breaking news
Movie News
-
సూపర్ హిట్ కాంబో.. ఆ డైరెక్టర్తో మరోసారి నిహారిక!
గతేడాది చిన్న చిత్రంగా వచ్చిన సూపర్ హిట్గా నిలిచిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ మూవీని మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. గోదావరి బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. రూ.9 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్గా రూ.24.5 కోట్లు వసూళ్లు రాబట్టింది.మరోసారి రిపీట్.. అయితే మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ యదు వంశీ మరోసారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెలతో కలిసి మరో సినిమాను రూపొందించటానికి చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక కమిటీ కుర్రోళ్లు సినిమా అవార్డుల రేసులో సత్తా చాటింది. సైమా 2025లోబెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్గా సందీప్ సరోజ్కి సైమా అవార్డు వచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెల్చుకుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అలాగే డైరెక్టర్ యదు వంశీ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్గా అవార్డును సొంతం చేసుకున్నారు.ప్రొడక్షన్ నెం.2..పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఫాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. -
సర్వస్వం నువ్వే.. నా జీవితంలో ఆదర్శం నువ్వే.. మంచు మనోజ్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి తమ్ముడు, హీరో మంచు మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో నువ్వే నాకు ఎల్లప్పుడు ఆదర్శం అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఒక తల్లిగా, నటుడిగా, నిర్మాతగా నువ్వు జీవిస్తున్న విధానం అద్భుతం అంటూ కొనియాడారు. నువ్వు అడుగుపెట్టే ప్రతి ఇంటికి వెలుగునిచ్చి.. నీ దయ, బలంతో ఎన్నో జీవితాలను మార్చేశావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు.ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే ఉండి.. నువ్వు వెళ్లే ప్రతిచోటా నీ వెలుగును ప్రకాశింపజేస్తూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మంచు మనోజ్ ఎమోషనలయ్యారు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్కా ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు లక్ష్మీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది భైరవం, మిరాయ్ చిత్రాలతో అలరించాడు. ఇటీవలే విడుదలైన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.Wishing my sister and my everything, @LakshmiManchu akka, a very happy birthday ❤️You’ve always been my biggest inspiration, akka. The way you handle life as a mother, actor, producer, and a person with such a big heart is just incredible.You light up every room you walk into… pic.twitter.com/aKNF6Qme5n— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 8, 2025 -
20 నెలల తర్వాత మళ్లీ.. వెంకీమామ మూవీపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత!
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ మామ.. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ను ఇటీవలే ప్రకటించారు. అనిల్ రావిపూడితో కలిసి బ్లాక్బస్టర్ విక్టరీ కొట్టిన వెంకటేశ్ నెక్ట్స్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో చేయనున్నట్లు తెలిసింది. ఈ మూవీని కుటుంబ కథాచిత్రంగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లో 77వ చిత్రంగా నిలవనుంది. వెంకటేశ్ నెక్స్ట్ మూవీకి సంబంధించి తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. దాదాపు 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు రాధాకృష్ణ(చినబాబు) నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. వీరిద్దరి కలిసి మరోసారి మ్యాజిక్ను సృష్టించడానికి సెట్స్పైకి వెళ్లనున్నారని రాసుకొచ్చారు. వెంకీతో త్రివిక్రమ్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.After 20 long months, the wizard of words #Trivikram garu is back behind the camera, joining hands with everyone’s favourite, Victory @VenkyMama garu! 🙌❤️The OGs of entertainment are back on sets to recreate the magic once again! ❤️😉🎬Produced by #SRadhaKrishna (Chinababu)… pic.twitter.com/781uxgmQ5P— Naga Vamsi (@vamsi84) October 8, 2025 -
కాంతార రికార్డ్ బ్రేక్ చేసిన కాంతార.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఈ మూవీ రిలీజైన ఆరు రోజుల్లోనే అరుదైన మార్క్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.(ఇది చదవండి: 'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్బాస్ సంజనా గల్రానీ ఆవేదన!)కాంతార రికార్డ్ బ్రేక్.. ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఆరు రోజుల్లోనే కాంతార లైఫ్ టైమ్ కలెక్షన్స్ను దాటేసింది. కేజీఎఫ్- 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది. కాగా.. 2022లో విడుదలైన 'కాంతార' సినిమా రూ.408 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు రాబట్టింది. శాండల్వుడ్లో కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1215 కోట్లతో మొదటిస్థానంలో ఉంది. కాంతార చాప్టర్-1 జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో రిలీజైన సంగతి తెలిసిందే. -
టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. ఎన్టీఆర్ బామ్మర్ది మ్యారేజ్ డేట్ ఫిక్స్!
ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్. వరుసకు మన యంగ్ టైగర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్.. శివానీ అనే అమ్మాయితో గతేడాది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో కలిసి వేడుకలో సందడి చేశారు. ఈ నిశ్చితార్థానికి హీరో కల్యాణ్ రామ్, వెంకటేశ్ కూడా హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నార్నే నితిన్- శివాని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక అక్టోబర్ 10న గ్రాండ్గా జరగనుందని టాక్. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. -
హోస్ట్ ముందు కాలి మీద కాలేసుకుని కూర్చోవడమేంటి?.. పుష్ప సినిమా చూడలేదా అన్న హరీశ్!
తెలుగు బిగ్బాస్ సీజన్ నాలుగో వారం సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంటిముఖం పట్టారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మరో కామనర్ హౌస్లో అడుగుపెట్టింది. అయితే హౌస్లో ఫుల్ అగ్రెసివ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న మాస్క్ మ్యాన్ హరీశ్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. టాప్-5 కంటెస్టెంట్స్లో ఒకరిగా ఉంటారనుకున్నా మాస్క్ మ్యాన్ను ఆడియన్స్ బయటకు పంపించేశారు.ఈ సందర్భంగా బిగ్బాస్ నుంచి బయటకొచ్చిన మాస్క్ మ్యాన్ హరీశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మాస్క్ మ్యాన్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. హోస్ట్ నాగార్జున ముందు కాలిమీద కాలు వేసుకుని ఎందుకు కూర్చున్నారు? సెలబ్రిటీలే మామూలుగా కూర్చుంటే.. కామనర్ అయిన మీరెందుకు అలా కూర్చోవాల్సి వచ్చిందని హరీశ్ను ప్రశ్నించారు.దీనికి బిగ్బాస్ కంటెస్టెంట్ హరీశ్ సమాధానం ఇచ్చారు. పుష్ప సినిమా డైలాగ్ను గుర్తు చేశారు. ఇది నా కాలే.. ఇది నా కాలే.. అంటూ అల్లు అర్జున్ చేసిన సీన్ ఎగ్జాంపుల్గా చూపించారు. కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అగౌరవించడం అనే విషయం నాకు ఇప్పటికీ తెలియదన్నారు. అలా చేయడం తప్పేమీ కాదు.. మన కాలు అవతలి వాళ్ల మీద వేస్తే తప్పు అని వివరించారు. అవతలి వ్యక్తిని గౌరవించడం అనేది మన మాటల్లో కనపడుతుంది.. అంతే కానీ మన కంఫర్ట్ జోన్లో కూర్చుంటే డిస్ రెస్పెక్ట్ చేయడం కాదన్నారు. నాగార్జున అంటే నాకు చాలా గౌరవముందని మాస్క్ మ్యాన్ హరీశ్ వెల్లడించారు. -
'సలార్'లో సీన్కి ముందు 50-60 పుష్ అప్స్ తీసేదాన్ని
ప్రభాస్ 'సలార్' సినిమా.. థియేటర్లలో రిలీజైనప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత మాత్రం చాలామందికి ఫేవరెట్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇందులో రాధారమ అనే పాత్రలో అదరగొట్టిన శ్రియారెడ్డి.. ఈ ఒక్క చిత్రంతో చాలా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా 'ఓజీ'లోనూ ఈమెకు అద్భుతమైన రోల్ పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియారెడ్డి.. 'సలార్'లో ఎందరో మగాళ్లు ఉన్నప్పటికీ తాను హైలైట్ కావడానికి గల కారణాన్ని బయటపెట్టింది.'సలార్ గురించి గుర్తుచేసుకుంటే.. నా ప్రతి సీన్కి ముందు దాదాపు 50-60 పుష్ అప్స్ తీసేదాన్ని. కాస్ట్యూమ్ వేసుకున్నా, కారవ్యాన్లో ఉన్నా ఇది తప్పనిసరి. నా వరకు అయితే బస్కీలు తీయడం అనేది చాలా సులభమైన వర్కౌట్. షూటింగ్ జరుగుతున్న టైంలోనూ దీని గురించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ముందే చెప్పాను. దీంతో నా సీన్ తీయడానికి ఇంకాసేపు ఉందనగా చెప్పేవారు. నేను పుష్ అప్స్ వర్కౌట్ పూర్తి చేసుకుని వెళ్లేదాన్ని. దీంతో అందరి మధ్య నేను శక్తిమంతురాలిలా కనిపించేదాన్ని. ఖాన్సార్లోని మగాళ్ల కంటే నాకు నేనే అజేయంగా అనిపించేదాన్ని' అని శ్రియారెడ్డి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'వార్ 2'.. అధికారిక ప్రకటన)ఈమె చెప్పిన కామెంట్స్ చూస్తుంటే నిజమేననిపిస్తుంది. ఎందుకంటే 'సలార్'లో ప్రభాస్, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇలా దాదాపు అందరూ మేల్ యాక్టర్స్ ఉన్నారు. వీళ్లతో సరిసమానంగా శ్రియారెడ్డి ఎలివేట్ అయిందంటే.. పుష్ అప్స్ వర్కౌట్ చేయడం ఈమెకు చాలా సహాయపడినట్లు కనిపిస్తుంది.శ్రియారెడ్డి వ్యక్తిగత విషయానికొస్తే.. విశాల్ 'పొగరు' మూవీలో విలన్గా నటించి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. హీరో విశాల్ అన్న విక్రమ్ని పెళ్లి చేసుకుంది. తర్వాత చాన్నాళ్ల పాటు నటనకు దూరమైపోయింది. రీసెంట్ టైంలో సలార్, ఓజీ సినిమాలతో మళ్లీ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. గతంలోనే ఈమె తెలుగు చిత్రాల్లో నటించింది. 2003లో అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది సినిమాల్లో నటించింది గానీ ఇవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రియాకు అవకాశాలు రాలేదు. మళ్లీ ఇప్పుడు తెలుగు చిత్రాలతోనే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్) -
'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్బాస్ సంజనా గల్రానీ ఆవేదన!
ప్రస్తుతం తెలుగు బిగ్బాస్ సీజన్-9 నడుస్తోంది. ఈ సీజన్లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ కాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్య కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టింది. తన మైండ్ గేమ్, స్ట్రాటజీతో ఏకంగా బిగ్బాస్ తెలుగు సీజన్-9కి తొలి కెప్టెన్గా నిలిచింది. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా రాణిస్తోంది. ఈ సందర్భంగా సంజనా గల్రానీకి సంబంధించిన ఓ వీడియోను బిగ్బాస్ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో తన జర్నీతో పాటు డ్రగ్స్ కేసు గురించి కూడా సంజనా మాట్లాడింది. తాను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ఎమోషనలైంది.ఈ వీడియోలో సంజనా మాట్లాడుతూ.. 'హాయ్ నా పేరు అర్చన.. నేను మీ బుజ్జిగాడు సంజనా అంటూ పరిచయం చేసుకుంది. ఏడో తరగతిలోనే ఇండస్ట్రీలో నేను అడుగుపెట్టాను. జాన్ అబ్రహంతో చేసిన యాడ్ చూసి పూరి జగన్నాధ్ నాకు బుజ్జిగాడులో అవకాశం ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నా. ఒకరోజు సడన్గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు? ఆ రోజు డిసైడ్ అయిపోయా. ఆ రోజు గురించి తలుచుకుంటేనే చాలా బాధేస్తోంది. ఒక్కొక్కరు వారికి నచ్చినట్లు రాసుకున్నారుని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ ఆ క్లీన్ చీట్ ఎవరికీ కనిపించలేదు. చూసేవారికి బిగ్బాస్ కేవలం ఓ ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కావొచ్చు. కానీ నా లైఫ్లో ఈ బిగ్బాస్ షో నాకు పెద్ద ఛాన్స్. మీ మనసుల్లో నాకు గురించి ఎంత తప్పుగా అనుకున్నారో.. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. ఈ షో నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. కానీ మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్బాస్కు వచ్చాను" అంటూ ఫుల్ ఎమోషనలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. 1989లో అక్టోబర్ 10న బెంగళూరులో స్థిరపడిన సింధి కుటుంబంలో జన్మించారు సంజన గల్రానీ. టాలీవుడ్ చిత్రపరిశ్రమతోనే తొలి ఛాన్స్ అందుకున్నారు. 2005లో విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సొగ్గాడులో చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళంలో ఒరు కధల్ సేవిర్లో నటించారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రంతో సంజన గల్రానీ లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.కాగా.. శాండిల్వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో సంజనా గల్రానీ పేరు తైరపైకి వచ్చింది. విచారణకు పిలిచిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలల పాటు ఆమెను జైల్లోనే ఉంచారు.Cleared the blame, now she’s in the game, #SanjanaGalrani is here to claim the fame ❤️🔥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/ZjX4leeZAN— Starmaa (@StarMaa) October 7, 2025 -
ఓటీటీలోకి 'వార్ 2'.. అధికారిక ప్రకటన
ఈ ఏడాది ఎన్టీఆర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా 'వార్ 2'. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో అయితే మరీ ఘోరమైన టాక్ వచ్చింది. హిందీలో ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. గత కొన్నిరోజులుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై పలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడ వాటికి చెక్ పెడుతూ అధికారిక ప్రకటన వెలువడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)'వార్ 2' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు అలా రేపటి(అక్టోబరు 09) నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే వారంనుంచి ఇదే తేదీన రానుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?'వార్ 2' విషయానికొస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని తమ కార్టెల్లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుథ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ టీమ్ రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు, వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్)Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/wkTWTIu0Wu— Netflix India South (@Netflix_INSouth) October 8, 2025 -
అటకెక్కిన ఎన్టీఆర్ రాజమౌళి సినిమా
-
సమంత బ్లాక్ బస్టర్ కంబ్యాక్
-
టాలీవుడ్ లో ధనుష్ డిమాండ్ మామూలుగా లేదుగా
-
కష్టాల్లో జాన్వీ..! ఆశలన్నీ రామ్ చరణ్ పైనే
-
బిగ్బాస్ హౌస్కి తాళం.. గంటల్లోనే మూసేసిన అధికారులు
తెలుగు, తమిళం, హిందీలో ప్రస్తుతం బిగ్బాస్ షో ప్రసారమవుతోంది. కన్నడ సీజన్ మాత్రం మొదలైన పదిరోజులకే క్లోజ్ అయిపోయింది. ఏకంగా ప్రభుత్వ అధికారులు వచ్చి హౌస్కి మంగళవారం తాళం వేశారు. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి విషయం?కన్నడ హీరో సుదీప్.. కన్నడ బిగ్బాస్ 12వ సీజన్కి హోస్టింగ్ చేస్తున్నాడు. గత నెల అంటే సెప్టెంబరు 28న ఆదివారంతో షో మొదలైంది. బెంగళూరుకి దక్షిణాన ఉన్న జాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పార్క్లో హౌస్ సెట్ వేశారు. అయితే హౌస్ నుంచి వచ్చే వ్యర్థాలని బయటకు వదిలేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే పర్యావరణ నియంత్రణ మండలి.. షో నిర్వహకులకు నోటీసులు జారీ చేసింది. వెంటనే బిగ్బాస్ ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డ్ కూడా ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖకు సూచించింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్)ఇక మంగళవారం.. ప్రాంతీయ తహసీల్దార్ నేతృత్వంలో అధికారులు.. బిగ్బాస్ హౌస్ దగ్గరకు వెళ్లారు. తర్వాత పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. గంటలో అందరూ హౌస్ని ఖాళీ చేయాలని హెచ్చరించారు. అయినా సరే లోపలి నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో అధికారులు.. హౌస్కి తాళం వేశారు. ఇక చేసేదేం లేక రాత్రి 8 గంటల తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ నిర్వహకులు.. ఓ థియేటర్కి తరలించారు.అయితే షో మొదలు కాకముందే పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ నిర్వహకులకు అవేం పట్టినట్లు లేవు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే షో ప్రారంభించారు. ఇప్పుడు మొదలైన 10 రోజుల్లో క్లోజ్ అయిపోయింది. మరి ఈ సీజన్ మళ్లీ మొదలవుతుందా లేదంటే ఇక్కడితే ఆపేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. చట్టం ముందు అందరూ సమానమేనని, రెండుసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని అందుకే ఇలా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: Bigg Boss 9: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)VIDEO | Bengaluru: The Bengaluru South district authorities on Tuesday sealed the studio premises hosting the Kannada reality show 'Bigg Boss' in Bidadi following the Karnataka State Pollution Control Board (KSPCB) order. The board had cited serious violations of environmental… pic.twitter.com/E1Ejv8kVo7— Press Trust of India (@PTI_News) October 8, 2025 -
స్టార్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్
రీసెంట్గా 'లోక' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్, అలానే 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి.. బెల్లీ డ్యాన్స్తో అదరగొట్టేశారు. రవి మోహన్ (జయం రవి) హీరోగా చేస్తున్న లేటెస్ట్ తమిళ సినిమా 'జీనీ'. దీని నుంచి అబ్దీ అబ్దీ అంటూ సాగే వీడియో సాంగ్ని తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఇందులో కల్యాణి-కృతి స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.(ఇదీ చదవండి: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటలో హీరో రవి మోహన్ కూడా ఉన్నప్పటికీ కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ తమ డ్యాన్స్ మూమెంట్స్తో తెగ హైలెట్ అయిపోతున్నారు. గతంలో ఇలాంటి పాట ఎక్కడో చూశామే అన్నట్లు అనిపిస్తుంది కానీ చూస్తున్నంతసేపు డ్యాన్ మాత్రం భలే చేశారు కదా అనిపిస్తుంది. 'జీనీ' అర్జునన్ చిత్రానికి అర్జునన్ దర్శకుడు కాగా.. ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్) -
రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి
బిగ్బాస్ షోలో ప్రస్తుతం ఐదోవారం నడుస్తోంది. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. మరోవైపు డేంజర్ జోన్ వల్ల రీతూ చావు తెలివితేటలు చూపించింది. దీంతో బిగ్బాస్ కోపం వచ్చింది. రీతూ చేసిన పనివల్ల మిగతా వాళ్లందరూ బలి అయిపోయారు. ఇంతకీ హౌస్లో 30వ రోజు ఏమేం జరిగింది? ఈసారి నామినేషన్లలో ఉన్నది ఎవరు?మంగళవారం ఎపిసోడ్లో వైల్డ్ కార్ట్ ఎంట్రీల గురించి చెప్పిన బిగ్బాస్.. కెప్టెన్ రాము, ఇమ్మాన్యుయేల్ తప్పితే మిగిలిన వాళ్లంతా డేంజర్లో ఉన్నారు. అయితే ఈ వారం డేంజర్లో ఉన్నవాళ్లకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వచ్చే ఫైర్ స్ట్రామ్ డేంజర్లో ఉన్నవాళ్లని కుదిపేస్తుంది. అదేంటంటే వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ వారం ముగిసేలోపు ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వాళ్లు ఎవిక్షన్ ప్రక్రియ తీసుకొచ్చే ఎప్పుడూ చూడని తీవ్రమైన ఫైర్ స్ట్రామ్ని ఎదుర్కోక తప్పదని చెప్పకనే చెప్పాడు. అంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు.ఇకనుంచి హౌసులో ఓనర్స్, టెనెంట్స్ ఉండరని చెప్పిన బిగ్బాస్.. ఇప్పటినుంచి కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. వాటిలో మంచి ప్రదర్శన చేసి ఎవరైతే పాయింట్స్ తెచ్చుకుంటారో వాళ్లు సేవ్ అవుతారు. అయితే ఈ పోటీల కోసం జంటలుగా విడిపోవాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పాడు. దీంతో పవన్-రీతూ, సంజన-ఫ్లోరా, భరణి-దివ్య, శ్రీజ-సుమన్, కల్యాణ్-తనూజ జట్టుకట్టారు. తొలుత 'పట్టువదలకు' అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఇసుకని తీసుకొచ్చి నచ్చని జట్టు పట్టుకున్న ఓ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇసుక నిండితే బాక్స్ కిందకు తగులుతుంది. అలా తగలకుండా ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్లు గెలిచినట్లు అని బిగ్బాస్ చెప్పాడు. ఈ గేమ్లో పవన్-రీతూ విజయం సాధించారు.అయితే ఇసుక టాస్క్లో భరణికి జంటగా ఉన్న దివ్య.. ఇసుకని తీసుకొచ్చి తనూజ టీమ్ బకెట్లో వేసింది. గేమ్ అయిపోయిన తర్వాత తనూజ హర్ట్ అయిపోయింది. దీంతో భరణి వచ్చి ఆమెని సముదాయించేందుకు తెగ ప్రయత్నించాడు. కానీ వినలేదు. దీంతో ఆమె చెబుతున్నంతసేపు భరణి సైలెంట్గానే ఉండిపోయాడు. రెండో పోటీగా బెలూన్ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా జంటలోని ఓ కంటెస్టెంట్ ఓ బాక్స్లో సూదులతో ఉన్న మాస్క్ పెట్టుకుని తల పెట్టాల్స ఉంటుంది. మరో కంటెస్టెంట్ బెలూన్ని లోపల వేయాలి. బాక్స్ లోపల ఉన్న సభ్యులు ఆ బెలూన్స్ తమ మాస్క్కి ఉన్న నీడిల్స్కి తగిలి పగలకుండా ఉండేలా పైకి ఊదుతూ గాల్లో ఉంచాలి అదే సమయంలో ఆ బెలూన్స్ బాక్స్ నుంచి బయటికి వెళ్లకుండా కూడా చూసుకోవాలని చెప్పాడు.అయితే ఈ పోటీలో రీతూ చావు తెలివితేటలు చూపించింది. పవన్ వెనక బెలూన్ ఉంచేసింది. ఈమెని శ్రీజ, తనూజ టీమ్స్ కూడా అదే ఫాలో అయిపోయారు. దీంతో బిగ్బాస్కి కోపం వచ్చింది. స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి మధ్య తేడా బిగ్బాస్కి చాలా బాగా తెలుసు. మీరు చదివిన స్కూల్కి చదువుతున్న స్కూల్కి ప్రిన్సిపల్ నేను. కానీ అత్యంత పేలవమైన ఆట ఇది. ఆట స్ఫూర్తికే విరుద్ధం అని ఏకిపారేశాడు. ఈ క్రమంలో ఈ గేమ్లో ఆడిన సంజన-ఫ్లోరాకి తప్పితే మిగిలిన వాళ్లందరూ ఉన్న పాయింట్లలో సగం కట్ చేసి పడేశాడు. దీంతో గేమ్ ఆడినా సరే పాయింట్ల్ రాలేదే అని సంజన ఏడ్చేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్, దివ్య, రీతూ డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. -
కాంతార 2 దెబ్బ.. కేజీఎఫ్ 2 రికార్డ్స్ గల్లంతు..!
-
హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఒక దానిలో ఉన్న మూవీస్.. మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ డబ్బింగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. పెళ్లికి ముందే తొందరపడి పేరెంట్స్ అయిన ఓ జంట.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే పాయింట్తో ఎమోషనల్ గా తీసిన ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)2023లో తమిళంలో 'డాడా' టైటిల్తో ఓ సినిమా రిలీజైంది. హిట్ అయింది. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ ఏడాది జూన్లో 'పాపా' పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కాకపోతే డబ్బింగ్ బొమ్మ కావడం వల్ల ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే జూలై చివరలో ఆహా ఓటీటీలోకి వచ్చింది. తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'పాపా' విషయానికొస్తే.. మణికంఠ (కవిన్), సింధు (అపర్ణ) క్లాస్మేట్స్. వీళ్ల మధ్య మొదలైన స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. అయితే కాస్త తొందరపడేసరికి పెళ్లికి ముందే మణి వల్ల సింధు గర్భం దాల్చుతుంది. ఆ విషయం తెలిసిన కుటుంబ పెద్దలు వీళ్లని దూరం పెడతారు. దీంతో మణి- సింధు ఓ అద్దె ఇంట్లో ఉంటూ చదువు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? జన్మనిచ్చిన వెంటనే బిడ్డను వదిలేసి సింధు ఎందుకు వెళ్లిపోయింది? ఆ చిన్నారిని పెంచేందుకు మణి ఎంతగా కష్టపడ్డాడు? మణి జీవితంలోకి మళ్లీ సింధు వచ్చిందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్) -
'డ్రాగన్' తెచ్చిన లక్.. కాయదు లోహర్కి మరో ఛాన్స్!
