megastar Chiranjeevi
-
చిరు లండన్ పర్యటనలో గోల్ మాల్
-
ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మెగాస్టార్ ఆగ్రహం
యూకే పర్యటనపై మెగాస్టార్ చిరంజీవి మరో ట్వీట్ చేశారు. తన పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని పోస్ట్ చేశారు. అయితే ఇదే క్రమంలో కొందరు డబ్బులు వసూలు చేశారని నాకు సమాచారం వచ్చిందన్నారు. అభిమానుల సమావేశాల పేరుతో ఇలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మెగాస్టార్ ట్విటర్లో రాసుకొచ్చారు. ఇలాంటి చర్యలకు తాను పూర్తిగా వ్యతిరేకమని చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సందేశమిచ్చారు. లండన్లో తనని కలిసేందుకు ఫ్యాన్స్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.చిరు తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన అభిమానులారా.. యూకేలో నన్ను కలవాలనుకునే మీ అందరి ప్రేమ, ఆప్యాయత నా మనస్సును తాకింది. అయితే కొంతమంది వ్యక్తులు అభిమానుల సమావేశాల కోసం డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు సమాచారం అందింది. ఇలాంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరైనా డబ్బులు వసూలు వస్తే వెంటనే వారికి తిరిగి ఇవ్వండి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్కడా కూడా ఇలాంటి చర్యలను అనుమతించను. మీ ప్రేమ, ఆప్యాయత, బంధం వెలకట్టలేనిది. దీన్ని ఎవ్వరూ ఏ విధంగానూ వ్యాపారంగా మార్చలేరు. ఇలాంటి దోపిడీకి దూరంగా ఉందాం' అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో మెగాస్టార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.(ఇది చదవండి: నా హృదయం సంతోషంతో నిండిపోయింది: మెగాస్టార్ చిరంజీవి)కాగా.. చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. My Dear Fans , I am deeply touched by all your love and affection in wanting to meet me in UK. However, I’ve been informed that some individuals are attempting to charge a fee for the fan meetings. I strongly condemned this behaviour. Any fee collected by any one will be refunded…— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025 -
నా హృదయం సంతోషంతో నిండిపోయింది: మెగాస్టార్ చిరంజీవి
యూకే పార్లమెంట్లో తనకు జరిగిన సన్మానంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చాలా మంది గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సెక్రటరీలు, దౌత్యవేత్తలు సమక్షంలో అందుకున్న గౌరవంతో నా మనసు నిండిపోయిందని పోస్ట్ చేశారు. టీమ్ బ్రిడ్జ్ ఇండియా ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించడంతో మనస్ఫూర్తిగా సంతోషాన్ని ఇచ్చిందని రాసుకొచ్చారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' నాకు దక్కిన ఈ గౌరవం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కానీ నా అద్భుతమైన ప్రేమగల అభిమానులకు, నా సోదర, సోదరిమణులకు, నా కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రయాణానికి నాకు అన్ని విధాలుగా సహకరించి.. నా మానవతా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ గౌరవం నన్ను మరింత కష్టపడేందుకు ప్రేరేపిస్తుంది. నాకు మరింత శక్తిని అందిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Heart filled with gratitude for the honour at the House of Commons - UK Parliament by so many Esteemed Members of Parliament , Ministers & Under Secretaries, Diplomats. Humbled by their kind words. Heartened by the Life Time Achievement Award by Team Bridge India. Words are not… pic.twitter.com/XxHDjuFIgM— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025 -
మెగాస్టార్ కు ప్రతిష్ఠాత్మక పురస్కారం
-
మెగాస్టార్కు ఆ దేశ పౌరసత్వం.. ఆయన టీమ్ ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మువీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్లో చిరు సందడి చేశారు. అయితే తాజాగా మెగాస్టార్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరుకు యూకే గౌరవ పౌరసత్వం అందించనుందని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ టీమ్ స్పందించింది. ఇటీవల ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన చిరంజీవి తాను లండన్ వెళ్తన్నట్లు చెప్పడంతో ఈ ఈ వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందన్న వార్తలు అవాస్తవమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు రాసేముందు ముందుగా ధృవీకరించుకోవాలని తెలిపింది. విశ్వక్ సేన్ మూవీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ లండన్ వెళ్లనున్నట్లు తెలిపారు. లండన్లో ఓ ఈవెంట్లో తనకు సన్మానం జరగనుందని మెగాస్టార్ తెలిపారు. దీంతో కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో సిటిజెన్షిప్ గురించే లండన్ వెళ్తున్నారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా.. చిరంజీవి చివరిసారిగా భోలా శంకర్లో కనిపించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర్ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో చిరు జతకట్టనున్నారు. -
చిరు-అనిల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్..
