breaking news
Movie News
-
ప్రతి ఇంట్లో విక్రాంత్..!
‘‘ది 100’ చిత్రంలో ప్రతిపాత్రకి ప్రాముఖ్యత ఉంది. సినిమాని థియేటర్స్లో చూడండి... ఏ ఒక్కర్నీ నిరుత్సాహ పరచదు. మా సినిమా నచ్చలేదని ఒక్కరు చెప్పినా సరే నేను దేనికైనా సిద్ధం... అంత నమ్మకంగా చెబుతున్నాను’’ అని ఆర్కే సాగర్ అన్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఆర్కే సాగర్, మిషా నారంగ్ జోడీగా ధన్యా బాలకృష్ణ కీలకపాత్ర పోషించిన చిత్రం ‘ది 100’. రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో ఆర్కే సాగర్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ఆర్కే నాయుడుపాత్రలాగే విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకి నచ్చింది. ఇంకా మంచి కథలు చెప్పాలనే స్ఫూర్తిని ప్రేక్షకులు ఇచ్చారు’’ అని తెలిపారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ– ‘‘సమాజంలోని సవాళ్ల గురించి తీసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో విక్రాంత్లాంటి క్యారెక్టర్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడం నాకు నచ్చింది’’ అన్నారు. ‘‘మా చిత్రానికి ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్ అవుతున్నారు. ప్రేక్షకులు పతాక సన్నివేశాల్లో చప్పట్లు కొడుతుండటం సంతోషంగా ఉంది’’ అని రమేశ్ కరుటూరి తెలిపారు. మిషా నారంగ్, నటుడు రాజా రవీంద్ర,పాటల రచయిత రాంబాబు గోసాల మాట్లాడారు. -
మధ్య తరగతి తెలుగబ్బాయి
సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానసా వారణాసి హీరోయిన్గా నటించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా జూలై 12న సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ తెరకెక్కింది.చెన్నైలో లైఫ్ లీడ్ చేస్తున్న ఓ మధ్య తరగతి తెలుగబ్బాయిగా సంతోష్ శోభన్ కనిపిస్తారు. చెన్నై నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: ఆదిత్య రవీంద్రన్. -
టెక్నాలజీతో ఫైట్ చేయలేం: సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్కుమార్
‘‘సినిమా గ్రాండియర్గా ఉంటే ఆడియన్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా కంటే ముందు ‘మగధీర’ సినిమాను చెప్పుకునేవారు. అయితే సినిమా ఎంత గ్రాండియర్గా ఉన్నా, కొత్త ప్రపంచాలను సృష్టించినా, హ్యూమన్ ఎమోషన్స్ అనేవి కథలో చాలా ముఖ్యం. ‘బాహుబలి’ తర్వాత ఈ తరహాలో ఇతర ఇండస్ట్రీస్లోనూ సినిమాలొచ్చాయి. కానీ ప్రేక్షకుల ఎమోషన్స్కు కనెక్ట్ అయిన సినిమాలే విజయాలు సాధించాయి. ‘జూనియర్’ సినిమా కథలో ప్రేక్షకులను కదిలించే భావోద్వేగాలు నచ్చి, ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అని సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్కుమార్ అన్నారు.ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్కుమార్ చెప్పిన విశేషాలు. ⇒ ఎవరైనా కొత్తవారిని పరిచయం చేస్తున్నప్పుడు సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ ఉంటే చాలనుకుంటారు. కానీ ఫ్యామిలీ డ్రామా జానర్కి వెళ్లరు. అయితే కొత్త హీరోగా కిరీటి ఈ చాలెంజ్ తీసుకోవడం నాకు నచ్చింది. కిరిటీ హార్డ్వర్కర్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్... ఇలా అన్నీ బాగా చేశాడు. నిర్మాత సాయిగారితో ‘ఈగ’ సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమా చేయడ హ్యాపీ. రాధాకృష్ణ క్లారిటీ ఉన్న దర్శకుడు. ⇒ రాజమౌళిగారి ‘ఛత్రపతి, యమదొంగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలకు నేను సినిమాటోగ్రాఫర్గా చేశాను. ఆ మధ్యలో ‘విక్రమార్కుడు, మర్యాద రామన్న’ వంటి సినిమాలకు నేను చేయలేదు. అలాగే ప్రస్తుతం రాజమౌళిగారి సినిమాకు (మహేశ్బాబు హీరోగా చేస్తున్న సినిమా) నేను సినిమాటోగ్రాఫర్గా చేయకపోవడం పట్ల షాకవ్వాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మళ్లీ కలిసి పని చేస్తాం. ⇒ రెండు దశాబ్దాల నా కెరీర్ సంతృప్తిగా ఉంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాలకు పని చేయడం నా అదృష్టం. కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ అప్డేట్ అవుతుంటా. టెక్నాలజీతో ఫైట్ చేయలేం. సినిమాటోగ్రఫీ పైనే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీపైన ఏఐ (కృత్రిమ మేధ) ప్రభావం ఉంటుంది. మంచి ఉంది... చెడు ఉంది. ⇒ ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నాను. ‘బాహుబలి’ తరహాలో ఇది కూడా రాజుల కథ. అలాగే నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ సినిమా చేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగిన కథ ఇది. వీర్ సవార్కార్ నేపథ్యంలో కథ ఉంటుంది. ఐదారు లక్షల లీటర్ల వాటర్ ఉన్న ఓ ట్యాంకులో సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరిపే ప్లాన్ చేశాం. కానీ సెట్స్లో వాటర్ ట్యాంకు పేలి, ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. ⇒ హాలీవుడ్లో ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరణ జరుగుతోంది. క్రిస్టోఫర్ నోలన్ వంటివారు అలా చేస్తున్నారు. ఓ సినిమాను ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించాలా? లేదా? అనేది ఆ సినిమా దర్శక–నిర్మాతల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐమ్యాక్స్ కెమెరాతో చిత్రీకరించినప్పుడు హాలీవుడ్లో మంచి థియేటర్స్ దొరుకుతాయి. ఇక భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. -
అల్లు అర్జున్.. ఆ నలుగురు!
'పుష్ప 2' సినిమా రిలీజై దాదాపు ఆరేడు నెలలు అయిపోయింది. దీని తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా అన్న సస్పెన్స్కి కొన్నాళ్ల ముందు తెరదించాడు. తమిళ దర్శకుడు అట్లీతో కలిసి భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నారని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్గా దీపికా పదుకొణె నటిస్తుందని కూడా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్తో పాటు షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ఇప్పుడు క్రేజీ అప్డేట్ ఒకటి వినబడుతోంది.(ఇదీ చదవండి: ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ)అల్లు అర్జున్ ఇప్పటివరకు 21 సినిమాలు చేశాడు. కానీ ఎందులోనూ ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ అట్లీ సినిమా కోసం మాత్రం ఏకంగా నాలుగు పాత్రలు పోషించనున్నాడట. అవి కూడా తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా బన్నీనే కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్ కావొచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బన్నీ ఎలా కనిపిస్తాడా అని ఎగ్జైట్మెంట్ గ్యారంటీ.అట్లీ-బన్నీ సినిమాలో దీపికతోపాటు మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్, రష్మిక కూడా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అలానే హాలీవుడ్ నటుడు విలన్గా కనిపించే అవకాశముందని కొన్ని రోజుల క్రితం గట్టిగా వినిపించింది. ఇలా ఎప్పటికప్పుడు ఏదో గాసిప్ వినిపిస్తూనే ఉంది. అలా ట్రెండ్ అవుతూనే ఉంది. మరి వీటిలో ఎన్ని నిజం ఎన్ని అబద్ధం అనేది కొన్నిరోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు. అప్పటివరకు బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.(ఇదీ చదవండి: భార్యకు సీమంతం చేసిన తెలుగు కమెడియన్) -
'ఆ గ్యాంగ్ రేపు 3' ఫస్ట్ లుక్ విడుదల
గతంలో యూట్యూబ్లో వైరల్ అయిన 'ఆ గ్యాంగ్ రేపు' షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత 'ఆ గ్యాంగ్ రేపు 2' పేరుతోనూ షార్ట్ ఫిల్మ్ తీశారు. ఇప్పుడు ఈ టీమ్ నుంచి మూడో భాగం రాబోతుంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు యోగి తొలి ఫీచర్ ఫిల్మ్ 'లవ్ యూ టూ' నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈసారి 'ఆ గ్యాంగ్ రేపు 3'.. దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. నరేన్ అన్నసాగరం, ప్రీతి సుందర్ హీరో హీరోయిన్లుగా నటించారు. నోక్షియస్ నాగ్స్ నిర్మించారు. కంటెంట్ ట్రైలర్ జూలై 16న విడుదల కానుంది. పూర్తి వివరాలు త్వరలో బయటపెట్టనున్నారు. -
తెలుగులో 'మై బేబీ' రిలీజ్కి రెడీ
తమిళంలో ఘన విజయం సాధించిన 'డీఎన్ఏ' సినిమాని తెలుగులో 'మై బేబీ' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా.. ఈనెల 18న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్మాల్, పిజ్జా లాంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేశ్ కొండేటి.. ఈ 'మై బేబి'ని తెలుగులో విడుదల చేస్తున్నారు.అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి నెల్సన్ వెంకటేశన్ దర్శకుడు. 2014లో ఓ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో రూపొందిన భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్ చెబుతున్నారు. ఎస్.కె.పిక్చర్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. -
రుహానీ గ్లామర్.. పోలీస్తో రాయ్ లక్ష్మి పోజు
ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ శ్రీముఖియూకేలో రెడ్ గౌనులో రాయ్ లక్ష్మీ హాట్ పోజులుహీరోయిన్ రుహానీ శర్మ మత్తెక్కించే స్టిల్స్చెక్ షర్ట్లో ప్రియాంక మోహన్ కిక్కిచే లుక్స్వైట్ డ్రస్సులో క్లాసీగా 'యానిమల్' తృప్తి దిమ్రిముక్కు పుడకతో మెరిసిపోతున్న ప్రియా వారియర్ప్రియమణి చుడీదార్ లుక్.. ఫుల్ క్లాస్ View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Shanvi S (@shanvisri) View this post on Instagram A post shared by Ananyaa (@ananyahere) -
భార్యకు సీమంతం చేసిన తెలుగు కమెడియన్
యూట్యూబర్గా ఫేమ్ తెచ్చుకుని ఆపై సినిమాలు చేసిన కమెడియన్ మహేశ్ విట్టా.. గత నెలలో గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేశాడు. ఇది జరిగి ఎన్ని రోజులు కాలేదు ఇప్పుడు ఆమెకు సీమంతం చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ)రాయలసీమ కుర్రాడిగా యూట్యూబ్ వీడియోలు చేసిన మహేశ్ విట్టా.. తర్వాత నటుడిగా పలు మూవీస్ చేశాడు. బిగ్బాస్ షోకి కూడా రెండుసార్లు వెళ్లొచ్చాడు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లో నటిస్తూ, మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్బాస్ హౌసులో ఉండగానే తన ప్రేమ గురించి బయటపెట్టిన మహేశ్.. త్వరలో పెళ్లి ఉండొచ్చని చెప్పాడు. అన్నట్లుగానే 2023 సెప్టెంబరులో శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించాడు.మహేశ్ విట్టా చెల్లెలి ఫ్రెండే శ్రావణి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్నారు. మహేశ్ విట్టా సినీ కెరీర్ విషయానికొస్తే.. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు. నిజానికి 'పుష్ప' మూవీలో కేశవ పాత్ర కోసం కూడా ఆడిషన్ ఇచ్చాడు. కానీ చివరి నిమిషంలో మహేశ్ విట్టా బదులు జగదీశ్ ప్రతాప్కి అవకాశం దక్కింది.(ఇదీ చదవండి: వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకు: రజినీకాంత్) View this post on Instagram A post shared by Mahesh Vitta (@maheshvitta) -
ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవాళ్లలో యాంకర్ అనసూయ ఒకరు. గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేయడంతో పాటు ట్రెండింగ్ టాపిక్స్పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈమె కూడా ఆన్లైన్లో మోసానికి గురైంది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తన దగ్గర డబ్బులు తీసుకుని, ఇప్పటికీ సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ అసలేం జరిగింది?ప్రస్తుతం ఆన్లైన్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి. మరీ ముఖ్యంగా బట్టల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అనసూయ కూడా ఇలానే నెల క్రితం ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్సైట్లో కొన్ని దుస్తుల్ని ఆర్డర్ పెట్టింది. ముందే డబ్బులు చెల్లించింది. కానీ ఇప్పటికీ సదరు వస్తువులు రాలేదని, అదే టైంలో రీఫండ్ కూడా రాలేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకు: రజినీకాంత్)సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి అప్పనంగా డబ్బులు కొట్టేస్తున్నారని సదరు క్లాతింగ్ వెబ్సైట్పై అనసూయ మండిపడింది. ఈమెకే కాదు గత కొన్నాళ్లుగా ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురువుతున్నాయి. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు అనసూయ కూడా అదే పనిచేసింది. మరి సదరు క్లాతింగ్ బ్రాండ్ స్పందిస్తుందో లేదో చూడాలి?ప్రస్తుతం అనసూయ.. రెండు తమిళ సినిమాలు చేస్తున్నట్లు ఉంది. అలానే ఒకటి రెండు తెలుగు రియాలిటీ షోల్లోనూ జడ్జిగా వ్యవహరిస్తోంది. చివరగా 'పుష్ప 2'లో దాక్షాయణిగా కనిపించింది. ఈనెల 24న రిలీజయ్యే 'హరిహర వీరమల్లు' చిత్రంలోనూ అనసూయ నటించింది.(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) -
వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకా అని ఆశ్చర్యపోయా
ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే అప్పుడప్పుడు వాళ్లపై వాళ్లే సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. సూపర్స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పుడు అలానే చేశారు. తమిళ రచయిత ఎస్.వెంకటేశన్ రచించిన 'వేల్పరి' పుస్తకానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్తోపాటు రజినీ కూడా హాజరయ్యారు. తనపై తాను జోక్స్ వేసుకుని కాసేపు అందరినీ నవ్వించారు.'ఏం మాట్లాడాలి అనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడలనేది స్టేజీపై ఆధారపడి ఉంటుంది. అలానే ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ఈ మధ్య నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలకు శివకుమార్, కమల్ హాసన్ లాంటి వాళ్లని పిలవాల్సింది. ఎందుకంటే వాళ్లు ఎంతో మేధావులు'(ఇదీ చదవండి: అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్తో నటి డేటింగ్)''వేల్పరి' కార్యక్రమానికి అతిథిగా నన్ను ఆహ్వానించినప్పుడు 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్లో నటిచే నన్నెందుకు పిలిచారా? అని ఆశ్చర్యపోయాను' అని రజినీకాంత్ తనపై తాను జోకులు వేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటిహీరో కమల్ తనకంటే మేధావి అని రజినీ చెప్పడం విశేషం.రజినీకాంత్ ప్రస్తుతం 'కూలీ' సినిమా చేశాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. మూవీపై అయితే హైప్ గట్టిగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత రజినీకాంత్.. ఏ డైరెక్టర్తో పనిచేస్తారా అనేది ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉంది.(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) He is 75 now Best orator when comes to stage speeches . The way he kept audience engaging 🔥🔥🔥Ultimate hilarious fun mode 😂😂Mr . Rajinikanth 😂Kamalhaasan elevation 🔥Sivakumar ayya elevation 🔥Dmk function 😂😂Cooling glass slow motion 😂Why I’m chief for this… pic.twitter.com/plbtMjBLQO— Suresh balaji (@surbalutwt) July 11, 2025 -
ముద్ద సీన్ని తొలగిస్తారా?.. సెన్సార్ టీమ్పై నటి ఫైర్!
సినిమాలో ముద్దు సీన్ తొలగించిన సెన్సార్ బోర్డ్పై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి(Shreya Dhanwanthary) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రేక్షకులు థియేటర్స్ రాకుండా వెళ్తారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేక్షకులను చిన్నపిల్లల భావించి, థియేటర్ని అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నారంటూ సెన్సార్ బోర్డ్పై మండిపడింది. వివరాల్లోకి వెళితే..డేవిడ్ కొరెన్స్వెట్, రెచెల్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’(Superman) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇండియన్ వెర్షన్లో 33 సెకన్ల ముద్దు సన్నివేశంతో పాటు హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ని తొలగించారు. సెన్సార్ టీమ్ అభ్యంతరం చెప్పడం వల్లే ఆయా సన్నివేశాలు తొలగించాల్సి వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. దీనిని నటి శ్రేయా ధన్వంతరి తప్పుపట్టింది. ఇదొక అర్థంపర్థం లేని చర్య అని సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. ‘సూపర్ మ్యాన్లో 33 సెకన్ల ముద్దు సీన్ని తొలగించడం ఏంటి? ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని సెన్సార్ వాళ్లే చెబుతుంటారు. పైరసీని ప్రొత్సహించొద్దని అంటారు. కానీ వాళ్లు మాత్రం ఇలాంటి అర్థంపర్థం లేని పనులు చేస్తారు. వాళ్ల లక్ష్యం ఏంటో నాకు అర్థం కాదు. ఇలాంటి చిన్న చిన్న సీన్లను కూడా కట్ చేసి.. థియేటర్ అనుభూతిని దారుణంగా దెబ్బతీస్తున్నారు. మేమే డబ్బులు పెడుతున్నాం..మేమే సమయం కేటాయిస్తున్నాం కదా.. మరి మాకు నచ్చింది చూడకుండా ఆపుతారెందుకు? మేం ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. సినిమా చూడడానికి థియేటర్ ఉత్తమ మార్గం. ప్రేక్షకులను చిన్న పిల్లలా భావించి.. థియేటర్స్ అనుభూతిని ఆస్వాదించకుండా చేస్తున్నారు’ అని సెన్సార్ బోర్డుపై ఫైర్ అయింది.శ్రేయా ధన్వంతరి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’, ‘స్కామ్ 1992’ వంటి వెబ్ సిరీస్లతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ‘జోష్’, ‘స్నేహగీతం’ చిత్రాల్లో నటించింది. త్వరలో విడుదల కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్తో నటి డేటింగ్
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటింగ్, పెళ్లి విషయంలో యువత ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. కొందరు అసలు పెళ్లి చేసుకోవడానికే భయపడుతుంటే.. మరికొందరు అబ్బాయిలు మాత్రం తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలతో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి వరకు వెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇలానే అఖిల్.. తన కంటే పెద్దదైన జైనబ్ని పెళ్లి చేసుకున్నాడు! ఇప్పుడు ప్రముఖ నటి కూడా తన కంటే చిన్నవాడైన ఓ యూట్యూబర్తో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు ఇద్దరూ ప్రకటించారు కూడా!(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) యూట్యూబ్లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.ఎక్కడా కూడా తన బంధం గురించి చెప్పలేదు కానీ ఆశిష్-ఎల్లీ డేటింగ్లో ఉన్నారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఈమె వయసు 34 ఏళ్లు కాగా, ఆశిక్కి 31 ఏళ్లు. మరి వీళ్లు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి?(ఇదీ చదవండి: రేణు దేశాయ్కు సర్జరీ.. అసలేమైంది?) View this post on Instagram A post shared by Ashish Chanchlani (@ashishchanchlani) -
బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?
హీరోయిన్లు సాధారణంగా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు సినిమాల విషయంలో సాహసాలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా తేడా కొడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు మాత్రం అది వర్కౌట్ అవ్వొచ్చు. రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీ రష్మిక కూడా అలాంటి ఓ డేరింగ్ స్టెప్ తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.ఈ మధ్య కాలంలో యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా వరస సినిమాలతో హిట్స్ కొట్టిన రష్మిక, పాన్ ఇండియా మార్కెట్లో వేలకోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన చిత్రాల్లో భాగమైంది. కొన్నిరోజుల ముందు రిలీజైన 'కుబేర'తోనూ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. వీటితో పాటు ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ భాగమైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రేణు దేశాయ్కు సర్జరీ.. అసలేమైంది?)'పుష్ప 2' తర్వాత బన్నీ, తమిళ దర్శకుడు అట్లీతో పనిచేస్తున్నాడు. ఇదివరకే షూటింగ్ మొదలైపోయింది. దీపికా పదుకొణెని హీరోయిన్గానూ అనౌన్స్ చేశారు. మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. రష్మిక కూడా ఇందులో కీ రోల్ చేస్తుందని రూమర్ వచ్చినప్పుడు ఇంకెంత మంది హీరోయిన్లకు చోటుందా అని అనుకున్నారు. అయితే రష్మికది హీరోయిన్ రోల్ కాదని టాక్.బన్నీతో తలపడే నెగిటివ్ రోల్లో రష్మిక కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం వేరే లెవల్ ఉండొచ్చు. గతంలో కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. మరి రష్మిక కూడా అలాంటి డెసిషన్ తీసుకుందా లేదా అనేది కొన్నిరోజుల్లో తేలుతుంది.(ఇదీ చదవండి: నాగచైతన్యపై ఆ రూమర్స్ నిజం కాదు) -
మోహన్ లాల్ దే మెగా విజయం, మళయాళ చిత్రసీమ 2025 తేల్చిందిదే..
తొలి అర్ధ సంవత్సరంలో మలయాళ సినిమా రంగం ఊహించని మలుపులు తిరిగింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ సినిమాల మాదిరిగానే మలయాళ ఇండస్ట్రీనూ భారీగా విస్తరించినా, ఈ ఏడాది మొదటి ఆరు నెలలు కొన్ని సినిమాలు జయాపజయాల అంచనాల్ని తలకిందులుగా చేసి, సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాయి.టాప్ స్టార్ల నుంచి మిశ్రమ ఫలితాలుమళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈసారి డబుల్ హిట్తో బాక్సాఫీస్లో సందడి సృష్టించాడు. విలక్షణ నటుడు, హీరో పృథ్విరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంపురాన్’ (ఎల్2) రాజకీయ థ్రిల్లర్గా రూ.265 కోట్లు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఆయన నటించిన ‘తుదరుం’ కూడా రూ.230 కోట్ల కలెక్షన్స్తో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరోవైపు మళయాళ మెగాస్టార్గా పేర్కొనే మమ్ముట్టి మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఆయన ఈ అర్ధభాగంలో తక్కువ ప్రభావం చూపించాడు. ఆయన నటించిన ‘డొమినిక్’, ‘లేడీస్ పర్స్’ లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్నన పొందలేకపోయాయి.చిన్న సినిమాలకు పెద్ద ఆదరణవినూత్న కధాంశాలు, వైవిధ్య భరిత చిత్రాలకు పెద్ద పీట వేసే తమ మనస్తత్వాన్ని మరోసారి మళయాళీలు చాటుకున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో వచ్చిన కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అసిఫ్ అలీ – అనస్వర రాజన్ జంటగా నటించిన ‘రేఖాచిత్రం’ విమర్శకుల ప్రశంసలు పొందింది. అలాగే, కుంచక్కో బోబన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’, టోవినో థామస్ నటించిన ‘నరివెట్ట’ వంటి థ్రిల్లర్ చిత్రాలు కూడా తమ సత్తా చాటాయి.గుర్తింపుకు నోచుకోలేకపోయిన ఐడెంటిటీ...భారీ అంచనాలతో వచ్చిన ఐడెంటిటీ మాత్రం సరైన గుర్తింపునకు నోచుకోలేక చతికిలపడింది. టోవినో థామస్, త్రిష లాంటి అగ్రతారలు ఉన్నా కథలో లోపాల వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదే వారం విడుదలైన ‘కమ్యూనిస్టుపచ్చ అదవా అప్పా’, ‘ఐడి: ది ఫేక్’ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.ఈ అర్ధ సంవత్సరం మళయాళ పరిశ్రమలో స్పష్టంగా కనిపించిన విషయం అదీ ఇదీ అని తేడా లేకుండా భిన్న రకాల కధలను ప్రేక్షకులు కోరుకుంటున్నారని, కధలో కొత్తదనం, ప్రేక్షకుల అభిరుచులకు దగ్గరగా ఉండే ప్రెజెంటేషన్. థ్రిల్లర్, రాజకీయ నాటకాలు ఆదరణ పొందగా, కుటుంబ భావోద్వేగాలు చిత్ర జయాపజయాల్లో తమ పాత్రను ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయని కూడా వెల్లడైంది.మోహన్లాల్ సినిమాల ఘనవిజయాలు మళయాళ సినీ పరిశ్రమకు ఉన్న బాక్సాఫీస్ సత్తాను చాటగా, చిన్న సినిమాల విజయం కొత్త ఆశల్ని అందించింది. ఇక రెండో అర్ధ సంవత్సరంలో పరిశ్రమ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.. -
కన్నప్ప అట్టర్ ఫ్లాప్ అంటూ ట్రోలింగ్.. మోహన్బాబు రియాక్షన్ ఇదే!
కన్నప్ప సినిమా (Kannappa Movie)కు విమర్శలు కొత్తేమీ కాదు. మూవీ ప్రకటించినప్పటినుంచి ఎప్పుడూ ఏదో రకంగా విమర్శిస్తూనే ఉన్నారు. అయితే సినిమా నుంచి ఎప్పుడైతే భక్తి పాటలు రిలీజయ్యాయో అప్పుడే ఎత్తిన ప్రతివేలు ముడుచుకుంది, జారిన ప్రతి నోరు అదుపులో పెట్టుకుంది. జూన్ 27న రిలీజైన కన్నప్ప చిత్రాన్ని చూసి ఎంతోమంది మంత్రముగ్ధులయ్యారు.ట్రోలింగ్పై స్పందించిన మోహన్బాబువిష్ణు నటనకు ఫిదా అయ్యారు. దర్శకుడి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కానీ కొందరు మాత్రం అదే పనిగా విమర్శిస్తూనే ఉన్నారు. సినిమా ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్.. కన్నప్ప ఏమీ బాగోలేదని కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఈ ట్రోలింగ్పై మోహన్బాబు స్పందిస్తూ.. విమర్శ - సద్విమర్శ, ప్రకృతి- వికృతి.. ఇలా రెండూ ఉంటాయి. ఓ గొప్ప పండితుడు ఏమన్నారంటే.. మోహన్బాబుగారు, జరిగేదంతా చూస్తున్నాను. కన్నప్ప మూవీ గురించి..గత జన్మలో లేదా ఈ జన్మలో తెలిసీతెలియక మీరేదైనా తప్పులు చేసుంటే ఇలా విమర్శించేవారంతా మీ కర్మను తీసుకెళ్తున్నారని అర్థం. కాబట్టి వారిని ఆశీర్వదించండి అన్నారు. వారి గురించి నేనేం మాట్లాడను. వాళ్లు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. కన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, శరత్ కుమార్, కాజల్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు.చదవండి: మూడు రోజుల్లో బిగ్బాస్ బ్యూటీ బర్త్డే.. లక్ష రూపాయలతో -
పిరియడ్స్లోనూ ‘హాఫ్ ఐరన్మ్యాన్’.. రికార్డు సృష్టించిన నటి
కొంతమంది తారలు నటనతో ఆకట్టకుంటూనే అప్పుడప్పుడు తమలోని అసాధరణమైన నైపుణ్యాన్ని బయటిప్రపంచానికి చూపించి.. ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా..ఇతర రంగాలలోనూ తన టాలెంట్ని నిరూపించుకొని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సయామీ ఖేర్(Saiyami Kher ) ఒకరు. తనదైన నటనతో అటు బాలీవుడ్, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇటీవల ‘ఐరన్మ్యాన్ 70.3’ అనే ట్రయాథ్లాన్ను పూర్తిచేసి..ఒకే ఏడాదిలో రెండు సార్లు ఈ రేసుని పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సారి ఆమె పిరియడ్స్లో ఉన్నప్పుడు ఈ ఘనత సాధించడం గమనార్హం.ఏమిటీ ‘ఐరన్ మ్యాన్70.3’ ‘ఐరన్మ్యాన్ 70.3’ అనేది ఒక ప్రముఖ ట్రయాథ్లాన్ రేసు, ఇది ఐరన్మ్యాన్ సిరీస్లో భాగం. దీనిని "హాఫ్ ఐరన్మ్యాన్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పూర్తి ఐరన్మ్యాన్ రేస్ దూరంలో సగం ఉంటుంది. ఈ రేస్ మూడు ఈవెంట్లను కలిగి ఉంటుంది. తొలుత 1.9 కిలోమీటర్లు (1.2 మైళ్లు) ఈత కొట్టాలి. తర్వాత 90 కిలో మీటర్లు(56 మైళ్లు) సైక్లింగ్ చేయాలి. ఆ తర్వాత 21.1(13.1 మైళ్లు) కిలోమీటర్లు పరుగెత్తాలి. మొత్తం దూరం 113 కిలోమీటర్లు(70.3 మైళ్లు). అందుకే దీన్నీ ఐరన్ మ్యాన్ 70.3 అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. జులై 6న స్వీడన్లోని జోంకోపింగ్లో నిర్వహించిన ఈ రేస్లో సయామీ ఖేర్ పాల్గొని పతాకాన్ని సాధించిది. గతేడాది సెప్టెంబర్లో తొలిసారిగా మెడల్ అందుకున్న సయామీ.. ఇప్పుడు స్వీడన్లో నిర్వహించిన రేస్లో సత్తా చాటి మరో పతకం అందుకుంది.నెలసరి సమస్యను అధిగమించి.. నాకు పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ఉంది. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా కాదు. రేసులో పాల్గొనే వారంలోనే నాకు పిరియడ్స్ మొదలయ్యాయి. అదృష్టవశాత్తు నా పీరియడ్స్ చివరి రోజు రేసులో పాల్గొన్న కాబట్టి నొప్పి అంతగా లేదు. కానీ సాధారణ రోజుల కంటే ఆ సమయంలోనే నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించింది. మానసికంగా కొంత కలవరపెట్టింది. చాలా మంది మహిళలు పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి, ఇతర పనులకు హాజరవుతుంటారు. అసౌకర్యంలోనూ మనం ఎలా ముందుకు సాగాలో వారి నుంచి నేర్చుకోవచ్చు. నేను కూడా నెలసరి సమస్యను అధిగమించి గత పోటీ కంటే ఈ సారి 32 నిమిషాల ముందే రేసుని పూర్తి చేశాను’ అని సయామీ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.సయామీ సీనీ నేపథ్యంనాసిక్కి చెందిన సయామీ.. ‘రేయ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి.. అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. చాలా కాలం తర్వాత ‘వైల్డ్ డాగ్’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ, మరాఠీ చిత్రాలతో బీజీగా అయింది. -
'తన్వి ది గ్రేట్' సినిమా వీక్షించిన రాష్ట్రపతి
తన్వి ది గ్రేట్ (Tanvi The Great) అనే చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) వీక్షించారు. చిత్ర యూనిట్తో కలిసి రాష్ట్రపతి భవన్లో ఈ సినిమాను ఆమె చూశారు. అనంతరం వారిని అభినందించారు. భారత సాయుధ దళాల ధైర్యం, త్యాగాలకు నివాళిగా ‘తన్వి ది గ్రేట్’ చిత్రాన్ని అనుపమ్ ఖేర్ (Anupam Kher) తెరకెక్కించారు. శుభాంగి దత్ టైటిల్ పాత్రలో నటించింది. ట్రైలర్లోనే ఆమె నటనతో అందరినీ మెప్పించింది. జులై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం. 2002లో వచ్చిన 'ఓం జై జగదీష్' సినిమా తర్వాత మళ్లీ ‘తన్వి ది గ్రేట్’ చిత్రానికి అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అరవింద స్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ వంటి స్టార్ నటులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎన్ఎఫ్డీసీతో కలిసి అనుపమ్ స్టూడియోస్ నిర్మించింది. -
పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ కి టాలీవుడ్
-
50 సెకన్ల ప్రకటన.. అదిరిపోయే రేంజ్లో 'నయనతార' రెమ్యునరేషన్
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది పాత సామెతే అయినా ఎవరైనా ఎప్పుడూ అమలు పరచేదే. ఇందుకు సంచలన తార నయనతార అతీతం కాదు. ఈమె చాలా కష్టపడి కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన నటి. కేరళలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి నటనపై ఆసక్తితో పలు అవమానాలు, అవరోధాలు ఎదుర్కొని కథానాయకిగా నిరూపించుకున్నారు. అయితే దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తానని బహుశ ఆమె కూడా ఊహించి ఉండరు. కోలీవుడ్లో అయ్యా చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సక్సెస్ను అందుకున్న నయనతార ఆ తరువాత రజనీకాంత్కు జంటగా చంద్రముఖి చిత్రంలో నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా వెలిగపోతున్నారు. ఈమె మొదటి నుంచి సంచనాలకు చిరునామా అని చెప్పవచ్చు. మొదట్లో ప్రేమ, ఆ తరువాత పెళ్లి, ఆపై సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లి, నిర్మాత ఇలా ఒక్కో ఘట్టంలోనూ వివాదాలు, విమర్శలను తొక్కుకుంటూ తన స్థాయిని నిలబెట్టుకుంటున్న నయన్ ఇప్పటికీ స్టార్ హీరోలతో జత కడుతూ బిజీగా ఉన్నారు. ఈ భామ చిత్రానికి రూ.10 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా 50 సెకన్ల నిడివి గల టాటా స్కై వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం సాయాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంటే ఈమె ఒక సెకన్ పారితోషకం అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. అయితే, ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగిందని సమాచారం. నయనతార సాధారణంగా యాడ్స్ చేయడం చాలా అరుదు. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినప్పుడు మాత్రమే యాడ్స్ చేస్తారు. ఇది చూసి ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్కు అంత రెమ్యునరేషన్ తీసుకోరు. నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్కు తగ్గట్టే దూసుకుపోతున్నారు. ఇకపోతే కోలీవుడ్లో ఇటీవల నయన చిత్రాలేమీ విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈమె క్రేజ్ ఏమాత్రం దగ్గలేదనడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది తెరపైకి రావడానికి ఆ చిత్రం సిద్ధం అవుతోంది. -
గదాధారి...
‘‘గదాధారి హనుమాన్’ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది’’ అని రవికిరణ్ తెలిపారు. ఆయన హీరోగా రోహిత్ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించారు.హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్కి నిర్మాతలు సి. కల్యాణ్, రాజ్ కందుకూరి, దర్శకుడు సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. రోహిత్ కొల్లి మాట్లాడుతూ– ‘‘గదాధారి హనుమాన్’తో మూడేళ్లు ప్రయాణం చేశాను. గద ఎంత పవర్ఫుల్ అనేదానిపై మా చిత్రంలో ఓ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘మా దర్శకుడు రోహిత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు రేణుకా ప్రసాద్. ‘‘కుటుంబ కథా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని బసవరాజ్ హురకడ్లి చెప్పారు. -
సార్... మేడమ్ వస్తున్నారు
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘సార్ మేడమ్’.పాండిరాజ్ దర్శకత్వంలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు.పెళ్లికి ముందు ఓ అమ్మాయికి మెట్టినింటి వాళ్లు చెప్పే మాటలతో మొదలయ్యే టీజర్ భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవతో సాగుతుంది. టీజర్ ప్రారంభంలో వంట మాస్టర్లా కనిపించిన విజయ్ సేతుపతి చివర్లో గన్ పట్టుకొని మాస్ యాక్షన్ లుక్లో కనిపించారు. ‘‘రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విజయ్, నిత్యల నటన హైలెట్గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వింబుల్డన్ మ్యాచ్లో దేవర భామ.. బాయ్ఫ్రెండ్తో కలిసి!
