాను వినీత్ జైన్, ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్, అనఘా, రైజా విల్సన్, అతుల్య రవి, జయప్రకాష్, కాళి వెంకట్ కీలక పాత్రల్లో నటించారు. -
హీరోయిన్పై అనుచిత వ్యాఖ్యలు.. వారంపాటు అమ్మ బాధలోనే: డైరెక్టర్
ధమాకా సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadh Rao Nakkina). తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న మూవీ మజాకా (Mazaka Movie). సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ఈవెంట్స్లో త్రినాధ రావు మన్మథుడు హీరోయిన్ అన్షు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో అతడు క్షమాపణలు చెప్పాడు.ఎలాంటి శిక్ష వేసినా ఓకేతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి త్రినాధరావు మాట్లాడుతూ.. నేను కావాలని అన్షుపై అలాంటి కామెంట్స్ చేయలేదు. ఏదో సరదా చేద్దామనుకోబోయి అనుకోకుండా నోరు జారాను. తప్పు సరిదిద్దుకునేలోపే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. తర్వాత అందరికీ క్షమాపణలు చెప్పాను. నేను దురుద్దేశంతో అలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. అప్పటికీ నోరు జారి తప్పు చేశానని ఫీలయ్యాను. అందుకే అన్షుతో పాటు అందరికీ సారీ చెప్పాను. అప్పటికే అన్షుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తనకు ఫోన్ చేసి విషయం మొత్తాన్ని వివరించా. తను అర్థం చేసుకుంది. అమ్మను చూసి భయమేసిందిఈ వివాదం జరిగినప్పుడు నాకంటే మా అమ్మ ఎక్కువ బాధపడింది. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నువ్వు ఎందుకు నాన్నా నోరు జారావు? అందరూ ఎలా విమర్శిస్తున్నారో చూశావా? ఒక్క పదం నిన్ను దుర్మార్గుడిని చేసింది. నువ్వు నిజంగా దుర్మార్గుడివా? కాదని ఎంతమంది దగ్గరకు వెళ్లి చెప్పగలం? ఇకమీదట స్టేజీ ఎక్కినప్పుడు ఆచితూచి మాట్లాడమని చెప్పింది. అమ్మ వారం రోజులు డీలా పడిపోయింది. తననలా చూసి భయమేసింది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా అన్నాడు త్రినాధరావు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
అను ఇమ్మాన్యుయేల్ సైకలాజికల్ థ్రిల్లర్.. టీజర్ గ్లింప్స్ చూశారా?
అను ఇమ్మాన్యుయేల్, శివకందుకూరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బూమరాంగ్ (Boomerang Movie). ఈ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బూమరాంగ్ టీజర్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ చిత్రాన్ని ఓ సందేశాత్మక సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆండ్రూ బాబు దర్శకత్వం వహించారు. కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ సినిమా తీసినట్లు డైరెక్టర్ వెల్లడించారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రోడక్షన్ బ్యానర్పై లండన్ గణేశ్, డా. ప్రవీణ్ రెడ్డి ఊట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
అలాంటి మాంసం కూడా తిన్నా.. రుచికరంగా..: టాలీవుడ్ విలన్
ఒకప్పుడు విలన్లను చూస్తేనే భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్లు కూడా మంచి ఎత్తూపొడుగూ ఉంటున్నారు. హీరోలతో పోటీపడేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. ఫిట్నెస్తో అబ్బురపరుస్తున్నారు. ఈ జాబితాలో నటుడు ఆదిత్య మీనన్ (Adithya Menon) ఉన్నాడు. మిర్చి, బిల్లా, పుష్ప.. ఇలా ఎన్నో సినిమాల్లో విలనిజం పండించిన ఆయన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.హీరోగా ఛాన్సులు..ఆదిత్య మాట్లాడుతూ.. హీరోలకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే హీరోగా అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాను. వివిధ రకాల పాత్రలు చేయడం ఇష్టం. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాను. కెరీర్ ప్రారంభంలో వచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ పోయాను. తర్వాత నాకు ఏవి సెట్టవుతాయి? ఏవి సెట్టవవు? అని ఆలోచించి సెలక్టివ్గా సినిమాలు ఎంచుకుంటున్నాను.(చదవండి: రూ.50 లక్షల ప్రైజ్మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్బాస్ విజేత)చిత్రవిచిత్ర దేశాలకు వెళ్తుంటా.. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దేశవిదేశాలు తిరుగుతూ ఉంటాను. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా భిన్నమైన ప్లేసెస్కు వెళ్తుంటాను. అక్కడి ప్రజల గురించి, అలవాట్ల గురించి తెలుసుకుంటాను. వారి వంటకాలు ట్రై చేస్తాను. అక్కడ గుర్రపు మాంసం తిన్నాను. ఇదే కాదు పాము మాంసం, కప్ప కాళ్లు, మొసలి మాంసం తిన్నాను. పాము తోలు తీసి, ముక్కలు చేసి వండిస్తారు, బాగుంటుంది. నేను నాస్తికుడిని, భగవంతుడు ఉన్నాడని నమ్మను అని చెప్పుకొచ్చాడు.సినిమాఆదిత్య మీనన్.. తెలుగులో బిల్లా, సింహా, అధినాయకుడు, కృష్ణం వందే జగద్గురుం, ఈగ, బాద్షా, బలుపు, మిర్చి, పవర్, లయన్, పండగ చేస్కో, రుద్రమదేవి, అమర్ అక్బర్ ఆంటోని, కార్తికేయ 2, పుష్ప 2.. ఇలా పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈయన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేశాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?
కొన్ని కథలు వినోదాన్ని పంచితే మరికొన్ని హృదయాలను బరువెక్కిస్తాయి. కొన్ని మాత్రమే మన రక్తం మరిగేలా చేస్తూనే కన్నీళ్ల వరద పారిస్తాయి. అలాంటి సినిమాయే ఛావా (Chhaava Movie). బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీగా నటించాడు. ఆయన భార్య ఏసుబాయిగా హీరోయిన్ రష్మిక మందన్నా యాక్ట్ చేసింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.ద్రోహులుగా చిత్రీకరించారుఇక ఈ సినిమాలో తన పూర్వీకులను తప్పుగా చూపించారంటూ మరాఠా యోధులు గానోజీ, కాన్హోజి షిర్కే వారసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను ఉటంకిస్తూ తమ పూర్వీకులను శంభాజీ మహారాజ్కు ద్రోహం చేసినవారిగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఆయా సన్నివేశాల ద్వారా తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకుగానూ చిత్రయూనిట్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)కు నోటీసులు పంపించారు.అసౌకర్యానికి గురైతే క్షమించండిఈ వివాదంపై డైరెక్టర్ లక్ష్మణ్ స్పందిస్తూ ఛావాలో గానోజి, కన్హోజీల పేర్లు మాత్రమే ఉపయోగించామన్నాడు. వారి ఇంటిపేరు, ఏ ప్రాంతానికి చెందినవారు వంటి వివరాలను వెల్లడించలేదన్నాడు. షిర్కే కుటుంబసభ్యుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. ఛావా వల్ల వారు అసౌకర్యానికి గురైతే తనను క్షమించాల్సిందిగా కోరాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
ఎలాన్ మస్క్ను సూటిగా ప్రశ్నించిన అనుపమ్ ఖేర్.. అసలేం జరిగిందంటే?