-
అమ్మ అంజనాదేవికి అస్వస్థత.. స్పందించిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అస్వస్థత గురైనట్లు వచ్చిన వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన ట్వీట్ చేశారు. మా అమ్మ అస్వస్థతకు గురైందని కొన్ని మీడియా కథనాలు చూశానని వెల్లడించారు. అమ్మ కొద్దిపాటి అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని.. రెండు రోజుల ముందు నుంచే ఆమెకు ఆరోగ్యం కాస్తా బాగాలేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని.. సంపూర్ణం ఆరోగ్యంతో ఉన్నారని చిరంజీవి తెలిపారు. అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నా అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థత గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే కేవలం రెగ్యూలర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లినట్లు వారి కుటుంబ సన్నిహితులు తెలిపారు. కానీ సోషల్ మీడియాలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కథనాలొచ్చాయి. దీంతో మెగాస్టార్ చిరు స్పందించారు. తాజాగా అమ్మ అంజనాదేవి ఆరోగ్యంపై అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార్ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. My attention is drawn to some media reports claiming our mother is unwell and is hospitalised. Want to clarify that she was a little indisposed for a couple of days. She is hale and hearty and is perfectly alright now. Appeal to all media not to publish any speculative reports…— Chiranjeevi Konidela (@KChiruTweets) February 21, 2025 -
విమానంలో వివాహ వేడుక.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి తన వివాహా వార్షికోత్సవాన్ని చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు. విమానంలో తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. ఫ్టైట్లో దుబాయ్ వెళ్తూ తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నామని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. తాజాగా చిరు తమ పెళ్లి రోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన స్నేహితులతో కలిసి విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని చాలా జరుపుకుంటున్నాం. సురేఖ లాంటి డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నా బలం, నా యాంకర్ కూడా. ప్రపంచంలోని అద్భుతమైన నాకు తెలియని వాటిని నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. తను నా పక్కన ఉంటే సౌకర్యంతో పాటు అద్భుతమైన ప్రేరణ కూడా. ఈ సందర్భంగా నా సోల్మేట్ సురేఖకు ధన్యవాదాలు. నీ పట్ల నాకున్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేయడానికి ఇలాంటివీ మరిన్నీ సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార్ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Celebrating our wedding anniversary on a flight with some very dear friends en route Dubai ! 🎉I always feel I am very fortunate to have found a dream life partner in Surekha. She is my strength, my anchor and the wind beneath my wings. Always helps me navigate through the… pic.twitter.com/h4gvNuW1YY— Chiranjeevi Konidela (@KChiruTweets) February 20, 2025 -
జూన్ లో పట్టాలపైకి చిరు-శ్రీకాంత్ ఓదెల యాక్షన్ ప్రాజెక్ట్
-
మీరు చాలా మారాలి సార్!