దేవర బ్యూటీ జాన్వీ కపూర్ వింబుల్డన్ మ్యాచ్లో సందడి చేసింది. తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి మ్యాచ్కు హాజరైంది. లండన్లో జరుగుతున్న టోర్నీలో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ జాన్వీ కపూర్ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాన్వీ కపూర్- శిఖర్ చాలాసార్లు ఇలా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించారు.ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో కనిపించనుంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు హోమ్బౌండ్, సన్నీ సంస్కారి కి తులసి కుమారి, పరమ్ సుందరి లాంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించనుంది. పరం సుందరి జూలై 24, 2025న విడుదల కావాల్సి ఉండగా.. ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది.Spotting Janhvi Kapoor with Shikhar Pahariya at Wimbledon was not on my list today😭— Preet (@preekaaaa) July 11, 2025Janhvi and Shiku at #Wimbledon pic.twitter.com/a5ejBasqmx— Radha (@JanhviSupremacy) July 11, 2025 -
హనుమాన్ లాంటి మరో సినిమా.. టీజర్ రిలీజ్
రవి కిరణ్ హీరోగా నటించిన మైథలాజికల్ చిత్రం 'గదాధారి హనుమాన్’. ఈ మూవీకి రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర ముఖ్య అతిథులుగా టీజర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ .. 'హనుమాన్ సినిమాను నేనే ప్రారంభించా. ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమాను ప్రారంభించాలనే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఆ హనుమాన్ ఎలా హిట్ అయిందో.. ఈ ‘గదాధారి హనుమాన్’ కూడా అంతే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హనుమాన్ను నమ్ముకున్న వారంతా విజయాన్ని సాధిస్తారు. టీజర్ అద్భుతంగా ఉంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.రాజ్ కందుకూరి మాట్లాడుతూ .. ‘‘గదాధారి హనుమాన్’ టైటిల్ చాలా బాగుంది. ఈ టైటిల్ను పెట్టుకుని సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రవి కిరణ్ ఇది వరకే నాకు కథ చెప్పారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉండబోతోంది. ఇలాంటి చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా ఆడుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్నదా? పెద్దదా? అన్న తేడాని ఆడియెన్స్ చూడటం లేదు. రవి కిరణ్ ఈ మూవీతో సూపర్ స్టార్ అవుతారనిపిస్తోంది. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అని అన్నారు.దర్శకుడు రోహిత్ మాట్లాడుతూ .. ‘‘గదాధారి హనుమాన్’ సినిమాతో నేను మూడేళ్లు ప్రయాణం చేశా. బసవ సర్తో ఈ జర్నీ ప్రారంభమైంది. అప్పుడు చాలా సింపుల్ కాన్సెప్ట్తో మూవీ అనుకున్నాం. కానీ రవి జాయిన్ కావడంతో స్పాన్ మారిపోయింది. అందుకే ఇప్పుడు ఇలా పాన్ ఇండియా స్థాయిలో మూవీని తీసుకు వస్తున్నాం. రవి కిరణ్ ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ను అద్భుతంగా పండించారు. హర్షిత చక్కగా నటించారని' తెలిపారుహీరో రవి కిరణ్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన రాజ్ కందుకూరికి థాంక్స్. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన మా నిర్మాతలు బసవరాజ్, రేణుకా ప్రసాద్ గారికి థాంక్స్. మొదట్లో ఈ సినిమాను చాలా చిన్నగా చేయాలని అనుకున్నాం. కానీ ఆ హనుమాన్ ఇచ్చిన సపోర్ట్, శక్తి వల్లే ఈ సినిమాను ఇంతటి స్థాయిలో తెరకెక్కించగలిగాం. క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయనకు హనుమాన్ అంటే ఇష్టం. ఆ ఇద్దరి ఆశీస్సులు మా సినిమాపై ఉంటాయని భావిస్తున్నా. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. -
ఆ తెలుగు సినిమా నా జీవితాన్ని మార్చేసింది: శృతిహాసన్
కోలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మోనికా అంటూ సాంగే రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ పూజా హేగ్డే తన డ్యాన్స్త అదరగొట్టేసింది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న కూలీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా నటించారు.అయితే ఇటీవల సోషల్ మీడియాకు గుడ్బై చెప్పిన శృతిహాసన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. తనకు లైఫ్ ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీనే అని తెలిపింది.తెలుగులో గబ్బర్ సింగ్ సినిమా తన జీవితాన్నే మార్చిందని చెప్పుకొచ్చింది. కోలీవుడ్ తర్వాత నాకు సక్సెస్ ఇచ్చిందంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమేనని వెల్లడించింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ సార్ పట్టుబట్టి మరి ఆ రోల్ ఇచ్చారని గుర్తు చేసుకుంది. మా నాన్న ఫిల్మ్ ఫేర్ అవార్డ్ను తీసుకునేందుకు హైదరాబాద్కు వచ్చానని శృతిహాసన్ తెలిపింది. -
చాలా ఏళ్లు బతకాలని ఉంది.. అప్పుడే నన్ను చంపేయొద్దు: నెటిజన్లకు కరణ్ జోహార్ కౌంటర్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవలే ట్రైటర్స్ పేరుతో ఓ రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించారు. అమెజాన్ ప్రైమ్లో ప్రసారమైన ఈ షోలో బిగ్బాస్ నటి ఉర్ఫీ జావెద్తో నికితా లూథర్ విజేతగా నిలిచారు. అయితే కొద్ది రోజుల క్రితం కరణ్ లుక్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరి బక్కచిక్కపోయి కనిపించడంతో అసలు ఏమైందని తెగ ఆరా తీశారు. ఇంత త్వరగా బరువు తగ్గడం ఎలా సాధ్యమంటూ నెటిజన్స్ ప్రశ్నించారు. కేవలం ఇంజక్షన్స్ ద్వారానే ఇలాంటివి సాధ్యమని కొందరు ఆరోపించారు.ఈ నేపథ్యంలో తన వెయిట్ లాస్కు సంబంధించి వచ్చిన రూమర్స్పై మరోసారి స్పందించాడు. ధడక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన కరణ్ జోహార్ తాను బరువు తగ్గడంపై మాట్లాడారు. నెటిజన్స్ తనను ఏకంగా చంపేశారని అన్నారు. నేను చాలా ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.కరణ్ మాట్లాడుతూ..'నేను బరువు తగ్గడానికి ఒకే ఒక కారణం ఉంది. నేను జీవితంలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సవాళ్లను స్వీకరించా. నెటిజన్స్కు నేను చెప్పేది ఏంటంటే.. నా పిల్లల కోసం చాలా ఏళ్ల పాటు బతకాలనుకుంటున్నా. నేను ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని మీ అందరికీ పరిచయం చేస్తా' అని అన్నారు.నెటిజన్స్ ట్రోల్స్కాగా.. గతంలో కరణ్ జోహార్ ఓజెంపిక్ను ఉపయోగించడం లేదని చేసిన వాదనలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఓజెంపిక్తో మీరు బరువు తగ్గారని అంగీకరించడంలో తప్పు లేదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. బరువు మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, మీరు బరువు తగ్గిన తర్వాత బాగానే ఉంటే, మీరు దానిని ఎలా కోల్పోయారన్నది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గర్వపడండి మీ డ్రీమ్ అదే కదా .. ఉన్నది ఒక్కటే జీవితం. మన శరీరంతో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్..’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘అది ఓజెంపిక్ ముఖమే.. దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తోంది .దాని గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. సార్ నిజం నిర్భయంగా చెప్పడి" అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో తాజాగా తనపై హెల్త్పై వచ్చిన రూమర్స్పై రిప్లై ఇచ్చారు కరణ్ జోహార్. -
జీన్ ప్యాంటు బుల్లెమ్మ మీనాక్షి.. పచ్చబొట్టుతో నిహారిక
జీన్ డ్రస్సుతో రచ్చ లేపుతున్న మీనాక్షి చౌదరివీపుపై పచ్చబొట్టుతో మరింత అందంగా నిహారికబీచ్లో తల్లితో కలిసి ఎంజాయ్ చేస్తున్న సుప్రీతసన్ కిస్ ఫొటోలు పోస్ట్ చేసిన వైష్ణవి చైతన్యఇంటికి పెయింట్ వేసుకున్న 'పుష్ప' ఫేమ్ పావనియూకేలో అందాల జాతర చేస్తున్న పూజిత పొన్నాడవింటేజ్ లుక్స్తో ఆకాంక్ష క్లాస్ ఫొటోషూట్ View this post on Instagram Shared post on Timeporn stars free porn.boxes3{height:175px;width:153px;} #n img{max-height:none!important;max-width:none!important;background:none!important} #inst i{max-height:none!important;max-width:none!important;background:none!important} View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) -
నాగచైతన్యపై ఆ రూమర్స్ నిజం కాదు
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. మరోవైపు నెక్స్ట్ ఏం మూవీ చేస్తాడా అని ఇప్పటినుంచే కొన్నిపేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో తమిళ దర్శకుడు మిత్రన్ పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న రూమర్లపై ఓ క్లారిటీ కూడా వచ్చేసింది.తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్-నాగచైతన్య కాంబినేషన్లో ఓ స్పై డ్రామా సినిమా తీసేందుకు సన్నాహాలు మొదలయ్యాయని కోలీవుడ్ నుంచి సమాచారం వచ్చింది. అయితే చైతూ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం అలాంటివే లేవని తెలుస్తోంది. తమిళంలో 'ఇరంబుదురై' (తెలుగులో 'అభిమన్యుడు'), 'సర్దార్' లాంటి హిట్ సినిమాలను తీసిన దర్శకుడు పీఎస్ మిత్రన్. ఒకవేళ ఈయనతో చైతూ సినిమా చేస్తే బాగానే ఉంటుంది. మరి భవిష్యత్తులో కాంబో సెట్ అవుతుందేమో చూడాలి. -
'కూలీ' నుంచి మోనికా.. స్పెషల్ సాంగ్ రిలీజ్
సూపర్స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఇదివరకే చికిటు అనే పాట రిలీజ్ కాగా.. ఇప్పుడు మోనికా అంటూ సాగే రెండో సాంగ్ రిలీజ్ చేశారు. పూజా హెగ్డే చేసిన స్పెషల్ పాట ఇది. రెడ్ కలర్ డ్రస్సుల్లో గ్లామర్ చూపిస్తూ పూజ డ్యాన్స్ బాగానే చేసింది. కాకపోతే అనిరుధ్ గతంలో కంపోజ్ చేసిన సాంగ్స్లా ఇదేం ప్రత్యేకంగా అనిపించలేదు. కాకపోతే కలర్ఫుల్గానే ఉంది.(ఇదీ చదవండి: లోకేశ్ కనగరాజ్పై చాలా కోపం.. నన్ను వేస్ట్ చేశాడు: సంజయ్ దత్)ఈ పాటని వైజాగ్ పోర్ట్లో తీసినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్సులు వేస్తూ కనిపించాడు. ఇదే గీతంలో విలన్ పాత్ర చేస్తున్న నాగార్జున కూడా స్టెప్పులేశాడు. కాకపోతే ఆ విజువల్స్.. లిరికల్ వీడియోలో పెట్టలేదు. థియేటర్లలో అవి ఉంటాయని తెలుస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న 'కూలీ'లో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్.. ఇలా స్టార్స్ బోలెడంత మంది ఉన్నారు. హైప్ కూడా గట్టిగానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ) -
నన్ను వేస్ట్ చేశాడు.. లోకేశ్ కనగరాజ్పై చాలా కోపం
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ, విక్రమ్ లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే స్టార్ దర్శకుల్లో ఇతడు ఒకడు. ప్రస్తుతం రజినీకాంత్తో 'కూలీ' తీస్తున్నాడు. ఈ మూవీపై హైప్ మామూలుగా లేదు. సరే ఇదంతా పక్కనబెడితే లోకేశ్పై తాను చాలా కోపంగా ఉన్నానని, తనని వేస్ట్ చేశాడని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ)స్వతహాగా బ్యాంక్ ఉద్యోగి అయిన లోకేశ్ కనగరాజ్.. 'మా నగరం' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ఖైదీ'తో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో దళపతి విజయ్తో 'లియో' సినిమా తీశాడు. కాకపోతే ఇది సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటించాడు. ఇప్పుడు దాని గురించే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో సంజయ్ దత్ మాట్లాడాడు.'కేడీ ద డెవిల్' అనే సినిమా టీజర్ని రిలీజ్ చేశారు. ఇందులో సంజయ్ కీలక పాత్ర చేశాడు. దీని ప్రమోషన్లో భాగంగా మూవీ టీమ్ అంతా తాజాగా చెన్నైలో ల్యాండ్ అయింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సంజయ్ దత్.. 'రజినీకాంత్, కమల్, అజిత్ సినిమాలు నేను చూస్తుంటాను. రజినీ సర్తో కలిసి అప్పట్లో హిందీ చిత్రాలు కూడా చేశాను. దళపతి విజయ్తోనూ 'లియో' చేశా. అయితే లోకేశ్పై నాకు చాలా కోపం. ఎందుకంటే చిన్న రోల్ ఇచ్చి నన్ను వేస్ట్ చేశాడు(నవ్వుతూ)' అని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)"I worked with #VijayThalapthy & I loved it. I'm angry with #LokeshKanagaraj, because he didn't give me a big role in #LEO. He wasted me.- #SanjayDutt pic.twitter.com/zzPaeqfEub— Movies4u Official (@Movies4u_Officl) July 11, 2025 -
‘వర్జిన్ బాయ్స్’ రివ్యూ
బిగ్బాస్ ఫేం మిత్ర శర్మ శ్రీహాన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం వర్జిన్ బాయ్స్. గేమ్ ఆన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న గీత్ ఆనంద్, జెనీఫర్ ఇమాన్యుయల్, వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాని గేమ్ ఆన్ డైరెక్టర్ దయానంద్ డైరెక్ట్ చేశాడు. రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫైనల్లీ నేడు(జులై 11) ఈ సినిమా ధియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాంకథేంటంటే..డూండీ (శ్రీహాన్), ఆర్య (గీత ఆనంద్), రోని(రోనిత్ రెడ్డి) ఒక యూనివర్సిటీలో కలిసి చదువుకుంటూ ఉంటారు. ఎలా అయినా వర్జినిటీ కోల్పోవాలని తహతహలాడుతున్న వీరికి వీరి ఫ్రెండ్ (కౌశల్) ఒక ఛాలెంజ్ ఇస్తాడు. తాను మళ్ళీ అమెరికా వెళ్లి వచ్చేటప్పటికి మీరంతా వర్జినిటీ కోల్పోవాలని ఛాలెంజ్ చేస్తాడు. ఎలాగైనా వర్జినిటీ కోల్పోవాలని ఉద్దేశంతో శ్రీహాన్ జెనీఫర్ ను, గీత్ ఆనంద్ మిత్ర శర్మను, రోనిత్ రెడ్డి అన్షులా ధావన్ను ప్రేమిస్తారు. వర్జినిటీ కోల్పోవడానికి వీరితో ప్రేమలో పడిన ముగ్గురు వర్జినిటీ కోల్పోయారా? ఛాలెంజ్లో గెలిచారా? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందేఎలా ఉందంటేఓ ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు వర్జినిటీ కోల్పోవడానికి చేసే పోరాటమే ఈ కథ. కథలో కొత్తదనం లేదు కానీ తనదైన శైలిలో నవ్విస్తూ ఎంగేజ్ చేసేలా రాసుకోవడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సెక్స్ ముఖ్యమని భావించి దాని వెనుకబడి తర్వాత ప్రేమ మాధుర్యాన్ని చవిచూసి, ప్రేమే గొప్పదని ఒప్పుకునే లైన్తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. వర్జిన్ బాయ్స్ కథ కూడాఅదే లైన్ లో రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే నేటి యూత్ ను టార్గెట్ చేసుకొని వారిని ఎంగేజ్ చేసేలా చాలా సీన్స్ రాసుకోవడంతో కొంతవరకు యూత్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సినిమా ఓపెనింగ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులకు ఎక్కడా కొత్తదనం కనిపించకపోయినా కొన్నిచోట బోల్డ్ జోక్స్, అమ్మాయిల అందాలతో కనివిందు చేస్తూ చాలావరకు సినిమా నడిపించే ప్రయత్నం చేశారుఒక ముగ్గురు యువకులు నగ్నంగా రోడ్డు మీద పరిగెత్తే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది.ఆ తర్వాత ఈ ముగ్గురి క్యారెక్టర్ లోని ఎస్టాబ్లిష్ చేస్తూ కథనం సాగుతుంది. అమ్మాయిల చేతిని తాకితేనే ఎంతో అదృష్టం అని భావించే ముగ్గురు యువకులు న్యూ ఇయర్ రోజుకి వర్జినిటీ కోల్పోవాలని లక్ష్యంతో ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడటం, వారితో ప్రేమ కయ్యాలు ఇలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్లో ఏదో ట్విస్ట్ ఇచ్చిన ఫీలింగ్ ఇస్తారు కానీ అదేమీ ఉండదు, సెకండాఫ్ మొదలయ్యాక వీరి ప్రేమ మీద అనుమానాలు తర్వాత మళ్లీ కలిసేందుకు ప్రయత్నాలు అంటూ రొటీన్ గానే సాగుతుంది చివరలో ఒక మంచి మెసేజ్ తో సినిమాని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు.ఎవరు ఎలా చేశారంటే.. ఈ సినిమాలో శ్రీహాన్ పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఎందుకంటే మన కాలేజీలలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వ్యక్తులను మనం చూసే ఉంటాం. ఈ పాత్రలో శ్రీహాన్ ఒదిగిపోయాడు.తర్వాత కొంతవరకు గీత్ ఆనంద్ పాత్ర కన్వెన్సింగ్ గా ఉంటుంది. మిత్ర శర్మ పద్ధతి అయిన అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. జెనీఫర్ అన్షుల ఒకపక్క అందాలు ఆరబోస్తూనే అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్ర పరిధి మేరకు పరవాలేదు అనిపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది సంగీతం పర్వాలేదు నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది నిర్మాణ విలువలు బాగున్నాయి ఎడిటింగ్ సినిమాకి సరిపోయేలా కట్ చేశారు.రేటింగ్: 2.75/5 -
శ్రీలీల లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ రాజమౌళితో.. కన్నడ వర్షన్ ట్రైలర్ను కిచ్చా సుదీప్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన వైరల్ వయ్యారి అనే ఐటమ్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.Happy to release the trailer of @KireetiOfficial’s #Junior… Wishing him all the best on his debut and best wishes to the entire team for the release on July 18th!#JuniorTrailer https://t.co/qDwK35QvR2— rajamouli ss (@ssrajamouli) July 11, 2025 -
పాక్ యువ నటి మృతి.. పోస్ట్మార్టం రిపోర్టులో సంచలన విషయాలు!
పాక్ నటి హుమైరా అస్గర్ మృతి కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. కరాచీలోని తన నివాసంలో హుమైరా విగతజీవిగా కనిపించింది. ఈ నెల 9న ఆమె మృతదేహన్ని ఫ్లాట్లో గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే హుమైరా పోస్టుమార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయం బయటపడింది. ఆమె మరణించి దాదాపు తొమ్మిది నెలలు అయిందని అక్కడి స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఆమె నివసిస్తోన్న అపార్ట్మెంట్లోని ఫ్లోర్లో ఎవరూ లేకపోవడంతో ఈ విషయం బయటికి రాలేదని తెలుస్తోంది.కాగా.. నటి చివరిసారిగా ఫోన్ కాల్ అక్టోబర్ 2024లో చేసిందని పోలీసులు గుర్తించారు. అదే ఆపార్ట్మెంట్లో నివసించేవారు కూడా ఆమెను చివరిసారిగా గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లో చూశామని పోలీసులకు తెలిపారు. అంతేకాకుండా హుమైరా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదు.. చివరిసారి సెప్టెంబర్ 2024లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ఈ లెక్కన ఆమె గతేడాదిలోనే మరణించినట్లు తెలుస్తోంది.మరోవైపు నటి భౌతికకాయాన్ని తీసుకునేందుకు ఆమె కుటుంబసభ్యులు నిరాకరించారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని తండ్రి, రిటైర్డ్ ఆర్మీ వైద్యుడు డాక్టర్ అస్గర్ అలీ పోలీసులకు తెలిపారు. చాలా రోజుల క్రితమే తనతో సంబంధాలు తెంచుకున్నామని ఆయన అన్నారు. పోలీసులు మొదట హుమైరా సోదరుడిని ఆమె ఫోన్ ద్వారా సంప్రదించగా.. తన తండ్రితోనే మాట్లాడాలని చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీంతో సింధ్ సంస్కృతి విభాగం హుమైరా అంత్యక్రియల ఏర్పాట్లు చేసేందుకు ముందుకొచ్చింది.హుమైరా రియాలిటీ షో తమషా ఘర్లో నటించింది. ఆ తర్వాత 2015 యాక్షన్-థ్రిల్లర్ చిత్రం జలైబీలో కూడా కనిపించింది. ఆమె పాకిస్తానీ చిత్రంలో మోడల్గా కనిపించింది. హుమైరా జస్ట్ మ్యారీడ్, చల్ దిల్ మేరే, ఎహ్సాన్ ఫరామోష్, గురు వంటి పాకిస్తాన్ సీరియల్స్లో నటించింది. హుమైరా చివరిసారిగా ఫర్హాన్ సయీద్, సోన్యా హుస్సిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ వ్యాక్సిన్ చిత్రంలో కనిపించింది. ఈ మూవీ 2021లో విడుదలైంది. -
ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. అన్ని భాషల సినిమాలు థియేటర్లకు వెళ్లి చూడలేం కాబట్టి డిజిటల్గా అందుబాటులోకి వచ్చిన తర్వాత చూసేయొచ్చు. అందుకు తగ్గట్లు ఓటీటీ సంస్థలు కూడా హాలీవుడ్తోపాటు విదేశీ భాషల్లో తెరకెక్కిన చిత్రాల్ని మన ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హాలీవుడ్లో తీసిన కరాటే మూవీ సడన్గా స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)చైనీస్ నటుడు జాకీ చాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు. 2010లో 'కరాటే కిడ్' అనే మూవీ చేశాడు. అది తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడు దాదాపు అలాంటి కాన్సెప్ట్తోనే తీసిన మూవీ 'కరాటే కిడ్: లెజెండ్స్'. మే 30న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.సినిమా విషయానికొస్తే.. ఓ చైనీస్ కుర్రాడు తల్లితో కలిసి అమెరికా వచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన కంగ్ ఫూని కూడా పక్కనబెట్టేస్తాడు. అయితే కాలేజీలో ఓ ఆకతాయి కుర్రాడు.. ఇతడిని ఇబ్బంది పెడతాడు. దీంతో ఇద్దరు మాస్టర్స్ ఆధ్వర్యంలో మళ్లీ కంగ్ ఫూ ప్రాక్టీస్ చేయడంతో పాటు కరాటే నేర్చుకుంటాడు. మరి చివరకు ఏమైంది? ఆకతాయికి చైనీస్ కుర్రాడు కరాటేతో సమాధానమిచ్చాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
మా కన్నడ భాష జోలికొస్తే ఊరుకోం: హీరో ధృవ సర్జా
ఒక్కసారి నోరు జారితే మాట వెనక్కు తీసుకోలేం. కొన్నిసార్లు దానివల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. తమిళ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) విషయంలో ఇదే జరిగింది. తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందని ఆయన చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయన ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ సినిమాను కన్నడిగులు అడ్డుకున్నారు. కోర్టు జోక్యం చేసుకుని విడుదలకు అనుమతిచ్చినప్పటికీ థగ్ లైఫ్ రిలీజ్ చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదు.చెన్నైలో కేడీ టీమ్దీంతో కన్నడ థియేటర్లలో థగ్ లైఫ్ బొమ్మ పడకుండానే నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై కన్నడ హీరో ధ్రువ సర్జా (Dhruva Sarja)కు ప్రశ్న ఎదురైంది. ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేడీ: ద డెవిల్. త్వరలోనే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా తమిళ టీజర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా ఓ తమిళ జర్నలిస్ట్ నుంచి హీరోకు ఊహించని ప్రశ్న ఎదురైంది.నేను పుట్టకముందు నుంచే..కన్నడ సినిమాలు తమిళంలో సులువుగా రిలీజైపోతున్నాయి. కానీ, ఇటీవల ఓ తమిళ చిత్రాన్ని (Thug Life Movie) మాత్రం కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. దీంతో కొందరు తమిళ ప్రజలు.. కన్నడ చిత్రాలు కూడా కోలీవుడ్లో రిలీజ్ చేసేందుకు వీల్లేదంటున్నారు. మరి మీ సినిమాను ఎలా రిలీజ్ చేస్తున్నారు? అని అడిగారు. అందుకు ధ్రువ సర్జా.. నేను పుట్టకముందు నుంచే కర్ణాటకలో బోలెడన్ని తమిళ చిత్రాలు రిలీజయ్యాయి. ఏ ఒక్క సినిమానూ ఎవరూ ఆపలేదు. కమల్ హాసన్ సర్ చేసిన కామెంట్స్ వల్ల ఆయన సినిమాపై వ్యతిరేకత వచ్చిందంతే! మా భాషను అగౌరవపరిస్తే..ఎవరికైనా మాతృభాష అంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. అందరిలాగే మేమూ మా భాషను ప్రేమిస్తాం. మా భాష గురించి తప్పుగా మాట్లాడితే జనాలు స్పందించకుండా ఉండరు కదా! థగ్ లైఫ్ మినహా అన్ని తమిళ చిత్రాలు ఏ ఇబ్బందీ లేకుండా రిలీజయ్యాయి. వాటిని కన్నడిగులు ఆదరించారు కూడా! మాతృభాష జోలికొస్తే, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఎవరూ ఊరుకోరు అని ధృవ సర్జా ఘాటుగా ఆన్సరిచ్చాడు.చదవండి: మరోసారి తల్లి కాబోతున్న దేవర నటి.. 'ఇన్నాళ్లు సీక్రెట్గా ఉంచాం' -
'దానికి మీరు అమ్మాయి అయితే చాలు'.. కింద పడేసి కొట్టాడన్న దంగల్ నటి!
దంగల్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించిన ఫాతిమా బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మెట్రో ఇన్ డినో చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో అలీ ఫజల్ సరసన నటించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న నటి.. ఇటీవల ఇంటర్వ్యూలో తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇటీవల ఓ వ్యక్తి తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ సమయంలో అతన్ని తాను కొట్టానని ఫాతిమా వెల్లడించింది. అయితే తను కూడా తిరిగి తనను గట్టిగా కింద పడేంతలా కొట్టాడని వివరించింది. దీంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపింది. ఆ సంఘటన తర్వాత తాను చాలా జాగ్రత్తగా ఉన్నానని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. అటువంటి పరిస్థితులలో ఎలా స్పందించాలో ఇప్పుడు తెలిసొచ్చిందని పేర్కొంది. మనలో ఏదో తప్పు జరుగుతోంది.. దానికి మనం ఎలా స్పందించాలో మాత్రమే ఆలోచించాలని చెబుతోంది ఫాతిమా.అంతేకాకుండా ముంబయిలో ఓ టెంపో డ్రైవర్ నన్ను ఫాలో అయ్యేవాడని ఫాతిమా సనా షేక్ తెలిపింది. కొవిడ్ టైమ్లో ముసుగు ధరించి సైకిల్ తొక్కుతుంటే.. నన్ను చూసిన టెంపో డ్రైవర్ హారన్ మ్రోగించేవాడని.. నేను నా లైన్లో వెళ్తంటే నా వెంటే వచ్చేవాడని వివరించింది. సెలబ్రిటీ అయినా.. సామాన్యులైనా ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమని తెలిపింది. దీనికి మీరు కేవలం అమ్మాయి అయి ఉంటే చాలని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ఫాతిమా సనా షేక్ నటించిన ఆప్ జైసా కోయి ఈ రోజే నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఇందులో ఆర్ మాధవన్ కూడా నటించారు. ఈ చిత్రం ఇద్దరు మధ్య వయస్కుల మధ్య జరిగే ప్రేమకథగా తెరకెక్కించారు. ఒక స్త్రీ సంప్రదాయ కుటుంబంలో తన ప్రేమ కోసం ఎలా పోరాడుతుందో ఈ మూవీలో చూపించనున్నారు. -
మరో రీమేక్.. 'దఢక్ 2' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్లో మరో రీమేక్ రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా పరిచయమైన 'దఢక్' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. కాకపోతే ఇందులో హీరోహీరోయిన్లతో పాటు స్టోరీ కూడా పూర్తిగా మారిపోయింది. కాకపోతే మెయిన్ పాయింట్ మాత్రం దాదాపు అదే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఏ మూవీకి రీమేక్? ట్రైలర్ ఉందనేది ఇప్పుడు చూద్దాం.మరాఠీలో వచ్చిన 'సైరాత్' సినిమా అదిరిపోయే హిట్. దాన్ని హిందీలో 'దఢక్' పేరుతో రీమేక్ చేశారు. తక్కువ కులానికి చెందిన ఓ అబ్బాయి.. పై కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ప్లాట్ పాయింట్. ఆ మూవీ హిందీలోనూ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ 'దఢక్ 2' తీశారు. ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)ట్రైలర్ చూడగానే అరె ఈ స్టోరీ ఎక్కడో చూసినట్లు ఉందే అనిపించింది. తమిళంలో 2018లో 'పరియరుమ్ పెరుమాళ్' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు దీన్నే హిందీలో 'దఢక్ 2' పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్ ఆర్ట్ ఫిల్మ్ తరహాలో ఉంటుంది. రీమేక్కి వచ్చేసరికి మాత్రం కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చారనిపిస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది తక్కువ కులానికి చెందిన కుర్రాడిగా, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి పై కులానికి చెందిన అమ్మాయిగా నటించారు.ట్రైలర్ అయితే చూడటానికి బాగానే ఉంది. హీరోహీరోయిన్లుగా చేసిన సిద్ధాంత్, తృప్తి జంట మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి సినిమా ఏ మేరకు క్లిక్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్) -
బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!
'బాహుబలి' రిలీజ్ తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి తెలుగు సినిమాలతో పాటు కేజీఎఫ్ తదితర చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించాయి. హిందీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్లో పరిస్థితి దారుణంగా తయారైంది. స్టార్ హీరోలు తీసిన సినిమాలు సరిగా ఆడట్లేదు. కొందరు సౌత్ దర్శకులు.. హిందీ హీరోలతో తీసిన జవాన్, యానిమల్ లాంటివి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఈ క్రమంలోనే గత కొన్నాళ్లలో హిందీ నటీనటులు.. బాహాటంగానే సొంత ఇండస్ట్రీపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా అలాంటి కామెంట్స్ చేశాడు. 'కేజీఎఫ్' చిత్రంలో విలన్గా అలరించిన ఇతడు.. ఇప్పుడు 'కేడీ ది డెవిల్' అనే మరో కన్నడ మూవీలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులోనే సంజయ్ దత్.. బాలీవుడ్ పరిస్థితి ఏంటో చెప్పేశాడు.(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్)ప్రస్తుతం మీరు దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు కదా.. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఏం తీసుకెళ్తారు? అని ఓ రిపోర్టర్ అడిగాడు. దీనికి బదులిచ్చిన సంజయ్ దత్.. 'మంచి సినిమాలు తీయాలనే ప్యాషన్ని బాలీవుడ్కి తీసుకెళ్తా. గతంలో మా దగ్గర మంచి సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు మా వాళ్లు.. కలెక్షన్, నంబర్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ సౌత్లో అలా కాదు. ముఖ్యంగా తెలుగులో మూవీస్పై మంచి ప్యాషన్ కనిపిస్తోంది. అందుకే నాకు ఇక్కడ పనిచేయడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలోనూ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. ఆ చిత్రంతో పాటు తెలుగు సినీ పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు. 'తెలుగులో చాలామంది నిర్మాతలు నాకు తెలుసు. వాళ్లతో కలిసి నేను పనిచేశాను. 1980ల నుంచి హైదరాబాద్ వస్తున్నాను. ఇక్కడి వాతావరణం, ఫుడ్ బాగుంటాయి. తెలుగులో ప్రభాస్తో సినిమా చేస్తున్నా. తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. ప్రభాస్ నాకు ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తున్నాడు' అని సంజూ చెప్పాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే బాలీవుడ్లో ఇప్పుడు ఎవరూ సరైన సినిమాలు తీయట్లేదని, ఈ విషయంలో టాలీవుడ్ చాలా బెటర్ అని అర్థం. ఓ రకంగా చూస్తే పరోక్షంగా సొంత ఇండస్ట్రీ పరువునే తీసేశాడు!(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
'మర్యాద రామన్న'కు రీమేక్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా
తెలుగులో కొన్నే సినిమాలు చేసినప్పటికీ మృణాల్ ఠాకుర్ అభిమానుల్ని బాగానే సంపాదించుకుంది. కొన్నిరోజుల క్రితం ఓ విషయమై ఈమె తెగ ట్రెండ్ అయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా ఓ హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర ట్రైలర్ని రిలీజ్ చేశారు. 56 ఏళ్ల హీరోతో ఈ మూవీలో రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?)2010లో తెలుగులో 'మర్యాద రామన్న' సినిమా రిలీజైంది. రాజమౌళి దర్శకత్వం వహించగా కమెడియన్ సునీల్.. ఇందులో హీరోగా నటించాడు. పలు భాషల్లో ఇది రీమేక్ అయింది. హిందీలో అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్' పేరుతో రీమేక్ చేశాడు. 2012లో ఇది విడుదలైంది. హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధం చేశారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2' పేరుతో జూలై 25న రిలీజ్ చేయబోతున్నారు. తొలి పార్ట్లో సోనాక్షి సిన్హా హీరోయిన్ కాగా.. ఇప్పుడు మృణాల్ ఠాకుర్ హీరోయిన్.ట్రైలర్ విషయానికొస్తే.. పంజాబ్ నుంచి సర్దార్, స్కాట్లండ్ వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కుటుంబానికి సాయం చేసే క్రమంలో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. తర్వాత ఏమైంది? ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తోంది. తొలి భాగంలానే దీన్ని కూడా కామెడీ ఎంటర్టైనర్గా తీశారు. ట్రైలర్ ఓకే ఓకే ఉంది. పెద్దగా మెరుపులేం లేవు. మరి థియేటర్లలో మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?