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న నటుడు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారాయన. ఇటీవలే ప్రభాస్ మూవీలోనూ ఛాన్స్ కొట్టేశాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించబోయే చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా అనుపమ్ ఖేర్కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎక్స్ ఖాతా కొంతసేపు లాక్ అయింది. ఈ విషయంపై ఏకంగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ను ఆయన ప్రశ్నించారు. దీనిపై ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన అకౌంట్ లాక్ అయినట్లు వచ్చిన స్క్రీన్షాట్ను కూడా షేర్ చేశారు. మీ అకౌంట్ లాకైంది. ఈ ప్లాట్ఫామ్ వేదికగా మీరు పోస్ట్ చేసిన కంటెంట్ విషయమై డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం కింద ఎక్స్కు ఒక ఫిర్యాదు వచ్చిందని అందులో రాసి ఉంది.దీనిపై అనుపమ్ తన ట్వీట్లో రాస్తూ.. 'నా ఖాతాను పునరుద్దరించినందుకు థ్యాంక్స్. కానీ నా అకౌంట్ లాక్ కావడం చూసి ఆశ్చర్యపోయాను. నేను 2007 సెప్టెంబర్ నుంచి ఈ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో ఉపయోగిస్తున్నా. నాకు ట్విటర్ నియమాలు, కాపీరైట్స్ గురించి బాగా తెలుసు. అందువల్ల నాకు అసంతృప్తిగా అనిపించింది. నేను చేసిన ఏ పోస్ట్ మీ నిబంధనలను ఉల్లంఘించిందో తెలుసుకోవచ్చా? అంటూ' పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Dear X! Even though my account has been restored I was surprised to see it locked. I have been on this platform since September 2007. Have always been mindful of rules of #X (formerly twitter). Or for that matter any social media copyright rules. So found it a little absurd.… pic.twitter.com/tNmhc30vtP— Anupam Kher (@AnupamPKher) February 24, 2025 -
తండేల్ సినిమా సక్సెస్ పార్టీ (ఫోటోలు)
-
ఓరగా చూస్తూ దివ్య భారతి.. నవ్వుతూ అనన్య మాయ!
క్రికెట్ స్టేడియంలోనూ ఊర్వశి రౌతేలా దబిడి దిబిడి డ్యాన్స్నవ్వుతో మాయ చేసేస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరినాభి అందాలతో కిక్ ఎక్కించేలా నభా నటేశ్నడుము చూపిస్తూ మెల్ట్ చేస్తున్న తమిళ బ్యూటీ దివ్య భారతిచీరలో మెరిసిపోతున్న హాట్ యాంకర్ అనసూయదృశ్యం పాప ఎస్తర్ అనిల్ కేక పుట్టించే లుక్బుట్టబొమ్మ పూజా హెగ్డే మార్నింగ్ వైబ్స్.. అలా నవ్వుతూ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Esther Anil (@_estheranil) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sharvari 🐯 (@sharvari) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Pragya Nagra (@pragyanagra) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Saiyami Kher (@saiyami) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) -
కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో..: బాలా
నాకు హానికరమైన ఔషధాలు ఇచ్చి నా ఆరోగ్యం చెడగొట్టారు అంటున్నాడు మలయాళ నటుడు బాలా (Actor Bala). రెండేళ్ల క్రితం ఆయనకు కాలేయ మార్పిడి జరిగింది. ఆ సమయంలో తను కోలుకోకుండా చేయాలన్న ప్రయత్నాలు జరిగాయంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలా మాట్లాడుతూ.. నాకు ఇప్పటివరకు రెండు సర్జరీలు జరిగాయి. రెండేళ్ల క్రితం నేను చనిపోయానని వదంతులు పుట్టుకొచ్చాయి. కానీ, చూడండి నేను మీ ముందు ఇలా ఆరోగ్యంగా నిలబడ్డాను.తనెవరో చెప్పనుఅయితే సర్జరీ జరిగాక గతేడాది నాకు మంచి మెడిసిన్ ఇవ్వలేదు. దానికి బదులుగా నా ఆరోగ్యాన్ని దిగజార్చే ఔషధాలు ఇచ్చారు. రాంగ్ మెడిసిన్ ఎవరిచ్చారన్నది నేను చెప్పను. అయితే ఆ విషయం తెలియక గుడ్డిగా అవే ఉపయోగించాను. తీవ్ర అనారోగ్యంతో పదిరోజులపాటు ఆస్పత్రిపాలయ్యాను. అప్పుడు నా బంధువైన కోకిల ఒక తల్లిలా నాకు సేవ చేసింది. అప్పుడే తను నన్నెంత ప్రేమిస్తుందో అర్థమైంది.చనిపోయానని అనుకున్నారునేను ఐసీయూలో ఉన్నప్పుడు మరణించానన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో నాకు వెంటిలేటర్ తీసేయాలనుకున్నారు. అంతర్గత అవయవాలు పని చేయడం లేదన్నారు. కిడ్నీ, లివర్, బ్రెయిన్.. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పని చేయడం ఆగిపోతున్నాయి. అప్పుడు మా అమ్మ చెన్నైలో ఉంది. నా చావు ఖాయమని అర్థమై పోస్ట్మార్టమ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాకోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థించారు. ముఖ్యంగా నా సినిమాలు చూసిన చిన్నపిల్లలు నేను బతకాలని బలంగా కోరుకున్నారు. అలాగే 25 ఏళ్లుగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను. అరగంటలో అద్భుతంవీటన్నిటి ఫలితమో ఏమో కానీ.. అరగంటలో అద్భుతం జరిగింది. నాలో ప్రాణం తిరిగి వచ్చింది. నన్ను ఎంతో ప్రేమించిన కోకిలతో నా పెళ్లి జరిగి మూడు నెలలవుతోంది. ఈ మధ్యకాలంలో కూడా ఒకరికి హార్ట్ సర్జరీ చేయించాను, స్కూల్ కట్టించాను. కోకిల స్థానంలో మరొకరుంటే కచ్చితంగా నాపై ఫిర్యాదు చేసేవారు. కానీ కోకిలకు నా లక్ష్యం ఏంటో తెలుసు. రేపు మాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇదే సేవా మార్గంలో వెళ్లాలని కోరుకుంటాను అని పేర్కొన్నాడు.చిత్రహింసలు పెట్టాడన్న మూడో మాజీ భార్యకాగా మలయాళ నటుడు బాలా ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండో మాజీ భార్య అమృత గతేడాది అతడిపై వేధింపుల కేసు పెట్టింది. మూడో మాజీ భార్య ఎలిజబెత్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా బాలా తనను చిత్రహింసలు పెట్టాడన్న విషయాన్ని వెల్లడించింది. బాలాకు విషపూరితమైన మెడిసిన్ ఇచ్చారన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ.. అది నిజమని నిరూపించమని సవాల్ విసిరింది. ఈ క్రమంలోనే బాలా పై కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.చదవండి: అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్ లాక్కున్న హీరో -
ప్రభాస్ కి కండీషన్స్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా?
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. దాదాపు అందరూ హీరో ఒకటి తర్వాత ఒకటి అంటూ సినిమాలు చేస్తుంటే డార్లింగ్ హీరో మాత్రం ఒకేసారి రెండు మూడు మూవీస్ చేస్తున్నాడు. అయినా సరే టైమ్ సరిపోవట్లేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కొన్ని స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టాడట!బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ వరస సినిమాలు చేస్తున్నాడు. అలా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాల్ని రిలీజ్ చేశాడు. దేశవ్యాప్తంగా వేలకోట్ల వసూళ్లు కొల్లగొట్టాడు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)మరోవైపు 'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో 'స్పిరిట్' చేయాలి. లెక్క ప్రకారం జనవరి నుంచే షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ ప్రభాస్ షూటింగ్స్ వల్ల స్పిరిట్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ మొదలుపెడితే మరొకటి చేయకూడదని సందీప్.. ప్రభాస్ కి చెప్పాడట.దీంతో చేతిలో ఉన్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాల్ని పూర్తి చేసి.. మే నెల నుంచి ప్రభాస్ స్పిరిట్ సెట్స్ పైకి వస్తాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తయిందని.. ఒక్కసారి ప్రభాస్ వస్తే ఆపకుండా షూటింగ్ చేసి పూర్తి చేస్తారని టాక్. ఈ మూవీలో ప్రభాస్.. పోలీస్ గా కనిపించబోతున్నాడని ఇదివరకే సందీప్ చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
భారత్- పాక్ మ్యాచ్.. ఊర్వశి రౌతేలా క్రేజీ రికార్డ్!