అంతరిక్షంలో చిక్కుకుపోయి, భూమికి చేరేమార్గం కోసం ధైర్యంగా ఎదురుచూస్తున్న సునీతా విలియమ్స్ (Sunita Williams) వంటి సాహసగత్తెల కాలంలో ఉన్నాము. అదే సమయంలో స్త్రీల మీద వివక్షలు మారకపోగా కొత్త రూపాలు తీసుకున్నాయని ఇటీవలి కొన్ని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రాబల్య స్థానాల్లో ఉన్న కొందరు పురుషులు బహిరంగంగా, ఎటువంటి సంకోచాలూ లేకుండా స్త్రీల గురించి చేస్తున్న వ్యాఖ్యలు పితృస్వామ్య సామాజిక స్థితిని దగ్గరగా చూపిస్తున్నాయి. ఈ పురుషుల్లో సినిమా నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, చివరికి న్యాయ, రక్షణ వ్యవస్థలు కూడా ఉండడం వివక్ష తీవ్రతను తెలుపుతున్నది.మాట, చూపు, హావభావ కవళికల్లో పెద్దమనిషితనం ఉట్టి పడుతున్నట్లు కనిపించేలా సవాలక్ష జాగ్రత్తలు తీసుకునే ‘మెగాస్టార్’ ఈసారి దొరికిపోయారు. ఆడపిల్లలతో నిండిన తన ఇల్లు లేడీస్ హాస్టల్లా, తను వార్డెన్లా ఆయనకి అనిపించింది. అయిదుగురు చెల్లెళ్లకి రక్షకుడిలా తను నటించిన ‘హిట్లర్’ సినిమా నిజం అనుకున్నారు కాబోలు! అంతేకాకుండా తమ లెగసీ కొనసాగించడానికి ఈసారైనా కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగా చమత్కారపూర్వక సలహా ఇచ్చారు. పసిబిడ్డ మొహాన్ని కూడా బహిరంగపరచకుండా తమ ప్రైవసీని కాపాడుకునే అతని కొడుకూ కోడలూ – తమ ఆడపిల్లకి ఎదురైన ఈ బహిరంగ వివక్షని ఎలా తీసుకుంటారో బహుశా అది వారి కుటుంబ విషయం. కానీ అనేకమంది ఆరాధకులని పెంచి పోషించుకునే ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించవలసినవి. రేపుమాపు ‘మెగా’ అభి మానులందరూ తమ ఇంటి స్త్రీలకి వార్డెన్లగానూ, లెగసీ కోసం కొడుకుల్ని కనమని వేధించేవారిగానూ ఉండడమే ఫ్యాషన్ అనుకుంటే అది ప్రమాదం కనుక ఈ వ్యాఖ్యలని కొందరైనా ఖండిస్తున్నారు. స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో సినీనటుడు బాలకృష్ణ ‘గాడ్ ఆఫ్ వల్గారిటీ’కి ప్రతీకగా మారిపోయారు. స్త్రీలను ఉద్దేశించి నర్మగర్భంగా తను ఎక్కని ఎత్తులు, దిగని లోతులు లేవని అనడం, వెంటపడే పాత్రలు చేస్తే తన ఫాన్స్ ఊరుకోరని, అమ్మాయిలు కనపడగానే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేసేయాలని కోరుకుంటారన్న అసభ్య వ్యాఖ్యలకి కోర్టుకేసులు ఎదుర్కున్నారు. ఒక నటిని పడిపోయేంతగా వేదిక మీద నెట్టడం దగ్గర్నుంచి తన చుట్టూ ఉండే స్త్రీలతో కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వేధింపు పరిధిలోకి వస్తుంది. ఇటీవల విడుదలైన చిత్రంలోని ఒక పాటకు ఆయన వేసిన స్టెప్పులు దిగజారడానికి పరిధులు ఏమీ లేనంత హీనమైనవి. అది కళారంగపు టేస్ట్ అనుకుని వదిలేయనివ్వలేదు బాలకృష్ణ (Balakrishna). అదే నటితో ఒక ప్రయివేట్ పార్టీలో అవే స్టెప్పులు వేస్తూ ఆమెని ఇబ్బంది పెట్టారు. వారికి లేని బాధ మీకేమిటనే అభిమానులకి కొరత లేదు. మగనటుల పవర్, స్త్రీ నటుల అవకాశాలను ప్రభావితం చేస్తుంది కనుక వారు ఊరుకుంటారు. కానీ సమాజం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగంగానే ఇలా ఉంటే కనపడని వేధింపులు ఎన్నో ఊహించలేము. నటుడిగా దాక్కోడానికి చోటు ఉన్నట్లు రాజకీయాల్లో ఉండదు కనుక ఇట్స్ టైమ్ టు స్టాపబుల్ మిస్టర్ ఎమ్మెల్యే!భార్యతో భర్త చేసే బలవంతపు అసహజ శృంగారం నేరం కాదని ఇటీవల ఛత్తీస్గఢ్ హైకోర్టు (chhattisgarh high court) ఇచ్చిన తీర్పు ఇపుడు చర్చలోకి వచ్చింది. 