టాలీవుడ్ రూపురేఖల్ని మార్చిన సినిమా 'బాహుబలి'. సరిగ్గా పదేళ్ల క్రితం థియేటర్లలో తొలి భాగం రిలీజ్ కాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా ట్రెండ్కి శ్రీకారం చుట్టింది. అప్పటినుంచి ఏ పెద్ద సినిమా రిలీజైనా సరే 'బాహుబలి' రికార్డ్స్ని సదరు చిత్రం దాటిందా లేదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి ఈ చిత్రానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీమ్ అంతా మరోసారి కలిశారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఈ మొత్తం ఫొటోల్లో చాలామంది ప్రభాస్ లుక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్తో స్టైలిష్గా కనిపించాడు. డార్లింగ్ అభిమానులైతే తెగ సరదా పడిపోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ అనుష్క కనిపించకపోవడం మాత్రం కాస్త వెలితిగా అనిపించింది. ఇంతకీ ఆమె రాకపోవడానికి కారణం ఏంటా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన)అయితే 'బాహుబలి' చేస్తున్న టైంలో 'సైజ్ జీరో' అనే మూవీ చేసిన అనుష్క.. ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా బరువు పెరిగింది. కానీ తగ్గే విషయంలో మాత్రం అప్పటినుంచి పలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. అందుకే బాహుబలి తర్వాత పలు సినిమాలు చేసినా సరే బయట పెద్దగా కనిపించలేదు. కనీసం ప్రెస్ మీట్స్కి కూడా హాజరు కాలేదు. ఇప్పుడు కూడా అందుకే రీ యూనియన్ పార్టీకి హాజరు కాలేదని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది.ఇకపోతే అనుష్క నటించిన 'ఘాటీ' సినిమా లెక్క ప్రకారం జూలై 11న అంటే ఈ రోజు(శుక్రవారం) థియేటర్లలోకి రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త డేట్ ఎప్పుడనేది టీమ్ చెప్పలేదు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. చాలా భాగం అడవి బ్యాక్ డ్రాప్లో తీశారు. మరి ఈ మూవీ రిలీజ్ ముందైనా సరే అనుష్క.. బయటకొస్తుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం) View this post on Instagram A post shared by Baahubali (@baahubalimovie) -
ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో థియేటర్లలోకి వచ్చిన హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ 'కుబేర'. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. యునానిమస్గా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. అయితేనేం ఇప్పుడు బిగ్ స్క్రీన్పై ఉండగానే డిజిటల్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం)విడుదలకు ముందు 'కుబేర' ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పుడు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో మిస్ కావొద్దు.'కుబేర' విషయానికొస్తే.. దీపక్ (నాగార్జున) సీబీఐ ఆఫీసర్. అక్రమ కేసు కారణంగా జైలులో ఉంటాడు. దేశంలో సంపన్నుడైన నీరజ్ మిత్రా(జిమ్ షర్బ్) ఇతడిని బయటకు తీసుకొస్తాడు. ఓ ఆయిల్ డీల్ విషయమై లక్ష కోట్ల రూపాయలని ప్రభుత్వంలో పెద్దలకు ఇవ్వడంలో భాగంగా దీపక్ని వాడుకోవాలనేది నీరజ్ ప్లాన్. ఈ క్రమంలోనే దేవా (ధనుష్)తో పాటు మరో ముగ్గురు అనాథల పేరుపై బినామీ కంపెనీలు సృష్టిస్తాడు దీపక్. వాళ్ల అకౌంట్స్ నుంచి ప్రభుత్వ పెద్దలకు డబ్బులు చేరవేయాలనేది ఆలోచన. అయితే... దీపక్, నీరజ్ మిత్రా గ్యాంగ్ నుంచి దేవా తప్పించుకుంటాడు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న నీరజ్ మిత్రాని ఓ బిచ్చగాడు ఎన్ని ఇబ్బందులకు పెట్టాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సినిమా టికెట్ లాటరీ.. ఐఫోన్ గెలుచుకున్న యువకుడు) -
సినిమా టికెట్ లాటరీ.. ఐఫోన్ గెలుచుకున్న యువకుడు
మిత్రాశర్మ, బిగ్బాస్ శ్రీహాన్, గీతానంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వర్జిన్ బాయ్స్' ఈ మూవీ జూలై 11న థియేటర్లో విడుదలైంది. థియేటర్లలో టికెట్ కొన్న ఆడియెన్స్కు ఐఫోన్ను గిఫ్ట్గా ఇస్తామని ట్రైలర్ లాంఛ్ మేకర్స్ వెల్లడించారు. వారు చెప్పిన విధంగానే మొదటిరోజు మాట నిలబెట్టుకున్నారు. దర్శకుడు దయానంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజ్ గురు ఫిలిమ్స్ నుంచి రాజా దారపునేని నిర్మించారు.వర్జిన్ బాయ్స్ విడుదల సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "మేం పెట్టిన స్కీమ్ టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు,’ మనీ రైన్ కాన్సెప్ట్స్ జనాల్లోకి బాగా వెళ్లింది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని, థియేటర్లకు ప్రేక్షకులను ఎక్కువ శాతం వచ్చేలా చేయాలని మేమీ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అలాగే దర్శకుడు కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. కథ ఏదైతే చెప్పారో అదే నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. అలాగే సినిమా కోసం ఆర్టిస్ట్లు ప్రతి ఒక్కరూ ఎంతగానో కృషి చేశారు. ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. మిత్ర శర్మ ప్రమోషన్ కోసం కూడా బాగా కష్టపడుతున్నారు. గతంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా కూడా పలువురికి ఆమె సాయం అందించారు.' అని తెలిపారుతొలి ఫోన్ గెలుచుకున్న ప్రవీణ్హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో ఓ షాప్ ఓపెనింగ్లో పాల్గొన్న మిత్ర శర్మ, వర్జిన్ బాయ్స్ టీం అడ్వాన్స్ టికెట్ తీసుకున్న వారిని వివరాలతో లాటరీ తీయగా చందానగర్కు చెందిన ప్రవీణ్ ఐఫోన్ గెలుచుకున్నారు. ఇది మొదటి ఫోన్ మాత్రమేనని. ఇంకా దాదాపు పది లాటరీస్ ఉన్నాయని సినిమా టీం తెలిపింది. -
ఒక్క సినిమాకు 150 కట్స్.. విడుదలకు ముందే కోర్టు స్టే
'ఉదయపూర్ ఫైల్స్' నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది. నేడు (జులై 11)న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రదర్శనపై స్టే విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన 'టైలర్ కన్హయ్య లాల్' హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఉదయపూర్ ఫైల్ ' ( Udaipur Files )... ఈ మూవీ విషయంలో ఇప్పటికే పలు అభ్యంతరాలు వచ్చాయి. ఏకంగా 150 సీన్స్కు సెన్సార్ బోర్ట్ కూడా అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైతే.. ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రోత్సహిస్తుందని, ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండటమే కాకుండా మతపరమైన ఉద్రిక్తతను రేకెత్తించగలదని వాదిస్తూ.. పిటిషనర్లు - జమియత్ ఉలామా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ, పాత్రికేయుడు ప్రశాంత్ టండన్ దీని విడుదలపై శాశ్వత నిషేధం కోరుతూ పిటిషన్ వేశారు. ఈమేరకు సినిమా విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. సినిమా విడుదల చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి కోర్టు కేంద్రానికి వారం సమయం ఇచ్చింది.టైలర్ కన్హయ్య లాల్ హత్య స్టోరీ ఏంటి..2022 ఉదయపూర్లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు గాను టైలర్ కన్హయ్య లాల్ను దారుణంగా చంపేశారు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే అతని దుకాణంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. 26 సార్లు కత్తితో నరికినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్గా గుర్తించారు. రియాజ్ గొంతు కోయగా.. గౌస్ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. హత్యకు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ నగరంతో కూడా నిందితులకు సంబంధాలు ఉన్నట్లు NIA విచారణలో తేలింది.నుపుర్ శర్మ ఎవరు..?న్యూఢిల్లీకి చెందిన నుపుర్ శర్మ విద్యార్థి దశ నుండి బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో కీలకంగా వ్యవహరించింది. 2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. వృత్తి రీత్యా న్యాయవాది . 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్పై పోటీ చేశారు. 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీ నుంచి బీజేపీ తొలగించింది. మహ్మద్ ప్రవక్త గురించి వారి వివాహం సమయంలో అతని మూడవ భార్య ఆయిషా వయస్సు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరానికి గురిచేశాయి. ఆ సమయంలో ఖతర్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు భారత్ను క్షమాపణ కోరాయి.దర్శకుడు ఏమన్నారు..?ఉదయపూర్ ఫైల్స్ సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు భరత్ ఎస్ శ్రీనేట్ వివరణ ఇచ్చారు. ఈ మూవీ ఒక మతానికో..? విశ్వాసాకో సంబంధించినది కాదని చెప్పారు. భావజాలం, సత్యం గురించి మాత్రమే సినిమాలో ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎవరి మనో భావాలను దెబ్బ తీసే కంటెంట్ ఎంత మాత్రం ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇందులో కన్హయ్య లాల్ పాత్రలో విజయ్ రాజ నటిస్తున్నారు. దుగ్గల్, రజనీష్, ప్రీతి ఘుంగియానీ, కమలేష్, సావంత్, కంచి సింగ్, ముస్తాక్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమీత్ జానీ ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు. -
జైలు నుంచి విడుదలైన నటులు శ్రీరామ్, కృష్ణ
మత్తుపదార్థాల కేసులో అరెస్ట్ అయిన కోలీవుడ్ నటులు శ్రీరామ్, కృష్ణ విడుదలయ్యారు. మాదక ద్రవ్యాల వాడిని కేసులో నటుడు శ్రీరామ్ (తమిళంలో శ్రీకాంత్) ను పోలీసులు గత నెల 23వ తేదీన అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించిన విషయం, అదే కేసులో మరో నటుడు కృష్ణ ను గత నెల 26వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన ఈ నటులు బెయిల్ కోసం చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ కోర్టు వీరి బెయిల్ పిటిషన్ను కొట్టి వేసింది. దీంతో శ్రీరామ్, కృష్ణ తరుపు న్యాయవాదులు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను విచారించిన న్యాయస్థానం శ్రీరామ్, కృష్ణకు రెండు రోజుల క్రితం నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రతులను న్యాయవాదులు జైలు అధికారులకు అందించారు. అనంతరం ప్రొసీజర్స్ పూర్తి చేసిన జైలు అధికారులు నటులు శ్రీరామ్, కృష్ణను విడుదల చేశారు.తప్పు చేశాను.. నా కుమారుడిని చూసుకోవాలిడ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని కోర్టులోనే శ్రీరామ్ ఒప్పుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తుపదార్థాలను అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీరామ్ తెలిపారు. ఆయన నిర్మాణంలో ‘తీంగిరై’ అనే సినిమాలో నటించానని, ఆ ప్రాజెక్ట్కు సంబంధించి తనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో డబ్బు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి తానే అడిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసులకు శ్రీరామ్ వెల్లడించారు. అయితే, తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని అందుకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీరామ్ కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది. -
ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం వద్దు: ఆర్. నారాయణ మూర్తి
ఆర్. నారాయణ మూర్తి చాలారోజుల తర్వాత లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ‘పేపర్ లీక్’ అనేది ఉపశీర్షిక. నేటి సమాజంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో చెబుతూ ఆయన ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్లతో పాటు దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ, జయరాజ్, నందినీ సిద్ధారెడ్డి, ప్రోఫెసర్ ఖాసీం, పలువురు విద్యార్థి సంఘాల నాయకులుపాల్గొన్నారు. యూనివర్సిటీ సినిమా కేవలం విద్యార్థులే కాదు.. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా చూడదగిన మూవీ అని అన్నారు.ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. నేటి సమాజంలో కాపీయంగ్ అనేది చాలా ప్రమాదకరమైనదని ఆయన అన్నారు. మన విద్యారంగంలో కొన్నేళ్లుగా జరుగుతున్న పేపర్ లీక్స్, గ్రూపు 1, 2 లాంటి ఉద్యోగ ప్రశ్నా పత్రాల లీక్స్ చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? వాళ్లకుపాఠాలు బోధించిన గురువులు ఏం కావాలి? అని మా సినిమా ద్వారా ప్రశ్నిస్తున్నామన్నారు. ‘యూనివర్సిటీ’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం లేదని పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి అన్నారు. 'నా మిత్రులు అద్దంకి దయాకర్, అందెశ్రీ తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ మూవీకి పన్ను మినహాయింపు ఇప్పిస్తామన్నారు. నాపై ప్రేమతో ఈ మాట చెప్పినందుకు వాళ్లకు కృతజ్ఞతలు. కానీ, నా సినిమాకు ఎలాంటి పన్ను మినహాయింపు వద్దు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వద్దు. సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లండి చాలు’.' అని నారాయణ మూర్తి కోరారు. -
అల్లు అర్జున్ మూవీలో రష్మిక.. ప్రతినాయిక పాత్రలో..?
‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల తర్వాత హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలోని ఓ హీరోయిన్ పాత్రలో దీపికా పదుకోన్ నటించనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ... ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు మరో హీరోయిన్ మృణాల్ ఠాగూర్.మిగిలిన ముగ్గురు హీరోయిన్స్ పాత్రల్లో రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ భోర్సే, బాలీవుడ్ నటి ఆలియా. ఎఫ్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రంలో రష్మికా మందన్నా, జాన్వీ కపూర్ల పేర్లు దాదాపు ఖరారయ్యాయని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాలో రష్మికా మందన్నాది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదట. ఆమె పాత్రకు ప్రతినాయిక ఛాయలు ఉంటాయని, కొన్ని యాక్షన్ సీక్వెన్స్లలో కూడా రష్మిక కనిపిస్తారని, ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె ప్రత్యేకమైన శిక్షణ తీసుకోనున్నారని టాక్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
తిమ్మరాజుపల్లి టీవీ ఆన్
హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారారు. సుమైరా స్టూడియోస్తో కలిసి తన నిర్మాణ సంస్థ కేఏప్రోడక్షన్స్ పతాకంపై విలేజ్ బ్యాక్డ్రాప్లో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే ఓ పీరియాడికల్ సినిమాను కిరణ్ అబ్బవరం నిర్మించనున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన గత సినిమాలకు కెమెరా అసిస్టెంట్గా చేసిన సాయితేజ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తారు.అలాగే కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన వి. మునిరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా, ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ‘‘ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
కార్తీ మార్షల్
హీరో కార్తీ ‘మార్షల్’ ప్రయాణం మొదలైంది. కార్తీ హీరోగా ‘తానాక్కారన్’ ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ‘మార్షల్’ టైటిల్ ఖరారైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరీ రావు, మురళీ శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చుతున్నారు. ‘‘అత్యున్నత స్థాయి సాంకేతిక, నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో ‘మార్షల్’ సినిమాను నిర్మించనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ప్రధానంగా తీరప్రాంతం, సముద్రం నేపథ్యంలో సాగుతుందని సమాచారం. -
ఆగస్టులో యూనివర్సిటీ
ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ‘పేపర్ లీక్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్లతో పాటు దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ, జయరాజ్, నందినీ సిద్ధారెడ్డి, ప్రోఫెసర్ ఖాసీం, పలువురు విద్యార్థి సంఘాల నాయకులుపాల్గొని, ‘‘యూనివర్సిటీ’ సినిమా కేవలం విద్యార్థులే కాదు... ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ చూడదగిన మంచి చిత్రం’’ అని కొనియాడారు.ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘గత కొన్నేళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపర్ లీక్స్, గ్రూపు 1, 2 లాంటి ఉద్యోగ ప్రశ్నా పత్రాల లీక్స్ చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? వాళ్లకుపాఠాలు బోధించిన గురువులు ఏం కావాలి? అని మా సినిమా ద్వారా ప్రశ్నిస్తున్నాం. కాపీయింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది.చూసి రాసినవాళ్లు డాక్టర్లు అయితే రోగులు బతుకుతారా? అలాంటివాళ్లు ఇంజినీర్ అయితే బ్రిడ్జిలు నిలబడతాయా? అందుకే విద్యను ప్రైవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి, విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని చాటి చెప్పేదే మా చిత్రం. ఈ సినిమాలో 5పాటలు ఉన్నాయి. స్వర్గీయ గద్దర్గారితోపాటు జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేశ్ గొప్పగా రాశారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాబూరావు దాస్, కథ–స్క్రీన్ ప్లే–మాటలు–సంగీతం–దర్శకత్వం–నిర్మాణం: ఆర్. నారాయణ మూర్తి. -
జిమ్లో కృతి కర్బందా వర్కవుట్స్.. ప్రగ్యా జైస్వాల్ గ్లామరస్ లుక్!
జిమ్లో హీరోయిన్ కృతి కర్బందా కసరత్తులు...హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గ్లామరస్ లుక్..శారీలో నభా నటేశ్ హోయలు..కలర్ ఫుల్ శారీలో బాలీవుడ్ భామ శిల్పా శెట్టి.. View this post on Instagram A post shared by Nyrraa M Banerji (@nyra_banerjee) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
నాగార్జున అడిగారని ఆ సినిమా చేశా: సంజయ్ దత్ కామెంట్స్
టాలీవుడ్ అభిమానుల్లో క్రేజ్ దక్కించుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. కన్నడలో కేజీఎఫ్ తర్వాత తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. గతేడాది డబుల్ ఇస్మార్ట్ మూవీతో అలరించిన సంజయ్ దత్.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తోన్న ది రాజాసాబ్లో నటిస్తున్నారు. అంతేకాకుండా సౌత్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన కేడీ ది డెవిల్ అనే కన్నడ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ధృవసర్జా హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్కు సంజయ్ దత్ హాజరయ్యారు. హైదరాబాద్లో ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.1998లో వచ్చిన టాలీవుడ్ మూవీ చంద్రలేఖ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సంజయ్ దత్ స్పందించారు. నాగార్జున అడిగడంతోనే ఈ సినిమా చేశానని సంజయ్ దత్ తెలిపారు. నాగ్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అని.. తనకు బ్రదర్ లాంటివాడని అన్నారు. అలాగే రామ్ కూడా తనకు తమ్ముడులాంటి వాడని సంజయ్ దత్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రభాస్ ఫుడ్ చాలా పెట్టేవాడని.. తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. చంద్రలేఖ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. -
యోగి మూవీని డైరెక్ట్ చేయమని ప్రభాస్ పిలిచారు: కన్నడ దర్శకుడు
శాండల్వుడ్ హీరో ధృవ సర్జా హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కేడీ ది డెవిల్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శిల్పాశెట్టి, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత కన్నడలో రీ ఎంట్రీ ఇస్తోంది. 1970లలో బెంగళూరులో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ ప్రేమ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ తనను యోగి సినిమా డైరెక్ట్ చేయాలని పిలిచారని అన్నారు. కానీ భాష సమస్య వల్ల తాను చేయలేక.. రీమేక్ రైట్ ఇచ్చేశానని తెలిపారు. తాను దర్శకత్వం వహించిన జోగి మూవీనే తెలుగులో రీమేక్ చేశారని ప్రేమ్ వెల్లడించారు. తాజాగా డైరెక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కమెడియన్ కపిల్శర్మ కేఫ్పై కాల్పులు.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్పై కాల్పులు జరిపారు. కెనడాలోని ఆయన కేఫ్పై గుర్తు తెలియని వ్యక్తి గన్తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేఫ్ను కపిల్ శర్మ ఇటీవలే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కారులో వచ్చిన గుర్తు తెలియిని వ్యక్తి కాల్పులు జరపినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందా? కేఫ్ టార్గెట్గా చేశారా? అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను రితేష్ లఖి అనే జర్నలిస్ట్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. కాగా.. కపిల్ శర్మ ఇటీవల కెనడాలోని సర్రేలో మూడు రోజుల క్రితమే కాప్స్ అనే పేరుతో కేఫ్ను ప్రారంభించారు. ఈ కాల్పుల ఘటనపై ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.World Famous comedian Kapil Sharma's newly inaugurated restaurant KAP'S CAFE shot at in Surrey, BC, Canada last night.Harjit Singh Laddi, a BKI operative, NIA's (INDIA ) most wanted terrorist has claimed this shoot out citing some remarks by Kapil@SurreyPolice pic.twitter.com/p51zlxXbOf— Ritesh Lakhi CA (@RiteshLakhiCA) July 10, 2025 -
ఫ్లాట్లో విగత జీవిగా యువ నటి.. అంత్యక్రియలకు తండ్రి నిరాకరణ!
పాకిస్తాన్లో ఇటీవల నటీనటుల మరణవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఊహించని విధంగా నటీమణలు సూసైడ్ చేసుకోవడం పాక్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతనెల 20న పాకిస్తాన్ నటి ఆయేషా ఖాన్ (76) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్.. కరాచీలోని తన ఫ్లాట్లో విగతజీవిగా కనిపించింది. ఇలా హఠాత్తుగా ఆమె మరణించడం పాక్ సినీ ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది.తాజాగా మరోసారి అలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. పాకిస్థాన్కు చెందిన నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ (Humaira Asghar Ali) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు కాగా.. కరాచీలోని తన ఫ్లాట్లో శవమై కనిపించింది. అయితే ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో చనిపోయి దాదాపు మూడు వారాలకు పైగానే అయినట్లు తెలుస్తోంది.కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో హుమైరా అస్గర్ అలీ గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే నివసిస్తోంది. గత మూడు వారాలుగా ఆమె స్థానికులకు కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లోపలికి వెళ్లి చూడగా.. నటి శవమై కనిపించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అమె మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.లాహోర్కు చెందిన హుమైరా హుమైరా అస్గర్ ప్రముఖ రియాలిటీ షో తమాషా ఘర్లో నటించింది. ఆ తర్వాత 2015లో యాక్షన్-థ్రిల్లర్ చిత్రం జలైబీలో కూడా కనిపించింది. జలైబీ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా హుమైరా జస్ట్ మ్యారీడ్, చల్ దిల్ మేరే, ఎహ్సాన్ ఫరామోష్, గురు లాంటి పాకిస్తాన్ సీరియల్స్లో నటించింది. ఆమె చివరిసారిగా ఫర్హాన్ సయీద్, సోన్యా హుస్సిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ వ్యాక్సిన్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా 2021లో విడుదలైంది.అంత్యక్రియలకు నిరాకరించిన తండ్రి..అయితే హుమైరా మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె తండ్రి, రిటైర్డ్ ఆర్మీ వైద్యుడు డాక్టర్ అస్గర్ అలీ నిరాకరించారు. తమతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు తెలిపారు. చాలా ఏళ్ల క్రితమే మాతో సంబంధాలు తెంచుకుందని చెప్పారు. మృతదేహాన్ని మీరే ఏదైనా చేసుకోండని అధికారులతో అన్నారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో సింధ్ సాంస్కృతిక విభాగం ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకొచ్చింది. ఈ కార్యక్రమానికి నటులు యష్మా గిల్, సోన్యా హుస్సేన్ కూడా ముందుకొచ్చారు. -
ఈ వీకెండ్లో ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ ఫ్రైడే ఇప్పటికే థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. తెలుగులో సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీపైనే అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు తెలుగులో వర్జిన్ బాయ్స్, ద 100 సినిమాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి మాలిక్.. హాలీవుడ్ నుంచి సూపర్ మ్యాన్ బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సుహాస్ మూవీ కోసమే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీల్లోనూ చాలా సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ వీకెండ్లో కూడా మిమ్మల్ని అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో ఇటీవలే విడుదలైన 8 వసంతాలు, ఆర్జీవీ తెరకెక్కించిన శారీ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కలియుగం, డిటెక్టివ్ ఉజ్వలన్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తిగా ఉన్నాయి. జూలై 11న ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు రానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఫ్యామిలీతో కలిసి మీకు నచ్చిన సినిమాను చూసి ఈ వీకెండ్లో ఎంజాయ్ చేయండి.జియో హాట్స్టార్..ద రియల్ హౌస్వైఫ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ (సీజన్ 9) - జూలై 11జాస్ ది డిఫినేటివ్ ఇన్సైడ్ వెడ్డింగ్- జూలై 11బరీడ్ ఇన్ ద బ్యాక్యార్డ్ (సీజన్ 6) - జూలై 13నెట్ఫ్లిక్స్8 వసంతాలు (తెలుగు సినిమా) -జులై 11ఆప్ జైసే కోయ్ - జూలై 11మడియాస్ డెస్టినేషన్ వెడ్డింగ్ - జూలై 11ఎమోస్ట్ కాప్స్ - జూలై 11డిటెక్టివ్ ఉజ్వలన్(మలయాళ సినిమా) -జులై 11ఆహాశారీ(తెలుగు సినిమా)- జూలై 11కలియుగం(తెలుగులో)- జూలై 11సన్నెక్స్ట్కలియుగం(తమిళంలో) - జూలై 11కర్కి(కన్నడ సినిమా)- జూలై 11మనోరమ మాక్స్మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ - జూలై 11సోనీలివ్నరివెట్ట(మలయాళ సినిమా)- జూలై 11(స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ టీవీ ప్లస్ఫౌండేషన్ (సీజన్ ) - జూలై 11లయన్స్గేట్ ప్లేఫోర్ ఇయర్స్ లేటర్ - జూలై 11జాస్ @ 50: ద డెఫినిటివ్ ఇన్సైడ్ స్టోరీ (డాక్యుమెంటరీ)- జూలై 11మిస్టర్ రాణి - జూలై 11ద సైలెంట్ అవర్ - జూలై 11బుక్ మై షోపాల్ అండ్ పాలెట్ టేక్ ఎ బాత్ - జూలై 11 -
‘ది 100’ మూవీ రివ్యూ
టైటిల్ : ది 100నటీనటులు: ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప తదితరులునిర్మాణ సంస్థలు : కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూశడపుకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్విడుదల తేది : జులై 11, 2024‘మొగలి రేకులు’, ‘చక్రవాకం’ సీరియళ్లతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు. సీరియళ్లతో వచ్చిన ఫేమ్తో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాది ముబారక్ సినిమాలలో హీరోగా నటించి, నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ‘ది 100’ మూవీ(The 100 Movie Review)తో నేడు( జులై 11) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘ది 100’ కథేంటంటే..విక్రాంత్(ఆర్కే సాగర్).. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో జరుగుతున్న రాబరీ గ్యాంగ్ హత్య కేసు టేకాప్ చేస్తాడు. అదే సమయంలో తను ఇష్టపడిన యువతి ఆర్తి(మిషా నారంగ్) కూడా వీరి బాధితురాలిగా మారినట్లు తెలుస్తుంది. దీంతో విక్రాంత్ ఈ కేసుని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. తనదైన శైలీలో విచారించగా అతనికో సంచలన నిజం తెలుస్తుంది. అదేంటి? ఆ గ్యాంగ్ ఆర్తి(మిషా నారంగ్) ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేసింది? సాఫ్ట్వేర్ ఉద్యోగి మధు ( విష్ణు ప్రియ) ఆత్మహత్య వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప)తో ఈ కేసు ఉన్న సంబంధం ఏంటి? స్నేహితురాలు విద్యా(ధన్య బాలకృష్ణ) సహాయంతో విక్రాంత్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(The 100 Movie Review).ఎలా ఉందంటే..విలన్ ఒక క్రైమ్ చేయడం.. పోలీసు అధికారి అయిన హీరో అతన్ని పట్టుకోవడం.. మధ్యలో ఓ ట్విస్ట్, ప్లాష్ బ్యాక్ స్టోరీ.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్ని దాదాపు ఇలానే ఉంటాయి. అయితే దీంట్లో క్రైమ్ జరిగిన తీరు.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో ఎంత తెలివిగా విలన్ను పట్టుకున్నాడనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుడి ఊహించని ట్విస్టులు, కట్టుదిట్టమైన స్క్రీన్ప్లే, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. అప్పుడే ప్రేక్షకుడు చూపు తిప్పుకోకుండా కథలో లీనమవుతాడు. ఈ విషయంలో ‘ది 100’ (The 100 Movie Review)కొంతవరకు మాత్రమే సఫలం అయింది. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ తెరపై దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. అమ్మాయి ఆత్మహత్య సీన్తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి విక్రాంత్గా హీరో ఎంట్రీ సీన్ని చక్కగా ప్లాన్ చేశాడు. హీరో ఏసీపీగా బాధ్యతలు చేపట్టి రాబరీ గ్యాంగ్ కేసుని టేకాప్ చేసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. రాబరీ గ్యాంగ్ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ఓ ట్విస్ట్.. కథనంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. రాబరీ గ్యాంగ్ బంగారం మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్తడం వెనుక ఉన్న రహస్యం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయిగే ఆ గ్యాంగ్ దొరికిన తర్వాత వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్గా ప్రారంభం అవుతుంది. వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప) ఎంట్రీ తర్వాత కథనం మరో మలుపు తిరుగుతుంది. మధు ప్లాష్బ్యాక్ ఎమోనల్కి గురి చేస్తుంది. అయితే ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం స్లోగా, ఊహకందేలా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో మంచి సందేశం ఇచ్చారు.ఎవరెలా చేశారంటే..మొగలి రేకులు సీరియల్లో పోలీసు పాత్రలో నటించి ఫేమస్ అయిన ఆర్కే సాగర్.. ఈ చిత్రంలోనూ అదే పాత్రే పోషించి మెప్పించాడు. ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన మాట, నడక, మాట..ప్రతిదీ అచ్చం పోలీసు ఆఫీసర్లాగానే అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్లో అదరగొట్టేశాడు. ఇక ఆర్తిగా మిషా నారంగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుగా విష్ణు ప్రియ, హీరో స్నేహితురాలు విద్యాగా ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు. సెకండాఫ్లో వీరిద్దరి పాత్రల నిడివి ఎక్కువగా ఉంటుంది. తారక్ పొన్నప్ప విలనిజం బాగా పండించాడు. గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ప్రభాస్ ది రాజాసాబ్తో బాక్సాఫీస్ క్లాష్.. ఆ పని చేయరనుకుంటున్నా: కేజీఎఫ్ నటుడు
ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్, కల్కి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాను కూడా ది రాజాసాబ్ రిలీజ్ రోజునే రానుందని మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ వీడియోతో పాటు విడుదల తేదీని కూడా వెల్లడించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్తో రణ్వీర్ సింగ్ పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ క్లాష్పై కేజీఎఫ్ నటుడు సంజయ్ దత్ స్పందించారు. తాజాగా తాను నటించిన కేడీ ది ముంబయి డెవిల్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దురంధర్, ది రాజాసాబ్ అదే రోజు రిలీజ్ కావడంపై సంజయ్ దత్ మాట్లాడారు.సంజయ్ దత్ మాట్లాడుతూ..' ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్. ది రాజాసాబ్, దురంధర్ చిత్రాల్లో నా రోల్స్ చాలా భిన్నమైనవి. ఈ రెండు సినిమాలు ఓకే రోజు విడుదల అవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్లు కూడా ఈ పని చేయరని అనుకుంటున్నా' అని పంచుకున్నారు. -
నయనతార దంపతులపై విడాకుల రూమర్స్.. గట్టిగానే ఇచ్చిపడేసిందిగా!
కోలీవుడ్ స్టార్ జంట నయనతార- విఘ్నేశ్ శివన్పై కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు త్వరలోనే తమ వివాహాబంధానికి గుడ్ బై చెప్పనున్నారని టాక్ వినిపించింది. ఈ స్టార్ కపుల్ గురించి పలు వెబ్సైట్స్లో కథనాలొచ్చాయి. దీంతో నయనతార తమపై వస్తున్న రూమర్స్కు గట్టి రిప్లై ఇచ్చింది. తన భర్తతో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. 'మాపై సిల్లీ న్యూస్ వచ్చినప్పుడల్లా మా రియాక్షన్ ఇలానే ఉంటుంది' అని ఘాటుగానే బదులిచ్చింది.కాగా.. పెళ్లి బంధం గురించి నయనతార కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఈ రూమర్స్కు కారణమైంది. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు.. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ పోస్ట్ను డిలీట్ చేసింది. కానీ అంతలోనే నెట్టింట స్క్రీన్షాట్స్ దర్శనమిచ్చాయి. ఆ పోస్ట్ వల్లే నయన్- విఘ్నేశ్ దంపతులు విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో కోలీవుడ్లో వీరిద్దరి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇక నయనతార సినిమాలపరంగా చూస్తే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మెగా 157లో కనిపించనుంది. అంతేకాకుండా యశ్ హీరోగా వస్తోన్న టాక్సిక్ మూవీలోనూ కనిపించనుంది. కాగా.. నయనతార సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టుకున్నారు. -
బర్త్ డే గిఫ్ట్.. లగ్జరీ కారు కొన్న రణ్వీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధురంధర్ అనే యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే జూలై 6న రణ్వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ యాక్షన్ చిత్రం డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తోన్న డాన్ -3లో నటించనున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే తాజాగా మన స్టార్ హీరో ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినీ తారలు ఇలాంటి లగ్జరీ కార్లు కొనడం సాధారణమే అయినప్పటికీ దీని విలువ దాదాపు రూ.4.57 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. సరికొత్త హై ఎండ్ ఈవీని రణ్వీర్ సింగ్ తన గ్యారేజీకి మరో కారును తీసుకొచ్చారు. ఈ విలాసవంతమైన కారును తన పుట్టిన రోజు కానుకగా జూలై 6న కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్తకారులో తన సతీమణి దీపికా పదుకొణెతో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
బాహుబలికి పదేళ్లు.. ఫ్యాన్స్కు రాజమౌళి బిగ్ సర్ప్రైజ్!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే ఠక్కున ఆయన పేరు చెప్పేస్తారు. ఎందుకంటే ఆ స్థాయిలో చిత్రాలు నిర్మించింది ఆయనే. బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ దాకా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు ప్రపంచస్థాయిలో సత్తాచాటాయి. నేటికి బాహుబలి చిత్రం విడుదలై దశాబ్దం రోజులు పూర్తి చేసుకుంది. తొలిభాగం 2015 జులై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజై తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది.బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ పాత్రల పేర్లు ఇప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. విజయేంద్రప్రసాద్ కథ అందించారు. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ రూ. 180 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అయితే ఈ రెండు భాగాలు కలిపి ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాలను ఓకే మూవీగా చూస్తే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. మీ అందరి కోసం మరోసారి బాహుబలి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో రెండు భాగాలను కలిపి ఓ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'బాహుబలి...అనేక ప్రయాణాలకు నాంది.. లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. అంతులేని ప్రేరణ.. అప్పుడే 10 సంవత్సరాలు పూర్తయింది. రెండు భాగాలను కలిపి సంయుక్త చిత్రంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ ప్రత్యేక మైలురాయిని గుర్తుచేసుకుంటున్నా. ఈ సినిమా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది' అంటూ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు రానా అభిమానులకు కూడా ఇక పండగే పండగ.Baahubali…The beginning of many journeys.Countless memories.Endless inspiration.It’s been 10 years.Marking this special milestone with #BaahubaliTheEpic, a two-part combined film.In theatres worldwide on October 31, 2025. pic.twitter.com/kaNj0TfZ5g— rajamouli ss (@ssrajamouli) July 10, 2025 -
ఒక రోజు ముందుగానే ఓటీటీకి వచ్చిన సూపర్ హిట్ మూవీ
మలయాళీ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'నరివెట్ట'. ఈ చిత్రానికి అనురాగ్ మనోహర్ దర్శకత్వం వహించారు. తెలుగులో మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2003లో జరిగిన ముతంగ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఐడెంటిటీ హిట్ తర్వాత టోవినో థామస్ మరో మూవీని సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. సోనీ లివ్ వేదికగా నరివెట్ట మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇంకేందుకు ఆలస్యం ఈ బ్లాక్బస్టర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రంలో వెంజరమూడు, చేరన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్గా నటించారు. ఈ ఏడాది మే 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తెలుగులోనూ మే 30న రిలీజైంది.Digital Premiere:Kannada Version Of Malayalam Film #Narivetta(2025) Now Streaming On @SonyLIVLink:https://t.co/l80BCRNHnNIMDb: 7/10Also Available In Telugu, Tamil & Hindi #KannadaDubbed pic.twitter.com/DnojlPyUrr— Shrikrishna (@Shrikrishna_13) July 10, 2025 -
కాలిపోతున్న పత్తి పంట.. తల దించుకున్న ధనుష్.. మరో ప్రయోగం!