హీరోయిన్లకు మొదట ఒకే ఒక్క ఛాన్స్ వస్తుంది. అదృష్టం కలిసొచ్చి ఆ మూవీ హిట్ అయితే తర్వాత అవకాశాలు వెల్లువలా వస్తాయి. కాయదు లోహార్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2021లో కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ 'అల్లూరి' అనే మూవీ చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గతేడాది తమిళంలో వచ్చిన 'డ్రాగన్'.. ఈమె కెరీర్ని మలుపు తిప్పేసింది. దీంతో ప్రస్తుతం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)తమిళంలో ఇదయం మురళి అనే సినిమా చేయగా.. ఇది విడుదలకు సిద్ధమైంది. తెలుగులోనూ విశ్వక్ సేన్ 'ఫంకీ'లో ఈమెనే హీరోయిన్. ఇప్పుడు తమిళంలో విశాల్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు సుందర్.సి-విశాల్ కాంబోలో ఈ ఏడాది 'మదగజరాజా' వచ్చింది. హిట్ అయింది. దీంతో ఇప్పుడు రిపీట్ కాబోతున్న కాంబోలోకి కాయదు వచ్చి చేరినట్లు తెలుస్తోంది.సుందర్.సి చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుంది. అలానే ఒకరికి మించి హీరోయిన్లు ఉంటారు. గ్లామర్ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. త్వరలో విశాల్ హీరోగా తీయబోయే సినిమాలో ఇద్దరు బ్యూటీస్కి చోటు ఉంది. అందులో ఒక హీరోయిన్గా కాయదు లోహర్ని ఎంపిక చేసినట్లు సమాచారం. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: పవన్ సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. నేను ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి) -
వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ
హీరో విజయ్ దేవరకొండ రీసెంట్గానే రష్మికతో నిశ్చితార్థం చేసుకున్నాడని టాక్. ఇది నిజమే అయినప్పటికీ బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారు. అయితే ఇది జరిగిన వెంటనే విజయ్.. తల్లి, తమ్ముడు ఆనంద్తో కలిసి పుట్టపర్తి సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఒకటి రెండు ఫొటోలతో ఈ విషయం కూడా బయటపడింది. అయితే ఇప్పుడు ఆ ట్రిప్ వీడియోని స్వయంగా విజయ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.పుట్టపర్తి వెళ్లడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన విజయ్ దేవరకొండ.. తను మొదట చేరిన '1ఏ' క్లాస్ రూమ్.. వేదాలు, మంత్రాలు, భజనలు నేర్చుకున్న మందిరం.. గతంలో తనలా ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు... నా రూమ్ బీ-13 మధ్యలో కప్ బోర్డ్ నాదే.. మమ్మల్ని సక్రమమైన దారిలో నడిపించిన సార్స్.. అంటూ 20 ఏళ్ల తన జ్ఞాపకాల్ని వీడియో రూపంలో పొందుపరిచి ఇన్ స్టాలో వీడియోగా పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: పవన్ సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. ఆ రోల్కు ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి)విజయ్ దేవరకొండ ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సడన్గా పుట్టపర్తి దర్శనం చేసుకోవాల్సిన అవసరం విజయ్ దేవరకొండకు అయితే లేదు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లాడంటే కచ్చితంగా నిశ్చితార్థం జరిగిన తర్వాత సాయిబాబా ఆశీర్వదాలు తీసుకోవడానికేనని రౌడీ హీరో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.అయితే పుట్టపర్తి దర్శనానంతరం.. విజయ్ ప్రయాణిస్తున్న కారు ఓ చోట ప్రమాదానికి గురైంది. అయితే ఈ యాక్సిడెంట్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా ఇప్పుడు విజయ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: 80'స్ రీ యూనియన్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
యూరప్లో ఫ్యామిలీ డ్రామా
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్లోని ఈ 46వ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, రవీనా టాండన్, రాధికా శరత్కుమార్ ఇతరపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల యూరప్లో మొదలు పెట్టారట. సూర్యతోపాటుగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్ టాక్.ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్. -
ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం: నీరజ కోన
‘‘స్కూల్ డేస్ నుంచే నాకు రైటింగ్ అంటే ఇష్టం. కథలు చెప్పడం ఇంకా ఇష్టం. అలా కొన్ని కథలు రాసుకున్నాను. నా స్నేహితులు రానా, నాని వంటివారు బాగా సపోర్ట్ చేశారు. ఒక దశలో సినిమా కథ రాయగలననే నమ్మకం కలిగింది. అలా రాసుకున్న కథే ఈ ‘తెలుసు కదా’’ అని అన్నారు నీరజ కోన. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ఆమె పంచుకున్న విశేషాలు...⇒ ‘తెలుసు కదా’ మంచి ప్రేమ కథా చిత్రం. ప్రేమకథతోపాటు ఒక కాంప్లెక్స్ సిటీ కూడా ఉంది. నేను మహిళా దర్శకురాలిని కనుక ఈ సినిమా కథను మహిళా దృష్టి కోణంలో చెప్పలేదు. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ఫస్ట్ సిట్టింగ్లోనే నా కథను సిద్ధు జొన్నలగడ్డ ఓకే చేయడం, దర్శకురాలిగా నాకు అవకాశం రావడం నా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్. ⇒ సిద్ధుపై టిల్లు క్యారెక్టర్ షాడో ఉండొచ్చు. కానీ, తను మంచి పెర్ఫార్మర్. ఈ సినిమాలో స్క్రీన్ పై తను పోషించిన వరుణ్పాత్రని మాత్రమే ఆడియన్స్ చూస్తారు. కథలో కాంప్లెక్స్గా ఉండే రాగపాత్ర కోసం శ్రీనిధిని తీసుకున్నాం. మెచ్యూర్డ్ క్యారెక్టర్ అంజలిపాత్రకి రాశి సరిపోయారు. టీజీ విశ్వప్రసాద్గారు లేకపోతే ఈ సినిమాయే లేదు. ఈ సినిమా ప్రయాణంలో కృతీ ప్రసాద్తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ బ్యాక్ బోన్ .⇒ నేను ఏ సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయలేదు. కానీ, కాస్ట్యూమ్ డిజైనర్గా 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా కెరీర్ స్టార్టింగ్లోనే ఎన్టీఆర్, రామ్చరణ్, రవితేజ, విజయ్, సూర్య వంటి టాప్ హీరోలు చేసిన సినిమాలకు పని చేశాను. అదే నా లెర్నింగ్ స్కూల్, ఎక్స్పీరియన్స్. ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం. ఇప్పటికీ నేను ప్రతిదీ నా తొలి సినిమా అన్నట్లుగా భయం, టెన్షన్ తో పనిచేస్తుంటాను. దర్శకురాలిగా నా తర్వాతి చిత్రం కూడా లవ్స్టోరీనే. త్వరలోనే వివరాలు చెబుతాను. -
శింబు @ అరసన్
హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాకు ‘అరసన్ ’ అనే టైటిల్ని ఖరారు చేశారు. కలైపులి ఎస్. థాను నిర్మించనున్న ఈ మూవీ టైటిల్ను మంగళవారం ప్రకటించారు. ‘అరసన్ ’ కథ నార్త్ చెన్నై నేపథ్యంతో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా అని టాక్. ఈ నెలలోనే రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.శింబు కెరీర్లోని ఈ 49వ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత, సాయిపల్లవి, రుక్మిణీ వసంత్లను సంప్రదించాలనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తార ని కోలీవుడ్ టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కిరణ అబ్బవరం కె ర్యాంప్.. మరో సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
29 ఏళ్ల నిన్నే పెళ్లాడతా.. ఫ్యాన్స్ వీడియో వైరల్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన కల్ట్ మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జునే నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ రిలీజై అక్టోబర్ 4వ తేదీ నాటికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన టబు హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.ఈ చిత్రం విడుదలైన 29 ఏళ్లు పూర్తి కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాలోని పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. ఏటో వెళ్లిపోయింది మనసు.. ఎలా ఒంటరైంది మనసు.. ఓ చల్లగాలి..ఆచూకి తీసి.. కబురివ్వలేవా ఏమైయిందో.. అంటూ సాగే పాట పాడుతూ చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నాగ్ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. అభిమానుల శక్తి అద్భుతం.. ఫ్యాన్స్ కలిసి వచ్చినప్పుడు నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.The power of fandom is incredible, and when fans come together, it's truly a special experience! 👏Cult King Fan's at one frame 😍 .@iamnagarjuna ❤️ 😍 💖 #29YearsForNinnePelladutha ❤️#KingNagarjunaForver ❤️ 😍 💖 #King100 🔥 🔥 pic.twitter.com/M22sNnl0kZ— NagaKiran Akkineni (@NagaKiran60) October 7, 2025 -
తెలుగు సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. ఆ రోల్కు ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్లా రెడ్డి గురించి తెలియనివారు ఉండరు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తనలోని కళామతల్లిని బయట పెడుతుంటారు. ఏదైనా ఈవెంట్స్కు వెళ్లినప్పుడు డ్యాన్స్తోనూ అలరిస్తూ సందడి చేస్తుంటారు. మల్లా రెడ్డి యూనివర్సిటీలో సినిమా ఈవెంట్స్ జరిగితే తనలో టాలెంట్ను ఒక్కసారిగా బయటికి తీసుకొస్తారు. అందుకే మల్లారెడ్డి అంటే కేవలం రాజకీయ నాయకుడే కాదు..కళాకారుడిగా కూడా ఆయనకు పేరు ఉంది.అయితే ఇటీవల దసరా సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లారెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తనకు టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమాలో విలన్ పాత్రను ఆఫర్ చేశాడని చెప్పారు. ఆ రోల్ కోసం మా కాలేజీకి వచ్చి ఒక గంటసేపు వెయిట్ చేశాడని తెలిపారు. అంతేకాకుండా రూ.3 కోట్ల పారితోషికం కూడా ఆఫర్ చేశాడని వెల్లడించారు. అయినా కూడా నేను ఆ పాత్రను ఒప్పుకోలేదని మల్లారెడ్డి వివరించారు. విలన్గా చేస్తే ఇంటర్వెల్దాకా నేను హీరోను కొడతా.. ఆ తర్వాత హీరో నన్ను కొడతాడు.. తిడతాడు అంటూ హాస్యంగా మాట్లాడారు. ఈ కామెంట్స్ కాస్తా నెట్టింట వైరల్గా మారాయి. -
రాజమౌళి 'బాహుబలి ది ఎపిక్'.. వామ్మో అంత రన్ టైమ్?
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ (Baahubali: The Epic) పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా రన్ టైమ్ గురించి తెగ చర్చ నడుస్తోంది. రెండు పార్ట్స్ ఓకేసారి కావడంతో నిడివిపై ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత శోభు యార్లగడ్డ రన్ టైమ్ గురించి మాట్లాడారు.బాహుబలి: ది ఎపిక్ మూవీ రన్టైమ్ 3 గంటల 40 నిమిషాలని నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించారు. బాహుబలి 1 ముగిశాక ఇంటర్వెల్..ఆ తర్వాత ‘బాహుబలి 2 ఉంటుందని తెలిరపారు. దాన వీర శూర కర్ణ (3 గంటల 46 నిమిషాలు) తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాల జాబితాలో బాహుబలి: ది ఎపిక్ చేరనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ సర్ప్రైజ్ కూడా ఉంటుందని తెలిపారు. బాహుబలి డాక్యుమెంటరీ ఈ ఏడాది చివరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ రావొచ్చని కూడా తెలిపారు. -
జాతి రత్నాలు-2 చేస్తే నటిస్తారా?.. ప్రియదర్శి సమాధానం ఇదే!
ప్రియదర్శి పులికొండ, నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం జాతి రత్నాలు. ఈ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. అప్పట్లో ఓవర్సీస్లోనూ వన్ మిలియన్ డాలర్ల మార్క్ను దాటిన చిత్రంగా ఘనత సాధించింది.తాజాగా ప్రియదర్శి మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిత్రమండలి సినిమాతో మరోసారి జాతిరత్నాల్లాంటి ఎంటర్టైన్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ట్రైలర్ విడుదల చేయగా విపరీతంగా నవ్వులు తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి జాతిరత్నాలు సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఆ టైమ్లో వచ్చిన జాతి రత్నాలు ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యిందని ప్రియదర్శి అన్నారు. జాతిరత్నాలు సినిమాకు, మిత్రమండలికి చాలా వేరియషన్ ఉంటుందన్నారు. ఒకవేళ ఇప్పుడు కనుగ జాతిరత్నాలు-2 తీస్తే నేను మాత్రం అస్సలు చేయనని ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాంటి క్లాసిక్ సినిమాను మళ్లీ తీయొచ్చేమో కానీ.. నేను మాత్రం నటించనని స్పష్టం చేశారు.కాగా.. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియదర్శితో పాటు విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన మిత్రమండలి అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది. -
80'స్ రీ యూనియన్.. వీడియో వైరల్
1980ల్లో దక్షిణాది భాషల్లో హీరోహీరోయిన్లుగా నటించిన స్టార్స్.. ప్రతి ఏడాది ఒక్కచోటకు చేరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా చెన్నైలో రీయూనియన్ జరిగింది. రెండు రోజుల క్రితం ఫొటోలు బయటకు రాగా ఇప్పుడు వీడియో బయటకొచ్చింది. అందరూ దీన్ని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇది 12వ రీ యూనియన్ అని నటుడు నరేశ్ పోస్ట్ పెట్టాడు. ఈ ఏడాది వీరంతా చిరుత థీమ్ని ఎంచుకున్నారు. చిరుత థీమ్లో దుస్తులు ధరించి సందడి చేశారు. చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్కుమార్ సేతుపతి, నరేశ్, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభన తదితరులు ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఆడిపాడుతూ కనిపించారు.All about 80’s Reunion ❤️ pic.twitter.com/U0yUq9NbAP— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) October 7, 2025 -
బాహుబలి ప్రభాస్ కోసం కాదు.. ఆ హీరో కోసమే.. నిర్మాత ఏమన్నారంటే?
టాలీవుడ్ ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన డైరెక్షన్లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 చిత్రాలు తెలుగు సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లాయి. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్ ఘనతను సాధించింది. తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి.. మరోసారి బాహుబలిని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు పార్ట్లను కలిసి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాలా రోజులుగా వైరలవుతోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. బాహుబలి చిత్రానికి మొదట అనుకున్నది ప్రభాస్ను కాదని.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అని గతంలో చాలాసార్లు రూమర్స్ వచ్చారు. ఈ వార్తలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. బాహుబలిలో ప్రభాస్ పాత్ర కోసం మేము హృతిక్ను సంప్రదించినట్లు ఆన్లైన్లో వచ్చిన వార్తలు విన్నానని అన్నారు.అయితే అవన్నీ కేవలం ఊహగానాలేనని కొట్టిపారేశారు. ఈ సినిమాను కేవలం ప్రభాస్ కోసమే సిద్ధం చేశామని శోభు వెల్లడించారు. ఈ పాత్ర మొదటి నుంచి ప్రభాస్ను దృష్టిలో ఉంచుకుని రాశారని తెలిపారు. ఇతర నటులు ఎవరికీ కూడా ఆడిషన్లు నిర్వహించలేదని అన్నారు. ఆ పాత్రకు హృతిక్ రోషన్ కోసం సంప్రదిచారని చాలా కాలంగా వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టారు నిర్మాత యార్లగడ్డ.హృతిక్పై రాజమౌళి వివాదాస్పద కామెంట్స్..కాగా.. బాహుబలి దర్శకుడు రాజమౌళి హృతిక్ రోషన్ పట్ల 2009లో చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ తెరకెక్కించిన బిల్లా సినిమాను ప్రమోట్ చేస్తున్న కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు. ధూమ్ -2 రెండేళ్ల క్రితం విడుదలైనప్పుడు బాలీవుడ్ మాత్రమే ఇలాంటి నాణ్యమైన సినిమాలు ఎందుకు చేయగలదా? అని ఆశ్చర్యపోయానని అన్నారు. మనకు హృతిక్ రోషన్ లాంటి హీరోలు లేరా? బిల్లా పాటలు, పోస్టర్, ట్రైలర్ చూశా.. నేను ఒక్క విషయం మాత్రమే చెప్పగలను.. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ అసలు ఏం కూడా కాదు. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినందుకు మెహర్ రమేష్ (దర్శకుడు)కి కృతజ్ఞతలు అంటూ రాజమౌళి మాట్లాడారు. ఈ కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత నా ఉద్దేశ్యం అతన్ని ఎప్పుడూ కించపరచడం కాదని.. హృతిక్ రోషన్ను చాలా గౌరవిస్తానని అన్నారు. -
పెళ్లి కూతురిలా అపర్ణ.. చేతులకు పారాణితో మౌనీ
చేతులకు పారాణితో లెహంగాలో మౌనీ రాయ్పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ అపర్ణ దాస్ఒంటరిగా దాండియా ఆడేస్తూ ప్రియా వారియర్క్యారవాన్ ఫన్ మూమెంట్స్తో మృణాల్ ఠాకుర్పారిస్ దేశంలో విహారయాత్రలో అనన్య పాండేసముద్రం, ఆకాశాన్ని గుర్తుచేస్తున్న అనుపమ డ్రస్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) -
ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీల్లోకి ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు థియేటర్లలో కాకుండా నేరుగా కొన్ని మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు థ్రిల్లర్ సిరీస్ డిజిటల్గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సిరీస్? ఎందులోకి రానుంది?రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తీశారు. ఇది ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రెక్కీ, విరాటపాలెం తదితర సిరీసులు తీసిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని నిర్మించింది. పోలూరు కృష్ణ దర్శకుడు. రాజీవ్ కనకాల తండ్రిగా చేయనుండగా.. అతడి కూతురు స్వాతిగా వాసంతిక నటించింది. ఉదయభాను పోలీస్ పాత్రలో కనిపించనుంది.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్లో తండ్రైన రాజీవ్ కనకాల.. కనిపించకుండా పోయిన తన కూతురు స్వాతి కోసం వెతుకుతుంటాడు. తండ్రికి ఏం చేయాలో తెలియక అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు తెలిసే రహస్యాలు, మోసాలు వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం మధ్య ఉండే సన్నని సరిహద్దులు కనిపించకుండా పోతాయి. బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణమే అసలు స్టోరీ.ఇకపోతే ఈ వారం 20కి పైగా కొత్త చిత్రాలు, సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో తేజా సజ్జా 'మిరాయ్', 'త్రిబాణధారి బార్బరిక్', ఎన్టీఆర్ 'వార్ 2', లీగల్లీ వీర్ అనే తెలుగు మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ తెలుగు డబ్బింగ్ సిరీస్ కూడా ఈ వీకెండ్లోనే అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా శుక్రవారం నాడు ఏమైనా సడన్ సర్ప్రైజ్ ఉండొచ్చు! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
తమిళంలో ఇచ్చేది అంతే.. తెలుగులో ఎందుకింత డిమాండ్..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవలే ఇడ్లీ కడాయి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీని తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాతే కాంతార థియేటర్లలోకి రావడంతో ఇడ్లీ కొట్టును ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.అయినప్పటికీ కోలీవుడ్ హీరో ధనుశ్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా తెలుగులోనూ ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ టాలీవుడ్ డైరెక్టర్, నిర్మాతతో కలిసి ధనుశ్తో ఓమూవీ చేసేందుకు సంప్రదించారట. ఆయనను కలిసి కథ కూడా వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథ విన్న ధనుశ్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ప్రస్తుతం టాలీవుడ్లో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. తమిళంలో ధనుశ్కు ఇచ్చేది కేవలం రూ.35 కోట్లలోపే రెమ్యునరేషన్ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది తెలుగులో రూ.50 కోట్లు డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ధనుశ్ను ఎవరు కలిశారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. -
కాంతార చాప్టర్-1.. 90 శాతం అక్కడే పూర్తి చేశాం: రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్-1. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. కర్ణాటకలోని ప్రాచీన కళ భూతకోల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తకర విషయం బయటకొచ్చింది. ఈ మూవీ షూటింగ్ రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలోనే తెరకెక్కించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 90 శాతం ఎడిటింగ్ తన ఊర్లోనే పూర్తి చేశామని రిషబ్ శెట్టి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. కాగా.. కర్ణాటకలోని ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, జానపద కథ నిర్మాణం కోసం రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోనే ఎక్కువగా ఈ మూవీని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.రిషబ్ శెట్టి మాట్లాడుతూ..'ఈ సినిమా దాదాపు 90 శాతం పోస్ట్, ప్రొడక్షన్ పనులన్నీ మా సొంత గ్రామంలోనే జరిగాయి. మేము కేవలం మిగిలిన పదిశాతం పనికోసమే బెంగళూరు, కొచ్చికి వచ్చాం. ఈ సినిమా కోసం ఏకంగా సంగీత దర్శకుడిని కూడా గ్రామానికి తీసుకువచ్చి అక్కడే మొత్తం రికార్డింగ్ పూర్తి చేశాం. సినిమా ఎడిటింగ్లో దాదాపు 90 శాతం మా గ్రామంలోనే జరిగింది. మా గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున షూటింగ్ వద్దకు రావడంతో ఒకరకంగా ఫిల్మ్ టౌన్గా మారిపోయింది. ప్రతి రోజు కనీసం 100 వాహనాలు షూటింగ్కు వచ్చేవి. దాదాపు ప్రతి రోజు వెయ్యిమందిని సెట్లో ఉంచాం. కాంతార కోసమే నేను, నా భార్య, పిల్లలతో కలిసి నా స్వగ్రామానికి వెళ్లా' అని అన్నారు.కాగా.. కాంతార: చాప్టర్ 1 కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
శ్రీలీల-భాగ్యశ్రీ.. ఆ లక్కీ హీరోయిన్ ఎవరు?
రీసెంట్ టైంలో కంటెంట్ లేదా భారీతనం ఉంటేనే ఆయా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగానే ఉన్నారు. మరోవైపు పలు నిర్మాణ సంస్థలు కంటెంట్ ఉండే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తీసేందుకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. ఇప్పుడు అలా అనుకున్న ప్రాజెక్ట్ కోసం రేసులో ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయట.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)'మహానటి', 'సీతారామం', 'కల్కి' చిత్రాలతో మళ్లీ పుంజుకున్న వైజయంతీ మూవీస్.. తాజాగా 'చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇదో ఫిమేల్ సబ్జెక్ట్ అని, అయితే లీడ్ రోల్ కోసం శ్రీలీల లేదా భాగ్యశ్రీ బోర్సే పేర్లు పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. తండ్రి కూతురు బ్యాక్ డ్రాప్ ఎమోషన్లతో ఈ మూవీ తీయబోతున్నారనే తెలుస్తోంది.ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల, భాగ్యశ్రీ ఉన్నారు. కమర్షియల్ సినిమాల్లో వీళ్ల యాక్టింగ్పై చిన్నపాటి కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. వీళ్లని మెయిన్ లీడ్గా పెట్టి ఓ మూవీ అంటే ఏదో డిఫరెంట్గానే ట్రై చేస్తున్నారా అనిపిస్తుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటనతో పాటు హీరోయిన్ ఎవరనేది కన్ఫర్మ్ అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఎంటర్టైనింగ్గా 'మిత్రమండలి' ట్రైలర్) -
ఎంటర్టైనింగ్గా 'మిత్రమండలి' ట్రైలర్
ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మిత్రమండలి'. అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది. కొన్నాళ్ల క్రితం రిలీజైన టీజర్, పాటలు ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. నిర్మాత బన్నీ వాస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)ట్రైలర్ చూస్తుంటే ఫన్నీగా ఉంది. 'జాతిరత్నాలు' తరహాలో నవ్వించడమే మూవీ టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించారు. వెన్నెల కిశోర్, సత్య తదితరులు కూడా కామెడీతో నవ్వించేలా కనిపిస్తున్నారు. దీపావళి బరిలో 'మిత్రమండలి'తో పాటు కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్', సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. బిగ్బాస్లోకి టీమిండియా స్టార్ బౌలర్?) -
సాయి పల్లవితో ఆ పాట.. శోభిత నాతో మాట్లాడలేదు : నాగ చైతన్య
నాగ చైతన్య(Naga Chaitanya) కెరీర్లో అత్యధిక వసూళ్ల(రూ. 100 కోట్లు)ను సాధించిన చిత్రం ‘తండేల్’. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రిలీజైన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ విజయంలో పాటలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బుజ్జితల్లి పాట రిలీజ్కి ముందే సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. మొన్నటి వరకు ఏ ఈవెంట్లో చూసినా ఈ పాట వినిపించేంది. సినిమా రిలీజ్ తర్వాత కూడా ఈ పాట గురించే ఎక్కువగా చర్చించారు. అంత సూపర్ హిట్గా నిలిచిన ఈ పాట.. నాగ చైతన్యకు మాత్రం కాస్త ఇబ్బందినే కలిగించిందట. ఈ పాట కారణంగా తన సతీమణి శోభిత(sobhita dhulipala) కొన్నాళ్లపాటు మాట కూడా మాట్లాడలేదట. ఈ విషయాన్ని స్వయంగా నాగ చైతన్యనే చెప్పారు. తాజాగా ఆయన జగపతి బాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘బుజ్జితల్లి’ పాట వెనుక జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ని షేర్ చేసుకున్నాడు.‘శోభితను నేను ముద్దుగా బుజ్జితల్లి అని పిలుస్తాను. అయితే ఈ పేరునే తండేల్లో చిత్రంలో సాయి పల్లవికి పెట్టడం.. బుజ్జితల్లిపై పాట కూడా రావడంతో శోభిత అప్సెట్ అయింది. కోపంతో కొన్నాళ్ల పాటు నాతో మాట్లాడలేదు. ఆ పేరుని నేనే దర్శకుడికి సూచించానని ఆమె అనుకుంది. కానీ నేనెందుకు అలా చేస్తా? అని నవ్వుతూ చెప్పాడు చైతన్య. ఇక భార్యభర్తల సంబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఈ ప్రపంచంలో గొడవ పడని జంటలు ఉండవు. ఇద్దరి మధ్య గొడవే జరగలేదంటే..వారి రిలేషన్షిప్ నిజమైనది కాదని అర్థం’ అని చెప్పుకొచ్చాడు.నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'జయం మనదేరా'కు 25 ఏళ్లు.. 'థమ్స్ అప్'తో ఉన్న లింక్ ఏంటో తెలుసా?