2017లో జరిగిన ఘటన ఇది. భర్త చేసిన అసహజ లైంగికచర్యల కారణంగా భార్య అనారోగ్యానికి గురయి మరణించింది. మరణ వాంగ్మూలంలో ఆమె ఇదే చెప్పింది. కింది కోర్టు వేసిన పదేళ్ళ శిక్షని కొట్టేసి భర్తని నిర్దోషిగా తేల్చింది హైకోర్టు. మారిటల్ రేప్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతంగా ఆమె శరీరాన్ని తాకకూడదన్నది ఒక విలువగా, హక్కుగా సమాజానికి అలవాటు కావాల్సిన సమయంలో ఈ తీర్పు స్త్రీల లైంగిక స్థితిని కొన్ని రెట్లు వెనక్కి నెట్టేదిగా ఉంది. ఆ భర్త అసహజ లైంగిక చర్య చేయడం గురించి కొంతమంది తప్పు బడుతున్నారు. సహజమా, అసహజమా అన్నది కాదు ముఖ్యం. ఆమె సమ్మతి ముఖ్యం. స్త్రీని లైంగిక కోరికలు తీర్చే వస్తువుగా చూసే పాత ఆలోచనా విధానాన్ని అందరూ సవరించుకోవాల్సిన అవస రాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తోంది. పనిగంటల విషయంలో ఎల్ అండ్ టి ఛైర్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చాలా చర్చల్లోకి వచ్చాయి. వారానికి తొంభై పనిగంటలు పనిచేయాలని సూచిస్తూ ‘ఇంట్లో మీరు మీ భార్య మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలరు, మీ భార్య మీ మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలదు’ అని వ్యాఖ్యానించారు. పనిగంటల భారాన్ని వ్యతిరేకిస్తూ ఇంటిపనులు, బైటిపనులు, వ్యక్తిగత, మానసిక అవసరాల గురించి చాలామంది మాట్లాడారు. అయితే తక్కువగా చర్చకు వచ్చిన విషయం ఒకటి ఉంది. అది ఈ పనిగంటల సూచన కేవలం మగ ఉద్యోగులను ఉద్దేశించినట్లుగా ఉండడం. దాని ద్వారా ఇల్లు, పిల్లలు, వృద్ధుల బాధ్యతలు మగవారి టెరిటరీ కావు, అవి కేవలం స్త్రీలకి ఉద్దేశించినవి మాత్రమేనన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు! మగవారు తమ పూర్తికాలం ఉద్యోగంలో గడిపితే కుటుంబాల సమస్త బాధ్యతలు స్త్రీల మీద పడతాయి. ఉద్యోగం పురుష లక్షణం, ఇల్లు దిద్దుకోవడం స్త్రీ లక్షణంగా ఆ వ్యాఖ్యల అంతరార్థం స్ఫురిస్తోంది. చదవండి: ‘దంగల్’ చూడండి ‘మాస్టారు’పై నాలుగు ఘటనల్లో నాలుగు ప్రధానమైన సమస్యలు మన ముందుకు చర్చకు వచ్చాయి. ఆడశిశువుని పురిటిలోనే చంపేసిన సమాజాలు మనవి. ఆ దశ దాటి వస్తున్నాము. ఆకాశంలో సగాలకి తాము వార్డెన్లమని బాధపడటం కాకుండా– వారి పుట్టుక, ఎదుగు దల, విజయాలు సాధికారికంగా సెలెబ్రేట్ చేసుకోవడం మన వివేకంలో భాగం కావాలి. స్త్రీలకు సొంత లైంగిక వ్యక్తిత్వం ఉంటుంది. అధికారం, హోదా, పేరు ప్రఖ్యాతులతో మదించినవారు ఆ వ్యక్తిత్వం మీద దాడి చేస్తూనే ఉంటారు. చదవండి: దీపికా పదుకోన్ (బాలీవుడ్ నటి) రాయని డైరీధైర్యంగా వ్యతిరేకించే వారు పెరగాలి. న్యాయవ్యవస్థలు న్యాయసూత్రాల పరిధికి లోబడి పనిచేస్తాయి. న్యాయసూత్రాలు కాలం చెల్లినవిగా, స్త్రీలకి రక్షణ కల్పించలేనివిగా ఉన్నప్పుడు వాటిమీద పౌరసమాజం విస్తృత చర్చ చేయాలి. ఇంటిపనికి విలువ కట్టడం సరే, స్త్రీ పురుషుల మధ్య పని విభజనకి మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. వీటన్నిటితో పాటు లోకం తన చూపుకి మరికాస్త స్త్రీ తత్వాన్ని అద్దుకోవాలి.కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
మాస్ ఇంట్రో
చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది.ప్రోడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ శంకర్పల్లిలో వేసిన ఓ భారీ సెట్లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఈ పాట కోసం ఓ పవర్ఫుల్ మాస్ యాంథమ్ను కంపోజ్ చేయగా, శోభి మాస్టర్ నృత్య రీతులను సమకూర్చుతున్నారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట చిత్రీకరణ సందర్భంగా ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి స్టైలిష్ లుక్ను రిలీజ్ చేశారు.‘‘యాక్షన్, ఎమోషన్లతో పాటు విజువల్ వండర్లా ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమాకు చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. -