కోలీవుడ్ హీరో ధనుష్ వెండితెరపై మరో కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుబేర సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న ఈ టాలెంటెడ్ నటుడు.. తన తర్వాత సినిమా కోసం పూర్తి రూరల్ బ్యాక్ డ్రాప్ కథను ఎంచుకున్నాడు. సెన్సిటివ్ చిత్రాల ఫేమ్ విగ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ధనుష్ 54వ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో కాలిపోతున్న పత్తి చేనులో ధనుష్ తల దించుకొని ఉన్నాడు. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతూ.. రైతు కష్టాలను ప్రస్తావించనుందని అనిపిస్తుంది.ఇప్పటికే వేరు వేరు జానర్స్లో నటించి అలరించిన ధనుష్..ఇప్పుడు పూర్తిస్థాయి ఎమోషనల్ కథతో రాబోతున్నాడు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
మంచు విష్ణు కన్నప్ప సినిమా (Kannappa Movie)లో నార్త్ నుంచి సౌత్ వరకు పెద్ద పెద్ద స్టార్స్ భాగమయ్యారు. ప్రభాస్, మోహన్లాల్, శరత్కుమార్, అక్షయ్కుమార్.. ఇలా పలువురు కన్నప్ప చిత్రంలో నటించారు. అక్షయ్కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా యాక్ట్ చేశారు. మొదట ఈ మూవీ చేసేందుకు అక్షయ్ అసలు ఒప్పుకోనేలేదు. రెండుసార్లు రిజెక్ట్ చేశాడు. అయినా విష్ణు పట్టు వదలకుండా ప్రయత్నించి ఆయన్ను ఎలాగోలా ఒప్పించాడు. డైలాగ్స్ చెప్పేందుకు అక్షయ్ కుమార్ తిప్పలుఅలా అక్షయ్ కుమార్ వెండితెరపై మహాశివుడిగా కనిపించాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది, కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. తాజాగా ఈ సినిమాలోని ఓ క్లిప్ నెట్టింట విపరీతంగా వైరలవుతోంది. అందులో అక్షయ్ కుమార్ డైలాగులు నేర్చుకుని సొంతంగా చెప్పినట్లు కనిపించడం లేదు. టెలిప్రాంప్టర్ను చూస్తూ అక్కడ రాసున్న డైలాగ్స్ చదువుతున్నట్లుగా ఉంది. అది అతడి కళ్లు తిప్పడం చూస్తేనే అర్థమైపోతుంది.ఇది చీటింగ్ కాదా?ఇది చూసిన నెటిజన్లు అక్షయ్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ డైలాగ్స్ గర్తుపెట్టుకుని చెప్పలేడా? ఎందుకిలా సగం సగం యాక్టింగ్ చేయడం? శివుడి వేషం కట్టుకుని చిన్న డైలాగ్స్ కూడా చెప్పడం రాకపోతే ఎలా? ఇది జనాల్ని చీటింగ్ చేయడమే అవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే సదరు వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కాగా అక్షయ్ కుమార్.. ఇలా ప్రాంప్టర్ చూసుకుంటూ డైలాగ్స్ చెప్పడం కొత్తేమీ కాదు. సర్ఫిరా సినిమాలోనూ ఓ సీన్లో ఇలాగే డైలాగ్స్ చూసుకుంటూ చదివాడు. అక్షయ్ ప్రస్తుతం జాలీ ఎల్ఎల్బీ 3, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: ప్రియుడితో శ్రద్ధా.. సీక్రెట్ వీడియో వైరల్.. ఇంత పని చేస్తారనుకోలేదు -
పేపర్ బాయ్ నుంచి కుబేర సినిమా సక్సెస్ దాకా.. మన కుర్రాడే!
పెద్ద అడిశర్లపల్లి(నల్గొండ): ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ట్రావెలింగ్, ఫొటోగ్రఫీపై తనకున్న ఆసక్తితో అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని మేడారం గ్రామానికి చెందిన మేడారం వెంకటయ్య, అంజమ్మ దంపతుల కుమారుడు మేడారం అరవింద్. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాకు అరవింద్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు.అరవింద్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలో బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లగా.. వారితో పాటు అతడు కూడా వెళ్తూ సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు పేపర్బాయ్గా, క్యాటరింగ్ బాయ్గా, రైస్మిల్లు నైట్ షిఫ్ట్ చేస్తూ సొంత ఖర్చులు సమకూర్చుకున్నారు. అంతేకాకుండా తనకు సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు, వ్యాసాలు రాస్తుండేవాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అభిరుచి ఏర్పర్చుకొని సినిమాల్లో ప్రవేశం దొరకబుచ్చుకున్నారు.చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై ఆసక్తి..తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో అరవింద్ చదువు కొనసాగింది. తమ గ్రామం నుంచి యూనివర్సిటీకి వచ్చిన మొదటితరం విద్యార్థి అరవిందే కావడం విశేషం. మాస్ కమ్యూనికేషన్ చదువుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్బాయ్గా పనిచేయడం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ కవితలు, వ్యాసాలు రాశారు.సాహిత్య ప్రచారం..కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం.. చదివిన పుస్తకాలను నలుగురికీ పంచడం అవసరమని భావించిన అరవింద్ ‘ఆలోచనా’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టిపొట్టి జానపద కథల నుంచి దేశభక్తుల జీవితచరిత్ర వరకు పరిచయం చేయడం, చదివించడం చేశారు. హైదరాబాద్ నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్స్ పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడంతో ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయా ప్రాంతాల సంస్కృతి, వైవిధ్యం, ఆర్కిటెక్చర్ను కెమెరాల్లో బంధించి వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు.జాతిరత్నాలు డైరెక్టర్తో సినిమా రంగంలోకి...జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ కేవీతో అరవింద్కు ఏర్పడిన పరిచయం స్నేహం మారడంతో ఆయనకు సినిమాల్లోకి ప్రవేశం దొరికింది. ఆయన కథలను చర్చిస్తుండటం.. రాస్తుండటంతో అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ప్రిన్స్ సినిమాకు రచన విభాగంలో పనిచేయడం వలన రచన నైపుణ్యాన్ని అరవింద్ నేర్చుకున్నారు.కుబేర విజయాన్ని ఆస్వాదిస్తున్నాకుబేర సినిమా మొదలవుతుంది అనుకున్న రెండు నెలల ముందు శేఖర్ కమ్ముల గారు నన్ను పిలిచారు. మొదట ఇంటర్న్షిప్గా జాయిన్ అయ్యాను. నాకు ట్రావెలింగ్ చేసిన అనుభవం ఉండడంతో ఈ సినిమా కథకు ముంబై దగ్గర్లలో లొకేషన్స్ వెతికి పెట్టే పని అప్పగించారు. ఈ క్రమంలో ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇన్చార్జిగా నియమించారు. తోట తరణి వంటి ఆర్ట్ డైరెక్టర్తో శేఖర్ కమ్ముల నేతృత్వంలో పనిచేయడం జీవితంలో మరిచిపోలేని మైలురాయి. డైరెక్టర్ విజన్, ప్రొడక్షన్ డిజైనర్ విజువల్ సెట్లో ప్రతిబింబించడానికి నిద్రాహారాలు పక్కనపెట్టి పనిచేశా. అయినా కష్టం అనిపించలేదు. ఆర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రాణితో సమన్వయంలో ఉండటం వలన టీంతో రాత్రి, పగలు ఆడుతూ పాడుతూ షూటింగ్ కంప్లీట్ చేశాం. కుబేర సినిమా విజయాన్ని నేను, మా టీం సభ్యులు ఆస్వాదిస్తున్నాం.– మేడారం అరవింద్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ -
పెళ్లైన హీరోయిన్లతో రొమాన్స్ ఎలా ఉంటుందంటే: ఆర్ మాధవన్
కోలీవుడ్ నటుడు ఆర్.మాధవన్, ఫాతిమా సనా షేక్ నటించిన చిత్రం ‘ఆప్ జైసా కోయి’ (Aap Jaisa Koi) ఓటీటీలో విడుదల కానుంది. కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా జులై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాధవన్ మీడియా సమావేశంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. పెళ్లి అయిన హీరోయిన్లతో రొమాన్స్ సీన్స్ ఎలా ఉంటాయో ఆయన చెప్పుకొచ్చారు. ఆపై తమ వయసులో సగం ఉన్న హీరోయన్స్తో సినిమాలు చేయడం తనకు నచ్చదని చెప్పారు.చాలా కాలంగా వయసుకు తగిన పాత్రలు చేయడమే తనకు ఇష్టమని మాధవన్ (55) చెబుతూనే ఉన్నారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోయిన్స్ల మధ్య ప్రేమ సినిమాలతో పాటు రొమాన్స్ సీన్స్ తెరకెక్కించడంలో ఇండస్ట్రీలో మార్పు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్ హీరోలు యువకుల్లా నటిస్తూ.. హీరోయిన్స్ వెంటబడి తెరకెక్కించే సినిమాలు ఇప్పుడు రావడంలేదన్నారు. అలాంటి కథను ఏ హీరో ఓకే చేయడం లేదన్నారు. అలాంటి చిత్రాలను ప్రజలు కూడా తిరష్కరిస్తున్నారు. తాను కూడా 40 ఏళ్ల వయసులో కాలేజీ కుర్రాడిగా '3 ఇడియట్స్' లో నటించానని ఆ పాత్ర తనకు ఎంత మాత్రం సంతృప్తి ఇవ్వలేదన్నారు.వివాహిత హీరోయన్లతో రొమాన్స్ కనిపించదుమాధవన్ ఎప్పుడూ ట్రెండ్స్ ప్రకారం నడుచుకోనని చెబుతాడు. తమ వయసు మేరకు మాత్రమే పాత్రలను ఎంపిక చేసుకోవాలని అంటారు. వయసుకు తగిన పాత్రలతో పాటు హీరోయిన్ ఎంపిక కూడా ఒక సినిమాకు చాలా కీలకమని ఇలా చెప్పారు. 'వివాహం అయిన హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాల్లో సరిగ్గా నటించలేరు. వారితో ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ సరిగ్గా వర్కౌట్ కాదు. మీ ముందు ఉన్న వ్యక్తి పట్ల మీకు నిజంగా కాస్త అయినా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండాలి. లేకపోతే ఆ సీన్ నిజం కాదని అనిపిస్తుంది. కానీ, వివాహిత హీరోయిన్లు దానిని తెరపై ఎప్పుడూ సృష్టించలేరు. పెళ్లి కావడం వల్ల వారు అప్పటికే అలాంటి అనుభూతి పొంది ఉంటారు. అలాంటప్పుడు ఆన్స్క్రీన్పై ఆ రకమైన కెమిస్ట్రీ కనిపించదు. ఈ కామెంట్తో నేను కొంత వివాదానికి కారణం కావచ్చు.' అని మాధవన్ అన్నారు. -
29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు
బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈడీ దూకుడు చూపింది. ఈ కేసులో 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు 4 కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. అందులో సినీ నటీనటులతో పాటు యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. కేసు నమోదు అయిన వారిలో విజయ్ దేవరకొండతో పాటు రానా ,మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ ,నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, ప్రణిత, విష్ణు ప్రియ వంటి ప్రముఖులు ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి కేసు విచారణ ప్రారంభించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను వారు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఐటీ రిటర్న్లలో ఈ లెక్కలు లేవని అధికారులు గుర్తించారట. దీంతో మనీ లాండరింగ్ కింద కేసు ఈడీ కేసు నమోదు చేసింది.బెట్టింగ్ యాప్లకు విషయంపై గతంలోనే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి టీమ్ ఒక ప్రకటన చేసింది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు వారు ప్రచారకర్తలుగా వ్యవహరించలేదని, నైపుణ్య ఆధారిత గేమ్లకు మాత్రమే ప్రచారం చేశారని వారిద్దరి టీమ్స్ వేర్వేరుగా ప్రకటన చేశాయి. చట్టపరమైన అనుమతులు ఉన్న వాటికి మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని వారు తెలిపారు. ఏ23 అనే కంపెనీతో విజయ్ చేసుకున్న ఒప్పందం ఇప్పటికే ముగిసిందని తెలుపగా రానా కుదుర్చుకున్న ఒప్పందం 2017లోనే పూర్తయ్యిందని పేర్కొన్నారు. నటుడు ప్రకాశ్రాజ్ కూడా 2016లోనే తను ఒప్పందం చేసుకున్న కంపెనీతో ఢీల్ ముగిసిందని తెలిపారు. అయితే, బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే చాలామంది నటీనటులను హైదరాబాద్ పోలీసులు విచారించారు. -
'ఐ లవ్ యూ' చెబితే ఓకే చెప్పేశాను: అనుష్క
నటి అనుష్క( Anushka Shetty). ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది అరుంధతి, బాహుబలి చిత్రాలే. నిజానికి ఈ మంగళూరు బ్యూటీ అంతకుముందు చాలా హిట్ చిత్రాల్లో నటించారు. వాటిలో ఎక్కువగానే గ్లామరస్ పాత్రలు పోషించి అభిమానులను కనువిందు చేశారు. ముఖ్యంగా 'రెండు' అనే తమిళ మూవీతో పాటు 'బిల్లా'లో స్విమ్మింగ్పూల్ సీన్ కోసం ఆమె అందాల ఆరబోతకు యూత్ ఫిదా అయ్యారు. అయితే ఆమెలోని నట విశ్వరూపాన్ని తెరపై ఆవిష్కరించిన తొలి చిత్రం మాత్రం అరుంధతినే. ఆ తరువాత అనుష్క పయనమే మారిపోయింది. ఏ చిత్రంలోనైనా ఒక హీరోయిన్ పాత్రను చూస్తే ఆ పాత్రలో అనుష్క అయితే ఇంకా బాగా నటించేవారు అని అనుకునే ఉన్నత శిఖరాలకు చేరుకున్న నటి ఆమె. ఒక పాత్ర కోసమే బరువు పెంచుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది అనుష్కనే అవుతారు. అలాంటి అద్భుత నటి వయసు ఇప్పుడు 43 ఏళ్లు. అయినా అవివాహితగానే ఉన్నారు. ఈమె ప్రేమ గురించి చాలా వదంతులు దొర్లుతూనే ఉన్నాయి. కాగా చాలా మందికి బాల్యంలో లవ్ స్టోరీస్ ఉంటాయి. అనుష్క బాల్యంలోనే ఒక లవ్ స్టోరీ ఉందట. ఈ విషయాన్ని తనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం విశేషం. ‘నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు అదే తరగతి చదువుతున్న సహ విద్యార్థి నా వద్దకు వచ్చి ఐ లవ్ యూ’ అని చెప్పాడు. ఆ వయసులో ఐ లవ్ యూ అంటే ఏమిటో కూడా తెలియదు. అయినా అతనికి ఓకే అని చెప్పాను. ఆ విషయం గుర్తుకు వస్తే ఇప్పటికీ మధురమైన అనుభూతిని కలిగిస్తుంది అని అన్నారు. కాగా చిన్న గ్యాప్ తరువాత అనుష్క కథానాయికగా నటించిన ఘాటీ త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా అనుష్క తొలిసారిగా మలయాళంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. -
బీచ్లో బిగ్బాస్ బ్యూటీ చిల్.. అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్!
బీచ్లో బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..పారిస్లో రష్మిక మందన్నా చిల్..అక్కినేని కోడలు శోభిత ధూళిపాల ట్రెండీ లుక్..యూఎస్లో బిగ్బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ పోజులు..బుల్లితెర భామ జ్వోతిపూర్వాజ్ స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Nyrraa M Banerji (@nyra_banerjee) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
హోంబలే ఫిల్మ్స్ యానిమేషన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ Hombale Films భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థగా అవతరించింది. తాజాగా ఈ సంస్థ సమర్పణలో యానిమేషన్ మూవీని తెరకెక్కించారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన 'మహావతార్ నరసింహ' (Mahavatar Narsimha) చిత్రం జూలై 25 థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ సినిమాను 3డీలో ప్రేక్షకులను అలరించనుంది. ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ట్రైలర్ చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాను క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించగా.. హోంబాలే ఫిల్మ్స్ సమర్పిస్తున్నారు.ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతూ నిర్మాతలు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ను ప్రకటించారు. వారు విడుదల చేసిన క్యాలెండర్లో 2025లో 'మహావతార్ నరసింహ', ఆ తర్వాత 'మహావతార్ పరశురామ్' (2027), 'మహావతార్ రఘునందన్' (2029), 'మహావతార్ ధావకధేష్' (2031), 'మహావతార్ గోకులానంద' (2033), 'మహావతార్ కల్కి పార్ట్ 1' (2035), 'మహావతార్ కల్కి పార్ట్ 2' (2037) ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
అన్నాచెల్లెళ్ల ఎమోషనల్ డ్రామా.. రాజు గాని సవాల్ టీజర్ వచ్చేసింది!
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "రాజు గాని సవాల్". ఈ చిత్రాన్ని లెలిజాల కమల సమర్పణలో ఎల్ఆర్ ప్రొడక్షన్ బ్యానర్పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ నటుడు జగపతి బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రం రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న విడుదల కానుంది. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ పాల్గొన్నారు.నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..' ఇది నాకు ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది. బాపిరాజు నాకు చాలా దగ్గర వ్యక్తి. ఆయన ఏదైనా సినిమా తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. రాజు గాని సవాల్ సినిమాను ఆయన తీసుకున్నారంటే తప్పకుండా బాగుంటుంది. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ సినిమాలను మన ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అలాంటి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. ' అని అన్నారు.హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ.. - రాజు గాని సవాల్ టీజర్ రిలీజ్ చేసిన జగపతి బాబుకు థ్యాంక్స్. మా మూవీ హైదరాబాద్ కల్చర్, తెలంగాణలో ఫ్యామిలీ బాండింగ్ చూపించేలా ఉంటుంది. బ్రదర్, సిస్టర్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది. అలాగే కుటుంబంలోని బంధాలు ఎలా ఉంటాయి. స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందని చూపించాం. తెలంగాణ సంస్కృతి నేపథ్యంగా సాగే క్లాసిక్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది.. మా మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రంలో సంధ్య రాథోడ్, రవీందర్ బొమ్మకంటి కీలక పాత్రల్లో నటించారు. -
కుబేర క్రేజీ సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న కుబేర కలెక్షన్ల పరంగా వందకోట్లకు పైగానే రాబట్టింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్ర పోషించారు.తాజాగా ఈ చిత్రంలో క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. అనఅనగా కథ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను రిలీజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను కరీముల్లా, హైడ్ కార్తి ఆలపించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్వీసీఎల్ఎల్పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.కుబేర కథేంటంటే..'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ. -
ఒకప్పటి స్టార్ హీరో.. హెయిర్ కట్కు బ్రాండ్ అంబాసిడర్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్నపిల్లలు, టీనేజ్ యువకులు ఎవరైనా హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎక్కువగా హీరోల స్టైల్స్నే ఫాలో అవుతుంటారు. ఆ హీరో స్టైల్లో కటింగ్ చేయమని సెలూన్ వాళ్లను అడిగి మరీ తమ అభిమాన హీరోలా తయారవుతారు. అందుకే ఏ సెలూన్ షాప్ల ముందైనా హీరోల హెయిర్ కట్స్తోనే పోస్టర్స్ పెడతారు. అలా ఓ హీరోను చూసి ఎంతో యూత్ అచ్చం అలానే ఉండాలని ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉండేది. ఆ హీరో ఎవరో మీకు గుర్తున్నారా? 1990ల్లో ఓ యూత్ ఫ్యాన్స్లో ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకవుతారు. ఒకప్పుడు హెయిర్ కట్ స్టెల్కు బ్రాండ్గా మారిన ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేరేమోనని అనిపిస్తోంది. ఇంతకీ అతనెవరో తెలుసుకోవాలనుందా?అయితే ఈ స్టోరీ చదివేయండి.ఆయనే మరెవరో కాదు.. ప్రేమదేశం హీరో అబ్బాస్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 1990ల్లో పుట్టిన కుర్రాళ్లను అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే అప్పట్లో ఆయన నటించిన సూపర్ హిట్ లవ్స్టోరీ మూవీ 'ప్రేమదేశం' చూసి అచ్చం అబ్బాస్ లాగే హెయిర్ స్టైల్ చేయించుకున్నారు యూత్ ఆడియన్స్. అతడిలా ఉండటానికి ఎంతోమంది ట్రై చేశారు. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు.తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వాళ్లు అసలు అబ్బాసేనా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతలా మారిపోయింది మరి ఆయన కటౌట్. తెల్లటి గడ్డం, స్టైలిష్ హెయిర్ లుక్లో అచ్చం అప్పటిలాగే ఉన్నప్పటికీ గుర్తుపట్టడానికి కాస్తా టైమ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అప్పటి అబ్బాస్ లవర్ బాయ్లా ఉంటే.. ఇప్పటి అబ్బాస్ కాస్తా సీరియస్ లుక్లో కనిపిస్తున్నాడు. ఏదేమైనా యూత్ హెయిర్ కట్కు బ్రాండ్ అంబాసిడర్ అబ్బాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు..అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో న్యూజిలాండ్లోని కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్లో సెటిలయ్యాడు. అయితే సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానిని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్ మళ్లీ చెన్నై వచ్చాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో రామానుజన్ బయోపిక్లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. తెలుగులో నీ ప్రేమకై, రాజా, శ్వేతనాగు, రాజహంస, ప్రియా ఓ ప్రియా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో అబ్బాస్ నటించారు. -
దీపిక, ప్రియాంక కాదు.. దీవిని కొన్న అందాల నటి తెలుసా.. అక్కడ ఏం చేస్తోందో..!
ఇంపోర్టెడ్ కార్లు, ఇంద్ర భవనాలు,నుంచి కళాఖండాలను దాటి క్రికెట్ టీమ్స్ దాకా కాదేదీ అనర్హం. తారల దర్పానికి, స్టార్ డమ్ ప్రదర్శనకి అన్నట్టుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే కార్ల ట్రెండ్ పాతబడుతూ వాటి స్థానంలో ప్రైవేట్ జెట్స్ సైతం సూపర్ స్టార్లకు అలంకారంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్కి చెందిన ఓ అందాల నటి ఏకంగా ఐలాండ్నే కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ వార్త వినగానే మన కళ్ల ముందు మెదిలే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, అలియా భట్, ఐశ్వర్యా రాయ్ వంటివారు ముందుండడం సహజమే.అయితే వీరందరూ కాకుండా.. నిజం చెప్పాలంటే విజయాల్లో వీరి సరసన నిలబడే స్థాయి లేని నటి ఐలండ్ క్వీన్గా మారిందనేది తెలుసుకోదగ్గ విశేషమే. ఆమె పేరు గ్లామర్ స్టార్ జాక్వలిన్ ఫెర్నాండెజ్. విదేశాల నుంచి మన దేశానికి వచ్చి సక్సెస్ అయిన తారల్లో ఒకరు శ్రీలంకకు చెందిన జాక్వలిన్. దాదాపు పాతికేళ్ల క్రితం 2006లో మిస్ యూనివర్స్ పోటీల్లో శ్రీలంకకు సారధ్యం వహించిన ఈ బ్యూటీకి కిరీటం దక్కకపోయినా బాలీవుడ్ ఛాన్సులు దండిగానే దక్కాయి. అలా 2009 నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ అదే పనితో ఆగిపోకుండా రకరకాల వ్యాపారాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. ఇప్పటికే ముంబైలో, శ్రీలంకలో విలాసవంతమైన అపార్ట్మెంట్, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వస్తువులు సైతం ఆమె స్వంతం. స్టార్ డమ్లో దిగువన ఉన్నా ఇన్ కమ్లో ముందున్న ఈ భామ ఆస్తులు దాదాపుగా రూ.100కోట్ల పైమాటే అని సమాచారం.ఈ నేపధ్యంలోనే ఆమె స్వదేశంలో, అంటే శ్రీలంక తీర ప్రాంతంలో ఒక ప్రైవేట్ దీవిని కూడా ఆమె కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇది బహిరంగంగా ఆమె ప్రకటించని విషయమే అయినా, తాజాగా వెలుగులోకి వచ్చింది. జాక్వలిన్ ఈ ప్రైవేట్ దీవిని కుటుంబం కోసం కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరిగాయో కానీ, అది పూర్తి స్థాయిలో పర్యాటకుల నుంచి దూరంగా, నిశ్శబ్దత నడుమ ఆమె తన కోసం విశ్రాంతి కోసం ఏర్పాటు చేసుకున్న ప్రదేశమని అంటున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడం వల్ల బాలీవుడ్లో జాక్వలిన్ స్థానం, ఆమె సంపద, జీవనశైలి పై కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే బాలీవుడ్లో ఇది అరుదైన విషయమే మరి. నటుల్లో స్వంత దీవిని కలిగిన నటి అనే ఘనతను జాక్వలిన్ ఒక్కరే దక్కించుకుంది.ఎక్కడ? ఎప్పుడు?శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంగా 2012లో సుమారు 4 ఎకరాల ప్రైవేట్ దీవిని సుమారుగా రూ.3కోట్లకు జాక్వలిన్ ఫెర్నాండెజ్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ దీవి ఖరీదు చేసినప్పుడు, ‘విలాసవంతమైన విల్లా నిర్మాణం‘ ఉండొచ్చని అంచనా వేశారట, అయితే అక్కడ అలాంటి నిర్మాణం జరిగిందా లేదా అనేది స్పష్టంగా వెలుగు చూడలేదు. ఈ దీవి, మాజీ శ్రీలంక క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కరా కి చెందిన సొంత దీవి దగ్గరనే ఉందని కూడా తెలుస్తోంది.కొసమెరుపు ఏమిటంటే... ఓ నాలుగేళ్ల క్రితం ఈ జాక్వెలిన్ పై మనీ లాండరింగ్ కేసులు దాఖలయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా విచారణకు హాజరైంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఘోస్ట్ సినిమాలో మన కింగ్ అక్కినేని నాగార్జున సరసన తెలుగులో నటించడానికి వచ్చిన ఛాన్స్ చేజారినట్టు సమాచారం. -
తండ్రి కాబోతున్న స్త్రీ-2 నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
హిందీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు తెలిపారు. పెళ్లయిన మూడున్నర్ర సంవత్సరాల తర్వాత శుభవార్తను ప్రకటించారు. కాగా.. బాలీవుడ్ నటి పాత్రలేఖను నవంబర్ 15, 2021న రాజ్కుమార్ వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 'బేబీ ఆన్ ది వే' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు బాలీవుడ్ దంపతులు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. రాజ్కుమార్ రావు గతేడాది సూపర్ హిట్ మూవీ స్త్రీ-2 చిత్రంలో నటించారు. శ్రద్ధాకపూర్ కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ ఏడాది బుల్ చుక్ మాఫ్ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు. మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పెద్దగా రాణించలేకపోయింది. మరోవైపు ఆయన భార్య పాత్రలేఖ గతేడాది వెల్డ్ వైల్డ్ పంజాబ్ అనే మూవీలో నటించింది. ఈ ఏడాదిలో పూలే సినిమాతో అభిమానులను అలరించింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) -
టాలీవుడ్లో నెపోటిజం.. ఇక్కడ పనిచేయవు.. ఆ హీరోకు మంచు మనోజ్ కౌంటరిచ్చాడా!
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం నెపోటిజం. ఈ పదం ఇటీవల సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పదానిరి అర్థం మరి సింపుల్గా చెప్పాలంటే.. తన కుటుంబం బ్యాక్గ్రౌండ్ అండతో స్టార్గా ఎదగడమే. ఒక రకంగా బంధుప్రీతి అన్నమాట. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు అలానే వచ్చినప్పటికీ.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. అలా ఎదిగిన వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. అయితే తాజాగా నెపోటిజంపై హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.సుహాస్ హీరోగా వస్తోన్న ఓ భామ అయ్యో రామా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మంచు మనోజ్ మాట్లాడారు. యూట్యూబ్తో కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదని సుహాస్పై ప్రశంసలు కురిపించారు. తాను కూడా నెపో కిడ్నే అని.. కానీ టీమ్ అంతా కష్టపడితేనే మూవీ సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడారు. దీనికి కౌంటర్గానే మంచు మనోజ్ మాట్లాడి ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ)మంచు మనోజ్ మాట్లాడుతూ..'నేను కూడా నెప్టో కిడ్నే. అయితే ఇక్కడ ఆ పప్పులేం ఉడకవు. బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే సినిమాల్లో వస్తారంటే అది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. నేను కూడా అలానే వచ్చా. నెప్టో కిడ్గా చెబుతున్నా.. ఇక్కడ అలాంటివి పనిచేయవు. ఎవరైనా దేకాల్సిందే. ఒక సినిమా సక్సెస్ అనేది.. పెద్ద స్టార్ చేశారా? ఎంత డబ్బు అనేది ముఖ్యం కాదు.. సినిమా ఎప్పటికీ సినిమానే. మనస్ఫూర్తిగా మనం కష్టపడి పనిచేస్తే సినిమా సక్సెస్ అవుతుంది.' అని అన్నారు. కాగా.. మాళవికా మనోజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను రామ్ గోదాల డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది.🚨#ManchuManoj latest 💥pic.twitter.com/xXf7hb0M9N— Tollywood Movies ✨ (@TollyMovies4u) July 8, 2025 -
2025లో టాప్ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ
కొత్త సంవత్సరం మొదలై ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఫస్టాఫ్లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ మీద కనక వర్షం కురిపించిన సినిమాలు కొన్నయితే నిర్మాతల నెత్తిన గుదిబండ వేసిన చిత్రాలు మరికొన్ని. అయితే వీటన్నింటినీ జల్లెడపట్టిన ఐఎమ్డీబీ (IMDB).. 2025 ఫస్టాఫ్- మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది.ఫస్టాఫ్లో టాప్ 102025లో జనవరి 1 నుంచి జూలై 1 మధ్య విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకుంది. ఆరు, అంత కంటే ఎక్కువ రేటింగ్ వచ్చిన చిత్రాలను తన జాబితాలో పొందుపరిచింది. టాప్ 10లో అత్యధికంగా బాలీవుడ్ నుంచే ఆరు సినిమాలున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విక్కీ కౌశల్ ఛావా సినిమా మొట్టమొదటి స్థానంలో ఉంది. రూ.130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.809 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. టాప్ 5లో ఏమున్నాయ్?మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 500% లాభాలను తెచ్చిపెట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. 2025లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా ఛావా రికార్డు సృష్టించింది. తమిళ సినిమా డ్రాగన్ రెండో స్థానంలో ఉంది. కోలీవుడ్ నుంచి 3 సినిమాలుబాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన షాహిద్ కపూర్ దేవా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. అజయ్ దేవ్గణ్ రైడ్ 2 నాలుగో స్థానంలో, సూర్య రెట్రో ఐదో స్థానంలో ఉన్నాయి. ద డిప్లొమాట్, ఎల్ 2: ఎంపురాన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విడాముయర్చి టాప్ 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. టాప్ 10లో తమిళం నుంచి మూడు, మలయాళం నుంచి ఒక మూవీ జాబితాలో ఉంది. టాలీవుడ్ నుంచి ఏ సినిమా కూడా ఈ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయింది. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: సినిమాలు మానేసి సెలూన్లో పని చేశా.. 10th ఫెయిలైనా.. -
సమంత- రాజ్ డేటింగ్ వార్తలు.. దర్శకుడి భార్య పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎపిసోడ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. గతంలో తనపై వచ్చిన రూమర్స్పై ఇప్పటికీ వరకు స్పందించని సామ్.. తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి సన్నిహితంగా ఉంటూ కనిపించింది. గతంలోనే విమానంలో తన భుజంపై వాలిపోయి మరి ఫోటోలకు పోజులిచ్చిన సమంత.. ఇప్పుడు ఏకంగా అతనే సమంత భుజంపై చేయి వేసుకుని అమెరికాలోని డెట్రాయిట్ వీధుల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో వీరిద్దరి డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ నెట్టింట వైరలవుతోంది. ఇక అఫీషియల్ ప్రకటన మాత్రమే మిగిలి ఉందని పోస్టులు పెడుతున్నారు.ఈ నేపథ్యంలో వీరిద్దరి డేటింగ్ వార్తలొస్తున్న వేళ.. రాజ్ నిడిమోరు భార్య మరోసారి ఆసక్తికర పోస్ట్ చేసింది. సామ్- రాజ్ ఫొటోలు వైరల్గా మారిన తర్వాత ఆయన భార్య శ్యామాలి ఇన్స్టా స్టోరీస్లో ఓ మేసేజ్ రాసుకొచ్చింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.మతమేదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే చెబుతుందని.. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని రాసుకొచ్చింది. అందులో వివిధ మతాల అర్థాలను వివరిస్తూ "లైఫ్స్ గ్రేట్ గోల్డెన్ రూల్" అనే శీర్షికతో పోస్ట్ చేసింది. ఆ తర్వాత అర్జునుడు, కృష్ణుడి మధ్య జరిగిన సంభాషణను కూడా ప్రస్తావించింది. అర్జునుడు.. విజయం, ఓటమి కాకుండా మరొకటి ఏంటి? అంటే.. శ్రీకృష్ణుడు ధర్మం మాత్రమే ముఖ్యమని చెప్పాడని అనే అర్థం వచ్చేలా స్టోరీస్లో రాసింది. అంటే తనకు ధర్మమే అండగా నిలుస్తుందని అందులోని సారాంశం. సమంత- రాజ్ డేటింగ్ వార్తల వేళ శ్యామలి చేసిన పోస్ట్పై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. సామ్ - రాజ్ ఫొటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చని.. అందుకే ఆమె ఈవిధమైన సందేశాన్ని పంచుకుని ఉంటారని కొందరు భావిస్తున్నారు.అయితే రాజ్ నిడిమోరుకు భార్య శ్యామలితో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. -
The Fantastic Four: 1960ల యాస కోసం హాలీవుడ్ హీరో కష్టాలు
మార్వెల్ స్టూడియోస్ నుంచి కెవిన్ ఫీజ్ నిర్మాణంలో, మాట్ షాక్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్వెల్ కామిక్స్లోని మొదటి సూపర్ హీరో కుటుంబం, గ్రహాలను మింగేసే గెలాక్టస్తో జరిగే ఉత్కంఠభరిత పోరాట కథతో ఈ చిత్రం రూపొందింది. ఇండియాలో ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఈ చిత్రం ప్రపంచవ్యాప్త ప్రమోషన్లలో భాగంగా, రీడ్ రిచర్డ్స్ పాత్రలో నటిస్తున్న పెడ్రో పాస్కల్ వానిటీ ఫెయిర్తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా కోసం 1960ల నాటి యాస అలవర్చుకునేందుకు తాను 100 శాతం ప్రయత్నించానని, కానీ సిబ్బంది తనను వెనక్కి లాగారని తెలిపారు. "నేను ఆ యుగంలోని మిడ్-అట్లాంటిక్ యాసను పట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను. కానీ సిబ్బంది నన్ను ‘మీలాగే మాట్లాడు’ అని చెప్పారు. ఈ సినిమా ఇప్పటివరకూ చూసిన దానికంటే భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది," అని పెడ్రో వెల్లడించారు. ఆ రకమైన మాండలికం కోసం తమకు ఓ కోచ్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు.ఈ చిత్రంలో సూ స్టార్మ్గా వెనెస్సా కిర్బీ, జానీ స్టార్మ్గా జోసెఫ్ క్విన్, బెన్ గ్రిమ్గా ఎబోన్ మోస్-బాచ్రాచ్, గెలాక్టస్గా రాల్ఫ్ ఇనేసన్, సిల్వర్ సర్ఫర్గా జూలియా గార్నర్ నటించారు. -
బాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్.. అభినయంతో ఆకట్టుకున్న స్టార్స్ వీళ్లే!