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఐదేళ్ల కుర్రాడి నుంచి డెబ్బై ఏళ్ల ముసలోళ్లు కూడా వదిలిపెట్టరు. మ్యాచ్ ఎప్పుడు మొదలతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రపంచ క్రికెట్లోనే అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇండియా- పాకిస్తాన్ పోరు మాత్రమే. ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్లు లేనందువల్ల అప్పుడప్పుడు వచ్చే ఐసీసీ ఈవెంట్స్లో మాత్రమే తలపడుతున్నారు దాయాది జట్లు. మరి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చే ఈ మ్యాచ్ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు క్రీడా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక మ్యాచ్ లైవ్లో చూసేవారికి ఆ థ్రిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ను మరింత స్పెషల్గా మార్చుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఏంటా స్పెషల్? అనేది తెలియాలంటే మీరు లుక్కేసేయండి మరి.తాజాగా ఆదివారం దుబాయ్లో జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. ఇటీవల డాకు మహారాజ్తో ఫ్యాన్స్ను అలరించిన ముద్దుగుమ్మ సడన్గా మ్యాచ్లో దర్శనమిచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా డైరెక్టర్ సుకుమార్, పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ మ్యాచ్ లైవ్లో అభిమానులు వీక్షించారు.అయితే చాలా మంది సెలబ్రిటీలు ఈ మ్యాచ్కు హాజరైనప్పటికీ అందరి కళ్లు ఊర్వశి రౌతేలాపైనే ఉన్నాయి. ఈ బాలీవుడ్ భామ దుబాయ్లో జరిగిన మ్యాచ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. టీమిండియా- పాక్ మ్యాచ్లో ఏకంగా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫిల్మ్ ఫేర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తొలి సెలబ్రిటీ అంటూ..భారత్- పాక్ మ్యాచ్లో పుట్టినరోజు జరుపుకున్న తొలి సెలబ్రిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో రికార్డ్ సృష్టిస్తే.. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఊర్వశి తొలిసారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని అంటున్నారు. మరికొందరైతే ఊర్వశి రౌతేలాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఖరికి ఫిల్మ్ ఫేర్ వాళ్లు కూడా ఊర్వశిపై జోకులు వేస్తున్నారని మరికొందరు రాసుకొచ్చారు. కొందరు రిషబ్ పంత్ పేరును కూడా కామెంట్స్లో ప్రస్తావిస్తున్నారు. అయితే ఆమెపై ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ.. చివరికీ బాలీవుడ్ భామ మాత్రం ప్రతిష్టాత్మక మ్యాచ్లో అందర దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఇటీవల టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఊర్వశి రౌతేలా బర్త్ డే ఈనెల 25న కాగా.. ముందుగానే స్టేడియంలో సెలబ్రేట్ చేసుకుని హైలెట్గా నిలిచింది. #ViratKohli broke several records during the India vs Pakistan match yesterday but #UrvashiRautela became the first actress to celebrate her birthday during an #IndvsPak cricket match. 🤣#Trending #indvspak #indiavspakistan #iccchampionstrophy pic.twitter.com/OLjHILtvgh— Filmfare (@filmfare) February 24, 2025 -
నెలలోపే ఓటీటీలోకి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. రీసెంట్ టైంలో ఇతడి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. అలా ఈ నెల తొలివారంలో విడుదలైన మూవీ 'విడామయూర్చి'. తెలుగులో దీన్ని పట్టుదల పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పుడు దీని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది.ఫిబ్రవరి 6న తెలుగు-తమిళంలో రిలీజైన ఈ చిత్రానికి తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ ఓకే అనుకున్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ లేకపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ కలెక్షన్స్ రూ.100 కోట్లకు పైనే వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్.. నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 3 అంటే వచ్చే సోమవారం నుంచే ఇది ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ప్రకటించారు.సినిమా కథ విషయానికొస్తే.. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్బైజాన్లో ఉంటారు. మనస్పర్థల కారణంగా విడిపోదామని నిర్ణయం తీసుకుంటారు. విడిపోయే ముందు భార్యని.. చివరగా రోడ్ ట్రిప్ వేద్దామని అర్జున్ అడుగుతాడు. దీంతో ఆమె ఒప్పుకొంటుంది. ఆ ప్రయాణంలో ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)Muyarchi thiruvinai aakum. Vidaamuyarchi ulagai vellum 💪🔥Watch Vidaamuyarchi on Netflix, out 3 March in Tamil, Hindi, Telugu, Kannada & Malayalam!#VidaamuyarchiOnNetflix pic.twitter.com/21OiHpF8AB— Netflix India South (@Netflix_INSouth) February 24, 2025 -
అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్ లాక్కున్న హీరో
మార్కో సినిమాతో బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించాడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఈ మూవీలో యాక్షన్ హీరోగా రక్తపాతాన్ని పారించిన ఆయన నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన గెట్ సెట్ బేబీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఓ మల్టీప్లెక్స్కు వెళ్లాడు హీరో. అతడిని చూసిన ఓ అభిమాని హీరోకు దగ్గరగా వెళ్లాడు. ఉన్ని ముకుందన్ నడుస్తూ ఉంటే అతడిని వెంబడిస్తూ ఫోన్లో వీడియో చిత్రీకరించాడు.ఫోన్ లాక్కున్న హీరోఅది చూసి సహనం నశించిన హీరో సదరు అభిమాని దగ్గరి నుంచి ఫోన్ లాక్కున్నాడు. దాన్ని జేబులో పెట్టుకుని కోపంతో అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అభిమాని బతిమాలడంతో ఫోన్ వెనక్కిచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇంకా నయం.. ఫోన్ తీసుకెళ్లిపోలేదులేమీరు హీరోగా ఎదిగే సమయంలో ఎవరైనా మీ అభిమాని అని మీ దగ్గరకు వస్తే సంతోషపడతారు. ఇలా స్టార్డమ్ వచ్చాక మాత్రం ఇరిటేట్ అవుతుంటారు అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. మరికొందరేమో.. హీరోకు మరీ అంత దగ్గరగా వెళ్లి వీడియో షూట్ చేయాలా? అలా చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది.. ఫోన్ను అలాగే తీసుకెళ్లకుండా తిరిగిచ్చేసినందుకు సంతోషించండి. అని కామెంట్లు చేస్తున్నారు. Marco Mode of Unni Mukundan in Real Time.Fan should not take advantage of stars like this.#UnniMukundan#Marco#GetSetBaby pic.twitter.com/mq2AOxLkq2— Deepak Kaliamurthy (@Dheeptweet) February 23, 2025చదవండి: రూ.50 లక్షల ప్రైజ్మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్బాస్ విజేత -
ఓటీటీలోకి వచ్చేస్తున్న డిజాస్టర్ సినిమా.. నెలలోపే?
రీసెంట్ టైంలో ఓ మాదిరి అంచనాలతో రిలీజై డిజాస్టర్ అనిపించుకున్న సినిమా లైలా. విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. వైవిధ్యం కోసం అమ్మాయి గెటప్ కూడా వేశాడు. కానీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేయబోతుందట.(ఇదీ చదవండి: సుకుమార్ చేయి వదలని ఐటమ్ బ్యూటీ.. వీడియో వైరల్)ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ తదితర చిత్రాలతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఈ మధ్య కాలంలో మాత్రం ప్రతి సినిమాతో నిరాశపరుస్తున్నాడు. గతేడాది రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి, మెకానిక్ రాకీ చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. 'లైలా' అయినా సరే హిట్ అవుతుందేమో అనుకుంటే ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది.వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో 'లైలా' రిలీజైంది. ఉదయం తొలి ఆట నుంచి టాక్ తేడా కొట్టేసింది. దీంతో రెండో రోజు నుంచి ఈ సినిమాకు వెళ్లే వారే కరువయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైం కంటే కాస్త ముందుకొచ్చిందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)లైలా సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. లెక్క ప్రకారం మార్చి 2వ వారంలో స్ట్రీమింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు తొలి వారంలోనే ఓటీటీలో రిలీజ్ అవకాశముందని సమాచారం. అంటే మార్చి 7న లేదా అంతకంటే ముందే 'లైలా' డిజిటల్ రిలీజ్ ఉండొచ్చట.'లైలా' కథ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సోనూ(విశ్వక్ సేన్)కి బ్యూటీ పార్లర్ ఉంటుంది. ఓ రోజు అనుకోకుండా పాతబస్తీ పహిల్వాన్, ఎస్ఐ శంకర్ కి సోనూ టార్గెట్ అవుతాడు. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు లేడీ గెటప్ వేసుకుని లైలా అవతారమేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?) -
పాక్ను ఆడేసుకుంటోన్న నెటిజన్స్.. పుష్ప-2 సీన్ను కూడా వదల్లేదు!
భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా జయకేతనం ఎగరేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అతిథ్య పాక్ జట్టును భారత్ మట్టికరిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ లీగ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. పాక్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే దాయాదుల పోరు అంటే ఓ రేంజ్లో ఫైట్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఇరుదేశాల అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఓటమి పాలైన జట్టుపై విమర్శలు కూడా అదేస్థాయిలో ఉంటాయి.ఇంకేముంది పాక్ జట్టు ఇండియాతో ఓడిపోవడంతో నెటిజన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆ జట్టుపై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. కింగ్ కోహ్లీని ప్రశంసలు కురిపిస్తూ.. పాక్ టీమ్ను ఫుట్బాల్ ఆడేస్తున్నారు నెటిజన్స్. తాజాగా పాక్ జట్టుపై చేసిన ఓ మీమ్ మాత్రం తెగ వైరలవుతోంది. ఇందులో మన పుష్పరాజ్ను కూడా వాడేశారు. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలోని ఓ పైట్ సీన్తో క్రియేట్ చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.పుష్ప-2 చిత్రంలోని గంగమ్మ జాతర సాంగ్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ గురించి సినిమా చూసిన ఎవ్వరైనా మర్చిపోలేరు. తాజాగా ఆ ఫైట్ సీన్లోని ఓ క్లిప్తో పాక్ టీమ్ను ట్రోల్ చేశారు. అల్లు అర్జున్కు ఫేస్కు కోహ్లీని చూపిస్తూ.. రౌడీలను పాక్ జట్టుతో పోలుస్తూ మీమ్ క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరలవుతోంది. ఇంకేముంది ఈ ఫన్నీ మీమ్ చూసిన మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఆ మీమ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. #INDvsPAK pic.twitter.com/7dP4diEwq7— Unlisted-pre IPO Investment Zone (@reddy73375) February 23, 2025 -
జబర్దస్త్ బ్యూటీతో డైరెక్టర్ తేజ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
సుకుమార్ చేయి వదలని ఐటమ్ బ్యూటీ.. వీడియో వైరల్
ఆదివారం ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ఫీవర్ నడిచింది. దుబాయిలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు తెలుగు సెలబ్రిటీలు కూడా వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, ఫ్యామిలీతో కలిసి దర్శకుడు సుకుమార్ కూడా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)ఇదే మ్యాచ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా సందడి చేసింది. తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు సుకుమార్ ని కూడా గట్టిగానే కాక పట్టేందుకు ప్రయత్నించినట్లు అనిపించింది. ఎందుకంటే సుకుమార్ ని కలిసిన ఆనందంలో ఆయన చేయి పట్టుకున్న ఊర్వశి.. కాసేపటి వరకు అస్సలు వదల్లేదు. ఆ వీడియోనే తన ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది.సుకుమార్ ని కలిసిన వీడియోని పోస్ట్ చేసిన ఊర్వశి.. ఈయన్ని తెగ పొగిడేసింది. 'సుకుమార్ గారు మీరు సాధించిన విజయాలకు శుభాకాంక్షలు. మీ మేధస్సు, డెడికేషన్ మమ్మల్ని ఎంతగానో స్పూర్తి కలిగిస్తున్నాయి. మేమంతా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం' అని రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)ఈ మధ్యే సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్'లో దబిడి దిబిడి అంటూ ఐటమ్ పాటకు స్టెప్పులేసిన ఊర్వశి.. బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు పనిలో పనిగా సుకుమార్ ని కూడా కాకా పట్టేసి తెలుగు ఇండస్ట్రీలో సెటిలైపోయే ప్లాన్ ఏమైనా వేస్తుందా అనిపిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 241 పరుగులు చేసింది. ఛేదనలో కొన్ని ఓవర్లు మిగిలుండగానే భారత్ గెలిచేసింది. కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: 'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
అవతార్ 3 కోసం నయా టెక్నాలజీ వాడుతున్న జేమ్స్..
-
నార్త్ లేడీస్ టెన్షన్ పెడుతున్న సౌత్ బ్యూటీస్
-
సౌత్, నార్త్ లో డబుల్ రిస్క్ చేస్తున్న మైత్రి మూవీస్..
-
అవతార్ 3 పై జేమ్స్ కెమారూన్ బిగ్ అప్డేట్..
-
జాన్వీతో రొమాన్స్ చేయడానికి స్టార్ హీరోలు సై..!
-
క్లాస్ డైరెక్టర్ తో జోడి కడుతున్న మాస్ మహారాజ్
-
'గేమ్ ఛేంజర్'తో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లోకి వచ్చి వెళ్లిపోయి కూడా చాలారోజులు అయిపోయింది. అయితే, ఈ సినిమాలో పనిచేసిన కొందరు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.గేమ్ ఛేంజర్ సినిమాలో పనిచేసినందుకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ గుంటూరు పోలీస్ స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ కోసం కో డైరెక్టర్గా పనిచేసిన స్వర్గం శివతో ఒప్పందం చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో విజయవాడ, గుంటూరు నుంచి చాలామందితో పాటు హైదరాబాద్ వెళ్లి షూటింగ్లో పాల్గొంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు చెప్పుకొచ్చారు. స్వర్గం శివ తమకు రూ.1200 వంతున ఇస్తానని ఒప్పుకొని చాలా రోజులుగా డబ్బులు ఇవ్వట్లేదని వాపోయారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు వద్దకు తీసుకెళ్లాలని మీడియాను కోరారు. ఇందులో దిల్ రాజు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆర్టిస్ట్ తరుణ్, ఇతరులు కోరారు. తమను మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా టీం తమను మోసం చేసిందని పోలీస్ స్టేషన్లో ఆర్టిస్టుల ఫిర్యాదు గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుండి హైదరాబాద్ కి 350 మంది వెళ్లామని, కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు రూ.1200 ఇస్తానని ఒప్పుకొని డబ్బులు ఇవ్వట్లేదని గుంటూరు పోలీస్ స్టేషన్లో… pic.twitter.com/39etzw3mTb— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025 -
'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!
హీరో నాని అంటే పక్కంటి కుర్రాడి తరహా పాత్రలతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాస్ సినిమాలు చేస్తూ తనలో డిఫరెంట్ యాంగిల్ పరిచయం చేస్తూ వస్తున్నాడు. దసరా, సరిపోదా శనివారం చిత్రాలు.. ఆ తరహా ప్రయత్నాలే. ఇప్పుడు వాటిని మించిపోయేలా బ్రూటల్ మాస్ చూపించబోతున్నాడు.నాని ప్రస్తుతం 'హిట్ 3' చేస్తున్నాడు. ఈ ఫ్రాంచైజీలో ఇదివరకే రెండు మూవీస్ వచ్చాయి. విశ్వక్ సేన్, అడివి శేష్ హీరోలుగా నటించిన ఈ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథలతో వీటిని తెరకెక్కించారు. వీటిని నిర్మించిన నాని.. మూడో భాగాన్ని నిర్మిస్తూ హీరోగా నటించాడు. ఇతడి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)'హిట్ 3' సినిమా చాలా వయలెంట్ గా ఉంటుదని నాని కొన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే టీజర్ ఉంది. లాఠి పట్టుకుంటే రెచ్చిపోయే అర్జున్ సర్కార్ అనే పోలీస్ గా కనిపించాడు. వైట్ కోట్ తో ఓ వ్యక్తిని చంపే సీన్ అయితే భయం కలిగించింది.టీజరే ఇలా ఉందంటే సినిమా ఇంకెలా ఉండబోతుందో అర్థమైపోతుంది. మే 1న థియేటర్లలోకి రాబోతుంది. శైలేష్ కొలను దర్శకుడు కాగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?