కులం కోసం కాదు... మనుషుల కోసం పోరాటం...! అనే మెసేజ్ ఇచ్చిన 'జయం మనదేరా' చిత్రానికి 25 ఏళ్లు. ఈ మూవీతో కులాల మధ్య అంతరాన్ని తగ్గించే మెసేజ్ ఓరియెంటెడ్ కథతో వెంకటేష్ మెప్పించారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై నేటికి 25 సంవత్సరాలు పూర్తి అయింది. ఇందులో వెంకటేశ్ ద్విపాత్రాభినయంలో కనిపించగా భానుప్రియ, సౌందర్య కథానాయికలుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్పై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.2000లో విడుదలై సూపర్ డూపర్ హిట్గా 'జయం మనదేరా' నిలిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డులను పొందింది. వెంకటేష్ కెరీర్లో ఒక మైలురాయిగా ఈ మూవీ నిలవడమే కాకుండా.. ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో వెంకటేష్.. మహదేవ నాయుడు, అభిరాం అనే రెండు పాత్రలు పోషించారు. అప్పట్లో ఇదో మాస్ సినిమాగా ప్రేక్షకులు ఆదరించారు.'జయం మనదేరా' మూవీ రూ. 16 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టి 2000 సంవత్సరంలో రెండోవ అతిపెద్ద గ్రాసర్గా నిలిచింది. నైజాం ప్రాంతంలో ఆల్-టైమ్ మొదటి వారం రికార్డును క్రియేట్ చేయడమే కాకుండా.. చిరంజీవి నటించిన అన్నయ్య కలెక్షన్స్ను కూడా అధిగమించింది. అదే సంవత్సరం సంక్రాంతికి విడుదలైన (కలిసుందం రా) 18 కోట్ల షేర్తో ఆల్-టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. జయం మనదేరా చిత్రం 149 కేంద్రాలలో 114 ప్రింట్లతో విడుదల కాగా... 120 కేంద్రాల్లో 50 రోజులు, 33 కేంద్రాల్లో 100 రోజుల పాటు ప్రదర్శించారు. అలా 2000 సంవత్సరం వెంకటేష్కు ఇది గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు.అయితే, ఈ సినిమాకు బ్రాండ్ ప్రమోషన్గా థమ్స్ అప్ కంపెనీ కొనసాగింది. సినిమా కోసం బ్రాండ్ ప్రమోషన్గా ఒక కంపెనీ నిలవడం అనేది ఇక్కడి నుంచే మొదలైంది. అందుకోసం ఆ కంపెనీ రూ.80 లక్షలు చెల్లించింది. ఆ డబ్బుతోనే ఈ సినిమా నిర్మించేందుకు కాస్త ఉపయోగపడిందని చెబుతారు. ఇది అప్పట్లో ఒక వ్యూహాత్మక నిర్ణయంగా నిలిచింది. ఈ మూవీ షూటింగ్ యూరప్లో 25 రోజులు కొనసాగింది. ఆపై రెండు పాటలను యునైటెడ్ స్టేట్స్లో చిత్రీకరించారు. ఇలా ఇతర దేశాల్లో షూటింగ్ జరగడం ఆరోజుల్లో కాస్త అరుదుగానే జరిగేది. -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనిపిస్తోంది. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. రెండు నెలల క్రితం అంటే ఆగస్టులో హరిణ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే ఈ విషయంలో సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో అందరూ షాకయ్యారు. ఇప్పుడు పెళ్లి పనులు కూడా మొదలైపోయాయా అనే సందేహం కలుగుతోంది. తాజాగా రాహుల్, హరిణ్య కలిసి బ్యాచిలర్ పార్టీ లాంటిది సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. బిగ్బాస్లోకి టీమిండియా స్టార్ బౌలర్?)హరిణ్య కూడా కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. బిగ్బాస్ షోలో రాహుల్ పార్టిసిపేట్ చేసిన టైంలో వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందట. అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. రీసెంట్గా ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పడు హరిణ్య ఫ్రెండ్ ఇంటిలో చిన్నపాటి పార్టీ జరిగింది. అయితే ఇది బ్యాచిలర్ పార్టీనా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోని హరిణ్య.. తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. వీడియో చూస్తుంటే ఈనెలలోనే రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి జరగనుందేమో అనిపిస్తుంది.రాహుల్ సిప్లిగంజ్ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఇతడు మాస్ సాంగ్స్ పాడటంలో స్పెషలిస్ట్. ఇప్పటికే 'కాలేజ్ బుల్లోడా', 'వాస్తు బాగుందే', 'రంగా రంగా రంగస్థలానా', 'బొమ్మోలే ఉన్నదిరా పోరి' లాంటి సినిమా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. బోనాలు, వినాయక చవితి ఆల్బమ్ సాంగ్స్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ అందించిన నాటు నాటు పాటలోనూ ఓ గొంతు ఇతడిదే. రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.కోటి నజరానా కూడా అందుకున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
సర్ప్రైజ్.. బిగ్బాస్లోకి టీమిండియా స్టార్ బౌలర్?
బిగ్బాస్ షో హడావుడి ప్రస్తుతం నడుస్తోంది. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ అవుతోంది. హిందీలోనూ కొన్ని వారాల క్రితమే 19వ సీజన్ మొదలైంది. అయితే లేటెస్ట్గా రిలీజ్ చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ వస్తున్నట్లు చూపించారు. దీంతో చాలామంది షాకయ్యారు. తీరా చూస్తే ఇతడి సోదరి మాలతి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ మాలతి సంగతేంటి?ఉత్తరప్రదేశ్కి చెందిన దీపక్ చాహర్.. ఐపీఎల్లో చెన్నై జట్టుకి ఆడినప్పుడు చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై టీమ్కి ఆడుతున్నాడు. అయితే లేటెస్ట్గా ప్రసారమైన హిందీ బిగ్బాస్ వీకెండ్ ఎపిసోడ్లో తొలుత ఇతడు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తన సోదరిని సపోర్ట్ చేసేందుకు వచ్చానని చెప్పడంతో రిలాక్స్ అయ్యారు.(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా మాలతి చాహర్.. బిగ్బాస్ 19లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు దీపక్ చాహర్ అక్కగా తనకు గుర్తింపు ఉందని, ఈ షోలో ఆడి సొంత గుర్తింపు తెచ్చుకోవాలనేది తన ప్రయత్నమని చెప్పుకొచ్చింది. మాలతి విషయానికొస్తే.. ఇంజనీరింగ్ చదివినప్పటికీ మోడలింగ్ వైపు వచ్చింది. పలు ఫ్యాషన్ పోటీల్లోనూ పాల్గొంది. 2014లో ఫెమినా మిస్ ఇండియా ఢిల్లీ రెండో రన్నరప్గా నిలిచింది. అయితే 2019లో ఐపీఎల్ సందర్భంగా చెన్నై జట్టుకు చీర్స్ చెబుతూ కెమెరా కంటపడి సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది.2018లో 'జీనియస్' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సదా వియా హోజీ, మా ఓ మేరీ మా తదితర చిత్రాల్లోనూ నటించింది. ఓవైపు నటిస్తూనే మరోవైపు దర్శకత్వం, నిర్మాణ రంగల్లోనూ ప్రవేశించింది. 'ఓ మారీ' అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. ఇన్ స్టాలోనూ ఈమెకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మరి బిగ్బాస్ షోతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?) View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality) -
'బిగ్బాస్' షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు
ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ కన్నడకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ షూటింగ్ ఆపేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నోటీసు జారీ చేసింది. బెంగళూరు శివార్లలోని బిడడి హోబ్లిలోని జాలీవుడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్లో బిగ్బాస్ సెట్ ఉన్న విషయం తెలిసిందే.కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతున్న ప్రకారం.. బిగ్బాస్ హౌస్ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని సైట్ వెలుపల విడుదల చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. బిగ్బాస్ సెట్ దగ్గరలో 250 KLD-సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) ఏర్పాటు చేసినట్లు నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ, ఆ సదుపాయంలో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని.. STP యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు గుర్తించారు.అధికారుల తనిఖీలో చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది. ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్లు, ఇతర డిస్పోజబుల్స్ వంటి వ్యర్థాలు అన్నీ బహిరంగంగానే వేశారని చెబుతున్నారు. అదనంగా, 625 kVA, 500 kVA సామర్థ్యం గల రెండు డీజిల్ జనరేటర్ సెట్లు అక్కడ ఏర్పాటు చేశారని తేలింది. ఇది మరింత పర్యావరణ ఆందోళనలను రేకెత్తిస్తోందని చెప్పారు. దీంతో వెంటనే బిగ్బాస్ షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖను సూచించింది.బిగ్ బాస్ కన్నడ సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. కిచ్చా సుదీప్ హోస్ట్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడంతో సోషల్మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. -
గుడ్న్యూస్ చెప్పిన 'కోయిలమ్మ' జంట
టాలీవుడ్ నటుడు సాయికిరణ్ తండ్రి కాబోతున్నాడు. ఇదే విషయాన్ని చెబుతూ సోషల్మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు. తెలుగులో 'నువ్వే కావాలి', 'ప్రేమించు' సినిమాల్లో నటించిన సాయికిరణ్.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్తో బిజీగా ఉన్నాడు. 'కోయిలమ్మ', 'గుప్పెడంత మనసు' తదితర సీరియల్స్తో బుల్లితెరపై మరింత గుర్తింపు పొందాడు. అయితే, గతేడాది డిసెంబర్లో తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.సాయికిరణ్, స్రవంతి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడంతో వారి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. దిగ్గజ గాయని పి.సుశీలకు.. సాయికిరణ్ మనవడు వరస అవుతాడు. ఇతడి తండ్రి కూడా సింగర్గా గుర్తింపు పొందాడు. అలా ఇండస్ట్రీ వాతావారణంలోనే పెరగడంతో 'నువ్వే కావాలి' మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు ఓ పాప కూడా ఉంది. కానీ, కొన్ని మనస్పర్థలు కారణంగా కొన్నాళ్ల క్రితమే సాయికిరణ్-వైష్ణవి విడాకులు తీసుకున్నారు. కొంతకాలం పాటు ఒంటరిగానే ఉన్న సాయికిరణ్. తనతోపాటు 'కోయిలమ్మ' సీరియల్లో నటించిన స్రవంతితో ప్రేమలో పడ్డాడు. అలా వారిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు వారిద్దరూ శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Actress Sravanthi (@sravanthi.official) -
రామ్ చరణ్ - ప్రశాంత్ నీల్ డేట్స్ లాక్..!
-
రైతులంటే లెక్కలేదా? పవన్ను ఏకిపారేసిన బుడ్డోడు
-
నా భర్త మరో అమ్మాయితో హోటల్కి వెళ్లాడు: హీరో పవన్ సింగ్ సతీమణి
భోజ్పురి సూపర్స్టార్, నటుడు, రాజకీయ నేత పవన్ సింగ్పై ఆయన రెండో సతీమణి జ్యోతి సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్గా స్టేజీపై హీరోయిన్ అంజలి రాఘవ్ను అసభ్యకరంగా తాకి వార్తల్లో నిలిచాడు. దీంతో ఆమె ఏకంగా భోజ్పురి పరిశ్రమనే వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో తనకు తప్పుడు ఉద్దేశం లేదని క్షమాపణలు చెప్పాడు. అయితే, తాజాగా ఆయనపై జ్యోతి సింగ్ సంచలన ఆరోపణలు చేసింది.పవన్ సింగ్, జ్యోతి సింగ్ ఇద్దరూ పలు విభేదాలతో దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జ్యోతి సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. తాను తన భర్త పవన్ సింగ్ ఇంటికి వెళ్తే తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని పోలీసులపై భగ్గుమంది. ఇప్పుడు పోలీసులు తనను తీసుకెళ్లడానికి వచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఆమె మాట్లాడుతూ.. “ భార్యను బయటకు గెంటేయాలని పోలీసులను పిలిపించుకున్న ఈ పవన్ సింగ్ సమాజానికి సేవ చేస్తాడా..? ఎన్నికలు జరిగినప్పుడు నాకు ఫోన్ చేసి నా పేరు ఉపయోగించాడు. అవి అయిపోయిన తర్వాత అతను మరొక అమ్మాయితో హోటల్కు వెళ్తాడు. కానీ, నన్ను మాత్రం భర్త ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. అతని తప్పులను ఎవరూ అడగరు. ఆయన మాత్రం మా ముందే ఒక అమ్మాయిని తీసుకుని హోటల్కు వెళ్తాడు. దీనిని ఎవరూ అడగరు. భార్యగా, నా భర్త వేరే అమ్మాయితో ఉండటం చూసి నేను భరించలేకపోయాను, అందుకే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. అని ఆమె చెప్పింది.పవన్ సింగ్ గతంలో(2014లో) ప్రియకుమారి సింగ్ను పెళ్లాడాడు. కేవలం ఏడాది మాత్రమే వీరు కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. 2018లో పవన్.. జ్యోతి సింగ్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీరి మధ్య కూడా గొడవలు రావడంతో దూరంగానే ఉంటున్నారు. ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ సింగ్ బీజేపీ నుంచి పోటీ చేయనున్నాడని సమాచారం. View this post on Instagram A post shared by Jyoti P Singh (@jyotipsingh999) -
ది ఇండియా స్టోరీ పూర్తి
‘ది ఇండియా స్టోరీ’ సినిమాను పూర్తి చేశారు కాజల్ అగర్వాల్. శ్రేయాస్ తల్సాడే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ సినిమా ‘ది ఇండియా స్టోరీ’. డీకే చేతన్ దర్శకత్వంలో ఎమ్ఐజీ ప్రోడక్షన్స్ అండ్ స్టూడియోస్ పతాకంపై సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు సోమవారం ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో లాయర్గా నటించారు కాజల్.రైతుల కష్టాలు, కార్పొరేట్ సంస్థలు తయారు చేసే పంటల పిచికారీ మందుల వ్యా పారాలు వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. మురళీ శర్మ, మనీష్ వాధ్యా, త్రిషా సర్ధా కీలక పాత్రల్లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నా కుదరలేదు. 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్. -
లాటరీ కింగ్?
నాగార్జున కెరీర్లోని వందో సినిమా చిత్రీకరణ కోసం కొన్ని రోజులుగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై అక్కినేని నాగార్జున ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని తెలిసింది. తొలి షెడ్యూల్లో నాగార్జున పాల్గొంటున్నారని సమాచారం.ఈ సినిమాకు ‘కింగ్ 100’, ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్స్ను మేకర్స్ అనుకుంటున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే తాజాగా ‘లాటరీ కింగ్’ అనే మరో టైటిల్ను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారట. అంతేకాదు.. కథ రీత్యా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కారు ప్రమాదంపై విజయ్ దేవరకొండ ట్వీట్!
కారు ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా బాగానే ఉందని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో తన కారు దెబ్బతిందని.. కానీ మాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఇప్పుడే వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వచ్చానని పోస్ట్ చేశారు. నా గురించి ఆరా తీసిన మీ అందరికీ లవ్ యూ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దని అభిమానులకు సూచించారు.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
సూపర్ హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం బల్టీ . ఇప్పటికే తమిళ, మలయాళం భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 10న టాలీవుడ్లో రిలీజ్ అవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది.ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ.. 'తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. క్రిటిక్స్ కూడా చక్కటి రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారు. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు షేన్ నిగమ్ ఇందులో హీరోగా అద్భుతమైన నటన కనబరిచారు. ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్ నటన ఆకట్టుకుంటుంది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు' అని అన్నారు.దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ..'తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జరిగే ఔట్ అండ్ ఔట్ రా రస్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా ఉంటుంది. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దలు వారి మధ్య జరిగే వ్యాపార రాజకీయాల్లో నలుగురు కబడ్డీ ప్లేయర్స్ చిక్కుకోవడం, ఆపై వచ్చే ఘర్షణలు, భావోద్వేగాల సమాహారంగా బల్టీ సినిమా ఉండనుంది' అని అన్నారు. -
సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ట్రాన్ ఏరిస్... రిలీజ్ ఎప్పుడంటే?
ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న హాలీవుడ్ ఫ్రాంచైజీలలో ట్రాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీలో మూడవ భాగంగా ట్రాన్: ఏరిస్ మూవీని తీసుకొస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏఐ టెక్నాలజీ ప్రధానంగా రూపొందించారు. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లో ఈ మూవీ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.ఈ సందర్భంగా లండన్ ప్రీమియర్లో జారెడ్ మాట్లాడుతూ... "ఒక విధంగా చూస్తే ఏఐ ఒక పెద్ద సంభాషణగా మారిన సరైన సమయంలో వస్తుంది. మేము ఈ సినిమా పై 9-10 సంవత్సరాల క్రితం పని చేయడం మొదలుపెట్టాం. అప్పుడు ఏఐ గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగిస్తున్నారు. వారు తెలిసినా లేదా తెలియకపోయినా, అది మన జీవితాల్లో ఏదో ఒక రూపంలో భాగమైపోయింది. కాబట్టి ఈ సినిమా ఈ సమయంలో వస్తుండటం ఆసక్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను." అని అన్నారు. కాగా. ఈ చిత్రంలో జారెడ్ లెటో, జెఫ్ బ్రిడ్జెస్, గ్రెటా లీ, ఇవాన్ పీటర్స్, జోడి టర్నర్ స్మిత్, కామెరాన్ మోనాఘన్, హాసన్ మిన్హాజ్, గిలియన్ ఆండర్సన్ నటించారు. -
విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. కాగా.. ఇటీవల రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టిపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
అడివి శేష్ ఎక్కడ.. కొత్త సినిమాల సంగతేంటి?
అడివి శేష్.. ఈ పేరు వినిపించి, స్క్రీన్పై ఇతడిని చూసి చాలా ఏళ్లయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ హిట్టో ఫ్లాఫో సంగతి పక్కనబెడితే ఎప్పటికప్పుడు ఏదో ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. ఇతడు మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి ఒక్క మూవీని కూడా తీసుకురావట్లేదు. ఈ ఏడాదైనా వస్తాడనుకుంటే ఈసారి కూడా పలు కారణాల వల్ల హ్యాండిచ్చేసినట్లు తెలుస్తోంది.క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2.. ఇలా వరస సినిమాలతో శేష్.. సక్సెస్ అందుకున్నాడు. మరి కారణాలేంటో తెలీదు గానీ 2022 డిసెంబరులో హిట్ 2 రిలీజైంది. తర్వాత గూఢచారి, డకాయిట్ అనే చిత్రాల్ని ప్రకటించాడు. అప్పటినుంచి అవి సెట్స్పైనే ఉన్నాయి. లెక్క ప్రకారం 'డకాయిట్' మూవీ ఈపాటికే రిలీజైపోవాలి. తొలుత శ్రుతిహాసన్తో ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఎక్కడ తేడా కొట్టిందో గానీ శ్రుతి ప్లేసులోకి మృణాల్ ఠాకుర్ వచ్చింది. ఈ ఏడాది క్రిస్మస్ రిలీజ్ అని పోస్టర్ కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడిది వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?)శేష్ గతంలో ఓసారి గాయపడ్డాడు. అయితే అది ఇంకా తగ్గే దశలో ఉందని, దీంతో షూటింగ్స్ పూర్తవక 'డకాయిట్' వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. త్వరలో కొత్త విడుదల తేదీని కూడా టీమ్ ప్రకటించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కావాల్సిన 'గూఢచారి 2' కూడా కచ్చితంగా వాయిదా పడే అవకాశముంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?శేష్ మంచి నటుడే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఒకటి అరా సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. లేదంటే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ. మళ్లీ రిలీజ్ టైంలో ప్రమోషన్లలో హడావుడి చేసినా సరే ఎవరా హీరో అని అనుకోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలని థియేటర్లలోకి తీసుకొచ్చి శేష్.. హిట్ కొట్టాల్సిన అవసరముంది!(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?) -
అప్పటికప్పుడే తీసుకున్న నిర్ణయమది: రష్మిక పోస్ట్ వైరల్
టాలీవుడ్లో ప్రస్తుతం ఆ ఇద్దరి పేర్లే తెగ వైరలవుతున్నాయి. ఆ జంట మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవలే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. వీరిద్దరిపై ఎప్పటి నుంచో డేటింగ్ రూమర్స్ వస్తున్నప్పటికీ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా నిశ్చితార్థం విషయంలోనూ అదే జరిగింది. ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.ఇక ఈ సంగతి పక్కన పెడితే రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి థామా.. మరొకటి ది గర్ల్ఫ్రెండ్. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. లేటేస్ట్గా రిలీజైన థామా సాంగ్ గురించి రష్మిక పోస్ట్ పెట్టారు. ఆ సాంగ్ రూపొందించడం వెనక ఉన్న స్టోరీని వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఇదంతా దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు.ఆయుష్మాన్ ఖురానా హీరోగా వస్తోన్న థామా నుంచి ఇటీవల నువ్వు నా సొంతమా అనే సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటలో రష్మిక తన అందంతో డ్యాన్స్తో అభిమానులను అలరించింది. తాజాగా ఈ పాట వెనక ఉన్న ఓ ఆసక్తికర విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.రష్మిక తన పోస్ట్లో రాస్తూ.. 'మేము ఓ అందమైన ప్రదేశంలో దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ చేశాం. అయితే షూట్ చివరి రోజు మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ప్లేస్ ఇంత బాగుంది కదా మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదని అన్నారు. ఆ ఆలోచన మా అందరికీ నచ్చింది. ఆ లొకేషన్ అందంగా ఉండడంతో మూడు, నాలుగు రోజుల్లోనే పాటను పూర్తి చేశాం. మేము ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు. మీరంతా కూడా థియేటర్లో ఈ సాంగ్ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా' అంటూ సాంగ్ స్టిల్స్ను షేర్ చేశారు. కాగా.. ఈ హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముంజ్య ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
బిగ్బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?