సాధారణంగా సినిమా జయాపజయాలను కలెక్షన్లతో ముడిపెడతారు. అలాగే ప్రతీ ఏటా కలెక్షన్లను అనుసరించి ఆ సంవత్సరపు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ సినిమా ఫలితాలను స్టార్ల స్టార్ డమ్ను విశ్లేషించడం కూడా రివాజు. అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా.. నటీనటుల అభినయం పరంగా ఈ విశ్లేషణ మొదలైనట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ మీడియా దీనికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ ఏడాది అర్ధభాగంలో విడుదలైన సినిమాలను తీసుకుని వాటిలో అభినయం ద్వారా ప్రభావం చూపిన స్టార్స్ను గుర్తిస్తోంది. అందులో భాగంగా 8మంది తారల్ని ప్రకటించింది. అర్ధభాగంలో అభినయంతో ఆకట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే...అభిషేక్ బెనర్జీస్టోలెన్ సినిమాలో నటించిన అభిషేక్ బెనర్జీ ఆ సినిమాని అమాంతం ప్రేక్షకుల హృదయాల్లో కూర్చోబెట్టారు. ఈ చిత్రంలో ప్రతీ భావాన్ని నిజంగా అన్నట్టు ప్రతిబింబించాడాయన. అతని నటన ఆ చిత్ర ప్రేక్షకులు పొందిన అనుభూతిని ఆకాశానికి తాకించింది. తరచూ నిశ్శబ్ధాన్ని ఆశ్రయిస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిశ్శబ్ధంగా నిలిచిపోయింది.సన్యా మల్హోత్రామిస్ట్రెస్ సినిమాలో నటించిన సన్యా మల్హోత్రా కూడా ఈ జాబితాలో స్థానాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. ఒక మహిళగా ఈక్వాలిటీ కోసం పోరాడటం, ఊహించని ఒత్తిడి ఎదుర్కోవడం – ఆమె వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, ఇలాంటి పాత్ర పోషించడం సులభం కాదు. కానీ ఆమె ఆ పాత్రకు జీవం పోసింది.ఆదర్శ్ గౌరవ్సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాలో ఆదర్శ్ గౌరవ్ పాత్రను మరచిపోవడం అంత సులభం కాదు. అందుకే అంత సులభంగా అతను ఫేమస్ అయ్యాడు. చిన్న పట్టణపు యువత కలలను ప్రతిబింబించడంతో పాటు హాస్య–భావాలను మనసుతో పలికించడం ద్వారా అతను అందరికీ గుర్తుండి పోయాడు.వామికా గబ్బీబూల్ చుక్ మాఫ్ చిత్రంలో నటించిన వామికా గబ్బీ ప్రేమచుట్టూ అల్లుకునే అనేక సమస్యలను వాటిని ఎదుర్కున్న తీరును ఆమె పాత్ర కొత్తగా పరిచయం చేస్తుంది. తెరపై అద్భుతమైన భావాలను చూపెట్టిన వామికా గబ్బీ..ఈ ఏడాది గట్టి ప్రభావం చూపిన నటీమణుల్లో ఒకరుగా నిలిచింది.రణదీప్ హుడామంచి విజయాన్ని సాధించిన జాట్ సినిమాలో రణదీప్ హుడా వీరానురాగాన్ని చూపిస్తూ విలనిజాన్ని ప్రదర్శించాడు. అతని పాత్ర అంత భయంకరంగా కనిపించకపోతే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునేది కాదేమో..రణదీప్ నటన జాట్ను ఒక సినిమాగా మాత్రమే కాదు ఒక అనుభవంగా మార్చింది. కాజోల్ఇప్పటికే అనేక పాత్రల ద్వారా తనను తాను నిరూపించుకున్న సీనియర్ నటి కాజోల్... మా సినిమాలో మరింతగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. మాతృత్వ బాధ్యతల్లో మునిగి పోయిన ఒక సగటు తల్లిగా కాజోల్, పటిష్టంగా పలికించిన భావోద్వేగాల లోతు అంతరంగాల్ని తాకుతుంది.విక్కీ కౌశల్చావా సినిమా సృష్టించిన సంచలనాల గురించి చెప్పుకోవడం ఎంత ముఖ్యమో ఆ సినిమాలో నటించిన విక్కీ కౌశల్ గురించి మాట్లాడడం అంతకన్నా ముఖ్యం. మరాఠా వీరుడు శంభూజీ మహరాజ్ ను ప్రేక్షకుల కళ్ల ముందు అతను ప్రతిష్టించిన తీరు అమోఘం. దేశంలో అత్యధిక శాతం మందికి అంతగా పరిచయం లేని ఓ వీరుని కధను పరిచయం చేయడం మాత్రమే కాదు వారి గుండెల్లో నిలిచిపోయేలా చేయడంలో విక్కీ...విజయం సాధించాడు.అమీర్ఖాన్...భావోద్వేగ భరిత సినిమాల ద్వారా భారీ విజయాల్ని అందుకోవడంలో తానెందుకు మిగిలిన హీరోల కన్నా ముందుంటాడో చాటి చెప్పడంలో అమీర్ఖాన్ మరోసారి విజయం సాధించాడు. సితారే జమీన్ పర్ లో అమీర్ ఖాన్ తన స్టార్ డమ్ ద్వారా కళ్ల ముందు మెరుపులు మెరిపించడం కన్నా... మన హృదయాలను స్పర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పనిలో ఆయన విజయం సాధించాడు. -
సాయిపల్లవి సినిమాకు రూ.1000 కోట్ల లాభం.. అదీ విడుదల కాకుండానే...
సినిమాల లాభాలు సాధారణంగా ఆ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత గానీ లెక్కకు రావు. అరుదుగా కొన్ని సెన్సేషనల్ చిత్రాలు మాత్రం బిజినెస్ రైట్స్ అమ్మకాలు వంటి వాటి ద్వారా ముందే రికార్డ్స్ సృష్టిస్తాయి. అయితే వీటన్నింటికీ అతీతంగా హక్కుల అమ్మకాల ద్వారా కాకుండా ఎప్పుడూ ఎవరూ చవిచూడని రీతిలో ఓ సినిమా లాభాలను ఆర్జించి వార్తల్లో నిలిచింది. బహుశా భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా లాభాలు అదీ ఈ స్థాయిలో అందుకున్న తొలిసినిమా ఇదే కావచ్చు. ఆ సినిమా పేరు రామాయణ(Ramayana). భారత దేశంలో హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా శాసించే పౌరాణిక గాధ... భారతీయ సినిమాను సైతం శాసించనున్నట్టు ఈ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే నభూతో నభవిష్యత్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.1000 కోట్ల వరకూ అంచనా వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే రూ.1000 కోట్ల లాభాలు ఎలా అర్జించిందీ అంటే...వెయ్యికోట్ల లాభం వెనుక...ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ను నమిత్ మల్హోత్రా ఆధ్వర్యంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ నిర్మిస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ)లో లిస్టింగ్ లో ఉన్న కంపెనీ ప్రైమ్ ఫోకస్. ఈ ప్రతిష్టాత్మక సినిమా ‘రామాయణ’ తొలి గ్లింప్స్ ఈ నెల3న విడుదలైంది. ఆ విడుదలతోనే దేశవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు, ప్రచారం పెరుగుతూ పోతుండడంతో ప్రైమ్ ఫోకస్ కంపెనీకి స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు రావడం మొదలైంది. ఈ కంపెనీ షేర్లు జూన్ 25న రూ113.47 వద్ద ఉండగా, జూలై 1 నాటికి రూ.149.69కి పెరిగాయి. అయితే, జూలై 3న ‘రామాయణం’ ఫస్ట్ లుక్ విడుదలైన రోజున ఈ షేర్ విలువ ఏకంగా రూ.176కి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 1న రూ.4638 కోట్ల నుంచి రూ5641 కోట్లకు పెరిగింది. అంటే, కేవలం రెండు రోజుల్లోనే సంస్థకు రూ.1000 కోట్ల వరకూ సంపద పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ధర ₹169గా ఉండగా, మొత్తం క్యాప్ దాదాపు 5200 కోట్ల వద్ద స్థిరపడింది.భారీ పారితోషికం...హీరోకి కూడా షేర్లు...ఇక ఈ సినిమా హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) కూడా నిర్మాణ సంస్థలో పెట్టుబడి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీ బోర్డు మంజూరు చేసిన 462.7 మిలియన్ షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యులో రణబీర్ కూడా షేర్లను పొందారని బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. రణబీర్ మొత్తం 12.5 లక్షల షేర్లను కలిగి ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను రణబీర్కు రూ.150కోట్ల వరకూ పారితోషికం చెల్లిస్తున్నట్టు సమాచారం. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027లో విడుదల కానుంది.సీతగా సాయిపల్లవి...ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రావణుడిగా, యష్(yash)లు నటిస్తుండగా సీత పాత్రలో దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi) నటిస్తుండడం విశేషం. ఇక లక్ష్మణుడిగారవీ దూబే హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్, హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంయుక్తంగా రూపొందించనున్నారు. హాన్స్ జిమ్మర్కు ఇది బాలీవుడ్ లో ఆరంగేట్రం కావడం విశేషం.రామాయణం’ ప్రాజెక్ట్తో భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం సాకారమవుతోందని సినీవర్గాలు భావిస్తున్నాయి. -
రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. ఆ పార్టీలో చేరనుందా?
సినీ కథానాయికలు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చెప్పడం సాధ్యం కాదు. నటి కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఒక సమయంలో ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశ పడ్డారట. ఓ భేటీలో తన ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయితే కథానాయికిగా రంగ ప్రవేశం చేసి పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఇదు ఎన్నమాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని అందించింది. ఆ తరువాత నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్కు చేరుకున్నారు. అలాగే తెలుగులో మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ ప్రేక్షకులను బేబీ జాన్ చిత్రంతో పలకరించారు. అలాగే తన 15 ఏళ్ల స్నేహితుడిని గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని ఇల్లాలుగా మారారు. ఆ కారణం చేతనో, వరుస అపజయాల కారణంగానో కీర్తి సురేష్కు అవకాశాలు తగ్గాయి. వివాహానంతరం ఈ బ్యూటీ కొత్త చిత్రం ఏదీ చేయలేదు. అంతకు ముందు నటించిన ఉప్పు కారం అనే చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదల అయ్యింది.సినిమా అవకాశాలు తగ్గినా కమర్షియల్గా నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా ఇటీవల ఈమె మదురైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఆమెను చూడగానే కొందరు అభిమానులు టీవీకే..టీవీకే అంటూ నటుడు విజయ్ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. కీర్తిసురేష్ నటుడు విజయ్కు జంటగా రెండు చిత్రాల్లో నటించారు. దీంతో కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీలో చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్ అయ్యింది. దీనిపై కీర్తి సురేష్ స్పందించలేదు. దీంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, విజయ్ పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది. అందుకే విజయ్ అభిమానులు ఆమెను చూడగానే టీవీకే అంటూ కేకలు పెట్టారు. మరి నటి కీర్తి సురేష్ నిర్ణయం ఏమిటో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
హీరోయిన్తో అసభ్యకర ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్
‘దసరా’ విలన్ షైన్ టామ్ చాకో(Shine Tom Chacko ) ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణలు, కొన్నాళ్లకే రోడ్డు ప్రమాదం..ఆ ప్రమాదంలో తండ్రి మరణించడం.. ఇవన్నీ చాకోని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకే కొన్నాళ్లుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. గతంలో చేసిన తప్ప్పులను సరిదిద్దుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో తన ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డ నటి విన్సీసోనీ అలోషియన్(Vincy Aloshious)కి తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. కావాలని అలా చేయలేదని.. ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలంటూ మీడియా ముందే ఆమెను కోరారు. చాకో చెప్పిన సారీని విన్సీ అంగీకరించడంతో వివాదానికి ఎండ్ కార్డు పడింది.సూత్రధారి సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ మధ్య విన్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మలయాళ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇదే సినిమా ప్రచారం కోసం వచ్చిన చాకో.. అందరి ముందే విన్సీకి క్షమాపణలు చెప్పాడు. ‘నేను కావాలని మీతో ఇబ్బందికరంగా ప్రవర్తించలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను సరదాగా చెప్పానంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. నా ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడినందుకు క్షమించాలి’ అని కోరగా.. పక్కనే ఉన్న విన్సీ మైక్ తీసుకొని ‘ఆ సమయంలో ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆయన నుంచి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. నేను స్పందించిన తీరు ఆయన కుటుంబాన్ని కూడా ఎంతో బాధించింది. ఇప్పుడు ఆయనలో మార్పు కనిపిస్తుంది. తప్పు తెలుసుకున్నాడు. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అని పేర్కొంది. విన్సీ క్షమించడంతో చాకోకు ఒక పెద్ద రిలీఫ్ లభించినట్లు అయింది. ఇప్పటికే డ్రగ్స్ కేసుతో ఇబ్బంది పడుతున్న చాకో.. సారీ చెప్పి మంచి పనే చేశాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సినిమా షూటింగ్లో అయితే వివాదం చెలరేగిందో.. అదే సినిమా ఈవెంట్లో దాన్ని పరిష్కరించుకొని ఒక సమస్యను తగ్గించుకున్నాడు. -
అయోత్తి రీమేక్లో?
తమిళ హీరో ధనుష్తో కలిసి నాగార్జున చేసిన ‘కుబేర’ సినిమా ఈ జూన్ 20న విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో నాగార్జున విలన్గా నటించగా, ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అలాగే నాగార్జున వందో సినిమా పనులు తమిళ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్తో జరుగుతున్నాయి.కాగా తాజాగా శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘అయోత్తి’ పట్ల నాగార్జున ఆసక్తిగా ఉన్నారట. 2023లో విడుదలై, ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఈ రీమేక్ వార్త నిజమే అయితే ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారా? లేక నిర్మాణం వరకే పరిమితమవుతారా? అనేది చూడాలి. ఇక ‘అయోత్తి’ కథ విషయానికి వస్తే... ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జీవించే బలరాం తీర్థయాత్ర కోసం తమిళనాడులోని రామేశ్వరానికి వెళతాడు.కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో బలరాం భార్య జానకి, కూతురు శివానీ గాయపడతారు. చికిత్స తీసుకుంటూనే జానకి మరణిస్తుంది. దీంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు తీసుకెళ్లాలని బలరాం అనుకుంటాడు. కానీ అతనికి అనుకోని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎదుర్కొని, అబ్దుల్ మాలిక్ అనే వ్యక్తి సాయంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు బలరాం ఎలా తీసుకుని వెళ్లాడన్నదే ‘అయోత్తి’ సినిమా. -
జిమ్లో బిగ్బాస్ దివి వర్కవుట్స్.. మాల్దీవుస్లో హీరోయిన్ ప్రణీత!
బిగ్బాస్ దివి జిమ్ వర్కవుట్ పోజులు.చిన్నపిల్లలతో బిగ్బాస్ అశ్విని శ్రీ ..మాల్దీవుల్లో హీరోయిన్ ప్రణీత వేకేషన్..శారీలో హీరోయిన్ ప్రియమణి పోజులు..స్విమ్మింగ్పూల్లో సేదతీరుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by HemaDayal (@hemadayal18) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
జయం రవితో విడాకుల వివాదం.. ఆర్తి తొలిసారి ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం గత కొద్దికాలంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల వివాహాబంధానికి ముగింపు పలికేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గతేడాది చివర్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు జయం రవి. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. తాము విడిపోవడానికి కారణం మూడో వ్యక్తేనని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. పరోక్షంగా సింగర్ కెన్నీషాను ఉద్దేశించి విమర్శలు చేసింది. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో కోర్టు విచారణకు హాజరవుతున్నారు.అయితే తాజాగా జయం రవి భార్య ఆర్తి చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్గా మారింది. తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. నా చుట్టూ ఉన్న ప్రతిదీ పెరుగుతూనే ఉంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తన ఇద్దరు పిల్లలు, పెట్ డాగ్తో ఉన్న వరుస ఫోటోలను షేర్ చేసింది. కొన్ని హృదయాలకు ఎక్కడ ఉండాలో తెలుసంటూ రాసుకొచ్చింది.ఆర్తి తన ఇన్స్టాలో రాస్తూ.. "కొన్ని సాయంత్రాలు, కొన్ని పెరుగుతున్న విషయాల మధ్య సూర్యాస్తమయం.. గట్టిగా పట్టుకునే రెండు చేతులు.. ఎలాంటి మాటలు లేకున్నా దగ్గరగా ఉండే హృదయం.. ప్రతిదీ సంపూర్ణంగా అనిపించేలా చేసే నిశ్శబ్ద ప్రేమ ' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్గా మారింది. జయం రవితో విడాకుల వివాదం ప్రేమ, హృదయం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. ఇది చూసిన హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా స్పందించింది. చాలా అందంగా ఉంది.. ఆర్తు అంటూ కామెంట్ చేసింది. కాగా.. 16 ఏళ్ల క్రిత రవి, ఆర్తి పెళ్లి చేసుకోగా..వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
'హృదయ విదారకం.. నిర్లక్ష్యం ఎవరిదైనా క్షమించరానిది'.. కమల్ హాసన్ ట్వీట్
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ కడలూరు ప్రమాదంపై స్పందించారు. ఇవాళ తమిళనాడులో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో విద్యార్థులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఈ ఘటనకు కారణం ఎవరైనా ఇది క్షమించరానిది అని ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కమల్ హాసన్ కోరారు.కమల్ హాసన్ తన ట్వీట్లో రాస్తూ..' ఇది చాలా హృదయ విదారక వార్త. కడలూరు-సెమ్మంగుప్పం రైల్వే లైన్లో పాఠశాలకు వెళ్తున్న పిల్లల బస్సును రైలు ఢీకొని విద్యార్థులు మరణించడం హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదైనా క్షమించరానిది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి. తమ పిల్లలను కోల్పోయినందుకు బాధపడుతున్న తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా' అంటూ సంతాపం తెలియజేశారు.కాగా.. ఇవాళ ఉదయం తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే.. గేట్మేన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్మేన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్మేన్ పంకజ్శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. இதயத்தைப் பதைக்க வைக்கும் செய்தி. கடலூர் செம்மங்குப்பம் ரயில் பாதையில் பள்ளிக்குச் சென்ற ஒன்றுமறியா இளங்குருத்துகள் ரயில் மோதி இறந்ததை ஒப்பவே மனம் மறுக்கிறது. எவரின் அலட்சியமாக இருந்தாலும் இது மன்னிக்கத் தகுந்ததே அல்ல.ஏற்றுக்கொள்ளவே முடியாத துக்கம் நிகழ்ந்திருக்கிறது. இனியும்…— Kamal Haasan (@ikamalhaasan) July 8, 2025 -
ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. జూలై 25న రావాల్సిన కింగ్డమ్ మరో ఆలస్యంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెలాఖర్లో బిగ్ స్క్రీన్పై కింగ్డమ్ రిలీజ్ కానుంది. ఓ స్పెషల్ వీడియోతో కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్క్రిప్ట్ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటున్నట్లు వెల్లడించారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో మనకు ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఈ స్క్రిప్ట్ బాగాలేదు.. ఈ సినిమా నేను చేయను.. అని ముక్కుసూటిగా చెప్పలేం. గతంలో నాకు ఇంత ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అదే ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న నటుడికే అవకాశం వస్తే.. ఆ స్క్రిప్ట్ను చేయనని ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఆ తర్వాత అతని తండ్రి వచ్చి మరో మూడు, నాలుగు నెలలు ఆగండి. వీలైతే ఎక్కువమంది రైటర్లను తీసుకొస్తానని అంటాడు. నేనైతే ఇటీవల స్క్రిప్ట్ల విషయంలో కాస్త కఠినంగానే ఉంటున్నా. నా దగ్గరకు వచ్చిన దర్శకులతో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాకు డబ్బుతో పాటు కెరీర్ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చేసేదానితో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నా. స్క్రిప్ట్తో ఓకే అనిపించిన తర్వాతే ముందుకు వెళ్తున్నా' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిటారు. ఈ యాక్షన్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
కొత్త ఏడాదిలో రెండు హిట్స్.. మరో సినిమా ప్రకటించిన మోహన్ లాల్
ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మలయాళ స్టార్ మోహన్ లాల్. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తుడురుమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శోభన కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సైతం ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాకుండా ఇటీవలే విడుదలైన మంచు విష్ణు కన్నప్ప చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు.తాజాగా మరో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. నా నెక్ట్స్ మూవీని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని.. ఈ ఆసక్తికర కొత్త అధ్యాయంలో భాగమైనందుకు గొప్పగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ఎల్365 అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ఆస్టిన్ డాన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆషిక్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు.With immense joy, I announce my next film.Directed by Austin Dan Thomas,Written by Retheesh Ravi,And produced by Ashiq Usman under the banner of Ashiq Usman Productions.Grateful to be part of this exciting new chapter.#L365#AustinDanThomas#RetheeshRavi#AashiqUsman… pic.twitter.com/F3MGb1xeRG— Mohanlal (@Mohanlal) July 8, 2025 -
ఆసక్తికర వెబ్ సిరీస్ వాయిదా.. కొత్త స్ట్రీమింగ్ ఇదే!
గతంలో ఓటీటీ ప్రియులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఓటీటీ ఆడియన్స్ను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే స్పెషల్ ఓపీఎస్ సీజన్-2 ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్ను కూడా ప్రకటించారు. జూలై 11 నుంచే స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.అయితే తాజాగా మేకర్స్ స్పెషల్ ఓపీఎస్-2 వెబ్ సిరీస్ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేశారు. ఈ నెల 18 నుంచి వెబ్ సిరీస్ అందుబాటులోకి వస్తుందని మేకర్స్ వీడియో ద్వారా తెలిపారు. కొన్నిసార్లు అన్ని మనచేతుల్లో ఉండవని అందుకే వాయిదా వేయాల్సి వచ్చిందని నటుడు కేకే మేనన్ పేర్కొన్నారు. మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదని ఆడియన్స్ను కోరారు. ఈ సారి అన్ని ఎపిసోడ్స్ ఓకేసారి స్ట్రీమింగ్ చేస్తామని తెలిపారు.కాగా.. ఈ వెబ్ సిరీస్లో కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త కీలక పాత్రలు పోషించారు. స్పై యాక్షన్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్ రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ జూలై 18 నుంచి జియోహాట్స్టార్లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రెండో సీజన్లో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు.We understand you're on the edge of your seat, but thoda aur intezar and it’s going to be worth all the wait! #HotstarSpecials #SpecialOps2, all episodes streaming from July 18, only on #JioHotstar#SpecialOps2OnJioHotstar pic.twitter.com/ky15pZPgnh— JioHotstar (@JioHotstar) July 8, 2025 -
'ఇప్పటికే మూడో పెళ్లి చేసుకున్నా.. కానీ'.. అమిర్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. లాల్ సింగ్ చద్ధా తర్వాత అమిర్ చేసిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2018లో వచ్చిన మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో.అయితే ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అమిర్ ఖాన్ మరోసారి రిలేషన్లో ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్లో ఉన్న అమిర్ ఖాన్.. మూడో పెళ్లిపై స్పందించారు. గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు అమిర్ ఖాన్ తెలిపారు. మేమిద్దరం చాలా నిజాయితీ, నిబద్ధతతో ఉన్నామని అన్నారు. మీకు తెలుసా? మేము ప్రస్తుతం భాగస్వాములని.. ఇప్పటికే తన హృదయంతో ఆమెను పెళ్లాడానని అమిర్ ఖాన్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేము కలిసి ఉన్నామని.. అయితే అధికారికంగా పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే దానిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అమిర్ ఖాన్ తెలిపారు.కాగా.. ఈ సంవత్సరం మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో తన రిలేషన్ను అఫీషియల్గా ప్రకటించారు. అమిర్ వయస్సు 60 ఏళ్లు కాగా.. గౌరీకి(46) అతనికి దాదాపు 14 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇప్పటికే అమిర్ ఖాన్ 1986లో మొదట రీనా దత్తాను పెళ్లాడారు. ఆ తర్వాత 2002లో విడిపోయారు. మరో మూడేళ్లకు డైరెక్టర్ కిరణ్ రావును వివాహమాడారు. వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మూడో పెళ్లికి సిద్ధమయ్యారు మన బాలీవుడ్ స్టార్ హీరో. -
శ్రుతీహాసన్ షాకింగ్ నిర్ణయం.. ఇన్స్టా పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో శ్రుతీహాసన్(Shruti Haasan) ఒకరు. సినిమా అప్డేట్స్తో పాటు తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు తరచు ఫోటోషూట్ చేసి వాటిని ఇన్స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ని అలరిస్తుంది. ఇన్స్టాలో ఆమెకు 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే..ఆమె నెట్టింట ఎంత యాక్టివ్గా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని తన ఫాలోవర్స్కి తెలియజేస్తూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఈ అమ్మడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. తన అకౌంట్ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. శ్రుతీహాసన్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. -
కార్పొరేట్ జాబ్ చేయకుండా.. రూ.2 వేల జీతానికే జాయిన్ అయ్యా: హీరో సిద్ధార్థ్
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా నటించిన 3బీహెచ్కే జూలై 4న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ మీతా రఘునాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేవలం రెండు వేల రూపాయలకే అసిస్టెంట్గా జాయిన్ అయ్యానని వెల్లడించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..' నేను నా లైఫ్ను రెండుసార్లు రీసెట్ చేశాను. ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ జాబ్ చేయకుండా సినిమా వైపు వచ్చా. కేవలం రెండు వేల రూపాయలకే మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. అప్పుడు నా పేరేంట్స్ నన్ను చూసి ఆందోళనకు గురయ్యారు. వీడేంటి సినిమా సైడ్ వెళ్తున్నాడు.. అది కూడా డైరెక్టర్ అవుతానని అంటున్నాడు. వీడు ఏమవుతాడో అని భయపడ్డారు. అక్కడి నుంచి మొదలై 25 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక సింగర్గా, నటుడిగా మీ ముందు నిలబడ్డా' అని పంచుకున్నారు.(ఇది చదవండి: తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్)కాగా.. 3 బీహెచ్కే మూవీలో శరత్కుమార్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముదుకొచ్చింది. కాగా.. గతేడాది సిద్ధార్థ్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఆదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు. తెలంగాణలోని ఓ ప్రాచీన ఆలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. -
స్మృతి ఇరానీకి జాక్పాట్.. రీ ఎంట్రీలో కళ్లుచెదిరే రెమ్యునరేషన్!
బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి ఇరానీ మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి' అనే సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో ఈ సీరియల్ ద్వారానే ఫేమ్ తెచ్చుకున్న స్మృతి ఇరానీ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి-2' సీక్వెల్ ద్వారా మరోసారి తులసి విరానీగా బుల్లితెర అభిమానులను అలరించనుంది. ఈ నెలలోనే ప్రసారం కానున్న ఈ సీిరియల్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి-2' సీక్వెల్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోన్న స్మృతి ఇరానీ భారీగానే రెమ్యుననేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2000లో ఈ షో ప్రారంభించినప్పుడు ఒక్కో ఎపిసోడ్కు కేవలం రూ.1800 రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ పాత్రకు ఎపిసోడ్కు ఏకంగా రూ.14 లక్షల పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం స్మృతి ఇరానీ రెమ్యునరేషన్పై టాక్ నడుస్తోంది. తాను ఒక పెద్ద స్టార్ అవుతానని జ్యోతిష్యంలో చెప్పారని గత ఇంటర్వ్యూల్లో ఆమె వెల్లడించారు. మొదట తాను మెక్డొనాల్డ్స్లో ఉద్యోగం చేసే సమయంలో నెలకు కేవలం రూ.1800 జీతం మాత్రమే అందుకున్నట్లు తెలిపారు.కాగా.. 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి-2' సీరియల్ జూలై 29 నుంచి స్టార్ ప్లస్లో ప్రీమియర్ కానుంది. ఇటీవల స్మృతి ఇరానీ.. తులసి విరానీ పాత్రలో నటించిన ప్రోమోను షేర్ చేశారు. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
' నా భార్యకు ఐవీఎఫ్ చికిత్స.. ఆశలు వదిలేసుకున్నాం.. కానీ'.. విష్ణు విశాల్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే హైదరాబాద్లో సందడి చేశారు. ప్రముఖ కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కుమార్తె నామకరణ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్- గుత్తా జ్వాల బిడ్డకు అమిర్ ఖాన్ ముద్దుపేరు పెట్టారు. మైరా అంటూ అంటూ వారి పాపకు నామకరణం చేశారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ దంపతులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విష్ణు విశాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య గుత్తా జ్వాలాకు ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా చాలా సార్లు ప్రయత్నించామని తెలిపారు. చాలాసార్లు విఫలం కావడంతో ఇక ఆశలు వదిలేసుకునే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. కానీ అమిర్ ఖాన్ ముంబయిలోని అతనికి తెలిసిన వైద్యుడి వద్దకు మమ్మల్ని తీసుకెళ్లారని వివరించారు. అలా అమిర్ ఖాన్ తమకు మరిచిపోలేని సాయం చేశారని అన్నారు.విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ' జ్వాలా, నేను కొన్ని నెలల పాటు ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా బిడ్డ కోసం ప్రయత్నించాం. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. ఇక లాభం లేదనుకుని దాదాపు ఆశలు వదిలేసుకున్నాం. అయితే చెన్నైలో వరదల సమయంలో నేను అనుకోకుండా అమీర్ సర్ను కలిశాను. మా గురించి తెలుసుకుని వెంటనే సాయం చేసేందుకు ముంందుకొచ్చాడు. అతను మమ్మల్ని ముంబయికి తీసుకొచ్చి వైద్యం కోసం అన్ని రకాల ఏర్పాటు చేశాడు. జ్వాలా గుత్తా తన చికిత్స కోసం ముంబయిలోనే ఉండాల్సి వచ్చింది. గుత్తా జ్వాలా తన తల్లి, సోదరీమణులతో పాటు అమీర్ ఖాన్ ఇంట్లోనే దాదాపు 10 నెలలు ఉండిపోయింది. తన ఇంట్లోనే అతిథ్యం ఇచ్చి పది నెలల పాటు మమ్మల్న ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అమీర్ సర్ తల్లి, సోదరీమణులు జ్వాలను ఎంతో బాగా చూసుకున్నారని' తెలిపారు.ఇటీవల తన కూతురికి పేరు పెట్టమని అమీర్ సర్ను అడిగిన క్షణాన్ని విష్ణు విశాల్ గుర్తు చేసుకున్నారు. మాకు బిడ్డ పుట్టబోతున్నప్పుడు నేను అమీర్ సార్కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపాను. ఆ తర్వాత మా పాపకు పేరు పెట్టమని అడిగాను.. వెంటనే మాకోసం హైదరాబాద్కు విమానంలో వచ్చి మా అమ్మాయికి మైరా అని పేరు పెట్టారు. అమీర్ సర్కు కృతజ్ఞతలు చెప్పడానికి ఏమిచ్చినా సరిపోదు.. జ్వాలా, మైరా, నేను ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞులమై ఉంటామని విష్ణు విశాల్ భావోద్వేగానికి గురయ్యారు.కాగా.. 2023 చెన్నైలో వరదల సమయంలో అమీర్ ఖాన్ తన తల్లితో చెన్నైలో చిక్కుకున్నారు. తన తల్లికి చికిత్స కోసం కొన్ని నెలలు చెన్నైలోనే ఉన్నారు. ఆ సమయంలో విష్ణు విశాల్, అమీర్ ఖాన్ ఓల్డ్ మహాబలిపురం రోడ్ (OMR) లోని ఒకే ప్రాంతంలో నివసించారు. అప్పుడు వీరందరినీ పడవల ద్వారా రక్షించిన సంగతి తెలిసిందే. -
మొన్న శృతిహాసన్.. నేడు మార్కో హీరో.. సోషల్ మీడియా హ్యాక్!