'ఆ ఆలోచన నుంచి బయటికి రండి'.. చిరుకు శ్యామల చురకలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. తనలాగే రామ్ చరణ్కు వారసుడు పుట్టాలని కోరుకుంటున్నానని మనసులో మాట బయటపెట్టారు. మా ఇంట్లో నా చుట్టూ అంతా మనవరాల్లే ఉన్నారని.. ఇళ్లంతా లేడీస్ హాస్టల్ను తలపిస్తోందని అన్నారు. చరణ్ ఇంకో అమ్మాయిని కంటాడేమనని భయమేస్తోందని సరదాగా అన్నారు. చిరు సరదాగా కామెంట్స్ చేసినప్పటికీ..దీనిపై పలువురు నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. వారసుడంటే మగపిల్లాడేనా.. కూతుర్లు వారసురాళ్లు కాకూడదా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.తాజాగా చిరంజీవి చేసిన కామెంట్పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించింది. వారసుడు అంటే కొడుకే అవుతాడా?.. కూతురు అవ్వకూడదా? అని ఆమె ప్రశ్నించారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదు కానీ..వారసుడు అంటే కొడుకులే అవ్వాలి అనే ఆలోచన నుంచి బయటికి వస్తే బాగుంటుందని అన్నారు. మహిళలు ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచన సరికాదన్నారు. వారి కోడలు ఉపాసన కూడా ఎంత చక్కగా రాణిస్తున్నారు. కొడుకైనా.. కూతురైనా వారసులు అవ్వొచ్చు అని తెలిపింది శ్యామల.మెగాస్టార్ ఏమన్నారంటే..బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ మాట్లాడుతూ..'ఇంట్లో నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగపిల్లాడు లేడు. చరణ్.. ఈసారైనా సరే ఒక మగపిల్లాడిని కనరా.. నా వారసత్వం ముందుకువెళ్లాలని కోరిక. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని నా భయం' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం చెలరేగింది. చిరంజీవి వారసుడిని కోరుకోవడం తప్పు లేదు కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందనడం కరెక్ట్ కాదని పలువురూ అభిప్రాయపడుతున్నారు. కాగా రామ్చరణ్- ఉపాసన దంపతులకు 2023లో క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. -
ఈసారైనా రామ్ చరణ్ కు కొడుకు పుడితే బాగుండు: చిరంజీవి
-
మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన తన తాతయ్య గురించి మాట్లాడారు. మా కుటుంబంలో ఆయనకు ఓ ప్రత్యేకమైన అలవాటు ఉండేదని అన్నారు. ఆయన మంచి కళా పోషణ కలిగిన వ్యక్తి అని నవ్వుతూ మాట్లాడారు. బ్రహ్మనందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మెగాస్టార్.చిరంజీవి మాట్లాడుతూ..'మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన స్వస్థలం నెల్లూరు అయితే మొగల్తూరు వచ్చి స్థిరపడ్డారు. అక్కడే స్టేట్ ఎక్సైడ్ ఇన్స్పెక్టర్గా రిటైరయ్యారు. నీకు ఎవరి బుద్ది అయినా రావొచ్చు కానీ.. ఆయన బుద్ధి మాత్రం రాకూడదనేవారు. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. మా ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. వాళ్లద్దరిపై అలిగితే మూడో ఆమె దగ్గరికి వెళ్లేవారు. నాకు తెలిసి ముగ్గురే.. అలా నాలుగు, ఐదు ఉన్నారేమో నాకు తెలియదు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావ్ కదా జాగ్రత్త. అసలే అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయనను మాత్రం ఆదర్శంగా తీసుకొవద్దని చెప్పారు.' అని నవ్వుతూ సరదాగా అన్నారు మెగాస్టార్. ఇంకేముంది ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇదే ఈవెంట్లో బ్రహ్మానందం తన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..'మా అమ్మానాన్నల గురించి చెప్పడం అంటే దేవుడి గురించి చెప్పడమే. నా తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఒకవైపు పేదరికం.. మరోవైపు పెద్దరికంతో బతికారు. నా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఎప్పుడు గర్వపడుతుంటా. మా నాన్న నాకు ఒక మాట చెబుతుండేవారు.. ఒక మనిషి 18 రోజులు భోజనం చేయకపోతే చనిపోతాడు. 17 రోజుల వరకు ఎవరి దగ్గర చేయి చాచి అడగొద్దు. 18వ రోజు తప్పనిసరి అయితేనే ఎవరినైనా సాయం అడుగు అనేవారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తా. నా జీవితంలో అప్పు అనే మాట తావులేదు' అని అన్నారు.కాగా.. బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్తో కలిసి బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవలే ప్రభాస్ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు. -
అలనాటి స్టార్ హీరోయిన్ కూతురి పెళ్లి.. చిరంజీవి సినిమాలో కూడా!