బిగ్బాస్ 9వ సీజన్ ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. గతవారం మాస్క్ మ్యాన్ హరీశ్ ఎలిమినేట్ అయిపోయాడు. చెప్పాలంటే తొలివారం అనుహ్యంగా శ్రష్ఠి వర్మ బయటకు రాగా.. తర్వాత నుంచి వరసగా మనీష్, ప్రియ, హరీశ్ ఇలా అందరూ కామనర్స్ ఎలిమినేట్ అవుతు వచ్చారు. దీంతో ఈసారి కూడా వీళ్లలో నుంచే ఒకరు బయటకొస్తారా లేదంటే సెలబ్రిటీల నుంచి వస్తారా అనేది సస్పెన్స్గా మారింది. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త డిఫరెంట్గా జరిగింది.కెప్టెన్ అయిన రాము తప్పించి మిగిలిన అందరూ అంటే భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, పవన్, కల్యాణ్, శ్రీజ, తనూజ, నికిత నామినేట్ అయినట్లు ప్రకటించిన బిగ్బాస్.. చిన్నపాటి షాకిచ్చాడు. అయితే లిస్ట్ నుంచి బయటకొచ్చేందుకు ఇమ్యూనిటీ పొందాల్సి ఉంటుందని చెప్పాడు. అలా తొలుత బెడ్ గేమ్ పెట్టాడు. బెడ్పై అందరూ ఉంటారు. వీళ్లలో ఒక్కొక్కరిని కిందరు తోసేయాల్సి ఉంటుంది. అలా చివరకు మిగిలిన వాళ్లతో మరో గేమ్ ఆడించారు.(ఇదీ చదవండి: క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన)నీరు, నిప్పు, గాలి అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్ ఆడించారు. ఈ పోటీలో ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణి, తనూజ పాల్గొన్నట్లు ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఇలా గేమ్స్ ఆడించగా చివరగా ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్ రాము, ఇమ్ము తప్పితే మిగిలిన వాళ్లంతా ఈసారి నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది.ఎందుకంటే ఈ వీకెండ్.. పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాబోతున్నారని సమాచారం. వీళ్లలో అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య, సీరియల్ నటి సుహాసిని తదితరుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో ఫైనల్ ఎంట్రీస్ ఎవరనేది ఓ క్లారిటీ వస్తుంది. (ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?) -
ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ది రాజా సాబ్ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్స్ షూటింగ్ చేసేందుకు రాజా సాబ్ టీమ్ యూరప్కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. డైరెక్టర్ మారుతితో ఫ్లైట్లో ఉన్న పిక్ను పోస్ట్ చేశారు. ఈ సాంగ్స్ను షూట్ చేసేందుకు చిత్రబృందం యూరప్కు పయనమయ్యారు. కాగా.. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. కల్కి తర్వాత వస్తోన్న ప్రభాస్ మూవీ కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
'రాజాసాబ్' మాళవిక స్మైల్.. నిధి అగర్వాల్ గ్లామర్
ఎర్రటి డ్రస్సులో వావ్ అనిపించేలా నిధి అగర్వాల్గ్యాలరీలో మిగిలిన ఫొటోలన్నీ పోస్ట్ చేసిన నభా నటేశ్ఎర్రని లిప్స్టిక్తో గట్టిగా నవ్వేస్తున్న మాళవిక మోహనన్అందమే అసూయపడేలా నందితా శ్వేత పోజులుసింపుల్ డ్రస్సులో క్యూట్గా రితికా నాయక్ఇంట్లో స్పెషల్ హోమం చేసిన హీరోయిన్ ప్రణీత'ఇడ్లీ కొట్టు' షూటింగ్ జ్ఞాపకాలతో శాలినీ పాండే View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Sanya Malhotra (@sanyamalhotra_) -
రామాయణలో సీత రోల్.. నేను ఆ పని చేయలేదు: కేజీఎఫ్ హీరోయిన్
'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. యశ్ సరసన నటించిన ముద్దుగుమ్మ తన గ్లామర్తోనూ అభిమానులను ఆకట్టుకుంది. కేజీఎఫ్ తర్వాత నాని హీరోగా వచ్చిన హిట్ -3 మూవీలో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్లో 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తోన్న రామాయణ చిత్రంలో ఛాన్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. సీతగా సాయి పల్లవి చేస్తోన్న రోల్ను రిజెక్ట్ చేశానన్న వార్తలపై శ్రీనిధి శెట్టి స్పందించింది. ఆడిషన్కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాను ఆ పాత్రకు ఎంపిక కాలేదని తెలిపింది. సీత రోల్కు ఎవరైతే సెట్ అవుతారో నిర్మాతలు డిసైడ్ చేశారని వెల్లడించింది. ఆ మూవీ ఆడిషన్కు వెళ్లడమే తనకు గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద రోల్కు నేను ఆడిషన్ ఇచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపింది.సీత పాత్రకు ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేయలేదని.. అంతకుమించి ఏం జరగలేదని శ్రీనిధి బ్యూటీ చెప్పింది. నేను ఎంపిక కాకపోయినా.. సౌత్ నుంచి సాయి పల్లవిని తీసుకోవడం నాకు ఆనందంగా అనిపించిందన్నారు. అంతే కానీ ఈ పాత్రను తాను రిజెక్ట్ చేయలేదని కేజీఎఫ్ భామ చెప్పుకొచ్చింది.శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన 'హిట్ 3' ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చిత్రం 'తెలుసు కదా'లో ఓ హీరోయిన్గా చేసింది. -
క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన
పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన దంపతులకు మెగా గారాలపట్టి క్లీంకార పుట్టింది. అయితే పుట్టి ఏడాది దాటిపోయినా సరే ఇప్పటికీ చిన్నారి ముఖాన్ని బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. అయితే దీనికి ఓ కారణం ఉందని, కావాలనే ఇలా ఫేస్ కవర్ చేస్తున్నామని ఉపాసన చెప్పుకొచ్చింది. తాజాగా ఢిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొన్న ఈమె.. కూతురు క్లీంకార గురించి మాట్లాడింది. అలానే తనని ట్యాగ్స్ పెట్టి పిలవడంపైనా స్పందించింది.'ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది దానికి తోడు కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా మమ్మల్ని భయపెట్టాయి. మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందుకే ఎయిర్పోర్ట్కి వెళ్లేటప్పుడు పాప ముఖానికి మాస్క్ వేస్తుంటాం. చెప్పాలంటే ఇది పాపకు తల్లిదండ్రులుగా నాకు, చరణ్కి పెద్ద పని. అయితే మేం కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది మాకు తెలీదు. కానీ పాప ముఖాన్ని దాస్తున్న విషయంలో రామ్, నేను సంతోషంగానే ఉన్నాం.' అని ఉపాసన చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)అలానే స్టార్ హీరోకు భార్య అనే ట్యాగ్ గురించి మాట్లాడిన ఉపాసన.. సానుకూలంగానే స్పందించింది. 'నన్ను ఎలాంటి ట్యాగ్తో పిలిచినా ఇష్టమే. ఎవరైనా మనకు ఓ ట్యాగ్ ఇచ్చారంటే వాళ్లు మనల్ని ఇష్టపడుతున్నట్లే కదా. ఈ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. అలానే ఇది ఓ బాధ్యత కూడా' అని చెప్పింది.ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్' సినిమాతో వచ్చిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఉపాసన విషయానికొస్తే.. తల్లిగా క్లీంకారని చూసుకుంటూనే మరోవైపు ఆస్పత్రి వ్యవహారాలు చూసుకుంటోంది. ఈ మధ్యే ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్గానూ ఉపాసనని నియమించారు. ఇలా పలు పనులు చేస్తూనే తల్లిగానూ క్లీంకారని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
2015లో మిస్క్యారేజ్.. ఇన్నాళ్లకు గుడ్న్యూస్ చెప్పిన పింకీ
'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో పింకీ గుర్తుందిగా.. ఇప్పుడా పింకీ తల్లి కాబోతోంది. పింకీ అలియాస్ సుదీప (Sudeepa Pinky) గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్త శ్రీరంగనాథ్తో కలిసి మెటర్నటీ షూట్ చేయించుకోగా.. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించింది.. ప్రేమ మమ్మల్ని బలంగా ఉంచింది. ఇప్పుడు మా కుటుంబం పెద్దదవుతోంది అని రాసుకొచ్చింది. అయితే తనకు ఈ మధ్యే డెలివరీ అయిందని, మెటర్నటీ షూట్ ఫోటోలను ఆలస్యంగా పోస్ట్ చేసిందంటున్నారు. మరి తన డెలివరీ గురించి సుదీప క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.2015లో మిస్క్యారేజ్సుదీపకు పెళ్లయి దాదాపు 12 ఏళ్లవుతోంది. 2015లో తొలిసారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా బిగ్బాస్ హౌస్లో వెల్లడించింది. 2015లో ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ, అప్పుడు రెడీగా లేను. అయినా సరే, చూద్దామని ప్రెగ్నెన్సీని అలాగే ఉంచుకున్నాను. కొంతకాలానికి పొట్టలో బిడ్డతో మాట్లాడటం మొదలుపెట్టాను. బేబీ హార్ట్బీట్ కూడా బాగానే ఉంది. నాకు థైరాయిడ్ సమస్య ఉండేది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, థైరాయిడ్ ఎక్కువవడంతో బిడ్డను కోల్పోయాను అని చెప్తూ ఏడ్చేసింది.సినిమా1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో వచ్చిన ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పింకీ. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. ఆ మధ్య తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొంది. అందరినీ కమాండ్ చేస్తూ బాస్ లేడీ అన్న ట్యాగ్ అందుకుంది. ఆరోవారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. తర్వాత మళ్లీ స్క్రీన్పై కనిపించనేలేదు. View this post on Instagram A post shared by Pinky Sudeepa (@pinky_sudeepaofficial) చదవండి: నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య -
'కానిస్టేబుల్' సెన్సార్ పూర్తి.. స్పెషల్ సాంగ్ రిలీజ్
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన సినిమా 'కానిస్టేబుల్'. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించారు. అక్టోబరు 10న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ చిత్రం తన కెరీర్కు మరో మలుపు అవుతుందని హీరో వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు.నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. సెన్సార్ పూర్తి కావడం, ట్రైలర్ కి వస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇందులోని ఓ మంచి ఐటమ్ సాంగ్ని దసరా సందర్భంగా విడుదల చేశాం. దానికి కూడా మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది అని అన్నారు. -
కేజీఎఫ్ను దాటేసిన కాంతార చాప్టర్-1.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ 'కాంతార: చాప్టర్ 1'. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతార మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.దేశవ్యాప్తంగా చూస్తే కాంతార చాప్టర్-1 నాలుగు రోజుల్లోనే రూ. 232.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రిలీజైన నాలుగు రోజుల్లో రూ.300 కోట్ల క్లబ్కు చేరువలో ఉంది. తొలి రోజు రూ. 89 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తోంది. ఇలాగే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తే కాంతార: చాప్టర్ 1 రూ. 300 కోట్ల మార్క్ త్వరలోనే అధిగమించనుంది.కాగా.. ఇప్పటికే ఈ సినిమా కన్నడలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో యశ్ నటించిన కేజీఎఫ్: చాప్టర్ 1ను అధిగమించింది. కాంతార, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత స్థానంలో ఈ చిత్రం నిలిచింది. కాంతార రూ. 408 కోట్లు సాధించగా.. కేజీఎఫ్-2 రూ. 1,215 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?
'ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది'.. అందరి విషయంలోనూ అని చెప్పలేం గానీ ఈ సామెత చాలాసార్లు నిజమవుతూ ఉంటుంది. దానికి లేటెస్ట్ ఉదాహరణ 'కాంతార 1'తో మరో పాన్ ఇండియా హిట్ కొట్టిన రిషభ్ శెట్టి. ఎందుకంటే హీరోగా ఇప్పుడు ఇతడు సక్సెస్ అయిండొచ్చు. కానీ ఏ ఫేమ్ లేని టైంలోనే ఇతడిని నమ్మిన ప్రగతి శెట్టి.. తోడునీడలా నిలిచింది. ఇప్పుడు ఫెర్ఫెక్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ వీళ్ల ప్రేమకథ ఏంటి? 'కాంతార 1'లో రిషభ్తో పాటు ప్రగతి కూడా నటించిందనే విషయం మీలో ఎందరు కనిపెట్టారు?కన్నడ ఇండస్ట్రీలో 'ఆర్ఆర్ఆర్' (RRR) గురించి తెలియని వాళ్లు ఉండరు. వీళ్లే రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టి, రాజ్ బి శెట్టి. వీరిలో రక్షిత్, రాజ్ బి శెట్టి.. లోకల్ వరకు మాత్రమే గుర్తింపు తెచ్చుకోగా రిషభ్ శెట్టి మాత్రం 'కాంతార' చిత్రాలతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వాటర్ కాన్ బిజినెస్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రిషభ్ శెట్టి.. ప్రొడక్షన్ బాయ్, క్యారెక్టర్ ఆర్టిస్టు, డైరెక్టర్.. ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడివరకు వచ్చాడు. అయితే 2016లో 'కిరిక్ పార్టీ' మూవీతో హిట్ కొట్టిన తర్వాత రిషభ్ గురించి కన్నడ ఇండస్ట్రీలో తెలిసింది.(ఇదీ చదవండి: 'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?)అయితే 'కిరిక్ పార్టీ' సినిమా రావడానికి చాన్నాళ్ల ముందు నుంచే రిషభ్, ప్రగతి ప్రేమించుకున్నారు. ఓ మూవీ ఈవెంట్లో తొలుత వీళ్లిద్దరూ కలసుకోగా.. తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్లకు ప్రేమ విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. అయితే ప్రగతి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. రిషభ్ ఇంకా జీవితంలో సక్సెస్ కాలేదని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్నాళ్లపాటు కష్టపడి పెద్దల్ని ఒప్పించిన తర్వాత 2017లో రిషభ్-ప్రగతి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు రణ్విత్, రాధ్య అని కొడుకు, కూతురు ఉన్నారు.అసలు విషయానికొస్తే.. రిషభ్ శెట్టి హీరోగా చేసిన బెల్ బాటమ్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా చేసిన ప్రగతి, 2022లో వచ్చిన 'కాంతార'కి కూడా పనిచేసింది. లేటెస్ట్ సెన్సేషన్ 'కాంతార 1'కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా చేసి ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రారంభంలో రాజు పక్కన ఓ పిల్లాడిని ఎత్తుకునే ఓ మహిళ నిలబడి ఉంటుంది. ఆమె ప్రగతినే. అలా ఫస్టాప్లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న రథం సీన్లోనూ ప్రగతి శెట్టి తన కొడుకుతో కనిపిస్తుంది. కాకపోతే ఒకటి రెండు సెకన్ల పాటు కనిపించే ఆ సీన్ని చాలామంది నోటీస్ కూడా చేసి ఉండరు. అలా తన భార్య, పిల్లలతో కూడా రిషభ్ శెట్టి యాక్టింగ్ చేయించేశాడు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
'కాంతార' దెబ్బతో వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించిన బిగ్ సినిమా
దసరా సందర్భంగా విడుదలైన కాంతార సినిమా పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. దీంతో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ హిందీ సినిమా ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ (Sunny Sanskari Ki Tulsi Kumari) సరికొత్త ప్లాన్ వేసింది. కాంతారను తట్టుకునేందుకు మేకర్స్కు మరోదారి లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.కాంతారతో పోటీ తట్టుకోవడం కష్టమని భావించిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి చిత్ర యూనిట్ ఇప్పుడు వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో నిర్మాతలు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా ప్రకటించారు. ప్రేమికులకు ఈ సీజన్లోన గొప్ప ఆఫర్ అంటూ తెలిపారు. టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగదారులు ఆఫర్ను పొందడానికి SSKTK కోడ్ను ఉపయోగించాలని సూచించారు.సన్నీ సంస్కారి కి తులసి కుమారి చిత్రం కూడా అక్టోబర్ 2న విడుదలైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 నెట్ కలెక్షన్లు సాధించింది. కాంతార చిత్రానికి క్రేజ్ పెరగడంతో ఈ మూవీ కలెక్షన్స్పై ఎక్కువ ప్రభావం చూపింది. దీంతో వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ను ప్రకటించినట్లు తెలుస్తుంది. -
రాజాసాబ్ యూరప్ టూర్.. అనుకున్న టైమ్కి వస్తాడా..?
-
చాన్నాళ్లకు నాగశౌర్య నుంచి సినిమా.. టీజర్ రిలీజ్
ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన నాగశౌర్య.. తర్వాత సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నాడు. 2023లో చివరగా 'రంగబలి' మూవీతో వచ్చాడు. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. అయితే రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ వాటి గురించి పెద్దగా అప్డేట్స్ ఇవ్వలేదు. ఇన్నాళ్లకు 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే చిత్రాన్ని సిద్ధం చేశాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు)రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విధి హీరోయిన్. యూత్ఫుల్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని తీసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. పూర్ణ సీరియస్ లుక్లో కనిపించగా, సాయి కుమార్ పోలీస్ పాత్ర పోషించారు. త్వరలో మూవీ థియేటర్లలోకి రానుందని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?) -
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు
మరోవారం వచ్చేసింది. గత వీకెండ్ 'కాంతార 1', 'ఇడ్లీ కొట్టు' లాంటి డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. ఈసారి మాత్రం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కొన్ని థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో ఎర్రచీర, కానిస్టేబుల్, శశివదనే, అందెల రవమిది, అరి, మటన్ సూప్, ప్రేమతో దెయ్యం లాంటి సినిమాలతో పాటు 'బల్టీ' అనే డబ్బింగ్ బొమ్మ ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా కొత్త మూవీస్, వెబ్ సిరీసులు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి'ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. మిరాయ్, త్రిభాణదారి బార్బరిక్, లీగల్లీ వీర్ అనే తెలుగు చిత్రాలతో పాటు కురుక్షేత్ర అనే యానిమేటెడ్ డబ్బింగ్ సిరీస్ ఈ వారంలోనే రానుంది. అలానే ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ 'వార్ 2' కూడా ఈ వారాంతంలోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మరి ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 06 నుంచి 12వ తేదీ వరకు)హాట్స్టార్మిరాయ్ (తెలుగు సినిమా) - అక్టోబరు 10సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ (హిందీ సిరీస్) - అక్టోబరు 10నెట్ఫ్లిక్స్హోర్టన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06మ్యాట్ మక్కస్కర్: ఏ హంబుల్ ఆఫరింగ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 07ట్రూ హాంటింగ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 07కారమెలో (పోర్చుగీస్ సినిమా) - అక్టోబరు 08ఈజ్ ఇట్ కేక్? హాలోవీన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 08నెరో (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబరు 08బూట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 08వార్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 09 (రూమర్ డేట్)ద రీసరెక్టెడ్ (మాండరిన్ సిరీస్) - అక్టోబరు 09ద ఉమెన్ ఇన్ కాబిన్ 10 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 09విక్టోరియా బెక్హమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 09కురుక్షేత్ర (తెలుగు డబ్బింగ్ యానిమేటెడ్ సిరీస్) - అక్టోబరు 10స్విమ్ టూ మీ (స్పానిష్ మూవీ) - అక్టోబరు 10 అమెజాన్ ప్రైమ్మెయింటైనెన్స్ రిక్వైర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 08జాన్ క్యాండీ: ఐ లైక్ మీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 10సన్ నెక్స్ట్త్రిభాణదారి బార్బరిక్ (తెలుగు మూవీ) - అక్టోబరు 10రాంబో (తమిళ సినిమా) - అక్టోబరు 10జీ5ఏ మ్యాచ్ (మరాఠీ సినిమా) - అక్టోబరు 10వెదువన్ (తమిళ సిరీస్) - అక్టోబరు 10లయన్స్ గేట్ ప్లేలీగల్లీ వీర్ (తెలుగు మూవీ) - అక్టోబరు 10ఆపిల్ ప్లస్ టీవీద లాస్ట్ ఫ్రంటియర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 10(ఇదీ చదవండి: రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి) -
అందుకే ఎక్కువ సినిమాలు చేయడం లేదు: హీరోయిన్
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath). ఈమె తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్' (The Game: You Never Play Alone Web Series). సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఈ వెబ్ సిరీస్ను దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ రూపొందించారు. దసరా పండుగ సందర్భంగా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలై స్ట్రీమ్ అవుతోంది. వెబ్ సిరీస్ఈ సందర్భంగా శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్లో తాను, సంతోష్ ప్రతాప్ గేమ్ డెవలపర్స్గా నటించామని చెప్పారు. గేమ్ డెవలపర్స్ అయిన తమను సామాజిక మాధ్యమాలు ఎలా బాధింపునకు గురిచేశాయి? తమ చుట్టూ ఉన్న వారిని ఎలా సమస్యల వలయంలో చిక్కుకునేటట్లు చేశాయి? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వెబ్ సిరీస్ ది గేమ్ అని చెప్పారు. 7 ఎపిసోడ్స్తో కూడిన ఈ సిరీస్ కోసం యూనిట్ అంతా ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. నాకు అదే ముఖ్యంతాను అధికంగా పద్ధతిగల పాత్రల్లో నటించడానికి కారణం.. తనను ప్రేక్షకులు అలాంటి పాత్రల్లో చూడాలని కోరుకోవడమే అన్నారు. అయితే తనకు లవ్, రొమాన్స్తో పాటు సీక్రెట్ ఏజెంట్ వంటి అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్ కథాచిత్రాల్లోనూ యాక్ట్ చేయాలని ఆశగా ఉందన్నారు. ఎక్కువ సినిమాలు చేయడం లేదని కొందరు అడుగుతున్నారని.. తనకు ఎక్కువ చిత్రాలు నటించడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా అందులో మంచిగా నటించి అభిమానులను అలరించడమే ముఖ్యమని పేర్కొన్నారు.చదవండి: రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
ఉప్పెన బ్యూటీ స్టన్నింగ్ లుక్.. బ్లాక్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ!
సెప్టెంబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న శ్రద్ధా శ్రీనాథ్..డిఫరెంట్ శారీ లుక్లో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి..టాలీవుడ్ నటి అనసూయ స్టన్నింగ్ లుక్..బ్లాక్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్..బ్లాక్ బ్యూటీలా ఓజీ భామ శ్రియా రెడ్డి.. View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
నా డ్రీమ్ అదే.. నాన్నలాగే అలాంటి సినిమాలు చేయాలని!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya ) తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నాగ చైతన్య తాజాగా ఓ ప్రోగ్రామ్కు హాజరయ్యారు. టాలీవుడ్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము.. నిశ్చయమ్మురా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలనుందని మనసులోని మాటను బయటపెట్టారు. నాన్నలాగా అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు చేయాలనుందని కోరికను వెల్లడించారు. ఇది విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
కాంతార ఛాప్టర్-1.. పంజర్లి లుక్లో సందడి చేసిన అభిమాని!
2022లో వచ్చిన కాంతార మూవీ పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్బస్టర్గా హిట్గా నిలిచింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమాకు ప్రీక్వెల్గా కాంతార ఛాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. కాంతారా మూవీతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.తాజాగా కాంతారా మూవీ థియేటర్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తమిళనాడులో దిండిగల్లో ఈ సంఘటన జరిగింది. రిషబ్ శెట్టి అభిమాని కాంతార చిత్రంలో పంజర్లి దేవత అవతారంలో సందడి చేశారు. పంజర్లి లుక్లో థియేటర్లో డ్యాన్స్ చేస్తూ ఆడియన్స్ను అలరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. After the screening of Kantara Chapter 1 at a cinema in Dindigul, a fan dressed as a Daiva stunned the audience there.Goosebumps Thank you Divine star @shetty_rishab @hombalefilms for making such a Divine movie #KantaraChapter1 pic.twitter.com/sPd3bNmNHN— ಸನಾತನ (@sanatan_kannada) October 5, 2025 -
'ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును'.. అనసూయ లేటేస్ట్ మూవీ ట్రైలర్
అనసూయ ( Anasuya Bharadwaj), సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నోబడి అనే ఉపశీర్షిక. ఈ మూవీకి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మనిషిలోని ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమాకు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇచ్చట అందరి కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కథ అంతా ఓ లైబ్రరీ చుట్టే తిరుగనుందని అనిపిస్తోంది. ట్రైలర్లో సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కామం అనే పదం చుట్టే హైలెట్ కావడంతో ఆ కోణంలోనే కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సురభి ప్రభావతి, వినోద్ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు.. ఆయన సన్నిదిలో విజయ దేవరకొండ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో రూమర్స్ వస్తోన్న రష్మికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. హైదరాబాద్లోని విజయ్ సృగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ప్రముఖ ఆలయంలో కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విజయ్ పుట్టిపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ వర్గాలు అతనికి ఘన స్వాగతం పలికాయి. ఇకపోతే విజయ్ దేవరకొండకి పుట్టపర్తితో ఉన్న అనుబంధం తెలిసిందే. అక్కడే శ్రీ సత్యసాయి పాఠశాలలో ఆయన చదువుకున్నారు. Puttaparthi ❤️🙏Sensational @TheDeverakonda visits Bhagwan Satya Sai Baba's Maha Samadhi and seeks blessings ✨#VijayDeverakonda has a special connection with this place from childhood❤️ pic.twitter.com/pOq8fY02Hy— Pavan Kumar (@pavankumar__123) October 5, 2025 -
టాలీవుడ్ నటి అనసూయ దసరా వైబ్స్.. ఫోటోలు
-
గేమ్ ఛేంజర్ రికార్డ్ బ్రేక్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార ఛాప్టర్-1. గతంలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.89 కోట్ల గ్రాస్ సాధించిన కాంతార ఛాప్టర్-1.. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్ను దాటేసింది. కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 162.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో రూ.235 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ సు ఫ్రమ్ సో (రూ. 92 కోట్ల నికర) జీవితకాల కలెక్షన్స్ను అధిగమించింది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సికందర్(రూ. 110 కోట్లు), రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (రూ. 131 కోట్లు) లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ కలెక్షన్స్ను దాటేసింది. అదే సమయంలో రూ. 150 కోట్ల మార్కును దాటేసిన నాల్గవ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1 విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ. 22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
58 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయిన నటుడు
అన్న పెళ్లి మాటే మర్చిపోయాడు. కానీ తమ్ముడు రెండో పెళ్లి చేసుకోవడమే కాదు, 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకోగా వీరికి అర్హాన్ ఖాన్ సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. 2023 డిసెంబర్లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు.ఏడాదిన్నర తిరిగేలోపు..ఈ ఏడాది ప్రారంభంలో షురా గర్భం దాల్చింది. నేడు (అక్టోబర్ 5న) ముంబైలోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సల్మాన్.. ఫామ్హౌస్ నుంచి నేరుగా ఆస్పత్రికి పయనమయ్యాడట! అర్బాజ్ ఖాన్.. ప్యార్ కియా తో డర్నా క్యా, హలో బ్రదర్, దబాంగ్, దబాంగ్ 2, దబాంగ్ 3, నిర్దోష్, తేరే ఇంతేజార్, మే జరూర్ ఆవుంగా వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో జై చిరంజీవ మూవీలో విలన్గా నటించాడు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు.చదవండి: హిమాలయాల్లో రజనీకాంత్.. వారం రోజులు అక్కడే! -
హిమాలయాల్లో రజనీకాంత్.. వారం రోజులు అక్కడే!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన జైలర్ (Jailer Movie) బ్లాక్బస్టర్ విజయం సాధించింది. 2023లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్గా జైలర్ 2 తెరకెక్కుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 12న విడుదల కానుంది. ఇకపోతే ఈ మధ్యే రజనీ నటించిన కూలీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే! రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ సినిమా విషయంలో మాత్రం అభిమానుల్లో కాస్త అసంతృప్తి అలాగే ఉంది.హిమాలయాల్లో ప్రత్యక్షందీంతో జైలర్ 2 విషయంలో చిత్రయూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మధ్యే కేరళ షెడ్యూల్ పూర్తయింది. తాజాగా జైలర్ 2కి షూటింగ్కు బ్రేక్ ఇస్తూ రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. బిజీ షూటింగ్స్కు బైబై చెప్తూ వారంరోజుల సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిషికేశ్ ఆశ్రమంలో రజనీ సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. బద్రీనాథ్, బాబా గుహ వంటి పవిత్ర స్థలాలను సైతం సందర్శించినట్లు తెలుస్తోంది.జైలర్ 2రజనీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువన్న విషయం తెలిసిందే! ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లొస్తుంటారు. జైలర్ రిలీజ్కు ముందు కూడా అక్కడికి వెళ్లొచ్చారు. జైలర్ 2 విషయానికి వస్తే.. ఇందులో మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఫస్ట్ పార్ట్కు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికీ పని చేస్తున్నారు. ఎస్జే సూర్య కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.చదవండి: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. అంత చులకనా?: శ్రీజ తండ్రి -
రహస్యంగానే విజయ్ దేవరకొండ, రష్మిక.. కారణం ఏంటి?
సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి అంటే సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. రీసెంట్గా అక్కినేని నాగార్జున కుటంబంతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి కూడా శుభవార్తలు విన్నాం. అయితే, తాజాగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక(Rashmika Mandanna)లు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని వారి సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. సోషల్మీడియాలో అయితే, పాన్ ఇండియా రేంజ్లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఈ జోడీ మాత్రం తమకు ఏమ్ తెలియనట్లు సైలెంట్గా ఉంది. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొణెలతో పాటు చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లి సందర్భం వచ్చినప్పుడు తమ అభిమానులతో పంచుకున్నారు. నేటి ప్రపంచంలో ఎవరూ కూడా తమ ప్రేమ,పెళ్లి విషయాల్ని దాచుకోవడం లేదు. సమయం వచ్చినప్పడు చెప్పేస్తున్నారు.విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం గురించి సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. మిలియన్ల కొద్ది శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ, ఈ జంట మాత్రం ఇలాంటి సమయంలో చాలా గుంభనంగా ఉంది. కనీసం ఇవన్ని రూమర్స్ మాత్రమే అని కూడా వారు తమ అభిమానులకు చెప్పలేదు. నిజమే అయితే, కనీసం తమ ఫ్యాన్స్కు కూడా చెప్పకుండా ఇలా చేయడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.గత కొన్నేళ్లుగా ఇద్దరూ ఒక లోకేషన్లో కనిపించడం చూశాం. విజయ్ ఇంట్లో రష్మిక ఫోటోలు దిగడం, పుట్టినరోజు సమయంలో ఒకే ప్రదేశానికి వెకేషన్ ప్లాన్ చేయడం వంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా పలు ఫోటోలతో అభిమానులే డీకోడ్ చేశారు. ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచారంటే తప్పులేదు. కానీ, నిశ్చితార్థం విషయాన్ని కూడా అంత సీక్రెట్గా ఉంచడం ఎందుకు అనే సందేహం అందరిలో వస్తుంది. రష్మిక రీసెంట్గా తన కొత్త సినిమా విడుదల తేదీ ప్రకటించింది కానీ నిశ్చితార్థం గురించి మాత్రం చెప్పలేదు. ఇలాంటి విషయాల్లో ఇంత రహస్యం అవసరమా అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. -
డ్యూడ్ 'సింగారి చిన్నదాని' గురించి విన్నావా?
తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) టాలీవుడ్కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే లవ్టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో మెప్పించాడు. అయితే, ఆయన తాజాగా డ్యూడ్(Dude) అనే కొత్త సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి మరో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ప్రేమలు సినిమాతో గుర్తింపు పొందిన మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్గా నటిస్తుంది. సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. -
అమ్మ మరణం తర్వాత సినిమాలు వద్దనుకున్నా: బిగ్బాస్ బ్యూటీ
కమలహాసన్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయింది అక్షర రెడ్డి (Akshara Reddy). తాజాగా రైట్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయింది. ఈ సందర్భంగా తను ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2021లో తమిళ బిగ్బాస్ సీజన్ 5లో పాల్గొన్నాను. అప్పుడు 87 రోజులు బిగ్బాస్ ఇంట్లో ఉన్నాను. అది నాకు ఎన్నో రకాల అనుభవాలనిచ్చింది. ఆ హీరోయిన్స్ అంటే ఇష్టంకమల్తో కలిసి నటించాలన్నది నా కల. బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)లో ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం లభించింది. అప్పుడు ఆయన అందరికీ ఒక మాట చెప్పారు. నీ జీవిత స్క్రిప్టును నువ్వే రాసుకుంటున్నావు. నీ జీవితంలో రేపు ఏమి జరగాలన్నదీ నువ్వే నిర్ణయించుకోవాలి. అని ఆయన చెప్పిన విషయం నా మనసులో నాటుకు పోయింది. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐశ్వర్యారాయ్, శ్రీదేవిలకు వీరాభిమానిని. అలాగే శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం. సినిమాలు వద్దనుకున్నా..ప్రస్తుతం తమిళ్లో నేను రైట్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యాను. మా అమ్మ మరణం తర్వాత సినిమా రంగమే వద్దనే భావనకు వచ్చాను. కానీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రైట్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. నేను ఇంతకుముందే బిల్ గేట్స్ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా చేశాను. కాలేజీ అయిపోగానే జార్జియాకు వెళ్లి సైకాలజీ చదివాను. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలను అని అక్షర రెడ్డి చెప్పుకొచ్చింది.చదవండి: 80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట! -
ట్రెండింగ్లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ
తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమాలు తీయడం, భారీ వసూళ్లు రాబట్టడంలో మలయాళ ఇండస్ట్రీ దిట్ట! ఈ ఏడాది మాలీవుడ్లో అనేక సినిమాలు హిట్గా నిలిచాయి. అందులో ఒకటి సుమతి వలవు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ మధ్యే ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..రియల్ స్టోరీసుమతి వలవు (Sumathi Valavu Movie Review) అంటే తెలుగులో సుమతి మలుపు. ఇది సినిమాలోనే కాదు నిజంగా ఉంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని మైలమ్మూడుకు సమీపంలో ఈ మలుపు ఉంది. 1950ల ప్రాంతంలో సుమతి అనే అమ్మాయిని అక్కడ చంపేశారని, తను దెయ్యమై అక్కడే తిరుగుతోందన్న కథ ప్రచారంలో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీ తీశారు.కథఅడవిని ఆనుకుని కల్లేలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే అడవి గుండా వెళ్లాలి. అక్కడే సుమతి వలవు అనే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే సుమతి అనే దెయ్యం తిరుగుతూ ఉంటుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ అక్కడకు వెళ్లరు. కానీ ఓ రోజు రాత్రి ఆ ఊర్లోని శేఖరన్ పెద్ద కూతురు ప్రేమించినవాడితో పారిపోతుంది. హీరో అప్పూ (అర్జున్ అశోకన్)యే ఏదో చేసుంటాడని శేఖరన్ కుటుంబం అతడిపై పగపెంచుకుంటుంది. ఈ క్రమంలో శేఖరన్ రెండో కూతురు భామ (మాళవిక మనోజ్)తో ప్రేమలో పడతాడు అప్పు. మరి వీరి ప్రేమకథను ఒప్పుకుంటారా? శేఖరన్ పెద్ద కూతురు పారిపోయిందా? లేదా దెయ్యం చంపేసిందా? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!విశ్లేషణహీరో అప్పుకు చీకటంటే పిరికి. ఓరోజు రాత్రి ఊర్లోని నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటారు. అందరూ భయపడుతుంటే హీరో గ్యాంగ్ మాత్రం బండి సిద్ధం చేసుకుని తీసుకెళ్తారు. మలుపు దాకా వెళ్లాక బండి దానంతటదే ఆగిపోతుంది. ఈ ఇంటర్వెల్లో జరిగే సీన్లు బాగుంటాయి. కానీ సెకండాఫ్లో కాస్త పస తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాను చాలా సహజంగా తెరకెక్కించారు. మూవీలో ఓ పక్క ప్రేమకథ.. మరోపక్క హారర్ రెండూ ఉంటాయి. మరీ ఎక్కువ భయపెట్టకుండా నవ్విస్తూ, అలరిస్తూ కథ అలా ముందుకు సాగుతుంది. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. అన్నట్లు దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. The Curve That Everyone’s Talking About — 100 M+ Streaming Minutes Strong 🚀 #ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada #GopikaAnil@GokulamMovies @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/0CjoYEX6EL— ZEE5 Malayalam (@zee5malayalam) October 3, 2025 -
'నేషనల్ క్రష్' గురించి ఎక్కువగా ఆలోచించను: రుక్మిణీ వసంత్
కాంతార చాప్టర్-1 విడుదల తర్వాత రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) పేరు పాన్ ఇండియా రేంజ్లో ట్రెండ్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం ఆమె అందంగా ఉండటమే కాకుండా తన నటన, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా శాండల్వుడ్లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసింది. కాంతార సినిమా చూసిన వాళ్లు అందరూ ఆమెనే నేషనల్ క్రష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వతా రష్మిక మందన్నకు దక్కిన గుర్తింపే రుక్మిణీకి దక్కుతుంది. ఆపై వీరిద్దరూ కూడా కన్నడ నుంచే రావడం విశేషం. తనను నేషనల్ క్రష్ అని పిలువడంపై రుక్మిణీ వసంత్ రియాక్ట్ అయింది.ఇటీవల శివకార్తికేయన్ సరసన ‘మదరాసీ’లో మెప్పించిన రుక్మిణీ.. ‘కాంతార చాప్టర్-1’తో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం తన చేతిలో యశ్ టాక్సిక్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.. ఇందులో ఆమె పాత్ర కూడా బలంగా ఉండబోతుందని తెలుస్తోంది.నేషనల్ క్రష్ గురించినేషనల్ క్రష్ ట్యాగ్లైన్ గురించి రుక్మిణీ ఇలా చెప్పింది. 'కొద్దిరోజుల నుంచి చాలా మంది నేషనల్ క్రష్ అంటూన్నారు. ఈ విషయం నా వరకు కూడా వచ్చింది. ఇలాంటివి వినడానికి మాత్రమే చాలా బాగుంటాయి. సంతోషాన్ని కూడా ఇస్తాయి. కానీ, ఇలాంటి ప్రశంసల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఇలాంటివి ఏమైనా సరే తాత్కాలికంగానే ఉంటాయి. కాలంతో పాటు ఎందరో వస్తుంటారు.. అవి కూడా మారిపోతుంటాయని నేను నమ్ముతాను. కానీ, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటే చాలనుకుంటాను. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో చాలామంది నన్ను ప్రియ పాత్రతో పిలుస్తుంటారు. ఇలా ప్రేక్షకులకు చేరువయ్యితే చాలనుకుంటాను. చాలా సింప్లిసిటీతో కూడిన ఆ పాత్రను కూడా సినీప్రియులు ఆదరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.'అని ఆమె అన్నారు. -
సినీ హీరోలను తలపై పెట్టుకొని ఊరేగకండి: సత్యరాజ్
తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేరుచేసి చూడలేం. ఈ రెండింటి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది. ప్రఖ్యాత దివంగత రాజకీయ నాయకులు కామరాజర్, అన్నాదురై నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ వరకు సినిమాలతో చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్లే. ఇప్పుడు కూడా చాలా మంది నటీనటుల దృష్టి రాజకీయాలపైనే ఉందని చెప్పవచ్చు. తాజాగా విజయ్ రాజకీయ రంగప్రవేశం ప్రకంపనలు పుట్టిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన ప్రచారంలో జరిగిన దురదృష్టకర సంఘటన అనేక చర్చలకు దారి తీస్తోంది. సినీ రంగంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తోంది. ఉదాహరణకు సత్యరాజ్(Satyaraj ), విజయ్ను విమర్శించే విధంగా తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందులో నటులను తలపై పెట్టుకొని ఊరేగకండి.., వాళ్లకు చాలా తెలుసని మీరు భావించకండి, నటించడం మాత్రమే తెలుసు. ఈ సమాజంలో జరుగుతున్న పెద్ద తప్పు నటులను ఐన్ స్టిన్ రేంజ్లో భావిస్తుండడమే. మమ్మల్ని నెత్తినెక్కించుకోకండి. మేము జస్ట్ పాటిస్తాం అంతే. మేము పెరియార్, అంబేడ్కర్ కాదని గుర్తుంచుకోవాలంటూ పేర్కొన్నారు. ఈ కామెంట్పై దర్శకుడు పేరరసు తీవ్రంగా స్పందించారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటులకు ఏమీ తెలియదు. ఒట్టి మట్టే అంటే ఎలా.. మీరూ నటుడే కదా.. మీరెందుకు సందేశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎంజీఆర్ ఉన్నప్పుడు మీకు ఇలా అనే ధైర్యం ఉండేదా ? కమలహాసన్కు ఎంపీ పదవి ఇచ్చారని, మీరు డీఎంకేను అడగాల్సింది. పార్టీ కోసం శ్రమించిన వాళ్లు ఎందరో ఉండగా వారి కూతుళ్లకు పదవి ఇవ్వకుండా సత్యరాజ్ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారని మీరు డీఎంకే పార్టీని అడగాలి. నటన అనేది ఒక వృత్తే. అందులోనూ ప్రపంచ జ్ఞానం కలవారు ఎందరో ఉన్నారు. వారిని అరకొర తెలిసిన వాళ్లు అని కించపరచరాదు అని దర్శకుడు పేరరసు సత్యరాజ్పై ఫైర్ అయ్యారు. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి!
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అని అంటున్నారట హీరో రవితేజ. ఈ విజ్ఞప్తి వివరాల కోసం ప్రేక్షకులను వచ్చే సంక్రాంతికి థియేటర్స్కి రమ్మంటున్నారు. రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తొలుత ‘అనార్కలి’ అనే టైటిల్ను అనుకున్నారు.కానీ తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ కోసమే రవితేజ స్పెయిన్ వెళ్లారు. కొంత టాకీ పార్టు, రెండు పాటల చిత్రీకరణ స్పెయిన్ లొకేషన్స్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అక్టోబర్లో రిలీజయ్యే సినిమాలివే..
చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పందెం కోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే సంక్రాంతికి భారీపోటీ ఉంటుంది. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి పండగలు తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్ ఆలోచన. ఈ ఏడాది దసరా, దీపావళి పండగలు అక్టోబరులోనే రావడం విశేషం. సో.. సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచ్చు.ఈ నెల ఆరంభంలో ‘ఇడ్లీ కొట్టు, కాంతారా: చాప్టర్ 1’ వంటి డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ నెలలోనే రవితేజ ‘మాస్ జాతర’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం ‘కె.ర్యాంప్’, సాయికుమార్, అనసూయ ‘అరి’, రక్షిత్ అట్లూరి ‘శశివదనే’ వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ప్రభాస్ ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి. ‘బాహుబలి: ది ఎపిక్’గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇవి మాత్రమే కాదు... ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళదాం.బాహుబలి: ది ఎపిక్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 15న, ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్బస్టర్గా నిలవడంతో పాటు పలు రికార్డులు, రివార్డులు సాధించింది.‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ఇంటర్నేషనల్ వైడ్గా ఈ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది? అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాలి.థియేటర్లలో జాతర రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. పైగా ‘ధమాకా’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.‘‘రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భాను భోగవరపు. ‘ధమాకా’ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘మాస్ జాతర’ కోసం సూపర్ మ్యూజిక్ అందించారు. మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్ పండగను తీసుకురాబోతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మనసు హత్తుకునే తెలుసు కదా! ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’.ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్రపోషించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.‘‘మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. మనసుని హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి. నీరజ కోన యునిక్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, వినోదాల ర్యాంప్ ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, క’ చిత్రాల ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్’. జైన్ ్స నాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.‘‘లవ్, రొమాన్ ్స, యాక్షన్, ఫన్తో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కె–ర్యాంప్’. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవ్వులు పంచే మిత్ర మండలి ‘బలగం, కోర్ట్’ చిత్రాల ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్. దర్శకత్వం వహించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. బ్రహ్మానందం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలుపోషించారు. బీవీ వర్క్స్(బన్నీ వాసు) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్పై కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.‘‘స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు మేకర్స్.తండ్రీ కొడుకుల అనుబంధం ‘పలాస 1978, నరకాసుర, ఆపరేషన్ రావణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్. తమిళ నటుడు శ్రీమాన్ కీలక పాత్రపోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘శశివదనే’. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులను నిరాశపరచదు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. దీపావళికి డ్యూడ్ ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రపోషించారు. ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. న్యూ ఏజ్ కథాంశంతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఆడియన్స్ని అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సమాజానికి సందేశం సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘‘మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్ పై బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్పోలీస్ కానిస్టేబుల్ పాత్రపోషించారు.సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని హైదరాబాద్ మాజీపోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
గ్రామంలో హైలెస్సో..
సుధీర్ ఆనంద్ (‘సుడిగాలి’ సుధీర్) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైలెస్సో’. ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రసన్నకుమార్ కోట దర్శకత్వంలో శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్పోస్టర్ను విడుదల చేశారు. శివాజీ, అక్షర గౌడ, మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్. -
థ్రిల్లింగ్ మారియో
అనిరుధ్, హెబ్బా పటేల్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘మారియో’. ‘నాటకం, తీస్ మార్ ఖాన్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ జి. గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ప్రోడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, రాకేందు మౌళి, కెమెరా: ఎంఎన్ రెడ్డి. -
నేను నీకు కరెక్టేనా?
‘విక్రమ్... అందరికీ ఒక టైపు ఉంటుంది కదా... నేను నీ టైపేనా’, ‘అంటే... ఒకరికొకరు కరెక్టా? అని ఎలా తెలుస్తుంది... అంతకన్నా ఎప్పుడు తెలుస్తుంది’, ‘కొంపతీసి నేను నీకు కరెక్టేనా అని ఆలోచిస్తున్నావా ఏంటి?’, ‘నేను నీకు కరెక్టేనా? అని కూడా ఆలోచిస్తున్నా?’... ఈ సంభాషణలు‘ది గార్ల్ ఫ్రెండ్’ సినిమా రిలీజ్ డేట్ ప్రోమోలోనివి.రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 7న రిలీజ్ చేయనున్నట్లుగా పేర్కొని, రిలీజ్ డేట్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. -
ఐదేళ్ల తర్వాత చేతికి పాస్పోర్ట్.. హీరోయిన్ భావోద్వేగం
ఐదేళ్ల క్రితం లాక్డౌన్ టైంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఈ విషయమై అప్పట్లో ఇతడి మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు, కేసులు అంటూ ఆ కేసు చాన్నాళ్ల పాటు సాగుతూనే వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈమెకు కొంతమేర విముక్తి దొరికినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!)దాదాపు ఐదేళ్ల తర్వాత పాస్పోర్ట్ తన చేతికి తిరిగొచ్చిందని రియా చక్రవర్తి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటినటీనటులు కంగ్రాట్స్ చెబుతున్నారు. గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రియానే స్వయంగా చెప్పింది. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ కేసు విచారణ సమయంలో రియాకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. పాస్పోర్ట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్లకు తిరిగిచ్చేయడంతో రియా ఆనందగానికి హద్దుల్లేకుండా పోయింది.పశ్చిమ బెంగాల్కి చెందిన రియా చక్రవర్తి.. 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. మొత్తంగా ఏడెనిమిది చిత్రాల్లో మాత్రమే నటించింది. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ చనిపోయాడో అప్పటినుంచి ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు కొంతమేర క్లియర్ కావడంతో మళ్లీ సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే రియా చక్రవర్తి.. బిగ్బాస్ షోలో పాల్గొని తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
బిగ్బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!
ఈసారి షాకింగ్ ఎలిమినేషన్. గత వారం ప్రియ బయటకెళ్లిపోయింది. కానీ ఆమెతో పాటు చివరవరకు డేంజర్ జోన్లో ఉన్న కల్యాణ్ లిస్టులో లేడు. దీంతో ప్రియ దోస్త్ శ్రీజ.. ఈసారి ఎలిమినేట్ కావడం పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ గేమ్స్ వల్ల ఈ వారం చాలా లెక్కలు మారిపోయాయి. అయినా సరే మరో కామనర్ ఎలిమినేట్ అయిపోయాడు. అతడే మాస్క్ మ్యాన్ హరీశ్. ఇంతకీ అసలేమైంది?అగ్నిపరీక్ష పోటీలో మంచి ప్రదర్శన ఇచ్చిన హరీశ్.. హౌసులోకి అడుగుపెట్టాడు. అయితే వచ్చినప్పటి నుంచి నాకు నచ్చినట్లు నేనుంటాను. పక్కనోళ్లు కూడ నాకు నచ్చినట్లుగానే ఉండాలని అనుకునేవాడు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు నోరుజారడం, వాటి గురించి హోస్ట్ నాగార్జున క్లాస్ పీకడం కామన్ అయిపోయింది. కానీ ఈ వారం మాత్రం ఆరోగ్య సమస్యల వల్ల గేమ్స్ ఆడలేకపోయాడు. దీంతో ఓటింగ్ అంతా డ్రాప్ అయిపోయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ఓజీ' నుంచి నేహా శెట్టి సాంగ్ రిలీజ్)ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. సంజన, రీతూ, శ్రీజ, ఫ్లోరా, దివ్య, హరీశ్. వీళ్లలో సంజన, రీతూ, ఫ్లోరా.. తొలి వారం నుంచి అడపాదడపా నామినేషన్లలో ఉంటూ వచ్చారు. దీంతో వాళ్లకు ఓటు బ్యాంక్ బాగానే ఏర్పడింది. అలా ఈసారి కూడా ఓటింగ్ బాగానే పడింది. దివ్య కూడా వచ్చి వారమే అవుతుండటం, హౌసులో హుందాగా ప్రవర్తిస్తుండటం ఈమెకు ప్లస్ అవుతోంది. అది ఓట్ల రూపంలో మారుతోంది. చివరగా ఈసారి శ్రీజ కూడా కల్యాణ్కి సపోర్ట్ చేస్తూ బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. దీంతో ఈమెకు కూడా ఓట్లు బాగానే పడ్డాయి. అమ్మాయిలందరూ ఆకట్టుకుంటే హరీశ్ మాత్రం ఆరోగ్య సమస్యలతో గేమ్స్ ఆడలేకపోయారు. అలా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యనే మెయిన్ అయినప్పటికీ హరీశ్పై హౌసులోనూ నెగిటివిటీ బాగానే ఏర్పడినట్లు తెలుస్తోంది. తాజాగా శనివారానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఫ్లోరా-హరీశ్ ఫొటోల్లో ఒకరిది ఎంచుకుని ట్రాష్ చేయాలని నాగార్జున అడిగేసరికి చాలామంది హౌస్మేట్స్ హరీశ్ పేరు చెప్పారు. అలా ఈసారి హౌస్ నుంచి మాస్క్ మ్యాన్ని ఎలిమినేట్ చేసేశారట. అనధికారికంగా ఈ విషయం బయటకొచ్చింది. ఆదివారం ఎపిసోడ్తో హరీశ్ ఎలిమినేషన్పై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి) -
రాశీఖన్నా ఫ్యామిలీ మూమెంట్.. అనుపమ గోల్డెన్ డ్రస్!
ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాశీఖన్నాబంగారు వర్ణం డ్రస్సులో అనుపమ పరమేశ్వరన్పచ్చని డ్రస్సులో గ్లామరస్గా ప్రియా వారియర్సిరిసిల్లలో షాప్ ఓపెనింగ్లో నటి దివి వద్త్యపారిస్ ట్రిప్లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేఫ్రెండ్ పెళ్లిల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) -
'ఓజీ' నుంచి నేహా శెట్టి సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సైలెంట్ అయిపోయింది. ఈ సినిమాకు ప్రారంభ వారంలో జనాలు వెళ్లారు గానీ తర్వాత చాలావరకు తగ్గిపోయారు. అయితే రెండో వారం నేహాశెట్టి చేసిన ఓ ఐటమ్ సాంగ్ని సినిమాలో జీడించారు. అయితే మూవీలోని మిగతా పాటలతో పోలిస్తే ఇది అంతంత మాత్రంగానే ఉండటం, దానికి తోడు సినిమాలో రాంగ్ ప్లేస్మెంట్లో వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి)థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పాటని ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అయితే ఈ గీతంలో నేహాశెట్టి మాత్రమే ఉంది. అటు హీరో పవన్ కల్యాణ్ గానీ విలన్ ఇమ్రాన్ హష్మీ గానీ లేకపోవడంతో ఈ పాట జనాలకు కూడా పెద్దగా రీచ్ కాలేదు. (ఇదీ చదవండి: ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్) -
నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి
'కేజీఎఫ్' సినిమాతో హీరోయిన్గా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. తర్వాత అడపాదడపా దక్షిణాదిలో మూవీస్ చేస్తోంది. ఈ ఏడాది నాని 'హిట్ 3'తో వచ్చింది. సక్సెస్ అందుకుంది. ఇప్పుడు 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబరు 17న థియేటర్లలో రానున్న ఈ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ తనని ఫ్రెండ్స్ అందరూ లేడీ ప్రభాస్ అని పిలుస్తారని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది.'నేను ప్రభాస్లా సోషల్ మీడియాలో ఎక్కువ ఉపయోగించను. అందుకే నా స్నేహితులందరూ నన్ను లేడీ ప్రభాస్ అని పిలుస్తుంటారు' అని శ్రీనిధి శెట్టి చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయమై ప్రభాస్ అభిమానులు భిన్నంగా స్పందిస్తుంటారు. తమ ఫేవరెట్ హీరోకి లేడీ వెర్షన్ అంటే అనుష్కనే అవుతుందని మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీనిధి శెట్టి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్)శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన 'హిట్ 3' ఆకట్టుకుంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'లో ఓ హీరోయిన్గా చేసింది. ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుంది.త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమా కోసం ఈమెను హీరోయిన్గా తీసుకున్నారనే రూమర్ వినిపించింది. దీని గురించే 'తెలుసు కదా' ప్రమోషన్లలో అడగ్గా.. ఈ ప్రాజెక్ట్ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఆ ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా తాను నటిస్తానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!) -
ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్
పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్న రష్మిక.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. హీరో విజయ్ దేవరకొండతో ఇది జరిగింది. అధికారికంగా బయటకు చెప్పలేదు. అయితే ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని విజయ్ టీమ్ చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే త్వరలో రష్మిక పెళ్లి హడావుడిలో పడిపోతుంది. అంతకు ముందు ఈమె నటించిన ఓ రెండు మూవీస్... రెండు వారాల వ్యవధిలో రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!)ఈ ఏడాది ఛావా, సికిందర్, కుబేర సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన రష్మిక.. ఈ నెల 21న 'థామా' అనే హారర్ మూవీతో థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన 'గర్ల్ ఫ్రెండ్' చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. నవంబరు 07న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు ఓ స్పెషల్ వీడియో విడుదల చేసి మరీ చెప్పుకొచ్చారు.గీతా ఆర్ట్స్ నిర్మించిన 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు కాగా.. రష్మిక సరసన దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే ఒకటి రెండు పాటలు రిలీజ్ కాగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. నవంబరు 07న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటించారు. ఆ తేదీన చెప్పుకోదగ్గ పెద్ద మూవీస్ అయితే ఏం లేవు.(ఇదీ చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్) -
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!
ఒకప్పుడు అంటే తెలుగు సినిమాల్లో ముద్దు సన్నివేశాలు అంటే వామ్మో అన్నట్లు చూసేవారు. కానీ గత కొన్నేళ్లలో మాత్రం ఈ విషయం చాలా సాధారణమైపోయింది. ప్రేక్షకులు కూడా ముద్దు సన్నివేశాల్ని సాధారణంగానే తీసుకుంటున్నారు. ఒకవేళ హీరోయిన్లని ఈ సీన్స్ గురించి అడిగితే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అనే మాట అంటారు. అయితే అది ఇప్పుడు పెద్ద జోక్ అయిపోయింది అని హీరోయిన్ కోమలి ప్రసాద్ అంటోంది.(ఇదీ చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్)రౌడీ బాయ్స్, హిట్ 2, హిట్ 3 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కోమలి.. స్వతహాగా తెలుగమ్మాయి. సహాయ పాత్రలు చేస్తూ వచ్చిన ఈమె.. ఇప్పుడు హీరోయిన్గా 'శశివదనే' అనే మూవీ చేసింది. అక్టోబరు 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టగా ట్రైలర్ చూపించిన లిప్ కిస్ గురించి కోమలి మాట్లాడింది.'ఈ రోజుల్లో ముద్దు సన్నివేశంలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నటించానని అనడం పెద్ద జోక్ అయిపోయింది. కానీ మా సినిమాలో ఈ సన్నివేశానికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. నేను చేసిన శశి అనే అమ్మాయి పాత్ర.. అసలు ఏడుస్తూ రాఘవని ఎందుకు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చిందనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. అలా అని ఇదేదో కావాలని ఇరికిందింది అయితే కాదు' అని కోమలి ప్రసాద్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్: నటి హేమ) -
పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్.. అప్పుడు చచ్చిపోవాలనుకున్నా!