ఇటీవల ఎక్కువగా సినీతారల సోషల్ మీడియా ఖాతాలే టార్గెట్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే శృతిహాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్ గురైంది. ఆమె ట్విటర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంభందించిన లింక్స్ దర్శనమిచ్చాయి. అయితే తాజాగా మరో హీరో సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్ గురైంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని అభిమానులను హెచ్చరించారు. ఏదైనా సందేశాలు వస్తే వాటికి రెస్పాండ్ కావొద్దని ఫ్యాన్స్కు సూచించారు. ప్రస్తుతం దీనిపై తన టీమ్ సభ్యులు పని చేస్తున్నారని.. అకౌంట్ రికవరీ అయ్యాక తానే అప్డేట్ ఇస్తానని అభిమానులకు అలర్ట్ చేశారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలియజేశారు.మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ గతేడాది మార్కో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోస్ట్ వయొలెంట్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే మార్కో చిత్రంలో వయొలెన్స్ విపరీతంగా ఉందని కొందరు విమర్శలు కూడా చేశారు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన మార్కోను రూ. 30 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్గా కూడా ఉంటుందని అభిమానులు భావించినప్పటికీ అలాంటిదేం లేదని ఇటీవలే కొట్టపారేశారు. -
ఉదయ్ కిరణ్ని చాలా హింసించారు.. వారికి అదొక ఆనందం: కౌశల్
ఉదయ్ కిరణ్(Uday Kiran) ..తెలుగు ప్రేక్షకులను పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కదన్నా.. లాంటి ఎన్నో ప్రేమ చిత్రాలను చేసి..యూత్కి ఫేవరేట్ హీరో అయ్యాడు. ఈ యంగ్ హీరో టాలీవుడ్ని కొన్నేళ్ల పాటు ఏలేస్తాడని అంతా అనుకున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం..అవకాశాలు పెద్దగా రాకపోవడంతో మానసిక క్షోభకు గురై 33 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆయన మరణంపై టాలీవుడ్లో అనేక రూమర్స్ ఉన్నాయి. కొంతమంది కావాలనే ఉదయ్కి అవకాశాలు రాకుండా చేశారని టాలీవుడ్లో టాక్ ఉంది. అయితే ఆయన ఆత్మహత్యకు సరైన కారణం ఏంటో తెలియదు కానీ..ఉదయ్ని దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తారు. చాలా కష్టపడి పైకి వచ్చాడని చెబుతుంటారు. తాజాగా బిగ్బాస్ ఫేం కౌశల్ కూడా అదే చెప్పాడు. ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్తో తనకు మంచి అనుబంధం ఉండేదని.. అతను స్టార్గా ఎదిగేందుకు చాలా కష్టపడ్డాడని అన్నారు.‘ఉదయ్ హీరో కాకముందే నాకు తెలుసు. ఆయనతో కలిసి నేను పదమూడు సినిమాలకు పైగా పని చేశాను. బేగంపేట్లో ఉండేవాడు. అప్పుడప్పుడు అతని ఇంటికి కూడా వెళ్లేవాడిని. ఇద్దరం కలిసి యాడ్ ఫిల్మ్స్కి పని చేశాం. చాలా కష్టపడి స్టార్ పొజిషిషన్కి వచ్చాడు. ఆటైంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. చిన్న చిన్న సినిమాలు చేస్తున్న ఆయనకు చిత్రం మూవీతో మంచి బ్రేక్ వచ్చింది.అప్పటి వరకు ఆయన చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం చూస్తే.. ఆయన చనిపోయి మంచి పనే చేశాడని అనకూడదరు కానీ.. ఇలాంటి సమాజంలో బతకడమే వేస్ట్. ఒక మనిషి జీవితంలో కష్టపడి పై స్థాయికి వెళితే.. కిందకు లాగడానికే ట్రై చేస్తారు. దాని వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ అదొక ఆనందం. పైకి వెళ్లిన వారిని హింసించి.. మెసేజ్లు పెట్టి, ట్రోల్ చేసి..కిందకు లాగేద్దామనే ఆలోచనతోనే చాలా మంది ఉన్నారు’అని కౌశల్ అన్నారు. -
కథ నచ్చితే అలాంటి పాత్ర కూడా చేస్తా : మాళవికా మనోజ్
‘‘గతంలో నేను నటించిన సినిమాల్లో సాధారణంగా ఉండే పల్లెటూరి అమ్మాయి పాత్రలు చేశాను. అయితే ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో ఎంతో మోడ్రన్ గా, హైపర్గా, ఆటిట్యూడ్తో ఉండే సత్యభామ పాత్రలో నటించా.. ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని మాళవికా మనోజ్(Malavika Manoj) తెలిపారు. సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’(Oh Bhama Ayyo Rama). హరీష్ నల్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మాళవికా మనోజ్ మాట్లాడుతూ–‘‘నేను తమిళంలో నటించిన ‘జో’లో నా నటన నచ్చడంతో ‘ఓ భామ అయ్యో రామ’కి ఎంపిక చేశారు రామ్ గోధల. నాకు తెలుగు రాకపోయినా.. భావం అర్థం చేసుకుని సత్యభామ పాత్ర చేశాను. సుహాస్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. హరీష్గారు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. రధన్గారు మంచి పాటలిచ్చారు. భాషతో సంబంధం లేకుండా ఈ పాటలు అందరికి నచ్చాయి. ఈ సినిమాలో హరీష్ శంకర్, మారుతిగార్లతో నటించడం సంతోషంగా ఉంది. నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ, నచ్చిన కథలు మాత్రమే చేస్తున్నాను. గ్లామరస్ రోల్స్ చేయాలా? వద్దా? అనే నిబంధన నాకు లేదు. కథ నచ్చితే చేస్తాను’’ అన్నారు. -
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఆయన సతీమణి సువర్ణతో పాటు కుమార్తె స్రవంతి వేడుకున్నారు. దీంతో తాజాగా నటుడు విశ్వక్షేన్ స్పందించి సాయం అందించారు. ఆయన పంపిన బ్యాంక్ చెక్ను ఫిష్ వెంకట్కు అందించారు. అందుకు సంబంధించిన వీడియోను షోషల్మీడియాలో పోస్ట్ చేశారు.సుమారు నాలుగేళ్లగా తన రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ ద్వారా వెంకట్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బోడుప్పల్లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలతో బయటపడాలంటే సుమారు రూ. 50 లక్షలు అవసరం అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ పెద్దలతో పాటు దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని ఆమె కోరారు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ సాయం చేశారు. రూ. 2 లక్షల బ్యాంక్ చెక్ను తన టీమ్ ద్వారా ఆయన పంపారు. అందుకు ఫిష్ వెంకట్తో పాటు ఆయన కుమార్తె స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు. -
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం కలిగింది. కీరవాణి తండ్రి 'శివశక్తి దత్త' (92) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన తెలుగు సినిమా గీత రచయిత, స్క్రీన్ రైటర్, చిత్రకారుడిగా గుర్తింపు పొందారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గీత రచయితగా అనేక పాటలను రచించారు. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘రామం రాఘవం’ ను ఆయనే రాశారు. అతను తెలుగు చిత్రాలలో సంస్కృతం ఆధారిత పాటలకు సాహిత్యాన్ని వ్రాసినందుకు ప్రసిద్ధి చెందారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా సోదరులు అనే విషయం తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరుకు చెందిన శివశక్తి దత్తా అప్పట్లోనే ఇంటర్ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచీ కళల వైపు మొగ్గు చూపిన అతను చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి ముంబైలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చేరారు . రెండు సంవత్సరాల తరువాత డిప్లొమా పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మళ్లీ తన స్వస్థలం కొవ్వూరుకు తిరిగి వచ్చారు. చిత్రకారుడిగా కమలేష్ అనే కలం పేరును ఉపయోగించడం ప్రారంభించారు . తరువాత సుబ్బారావు తన పేరును శివ శక్తి దత్తగా మార్చుకున్నారు. దత్తాకు సంగీతంపై కూడా ఆసక్తి ఉంది. గిటార్ , సితార్ , హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు.రాఘవేంద్రరావుతో తొలిసారి జానకి రాముడు (1988) కోసం స్క్రీన్ రైటర్గా శివశక్తి దత్తా పనిచేశారు. సై , చత్రపతి , రాజన్న , బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి 2: ది కన్క్లూజన్ , RRR , హను-మాన్ వంటి చిత్రాలలో వివిధ పాటలకు సాహిత్యం రాశారు . దర్శకుడిగా చంద్రహాస్ (2007) సినిమా కోసం ఆయన పనిచేశారు. బాహుబలి సినిమాలో 'సాహోరే బాహుబలి' , 'మమతల తల్లి' 'దీవర' వంటి సాంగ్స్ రాశారు. -
ఆ ట్యాగ్ వల్ల ఎవరికీ తగలనన్ని ఎదురుదెబ్బలు తగలాయి: విజయ్
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), గతంలో తన పేరు ముందు 'ది' ట్యాగ్ని ఉపయోగించిన తర్వాత, దానిని వివాదాస్పదంగా భావించి, అభిమానులకు తొలగించమని సూచించారు. దీనిపై తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ఆ ట్యాగ్ ఇతర హీరోలతో పాటు వారి అభిమానులకు ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదని, తన పేరు ముందు 'ది' ఉపయోగించడం సరికాదనే నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.లైగర్ సినిమా విడుదల సమయంలో ఆయన పేరు ముందు సౌత్ సెన్సేషన్ అని చేర్చారు. దీంతో విజయ్ దేవరకొండపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగిందని ఇలా గుర్తుచేసుకున్నారు. 'లైగర్ సమయంలో నా పేరు ముందు ఒక ట్యాగ్లైన్ చేరుస్తున్నట్లు నా టీమ్ ఒత్తిడి చేసింది. నాకు ఆ ట్యాగ్ అక్కర్లేదు అంటూ వారికి చెప్పాను. దానిని చాలా కాలం పాటు వారితో ప్రతిఘటించాను. నా పేరుతోనే నాకు పేరు రావాలని మాత్రమే కోరుకున్నాను. కానీ మీడియాలో అప్పటికే సౌత్ సెన్సేషన్, రౌడీ స్టార్ వంటి ఇతర ట్యాగ్లైన్స్ నా పేరు ముందు చేరిపోయాయి.' అని ఆయన గుర్తు చేసుకున్నారు.అయితే, తన పేరు ముందు ఈ ట్యాగ్ లైన్స్ ఉండటం వల్ల కొందరికి ఇబ్బంది కలిగిందని అప్పుడే తొలగించాలని కోరినట్లు విజయ్ చెప్పారు. అయితే, తన పేరు ముందు 'ది' అని మాత్రమే ఉపయోగించాలని గతంలో ఆయన సూచించినట్లు గుర్తుచేసుకున్నారు. కానీ, అది కూడా వివాదాస్పదం కావడంతో దానిని కూడా తొలగించాలని అభిమానులకు సూచించినట్లు విజయ్ చెప్పారు. తన పేరు ముందు ఎలాంటి ట్యాగ్ చేర్చవద్దని తన అభిమానులను కోరినట్లు ఆయన గుర్తచేసుకున్నారు. తనను విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవమని కోరానన్నారు. ఏ హీరోలకు ఇలా జరగలేదు: విజయ్తన పేరు ముందు ఎలాంటి ట్యాగ్స్ అవసరం లేదని విజయ్ దేవరకొండ తాజాగా ఇలా చెప్పారు. 'నా పేరుకు ముందు 'ది' అనే పదం జోడించబడినందున విపరీతమైన వ్యతిరేఖత వచ్చింది. అలా వివాదాస్పదం కావడంతో తొలగించాలని అభిమానులకు అప్పుడే చెప్పాను. కానీ, చాలామంది హీరోలకు తమ పేరుకు ముందు ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. ఇలాంటి ట్యాగ్ వల్ల ఇతర ఏ హీరోలకు తగలనన్ని ఎదురుదెబ్బలు నాకు మాత్రమే తగిలాయి. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఉన్న వారికి యూనివర్సల్ స్టార్ నుండి పీపుల్స్ స్టార్ వరకు ఏ పేరు అయినా ఉండవచ్చు తప్పు లేదు. నాకంటే చిన్నవారు, నాకంటే పెద్దవారు, నాకంటే ముందు అరంగేట్రం చేసినవారు ఇలా ప్రతి ఒక్కరికీ ఒక ట్యాగ్లైన్ ఉంటుంది. బహుశా నాకు మాత్రమే అలాంటివి లేవు. ఇలా మరెవరికీ ఎదురుదెబ్బ తగలకూడదు.' అని ఆయన అన్నారు. -
'విక్రమ్ వేద' తర్వాత బిగ్ హీరోతో దర్శక ద్వయం సినిమా
సౌత్ ఇండియా చిత్రపరిశ్రమకు చెందిన నటుడు శివకార్తికేయన్( Sivakarthikeyan) సక్సెస్ఫుల్ బాటలో పరిగెడుతున్నాడు. ఇప్పటికే అయలాన్, మావీరన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఆయన ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మదరాసీ, సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో మదరాసీ చిత్రం ముందుగా తెరపైకి రానుందని సమాచారం. కాగా పరాశక్తి తరువాత శివకార్తికేయన్ నటించే చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా తాజాగా ఒక ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు మాధవన్, విజయ్సేతుపతి హీరోలుగా విక్రమ్ వేదా వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్–గాయత్రిల దర్శక ద్వయం ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. అయితే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సుడల్ అనే వెబ్ సిరీస్ను రూపొందించారు. అలాంటిది తాజాగా ఈ దర్శక ద్వయం మళ్లీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటుడు శివకార్తికేయన్ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. పుష్కర్–గాయత్రి చెప్పిన కథ శివకార్తికేయన్కు నచ్చిందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. కాగా నటుడు శివకార్తికేయన్ గుడ్నైట్ చిత్రం ఫేమ్ వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో ఏ చిత్రం ముందుగా సెట్పైకి వెళుతుందో చూడాలి. -
పూరి సేతుపతి ఆరంభం
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పూరి సేతుపతి’ (వర్కింగ్ టైటిల్) సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. సంయుక్త హీరోయిన్గా, టబు, విజయ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా సోమవారం నుంచి హైదరాబాద్లో ‘పూరి సేతుపతి’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని ప్రకటించారు మేకర్స్.‘‘విజయ్ సేతుపతి, సంయుక్తలతో పాటు ఇతర కీలక తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందుకోసం భారీ సెట్ వేశాం. ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ శరవేగంగా జరిగేలా ప్లాన్ చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
జోరుగా హుషారుగా...
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత కొత్త సినిమాలను ఖరారు చేయడంలో వెంకటేష్ జోరు పెంచారు. ఆయన నటించనున్న కొత్త సినిమాలపై స్పష్టత వచ్చింది. అమెరికాలో జరిగిన ‘నాట్స్–2025’ వేడుకల్లో తన తర్వాతి చిత్రాల గురించి వెంకటేశ్ హుషారుగా మాట్లాడారు. ‘‘త్రివిక్రమ్తో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తాను.మీనాతో కలిసి ఓ సినిమా చేస్తాను (దృశ్యం 3). ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలోనే మరో సినిమా ఉంది. ఈ చిత్రాలతో పాటు నా మిత్రుడు, తెలుగులో ఓ పెద్ద స్టార్ హీరోతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాను’’ అని తెలిపారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చేయబోయే సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ అని, అలాగే వెంకటేశ్ ప్రస్తావించిన భారీ ప్రాజెక్ట్ బాలకృష్ణతో ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
బీచ్లో యాంకర్ శ్రీముఖి పోజులు.. మిచిగాన్ వీధుల్లో సమంత చిల్!
గ్రీన్ డ్రెస్లో సింగర్ కెన్నీషా హోయలు..లండన్లో చిల్ అవుతోన్న లక్ష్మీ రాయ్..బీచ్లో యాంకర్ శ్రీముఖి పోజులు...మిచిగాన్ వీధుల్లో హీరోయిన్ సమంత..వెకేషన్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ చిల్.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by KENEESHAA (@keneeshaa1) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి
లెజెండరీ నటుడు కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో తలుపులమ్మ ఆలయంలో ఆమె అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న శ్యామలాదేవి.. ప్రభాస్ పేరిట విశేష కుంకుమార్చన పూజ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. -
ఆమె సినిమాల్లోకి ఎంట్రీ.. అప్పటికీ నువ్వింక పుట్టనేలేదు.. రష్మికపై నెటిజన్స్ ట్రోల్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ వారికి కోపం తెప్పిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా రష్మికపై మండిపడుతున్నారు. మీ అజ్ఞానాన్ని అందరిపై రుద్దొద్దని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అసలు రష్మిక చేసిన కామెంట్స్ ఏంటి? ఎందుకింతలా వ్యతిరేకత వస్తుందో? మీరు కూడా చూసేయండి.నేను ఫస్ట్ అంటూ కామెంట్స్..ఇటీవల రష్మిక మందన్నా.. కూర్గ్ జిల్లాలోని కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నటిని అని తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది. ఈ వ్యాఖ్యలే రష్మికను టార్గెట్ చేసేలే చేశాయి. ఆమె కామెంట్స్పై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. ఎందుకంటే ఆమె కంటే ముందు పలువురు నటీనటులు కూర్గ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. మీ కంటే ముందుగానే 1990ల్లోనే నెరవంద ప్రేమ కూర్గ్ నుంచి వచ్చారని చురకలంటించారు. అంతేకాకుండా నీ కంటే ముందు నుంచే గుల్షన్ దేవయ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారని గుర్తు చేశారు.రష్మిక చేసిన కామెంట్స్పై నటి ప్రేమ కూడా స్పందించింది. ఈ విషయంలో నేను ఏమి చెప్పగలను? కొడవ సమాజానికి నిజమేంటో తెలుసు.. ఆమె వర్షన్ గురించి తననే అడగాలని సూచించింది. కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సుగమం చేశారని ప్రేమ వెల్లడించారు.ప్రేమ మాట్లాడుతూ..' రష్మిక సినిమాల్లోకి రాకముందే ఇతరులు ఆమెకు మార్గం సుగమం చేశారు. నా కంటే ముందు కూర్గ్కు చెందిన శశికళ అనే నటి సహాయక పాత్రలు పోషించింది. అప్పుడే నేను చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించా. ఆ తరువాత చాలా మంది కొడవ వాళ్లు బాగా రాణించారు.' అని అన్నారు. కాగా.. ప్రేమ 1990ల్లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. తన నటనకు గానూ కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు, ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది.రష్మికపై నెటిజన్ల ట్రోల్స్..రష్మిక కామెంట్స్పై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రోల్స్ వచ్చాయి. ఆమె కంటే ముందే ప్రేమ, నిధి సుబ్బాయ్య, హరిషిక పూనాచా, తనీషా కుప్పందా లాంటి వాళ్లు సినిమాల్లో నటించారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కూర్గ్ నుంచి వచ్చిన మొదటి నటినని చెప్పడం వందశాతం తప్పు.. ఎందుకంటే రష్మిక రాకముందే 5 నుంచి 6 మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రేమ మేడమ్ ఓం అనే కన్నడ సినిమాలో నటించినప్పుడు రష్మిక అస్సలు పుట్టలేదని మరో నెటిజన్ రాశారు. రష్మిక బహుశా నీకు నువ్వే గొప్ప అనుకోవచ్చు.. కానీ గుల్షన్ దేవయ్య కూడా గొప్పగా నటించాడనే విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు అంటూ ప్రశ్నించాడు. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈనెల 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. దీంతో మేకర్స్ మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది.(ఇది చదవండి: విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!)తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ తేదీని రివీల్ చేశారు. జూలై 31న కింగ్ డమ్ విడుదల కానుందని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.One man.A heart full of fury.A world that pushed too far.Now it’s CARNAGE time.#Kingdom Release Date Promo out now 🔥Telugu - https://t.co/SYAlvEXoNhTamil - https://t.co/QHRfX0jNEUIn Cinemas July 31st, 2025 ❤️@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev… pic.twitter.com/OxOmcrZhil— Sithara Entertainments (@SitharaEnts) July 7, 2025 -
తెలంగాణ సీఎంను కలిసి స్టార్ హీరో అజయ్ దేవగణ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కలిశారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి అజయ్ దేవగణ్ హామీ ఇచ్చారు. ఏఐ సాంకేతికత జోడింపుతో వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సీఎంకు అందజేశారు.మాజీ క్రికెటర్ కపిల్ దేవ్తో భేటీముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీలోని ఆయన నివాసంలో ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించారు. దీనికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రికి కపిల్దేవ్ వివరించారు. -
వర్జిన్ బాయ్స్ హీరోయిన్ గొప్పమనసు.. నల్గొండ కుర్రాడికి సాయం!
బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ ప్రస్తుతం వర్జిన్ బాయ్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయగా.. యూత్ ఆడియన్స్ను ఓ రేంజ్లో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించారు. దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మిత్రా శర్మ తన మంచి మనసును చాటుకుంది. నల్గొండ నుంచి వచ్చిన ఓ దివ్యాంగుడు ఈవీ ఇప్పించాలని కోరడంతో మిత్రా శర్మ అతని వివరాలు అడిగి తెలుసుకుంది. నీకు 15 రోజుల్లోనే ఈవీ వాహనం అందజేస్తామని అతనికి హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ హీరోయిన్ మిత్రా శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామని అనౌన్స్ చేశారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని.. ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందించారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్గా పని చేశారు. Heroine @Mitraaw_sharma encounters a need boy at #VirginBoysTrailer Launch Event and extends her helping hand for an EV 👏#VIRGINBOYS IN THEATERS FROM JULY 11th ! pic.twitter.com/YYC6euA504— Rajesh Manne (@rajeshmanne1) July 7, 2025 -
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం.. అంతా మోహన్ లాల్ సినిమా వల్లే!
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జానకి వర్సెస్ స్టేర్ ఆఫ్ కేరళ. ఈ మూవీ రిలీజ్కు ముందే చిక్కుల్లో పడింది. దీనికి ప్రధాన కారణం ఆ మూవీ టైటిల్. సినిమా టైటిల్లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. దీంతో ఈ పంచాయతీ కాస్తా కోర్టుకు చేరింది.అయితే ఈ వివాదంపై నిర్మాత సురేశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది విడుదలైన మోహన్ లాల్ చిత్రం ఎంపురాన్-2 పేరును ప్రస్తావించారు. ఆ సినిమా వల్లే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని ఆరోపించారు. ఎంపురాన్ మూవీ విడుదల తర్వాత వివాదం తలెత్తడంతో సెన్సార్ బోర్డ్ మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే సెన్సార్ బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరించిందని.. ఈ సమస్య అంతా ఆ సినిమాతోనే ప్రారంభమైందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉన్నందున మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు నిర్మాత జి సురేశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. పృథ్వీరాద్ సుకుమారన్ డైరెక్షన్లో వచ్చిన ఎంపురాన్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఐదో సీజన్.. మేకర్స్ అఫీషియల్ ప్రకటన
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ల్లో పంచాయత్ ముందు వరుసలో ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సిరీస్కు ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవలే నాలుగో సీజన్ విడుదలై అభిమానులను అలరించింది. దీంతో మేకర్స్ మరో సీజన్కు రెడీ అయిపోయారు. త్వరలోనే మీ ముందుకు వస్తామంటూ పోస్టర్ను విడుదల చేశారు. వచ్చే ఏడాదిలో పంచాయత్ ఐదో సీజన్ రానుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. 2026లో మీ ముందుకొస్తామని మేకర్స్ వెల్లడించారు.జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్కు దీపిక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2020లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2022, 2024లో రెండు, మూడు సీజన్లు వచ్చాయి. ఇటీవలే నాలుగో సీజన్ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.Hi 5 👋 Phulera wapas aane ki taiyyaari shuru kar lijiye 😌#PanchayatOnPrime, New Season, Coming Soon@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77 @Sanvikka #DurgeshKumar… pic.twitter.com/59R6Xvj3R1— prime video IN (@PrimeVideoIN) July 7, 2025 -
బాక్సాఫీస్ బరిలో దీర్ఘాయుష్మాన్ భవ.. రిలీజ్ డేట్ ఫిక్స్
కార్తీక్రాజు, నోయల్ ,మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం "దీర్ఘాయుష్మాన్ భవ". ఈ సినిమాకు ఎం.పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం ట్రైలర్, పాటలను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..'కొత్త నిర్మాతలకు చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అయితే కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమ మీద కనీసం ఒక ఏడాది పాటు అవగాహన పెంచుకుని వస్తే బాగుంటుంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ తరపున మేము ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. పెద్ద, చిన్న సినిమాల సమస్యలు, సాధ్యాసాధ్యాల గురించి ఛాంబర్లో చర్చించబోతున్నాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, మంచి అభిరుచితో, మంచి కాంబినేషన్ ఆర్టిస్టులతో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తోంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా" అని అన్నారు.నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. "చిన్న సినిమాల సమస్యలను తీర్చేందుకు ఇటు పరిశ్రమ, అటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. మల్టీ ఫ్లెక్స్ల్లో పేదవాడు సినిమా చూసే విధంగా ఆక్యుపెన్సీలో 20 శాతం టిక్కెట్ రేట్లను 75 రూపాయలుగా నిర్ణయించాలి. ఫామిలీ అంతా కూర్చుని హాయిగా చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది" అని అన్నారు. చిత్ర దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ.. "ఫ్యామిలీ ప్యాక్ చిత్రమిది. అందరినీ ఆహ్లదపరిచే కామెడీ, ఉంది. సోసియో ఫాంటసీగా దీనిని మలిచాం" అని తెలిపారు. ఈ చిత్రంలో ఆమని, కాశీ విశ్వనాధ్, పృథ్వీరాజ్, సత్యం రాజేష్, గెటప్ శ్రీను , తాగుబోతు రమేష్, జె మిని సురేష్, నోయల్, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వినోద్ సంగీతమందించారు. ఈ చిత్రం ఈనెల 11న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్? ఈసారి ఏకంగా..!
నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad).. ఈయన పండించిన హాస్యానికి, చేసిన సినిమాలకు ఫిదా అవ్వని ఫ్యామిలీ ఆడియన్స్ అంటూ ఎవరూ ఉండరనే చెప్పొచ్చు. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెలో స్థానం సంపాదించుకున్న ఈయన ఈ మధ్య వరుసగా నోరు జారుతూ విమర్శల పాలవుతున్నాడు. రాబిన్హుడ్ ఈవెంట్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో కమెడియన్ అలీపై అతి చనువుతో బూతులు మాట్లాడుతూ సంబోధించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సహనటులకు కనీస గౌరవం ఇవ్వకుండా స్టేజీపైనే చులకన చేసి మాట్లాడటంతో నటుడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్పదేపదే నోరు జారుతూ.. తను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను తనే స్వయంగా మంటగలుపుకుంటున్నారు. తాజాగా తానా 24వ మహాసభలకు వెళ్లిన రాజేంద్రప్రసాద్ అక్కడ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది డెట్రాయిటా? లేక బెజవాడా? తెలియట్లేదు. ఉన్నట్లుండి ఓ వ్యక్తి.. అన్నా.. నీ వల్లే బతికేస్తున్నాం అన్నాడు. నా వల్ల బతకడమేంటి? అని అడిగాను. అందుకా అబ్బాయి.. జీవితంపై విరక్తి కలిగినా, ఇంటికి వెళ్లిపోదాం అనిపించినా ఒక్కసారి మీ సినిమాలు చూడగానే అంతా మర్చిపోతున్నాం అన్నాడు. దరిద్రంగా..ఈ మాట నువ్వే కాదు నాయనా.. దివంగత ప్రధాని పీవీ నరసింహరావు గారు కూడా అన్నారు. ఆయన.. పెద్దపెద్ద సూట్కేసులు, కేసులు అయితే చివరకు నా సినిమా చూసి స్వాంతన పొందేవారు అని చెప్పుకొచ్చాడు. మాజీ ప్రధాని గురించి ప్రస్తావించేటప్పుడు కేసులు అని చెప్పడం ఏమీ బాగోలేదని పలువురు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అలాగే వెండితెరకు పరిచయమవడానికి ముందు సన్నగా, దరిద్రంగా సత్యసాయిబాబా జుట్టుతో ఉండేవాడిని అని కామెంట్ చేశాడు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి.డప్పు కొట్టుకోవడమే పని1977లో తన కెరీర్ మొదలైందన్న రాజేంద్రప్రసాద్ అప్పుడే తానా కూడా ప్రారంభమైందన్నాడు. ప్రతి ఇంట్లో కంచం, మంచంలాగా రాజేంద్రప్రసాద్ సినిమా కూడా ఉంటుందని సినారె తనతో అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అంత పెద్ద వేదికపై రాజేంద్రప్రసాద్.. తన గొప్పలు, చేసిన సినిమాల గురించి చెప్పుకుంటూనే ప్రసంగం ముగించాడు.చదవండి: థియేటర్లో చిన్న చిత్రాలు.. ఓటీటీలో 26 సినిమాలు/ సిరీస్లు -
'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవికి గోల్డెన్ ఛాన్స్
'కోర్ట్' సినిమాతో తెలుగమ్మాయి శ్రీదేవి మంచి విజయాన్ని అందుకుంది. హీరోయిన్గా తనకు ఇదే మొదటి సినిమా.. అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. కాకినాడ యువతి శ్రీదేవికి తాజాగా కోలీవుడ్ సినిమా ఛాన్స్ వచ్చింది. తన రెండో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్మీడియాలో షేర్ చేసింది. తొలి సినిమాతోనే మెప్పించిన మన తెలుగమ్మాయి ఇప్పుడు ఏకంగా కోలీవుడ్లో అవకాశం రావడంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.కోలీవుడ్ ప్రముఖ నిర్మాతగ 'కేజీఆర్' హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటికే ఒక సినిమాలో ఆయన హీరోగా నటిస్తుండగా ఇప్పుడు రెండో సినిమాను ప్రకటించాడు. ఆయనకు జోడీగానే శ్రీదేవి నటిస్తుంది. కేజీఆర్కు నిర్మాతగా తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. గతంలో శివకార్తికేయన్తో హీరో, డాక్టర్, అయలాన్ సినిమాలు చేశారు. విజయ్ సేతుపతి కాపే రణసింగంతో పాటు ప్రభుదేవాతో గులేభకావలి వంటి సినిమాలను ఆయన నిర్మించారు. పలు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూటర్గా విడుదల చేశారు.Kickstarting the pooja for #MiniStudios' production no.15, #KJR's next, with blessings and good vibes 🙏✨@ministudiosllp @KJRuniverse #ArjunAshokan #SrideviApalla #HarishKumar @AjuVarghesee @Abishek_jg @ashwin_kkumar @REGANSTANISLAUS @GhibranVaibodha @pvshankar_pv pic.twitter.com/hP5PDbtBq6— Mini Studios LLP (@ministudiosllp) July 7, 2025 -
ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజ్ ఎక్కడ?
ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మన హీరోలు అపసోపాలు పడుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారు ఏడాదికి ఆరేడు సినిమాలు ఈజీగా చేసేవారు. తర్వాతి తరం హీరోలు కూడా మొదట్లో అదే ఫాలో అయ్యారు. నెమ్మదిగా ఇప్పుడా సంఖ్య ఒకటీరెండుకు వచ్చేసింది. ఈ తరం హీరోలైతే ఏకంగా ఏడాదికో, లేక రెండుమూడేళ్లకో ఒక సినిమా చేస్తున్నారు.ఒక్క హీరోయిన్తో 130 చిత్రాలుఅప్పట్లో మలయాళ స్టార్ హీరో ప్రేమ్ నజీర్ (Prem Nazir) ఏడాదికి ఒకటీరెండు కాదు ఏకంగా 30 సినిమాలు చేసేవారు. ఆ లెక్కన ఆయన ఏడువందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రపంచ రికార్డు సృష్టించారు. తన కెరీర్లో దాదాపు 80 మంది హీరోయిన్లతో కలిసి పని చేశారు. అందులోనూ ఓ హీరోయిన్(షీల)తో ఏకంగా 130 సినిమాలు చేయడం విశేషం! ఈయన తెలుగులో ఆకలి, తండ్రి చిత్రాల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలిగిన నజీర్ 1989లో కన్నుమూశారు. సినిమా ఛాన్స్ కోసం కన్నీళ్లుఅయితే నజీర్ చివరి రోజుల్లో అవకాశాలు లేక కన్నీళ్లు పెట్టుకున్నారని నటుడు టిని టామ్ వ్యాఖ్యానించాడు. ఛాన్సులిప్పించమని అడూర్ భసి, బహదూర్ వంటి నటుల ఇళ్లకు వెళ్లి కన్నీళ్లతో వేడుకునేవారని ఆయన పేర్కొన్నాడు. ఈ కామెంట్స్పై సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి మండిపడింది. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. 1985 వరకు మేమందరం నజీర్తో కలిసి పని చేసినవాళ్లమే! ఆయన జీవితాన్ని దగ్గరి నుంచి చూసిన మా అందరికీ టినీ కామెంట్స్ బాధ కలిగించాయి. చివరి రోజుల్లో..ప్రేమ్ నజీర్ చనిపోవడానికి ముందు కూడా ఆయన్ను కలిశాను. తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రశాంత జీవనం గడిపాడు. తనకు సినిమా అవకాశాలు వచ్చినా సరే.. వేరొకరికి ఇవ్వమని సూచించేవాడు. అలాంటిది చివరి రోజుల్లో అవకాశాల్లేక ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడని చెప్పడం కరెక్ట్ కాదు. నజీర్ బతికున్నప్పుడు టిని ఇంకా సినిమాల్లోకే రాలేదు. వాళ్లూవీళ్లు అనుకునే మాటలను నిజమని నమ్మి ఇలా అసత్య ప్రచారం చేయడం సరికాదు. ఎవరినీ అడుక్కోలేదుయూట్యూబ్లో వ్యూస్ కోసం దివంగత నటుల గురించి లేనిపోని కథలు అల్లేస్తున్నారు. కనీసం ఇండస్ట్రీలో ఉన్నవారైనా వారి గురించి నిజాలు మాట్లాడితే బాగుంటుంది. ప్రేమ్ నజీర్ సినిమా ఛాన్సుల కోసం ఎప్పుడూ ఏడవలేదు. ఎవరినీ అడుక్కోలేదు. అలాంటి గొప్ప మనిషి గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి అని ఘాటుగానే స్పందించింది.క్షమించండిదీంతో నజీర్ గురించి అలా మాట్లాడినందుకు టిని టామ్ ఫేస్బుక్ వేదికగా క్షమాపణలు తెలిపాడు. నజీర్ సర్ను అభిమానించేవారిలో నేనొకరిని. ఆయన స్థానమెక్కడ? నేనెక్కడ? తనను ఒక్కసారి కూడా కలవనేలేదు. ఆయన గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తిని కాదు. తన ఇమేజ్ను చెడగొట్టాలన్న దురుద్దేశం నాకు లేదు. ఇండస్ట్రీలో ఓ వ్యక్తి చెప్పినదాన్ని మీతో పంచుకున్నానంతే.. అయినప్పటికీ నావల్ల పొరపాటు జరిగింది కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను అన్నాడు.చదవండి: 11 ఏళ్ల వయసులో స్కూల్ నుంచి పారిపోయిన కాజోల్ -
మహేశ్బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు
సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా, ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆయన్ని.. 3వ ప్రతివాదిగా పేర్కొంటూ నమోదైన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు ప్రతివాదులకు నోటీసులిచ్చిన కమిషన్.. ప్రతివాదుల హాజరు కోసం విచారణను సోమవారాని కి వాయిదా వేసింది. సాయి సూర్య డెవలపర్స్ బాలాపూర్ గ్రామంలో లేఅవుట్ వేశామని చెప్పడంతో ఆకర్షితులైన ఓ మహిళా డాక్టర్, మరో వ్యక్తి చెరో ప్లాటు కొనడానికి రూ. 34.80 లక్షలు చెల్లించారు. అయితే ప్రతిపాదిత ప్రాంతంలో లేఅవుట్ లేదని తెలుసుకొని డబ్బు తిరిగివ్వాలని అడగ్గా సంస్థ యజమాని కంచర్ల సతీశ్చంద్ర గుప్తా రూ. 15 లక్షలే చెల్లించారు. బాధితులు వేసిన కేసులో సంస్థతోపాటు దాని యజమాని, ప్రచారకర్తగా ఉన్న మహేశ్బాబును ప్రతివాదులుగా పేర్కొన్నారు.ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం మహేష్బాబుకి గతంలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. -
ది 100 సినిమాను ఫస్ట్ డే చూస్తాను: తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
‘‘మంచి సందేశంతో ‘ది 100’ సినిమా నిర్మించారు. పోలీసాఫీసర్గా సాగర్ కరెక్ట్గా ఫిట్ అయ్యాడు. ఈ సినిమాను ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాను. ఒక రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్ కూడా ఐదుకోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి సైబర్ క్రైమ్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆర్కే సాగర్ మంచి హీరో అవుతాడనిపిస్తోంది.ఈ సంవత్సరం ‘గద్దర్ అవార్డ్స్’లో బెస్ట్ ఫిల్మ్గా ‘ది 100’ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని నేను రికమండ్ చేయడం లేదు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. ఇక పైరసీ వల్ల వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టడానికి ఆల్రెడీ మా ప్రభుత్వం పోలీస్ అధికారులతో మాట్లాడి యాక్షన్ తీసుకోవడం జరిగింది’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేమ్ హీరో ఆర్కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది 100’. ఈ చిత్రంలో హీరోయిన్లు మిషా నారంగ్, ధన్య బాలకష్ణ నటించారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో రమేశ్ కరుటూరి, వెంకీ పూశడపు, జె. తారక్ రామ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై, బిగ్ టికెట్ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ– ‘‘ది 100’ సినిమా చూశాను. ఒక పవర్ఫుల్ యాక్టింగ్తో మంచి సోషల్ మెసేజ్ చెప్పడానికి దర్శకుడు శశి మంచి ప్రయత్నం చేశారు. సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. మా ప్రాంతవాసి. టాలీవుడ్, బాలీవుడ్లోనే కాదు... హాలీవుడ్లోనూ రాణించగల ప్రతిభ సాగర్లో ఉంది. ఐపీసీలోని మంచి సెక్షన్ లోని సారాంశంతో ‘పవర్ఫుల్ వెపన్ టు డిఫెండ్ యువర్సెల్ఫ్’ అనే పాయింట్తో తీసిన సినిమా ఇది. ఈ రోజు ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిగారు రావాల్సింది. కానీ ఆయనకు మరో కార్యక్రమం ఉండటం వల్ల, మాకు తెలియజేయడం జరిగింది’’ అన్నారు శ్రీధర్బాబు. ఆర్కే సాగర్ మాట్లాడుతూ– ‘‘ఐటీ మినిస్టర్ శ్రీధర్ అన్నగారు నా సినిమా చూసి, నన్ను ఆశీర్వదించారు. అలాగే నా కోసం ఈ వేడుకకు వచ్చిన వెంకట్రెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఎస్. గోపాల్రెడ్డి, కోదండ రామిరెడ్డి, డైరెక్టర్ బి.గోపాల్ గార్లు... వాళ్ల ఫ్యామిలీలో నన్ను చేర్చుకున్నందుకు థ్యాంక్స్. ‘ది 100’ అనేది ఒక వెపన్ . కొందరు సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమాను చూపించినప్పుడు, వాళ్లు కన్నీళ్ళు పెట్టుకున్నారు’’ అని అన్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ– ‘‘ఓ రియల్ పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన ఒక సంఘటన విని, ఇలాంటివి కూడా జరుగుతున్నాయా? అనిపించి, ఈ పాయింట్ను చె΄్పాలనుకున్నాను.ఈ చిత్రంలో మహిళల గురించీ చెప్పడం జరిగింది. ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన చిత్రం’’ అని చె΄్పారు. ‘‘ది 100’లో ఎంటర్టైన్ మెంట్తో పాటు మంచి సందేశం ఉంది’’ అన్నారు నిర్మాత రమేశ్. ‘‘ఈ వేడుకకు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్ బాబుగార్లకు, మిగతా పెద్దలందరికీ థ్యాంక్స్’’ అని నిర్మాత వెంకీ చె΄్పారు. ఈ వేడుకలో ఎ. కోదండ రామిరెడ్డి, బి. గోపాల్, ఎస్. గోపాల్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా ‘ది 100’ చిత్రబృందంలోని పలువురు పాల్గొన్నారు. -
డేట్ ఫిక్స్?
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సింది... కానీ కుదర్లేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది.ఆ సంగతి అలా ఉంచితే, తాజాగా ఈ సినిమాను సెప్టెంబరు 18న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ‘విశ్వంభర’కి సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ను చిత్రీకరించాల్సి ఉంది. ఈ పాటలో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ‘అన్నయ్య’ సినిమాలోని పాపులర్ పాట ‘ఆట కావాలా పాట కావాలా...’కి రీమిక్స్గా ఈ పాట ఉంటుందని సమాచారం.ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రిష హీరోయిన్గా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
హీరో కుమార్తెకు పేరు పెట్టిన అమిర్ ఖాన్..!
కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్.. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఈ ఏడాది ఏప్రిల్లో పాప జన్మించింది. 2021లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. నాలుగేళ్ల తర్వాత వీరి బిడ్డ పుట్టింది. అయితే తాజాగా వీళ్ల ఇంటికి బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ విచ్చేశారు. అంతేకాకుండా ఈ జంట జన్మించిన చిన్నారికి పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు హీరో విష్ణు విశాల్.ఈ సందర్భంగా తమ కుమార్తెకు పేరు పెట్టినందుకు అమిర్ ఖాన్కు ధన్యవాదాలు తెలిపారు. మా మైరాని పరిచయం చేస్తున్నాను... మా బిడ్డకు పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చినందుకు అమిర్ ఖాన్ సార్కు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్, లాల్ సలామ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరోవైపు అమిర్ ఖాన్ సితారే జమీన్ పర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే గతంలో.. తన తల్లికి చికిత్స చేయించే క్రమంలో ఆమిర్.. విష్ణు విశాల్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నట్టు కోలీవుడ్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vishnu Vishal (@thevishnuvishal) -
ఏడుస్తూ వెళ్లిపోయిన హరిహర వీరమల్లు నటి.. వీడియో వైరల్!