ఈసారి సంక్రాంతికి థియేటర్లలో రిలీజై అనుహ్యంగా హిట్ అయింది వెంకటేశ్ మూవీ. పండగ పేరుతో 'సంక్రాంతికి వస్తున్నాం' అని ప్రేక్షకుల్ని పలకరించారు. అనుహ్యమైన విజయాన్ని అందుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది.అయితే వెంకీమామ సినిమా ఓటీటీలోకి రావడానికి కంటే ముందే టీవీలో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. మార్చి 1న సాయంత్రం టీవీలో ప్రసారం చేస్తున్నట్లు చెప్పడంతో మరి ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్ప్పుడు స్ట్రీమింగ్ పై ఓ రూమర్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)మార్చి 1న టీవీలో ప్రసారమైన సమయానికే ఓటీటీలోనూ రిలీజ్ చేయాలని సదరు సంస్థ నిర్ణయం తీసుకుందట. దీనిబట్టి చూస్తే మార్చి 1నే సాయంత్రం జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కొన్నిరోజుల క్రితం సుదీప్ 'మ్యాక్స్' మూవీ కూడా ఇలానే టీవీ- ఓటీటీలో ఒకేసారి తీసుకొచ్చారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.'సంక్రాంతి వస్తున్నాం' కథ విషయానికొస్తే.. అమెరికాలో సెటిలైన సత్య అనే బడా వ్యాపారవేత్తని తెలంగాణ సీఎం కేశవ.. హైదరాబాద్ తీసుకొస్తాడు. కానీ అతడిని పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిస్తే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతో సీక్రెట్ ఆపరేషన్ కి సిద్ధమవుతారు. దీనికోసం మాజీ పోలీస్ వైడీ రాజు (వెంకటేశ్)ని ఒప్పించే బాధ్యతని ఇతడి మాజీ ప్రేయసి మీనాక్షి (మీనాక్షి చౌదరి) తీసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ) -
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. గతవారంలానే ఈసారి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో సందీప్ కిషన్-రావు రమేశ్ నటించిన 'మజాకా'.. కాస్త ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు తకిటి తదిమి తందాన, శబ్దం,అగాథియా తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ)మరోవైపు ఓటీటీల్లో 11 వరకు పలు సినిమాలు-వెబ్ సిరీసులు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో సుడాల్ సీజన్ 2, డబ్బా కార్టెల్, ఆశ్రమ్ తదితర వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి ఏయే ఓటీటీల్లో ఏది రిలీజ్ కానుందంటే?\ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 24 - మార్చి 1)నెట్ఫ్లిక్స్డబ్బా కార్టెల్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 28అమెజాన్ ప్రైమ్జిద్దీ గర్ల్స్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 27హౌస్ ఆఫ్ డేవిడ్ (ఇంగ్లీష్ సిరీస్) ఫిబ్రవరి 27సుడల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 28సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 28హాట్స్టార్సూట్స్: లాస్ ఏంజిల్స్(ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 24బీటిల్ జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28లవ్ అండర్ కన్స్ట్రక్షన్ (మలయాళ సిరీస్) - ఫిబ్రవరి 28ది వాస్ప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28సైనా ప్లేస్వర్గం (మలయాళ మూవీ) - ఫిబ్రవరి 24ఎంఎక్స్ ప్లేయర్ఆశ్రమ్ 3 పార్ట్ 2 (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 27(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి భారీ సాయం.. ఆయన పేరుతోనే నిర్మిస్తాం: ఆర్కే సెల్వమణి) -
1965 నందాదేవి స్పై మిషన్పై సినిమా.. టీజర్ విడుదల
కోలీవుడ్లో గతేడాదిలో విడుదలైన లబ్బర్ బంతు సినిమా భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం తెలుగు వర్షన్ హాట్స్టార్లో విడుదయ అయిన తర్వాత ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. అలాంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణన్ కుమార్, ఎ. వెంకటేష్తో కలిసి నిర్మిస్తున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం 'మిస్టర్ ఎక్స్'.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. కోలీవుడ్లో ఎఫ్ఐఆర్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఫ్రేమ్ మను ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం అందిస్తున్నారు. 'మిస్టర్ ఎక్స్' చిత్రంలో ఆర్య కథానాయకుడుగానూ, గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రుల్లోనూ నటిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత నటుడు ఆర్య మాట్లాడుతూ ఇందులో నటించడానికి తనకు సిఫార్సు చేసింది నిర్మాత ఎస్ లక్ష్మణన్ కుమార్ అని చెప్పారు. దర్శకుడు మను ఆనంద్ కథ చెప్పగానే ఇందుకు చాలా భారీ బడ్జెట్ అవుతుంది కదా అని నిర్మాతలతో చెప్పగా ప్రేక్షకులకు ఆశ్చర్యకరమైన అనుభవాన్ని ఇవ్వాలంటే రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాల్సిందే అని చెప్పారన్నారు. నటుడు గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తాను ఊహించిన దానికంటే 100 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం కోసం కండలు పెంచి నటించారన్నారు. తనకు తెలిసి ఈయన కోలీవుడ్ హల్క్ అని పేర్కొన్నారు. నిర్మాత ఎస్. లక్ష్మణన్ కుమార్ మాట్లాడుతూ ఇది చాలా కాలం పాటు ప్రణాళికను సిద్ధం చేసి రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. దర్శకుడు మను ఆనంద్ చెప్పిన ఏ విషయం నమ్మశక్యంగా లేదని అయితే ఆయన చెప్పిన నాలుగు విషయాలు మాత్రం ఎంతో నమ్మశక్యం అనిపించాయన్నారు. చైనాను టార్గెట్ చేసేందుకు1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోతాయన్నారు. వాటి గురించి ఇప్పటివరకు ఆచూకీ లేదన్నారు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్ చిత్రం చెప్పారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎఫ్ఐఆర్ లేకుంటే ఈ చిత్రం అవకాశం తనకు వచ్చేది కాదని దర్శకుడు మను ఆనంద్ పేర్కొన్నారు. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.నందాదేవి మిస్టరీ ఇదేచైనా, భారత్ యుద్ధం ముగిసిన తర్వాత చైనా మిలటరీపై ఇండియా నిఘా పెట్టింది. ఈ క్రమంలో అమెరికాతో భారత్ చేతులు కలిపింది. 1965లో అమెరికా, భారత్ సంయుక్తంగా నందాదేవి పర్వతంపై ఒక అణుశక్తి పరికరాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాయి. అందుకోసం ట్రాన్స్ రిసీవర్స్తో పాటు అణుశక్తి ఉత్పాదక జనరేటర్, అణు ఇంధనమైన ఫ్లుటోనియంను నందాదేవి కొండపైకి తీసుకెళ్లారు. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా ప్రమాదకరంగా మారడంతో వాటిని అక్కడే వదిలేసి కొండ నుంచి తిరిగొచ్చారు. 1966లో తిరిగి అక్కడికి వెళ్లేసరికి పరికరాలు కనిపించలేదు. అక్కడ పూర్తిగా మంచు కప్పుకొని ఉంది. దీంతో సరైన ప్రదేశం గుర్తించలేక తిరిగొచ్చేశారు. అయితే, 2005లో అనూహ్యంగా ఈ ఫ్లుటోనియం జాడలు కింద ప్రవహిస్తున్న నదుల్లో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్లుటోనియం వల్లే మంచు కరిగే ప్రమాదం ఉందని అంచనా వుంది. ఈ మూలకం జీవితకాలం వందేళ్లుగా ఉంది. వచ్చే 40 ఏళ్లలో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయోనని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనిని మరో మానవ తప్పిదంగా వారు చెప్పుకొస్తున్నారు. -