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి హేమ (Actress Hema). టాలీవుడ్లో వందలాది సినిమాలు చేసిన ఆమె ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ వస్తోంది. తాజాగా తన జర్నీ గురించి యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకుంది. హేమ మాట్లాడుతూ.. అమ్మకు సినిమాలంటే ఇష్టం. అలా నేను ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మ సపోర్ట్ లేకపోతే నేనింతవరకు వచ్చేదాన్ని కాదు. ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లవుతోంది.పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదుకెరీర్ బాగున్నప్పుడే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సినిమాకు, ఫంక్షన్కు, ఓ ఇంటర్వ్యూకు.. అలా కాసేపు బయటకు వెళ్దామన్నా సరే మా ఆయన రాడు. తను రిజర్వ్డ్గా ఉంటాడు. పొద్దున్నే లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్కు వెళ్లేదాన్ని. తిరిగి రాగానే మళ్లీ వంట చేసేదాన్ని. అలా క్షణం తీరిక లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాను. నా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది. అందుకే బిగ్బాస్కు వెళ్లా..లాక్డౌన్లో 40 ఏళ్ల వయసు దాటేశాను. ఆ వయసులో నా శరీరంలో హార్మోన్లలో మార్పు మొదలైంది. డిప్రెషన్ ఛాయలు కనిపిస్తున్నాయి. నాకెవరి టార్చర్ లేదు, అయినా తెలియని కోపం, బాధ.. ఎందుకో నాకే అర్థం కాలేదు. అప్పుడు బిగ్బాస్ ఆఫర్ రావడంతో షోకి వెళ్లిపోయా.. బిగ్బాస్ హౌస్లో అందరికీ బాగా వండిపెట్టాను. నాకు నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను ఎదురుచెప్పలేను. బహుశా అందుకే నన్ను వారం రోజులకే ఎలిమినేట్ చేశారు. కానీ ఆ షో వల్ల ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లతో కలిసి చిల్ అయ్యేదాన్ని. నాగార్జున వస్తే..త్వరగానే డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. చిన్న చిన్న బిజినెస్లు చేశాను. నా కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్కి నాగార్జున, అమలతో కలిసి వచ్చారు. గంటన్నరసేపున్నారు. ఇంకా ఉండాలనుకున్నారు. కానీ అక్కడున్నవాళ్లు ఫోటోల కోసం ఇబ్బందిపెడుతుండటంతో ఇక వెళ్లిపోండి.. అని నాగార్జునను బతిమాలి పంపించేశాను. నా జీవితంలో అనుభవించని కష్టాలు, ఇబ్బందులన్నీ ఒక్క 2024లోనే ఫేస్ చేశాను. ఏ తప్పు చేయకపోయినా కష్టాలపాలయ్యాను. ఒకానొక సమయంలో చచ్చిపోవాలనిపించింది లేదంటే ఎవరినైనా చంపేయాలనిపించింది అని హేమ చెప్పుకొచ్చింది. ఈ నటి తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొంది.చదవండి: ఇండియన్ అంకుల్లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళ -
బిగ్బాస్లోకి 'ప్రభాస్' ఫ్రెండ్తో పాటు మరో నలుగురికి ఎంట్రీ!
బిగ్బాస్-9 తెలుగులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కామనర్స్ విభాగం నుంచి దివ్య నిఖిత హౌస్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వారి పేర్లు కూడా సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్తవారు హౌస్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో బిగ్బాస్లో ఆట మరింత రణరంగంగా మారనుందని చెప్పవచ్చు.సినీ నటుడు ప్రభాస్ శీను(Prabhas Sreenu) బిగ్బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్తున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 11,12 తేదీలలో వీరందరూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. హీరో ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు కావడంతో ఆయన పేరునే ట్యాగ్లైన్గా మార్చుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లో సంఖ్య పెరగడంతో పాటు ఆట మరింత ఆసక్తిగా ఉండనుందని సమాచారం. బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్(Nikhil Nair) కూడా బిగ్బాస్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. భారీ కటౌట్తో ఉన్న నిఖిల్ సిరీయల్స్తో మెప్పించాడు. ఇంటింటి గృహలక్ష్మి, పలుకే బంగారమాయెనా సీరియల్స్తో గుర్తింపు పొందాడు.అలేఖ్య చిట్టి పికిల్స్తో గుర్తింపు తెచ్చుకున్న సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమ్య(Ramya) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. రీసెంట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ గురించి పెద్ద కాంట్రవర్సీ జరగడంతో ఆమె పేరు బాగా వెలుగులోకి వచ్చింది. దీంతో బిగ్బాస్ టీమ్ ఆమెతో సంప్రదింపులు జరిపారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు టాక్.లఘు చిత్రాలు, వెబ్ సీరిస్లతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్(Akhil Raj) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయినట్లు సమాచారం. అయితే, సోషల్మీడియాలో అతనికి పెద్దగా గుర్తింపు లేదు. ఇలా బిగ్బాస్తో అందరికీ దగ్గరకావాలనే ప్లాన్ ఉన్నాడు. యూకేలో నివసిస్తున్న మౌనిషా చౌదరి(Mouneesha Chowdary) బిగ్బాస్లో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి.. ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటుంది. 2016లో 'మిస్ ఆసియా ఉతా'గా కిరీటం గెలుచుకుంది. స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి 'కన్నప్ప' టూర్లో పాల్గొంది. సినిమాను ప్రమోట్ కూడా చేసింది. -
ఇండియన్ అంకుల్లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళ
కొంతమంది ఫోటోలు దిగడంలో దిట్ట. కొందరికేమో సరిగా ఫోటోలు దిగడమే రాదు. హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) రెండో కోవలోకి వస్తుంది. ఫోటో దిగేటప్పుడు కెమెరా వైపు కాకుండా మరోవైపు బిత్తరచూపులు చూస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేనెప్పుడు సెల్ఫీ తీసుకున్నా.. కెమెరా వైపు కాకుండా స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. ఇండియన్ అంకుల్స్ ఇలాగే చేస్తారు కదా!సెల్ఫీ ఫోటోలుఇట్స్ ఓకే.. నన్ను ఇండియన్ అంకుల్ అనుకోండి.. మరేం పర్వాలేదు అని క్యాప్షన్ ఇచ్చింది. తను యోగా చేస్తున్న ఫోటోను, తిన్న ఐస్క్రీమ్ను, అద్దంలోనుంచి బయటకు చూస్తున్న పిక్స్ను ఈ పోస్ట్లో జత చేసింది. అలాగే రెండు సెల్ఫీ పిక్స్ కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలతో మెప్పించిందీ తెలుగు బ్యూటీ.సినిమాహిందీలో.. రామన్ రాఘవ్ 2.0, చెఫ్, ద బాడీ, లవ్ సితార వంటి సినిమాలు చేసింది. తమిళంలో పొన్నియన్ సెల్వన్ ఫస్ట్, సెకండ్ పార్ట్స్లో నటించింది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేసింది. ఓటీటీలో మేడ్ ఇన్ హెవెన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లలోనూ నటించింది. ప్రస్తుతం తమిళంలో పా.రంజిత్ డైరెక్షన్లో 'వెట్టువం' మూవీలో శోభిత యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే? -
కూలీ ఫేమ్ రచిత రామ్ 'కల్ట్' పోస్టర్ విడుదల
కన్నడ హీరోయిన్ రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్గా కూలీ సినిమాలో లేడీ విలన్గా నటించిన ఈ బ్యూటీ తాజాగా ‘కల్ట్’ పేరుతో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నారు. ఈ మూవీకి ‘బ్లడీ లవ్’ అనే ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించనున్నారు. ఇందులో రచిత రామ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆమెకు జోడీగా జైద్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమా కథలో రచిత రామ్ ఒక లవ్ ఫెయిల్యూర్ యువతిగా కనిపించనున్నారు. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మలుపులు తిరుగుతుంది అనే అంశం చుట్టూ కథ సాగుతుంది.రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కల్ట్ పోస్టర్లో ఆమె లేడీ డాన్ లుక్లో కనిపించారు. బాత్రూమ్లో టాయిలెట్ సీటింగ్పై కూర్చొని, సిగరెట్ తాగుతూ.. ఆమె మాస్ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పక్కన గిటార్ కాలిపోతుండగా, వెనకాల ఒక వ్యక్తి బాధతో చూస్తున్న ఫొటో కూడా ఉంది. ‘‘నీ జ్ఞాపకాలను ఫ్లష్ చేసి తుడిచి పెట్టలేను’’ అనే డైలాగ్తో పోస్టర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ద్వారా రచిత రామ్ మరోసారి తన నటనలో విభిన్నతను చూపించబోతున్నారు. ఇలాంటి పాత్రలతో రచిత రామ్ తన కెరీర్లో కొత్త మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 23న తెలుగులో కూడా విడుదల కానుంది. View this post on Instagram A post shared by R R (@rachita_instaofficial) -
ప్రియురాలు ఫిర్యాదు.. సింగర్కు నాలుగేళ్ల జైలు శిక్ష
అమెరికన్ ప్రముఖ ర్యాపర్ డిడ్డీ (54)కి జైలు శిక్ష పడింది. అమ్మాయిల ట్రాఫికింగ్కు పాల్పడుతున్నాడని ఈ ఏడాది జులైలో న్యూయార్క్లోని ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో ఆయన్ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. కానీ, అతని మాజీ ప్రియురాళ్ళు కాసాండ్రా వెంచురా, జేన్లతో వ్యభిచారం కోసం రవాణా చేసినందుకు అతని ప్రమేయం ఉందని తేలింది. తమను డిడ్డీ విక్రయించాడని వారు కోర్టుకు ఆధారాలు అందించారు. దీంతో అతనికి 4ఏళ్లు జైలు శిక్ష పడింది.2016లో డిడ్డీ తన ప్రియురాలు కాసాండ్రా వెంచురా నుంచి బ్రేకప్ అయ్యాడు. కానీ ఆ సమయంలో ఆమె డిడ్డీపై పలు ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా హింసించాడని పేర్కొంది. అత్యాచారం- దాడి -మానవ అక్రమ రవాణా సహా చాలా కేసులు కూడా ఆ సమయంలో పెట్టింది. పురుష వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకోమని డిడ్డీ బలవంతం చేశాడని కూడా కాసాండ్రా ఆరోపించింది. ఈ క్రమంలోనే తనను విక్రయించాడని కూడా పేర్కొంది.ర్యాపర్ డిడ్డీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని న్యాయమూర్తి పేర్కొన్నాడు. దీంతో అతనికి 4 ఏళ్లు జైలు శిక్ష విదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షను అధిగిమించి తిరిగొస్తావని ఆశిస్తున్నట్లు డిడ్డీతో ప్రధాన న్యాయమూర్తి అన్నారు. మహిళలకు హాని కలిగించడానికి నువ్వు చూపిన చొరవ.. వారికి సహాయం చేయడానికి చూపించాల్సింది అంటూ చేసిన పాపాల విముక్తి కోసం ఈ శిక్ష తప్పదని పేర్కొన్నారు.తన ప్రతిభతో గ్రామీ అవార్డులను సొంతం చేసుకుని మ్యూజిక్ మొఘల్ గా డిడ్డీ కీర్తిని అందుకున్నాడు. కోర్టు తీర్పు తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రవర్తన భయానకంగా, అవమానకరంగా ఉందని తన తప్పును ఒప్పుకున్నాడు. అయితే తాను మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నానని చెప్పాడు. నేను చేసిన తప్పులను ఎట్టిపరిస్థితిలోనూ సమర్థించుకోను. నేను శిక్ష అనుభవించాల్సిందే. డిడ్డీ 2029లో విడుదల కావచ్చు.BREAKING: Sean 'Diddy' Combs sentenced to over 4 years in federal prison.Back in July, Combs was found guilty of two counts of transporting individuals for prostitution."A substantial sentence must be given to send a message to abusers and victims alike that abuse against… pic.twitter.com/atFjasAmiv— Collin Rugg (@CollinRugg) October 3, 2025 -
దిగొచ్చిన యూట్యూబ్.. ఐశ్వర్యరాయ్ వీడియోలు తొలగింపు
బాలీవుడ్ కపుల్స్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)ల దెబ్బతో యూట్యూబ్ దిగొచ్చింది. యూట్యూబ్లో తమ అనుమతి లేకుండా ఫోటోలు ఉపయోగిస్తున్నారని వాటిని తొలగించాలని కొద్దిరోజుల క్రితం ఢిల్లీ హైకోర్టును వారు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు నుంచి వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ యూట్యూబ్లో ఆ వీడియోలు ఉండటంతో ఐశ్వర్య దంపతులు ఆగ్రహించారు. మరోసారి కోర్టుకు వెళ్లారు. యూట్యూబ్పై రూ. 4 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీంతో ఆ సంస్థ దిగొచ్చింది.ఐశ్వర్య దంపతులు రూ.4కోట్ల దావా వేయడంతో ఆ వీడియోలను యూట్యూబ్ తొలగించింది. సుమారు 250కి పైగా వీడియో లింక్లను తొలగించడంతో పాటు ఆ ఛానల్స్ను బ్లాక్ చేసింది. ఇప్పటికే ఆ వీడియోలకు సుమారు 20 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం ఆశ్చర్యం కలిగించే అంశమని చెప్పవచ్చు. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలకు ఇలాంటి చిక్కులు ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్గా అక్కినేని నాగార్జున కూడా తన ఫోటోలు, వీడియోలు అనుమతి లేకుండానే కొన్ని సంస్థలు తమ వ్యాపారా ప్రకటనలకు ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఐశ్వర్యరాయ్ అనుమతి లేకుండా ఆమె ఫొటోలు, వీడియోలను ఏఐ టెక్నాలజీ ఉపయోగించడంతో వారు అభ్యంతరం తెలిపారు. ఆమె పేరు, గౌరవం, ప్రతిష్ఠ ను దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు ఏంటి అంటూ కోర్టు పేర్కొంది. ఐశ్వర్యను దెబ్బతీసేలా ఉన్న యూఆర్ఎల్లను తొలగించి బ్లాక్ చేయాలని గూగుల్, యూట్యూబ్తో సహా ఇతర ప్లాట్ఫార్మ్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 72 గంటల్లోపు ఎలాంటి వీడియోలు కనిపించకూడదని హెచ్చిరించింది. ఈ క్రమంలోనే యూట్యూబ్, గూగుల్ చర్యలు చేపట్టింది. -
అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార
హీరోయిన్ నయనతార (Nayanthara) దేవతగా నటించిన చిత్రం మూకుత్తి అమ్మన్(ఈ మూవీ తెలుగులో అమ్మోరు తల్లి పేరిట విడుదలైంది). వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రం 2020లో విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా మూకుత్తి అమ్మన్–2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రంలో నయనతార అమ్మవారిగా నటిస్తున్నారు. ఐసరి గణేష్ తన వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. పార్ట్–1 కంటే మరింత భారీ బడ్జెట్లో రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్–2 షూటింగ్ గత మార్చి నెలలో ప్రారంభమైంది. నయనతార, కమర్షియల్ దర్శకుడు సుందర్.సి కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. విజయదశమి పండుగ సందర్భంగా గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అమ్మవారి గెటప్లో ఉన్న నయనతార పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెల్ను తెలుగులో మహాశక్తి పేరిట విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Vels Film International (@velsfilmintl) చదవండి: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న 'బేబీ' సింగర్ -
వార్2 ఫలితంపై స్పందించిన 'హృతిక్ రోషన్'
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్2.. ఆగష్టు 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ ఫ్రాంఛైజీలోకి ఎన్టీఆర్ రావడంతో వార్2 కోసం తెలుగు వారు కూడా మరింత ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, టాలీవుడ్లో దారుణమైన నెగటివ్ రివ్యూలు కనిపించడంతో పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి హృతిక్ రోషన్ ఒక పోస్ట్ చేశారు.వార్2 గురించి హృతిక్ ఇలా చెప్పారు. 'వార్2లో కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించింది. ప్రాజెక్ట్ మొత్తం చాలా రిలాక్స్డ్గా పూర్తి చేశాను. నాకు ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చాలా సులువు అయింది. ఒక నటుడిగా సినిమా కోసం నేను చేయాల్సింది చేశాను. సెట్స్లో నా పని పూర్తి అయిన తర్వాత ఇంటికి రావడం.. మరుసటి రోజు షెడ్యూల్ ఏంటో చూసుకోవడం జరిగేది. నా దర్శకుడు అయాన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు. సెట్లో అతను ఎప్పుడూ కూడా చాలా ఎనర్జీగా కనిపిస్తూ ఉండటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సినిమా చేస్తున్నంత కాలం ప్రతిదీ చాలా పరిపూర్ణంగా అనిపించింది. నా పని నేను పూర్తి చేస్తే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం.. కానీ, వెనుక నుంచి మమ్మల్ని ఏదో పదేపదే ఆపుతున్న ఒక శబ్ధం వినిపించేది. ప్రతి సినిమా ఒక చిత్రహింసలా, ఒక గాయంలా ఉండాల్సిన పనిలేదు. జస్ట్ రిలాక్స్" అని హృతిక్ పోస్ట్ చేశాడు.వార్ 2 సినిమాకి ఎక్కువగా నెగటివ్ రివ్యూలే వచ్చాయి. రూ. 400 కోట్ల బడ్జెట్తో నిర్మించిన వార్ 2 రూ. 236.55 కోట్లు వసూలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలైన వార్ కంటే తక్కువ మొత్తంలో వసూలు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 318.01 కోట్లు వసూలు చేసింది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న 'బేబీ' సింగర్
మలయాళంలో గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ ప్రేమ వివాహం చేసుకుంది. తాజాగా ఇదే విషయాన్ని సోషల్మీడియాలో ప్రకటించింది. చాలా కాలంగా అభిషేక్తో ప్రేమలో ఉన్నానంటూ చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్ను చూపుతూ తన భర్తతో పాటు ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.‘బేబీ’ సినిమాతో తెలుగు పరిశ్రమకి ఆర్య దయాళ్ పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాటను ఆమె పాడారు. తెలుగులో ఆమెకు ఇదే తొలి కావడం విశేషం. ఈ పాటకు టాలీవుడ్లో అభిమానులు భారీగానే ఉన్నారు. స్టార్ సింగర్గా మలయాళంలో భారీ క్రేజ్ ఉన్న ఆర్య దయాళ్ ఇలా సింపుల్గా పెళ్లి చేసుకోవడంతో అందరూ ఈ దంపతులను అభినందిస్తున్నారు. అభిషేక్ కూడా సంగీత ప్రపంచంలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by MazhavilManoramaTV (@mazhavilmanoramatv) -
క్లాప్... క్లాప్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దసరా సందడి ప్రతి ఏడాది కంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువగా కనిపించింది. ఈ పండగ సందర్భంగా పలు సినిమాలు ఘనంగా ప్రారంభోత్సవాలు జరుపుకున్నాయి. ఆ చిత్రాల వివరాలేంటే చూద్దాం. వెంకటేశ్ క్లాప్తో... నాని హీరోగా ‘సాహో, ఓజీ’ చిత్రాల ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో కొత్త సినిమాకి శ్రీకారం జరిగింది. ‘నాని 34’ అనే వర్కింగ్ టైటిల్తో నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హీరో వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. నాని తండ్రి రాంబాబు ఘంటా కెమెరా స్విచ్చాన్ చేయగా, నాని, వెంకట్ బోయనపల్లి కలిసి స్క్రిప్ట్ను సుజిత్కి అందించారు. ఫస్ట్ షాట్కి దర్శకులు రాహుల్ సంకృత్యాన్, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ని బ్యాలెన్స్ చేస్తూ, నానీని ఎప్పుడూ చూడని పాత్రలో చూపించనున్నారు సుజిత్’’ అని వెంకట్ బోయనపల్లి తెలిపారు.కాంబినేషన్ రిపీట్... హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ (2023) మంచి విజయం సాధించింది. ఈ కాంబినేషన్లో మరో సినిమా ఆరంభమైంది. ‘శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు 2’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొందనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయిదుర్గా తేజ్ క్లాప్ కొట్టగా, హీరో నారా రోహిత్ స్క్రిప్ట్ని నిర్మాతలకు అందజేశారు. ‘‘హై ఓల్టేజ్ హ్యూమర్ ఎక్కువగా ఉండే కథనంతో ఈ చిత్రం నాన్స్టాప్ వినోదాన్ని అందించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. సరికొత్త ప్రేమ కథ ‘ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాల ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. చైతన్యా రావు హీరోగా, ఐరా, సాఖీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్ణ నాయుడు, శ్రీకాంత్ .వి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ దేవా కట్టా క్లాప్ కొట్టారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్లు స్క్రిప్ట్ని డైరెక్టర్కి అందజేశారు. వర ముళ్లపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సరికొత్త ప్రేమకథతో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్, కెమెరా: జ్ఞాన శేఖర్. ముగ్గురు యువకుల స్నేహం: ప్రేమ్, వాసంతిక జంటగా ‘మావా’ టైటిల్తో సినిమా ఆరంభమైంది. ఏ.ఆర్. ప్రభావ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకటేశ్ బాలసాని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి వెంకటేశ్ బాలసాని క్లాప్ ఇవ్వగా, ఆయన సతీమణి పద్మ కెమెరా స్విచ్చాన్ చేశారు. మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య సిరికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘స్నేహం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ముగ్గురు అబ్బాయిల మధ్య ఉండే స్నేహాన్ని అద్భుతంగా చూపించబోతున్నాం’’ అని యూనిట్ తెలిపింది. థ్రిల్లర్ నేపథ్యంలో... అభిరామ్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ రెడ్డి దాసరి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి భగీరథ కెమెరా స్విచ్చాన్ చేయగా, స్క్రిప్టును ఎన్.ఆర్. అనురాధా దేవికి అందించారు అభిరామ్. లవ్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నారు మేకర్స్. -
డిసెంబరులో...