కన్నడ సినీ ఇండస్ట్రీలో జయమాల అప్పట్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కన్నడతో పాటు తెలుగు, తుళు, తమిళ భాషల్లో కూడా హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన జయమాల పెరిగింది మాత్రం చిక్మంగళూరు జిల్లాలోనే. ఆమె కాస్ దాయె కండన అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత నటిగా ఫేమ్ తెచ్చుకున్న ఆమె కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్(తెలుగు నాట కన్నడ ప్రభాకర్గా పాపులర్) వంటి సుప్రసిద్ధ కన్నడ స్టార్ హీరోల సరసన నటించింది.తాజాగా ఆమె కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు కన్నడ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. కిచ్చా సుదీప్, కేజీఎఫ్ హీరో యశ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చిరంజీవితో జయమాల..కాగా.. తెలుగులో జయమాల అర్జున గర్వభంగం (1979), భామా రుక్మిణి (1983), రాక్షసుడు (1986)(చిరంజీవి) చిత్రాల్లో నటించింది. రాక్షసుడు చిత్రంతో ఈమె తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలసి "నీ మీద నాకు ఇదయ్యో...అందం నే దాచలేను పదయ్యో.." అనే పాటతో మెప్పించింది. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో చిరంజీవితో పాటు తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మించగా.. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.కాగా.. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్ను వివాహం చేసుకుంది. అనేక తెలుగు చిత్రాల్లో విలన్గా బాగా పాపులరిటీ తెచ్చుకున్నారు. రాక్షసుడు చిత్రంలో కూడా ప్రధాన విలన్గా నటించడం విశేషం. అయితే కొన్ని కారణాల రీత్యా జయమాల అతడికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామెన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లాడింది. వీరిద్దరికి సౌందర్య అనే కుమార్తె ఉంది. తాజాగా తన కూతురి పెళ్లిని గ్రాండ్గా నిర్వహించింది జయమాల. -
విశ్వంభరలో మరో సర్పైజ్
-
వాల్తేరు డైరెక్టర్కు పిలిచి మరో ఆఫర్ ఇస్తోన్న చిరు
-
అమ్మ అంజనాదేవితో కేక్ కట్ చేయించిన మెగాస్టార్ (ఫోటోలు)
-
అంజనమ్మ బర్త్ డే వేడుక.. మెగాస్టార్ ఎమోషనల్ నోట్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన మాతృమూర్తి అంజనమ్మకు (Anjana Devi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్, మెగాస్టార్ దగ్గరుండి అంజనమ్మతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి.చిరు తన ఇన్స్టాలో రాస్తూ..'అమ్మా! ఈ ప్రత్యేకమైన రోజున మాటల్లో చెప్పలేనంతగా ప్రేమను అందుకున్నారు. మీరు ఊహించలేనంతగా గౌరవం అందించిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. మా ప్రియమైన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబానికి హృదయం లాంటి మీ స్వచ్ఛమైన, నిస్వార్థ ప్రేమకు కృతజ్ఞతలు. నీ పాదాలకి నమస్కరిస్తూ.. పుణ్యం చేసుకొన్న నీ సంతతి.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. అంతకుముందే ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. అంజనమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నాయనమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఇన్స్టా వేదికగా విషెస్ తెలిపింది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావడంతో వాయిదా వేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
'ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం'.. ఉపాసన స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి మెగా కోడలు శుభాకాంక్షలు తెలిపింది. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పింది. అంజనా దేవితో ఉన్న ఫోటోను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా అభిమానులు సైతం అంజనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన తన ఇన్స్టాలో రాస్తూ..'అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నాయనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో పాటు కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్ పూర్తయ్యాక మా ఫేస్లో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్సవదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తిదాయకం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ పోస్టులు పెడుతున్నారు.(ఇది చదవండి: అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్)ఇక ఉపాసన విషయానికొస్తే వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, దేవరభామ జాన్వీ కపూర్ చెర్రీ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆర్సీ16 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్.. ప్రధాని మోదీతో కలిసి జ్యోతి ప్రజ్వలన
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు జ్యోతి ప్రజ్వలన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంక్రాంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ పండుగ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా పాల్గొన్నారు. విశ్వంభరలో చిరంజీవి..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించనున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్తో విక్రమ్, వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఎంపిక చేశారు. ఫ్యాన్స్ కూడా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్ చూస్తే అర్థమవుతోంది. విశ్వంభర బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. #WATCH | Prime Minister Narendra Modi participates in #Pongal celebrations at the residence of Union Minister G Kishan Reddy, in Delhi. Ace badminton player PV Sindhu and actor Chiranjeevi also attend the celebrations here.(Video: DD News) pic.twitter.com/T7yj7LpeIG— ANI (@ANI) January 13, 2025 -
గేమ్ ఛేంజర్ రిలీజ్.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సినిమాకు చాలామంది ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉందన్నారు. అప్పన్న, రామ్ నందన్ పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా చేశారని తనయుడిని కొనియాడారు. ఈ సందర్భంగా సక్సెస్ సాధించిన గేమ్ ఛేంజర్ చిత్రబృందానికి ఆయన అభినందనలు తెలిపారు. గొప్ప సినిమాను అందించిన దర్శకుడు శంకర్తో పాటు దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. మెగా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే.. మరికొందరేమో ఫర్వాలేదని కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించారు.Delighted to see lots of appreciation for @AlwaysRamCharan who excels as Appanna ,the righteous ideologue & Ram Nandan, the determined IAS officer out to cleanse the system. Hearty Congrats to @iam_SJSuryah @advani_kiara @yoursanjali ,Producer #DilRaju @SVC_Official , above…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 10, 2025 నాలుగు పాటలకే రూ.75 కోట్లు..ఈ చిత్రంలోనే నాలుగు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పోస్ట్ చేశారు. కేవలం పాటలకే ఇంత భారీ బడ్జెట్ ఖర్చు చేయడంపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. అందువల్లే ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సినిమా రిలీజ్కు ముందే గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. మొదటి సాంగ్ జరగండి.. జరగండి అనే పాట ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు 13 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఈ సాంగ్లో విజువల్స్ ఫ్యాన్స్ను అలరించాయి.గేమ్ ఛేంజర్ కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ఐపీఎస్గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
అప్పట్లో ఐరన్ లెగ్ అని పేరొస్తుందని భయపడ్డా