ఇక్కడ బ్యూటీ నేనే... బీస్ట్ని నేనే: ఆనంది
ఆనంది, వరలక్ష్మీ శరత్కుమార్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘శివంగి’(shivangi). దేవరాజ్ భరణీ ధరణ్ దర్శకత్వంలో పి. నరేశ్బాబు నిర్మించిన ఈ పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ మార్చి 7న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నా జీవితంలో జరిగిన రెండు ముఖ్యమైన విషయాలు ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయి.ఒక అమ్మాయికి ఒక్క రోజుకి ఇన్ని కష్టాలు, సత్యభామ అంటే ఏదో చందమామ కథలు చెప్పే భామ అనుకున్నావేమో... సత్యభామ రా... ఇక్కడ బ్యూటీ నేనే... బీస్ట్ని నేనే’’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. జాన్ విజయ్, డా. కోయ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్ సంగీతం అందించారు. -
విద్రోహి చాలా మంచి కథ: శ్రీకాంత్
రవి ప్రకాశ్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘విద్రోహి’. వీఎస్వీ దర్శకత్వంలో విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గా రావు నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పొస్టర్ను రిలీజ్ చేసిన నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. చాలా మంచి మూవీ అవుతుంది.రవిప్రకాశ్ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టు. ‘విద్రోహి’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఇందులో నేను పొలీసాఫీసర్ పాత్ర చేశాను. ఓ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది’’ అని తెలిపారు రవిప్రకాశ్. ‘‘ఓ సరికొత్త పాయింట్తో మేం తీసిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు వీఎస్వీ. ‘‘విద్రోహి’ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది’’ అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పప్పుల కనకదుర్గా రావు. నటుడు శివకుమార్ మాట్లాడారు. -
సైకలాజికల్ థ్రిల్లర్
అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘బూమరాంగ్’(Boomerang). పలు భాషలలో 34 చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన ఆండ్రూ బాబు దర్శకత్వంలో లండన్ గణేశ్, డా. ప్రవీణ్ రెడ్డి ఊట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రోడక్షన్ని నిర్వహిస్తోంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన చిత్రం ఇది.ఈ సినిమాలో ఓ డార్క్ సైడ్, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘ఇది మెసేజ్ ఓరియంటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా కథ విని ప్రవీణ్గారు వెంటనే ఒప్పుకున్నారు’’ అని తెలిపారు ఆండ్రూ బాబు. ‘‘కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ సినిమా తీశాం. అవుట్పుట్ బాగా వచ్చింది.ఈ సినిమాకి అందరి సపొర్ట్ కావాలి’’ అని పేర్కొన్నారు ప్రవీణ్ రెడ్డి. ‘‘బూమరాంగ్’ మంచి థ్రిల్లర్ ఫిల్మ్’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్కుమార్ కొండా, నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అతిథులుగా పాల్గొని, మాట్లాడారు. -
సంక్రాంతికి వస్తున్నాం.. హిందీ రీమేక్?
వెంకటేశ్ హీరోగా నటించిన బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేయాలని చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు ప్లాన్ చేస్తున్నారని, ఈ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారనే టాక్ తెరపైకి వచ్చింది.ఈ హిందీ రీమేక్లో అక్షయ్ కుమార్(Akshay Kumar) అయితే బాగుంటుందని ‘దిల్’ రాజు భావిస్తున్నారట. కెరీర్లో ఇప్పటికే ఎన్నో దక్షిణాది సినిమాల హిందీ రీమేక్స్లో నటించిన అక్షయ్ కుమార్ మరి... ఈ రీమేక్ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
నవ్వులు గట్టిగా వినిపిస్తాయి: సందీప్ కిషన్
సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’(Mazaka). రావు రమేశ్, అన్షు ఇతర లీడ్ రోల్స్లో నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘మజాకా’ సినిమాకు థియేటర్స్లో నవ్వులు గట్టిగా వినిపిస్తాయి.నా కెరీర్లో హయ్యెస్ట్ నంబర్స్ ఈ సినిమా ఇస్తుందనే నమ్మకం ఉంది. ఫ్యామిలీతో థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఇది. నాకు, రావు రమేశ్గారికి ఈక్వెల్ స్క్రీన్ స్పేస్ ఉంది. ఆయన వల్ల కథ మరింతగా పండింది’’ అన్నారు సందీప్ కిషన్. ‘‘ఇద్దరు మగవాళ్లు మాత్రమే ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకైనా ఒక ఫ్యామిలీ ఫొటో రావాలని పడే తపనే ఈ సినిమా కథ. నా ప్రతి సినిమాలో ఉండే మ్యాజిక్ ఈ సినిమా లోనూ ఉంటుంది. ఈ సినిమా డబుల్ బ్లాక్బస్టర్ అవుతుంది’’ అన్నారు నక్కిన త్రినాథరావు.‘‘ఈ చిత్రంలో రొమాంటిక్గా నటించడం చాలా సవాల్గా అనిపించింది. కొత్తగా నవ్వించే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రావు రమేశ్. ‘‘కెప్టెన్ మిల్లర్, భైరవకోన, రాయన్’ ఇప్పుడు ‘మజాకా’... ఇలా డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న సందీప్ కిషన్కు పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ యాప్ట్ అనిపించింది’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘సందీప్, రావు రమేశ్గార్లు పొటీపడి నటించారు. ‘మజాకా’ అందరికీ నచ్చుతుంది. ‘సామజ వరగమన, భైరవ కోన’ చిత్రాల తర్వాత అనిల్గారు, నేను హ్యాట్రిక్ సినిమాతో వస్తున్నాం’’ అన్నారు రాజేశ్ దండా. హీరోయిన్ రీతూ వర్మ, అన్షు మాట్లాడారు. -
సందేశంతో...
వాతావరణ పరిరక్షణపై సామాజిక సందేశం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బందీ’(Bandhi). ఆదిత్య ఓం(Aditya Om) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు రఘు తిరుమల దర్శకత్వం వహించారు. గల్లీ సినిమాపై వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.‘‘భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతాల్లో రియల్ లొకేషన్స్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పర్యావరణ ప్రేమికులందరినీ ఈ సినిమా కదిలించేలా ఉంటుంది. అటవీ ప్రాంతంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ఆదిత్య ఓం అద్భుతంగా నటించారు’’ అని యూనిట్ పేర్కొంది. -
అరియానాకు ఏమైంది? బక్కచిక్కిపోయి.. అస్థిపంజరంలా!