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. ఎం. తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 25న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. తాజాగా డిసెంబరు 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 24న ప్రారంభం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘వీరసింహా రెడ్డి’ (2023). వీరి కాంబినేషన్లో రానున్న ద్వితీయ చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 24న ప్రారంభం కానుంది. -
అంత సులభం కాదు.. ట్రంప్ టారిఫ్స్పై నిర్మాత విశ్వప్రసాద్
కొన్నిరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సినిమా రంగంపై ఊహించని పిడుగు వేశాడు. విదేశీ చిత్రాలపై 100 శాతం టారిఫ్స్ విధిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇది అమల్లోకి వస్తే ఓవర్సీస్లో టాలీవుడ్ చిత్రాలకు ఇబ్బంది ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు. దీని వల్ల ఇప్పట్లో తెలుగు మూవీస్కి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని తన అభిప్రాయాన్ని చెప్పారు. 'సాక్షి'తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)ట్రంప్.. విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?ఇక్కడ లాస్ట్ అంటే బిఫోర్ ఎలక్షన్ నుంచి 'మాగా' అన్నది ఒక క్యాంపెయిన్. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. వీలైనంత వరకు అంటే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు.. వాళ్ల ఉద్యోగ అవకాశాలన్నీ అమెరికాలోనే జరగాలన్నది ఆయన ఆశయం. దాని ప్రకారం సినిమాల్లో కూడా ఈ హాలీవుడ్ వర్క్ అంతా బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళకుండగా అమెరికాలో జరగాలన్నది ఆయన ఉద్దేశం. దాన్ని నియంత్రించడానికే 100% టారిఫ్ అన్నారు. కానీ అది ప్రాక్టికల్గా ఎలా అమలు చేయాలి అనేదానికి ఒక ప్రొసీజర్ లేదు. కాబట్టి అది అంత సులభం కాకపోవచ్చు.ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ ఏమైనా సంతకం చేశారా?అంటే నేను విన్నది ఏంటంటే.. ఇది ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలంటే దీన్ని అంటే ఆ గైడ్ లైన్స్ డెవలప్ కావాలి. దీన్ని స్టడీ చేయడానికి చాలా అంశాలున్నాయి. అంటే దేని మీద టాక్స్ వేయాలా దేని మీద టారిఫ్ వేయాలా అన్నది. ఇదంతా డెవలప్ చేయడం కూడా ఎంత టైం అన్నా పట్టొచ్చు. మూడు నెలలైనా కావొచ్చు ఏడాదైనా పట్టొచ్చు. అప్పటివరకు మనం ఏం చెప్పలేం. జనరల్గా టారిఫ్ ఉన్నా లేకున్నా మనం కాస్ట్ కంట్రోల్ చేసుకొని క్వాలిటీ మీద ఫోకస్ చేస్తే దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసే అంటే మన దరిదాపుల్లో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు.(ఇదీ చదవండి: సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో హీరో కిరణ్ అబ్బవరం) -
నందు, అవికా గోర్ 'అగ్లీ స్టోరీ' టీజర్ విడుదల
నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'అగ్లీ స్టోరీ'. రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, 'హే ప్రియతమా' లిరికల్ సాంగ్ రిలీజైంది. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ ఇంటెన్స్ టీజర్ రిలీజ్ చేశారు.నందు పర్వర్ట్ క్యారెక్టర్ చేశాడు. అవికా గోర్ నందుని కాకుండా మరో అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ నందుకి ఇది ఇష్టముండదు. దీంతో అవికా గోర్ని ఇబ్బంది పెడతాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. శివాజీ రాజా, రవితేజ మహదాస్యం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో చిత్ర విడుదల గురించి వెల్లడించనున్నారు. -
కళ్యాణ్ జీ గోగణ 'మారియో' ఫస్ట్ లుక్ రిలీజ్
'నాటకం', 'తీస్ మార్ ఖాన్' సినిమాలు తీసిన దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ ఇప్పుడు మరో మూవీ సిద్ధం చేస్తున్నారు. దసరా సందర్భంగా ఆ చిత్రం అప్డేట్ ఇచ్చారు. 'మారియో' అనే టైటిల్ నిర్ణయిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.హీరోహీరోయిన్లుగా అనిరుధ్, హెబ్బా పటేల్ నటించారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో 'మారియో' చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గత చిత్రాలలో కామెడీ, థ్రిల్ను విజయవంతంగా మిళితం చేసిన దర్శకుడు కళ్యాణ్జీ గోగణ ఈసారి సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు. -
చైతన్య రావు-క్రాంతి మాధవ్ కొత్త సినిమా లాంచ్
'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు మరో యూత్ ఫుల్ కథతో సిద్ధమైపోయారు. గ్యాప్ తరువాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించేందుకు వస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని శుక్రవారం (అక్టోబర్ 3) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.చైతన్య రావు, ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా చేయబోతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్ కొట్టగా, కెఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా.. తొలి సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు.'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' తర్వాత పూర్ణగారితో ఓ మూవీ చేయాలి. హిట్స్లో ఉన్నప్పుడు చేయను, బాధల్లో ఉన్నప్పుడు చేస్తానని ఆయనతో చెప్పాను. అలా నా గత చిత్రం ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే పూర్ణ గారు వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోందని దర్శకుడు క్రాంతి మాధవ్ చెప్పుకొచ్చారు. -
అమ్మ బంగారంతో శ్రీముఖి.. రకుల్ ఆస్ట్రేలియా ట్రిప్
సింపుల్ లుక్.. ముద్దుచ్చేంత అందంగా మృణాల్రెడ్ డ్రస్సులో అదరగొట్టేస్తున్న మాళవిక మోహనన్ఈజిప్ట్ టూర్లో మలయాళ హీరోయిన్ పార్వతిఅమ్మని బంగారం అంటూ ముద్దు చేస్తున్న శ్రీముఖిమెల్బోర్న్ టూర్ ఫొటోలని పోస్ట్ చేసిన రకుల్ ప్రీత్నవ్వడం మర్చిపోవద్దనని గుర్తుచేస్తున్న ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) -
సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో హీరో కిరణ్ అబ్బవరం
తెలుగు హీరో కిరణ్ అబ్బవరం.. తన భార్య, కొడుకుతో కలిసి పెళ్లిలో సందడి చేశాడు. తన సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న డేనియల్ విశ్వాస్.. మాధురి అనే అమ్మాయిని శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. మదనపల్లిలోని ఓ చర్చిలో ఈ శుభకార్యం జరిగింది. దీనికి కిరణ్ అబ్బవరం ఫ్రెండ్స్ అందరూ హాజరై నూతన వధూవరుల్ని దీవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని కిరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం.. తర్వాత పలు సినిమాలు చేశాడు. కానీ గతేడాది రిలీజైన 'క' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం 'కె ర్యాంప్' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఇకపోతే తన చిత్రాలు 'వినరో భాగ్యము విష్ణుకథ', 'క' సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసిన డేనియల్ విశ్వాస్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో కిరణ్.. తన భార్య రహస్య, కొడుకు హనుతో కలిసి మరీ వేడుకకు హాజరయ్యాడు.(ఇదీ చదవండి: 'ఐబొమ్మ' వార్నింగ్.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం) -
'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
దసరా సందర్భంగా 'కాంతార ఛాప్టర్ 1' థియేటర్లలోకి వచ్చేసింది. కన్నడలో దీనికి ఎలానూ పోటీ లేదు. తెలుగు, హిందీలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం థియేటర్లలోకి రాలేదు. ఈ క్రమంలోనే దీనికి పోటీ అనేది లేకుండా పోయింది. దానికి తోడు తొలిరోజు దాదాపు అన్నిచోట్ల హౌస్ఫుల్స్ పడ్డాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు మూవీ చూసేందుకు ఎగబడ్డాయి. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి?విడుదలకు ముందు కర్ణాటకలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుగా 'కాంతార 1' నిర్మాణ సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. తీర్పు వీళ్లకు అనుకూలంగా రావడంతో ధరలు బాగానే పెంచారు. తెలంగాణలో పెంపు లభించలేదు గానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గరిష్ఠంగా రూ.100 వరకు పెంపు లభించింది. అన్ని చేసినా సరే తొలిరోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కూడా దాటలేదు.దేశవ్యాప్తంగా తొలిరోజు 1.28 మిలియన్ల టికెట్స్ బుక్ మై షోలో సేల్ అయ్యాయి. ఈ క్రమంలో భారత్ మొత్తం కలిపి రూ.66 కోట్ల వసూళ్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో 'ఓజీ', 'కూలీ' తర్వాత ఇది అత్యధికం. ఏమైనా ప్రస్తుత బాక్సాఫీస్ దగ్గర జోష్ చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి లాభాల్లోకి వచ్చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.'కాంతార' విషయానికొస్తే.. మొదటి పార్ట్లో హీరో తండ్రి ఎక్కడైతే మాయమవుతాడో సరిగ్గా అక్కడి నుంచే 'కాంతార చాప్టర్ 1' కథ మొదలవుతుంది. 8వ శతాబ్దంలో కాదంబుల రాజ్యానికి ఓ దిక్కులోని కాంతార అనే ప్రాంతం ఉంటుంది. అందులోని ఈశ్వరుడి పూదోటకు అనే దైవిక ప్రదేశముంటుంది. ఆ ప్రాంతాన్ని కాంతార గిరిజన తెగ చాలా జాగ్రత్తగా కాపాడుతుంటారు. అక్కడున్న బావిలో ప్రజలకు ఓ బిడ్డ దొరుకుతాడు. అతనికి బెర్మి (రిషబ్ శెట్టి) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు.అయితే కాంతారలోనే ఉండే బెర్మి.. అనుకోని పరిస్థితుల కారణంగా ఓసారి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు. స్వయానా రాజుతోనే కయ్యం పెట్టుకుంటాడు. దీంతో బాంగ్రా రాజు రాజశేఖరుడు (జయరామ్)తో బెర్మికి వైరం ఏర్పడుతుంది. తర్వాత ఏమైంది? ఈ స్టోరీలో యువరాణి కనకావతి(రుక్మిణి వసంత్) సంగతేంటి? ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగిలిన స్టోరీ. -
స్టార్ క్రికెటర్ సోదరి.. 'బిగ్బాస్'లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ (Salman Khan) హోస్ట్గా ‘బిగ్బాస్ 19’( Bigg Boss 19) ఆగష్టులో మొదలైంది. హిందీలో కొనసాగుతున్న ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే, ఈ షోలోకి భారత క్రికెటర్ అక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు బాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఈమేరకు సోషల్మీడియాలో పలు పోస్ట్లు కనిపిస్తున్నాయి.ఇండియన్ క్రికెటర్ దీపక్ చాహర్(Deepak Chahar) సోదరి మాల్తీ చాహర్(Malti Chahar) హిందీ బిగ్బాస్-19లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మోడల్గా తన కెరీర్ను ప్రారంభించి బాలీవుడ్ పలు సినిమాల్లో కూడా నటించింది. సోషల్మీడియాలో ఆమె కంటెంట్ క్రియేటర్గా కూడా రాణిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మాల్తీకి సుమారు పది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె 2014లో ఫెమినా మిస్ ఫోటోజెనిక్, మిస్ సుడోకు కిరీటాలను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్లతో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్లో మిస్టరీ గర్ల్గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది. View this post on Instagram A post shared by Malti Chahar (@maltichahar) -
రావణుడు కొంటెవాడు కానీ రాక్షసుడు కాదు: బాలీవుడ్ నటి
రావణాసురుడు కొంటెవాడే కానీ రాక్షసుడు కాదంటోంది బాలీవుడ్ సీనియర్ నటి సిమి గరేవాల్. దసరా పండగనాడు రావణుడి బొమ్మను దహనం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రతి ఏడాది దసరా రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ రావణా.. నువ్వు కాస్త కొంటెగా ఉన్నావే తప్ప రాక్షసుడిలా ప్రవర్తించలేదు. కొంటెతనం తప్ప అంతకుమించి ఏ తప్పూ చేయలేదు.తిండి పెట్టావ్తొందరపడి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశావు. ఈ కాలంలో ఆడవాళ్లకు ఇస్తున్న గౌరవమర్యాదలతో పోలిస్తే అప్పట్లో నువ్వే ఒక స్త్రీ(సీతాదేవి)ని ఎంతో గౌరవించావు. ఆమెకు మంచి తిండి, ఆశ్రయం కల్పించావు. తన భద్రత కోసం మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించావు(వాళ్లు అందంగా లేరనుకో..). పార్లమెంటులో ఉన్న సగం మంది సభ్యులకంటే కూడా నువ్వే ఎక్కువ చదువుకున్నావు. ట్వీట్ డిలీట్రావణుడి బొమ్మను కాల్చడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయనేం చేశారన్నదే నా ప్రశ్న.. అంతే! హ్యాపీ దసరా అని ట్వీట్ చేసింది. ఈ పోస్ట్పై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ట్వీట్ను డిలీట్ చేసింది. కాగా సిమి గరేవాల్.. దో బడాన్, మేరా నామ్ జోకర్, కర్జ్ వంటి సినిమాల్లో నటించింది. యాంకర్గా టాక్ షోలు కూడా చేసింది. కొన్ని సీరియల్స్, సినిమాలకు డైరెక్టర్గానూ వ్యవహరించింది.చదవండి: తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్.. -
అనసూయ 'అరి' మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం అరి. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి.శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్నారు.అరి రిలీజ్ ఎప్పుడంటే?లింగ గుబపనేని కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మంచి మెసేజ్తో ‘అరి’ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది.చదవండి: కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత -
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. కంచు కనకమాలక్ష్మి అప్డేట్!
మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'కంచు కనకమాలక్ష్మి'. ఈ సినిమాను గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ దసరాకు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.విజయ దశమి సందర్భంగా ఈ మూవీ షూటింగ్ను గ్రాండ్గా ప్రారంభించారు. పాటల రికార్డింగ్తో పాటు చిత్రీకరణ మొదలెట్టారు. ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ మూవీని వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ అగస్త్య మాట్లాడుతూ.."ఇది క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. అందరికీ కంచు కనకమాలక్ష్మి స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది. విజయదశమి నాడు అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్తో మొదలుపెట్టాం. ఈ నెల 10 నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్తున్నాం. విజయనగరం, పట్టిసీమ, అరకు పరిసర ప్రాంతాల్లో 28 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఆ తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తామని' వెల్లడించారు. -
ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్తోనే!
ఓజీ డైరెక్టర్ సుజిత్ అప్పుడే మరో సినిమాకు సిద్ధమైపోయారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఓజీ ఇటీవలే థియేటర్లో రిలీజైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా ఓజీ డైరెక్టర్ సుజిత్ మరో టాలీవుడ్ స్టార్తో జతకట్టారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టాలీవుడ్ హీరో నానితో మూవీకి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను సుజిత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. SKY IS THE LIMIT…🔥#NaniXSujeeth @NameisNani @Sujeethsign pic.twitter.com/lIylWc2taZ— Niharika Entertainment (@NiharikaEnt) October 2, 2025 With @NameIsNani anna 🤗❤️#NaniXSujeeth pic.twitter.com/gDBYKZtoD4— Sujeeth (@Sujeethsign) October 2, 2025 -
థియేటర్లలో కాంతార ఛాప్టర్-1.. ఓటీటీల్లో ఏయే సినిమాలంటే?
అసలే దసరా సెలవులు.. చూస్తుండగానే అయిపోతున్నాయి. మరో వీకెండ్ కూడా వచ్చేస్తోంది. ఈ పండుగకు అలరించేందుకు కాంతార చాప్టర్-1, ఇడ్లీ కొట్టు సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇవీ తప్ప పెద్దగా సినిమాలేవీ దసరాకు రిలీజ్ కాలేదు. కాంతార మూవీపై భారీ అంచనాలు ఉండడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు.ఇక ఓటీటీల విషయానికొస్తే అదే పరిస్థితి నెలకొంది. ఈ శుక్రవారం పెద్దగా మూవీస్ ఏవీ స్ట్రీమింగ్ కావట్లేదు. మైనే ప్యార్ రియా అనే మలయాళ సినిమా, హాలీవుడ్ చిత్రాలు, మరికొన్ని వెబ్ సిరీస్లు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో పెద్దగా బజ్ చిత్రాలేవీ కనిపించడం లేదు. అయితే దసరా సెలవులు కావడంతో కాస్తా డిఫరెంట్ సిరీస్, సినిమాలు ట్రై చేసే వాళ్లు ఓ లుక్కేయ్యొచ్చు. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి.నెట్ఫ్లిక్స్..స్టీవ్(హాలీవుడ్ మూవీ)- అక్టోబరు 03మాన్స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03జెనీ మేక్ ఏ విష్(కొరియన్ సిరీస్)- అక్టోబరు 03ఓల్డ్ డాగ్.. న్యూ ట్రిక్స్(స్పానిష్ కామెడీ సిరీస్)- అక్టోబరు 03ది న్యూ ఫోర్స్(స్వీడీష్ మూవీ)- అక్టోబరు 03జీ5డాకున్ కా ముండా-3(పంజాబీ మూవీ)- అక్టోబర్ 03జియో హాట్స్టార్బిగ్బాస్ తమిళ్(రియాలిటీ షో)- అక్టోబర్ 05లయన్స్ గేట్ ప్లేమైనే ప్యార్ కియా(మలయాళ సినిమా)- అక్టోబరు 03 ఆపిల్ ప్లస్ టీవీ లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03హులువేర్ వాల్వ్స్- అక్టోబర్ 03 -
ఏయ్.. మీసాల పిల్ల.. నయన్ను ఆటపట్టించిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్.. వచ్చే ఏడాది సూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి.ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. తాజాగా దసరా సందర్భంగా ప్రోమోను విడుదల చేశారు. మీసాల పిల్ల పేరుతో ఈ ప్రోమోను రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో నయనతారను చిరంజీవి ఆటపట్టిస్తూ కనిపించారు. మా ఊర్లో కుర్రోళ్లు పొగరుమోతు పిల్లని క్యూట్గా… మీసాల పిల్ల అని పిలుస్తారు అంటూ ఆటపట్టించారు. ఈ హిలారియస్ కామెడీ ప్రోమో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు. -
అనగనగా ఒక రాజు.. ప్రమోషన్స్ వేరే లెవెల్!
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలిచాడు. పొలిశెట్టి హీరోగా వస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమా రిలీజ్కు ఇంకా దాదాపు మూడు నెలల సమయం ఉంది. అయినప్పటికీ ప్రమోషన్స్లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రోమోను రిలీజ్ చేయగా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది.తాజాగా ఇవాళ దసరా కావడంతో మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో సినీ ప్రియులకు నవీన్ పొలిశెట్టి శుభాకాంక్షలు తెలిపారు. పచ్చని పొలాల మధ్య చేసిన ఈ ప్రమోషన్ వీడియో ఆడియన్స్ను అలరిస్తోంది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. -
ఏఐతో అసభ్యకర వీడియోలు.. యూట్యూబ్కు ఐశ్వర్య దంపతుల షాక్!
ఇటీవల తమ అనుమతి లేకుండా ఫోటోలు వినియోగిస్తున్నారని బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిచ్చింది. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా ఉన్న అలాంటి వాటిని తొలగించేలా ఆదేశాలిస్తామని కోర్టు వెల్లడించింది.తాజాగా ఈ జంట మరోసారి కోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా గూగుల్, యూట్యూబ్ తమ ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ రూ.4 కోట్ల దావా వేశారు. ఏఐ సాయంతో రూపొందించిన వీడియో కంటెంట్ను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. లైంగికంగా అసభ్యకరమైన వీడియోలను రూపొందిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని.. ఏఐ బాలీవుడ్ ఇష్క్ అనే ఛానెల్లో దాదాపు 259 వీడియోల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.కాగా.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉన్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే ఐశ్వర్య ప్రస్తుతం ఎలాంటి సినిమాలు ప్రకటించలేదు. ఆమె చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 చిత్రంలో కనిపించింది. -
హీరోయిన్స్ దసరా వైబ్స్.. మంచు కొండల్లో మంచు లక్ష్మీ
దసరా పండగ కావడంతో టాలీవుడ్ హీరోయిన్లు చాలామంది తమ ఇళ్లలో పూజ చేసుకున్నారు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిలో మాళవిక మోహనన్, నభా నటేశ్, ఈషా రెబ్బా తదితరులు ఉన్నారు. వీళ్లతో పాటు శ్రీముఖి, రెజీనా, సుప్రీత తదితరులు కూడా ఉన్నారు. ఇకపోతే మంచు లక్ష్మీ మంచు కొండల్లో సాహసం చేస్తున్న ఓ వీడియోని పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Soundarya Rajinikanth (@soundaryaarajinikant) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1.. ఏ ఓటీటీకి రానుందంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార చాఫ్టర్-1(Kantara Chapter1). ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ కాంతారకు ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజైన తర్వాత ఏ ఓటీటీకి రానుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.తాజాగా కాంతార ఛాప్టర్-1 ఓటీటీకి సంబంధించిన సినీ ప్రియులు సైతం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కుదుర్చుకున్న డీల్ ప్రకారం.. ఈ సినిమా ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ చూసి ఓటీటీ డేట్ రివీల్ చేయనున్నారు. అప్పటి వరకు కాంతార ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు. -
పవన్ కళ్యాణ్ 'పురుష' షూటింగ్ పూర్తి
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ఓ డిఫరెంట్ కామెడీ మూవీ తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ని తెలుగు తెరకు పరిచయం చేస్తూ 'పురుష' అనే సినిమాను నిర్మిస్తున్నారు. వీరు ఉలవల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ డైరెక్టర్ ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రంలో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.ఈ సినిమా వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్లు హీరోయిన్లు. తాజాగా ఓ ప్రత్యేక గీతం పూర్తి చేసి షూటింగ్కు గుమ్మడికాయ కొట్టేశారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు. -
'కాంతార 1' రెమ్యునరేషన్స్.. ఈసారి ఎవరికి ఎంత?
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'కాంతార' ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే 'కాంతార ఛాప్టర్ 1'. తొలి పార్ట్ కంటే ఈసారి భారీ హంగులు, స్టోరీలో మరిన్ని ఎలిమెంట్స్ జోడించారు. దసరా కానుకగా అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కొందరు ప్రేక్షకులు ఆహా ఓహో అంటుండగా.. మరికొందరు మాత్రం ఓకే ఓకే అని అంటున్నారు.మరోవైపు తొలి పార్ట్ కేవలం రూ.15-20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు మాత్రం భారీగా బడ్జెట్ పెట్టారు. ఏకంగా రూ.125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ప్రతి సీన్లోనూ రిచ్నెస్ కనిపించింది. అడవిలో సెట్ కావొచ్చు, బాంగ్రా రాజ్యం సెట్ కావొచ్చు స్క్రీన్పై అద్భుతంగా కనిపించాయి. కంటెంట్తో పాటు విజువల్స్, సెట్స్కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.(ఇదీ చదవండి: Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ)ఈ సినిమా రెమ్యునరేషన్ విషయానికొస్తే తొలి పార్ట్ కోసం హీరో, దర్శకుడిగా చేసినందుకు రిషభ్ శెట్టి అప్పట్లో కేవలం రూ.4 కోట్లు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈసారి మాత్రం రూపాయి పారితోషికం తీసుకోకుండానే దాదాపు మూడేళ్ల పాటు కష్టపడ్డాడని అంటున్నారు. అలా అని ఫ్రీగా ఏం చేసేయలేదు. రిలీజ్ తర్వాత లాభాల్లో వచ్చే వాటాని తీసుకోవాలని ముందే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.సినిమాలో రిషభ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ చేశారు. వీళ్లందరికీ తలో రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. వీళ్లు తప్పితే అందరూ పెద్దగా పేరున్న యాక్టర్స్ అయితే కనిపించలేదు. అయితే సినిమాలో అటు రిషభ్ ఇటు రుక్మిణి వసంత్ యాక్టింగ్ జనాలకు బాగా నచ్చుతోంది. పబ్లిక్ టాక్లోనూ ఎక్కువ మంది వీళ్లిద్దరినే మెచ్చుకుంటుండటం విశేషం. (ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?) -
డైరెక్టర్గా జబర్దస్త్ కమెడియన్.. హీరోగా రాజ్ తరుణ్.. టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న తాజా చిత్రం చిరంజీవ(). ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్.. అదిరే అభి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.ఇవాళ దసరా సందర్భంగా చిరంజీవ టీజర్ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే..మైథలాజికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో హీరో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. ఆంబులెన్స్ డ్రైవర్.. అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో కుషిత హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆహా వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. Chiranjeeva Meter lo chala Matter undhi 🧭#Chiranjeeva Premieres 7th Nov only on #aha#ChiranjeevaOnAha #AnAhaOriginalFilm pic.twitter.com/yknNbBuTGT— ahavideoin (@ahavideoIN) October 2, 2025 -
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన శివజ్యోతి
బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది తనకు పిల్లాడు పుట్టబోతున్నాడని చెప్పి ఓ వీడియోని షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?)తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అసలు పేరు శివజ్యోతి. కానీ సావిత్రిగానే చాలా ఫేమస్ అయింది. తెలంగాణలోని నిజామాబాద్ నాగంపేట ఈమె సొంతూరు. పదేళ్ల క్రితమే గంగూలీ అనే వ్యక్తిని ప్రేమించి, ఇంట్లో వాళ్లు నో చెప్పినా సరే పెళ్లి చేసుకుంది. అయితే బిగ్బాస్ 3వ సీజన్లో పాల్గొని మరింత ఫేమస్ అయింది. తర్వాత షోలు, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బాగానే సంపాదించింది. ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని బయటపెట్టింది.'అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో 2026లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతగానం ఎదురు చేసిండ్రో. మీరు నాకు కావలిసినవాళ్లు. వాళ్ల సొంత అక్క బావకి బేబీ రావాలి అన్నంత గట్టిగా కోరుకున్నారు. ఇట్ల బిడ్డ అస్తుంది అని చెప్పగానే మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయితరు అనుకుంటున్న. అందుకే చెపుతున్న పండుగ పూట ఈ ముచ్చట. దిష్టి పెట్టొద్దు. ఆశీర్వదం చాలు. ఈ బ్యూటీఫుల్ జర్నీలో సపోర్ట్ చేసినోళ్లను మర్చిపోను, బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోను' అని శివజ్యోతి రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్
మెగా హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. రెండేళ్ల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. గత నెల 10న వీళ్లకు మగ పిల్లాడు పుట్టాడు. రీసెంట్గానే మూడు నాలుగు రోజుల క్రితం బారశాల వేడుక జరిగింది. దీనికి మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. కాకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచారు.(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం)ఇప్పుడు స్వయంగా వరుణ్-లావణ్య దంపతులు తమ కొడుకు పరిచయం చేస్తూ పేరుని బయటపెట్టారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు రెండు ఫొటోల్ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ లైకులు కొట్టేస్తున్నారు.నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అయిపోయారు.(ఇదీ చదవండి: కాంతార 1 టీమ్పై 'ఎన్టీఆర్' కామెంట్స్) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
కాంతార 1 టీమ్పై 'ఎన్టీఆర్' కామెంట్స్
‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1) ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మరింత క్రేజ్ దక్కింది. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా తారక్ చిత్ర యూనిట్ను అభినందించారు. నేడు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ క్రమంలో కాంతార1 టీమ్కు అభినందనలు చెప్పారు.కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార-1 మంచి విజయాన్ని సొంతం చేసుకుందని తారక్ అన్నారు. ముఖ్యంగా రిషబ్శెట్టి నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా ఎవ్వరి ఊహకు అందని అద్భుతాన్ని క్రియేట్ చేశాడని కొనియాడారు.. రిషబ్ మీద నమ్మకాన్ని ఉంచి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారికి శుభాకాంక్షలు అంటూ తారక్ ఒక పోస్ట్ చేశారు. కాంతార చాఫ్టర్ 1లో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ను విడుదల చేశారు. దీంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
కార్తీక్ రాజు హీరోగా 'విలయ తాండవం'.. పోస్టర్ లాంచ్
యువ హీరో కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విలయ తాండవం'. జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద మందల ధర్మారావు, గుంపు భాస్కరరావు నిర్మిస్తున్నారు. వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన టైటిల్ పోస్టర్ బుధవారం (అక్టోబర్ 1) రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆకాశ్ పూరీ, దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు అతిథులుగా హాజరయ్యారు.ఆకాష్ పూరి మాట్లాడుతూ.. 'విలయ తాండవం' టైటిల్ పవర్ఫుల్గా ఉంది. టైటిల్ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకి మరోసారి ఈ చిత్రంతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'కార్తీక్ రాజు నేను తీసిన 'కౌసల్యా కృష్ణమూర్తి' చిత్రంలో నటించారు. కార్తీక్ ఎప్పుడూ డిఫరెంట్ కథల్నే ఎంచుకుంటారు. ఈ 'విలయ తాండవం'తో మరోసారి కార్తీక్ రాజుకి హిట్ రావాలి అని అన్నారు. -
16ఏళ్ల తర్వాత మళ్లీ.. 'పేట్రియాట్' టీజర్
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty), మోహన్లాల కలిసి నటిస్తున్న పేట్రియాట్ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. దర్శకుడు మహేశ్ నారాయణన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, ఫహాద్ ఫాజిల్, రేవతి వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమా సమయంలోనే మమ్ముట్టి అనారోగ్యానికి గురయ్యారు. రీసెంట్గా సినిమా సెట్స్లోకి ఆయన జాయిన్ అయ్యారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల కానుంది. సుమారు 16 ఏళ్ల తర్వాత మళ్ళీ మోహన్లాల్, మమ్ముట్టి కలిసి ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. -
రాజుగారి నాలుగో గది.. హిట్ కాంబో మరోసారి
దసరా సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్స్ వస్తుంటాయి. ఈసారి కూడా అలానే పలు చిత్రాలవి వచ్చేశాయి. వీటిలో హారర్ ఫ్రాంచైజీ అయిన రాజుగారి గది నాలుగో భాగం ఒకటి కాగా.. సామజవరగమన కాంబో మళ్లీ రిపీట్ అయింది. ఈ క్రమంలోనే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ అప్డేట్ కూడా ఇచ్చేశారు.(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం)యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారిన తర్వాత 'రాజుగారి గది' సినిమాలతో ఫేమస్ అయ్యాడు. అయితే తొలి పార్ట్ సూపర్ హిట్ అయింది. రెండు, మూడో పార్ట్స్ మాత్రం యావరేజ్ అనిపించుకున్నాయి. మూడో భాగం 2019లో రాగా దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు నాలుగో భాగాన్ని అనౌన్స్ చేశారు. ఓంకార్ దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. త్వరలో షూటింగ్ కూడా మొదలు కానుందని చెప్పుకొచ్చారు. ఈసారి కాళికా దేవి బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ తీయబోతున్నట్లు పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది.2023లో అంచనాల్లేకుండా వచ్చి హిట్ అయిన సినిమా 'సామజవరగమన'. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకుడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో కొత్త సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా లాంఛనంగా పూజతో ప్రాజెక్టుని ప్రారంభించారు. అయితే ఇది 'సామజవరగమన' సీక్వెలా లేదంటే కొత్త స్టోరీతో తీస్తున్నారా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ) -
నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం
టాలీవుడ్లో సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన మూడో కూతురు స్రవంతి నిశ్చితార్థం.. హైదరాబాద్లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాకపోతే సోషల్ మీడియాలో ఎక్కడా ఈ విషయం పెద్దగా కనిపించలేదు. ఒకటి రెండు ఫొటోలు బయటకు రావడంతో దీని గురించి అంతా తెలిసింది.(ఇదీ చదవండి: త్వరలో అల్లు శిరీష్ నిశ్చితార్థం.. అధికారిక ప్రకటన)వైజయంతి ప్రొడక్షన్ తరఫున సినిమాలు తీస్తూ వచ్చిన అశ్వనీదత్.. కొన్నేళ్ల క్రితం సైలెంట్ అయిపోయారు. తర్వాత ఈయన కూతుళ్లు స్వప్న, ప్రియాంక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర చిత్రాలతో మళ్లీ తండ్రి నిర్మాణ సంస్థని రేసులోకి తీసుకొచ్చారు. గతేడాది వచ్చిన 'కల్కి'తో పాన్ ఇండియా లెవల్లోనూ హిట్ కొట్టారు.అయితే అశ్వనీదత్ పెద్ద కూతురు స్నప్న, రెండో కూతురు ప్రియాంక, అల్లుడు నాగ్ అశ్విన్ గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అయితే ఈయన మూడో కూతురు స్రవంతి గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలీదు. తండ్రి అక్కలు నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ ఈమెకు ఇండస్ట్రీతో సంబంధం లేనట్లే కనిపిస్తుంది. ఇప్పుడు నిశ్చితార్థం జరగడంతో ఈమె గురించి తెలిసింది. మరి పెళ్లి కూడా ఈ ఏడాదిలో ఉంటుందేమో!(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ) -
గాయకుడు ఛన్నులాల్ మరణం బాధించింది: మోదీ
ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, పద్మ విభూషణ్ ఛన్నులాల్ మిశ్రా (chhannulal mishra) అనారోగ్యంతో మరణించారు. ఉత్తర్ప్రదేశ్లోని తన కుమార్తె నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయసురీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఛన్నులాల్ మరణం తనను బాధించిందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందంటూ సంతాపం తెలిపారు.హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఎలనలేని గుర్తింపు పొందిన ఛన్నులాల్ ఉత్తరప్రదేశ్లో 1936లో జన్మించారు. భారతీయ కళ, సంస్కృతి కోసం ఆయన చేసిన సేవకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ (2010), పద్మ విభూషణ్ (2020)తో గౌరవించింది. -
తనూజ ప్రేమకథ.. బిగ్బాస్లో ముగ్గురు శివంగుల పోరాటం
బిగ్బాస్లో ఈ వారం నామినేషన్స్ తంతు ముగిసిన తర్వాత కెప్టెన్సీ టాస్క్లు మొదలయ్యాయి. బుధవారం జరిగిన 25వ ఎపిసోడ్లో సంజన, హరీష్ల టాపిక్తో పాటు తనూజ లవ్ స్టోరీనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టాస్క్లలో మాత్రం కల్యాణ్, శ్రీజ, రీతూ చౌదరి, దివ్య ఒక రేంజ్లో దుమ్ములేపారు. ఇమ్మానుయేల్ తన కామెడీ పంచ్లతో పాటు ఆటలోనూ సత్తా చాటాడు. అయితే, భరణి మాత్రం చాలా పేలవంగా తన టీమ్ను ఎంచుకోవడంతో పాటు సరైన పోటీ ఇవ్వలేకపోయారు. ఈ వారం నామినేషన్లో రీతూ, ఫ్లోరా, సంజనా, శ్రీజ, దివ్య, హరీశ్ ఉన్న విషయం తెలిసిందే.తనూజ ప్రేమ కథరీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్ కలిసి పక్కా ప్లాన్తో తనూజ, కళ్యాణ్లను పిలిపిస్తారు. వారితో పాటు దమ్ము శ్రీజ కూడా కలిసిపోతుంది. వారందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. అందులో తనూజకి ట్రూత్ అని వస్తుంది. ‘నీవు బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటి..? అంటూ అడుగుతారు. దాంతో తనూజ.. ‘హృతిక్ రోషన్ అని సమాధానం చెబుతుంది. ఆ తరువాత కళ్యాణ్ వంతు వస్తుంది. బిగ్బాస్లో ఈ అమ్మాయిని ప్రేమించవచ్చు అనిపించేదెవరు? అంటూ అడుగుతారు. కల్యాణ్ ఒక్క క్షణం ఆలోచించకుండా తనూజ అనేస్తాడు. ఆ తర్వాత మళ్లీ తనూజ వంతు వస్తుంది. తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాలంటూ రీతూ అడుగుతుంది. ఈ క్రమంలో తనూజ కూడా ఫస్ట్ లవ్ స్టోరీ 8వ తరగతిలోనే మొదలైందని చెబుతుంది. అతని పేరు కూడా కల్యాణ్ అని చెప్పడంతో హౌస్లో ఉన్న కల్యాణ్ తెగ సంబరపడిపోతాడు. నవ్వేసుకుంటూ మెలికలు తిరిగిపోయాడు. తనూజ లవ్ స్టోరీ డ్యాన్స్ క్లాస్లో మొదలైందని గుర్తుచేసుకుంటుంది. ఒక గ్రీటింగ్ ఇచ్చి మొదట తనే ప్రపోజ్ చేశాడని పంచుకుంది. తన జీవితంలో అదే మొదటి లవ్ అంటూనే అది వన్సైడ్ లవ్ స్టోరీ అని చెప్పింది. అయితే, ఆ అబ్బాయి మంచి వాడు కావడంతో ఇప్పటికీ తనతో టచ్లో ఉన్నాడని చెప్పింది. తనకి పెళ్లి కూడా అయిపోయిందని తన క్యూట్ లవ్స్టోరీని తనూజ చెప్పింది. ఆ తరువాత మళ్లీ తనూజకు డేర్ రావడంతో.. కల్యాణ్తో డ్యాన్స్ చేసింది.బిగ్బాస్లో శివంగులుఈ వారం కెప్టెన్సీ కంటెండర్ షిప్తో పాటు లగ్జరీ ఐటెమ్స్ను బిగ్బాస్ ఆఫర్ చేశాడు. రణరంగంలా జరిగిన ఈ టాస్క్ కోసం హౌస్ మొత్తాన్ని నాలుగు టీమ్లుగా డివైడ్ చేశాడు. అయతే, కెప్టెన్ డీమాన్ పవన్ని మళ్లీ సంచాలక్గా ఉంచారు. కల్యాణ్, ఇమ్మానుయేల్, ఫ్లోరా (రెడ్ టీమ్) రాము, సంజన, సుమన్ శెట్టి (ఎల్లో టీమ్), హరీష్, తనూజ, రీతూ చౌదరి (బ్లూ టీమ్), భరణి,శ్రీజ, దివ్య (గ్రీన్ టీమ్)లుగా ఉన్నారు.ఈ ఎపిసోడ్లో కల్యాణ్ తన ఆటతో పూర్తిగా డామినేట్ చేశాడు. తనను అడ్డుకునేందుకు కూడా ఇతర కంటెస్టెంట్స్ భయపడేలా చేశాడు. ఫైనల్గా ఈ వారం కెప్టెన్సీ మొదటి పోటీదారుడిగా ఆర్హత పొందాడు. అయితే, జరిగిన రెండు ఎపిసోడ్స్లలో శ్రీజ తన దమ్ము ఏంటో చూపింది. తీవ్రంగా గాయపడినప్పటికీ తన జట్టును గెలిపించి సత్తా ఏంటో చూపింది. ఒకానొక సమయంలో శ్రీజను అడ్డకుంటే చాలు గెలుపు మనదే అని కల్యాణ్ కూడా అంటాడు. అంతలా ఆమె తన ఆటను చూపింది. మరోవైపు దివ్య కూడా సరైన సమయంలో తన ఆట ఎలా ఉంటుందో చూపింది. ఒకసారి ఏకంగా హరీష్, రీతూలను కట్టడి చేసే ప్రయత్నం చేసింది. కొంత సేపు వారిద్దరినీ కదలనీయకుండా అడ్డకుంది. రీతూ చౌదరి కూడా తనలోని గేమర్ను బయటకు తెచ్చింది. ఎదురుగా కల్యాణ్ ఉన్నా సరే తన స్ట్రాటజీతో మెప్పించింది. ఈ వారం శ్రీజ, దివ్య, రీతూ ఒక శివంగుల మాదిర తమ ఆటను చూపారు. బిగ్బాస్ అసలైన రణరంగం ఏంటో ప్రేక్షకులు చూపించారు. అయితే, కల్యాణ్ దాటికి ఇప్పటికే శ్రీజ, దవ్య టాస్క్ నుంచి విరమించారు. -
Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ
మూడేళ్ల క్రితం ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్బస్టర్ హిట్ అయిన కన్నడ సినిమా 'కాంతార'. తర్వాత పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేస్తే తెలుగు, హిందీలోనూ సక్సెస్ అయింది. దీనికి ప్రీక్వెల్గా తెరకెక్కిన చిత్రమే 'కాంతార ఛాప్టర్ 1'. ఇప్పుడు ఇది థియేటర్లలోకి వచ్చేసింది. రిషభ్ శెట్టి హీరో కమ్ దర్శకుడు. ఈ మూవీని తొలి భాగం కంటే భారీగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థమైంది. ఈసారి హీరోయిన్గా రుక్మిణి వసంత్ చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తొలి పార్ట్కి మించి ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది బాంగ్రా రాజ్యం. దీనికో రాజు. ఓ రోజు ఈశ్వరుని పూదోట అనే ప్రాంతానికి వెళ్తాడు. బ్రహ్మ రాక్షసుడి కారణంగా ఇతడితో పాటు సైన్యం అక్కడ చనిపోతారు. పిల్లాడిగా ఉన్న రాజు కొడుకు రాజశేఖరుడు(జయరామ్) బతికిపోయి తిరిగి రాజ్యానికి వస్తాడు. పెద్దయ్యాక కూడా అటు వైపు వెళ్లే సాహసం చేయడు. ఇదే ఈశ్వరుని పూదోటకు దగ్గరలోని కాంతార అనే చోట జనాలు నివసిస్తుంటారు. వాళ్లకు బెర్మి(రిషభ్ శెట్టి) అనే పిల్లాడు దొరుకుతాడు. పెరిగి పెద్దవుతాడు. మరోవైపు రాజశేఖరుడు కొడుకు కులశేఖరుడు(గుల్షన్ దేవయ్య) కూడా పెద్దయ్యాక యువరాజు అవుతాడు. ఎక్కడో అడవుల్లో ఉండే బెర్మి.. బాంగ్రా రాజ్యానికి ఎందుకు రావాల్సి వచ్చింది? కులశేఖరుడితో వైరం ఏంటి? ఇంతకీ యువరాణి కనకవతి(రుక్మిణి వసంత్) ఎవరు? తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?2022లో వచ్చిన 'కాంతార'లో క్లైమాక్స్ తప్పితే మిగతా సినిమా అంతా సోసోనే. చివరలో వచ్చే దైవత్వం అనే ఎలిమెంట్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. భాష అర్థం కాకపోయినా సరే ప్రేక్షకులు ముగ్దులయ్యారు. దానికి ప్రీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందా? అంటే లేదు. తొలి భాగమంతా మెప్పించిందా? అంటే లేదు. తొలి పార్ట్తో దీనికి కచ్చితంగా పోలిక వస్తుంది. అందులో అంతా చాలా సహజంగా ఉంటే ఇందులో మాత్రం ప్రతి సీన్లో భారీతనం కనిపించింది. కానీ నేటివిటీ మిస్ అయింది.తొలి పార్ట్లో శివ చిన్నతనంలో తండ్రి తప్పిపోవడం అనే పాయింట్ దగ్గర ఈ సినిమా మొదలవుతుంది. ఎక్కడైతే తన తండ్రి తప్పిపోయాడో అక్కడికి వెళ్లి చూస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి దంత కథ అంటూ చెప్పడం మొదలుపెడతాడు. ఈశ్వరుని పూదోట, బాంగ్రా రాజ్యం, కాదంబ రాజ్యం, కడపటి దిక్కువాళ్లు, కాంతార అనే ప్రదేశం.. ఇలా చాలా కొత్త విషయాలు కొత్త మనుషుల్ని పరిచయం చేస్తూ వెళ్లారు. ఈ క్రమంలో అసలు కథ చెప్పడానికి చాలా టైమ్ తీసుకున్నారు. అడవిలో ఉండే హీరో అతడి మనుషులు బాంగ్రా రాజ్యానికి రావడం, అక్కడ చేసే హంగామాతో ఫస్టాప్ అలా నడిచిపోతుంది. టైగర్ ఎపిసోడ్తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్ మొదలయ్యాక స్టోరీ ఎటెటో వెళ్తుంది. అసలు కథ కంటే ఉపకథలు ఎక్కువైపోయాయి. దీంతో మొత్తం గజిబిజి గందరగోళంలా అనిపిస్తుంది. స్క్రీన్పై అన్నీ జరుగతుంటాయి కానీ దేనికి కనెక్ట్ కాలేకపోతాం. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి కూడా టైమ్ పడుతుంది. సరే అయిందేదో అయిపోయిందిలే అనుకుంటే చివరలో మూడో పార్ట్ కూడా ఉందని చెప్పి ముగించారు. అప్పుడొచ్చిన 'కాంతార' స్టోరీ ఎవరైనా సరే సింపుల్గా చెప్పడానికి వీలు కుదిరేలా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు అలా చెప్పలేరు. సినిమా చూసొచ్చాక ఎవరినానై స్టోరీ ఏంటో చెప్పమని అడగండి. కచ్చితంగా తడబడతారు. అలా ఉంది! అయితే యాక్షన్ సన్నివేశాలు, దానికి తగ్గ సెటప్ బాగుంది. కానీ సెకండాఫ్లో వచ్చే యుద్ధం సీన్ చూస్తున్నప్పుడు బాహుబలి ఛాయలు కనిపిస్తాయి.ఎవరెలా చేశారు?రిషభ్ శెట్టి నటన బాగానే ఉంది గానీ తొలి పార్ట్ కంటే డిఫరెన్స్ ఏముందా అని సందేహం వస్తుంది. మిగతా వాళ్లలో రుక్మిణి వసంత్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. యువరాణిలా అందంగా ఉంది. ఈమె పాత్రలో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. చివరలో ఈమె పాత్రని ముగించిన తీరు మాత్రం ఆమె ఫ్యాన్స్కి అస్సలు మింగుడుపడదు. జయరామ్, గుల్షన్ దేవయ్య.. రాజులుగా బాగానే చేశారు. మిగిలిన వాళ్లలో పెద్దగా తెలిసిన ముఖాలేం లేవు. టెక్నికల్ విషయాలకొస్తే పాటలు రొటీన్. గుర్తుండవు అలానే అర్థం కావు కూడా. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే. నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ దర్శకుడిగా మాత్రం రిషభ్ శెట్టి ఈసారి మెప్పించలేకపోయాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం రిచ్గా ఉన్నాయి. మూవీ అంతా చూసిన తర్వాత పాన్ ఇండియా మోజులో పడిపోయి రిషభ్ శెట్టి ఇలాంటి సినిమా తీశాడేంటా అని కచ్చితంగా అనిపిస్తుంది.- చందు డొంకాన -
శారీలో నిహారిక లుక్స్.. ఫెస్టివ్ మూడ్లో దిల్ రాజు సతీమణి!
శారీలో నిహారిక కొణిదెల ఫెస్టివ్ లుక్స్..ఫెస్టివ్ మూడ్లో దిల్ రాజు సతీమణి తేజస్విని..ఐస్లాండ్లో చిల్ అవుతోన్న మంచు లక్ష్మీ..శారీలో నివేదా థామస్ బ్యూటీఫుల్ లుక్..సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి సాహితి..కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి డిఫరెంట్ పోజులు.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
బాబా బ్లాక్ షీప్.. పోస్టర్ రిలీజ్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్
గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట.. ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఓ ఆరుగురి ప్రయాణంతో న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా బాబా బ్లాక్ షీప్ అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియో బ్యానర్పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు.దసరా సందర్భంగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా బా బా బ్లాక్ షీప్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ను చూస్తుంటే.. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథగా అర్థమవుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నారు. -
నాకు డిజార్డర్ ఉంది.. నాలుగు గంటలు కూడా కష్టమే: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. సినిమాలతో పాటు రేసింగ్లో దూసుకెళ్తోన్న స్టార్ హీరో.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఓ డిజార్డర్ ఉందని తెలిపారు. తనకు అస్సలు నిద్ర పట్టదని అజిత్ కుమార్ తెలిపారు. స్లీపింగ్ డిజార్డర్ వల్ల రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని వెల్లడించారు. ఇది అధిగమించేందుకు ప్రయాణం చేసేటప్పుడు నిద్రించేందుకు ట్రై చేస్తానని అజిత్ అన్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో అద్భుతాలు చేయడానికి సోషల్ మీడియా గొప్ప సాధనంగా మారిందన్నారు. సామాజిక మాధ్యమాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు. రేసింగ్లో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమని విషయమన్నారు. అయితే కార్లను ప్రత్యేకంగా.. డ్రైవర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారని వెల్లడించారు. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలకు ముప్పు చాలా చాలా తక్కువని చెప్పారు. -
‘మటన్ సూప్’ హిట్ అవ్వాలి : అనిల్ రావిపూడి
రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’.‘విట్నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. దసరా సందర్భంగా బుధవారం (అక్టోబర్ 1) నాడు ‘మటన్ సూప్’ టీజర్ను సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.ఈ టీజర్ను లాంఛ్ చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ బాగుంది. టీం కూడా చాలా కొత్తగా ఉంది. దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ .. ‘గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్ను లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. మంచి స్క్రీన్ ప్లేతో మా చిత్రం రాబోతోంది. అక్టోబర్ 10న మా సినిమా రాబోతోంది. అందరూ వీక్షించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. ‘క్రమశిక్షణకు, నిబద్దతకు మారు పేరు అయిన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్ను లాంఛ్ చేశారు. ఆయన మా టీజర్ను లాంఛ్ చేయడం మా అదృష్టం. మా నిర్మాతలు నాకు ఎంతో అండగా నిలిచారు. రమణ్ గారు ఎంతో గొప్పగా నటించారు. మా అందరినీ ముందుండి నడిపిస్తున్న పర్వతనేని రాంబాబు గారికి థాంక్స్. గొప్పగా నటించిన గోవింద్, జెమినీ సురేష్ గార్లకు థాంక్స్. నాకు అండగా నిలిచిన సునీత అక్కకి థాంక్స్. మా సినిమా అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
రూ.40 కోట్ల మాదక ద్రవ్యాలు.. అదుపులో బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ను సరఫరా చేస్తూ చెన్నై ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు. ఈ మాదకద్రవ్యాల రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.కాగా.. అస్సాంకు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాల్లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం కొందరు స్నేహితుల నైజీరియా ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్కు వెళ్లమని.. భారత్కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని ఆశ చూపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. రెండు వారాల క్రితమే ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. రిటన్ జర్నీలో ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా.. అక్కడి నుంచి చెన్నై.. చెన్నై నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలని నైజీరియా ముఠా అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విశాల్ బ్రహ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించారు. -
సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ.. భయపెట్టేలా సాంగ్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జటాధర. ఈ మూవీలో పాన్ ఇండియా మూవీలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో పాటను విడుదల చేశారు.జటాధర మూవీలోని ధన పిశాచి అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా..సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటకు సమీర్ కొప్పికర్ సంగీతమందించారు. ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. సోనాక్షి సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. -
అనుమతి లేకుండా నాగార్జున పేరు వాడితే అంతే
తన హక్కులకు రక్షణ కల్పించాలంటూ తెలుగు హీరో నాగార్జున.. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని పేర్కొంది. ఏఐ, జెఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.(ఇదీ చదవండి: శుభవార్త.. నిశ్చితార్థం చేసుకున్న అల్లు శిరీష్)అయితే నాగార్జున ఫొటోని, గాత్రాన్ని అభ్యంతర కంటెంట్తో పాటు నకిలీ ఎండోర్స్మెంట్, టీ షర్ట్స్ తదితర వ్యాపారాల్లో.. యూట్యూబ్ షార్ట్స్లోనూ ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారని నాగ్ తరఫు న్యాయవాదాలు.. ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నాగ్కి అనుకూలంగా తీర్పు వచ్చింది.ఇక మీదట సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నాగార్జున హక్కులకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలకు న్యాయస్థానం ఆదేశించింది. నాగార్జున ఇప్పుడు ఇలా చేయడంతో ముందు ముందు ఇతర సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు విషయమై ఇదే దారిలో వెళ్తారని అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ) -
ఓటీటీకి వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి సినిమాలకు పెద్ద సంఖ్యలో ఆడియన్స్ ఉన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి చిత్రాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ చిత్రాలకు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్లో సుమారు 15 ఏళ్ల తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగాన్ని తెరకెక్కించారు. మే 15న భారత్లో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ను తెగ భయపెట్టేసింది.అయితే ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియా ఫ్యాన్స్కు మాత్రం వీక్షించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో ఓటీటీలో ఫైనల్ డెస్టినేషన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇండియా ఫ్యాన్స్ కోసం జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి తెలుగు ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.కాగా.. రూ. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్టైమ్ ఉన్న ఈ చిత్రంలో బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్ తదితరులు నటించారు. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అయింది. -
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ అవికా గోర్ (ఫొటోలు)
-
త్వరలో అల్లు శిరీష్ నిశ్చితార్థం.. అధికారిక ప్రకటన
అల్లు వారి ఇంట్లో శుభకార్యం. బన్నీ సోదరుడు, హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ మధ్యనే మూడు నాలుగు రోజుల క్రితం శిరీష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఇన్ స్టాలో ఫొటోలు పోస్ట్ చేశాడు. నయనిక అనే అమ్మాయితో తన ఎంగేజ్మెంట్ జరగనుందని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కురుక్షేత్ర'.. ట్రైలర్ రిలీజ్)'మా తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసుకు సంబంధించిన ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నయనికతో నాకు నిశ్చితార్థం అక్టోబరు 31న జరగనుంది. కొన్నాళ్ల క్రితమే చనిపోయిన మా నానమ్మ నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కోరుకునేది. ఇప్పుడు ఆమె మా మధ్య లేనప్పటికీ పైనుంచి ఆశీర్వదాలు కచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను' అని శిరీష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.అల్లు అరవింద్ కొడుకుగా అందరికీ తెలిసిన శిరీష్.. 'గౌరవం' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా కొత్త ప్రాజెక్టులు చేయట్లేదు. దీంతో ఏం చేస్తున్నాడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. (ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
స్టార్ హీరోయిన్కు రెండోసారి ప్రెగ్నెన్సీ..!
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ (Sonam Kapoor) గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఆ తర్వాత 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2022లో మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పింది. తన ముద్దుల కుమారుడికి వాయు అనే పేరు పెట్టుకుంది. తాజాగా సోనమ్ కపూర్ రెండోసారి ప్రెగ్నెన్సీ ధరించినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటిస్తారని సమాచారం. సోనమ్ కపూర్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. కాగా.. సోనమ్ కపూర్ తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని పెళ్లాడింది. (ఇది చదవండి: తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్)ఇక సోనమ్ కపూర్ కెరీర్ విషయానికొస్తే..ఆమె చివరిసారిగా బ్లైండ్ (2023) చిత్రంలో కనిపించింది. ఈ మూవీని 2011లో అదే పేరుతో వచ్చిన కొరియన్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో పురబ్ కోహ్లీ, వినయ్ పాఠక్, లిల్లెట్ దుబే కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
ఓటీటీలోకి 'కురుక్షేత్ర'.. ట్రైలర్ రిలీజ్
కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన యానిమేటెడ్ మూవీ 'మహావతార్ నరసింహా'.. ఊహించని విధంగా బ్లాక్బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. కేవలం రూ.40 కోట్లు పెడితే రూ.300 కోట్ల పైగా కలెక్షన్ అందుకుని ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే యానిమేటెడ్ ట్రెండ్ మొదలైపోయింది. తెలుగులోనూ రీసెంట్గానే 'వాయుపుత్ర' అనే యానిమేటెడ్ మూవీ ప్రకటించారు.(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ)ఇది సినిమాల వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోనూ 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. కొన్నిరోజుల క్రితం దీని స్ట్రీమింగ్ గురించి ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే 18 రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగిందో చూపించబోతున్నారని ట్రైలర్తో చూస్తే అర్థమైంది. కాకపోతే ట్రైలర్లో యానిమేషన్ ఏమంత గొప్పగా అనిపించలేదు.అక్టోబరు 10 నుంచి ఈ సిరీస్.. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటితరానికి కురుక్షేత్రం గురించి పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం గురించి చాలామందికి తెలియదు. ఒకవేళ యానిమేషన్ అంతంత మాత్రంగా ఉన్నాసరే మేకర్స్.. కంటెంట్ని ఎంగేజింగ్గా చెప్పగలిగితే ఈ సిరీస్ హిట్ కావొచ్చు. చూడాలి మరి ఏం చేశారో?(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్') -
మూవీ వార్.. ఈ దసరా ఎవరిది..?
-
Devara 2: బాహుబలి 2 పుష్ప 2ని మించి..