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ పేరు వినగానే స్పెషల్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. బాలీవుడ్ పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రంలోనూ కనిపించనుంది. ఇటీవలే విడుదలైన హౌస్ఫుల్-5 మూవీతోనూ ప్రేక్షకులను అలరించింది. చివరిసారిగా నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ది రాయల్స్లో నటించిన ముద్దుగుమ్మ ముంబయిలో ఎయిర్పోర్ట్లో కనిపించింది. అయితే ఆమె ఏడుస్తూ విమానాశ్రయంలో వెళ్తున్న వీడియో వైరల్గా మారింది.అదే సమయంలో ఓ వ్యక్తి ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. ఏడుస్తూ వెళ్తున్న నటితో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె బాడీగార్డ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. సెల్ఫీ కోసం యత్నించిన యువకుడిని గట్టిగా పట్టుకుని పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అంతకుముందే నోరా ఫతేహీ తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్లో పోస్ట్ చేసింది. అయితే నోరా ఎందుకు అలా వెళ్లారో వివరాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఏడాది బీ హ్యాపీ, హౌస్ఫుల్-5 చిత్రాలతో మెప్పించిన నోరా.. చివరిసారిగా ది రాయల్స్ వెబ్ సిరీస్లో కనిపించింది. బాలీవుడ్లో ఎక్కువగా ఐటమ్ సాంగ్స్తోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా స్ట్రీట్ డాన్సర్ 3డీ, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, క్రాక్, మడ్గావ్ ఎక్స్ప్రెస్ లాంటి చిత్రాలలో కూడా నటించింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ట్రెండీ లుక్లో అనసూయ.. బ్లాక్ డ్రెస్లో సీతారామం బ్యూటీ!
ట్రెండీ లుక్లో టాలీవుడ్ భామ అనసూయ..బ్లాక్ డ్రెస్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..స్విమ్మింగ్పూల్ చిల్ అవుతోన్న యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ..తొలి ఏకాదశి పూజలు చేసిన యాంకర్ లాస్య..లైట్ పింక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ విష్ణుప్రియ.. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Kanduri SriRangaSudha (@im_ksudha) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
క్లబ్లో పెంపుడు శునకం బర్త్డే సెలబ్రేట్ చేసిన హీరోయిన్
సింగర్, హీరోయిన్ ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah) తన పెంపుడు శునకం బర్త్డేను సెలబ్రేట్ చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న జాన్ స్నో నేడు (జూలై 6న) ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. దీంతో స్నో పుట్టినరోజును పెట్ క్లబ్లో జరిపింది. కుక్కను ముద్దుగా ముస్తాబు చేసి దానికి బదులుగా తనే కేక్ కట్ చేసింది. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ బర్త్డే వేడుకలకు వచ్చిన అతిథులు కూడా శునకాలే కావడం విశేషం.సినిమాతడాఖా, చంద్రకళ (అరణ్మనై), అంతఃపురం (అరణ్మనై 3), డిటెక్టివ్, మాస్టర్, సైంధవ్, వడ చెన్నై, తుపాకి, యుగానికి ఒక్కడు వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పిశాచి 2, నో ఎంట్రీ, మాస్క్, మానుషి సినిమాలు చేస్తోంది. తాప్సీ, అమీ జాక్సన్, రెజీనా కసాండ్రా వంటి పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది. గిలిగిలిగా (దేశముదురు), జరజర.. (రాఖీ), దీవాళీ దీపానీ (దడ), ఓయ్ ఓయ్ ఓయ్ (ఎవడు) వంటి పలు సాంగ్స్ ఆలపించింది. View this post on Instagram A post shared by The name’s Snow. Jon Snow 🐶 (@jonsnow.bichon) చదవండి: బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. 40 ఏళ్ల హీరోతో.. -
'సంక్రాంతికి వస్తున్నాం-2 వస్తే ఆరుగురు ఉంటారు'
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగన ముద్ర వేసిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. ఈ చిత్రంలో వెంకటేశ్ సతీమణిగా నటించి అభిమానులను అలరించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైంది.ఈ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీలో తన రోల్ గురించి మాట్లాడింది. పిల్లలకు తల్లి పాత్రలో చేయడం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. మంచి నటిగా రాణించాలంటే ఎలాంటి పాత్రనైనా చేయాల్సిందేనని.. ఇలాంటి పాత్రలు చేయడానికి వయస్సు అడ్డంకి కాదని వెల్లడించింది. నేను చాలా సినిమాల్లో తల్లిగానే నటించానని పేర్కొంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నలుగురు పిల్లలకు అమ్మగా నటించానని ఐశ్వర్య రాజేశ్ తెలిపింది. ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం-2 మూవీ చేస్తే కనుక నాకు ఆరుగురు పిల్లలు ఉంటారని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారని తానా సభలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. 40 ఏళ్ల హీరోతో..
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ మూవీ దురంధర్ (Dhurandhar Movie). సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. నేడు (జూలై 6) రణ్వీర్ బర్త్డే సందర్భంగా దురంధర్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో మాస్ అవతార్లో కనిపించాడు. అలాగే ఓ హీరోయిన్ను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు.చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా..ఆ హీరోయిన్ మరెవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్. ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ కూతురే సారా. సౌత్లో బాలనటిగా ఎన్నో సినిమాలు చేసిన ఆమె.. దురంధర్తో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఈమె తెలుగులో దాగుడుమూత దండాకోర్ చిత్రంలో రాజేంద్రప్రసాద్ మనవరాలిగా నటించింది. నాన్న మూవీలో విక్రమ్ కూతురిగా మెప్పించింది. తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ మూవీలో ఐశ్వర్యరాయ్ చిన్ననాటి పాత్రలో మెరిసింది. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్చైల్డ్ ఆర్టిస్ట్గా బోలెడంత పాపులారిటీ సంపాదించిన సారా.. అప్పుడే హీరోయిన్గా మారడంతో సినీప్రియులు ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ 40 ఏళ్ల రణ్వీర్తో 20 ఏళ్ల సారా కలిసి నటించడంపై అప్పుడే చర్చ మొదలైంది. వీళ్లిద్దరూ జంటగా నటించారా? లేదంటే ఏదైనా మిషన్ కోసం ఇలా కలిశారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అదే రోజు ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రిలీజ్ అవుతుండటం గమనార్హం. చదవండి: కోలీవుడ్ స్టార్ విజయ్ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి -
ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్.. ఫ్యాన్స్కు పూనకాలే!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్కో సారి ఒక్కో సీజన్ నడుస్తుంటుంది. ఈ కోవలోనే ప్రస్తుతం డ్యూయల్ రోల్స్ సీజన్ కనిపిస్తోంది. తమ అభిమాన హీరో ఒక్క పాత్రలో కనిపిస్తేనే అభిమానుల ఆనందాలకు అవధులుండవు. అలాంటిది రెండు పాత్రల్లో కనిపిస్తే? ఇక చెప్పేదేముంది... పండగ చేసుకుంటారు. పైగా ద్విపాత్రాభినయం చేస్తే వేరియేషన్ చూపించే అవకాశం కూడా ఉంటుంది హీరోలకి. ఇక డ్యూయల్ రోల్స్తో ప్రేక్షకులకు, అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్న హీరోలపై ఓ లుక్కేద్దాం.మరోసారి...‘రిక్షావోడు, స్నేహం కోసం, అందరివాడు’... ఇలా తన కెరీర్లో పలు సినిమాల్లో ద్విపాత్రాభియం చేసి, ప్రేక్షకులను అలరించారు చిరంజీవి(Chiranjeevi ). చాలా రోజుల తర్వాత ఆయన మరోసారి ప్రేక్షకులకు, అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుపుకుంటోంది. చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి.చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారని ఫిల్మ్నగర్ టాక్. వినోదం నేపథ్యంలో రూపొందుతోన్న ‘మెగా 157’లో మనసుని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. చిరంజీవి పాత్ర ‘రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, యముడికి మొగుడు, చంటబ్బాయి’ చిత్రాల తరహాలో ఉంటుందని తెలిసింది. ద్విపాత్రాభినయంలో కనిపించనున్న చిరంజీవి తండ్రీ కొడుకులుగా కనిపిస్తారా? లేకుంటే సోదరులుగానా? అనే వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రకటించనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.రెండు చిత్రాల్లో...‘బాహుబలి 1, 2’ చిత్రాల తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు హీరో ప్రభాస్(Prabhas). ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి, బిల్లా’ వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేసిన ఆయన ‘ది రాజా సాబ్’తో మరోసారి తన అభిమానులకు, ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో తాత–మనవడు పాత్రల్లో ప్రభాస్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. ‘ది రాజా సాబ్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా డిసెంబరు 5వ తేదీకి వాయిదా పడింది.సలార్ 2 లోనూ...ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్: పార్ట్ 1 సీజ్ఫైర్’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. 2023 డిసెంబరు 22న విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా హిట్గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్గా ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ ఉంటుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారట ప్రభాస్. ‘సలార్’లో ప్రభాస్ తండ్రి కనిపించకపోయినా ‘సలార్ 2’లో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో ఆయన వస్తారని సమాచారం.రెండు సినిమాల్లోనూ తండ్రి... కొడుకు?‘‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర: పార్ట్ 1’ చిత్రంలో ఎన్టీఆర్(Jr NTR) చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగుకి హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ 27న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.ఈ సినిమా ఇటీవల జపాన్లో కూడా విడుదలవడం, అక్కడి ప్రమోషన్లలో ఎన్టీఆర్ పాల్గొనడం తెలిసిందే. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సీక్వెల్గా ‘దేవర: పార్ట్ 2’ రూపొందనుంది. కొరటాల శివ ‘దేవర 2’ స్క్రిప్ట్ వర్క్ పనుల్లోనే ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ‘దేవర’ చిత్రంలో కేవలం కొడుకు పాత్రనే చూపించారు దర్శకుడు. రెండో భాగంలో తండ్రి పాత్ర సందడి చేయనుంది. తండ్రి పాత్ర ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో వస్తుందని టాక్. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ (హృతిక్ రోషన్ హీరో) ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలోనూ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి... ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్.మూడోసారి?హీరో రామ్చరణ్ ‘నాయక్’, ‘గేమ్ చేంజర్’ సినిమాల్లో ద్వి΄ాత్రాభినయం చేశారు. తాజాగా రామ్చరణ్ నటిస్తున్న ΄ాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంలో రామ్చరణ్ ద్వి΄ాత్రాభియం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలోని ఓ ప్రత్యేక ΄ాటలో కాజల్ అగర్వాల్ సందడి చేయనున్నారని భోగట్టా. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన లేదు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే... రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.తొలిసారి...‘పుష్ప 1, 2’’ వంటి భారీ పాన్ ఇండియా హిట్స్ తర్వాత హీరో అల్లు అర్జున్... తమిళ దర్శకుడు అట్లీ సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘ఏఏ22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం తెరకెక్కనుంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మించనున్న పాన్ ఇండియా చిత్రమిది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా ఖరారు కావడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో అల్లు అర్జున్ తొలిసారి ‘ఏఏ 22 ఏ6’లో ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఒక పాత్ర హీరో కాగా మరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్నగర్ వర్గాలు చెబుతున్నాయి. తొలిసారి ఆయన ద్విపాత్రాభినయం చేయనుండటంతో అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పీరియాడికల్ డ్రామాగా భారీ బడ్జెట్తో రూ΄÷ందనున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్కి చాలా ప్రాధాన్యత ఉందట. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల తరహాలో ఈ మూవీ ఉంటుందని, అందుకే ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకర్స్ను రంగంలోకి దింపుతున్నారనీ టాక్. ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. 2026 ఆగస్టులో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తోందట యూనిట్. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే వార్తలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరి అల్లు అర్జున్ది ద్వి΄ాత్రాభినయమా? త్రి΄ాత్రాభినయమా? అనే విషయంపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలి.తొలిసారి...హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్లది హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘ట్యాక్సీవాలా’ 2018 నవంబరు 17న విడుదలై, హిట్గా నిలిచింది. వీరి కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. బ్రిటిష్ పాలన నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నారట విజయ్. తండ్రీ కొడుకులుగా వెండితెరపై సందడి చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.సర్దార్ 2లో...కార్తీ హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 2022 అక్టోబరు 21న విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘సర్దార్ 2’. ఇక గత ఏడాది కార్తీ పుట్టినరోజు (మే 25) సందర్భంగా ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్లో ముగిసింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలోనూ ద్వి΄ాత్రాభినయంలో కనిపించనున్నారు కార్తీ. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రొలాగ్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాని 2026 పొంగల్కి విడుదల చేయనున్నారట మేకర్స్. వీరే కాదు.. మరికొందరు హీరోలు కూడా డ్యూయల్ రోల్స్లో కనిపించే అవకాశం ఉంది. -
నాలాగే సుకుమార్ కూడా దాన్నే నమ్ముకున్నారు.. అందుకే స్టార్ అయ్యాడు: రాఘవేంద్రరావు
అమెరికాలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. యూఎస్లో జరుగుతున్న నాట్స్ 2025 కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ఈవెంట్కు టాలీవుడ్ డైరెక్టర్స్ సుకుమార్, రాఘవేంద్రరావు, అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్పై ఆయన ప్రశంసలు కురిపించారు.దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. 'ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా 50 ఏళ్ల దర్శక ప్రస్థానం. నేను పరిచయం చేసిన బన్నీ, శ్రీలీల ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది. సుకుమార్కు నాకు కామన్గా ఒక పోలిక ఉంది. అదేంటంటే గడ్డం. అడవిరాముడు, అన్నమయ్య. నేను అడవి రాముడులో అడవిని నమ్ముకున్నా. నువ్వు పుష్ప సినిమాలో అడవిని నమ్ముకున్నావ్. స్టార్ డైరెక్టర్ అయ్యావ్. బన్నీని స్టార్హీరోను చేశావ్. శ్రీలీల సైతం దెబ్బలు పడతాయి అంటూ అందరిని అలరిస్తోందని' ఆయన అన్నారు. -
ఆర్జే మహ్వశ్తో డేటింగ్.. చాహల్ బయటికి చెప్పేశాడుగా!
టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆ మ్యాచ్లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కలిసి స్టేడియంలో కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్లో వైరలయ్యాయి. అంతేకాకుండా ఆర్జే మహ్వశ్ ఐపీఎల్లోనూ పంజాబ్ కింగ్స్ మద్దతుగా నిలిచింది. పంజాబ్ ఆడిన అన్ని మ్యాచ్లకు హాజరై సందడి చేసింది. దీంతో చాహల్తో డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ పలు కథనాలొచ్చాయి. అయితే తనపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు ముద్దుగుమ్మ.అయితే తాజాగా చాహల్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్లో అతని ప్రేమ, డేటింగ్ గురించి ప్రస్తావన వచ్చింది. తన రిలేషన్ షిప్ గురించి "కౌన్ హై వో లడ్కీ? అంటూ చాహల్ను ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ 'నాలుగు నెలల కిందటే.. ఇండియా మొత్తం తెలుసు' అంటూ మాట్లాడారు. ఇది చూసిన నెటిజన్స్ పరోక్షంగా ఆర్జే మహ్వశ్ అని క్లారిటీ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పేరు ప్రస్తావించకపోయినా నెట్టింట మాత్రం తెగ వైరల్గా మారింది. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం చాహల్ను ఆట పట్టించారు.కాగా.. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన మొదటి భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. ఈ సంవత్సరం మార్చిలో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే ఆర్జే మహ్వశ్తో కలిసి చాహల్ మొదటిసారి ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ల కనిపించారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా కపిల్ షోలో చాహల్ కామెంట్స్ చూస్తుంటే మహ్వస్తో డేటింగ్ కన్ఫామ్ చేసినట్లేనని నెటిజన్స్ భావిస్తున్నారు. -
కలిసిపోయిన తెలుగు హీరోల ఫ్యాన్స్.. ఆ కన్నడ హీరోపై ట్రోలింగ్
టాలీవుడ్ (Tollywood)లో ఫ్యాన్ వార్స్ ఎప్పుడూ ఉండేవే! మా హీరో తోపు, తురుము అని కొందరు.. మా హీరో గ్రేటెహె.. ఆయన కొట్టిన రికార్డులు మీ హీరోకెక్కడివి? అని మరికొందరు ఆయా కథానాయకులను వెక్కిరించడం, హేళన చేయడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తీసుకుని ఎన్నో ఏళ్ల నుంచి వైరం ఉన్నట్లు దూషించుకుంటూనే ఉంటారు. అయితే ఆశ్చర్యంగా తెలుగు హీరోల అభిమానులంతా ఒక్కటయ్యారు.ఒక్క ఘటనతో దర్శన్పై నెగెటివిటీఎప్పుడూ గొడవపడే వీళ్లు ఈసారి వార్ ఆపేసి కలిసిపోయారు. అంతా కలిసి వేరే ఇండస్ట్రీకి చెందిన హీరో అభిమానులతో గొడవకు దిగారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? శాండల్వుడ్ స్టార్ దర్శన్ (Darshan). ప్రియురాలిపై నీచమైన కామెంట్లు చేశాడని అభిమానినే హత్య చేసి జైలుకు వెళ్లొచ్చాడు కన్నడ హీరో దర్శన్. ఈ హత్య కేసు వల్ల దర్శన్పై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. కానీ, అతడి అభిమానులు మాత్రం అప్పటికీ, ఇప్పటికీ దర్శన్ను వెనకేసుకొస్తూనే ఉన్నారు.ఈ ఎలివేషన్స్ అవసరమా?తనేం చేసినా ఒప్పని చెప్తున్నారు. దర్శన్ మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతుండటంతో కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది చూసిన తెలుగువారు.. మర్డర్ చేసిన వ్యక్తికి ఎందుకీ ఎలివేషన్స్? ఇంకా ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నారు? అంటూ విమర్శించారు. అది దర్శన్ అభిమానులకు అస్సలు నచ్చలేదు. అంతే, తెలుగు హీరోలను టార్గెట్ చేస్తూ ఇక్కడి అభిమానులపై బూతులతో చెలరేగిపోయారు.ఏకమైన టాలీవుడ్మనవాళ్లు ఊరుకుంటారా? నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం.. అన్నట్లుగా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కాసేపు టాలీవుడ్ ఫ్యాన్ వార్స్ పక్కనపెట్టి అంతా ఏకమై దర్శన్ను, అతడి అభిమానులను ఏకిపారేస్తున్నారు. #KFIcriminalDarshan అంటూ రకరకాల హ్యాష్ట్యాగ్లతో నేషనల్ లెవల్లో ఈ గొడవను హైలైట్ చేస్తున్నారు. Picha kottudu kodutunnaru ga 👌🔥#KFIcriminalDarshan pic.twitter.com/6ZTtw4XXHf— Saha Devudu 🪐 (@SahaDevudu_) July 6, 2025Just repost #KFIcriminalDarshan 7k tweets speed penchandi pic.twitter.com/lxcg6Eyhy2— KALION⚰️🧡❤️🔥🛐 (@Rushinaidu11) July 6, 2025Can I get 500 Retweets and 200 comments with #KFIcriminalDarshan tag 😎 TFI yuvatha possible aah ???? #KFIcriminalDarshanpic.twitter.com/dCQ1mIbivE— Rebal Relangi (@RebalRelang) July 6, 2025 చదవండి: కోలీవుడ్ స్టార్ విజయ్ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి -
ఈ సారికి వదిలేయండి.. మళ్లీ తప్పు జరగకుండా చూసుకుంటా: కలర్ ఫోటో డైరెక్టర్
షార్ట్ ఫిల్మ్లతో కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్.. కలర్ ఫోటో చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నటుడిగా కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన డాకు మహారాజ్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. తాజాగా సందీప్ ఓ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ సిరీస్ ఓ సన్నివేశంపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. దీంతో ట్విటర్ వేదికగా సందీప్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు.సందీప్ తన ట్వీట్లో రాస్తూ..' డియర్ బ్రదర్స్.. 2025 ఏడాదిని గొప్పగా ప్రారంభించా. డాకు మహారాజ్ వంటి భారీ బ్లాక్బస్టర్ చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో నాకు లభించిన ప్రేమ, మరింత కష్టపడేందుకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.కానీ ఇప్పుడు అదే ఖాతాల నుంచి, అదే వ్యక్తుల నుండి ద్వేషాన్ని చూపటం నా హృదయాన్ని కలిచివేసింది. జనవరిలో అభినందనలకు అర్హుడినో కాదో తెలియదు.. జూలైలో వస్తోన్న ఈ ద్వేషానికి అర్హుడనా? అంటే స్పష్టంగా అవుననే అనిపిస్తోంది. నేను ఈ విషయాలను కప్పిపుచ్చడానికి, మేము చేసిన దానికి సమర్థించడానికి ఇక్కడ లేను. ఎల్లప్పుడూ ప్రేక్షకులే కరెక్ట్ అనే ఒకే ఒక నినాదాన్ని మాత్రమే ఒక చిత్రనిర్మాతగా నమ్ముతా. ఆ నిర్దిష్ట కంటెంట్ మిమ్మల్ని బాధపెడితే. అందులో భాగమైనందుకు చాలా చింతిస్తున్నా. నాకు ఎవరిపై ద్వేషం లేదు. ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు. అంతే కాదు మిమల్ని ఇబ్బందిపెట్టిన ఆ సీన్ను తొలగించాం.' అని పోస్ట్ చేశారు.ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభ రోజుల్లో తప్పులు చేస్తారని సందీప్ రాసుకొచ్చారు. ఇప్పుడు మేము కూడా అదే చేశామని.. అయితే వెంటనే దానిని సరిదిద్దుకున్నామని ట్వీట్లో ప్రస్తావించారు. ఇలాంటివీ మళ్లీ చేసే ఉద్దేశం అయితే తమకు అస్సలు లేదన్నారు. ఈ వెబ్ సిరీస్ను యువ ప్రతిభావంతులు వారి కెరీర్ ఆధారంగానే రూపొందించామని సందీప్ వివరణ ఇచ్చారు. ఇందులోని నాటకీయత, భావోద్వేగాలు కొత్తదనం కోసం మేము ఈ సిరీస్ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి నుంచి కంటెంట్ విషయంలో మరింత బాధ్యతాయుతంగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నా..ఈ వారాంతంలో మీ మనస్సులను బాధపెట్టినందుకు క్షమించండి... నాపై, నా బృందంపై మీ కోపాన్ని చల్లార్చడానికి మరో అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకొస్తాను అంటూ సందీప్ పోస్ట్ చేశారు. 'ఈ సారికి వదిలేయ్ అన్నా… నిన్ను నొప్పించాలి అని చేయలేదు' అని మా టీమ్ తరఫున మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు.Dear brothers,2025 started on a greatest note for me by being part of such massive blockbuster film like Daaku Maharaj.The love i got in the name of tweets, gave me immense confidence to do more and more beautiful work.But now seeing the hatred from same accounts and same…— Sandeep Raj (@SandeepRaaaj) July 5, 2025 -
ఓటీటీలోకి హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. ‘క్లీనర్’ కథేంటి?
ఊహించని, ఊహకందని విషయాలను మనం చూడగలిగేది వెండితెర మీదే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సన్నివేశాలతో ప్రేక్షకులను రక్తి కట్టించే దర్శకుల ఊహ మాత్రం ఎవరి ఊహకూ అందనిది. అటువంటి ఊహతోనే అల్లుకున్న కథ ఈ క్లీనర్ సినిమా. ఈ కథ లైన్ ఎంత చిన్నది గా ఉంటుందో కథ నడిచే తీరు మాత్రం అందనంత ఎత్తులో ఉంటుంది. గంటన్నర నిడివితో ఉన్న సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. జోయే తన తమ్ముడు మైఖేల్ తో లండన్ లో ఓ అపార్ట్ మెంట్లో ఉంటుంది. మైఖేల్ ఆటిజమ్ వ్యాధి బారిన పడ్డ స్పెషల్ ఛైల్డ్, కాని మంచి టాలెంటెడ్ కిడ్. జోయే ఆర్మీలో పని చేసిన అమ్మాయి ఇప్పుడు మాత్రం పోషణ కోసం ఆగ్నియన్ యనర్జీ సంస్థ కి సంబంధించన బిల్డింగ్ లో క్లీనర్ గా చేస్తుంటుంది. ఓ రోజు ఆ బిల్డింగ్ లో పెద్ద పార్టీ జరుగుతుంది. దాని కోసంగా వంద అంతస్తుల బిల్డింగ్ లోని పై ఫ్లోర్ అద్దాలు క్లీన్ చేయాలని జోయేకు టాస్క్ ఇస్తాడు మేనేజర్. తను ఆ పని చేస్తున్నపుడు తన తమ్ముడిని ఓ సూపర్ వైజర్ దగ్గర వదిలి పెట్టి జోయో గాల్లో వేలాడుతూ అద్దాలను క్లీన్ చేస్తుంటుంది. ఇంతలో బిల్డింగ్ లోకి కొందరు దుండగులు పెద్ద బాంబులు, తుపాకీలతో చొరబడి పార్టీలో ఉన్న విఐపీలనందరినీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. జోయే అద్దాలను క్లీన్ చేస్తూనే ఇదంతా గమనిస్తూ తన తమ్ముడి గురించి బెంగపడుతుంది. జోయే గాల్లోనుండి బిల్డింగులోకి రావాలన్నా సూపర్ వైజర్ తన రోప్ ని ఆపరేట్ చేయాలి. కాని దుండగులు ఆ సూపర్ వైజర్ ని చంపేసుంటారు. మరి జోయే అక్కడి నుండి బయటపడి తనను తనతో పాటు తన తమ్ముడిని రక్షించుకోగలదా అన్నదే సినిమా. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ముఖ్యంగా ఈ సినిమాలో జోయే చేసే స్టంట్స్ ఒళ్ళు గగుర్పొడిస్తాయి. అంతేకాదు కథలో చాలా ట్విస్టులతో నడుస్తూ ప్రేక్షకుడి మతి పోగొడుతుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ఈ వీకెండ్ కి మంచి టైంపాస్ మూవీ. ఎంజాయ్ ది క్లీనింగ్ డన్ బై జోయే. -
నా ప్రెగ్నెన్సీ పుకార్లకు కారణం ఆయనే : హీరోయిన్
సెలెబ్రెటీల ప్రేమ, పెళ్లి విషయంలో నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. పెళ్లయ్యే వరకు డేటింగ్, ప్రేమ పుకార్లు చక్కర్లు కొడితే.. పెళ్లి తర్వాత కొన్నాళ్లకే ప్రెగ్నెన్సీ రూమర్స్ వినిస్తాయి. తండ్రి కాబోతున్న హీరో, తల్లి కాబోతున్న హీరోయిన్ అంటూ వార్తలు వస్తాయి. తాజాగా అలాంటి ప్రెగ్నెన్సీ పుకారే బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha ) విషయంలో వచ్చింది. అయితే ఆ పుకార్లకు కారణం తన భర్తే అంటుంది ఈ బ్యూటీ. దానికి సంబంధించిన ఆధారాలను బయటపెడుతూ.. ప్రెగ్నెన్సీ రూమర్స్కి చెక్ పెట్టింది.సోనాక్షి ఇటీవల కాస్త బరువు పెరిగింది. దీంతో ఆమె గర్బం దాల్చిందని, అందుకే బొద్దుగా మారిందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. చాలా మంది నిజమే అని నమ్మారు. తాజాగా దీనిపై సోనాక్షి స్పందించారు. తాను ప్రెగ్నెంట్ కాదని చెబుతూనే.. బరువు పెరగడానికి భర్తే కారణం అని చెప్పుకొచ్చింది సోనాక్షి.భర్త జహీర్ ఇక్బాల్ రోజు తనకు ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటాడట. అలా బయటఫుడ్ తినడం వల్లే బరువు పెరగానని.. దీంతో అందరూ గర్భం దాల్చిందని అనుకున్నారని సోనాక్షి చెప్పుకొచ్చింది. అర్థరాత్రి 12 గంటల తర్వాత కూడా ‘ఆకలేస్తుందా? ఏమైనా తీసుకురావాలా?’ అని అడుగుతాడంటూ.. భర్తతో చేసిన వాట్సాప్ చాట్ని ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. కాగా, కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి, జహీర్ గతేడాది జూన్లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఐదు నెలల నుంచే ప్రెగ్నెన్సి రూమర్స్ మొదలయ్యాయి. గతంలో కూడా ఇలాంటి రూమర్సే వస్తే.. సోనాక్షి సింపుల్గా కొట్టిపారేసింది. ఈ సారి కూడా ఫన్వేలో తన ప్రెగ్నెన్సీ రూమర్స్కి చెక్ పెట్టింది. -
తెలుగువాళ్లు అస్సలు తగ్గేదేలే.. పుష్ప డైలాగ్స్తో అదరగొట్టిన ఐకాన్ స్టార్
అమెరికాలో జరిగిన నాట్స్ 2025 సంబరాల కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ (Allu Arjun), హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ రాఘవేంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పుష్ప డైలాగ్స్తో అభిమానులను ఉర్రూతలూగించాడు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఇండియా నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. హైదరాబాద్ లేదా వైజాగ్లో ఉన్నట్లే అనిపిస్తోంది. అమెరికాలో ఇలా తెలుగువాళ్లందరూ కలవడమనేది అద్భుతం. నాట్స్ సంబరాలకు నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది.తెలుగోళ్లంటే వైల్డ్ ఫైర్..నాట్స్ గురించి పుష్ప స్టైల్లో చెప్పాలంటే.. 'నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్'. 'ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులో తెలుగువాళ్లయితే అస్సలు తగ్గేదేలే..', 'తెలుగోళ్లంటే ఫైర్ అనుకున్నారా? వైల్డ్ ఫైర్' అని డైలాగ్స్ చెప్పాడు. బన్నీ డైలాగ్స్తో సభాప్రాంగణం విజిల్స్, అరుపులు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. చివర్లో యాంకర్ శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. మీ యాంకరింగ్ మాత్రం రప్పా రప్పా అని పొగిడేశారు. View this post on Instagram A post shared by alluarjun_statusworld (@alluarjun_statusworld) చదవండి: చిత్ర పరిశ్రమ ప్రథమార్ధం రిపోర్ట్.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టింది? -
స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. వీడియో వైరల్
స్టార్ హీరోయిన్ సమంత భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమను జీవితంలో మరవలేనని, తన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. తప్పు చేసినా.. వారు మాత్రం ఎప్పుడూ తనవెంటే ఉన్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా ఆమె అమెరికాలో జరిగిన తానా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత స్టేజ్పై స్పీచ్ ఇస్తూ మధ్యలో ఎమోషనల్ అయ్యారు. ‘ఈ వేదికపైకి వచ్చి మాట్లాడడానికి నాకు 15 ఏళ్లు పట్టింది. ప్రతి ఏడాది ఇక్కడి తెలుగు వారి గురించి వింటూనే ఉంటాను. నా మొదటి చిత్రం ఏ మాయ చేసావె’ నుంచి నన్ను మీరు ఆదరిస్తున్నారు. ఇన్నాళ్లకు మీకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం వచ్చింది. మొదటి నుంచి మీరు నాకు ప్రేమను మాత్రమే ఇస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..మీరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు నా కెరీర్ పరంగా ముఖ్యమైన దశలో ఉన్నాను. ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిర్మాతగా శుభం సినిమా తీస్తే.. నార్త్ అమెరికాకు చెందిన తెలుగు వాళ్లు ఎంతో ఆదరించారు. నేను ఎక్కడికి వెళ్లినా.. ఏ పరిశ్రమలో పని చేసినా.. తెలుగు ప్రేక్షకులు నన్ను గర్వపడతారా లేదా? అనేదే ఆలోచిస్తాను. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు నాకొక ఐడెంటీటీ, కుటుంబాన్ని ఇచ్చారు. నా ఓబేబీ సినిమా ఇక్కడ ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించిదని చెబితే నమ్మలేకపోయాను. ఇదంతా మీవల్లే సాధ్యమైంది. మీరు నాకు దూరంగా ఉన్నప్పటికీ నా హృదయంలో మాత్రం మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది’ అంటూ సమంత భావోద్వేగంగా తన ప్రసంగాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.Actress #Samantha got emotional during her speech at TANA Conference 2025. pic.twitter.com/LV6SBVZZ5g— Whynot Cinemas (@whynotcinemass_) July 6, 2025 -
డిప్రెషన్లోకి వెళ్లిన మృణాల్.. చనిపోవాలనుకుందట!
టీవీలో ‘కుంకుమ‘ పెట్టుకొని ప్రారంభించి, నేడు సిల్వర్ స్క్రీన్ పై ‘సూపర్’గా మెరుస్తోంది. బ్యూటీకి బ్రెయిన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆమెను చూస్తే చాలు, ఎమోషన్ , ఎలిగెన్స్, ఎక్స్ప్రెషన్– అన్నింటికీ చిరునామా! మారిన మృణాల్ చెప్పిన ముచ్చట్లు!మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.నటి కావాలనేది మృణాల్ చిన్నప్పటి కోరిక. కానీ సినిమా రంగంపై అపోహల వల్ల ఆమె తల్లిదండ్రులు మొదట అందుకు అంగీకరించలేదు. ఒకరోజు ఆమె తండ్రికి ‘త్రీ ఇడియట్స్’ సినిమాను చూపించి, నటి అయితే ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం ఉంటుందని నచ్చజెప్పింది.అందుకే ప్రతి సినిమా చేసేముందు, తన తల్లిదండ్రులు గర్వపడేలా పాత్ర ఉందా లేదా అని చూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తానని మృణాల్ చెబుతుంది.మృణాల్ టీవీ సీరియల్స్తో కెరీర్ ప్రారంభించింది. ‘కుంకుమ రేఖ’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కాని, ఆడిషన్లకు వెళ్లేటప్పుడు టీవీ నటి అనే ట్యాగ్తో చాలామంది చులకనగా చూసేవారు. కొన్నిసార్లు డిప్రెషన్ను తట్టుకోలేక, లోకల్ ట్రైన్ నుంచి దూకేయాలనిపించినా, తల్లిదండ్రులు గుర్తొచ్చి ఆగిపోయేదట!హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అంటే మృణాల్కు విపరీతమైన అభిమానం. హృతిక్తో ‘సూపర్ 30’, షాహిద్తో ‘జెర్సీ’ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు ఆనందంతో పొంగిపోయింది.తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు మొదటి పరిచయం దర్శకుడు నాగ్ అశ్విన్ ద్వారా. అప్పుడే తెలుగు పరిశ్రమపై ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడిందట! హను రాఘవపూడి ‘సీతారామం’ కథ చెప్పగానే, ఆ కథలో హీరోయిన్ పాత్రతో ప్రేమలో పడిపోయిందట. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించింది. ఆమె పెర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది.తన టీవీ కాలంలో పని చేసిన కొంతమంది నటులు, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు, హీరోలతో మృణాల్ పేరు కలిపి డేటింగ్ రూమర్లు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ, ‘నేను ఎవరితో రిలేషన్లో ఉన్నాను, ఎవరితో బ్రేకప్– ఇవన్నీ పబ్లిక్కి చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగైనా చెబుతాను’ అని చెప్పింది.హీరోయిన్గా సినిమాల్లో బిజీగా ఉన్నా, వెబ్ సిరీస్లకు కూడా ఆసక్తి చూపుతోంది. ఇందుకు ప్రధాన కారణాలుగా తక్కువ పని రోజులు, విభిన్నమైన పాత్రలు, ఎక్కువ రీచ్ వస్తుందని చెప్పింది.మాతృభాష మరాఠీ అయినా, తెలుగు భాష కూడా దగ్గరగా ఉందని, కొద్దిగా బ్రోకెన్ తెలుగులో మాట్లాడగలనని మృణాల్ చెప్పింది.తన కాలేజ్ ఫ్రెండ్స్ క్షేమ, అనుశ్రీ జైన్ ఆమెకు బెస్ట్ ఫ్రెండ్స్. షూటింగ్లతో బిజీగా ఉన్నా వాళ్లతో తరచు ట్లాడుతుంటుందట!టీవీ సీరియల్స్లో పనిచేస్తున్న రోజుల్లో తరచు అపార్ట్మెంట్లు మార్చాల్సి వచ్చేది. ఒక్కో సీరియల్ నెలల తరబడి, ఏళ్ల తరబడి సాగేది. షూటింగ్ లొకేషన్కి దగ్గరగా, తక్కువ రెంటులో ఉండే ఫ్లాట్లను ఎంచుకునేది. ఆ సమయంలో వంట పని యాక్టింగ్ కంటే కష్టంగా అనిపించేదట!తెలుగు షూటింగ్లకి వచ్చినప్పుడు ఇడ్లీ, వడ ఆమె ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. టిఫిన్ కంటే చట్నీలు తినడానికి ఇష్టపడుతుంది మృణాల్.మృణాల్కు చెందిన డేట్స్, రెమ్యునరేషన్ వంటి విషయాలు ఆమె సోదరి లోచన్ చూసుకుంటుంది. షూటింగ్లలో బిజీగా ఉన్నప్పుడు గంటన్నర, రెండు గంటలకంటే ఎక్కువ నిద్రపోయే అవకాశం ఉండదట. ఎక్కువగా ఫ్లైట్ జర్నీల్లోనే నిద్రపోతుంటుందట మృణాల్. -
SSMB 29 రిలీజ్ డేట్ వచ్చేసింది..