అమెరికన్ పాప్ సింగర్, నటి అరియానా గ్రాండె (Ariana Grande) గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇటీవల బాఫ్తా ఫిలిం అవార్డుల కార్యక్రమానికి వెళ్లిన ఆమె తన అభిమానులకు ఆటోగ్రాఫులిచ్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె ఫోటో క్లిక్మనిపించి దాన్ని సోషల్ మీడియాలో వదలగా.. అది కాస్తా వైరల్గా మారింది. ఆ పిక్లో అరియానా ఎంతో బక్కచిక్కిపోయింది. అది చూసిన అభిమానులు తన ఆరోగ్యం బాగానే ఉందా? అని ఆరా తీస్తున్నారు. ఇలా అయిపోయిందేంటి?అరియానా రోజురోజుకీ ఇలా అయిపోతుందేంటి? అని కంగారు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అంటూ తన పాత ఫోటోలు తిరగేస్తున్నారు. 2020లో పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ ఫంక్షన్లో అరియానా ఎలా ఉంది? ఇప్పుడు బాఫ్లా ఫంక్షన్లో ఎలా ఉంది? అసలేం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఏకంగా పదేళ్లు వెనక్కి వెళ్లి.. అప్పటి అరియానాయే బాగుందని కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడే బాగున్నా..గతంలోనూ తన బాడీ గురించి ఇటువంటి చర్చ జరిగింది. అప్పుడు అరియానా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఆరోగ్యంగా ఉన్నానని తెలియజేయడానికి ఎలా కనిపించాలో మీరు నాకు చెప్పొద్దు. నేను గతంలో కంటే కూడా ఇప్పుడే బాగున్నాను. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నానంటున్నారుగా.. అప్పుడు సరిగా తినలేదు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను.మీకనవసరం..మానసికంగానూ బాగోలేను. దాన్ని మీరు ఆరోగ్యకరమైన రోజులుగా వర్ణిస్తున్నారు. లుక్స్ను బట్టి ఆరోగ్యంగా లేనని డిసైడ్ అవకండి. నా శరీరం గురించి మీకనవసరం అని పేర్కొంది. కాగా అరియానా గ్రాండె విక్టోరియస్, అండర్డాగ్స్, డోంట్ లుకప్, విక్డ్ సినిమాల్లో నటించింది. ఎన్నో పాప్ సాంగ్స్ పాడింది. What happened to Ariana Grande ??both are realleft one is 2020 E! People's Choice Awards right one is 2025 BAFTA Awards pic.twitter.com/NtNjTzTFJN— Victor Bigham 🇺🇸 (@Ravious101) February 20, 2025Ariana Grande 2015 & 2025, what’s happening? 👀 pic.twitter.com/jLFvNOUoGA— ViralMedia🎥 (@ViralMedia247) February 19, 2025What happened to Ariana Grande? pic.twitter.com/41Hkmfj8mW— Truth Seeker (@_TruthZone_) February 20, 2025 చదవండి: -
చీర కట్టుకోవాలంటే భయమేసింది, నటుడిగా 5.5 మార్కులే..: అల్లు అర్జున్
తగ్గేదేలె అన్న డైలాగ్ను సినిమాలోనే కాదు రియల్ లైఫ్లోనూ ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప 2 చిత్రంతో ఏకంగా రూ.1871 కోట్లు సాధించి రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. అలాగే ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ తొలి సంచికపై కనిపించిన మొట్టమొదటి భారతీయ హీరోగా అరుదైన ఘనత సాధించాడు. ఈ కవర్ పేజీ షోటషూట్ సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.భయపడ్డా..అల్లు అర్జున్ మాట్లాడుతూ.. గంగమ్మ జాతర సన్నివేశంలో చీర కట్టుకోవాలని చెప్పినప్పుడు నేను మొదట భయపడ్డాను. ఇది వర్కవుట్ కాదేమో అన్నాను. కానీ సుకుమార్ (Sukumar) మాత్రం ఆ సన్నివేశంలో నువ్వు చీర కట్టుకుని అమ్మాయిగా కనిపించాలంతే అన్నాడు. అందుకోసం మొదట డ్రాయింగ్స్ వేశారు. నాకు ఏ లుక్ సూటవుతుందని పరీక్షించారు. తర్వాత నెమ్మదిగా నాలోనూ నమ్మకం మొదలైంది. కచ్చితంగా ఇది సినిమాకే హైలైట్గా నిలుస్తుందనిపించింది. నటుడిగా ఐదున్నర మార్కులుఅదే సమయంలో ఇది నాకెంతో ఛాలెంజింగ్గానూ అనిపించింది. ఎందుకంటే చీర కట్టినా కూడా ఎంతో పవర్ఫుల్గా కనిపించాలి. ఫైనల్గా ఆ సీన్ అనుకున్నట్లుగానే చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ అయిందని నేను గర్వాన్ని తలకెక్కించుకోలేదు. నటుడిగా నాకు 10కి 5.5 మార్కులు వేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. పుష్ప 2 (Pushpa 2 The Rule) విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు.చదవండి: దుబాయ్లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు -
దుబాయ్లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు
టాలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఫారిన్లో చిల్ అవుతున్నారు. దుబాయ్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, హీరోల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేశ్బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. జీవితంతం సంతోషంగా..'కీర్తి- నితేశ్ జంటగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వీరు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని క్యాప్షన్ జోడించింది. ఈ ఫోటోల్లో ఉపాసన, ఎన్టీఆర్ (Jr NTR)- లక్ష్మీ ప్రణతి తదితరులు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర అనిరుధ్ రవిచంద్రన్తో కలిసి మహేశ్ కూతురు సితార, సుకుమార్ కూతురు సుకృతి సెల్ఫీ కూడా దిగారు.నాటు నాటు పాటకు స్టెప్పేసిన అఖిల్ఈ పెళ్లిలో అఖిల్ సహా మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నాటునాటు పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమాలో చరణ్, తారక్ డ్యాన్స్ చేసినట్లుగానే ఇక్కడ కూడా అఖిల్ వేరొకరితో కలిసి స్టెప్పులేశాడు. ఈ సెలబ్రిటీల హంగామా చూసిన ఫ్యాన్స్ మిగతా హీరోలు కూడా ఈ పార్టీలో ఉంటే బాగుండని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Akhil Akkineni Dance For "NattuNattu" Song 🔥Happy to witness His Dance 🥹@AkhilAkkineni8 Anna Akhil6 lo Dance kummeyandi #AkhilAkkineni #RRR pic.twitter.com/xxg7OKuz3r— Vinay Vk18 (@Vinay_Akhil999) February 23, 2025చదవండి: హీరోయిన్ కుమార్తెలకు బంగారు గాజులు తొడిగిన స్టార్ హీరో -
'మజాకా' ట్రైలర్లో పీపుల్స్ స్టార్.. తప్పు సరిచేసుకున్న సందీప్
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఈ నెల 26న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను విడుదల చేశారు. నేను లోకల్,హలో గురు ప్రేమకోసమే,సినిమా చూపిస్త మావ ,ధమాకా వంటి సినిమాలతో దర్శకుడిగా త్రినాథరావుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన నుంచి మజాకా మూవీ వస్తుండటంతో ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.తాజాగా విడుదలైన మజాకా ట్రైలర్ టైటిల్ కార్డ్లో హీరో సందీప్ కిషన్కు 'పీపుల్స్ స్టార్' అనే ట్యాగ్లైన్ చేర్చారు. పీపుల్స్ స్టార్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు ఆర్. నారాయణమూర్తి అని తెలిసిందే. దీంతో ఈ విషయంపై పలు అభ్యంతరాలు రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆర్ . నారాయణమూర్తికి పీపుల్స్ స్టార్ ట్యాగ్ లైన్ ఉన్న విషయం తనకు తెలియదని సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు. తనకు ట్యాగ్ లైన్స్తో ఎలాంటి పనిలేదన్నారు. వాటిని పెద్దగా పట్టించుకోనని తెలిపారు. అయితే, నారాయమూర్తి సినిమాలు చాలా బాగుంటాయని, ఆయనకు తాను కూడా అభిమానినని పేర్కొన్నారు. మజాకా సినిమా కోసం పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ లైన్ను తాను పెట్టుకోలేదు. నిర్మాత అనిల్ సుంకర పెట్టారని సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు.మజాకా చిత్రంలో సందీప్ కిషన్ - రావు రమేశ్ తండ్రీ తనయుల పాత్రల్లో సందడి చేయనున్నారు. తనయుడు ఒక అమ్మాయితో.. తండ్రి మరో అమ్మాయితో ప్రేమలో పడటం.. సరదాగా సాగే జీవితాల్లో వారికి వచ్చిన సమస్య ఏమిటి? దానిని వారెలా అధిగమించారు? అనే అంశాలతో ఈ సినిమా రూపొందుకున్నట్లు తెలుస్తోంది. -
'తండేల్' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు
నాగచైతన్య- సాయిపల్లవి నటించిన తండేల్ సినిమా (Thandel Movie) భారీ విజయం సాధించింది. పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల జీవితాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాతో తండేల్ రామారావు బాగా పాపులర్ కావడమే కాకుండా ఆయన చిత్ర యూనిట్ నుంచి ఎక్కువగా లబ్ధి పొందాడంటూ మిగిలిన మత్స్యకారులు మీడియా ముందుకు వచ్చారు. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయని వారు చెబుతున్నారు. గనగళ్ల రామారావు, ఆయన సతీమణి నూకమ్మకు దక్కుతున్న గౌరవం, లబ్ధి.. 21 మత్స్యకార కుటుంబాలకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రామారావుకు మాత్రమే గౌరవంమత్స్యలేశం గ్రామంలో 21 మత్స్యకార కుటుంబాలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తండేల్ రామారావు గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. 'సినిమాలో రియల్ తండేల్ రామారావు ఒక్కడే అని చూపారు. అందులో ఎలాంటి నిజం లేదు. పాకిస్థాన్కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేల్లు ఉన్నారు. కేవలం రామారావు చేసిన తప్పు వల్లే మేము పాకిస్థాన్కు దొరికిపోయాం. మేము హెచ్చిరించినా మాట వినకుండా రామారావు బోటును ముందుకు పోనిచ్చాడు. దీంతో పాక్ దళాలకు దొరికిపోయాం. కానీ, సినిమా విషయానికి వస్తే కేవలం రామారావు, అతడి భార్య నూకమ్మకు మాత్రమే గౌరవం దక్కుతుంది. మిగిలిన 21 మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి గౌరవం దక్కడం లేదు. (చదవండి: దుబాయ్లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు)చెప్పుతో కొట్టినట్లు..సినిమా కథ రాసిన కార్తీక్, రామారావు మాకు తీరని అన్యాయం చేశారు. సినిమా ప్రారంభంలో మా 20 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 45 వేల చొప్పున ఇచ్చి సంతకాలు చేయించుకున్నారు. అయితే, రామారావు, ఆయన బావమరిది ఎర్రయ్యకు మాత్రం చెరో రూ. 90 వేలు ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళంలో జరిగిన తండేల్ ఈవెంట్కు మా 20 కుటుంబాలను పిలిపించి.. కనీసం స్టేజీ మీదకు కూడా పిలవలేదు. స్టేజీ మీద రామారావు, ఆయన సతీమణి నూకమ్మ మాత్రమే ఉన్నారు. మమ్మల్ని పిలిపించి చెప్పుతో కొట్టినంత పని చేశారు. వారిద్దరికి సినిమా కథ రచయిత కార్తీక్ అండదండలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరి వల్ల రిలీజయ్యామో అందరికీ తెలుసుఈ సినిమాతో రామారావు జీవితం మాత్రం మారిపోయింది. ఆయనకు ఒక ఇళ్లు, రూ. 20 లక్షల డబ్బు చిత్ర యూనిట్ నుంచి అందినట్లు తెలుస్తోంది. అందుకే రామారావు కూడా వారు ఏం చెబితే అది మీడియా ముందు మాట్లాడుతున్నాడు. అతనితో పాటు మేము కూడా పాకిస్థాన్ జైల్లో ఉన్నాం. అక్కడ ఏం జరిగిందో మాకూ తెలుసు. ఎవరి వల్ల విడుదలయ్యామో కూడా అందరికీ తెలుసు. మేము స్టేజీ ఎక్కితే అవన్నీ చెబుతామని ఆ అవకాశం లేకుండా చేశారు. రామారావు, కథా రచయిత కార్తీక్ మమ్మల్ని మోసం చేశారు. వాళ్లు మాత్రమే లబ్ధి పొందారు. మాకు ఎలాంటి సాయం చేయలేదు' అని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: ఎంత పని చేశావు రా మనోజ్.. సుహాస్ ఎమోషల్ పోస్ట్ -
అజిత్కు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
కోలీవుడ్ హీరో అజిత్ కారు రెండు పల్టీలు కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్పెయిన్లో జరుగుతున్న కారు రేసింగ్లో అజిత్ పాల్గొన్నారు. రేసింగ్లో భాగంగా మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన కారు ట్రాక్ తప్పింది. అయితే, సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ఆయన సురక్షితంగా బయటకొచ్చారు. ఇదే విషయాన్ని ఆయన యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో అజిత్ తప్పులేదని వారు తెలిపారు. రేసులో ఉన్న ఇతర కార్ల వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. అయితే, మళ్లీ అజిత్ రేసులో పాల్గొనడం విశేషం.అజిత్ కారు రేసింగ్లో భాగంగా ఇప్పటి వరకు మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారు. అజిత్ ఇటీవల దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ కారు రేస్ క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆప్పుడు కూడా ఆయన ప్రమాదానికి గురికావడం జరిగింది. స్పెయిన్ రేసులో పాల్గొనేందుకు ఆయన శిక్షణ తీసుకుంటున్న సమయంలో కూడా ప్రమాదం జరిగింది. అయితే, ఆయన అన్నిసార్లు కూడా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళ చెందుతూ జాగ్రత్తగా ఉండాలని అజిత్ను సూచిస్తున్నారు.అజిత్ కుమార్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. త్రిష హీరోయిన్ . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు. ఇండియన్ మూవీ చరిత్రలోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by Ajith Kumar Racing Team (@ajithkumarracing) -
హీరోయిన్ కుమార్తెలకు బంగారు గాజులు తొడిగిన స్టార్ హీరో
కోలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత స్నేహన్, నటి కనిక కుమార్తెలకు కమల్ హాసన్ అదరిపోయే కానుక అందించారు. తమిళ చిత్రపరిశ్రమలో పాటల రచయితగా స్నేహన్కు మంచి గుర్తింపు ఉంది. ఆయన తెలుగులో కూడా ప్రియమైన నీకు చిత్రంలో పాటలు రాశారు. మన్మధ, ఆటోగ్రాఫ్,ఆడుకాలం,ఆకాశం నీ హద్దురా, సామీ వంటి తమిళ చిత్రాలతో పాటు రజనీకాంత్, సూర్య, విజయ్, అజిత్,కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఆయన పనిచేశారు.స్నేహన్, కనిక దంపతులు కవల పిల్లలకు ఈ ఫిబ్రవరిలో జన్మనిచ్చారు. అయితే, ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన వెంటనే ఈ జంట కమల్ హాసన్ ఆశీర్వాదం కోసం ఆయన ఇంటికి వెళ్లింది. ఇద్దరూ అమ్మాయిలు చాలా ముద్దుగా ఉన్నారంటూ కమల్ ఆశీర్వదించారు. ఆపై వారిద్దరికీ బంగారు గాజులు ఆయన తొడిగారు. ఆపై కనిక, స్నేహన్లతో పాటు పిల్లలకు బట్టలు కూడా అందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్నేహన్ చాలా రోజులుగా కమల్కు దగ్గరగా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యంలో ఆయన క్రియాశీలంగా పనిచేస్తున్నారు. 2019లో తమిళనాడులోని శివగంగ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఓటమి చెందినప్పటికీ సుమారు 25వేల ఓట్లు వచ్చాయి.కోలీవుడ్ నటి కనిక రవిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కమల్ హాసన్ సమక్షంలోనే 2021లో వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సుమారు పదేళ్ల క్రితం క్రితం వచ్చిన 'దేవరాట్టం' అనే మూవీలో కనిక నటించింది. ఆ మూవీ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయం నుంచి వారు రహస్యంగా ఉంటూ ఉంచారు. అయితే, కొంత కాలం తర్వాత ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో ఆశీర్వదించారు. వారి పెళ్లిని కూడా కమల్ హాసన్ దగ్గరుండి జరిపించడం విశేషం. View this post on Instagram A post shared by Kannika Snekan (@kannikasnekan) -
'యుగానికి ఒక్కడు' రీ-రిలీజ్.. సీక్వెల్లో హీరో ఎవరో తెలుసా..?
కోలీవుడ్ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్ (యుగానికి ఒక్కడు). ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్లోకి రానుంది. విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా సినిమా ఉండటంతో తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదుచేసింది. హీరో కార్తీకి ఈ సినిమాతో పాపులారటీ వచ్చింది.యుగానికి ఒక్కడు(Yuganiki Okkadu) సినిమా రీరిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత చోలాస్ మళ్లీ తిరిగి వస్తున్నారని వారు ఒక పోస్టర్ విడుదల చేశారు. ఎపిక్ ఫాంటసీ మాస్టర్ పీస్ చూసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ వర్షన్ సన్నెక్ట్స్లో అందుబాటులో ఉంది.యుగానికి ఒక్కడు సీక్వెల్ ప్లాన్‘యుగానికి ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు సెల్వ రాఘవన్ అధికారికంగా గతంలోనే ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్ హీరోగా నటించనున్నాడని కూడా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్పై ధనుష్ కూడా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన అన్నారు. యుగానికి ఒక్కడు కోసం రూ. 18 కోట్లు బడ్జెట్ అయింది. సీక్వెల్ కోసం సుమారు రూ. 150 కోట్లు దాటొచ్చని అంచనా ఉంది.