-
ప్రభాస్ స్పిరిట్ క్రేజీ అప్డేట్
-
టాలీవుడ్ ప్రథమార్ధం రిపోర్ట్.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టింది
తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ సక్సెస్ రేటు బాగా తగ్గిపోయింది. 2025 ఏడాది మొదలై చూస్తుండగానే ఆర్నెళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమా ఏదీ తెరపై కనిపించలేదు. గతేడాది చివరిలో పుష్ప2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతే ఈ ఏడాది మాత్రం అలాంటి మెరుపులు లేవు. అయితే, ఈ ఆర్నెళ్లలో మన భారతీయ సినిమాలు 856 విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద రూ.5,360 కోట్లకు పైగా వసూళ్లతో ఈ మూవీస్ జోరు చూపించాయి. గతేడాది మొదటి ఆరు నెలల్లో రూ.5,260కోట్లకు పైగా వసూళ్లు రావడం జరిగింది.అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు సాధించిన చిత్రాలు ఉన్నా తెలుగు సినిమాలు మాత్రం పెద్దగా లేవు. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు నిరుత్సాహపరిచినా జాతీయ మీడియా సర్వేల ప్రకారం ఇండియన్ బాక్సాఫీస్ ప్రథమార్ధం గతేడాదితో పోలిస్తే తటస్థంగానే ఉందని చెప్పాలి. కానీ, పెద్దగా పుంజుకోలేదనే భావన కూడా ఉంది. విక్కీ కౌషల్ నటించిన 'ఛావా' రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి పరిశ్రమకు ఊపరిపోసింది. అయితే, తెలుగులో మాత్రం సంక్రాంతికి వస్తున్నాం రూ.300 కోట్లు సాధించి తర్వాతి స్థానంలో ఉంది. మొదటి ఆరు నెలల్లో తెలుగు పరిశ్రమ నుంచి రూ. 1200 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ. 300 కోట్ల కలెక్షన్లతో సత్తా చాటింది. అయితే, రూ. 450 బడ్జెట్తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్గా మిగలడంతో టాలీవుడ్కు తీరని నష్టాలను తెచ్చింది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్గా రంగంలోకి దిగిన ఈ మూవీ కేవలం రూ. 150 కోట్ల లోపే పరిమతం కావడం జరిగింది. అయితే, ఈ ఏడాదిలో దక్షిణాది సినిమాల కలెక్షన్ల వాటా మాత్రం బాలీవుడ్ను దాటేశాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ (రూ. 250 కోట్లు), తుడరుమ్ (రూ. 250 కోట్లు), లూసిఫర్ 2 (రూ. 270 కోట్లు), డ్రాగన్ (రూ. 160 కోట్లు) వంటి సినిమాలతో పాటు వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన చిత్రాలు భారీగానే ఉన్నాయి. ఒక రకంగా ఇండియన్ సినిమా మార్కెట్లో దక్షిణాది పరిశ్రమల వాటా కాస్త ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఈ ఏడాది సమ్మర్లో ఐపీఎల్ ప్రభావం కూడా సినిమాలపై ఎక్కువగానే చూపింది. వేసవిలో చాలామటకు విడుదలైన చిన్న సినిమాలు మెప్పించాయి. కానీ, క్రికెట్ ప్రభావం వల్ల ప్రేక్షకులు థియేటర్కు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. గతేడాది ప్రథమ ఆరు నెలల్లో చిత్ర పరిశ్రమను 'కల్కి' సినిమా కాపాడింది. రూ.1000కోట్ల మైలురాయిని దాటేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. మొదటి ఆరు నెలల కలెక్షన్స్ వాటాలో ఎక్కువ కల్కి సినిమాదే ఉండటం విశేషం. అదే ఏడాది చివర్లో పుష్ప2 రూ. 1800 కోట్లకు పైగా సాధించి తెలుగు పరిశ్రమ ఉణికిని కాపాడింది. అయితే, 2025 మొదటి ఆరు నెలలు మాత్రం తెలుగు పరిశ్రమ కాస్త నిరాశనే మిగిల్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, బాలీవుడ్ సినిమా ఛావా మాత్రమే రూ. 800 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. అలా 2025 మొదటి ఆరు నెలలు కాస్త నిరాశగా ఉన్నప్పటికీ తర్వాత ఆరు నెలల్లో భారీ సినిమాలే ఉన్నాయి. ప్రభాస్ (రాజాసాబ్), ఎన్టీఆర్ (వార్2), కూలీ, రామాయణ, కాంతార2 వంటి భారీ సినిమాలు ఉన్నాయి.వెంటాడిన పైరసీసినిమా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ పరిశ్రమ కూడా భారీగానే దెబ్బతింది. గత ఏడాదిలో కేవలం టాలీవుడ్లోనే పైరసీ వల్ల రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా వెల్లడించింది. 2025 మొదట ఆరు నెలల్లో కూడా సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా నష్టపోయినట్లు తెలుగు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే ఈ స్థాయిలో నష్టం వాటిల్లితే.. మరి దేశవ్యాప్తంగా ఇతర భాషల చిత్రాల సంగతేంటి..? దానిని ఊహించడం చాలా కష్టం. సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం లీక్ కావడంతో నిర్మాత రూ.91 కోట్ల నష్టాన్ని చవిచూశారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఆపై గేమ్ ఛేంజర్ మూవీ లీక్ కావడంతో రూ. 100 కోట్లకు పైగా నష్టం వచ్చిందని సమాచారం. మొన్నటికి మొన్న కన్నప్ప పరిస్థితి కూడా అంతే.. ఇలా చెప్పుకుంటూ పోతే పైరసీకి గురైన సినిమాల జాబితా పెద్దదే. అలా పరిశ్రమకు కూడా తీరని నష్టాలను పైరసీ తెచ్చిపెడుతంది. -
సూర్యతో ఒక్క ఛాన్స్ అంటున్న ట్రెండింగ్ బ్యూటీ
ఏ రంగంలోనైనా కలలు కనడంతో పాటూ వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అలా తన కల ఎప్పటికైనా నెరవేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు నటి మీనాక్షీ దినేష్. మలయాళంలో 18 ప్లస్, రెట్టా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న ఈ కేరళా బ్యూటీ లవ్ మ్యారేజ్ చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. నటుడు విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సక్సెస్పుల్గా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో మీనాక్షీ ధినేష్ నటన పలువురిని ఆకట్టుకుంది. సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నటి మీనాక్షీ దినేష్ తన భావాలను పంచుకున్నారు. తెలుగులో కూడా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై గోపీచంద్ చేస్తున్న సినిమాలో హీరోయిన్గా ఆమె ఛాన్స్ దక్కించుకుంది.లవ్ మ్యారేజ్ చిత్రంతో తమిళ ప్రేక్షకుల నుంచి తనకు లభిస్తున్న అభినందనలు, ఆదరాభిమానాలు చాలా సంతోషాన్నిస్తున్నాయని మీనాక్షీ అన్నారు. ఈ చిత్రంలో నటించడం ఒక కొత్త పరిణాన్ని ఆవిష్కరించుకోవడానికి తనకు లభించిన అవకాశంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో తనను హీరోయిన్గా ఎంపిక చేసిన యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. పలు ఛాలెంజ్తో కూడిన కథాపాత్రల్లో నటించి తనకుంటై ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాలని కోరుకుంటున్నాననీ, స్టీరియో భాణిని బద్దలు కొట్టి నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్రల్లో నటించాలన్నది తన ఆశ అన్నారు. కాగా తనకు తమిళంలో సూర్య నటనకు తాను వీరాభిమానినని చెప్పారు. ఆయన నటనను తాను చాలా కాలంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో చిత్రంలోనూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న ఆయన నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందన్నారు. సూర్యకు జంటగా నటించాలన్నది తన కల అన్నారు. దాన్ని ఒక రోజు కచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రతిభావంతమయిన నటన, మంచి కథా చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి మీనాక్షీ దినేష్ త్వరలోనే దక్షిణాది సినిమాలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకంటారని భావించవచ్చు. -
ఘాటీ వాయిదా
‘‘సినిమా అనేది జీవనది లాంటిది. కొన్నిసార్లు అది వేగంగా ముందుకు వెళుతుంది. కొన్నిసార్లు లోతు పెంచుకోవడానికి ఆగుతుంది. ‘ఘాటీ’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు... అది పర్వతాల ప్రతిధ్వని, అడవిలోని చల్లటి గాలి. మట్టి నుంచి, రాతి నుంచి చెక్కిన కథ. ప్రతి ఫ్రేమ్ని అద్భుతంగా ఆవిష్కరించడం కోసం మేం మరికొంత సమయం వెచ్చించాలనుకున్నాం’’ అని ‘ఘాటీ’ చిత్రబృందం ఓ లేఖ విడుదల చేసింది. అనుష్క లీడ్ రోల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘ఘాటీ’.ఈ నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే వాయిదా వేసినట్లు పేర్కొని, శనివారం ఓ లేఖ విడుదల చేశారు. ‘‘మా సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకుల నిరీక్షణకు తగ్గట్టు ఓ అద్భుతమైన, ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి దక్కుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. బాధితురాలైన ఓ మహిళ పగ తీర్చుకునే క్రమంలో నేరస్థురాలిగా ఎలా మారింది? ఆ తర్వాత ఎలా లెజెండ్ అయింది? అనేది ‘ఘాటీ’ చిత్రం ప్రధానాంశం. విజువల్ ఎఫెక్ట్స్కిప్రాధాన్యం ఉన్న చిత్రం కావడంతో, ఆ పనులు పూర్తి కాకపోవడం వల్లే రిలీజ్ను వాయిదా వేశారట. -
కచ్చితంగా ఆపగలం
‘మొగలి రేకులు’ సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిషా నారంగ్ కథానాయికగా నటించగా, ధన్యా బాలకృష్ణ కీలకపాత్రపోషించారు. కేఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రోడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హీరో పవన్ కల్యాణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.‘జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేం... కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా ఆపగలం’ అనే విక్రాంత్ ఐపీఎస్ వాయిస్ ఓవర్తో ట్రైలర్ప్రారంభమవుతుంది. ‘‘యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో విక్రాంత్ ఐపీఎస్గా ఆర్కే సాగర్ అద్భుతంగా నటించారు. మిషా నారంగ్పాత్ర కథకు రొమాంటిక్ టచ్ను యాడ్ చేస్తుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు. -
డెకాయిట్ కోసం..
‘డెకాయిట్’ కోసం హైదరాబాద్ చేరుకున్నారు మృణాల్ ఠాకూర్. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ లవ్స్టోరీ చిత్రం ‘డెకాయిట్’. ‘ఏక్ ప్రేమ్ కథ’ అనేది ట్యాగ్లైన్. షనీల్ డియో డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్లోకి అడుగుపెట్టారు మృణాల్ ఠాకూర్. ‘డెకాయిట్’ సినిమా సెట్స్లోకి జాయిన్ అయినట్లుగా తన ఇన్స్టా అకౌంట్లో కన్ఫార్మ్ చేశారీ బ్యూటీ. ఈ కీలక షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంటుందట.ఇద్దరు మాజీ ప్రేమికులు తమకు ఇష్టం లేకపోయినా ఓ క్రైమ్ను కలిసి చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథాంశమనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలోని కొంత భాగం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని, మదనపల్లె యాసలో అడివి శేష్ క్యారెక్టర్ ఉంటుందని ఫిల్మ్నగర్ భోగట్టా. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. -
వెండితెరపై ఎంట్రీ
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి లోగన్ దర్శకత్వం వహించనున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సురేష్ రైనా క్రికెట్ నేపథ్యంలో రానున్న ఈ తమిళ చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేయనున్నారు. డ్రీమ్ నైట్ స్టోరీస్ బ్యానర్పై శ్రవణ కుమార్ ఈ సినిమా నిర్మించనున్నారు. చెన్నైలో జరిగిన వేడుకలో ఈ చిత్రాన్ని ప్రకటించారు. క్రికెటర్ శివమ్ దూబే నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సురేష్ రైనా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘క్రికెట్ మైదానం నుంచి కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్ సంస్థతో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న సురేష్ రైనా వర్చ్యువల్గా ఈ ఈవెంట్లోపాల్గొని, తన సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కుప్రాతినిధ్యం వహించిన రైనా చిన్న తల (చిన్న నాయకుడు)గా తమిళనాడులో విశేష అభిమానులను సంపాదించుకున్నారు. -
ఈ సినిమాకు వెళ్తే థియేటర్లలో డబ్బుల వర్షం..
మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తుండగా వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్గా పని చేశారు. శనివారం నాడు వర్జిన్ బాయ్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామన్నారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని, ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నటుడు రోనిత్ మాట్లాడుతూ... "నేను, దర్శకుడు దయ కాలేజ్ ఫ్రెండ్స్. అప్పటినుండే ఇద్దరం సినిమాలు చేయాలని అనుకునే వాళ్ళం. చూస్తే పది సంవత్సరాల తర్వాత ఒక సినిమా స్టేజిపై ఉన్నాము. చిన్న సినిమాలకు ఊపిరి పోసే సినిమాగా వర్జిన్ బాయ్స్ నిలుస్తుందని అనుకుంటున్నాను" అన్నారు. నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ.. తనను నమ్మి తనపై ఎంతో ఖర్చు పెట్టి ఎంకరేజ్ చేసిన నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నటి మిత్ర శర్మ మాట్లాడుతూ... "ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. రోనిత్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. అలాగే గీతానంద్ తో కలిసిన నటించడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు. నేను మీ అందరిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను" అంటూ ముగించారు. -
9 రోజులు మంచినీళ్లు తాగే బతుకుతా.. అన్నం ముట్టను: హీరోయిన్
చాలామంది వారానికోసారి లేదా ఏదైనా పండగ ఉన్నప్పుడు ఉపవాసం చేస్తుంటారు. అలా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri)కి కూడా ఉపవాసం చేసే అలవాటుందట! కాకపోతే ఎప్పుడో ఒకసారి కాదు.. ఏకధాటిగా 9 రోజులు ఏమీ తినకుండా ఉంటుందట! ఇలా ఏడాదికి రెండుసార్లు దీన్ని కఠిన దీక్షలా పాటిస్తానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నర్గీస్ ఫక్రి మాట్లాడుతూ.. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ఆ సమయంలో ఏమీ తినను. 9 రోజులు తిండి లేకుండా..తొమ్మిదిరోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. 9 రోజులయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ముఖంలో మాత్రం కాస్త గ్లో ఉంటుంది. అయితే ఇది పాటించమని నేనెవరికీ సలహా ఇవ్వను. చాలామంది ఏదైనా త్వరగా జరిగిపోవాలనుకుంటారు. కానీ దేనికైనా సమయం పడుతుంది. ఉదాహరణకు మంచి నిద్ర కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. నేనైతే రోజూ ఎనిమిది గంటలు నిద్రపోతాను. సినిమాఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్, మినరల్స్ వంటి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. నర్గీస్ ఫక్రి.. రాక్స్టార్ (2011) మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మే తేరా హీరో, హౌస్ఫుల్ 3, టొర్బాజ్, అజర్, మద్రాస్ కేఫ్, అమవాస్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల హౌస్ఫుల్ 5 సినిమాతో అలరించింది.చదవండి: పాపం.. ఏదో నోరు జారింది.. రష్మికను వదిలేయండి: నటి -
కొడుకు వీడియో వైరల్.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి!
కొడుకు సూర్య వైరల్ వీడియో వివాదంపై తమిళ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) స్పందించాడు. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని అని మీడియా ముఖంగా తెలియజేశాడు. విజయ్ సేతుపతి కొడుకు సూర్య(Surya) హీరోగా నటించిన తొలి సినిమా ‘ఫీనిక్స్’ జులై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ సంపాదించుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోనే వివాదస్పదంగా మారింది. సూర్యకు సంబంధించిన వీడియోలను డిలీట్ చేయాలని అతని టీమ్ మీడియాపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై విజయ్ సేతుపతి స్పందించాడు. ‘సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు నిజంగా అలాంటి ఒత్తిడి తెచ్చి ఉంటే.. అది తెలియకుండా జరిగి ఉండవచ్చు లేదా వేరొకరు చేసి ఉండవచ్చు. ఈ విషయంలో ఎవరైనా బాధపడితే వారిని నా తరపున క్షమాపణలు చెబుతున్నాను’ అని విజయ్ సేతుపతి అన్నారు.ఫినిక్స్ విషయానికొస్తే..ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. స్టంట్ మాస్టర్ అనల్ అరసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దేవదర్శిని, వరలక్ష్మి శరత్కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జులై 4న విడుదలైన ఈ చిత్రానికి ప్రశంసలు అయితే భారీగానే వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. పోటీలో సిద్ధార్థ్ 3బీహెచ్కే తో పాటు మరో సినిమా ఉండడం వల్లే.. తొలిరోజు ఫినిక్స్కి అతి తక్కువ(రూ. 10 లక్షలు) వసూళ్లు వచ్చాయి. వారంతంలో కలెక్షన్స్ పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.విజయ్ సేతుపతి విషయానికొస్తే.. ఇటీవల ఏస్ చిత్రంలో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ‘తలైవన్ తలైవీ’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిత్యా మీనన్, యోగి బాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. -
నాలో ఏదైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా?.. ఏడ్చేసిన బిగ్బాస్ బ్యూటీ
బిగ్బాస్ బ్యూటీ మిత్రా శర్మ (Mitraaw Sharma) హీరోయిన్గా, నిర్మాతగా అందరికీ సుపరిచితురాలే! తను బిగ్బాస్ నాన్స్టాప్ (ఓటీటీ) సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది. మిత్రా శర్మ కథానాయికగా నటించిన తాజా చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మిత్ర భావోద్వేగానికి లోనైంది. అమ్మ-నాన్నను కోల్పోయానేను పుట్టగానే అమ్మను కోల్పోయాను. చిన్నవయసులోనే నాన్నకూ దూరమాయ్యాను మా నాన్న టీచర్. ఆయన నాకు ఇచ్చింది విద్య మాత్రమే! ఆయన చనిపోయేముందు కూడా నువ్వు లేకుండా నేను బతకలేను నాన్న అని చాలా బాధపడ్డాను. ఆయన వెళ్లిపోయాక నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితంలో ఎవరైనా ఉంటే వారికోసం ఏదైనా చేయాలనుకున్నాను. కానీ, అర్హత ఉన్నవారికే సాయం చేయాలి. ఎందుకంటే జీవితంలో ఎన్నో రిజెక్షన్స్ చూశాను.తలరాత మార్చలేరుగాతిరస్కరణకు గురైనప్పుడల్లా నాకేమనిపించేదంటే.. నాలో ఏమైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా? లేదంటే టైం బాగోలేదా? ఇలా నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. తర్వాత మళ్లీ నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. మన దగ్గరున్న డబ్బు ఆఖరి రూపాయి వరకు ఎవరైనా తీసుకెళ్లవచ్చు. కానీ మన తలరాతను తీసుకెళ్లలేరు కదా అని రియలైజ్ అయ్యేదాన్ని. సాయం చేయాలి.. నాకంటూ మంచి మనుషులను సంపాదించుకోవాలి అనే లక్ష్యంతోనే ముందుకువెళ్తున్నాను అంటూ మిత్ర శర్మ కన్నీళ్లు పెట్టుకుంది.సినిమాగీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వర్జిన్ స్టోరీ. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ కీలక పాత్రల్లో నటించారు. దయానంద దర్శకత్వం వహించగా దారపునేని రాజా నిర్మించారు. జూలై 11న ఈ సినిమా రిలీజవుతోంది. సినిమా చూసినవారికి ఐఫోన్లు కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇస్తామని ప్రకటించారు. సినిమా చూశాక.. టికెట్ ఫోటో తీసి 8019210011 నెంబర్కు వాట్సాప్ చేయాలని.. లక్కీ డ్రా ద్వారా 11 మందిని సెలక్ట్ చేసి ఐఫోన్ పంపిస్తామని క్రేజీ ఆఫర్ ఇచ్చారు.చదవండి: ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ -
‘లోపలికి రా చెప్తా’ మూవీ రివ్యూ
టైటిల్: లోపలికి రా చెప్తానటీనటులు: కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడా తదితరులునిర్మాతలు: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్రకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్రసంగీతం: దేవ్ జాండ్సినిమాటోగ్రఫీ:రేవంత్ లేవాక, అరవింద్ గణేష్విడుదల తేది: జులై 5, 2025కొండా వెంకట రాజేంద్ర కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘లోపలికి రా చెప్తా’(Lopaliki Ra Chepta Review). మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరోయిన్లుగా నటించారు. లక్ష్మీ గణేశ్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(జులై 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డెలివరీ బాయ్ రామ్ (కొండా వెంకట రాజేంద్ర), ప్రియ(సుస్మిత ఆనాల)కి పెళ్లి జరుగుతుంది. శోభనం రోజు గదిలోకి వెళ్లిన తర్వాత ప్రియ దెయ్యంలా మారి..రామ్ని భయపెట్టి, ముద్దు కూడా పెట్టుకోనియకుండా బయటకు పంపుతుంది. స్నేహితుడు ఇచ్చిన సలహాతో చేతికి తాయత్తు కట్టుకొని వెళితే.. రెండో రాత్రి కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. దీంతో ఓ మంత్రగాడి(వంశీ) దగ్గరకు వెళ్తారు. ఆ మంత్రగాడు రామ్ నేపథ్యం గురించి అడగడంతో కథ ప్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. డెలివరీ బాయ్ రామ్కి రోడ్డుపై ఓ అమ్మాయి(సాంచిరాయ్) పరిచయం అవుతుంది. ఆమెనే నెంబర్ ఇచ్చి.. రాత్రికి తన అపార్ట్మెంట్కి రమ్మని కబురు పంపుతుంది. అక్కడి వెళ్లిన రామ్.. విల్లా నెంబర్ తప్పుగా చెప్పి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విల్లా నెంబర్ 91లో ఉన్నది ఎవరు? నైనిక (మనీషా జష్ణాని) ఎవరు? ఆమెతో రామ్కి ఉన్న సంబంధం ఏంటి? విక్కీ(అజయ్ కార్తిక్) ఎవరు? రామ్ ఫస్ట్ నైట్ జరగకుండా అడ్డుకుంటున్న దెయ్యం ఎవరు? దాని కోరిక ఏంటి? చివరకు రామ్ శోభనం జరిగిందా లేదా? అనేదే మిగతా కథ.(Lopaliki Ra Chepta Review)ఎలా ఉందంటే..హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఇప్పటికే పదుల సంఖ్యలు ఈ జానర్లో చిత్రాలు వచ్చాయి. లోపలికి రా చెప్తా కూడా ఆ కోవలోకి చెందిన సినిమానే. హారర్ కామెడీకి రొమాన్స్ని యాడ్ చేసి యూత్పుల్ ఎంటర్టైనింగ్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కొండా వెంకట రాజేంద్ర. హారర్ కంటే ఎక్కువ కామెడీ, రొమాంటిక్ సీన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్నైట్ సీన్తో సినిమా ప్రారంభం అవుతుంది. భార్య వింతగా ప్రవర్తిండంతో కథ హారర్ జోన్లోకి వెళ్తుంది. అయితే దర్శకుడు అక్కడ కూడా ఎక్కువగా భయపెట్టకుండా..కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. మంత్రగాడి దగ్గరకు వెళ్లడం.. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్గానే ఉంటాయి. ప్లాష్బ్యాక్లోకి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తికరంగా సాగుతుంది. అమ్మాయి నెంబర్ ఇవ్వడం.. అపార్ట్మెంట్లోకి వెళ్లడం.. ఇద్దరి మధ్య రొమాన్స్.. ఇవన్నీ యూత్ని ఆకట్టుకుంటాయి. నైనిక ఎపిసోడ్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ని బాగా ప్లాన్ చేశారు. ఇక సెకండాఫ్ మొత్తం దెయ్యం చుట్టునే కథనం తిరుతుంది. దెయ్యంతో శోభనం సీన్ నవ్వులు పూయిస్తుంది. ఓ మంచి సందేశంతో సినిమా ముగుస్తుంది. ప్రతి పది నిమిషాలకు ఒక రొమాంటిక్ సీన్ లేదా పాటనో పెట్టి బోర్ కొట్టకుండా చేశాడు. అయితే కొన్ని చోట్ల మోతాదుకు మించిన రొమాన్స్ ఉండడం, డబుల్ మీనింగ్ పాట ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ‘లోపలికి రా చెప్తా’ కోసం థియేటర్ లోపలికి వెళితే.. ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారెంటీ.ఈ సినిమాకు కొండా వెంకట రాజేంద్ర దర్శకత్వం వహించడంతో పాటు హీరోగాను నటించాడు. రెండింటికి తగిన న్యాయం చేశాడు. తెరపై చాలా ఎనర్జిటిక్గా కనిపించాడు. నైనిక పాత్రలో నటించిన మనీషా జష్ణాని తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శించింది. ఎమోషనల్ సీన్లలో చక్కగానే నటించింది. ఇక దెయ్యం పట్టిన భార్య ప్రియగా సుస్మిత ఉన్నంతలో బాగానే చేసింది. అయితే హారర్ సీన్లను బలంగా రాసుకోలేకపోవడంతో..ఆమె భయపెట్టిన ప్రతిసారి థియేటర్స్లో నవ్వులే పూసాయి తప్ప భయం పుట్టలేదు. సాంచిరాయ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ‘టిక్ టాక్ చేద్దామా’ పాటలో అందాలను ఆరబోసి యూత్ని ఆకట్టుకుంది. అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. దేవ్ జాండ్ సంగీతం బాగుంది. టిక్ టాక్ చేద్దామా పాట యూత్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అలాగే సుదిలోనా దారం పాట థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
నా వయసు, పెళ్లి గురించి మీకెందుకు: రెజీనా
ఈ తరం అమ్మాయిలు పెళ్లి కంటే కెరీర్పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్నది కాదనలేని విషయం. ఇంతకు ముందు 16, 18 ఏళ్లకే అమ్మాయిలను పెళ్లీడుకొచ్చారనే వారు. ఇప్పుడు అంతా మారిపోయింది. 21 ఏళ్లు దాటిన తరువాతనే పెళ్లిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమా రంగంలో అయితే 35 దాటిపోతోంది. చాలా మంది హీరోయిన్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గానే ఉంటున్నారు. అలాంటి వారిలో నటి రెజీనా( Regina Cassandra) ఒకరు. ఈమె బహుభాషా నటి. తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో కథానాయకిగా నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా తమిళంలో 2005లో విడుదలైన కండనాళ్ మొదల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నటించిన అసుర చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, శివకార్తీకేయన్కు జంటగా నటించిన కేడీబిల్లా కిల్లాడి రంగా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తెలుగు, కన్నడం భాషల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే కొంత కాలంగా సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. దీంతో ప్రత్యేక పాటల్లో నటించడంతోపాటు ప్రతినాయకి పాత్రల్లో నటించడానికి సై అన్నారు. అదే సమయంలో వెబ్ సిరీస్లోనూ నటించడం ప్రారంభించారు. ఇలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న రెజీనా చాలా బోల్డ్ నటి అనే ముద్ర వేసుకున్నారు. అందాలారబోతకు నో చెప్పని ఈ భామ వయసు 34 ఏళ్లు. ఈమె తమిళంలో చివరిగా నటించిన చిత్రం విడాముయర్చి. అందులో నెగిటీవ్ పాత్రలో నటించారు. కాగా ఇటీవల ఒక భేటీలో 34 ఏళ్లు వచ్చాయి. పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ముక్కు సూటిగా బదులిచ్చిన రెజీనా పెళ్లెప్పుడు చేసుకుంటావని తన తల్లే అడగదని, మీరెందుకు అడుగుతున్నారు? మీకెందుకు అంత అక్కర అని చెప్పింది. అంతే కాకుండా తనతో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే వారికే కష్టం అనీ, అందుకే ఫ్రెండ్షిపే బెటర్ ఈజీగా ఉంటుందని చెప్పారు. దీంతో నెటిజన్లు ఈ అమ్మడిపై రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు.అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటారా? లేక అవివాహితగానే ఉండిపోతారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఒకప్పుడు నేషనల్ అవార్డ్ విన్నర్.. ఇప్పుడేమో ఆటో డ్రైవర్
కర్ణాటకు చెందిన షఫీక్ సయ్యద్.. బెంగుళూరు మురికివాడలో జన్మించాడు. చిన్నతనంలోనే పెద్ద పెద్ద కలలు కన్నాడు. ఏదోరోజు అమితాబ్ బచ్చన్ అంతటి స్టార్ కావాలని కోరిక పెంచుకున్నాడు. సినిమాపై మక్కువతో కేవలం 12ఏళ్ల వయసులో ఒంటరిగానే ముంబై రైలు ఎక్కాడు. అనుకున్నట్లుగానే సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. తొలి సినిమాతోనే ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకుని దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయాడు. ఆప్పుడు తన ఆశలకు జీవం వచ్చింది. ఇక గొప్ప స్టార్ అయిపోతానని నిర్ణయించుకున్నాడు. కానీ, తర్వాత ఛాన్సులు రాలేదు. అదే వచ్చింటే ఒక అమితాబ్, చిరంజీవిలా ఇండస్ట్రీని ఏలేవాడేమో చెప్పలేము కదా..!1988లో విడుదలైన 'సలాం బాంబే' సినిమా ఒక సంచలనం. ఎక్కడ చూసిన షఫీక్ సయ్యద్ పోస్టర్స్తోనే సినిమా టైటిల్ కనిపించేది. ఈ చిత్రాన్ని మీరా నాయర్ దర్శకత్వం వహించడమే కాకుండా ఆమె నిర్మాతగా ఉన్నారు. ముంబైలోని మురికివాడల్లో నివసించే పిల్లల దైనందిన జీవితాలను ఈ చిత్రంలో చూపించారు. ఆ ఏడాదిలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డ్ను అందుకోవడంతో పాటు ఉత్తమ బాల నటుడిగా షఫీక్ సయ్యద్ కూడా అవార్డ్ దక్కించుకున్నాడు. ఆపై సలాం బాంబే మూవీ ఆస్కార్ అవార్డ్కు కూడా నామినేట్ అయింది. భారత్ నుంచి అలా ఎంపికైన రెండో చిత్రంగా రికార్డ్ పొందింది. లెక్కలేనన్ని అంతర్జాతీయ అవార్డ్స్ను ఈ చిత్రం అందుకుంది. వీటన్నింటికీ కారణం సలాం బాంబేలో షఫీక్ సయ్యద్ నటనే అని అప్పట్లో చెప్పుకునేవారు.'షఫీక్ సయ్యద్' ఎందుకు ఆటో నడుపుతున్నాడు'సలాం బాంబే' సినిమా వల్లే షఫీక్ సయ్యద్కు మంచి గుర్తింపు వచ్చింది. ఏదైనా పార్టీలో అతను కనిపిస్తే చాలు పెద్దపెద్ద వారు కూడా పోటోలు దిగేందుకు పోటీపడేవారు. దీనిని బాలీవుడ్ మేకర్స్ జీర్జించుకోలేకపోయారు. తమ పిల్లలకు దక్కిని గౌరం ఇతనికి ఇంతలా రావడం ఏంటి అనే అక్కసు వారిలో మొదలైంది. అంతే, షఫీక్ సయ్యద్కు ఛాన్సులు ఆగిపోయాయి. ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సయ్యద్.. రెండో సినిమా ఛాన్సు కోసం ఐదేళ్లు పోరాడాడు. ఆకలితోనే అక్కడి సినిమా ఆఫీసుల చుట్టు తిరిగాడు. అలా 1993లో పతంగ్ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత అతనికి ఎవరు కూడా ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో తిరిగి బెంగళూరు వచ్చేశాడు. కుటుంబానికి ఆర్థికంగా నిలబడేందుకు ఏదో చిన్నచిన్న పనులు చేసుకునేవాడు. ప్రస్తుతం తన జీవనోపాధి కోసం బెంగళూరులోనే ఆటో నడుపుతున్నాడు. భార్య, తల్లి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని టీవీ ప్రోగ్రామ్లలో గెస్ట్గా పిలుస్తుంటారని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. -
ధనుష్తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. హిట్ దక్కేనా..?
బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ధనుష్. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఆయన ఉన్నారు. తాజాగా కుబేర చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు. తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఇడ్లీ కడై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే హిందీలో ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరే ఇష్క్ మే' చిత్రం షూటింగ్ను పూర్తి చేశారు. కాగా ఇప్పుడు మరో నూతన చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. దీన్ని వేల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి 'అరువడై' అనే టైటిల్ను నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఇందులో నటుడు ధనుష్కు జంటగా నటి పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంతకుముందు ఈ చిత్రంలో మాలయాళ బ్యూటీ మమితా బైజు నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే గత 12 ఏళ్ల క్రితం జీవాకు జంటగా ముఖముడి చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే ఆ తరువాత విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అలాగే ఇటీవల సూర్యకు జంటగా రెట్రో చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ధనుష్తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇది ఇక్కడ ఈ అమ్మడు నటించే నాలుగవ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విష్నేశ్ రాజా కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించనున్నారు. -
ఇండియన్ సినిమా చేయడం హ్యాపీ
‘‘ఇండియాని చాలా మిస్ అయిపోతున్నాను. హిందీ సినిమాలను కూడా మిస్సవుతున్నాను. ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా చెప్పిన విషయాలు వైరల్గా మారాయి. ఈ బ్యూటీ నటించిన హాలీవుడ్ చిత్రం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె ఇండియన్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. ‘‘ఇండియాలో 2002లో నా తొలి సినిమా (తమిళ చిత్రం ‘తమిళన్’)తో కెరీర్ మొదలుపెట్టి, ఎన్నో రకాల సినిమాలు చేశాను.ఎందరో ప్రతిభావంతులతో సినిమాలు చేశాను. అందుకే ఈ సంవత్సరం ఇండియన్ సినిమా (మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ఉద్దేశించి) చేయడం చాలా ఆసక్తిగా ఉంది. భారతీయ ప్రేక్షకులు నా పై చూపించే ప్రేమ నాకెంతో విలువైనది. నాపై వారి ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు.హాలీవుడ్ సింగర్–యాక్టర్–మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోనస్ని 2018లో పెళ్లి చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత భారతీయ చిత్రాలు ఎక్కువ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్బాబు–రాజమౌళి కాంబినేషన్లోని సినిమాలో నటించడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.