సాక్షి, హైదరాబాద్: ‘ఆంట్రప్రెన్యూర్షిప్’ అంటే స్పెల్లింగ్ కూడా నాకు తెలీదు. దాని గురించి పెద్దగా మాట్లాడలేను. నా గురించి చెప్తా. తిరుగులేని మనిషి అనే సినిమా ఎన్టీఆర్తో చేస్తే ఫ్లాప్ అయ్యింది. తర్వాత డేట్లు చెప్పిన వ్యక్తి సినిమా నుంచి నన్ను తీసేశారు. ఏమైందంటే సినిమా పోయింది కదా అన్నారు. ఆ పరిస్థితుల్లో కుంగిపోయాను. ఐరన్ లెగ్ అనే పేరొస్తుందని భయపడ్డా. ఆకాశంలో గద్ద గుర్తొచి్చంది. అది కొంతవరకే కష్టపడి ఎగరాలి. తర్వాత గాలితో పాటు సునాయాసంగా పైకి ఎగరగలుగుతుంది.నన్ను నేను అలా మార్చుకోవాలని అనుకున్నా. నన్ను వద్దు అనుకున్న వ్యక్తితోనే ఎన్టీఆర్ కంటే ఎక్కువ చిత్రాలు తీసేలా మలచుకున్నా. పరిస్థితులు ఎలా ఉన్నా మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మన సానుకూల దృక్పథమే మనకు బలం..’అని ప్రముఖ నటుడు చిరంజీవి చెప్పారు. ఆదివారం హైటెక్స్లో ఆప్టా (అమెరికన్ ప్రోగ్రెస్సివ్ తెలుగు అసోసియేషన్) కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాజ్కపూర్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్నాం ‘విమర్శించే వారు మన గురించి ఆలోచన చేసే విధంగా మనం ఉండాలి. సినిమాల్లోకి కొత్తవారు వస్తారు. టాలెంట్ ఉంటే నడిచిపోతుందనుకుంటారు. అది సెకెండరీ. ప్రవర్తన బాగుండాలి. నైపుణ్యంతో పాటు వ్యక్తిత్వం ఉండాలి. ఎన్టీఆర్ తర్వాత నేనే టాప్లో నిలిచా. కానీ స్థానం కోసం ఏనాడూ ఆరాట పడలేదు. మన కుటుంబంలో 9 మంది నటులు ఉన్నారు. రాజ్కపూర్ కుటుంబంలా మన కుటుంబం ఉండాలని పవన్ అన్నాడు. అన్నట్టుగానే దక్షిణ భాతర దేశపు రాజ్కపూర్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్నాం..’అని చిరంజీవి చెప్పారు. అంతకుముందు జరిగిన ప్యానల్ చర్చలో పలువురు సభ్యులు మాట్లాడారు. ప్రతి ఒక్కరిలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉంటాడని అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించడం, దాన్ని విజయవంతం చేయడానికి విశ్వాసం, దూర దృష్టి, సహనం, స్వీయ క్రమశిక్షణ, సంకల్పం ఉండాలన్నారు.పోటీతత్వం లాంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉద్యోగులకు టీం, యాజమాన్య బాధ్యతలు అప్పగించడం వల్ల మరింత అంకితాభావంతో పనిచేస్తారని తెలిపారు. చిత్ర పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ప్యానలిస్టులు అభిప్రాయపడ్డారు. కేటలిస్ట్ బిజినెస్ పిచ్ పోటీలో టాప్ 5 స్టార్టప్లు ఫైనల్కు చేరుకున్నాయి. అందులో ముగ్గురిని విజేతలుగా ప్రకటించి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆప్టా చైర్మన్ సుబ్బు కోట, బిజినెస్ ఫోరం చైర్మన్ రమేష్, కన్వినర్ సాగర్, కమిటీ సభ్యులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
తండ్రికి నివాళులర్పించిన మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తండ్రికి నివాళులర్పించారు. చిరంజీవి(Chiranjeevi) తన తండ్రి వెంకట రావు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ చిరు తల్లి అంజనాదేవితో పాటు నాగబాబు దంపతులు ఆయన చిత్రపటానికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో షేర్ చేశారు. 'జన్మనిచ్చిన మహానీయుడిని ఆయన స్వర్గస్తులైన రోజున స్మరించుకుంటూ' అంటూ ఫోటోలు, వీడియోను పంచుకున్నారు.కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మెగాస్టార్తో పాటు నాగబాబు, పవన్ కల్యాణ్, మాధవి, విజయ దుర్గ జన్మించారు. కాగా.. చిరంజీవి తండ్రి వెంకటరావు కానిస్టేబుల్గా పనిచేశారు.కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర(vishwambhara) చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విశ్వంభరలో చిరంజీవి ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లోత్రిశూలంతో చిరంజీవి కనిపించారు. 'చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించిన సమయంలో ఒక అద్భుతమైన తార పోరాడేందుకు ప్రకాశిస్తుంది.' అని పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది.కాగా.. కోలీవుడ్ భామ త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోందని గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ… 🙏🙏 pic.twitter.com/MKxIw57pBZ— Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2024 -
ఆయన సినిమాలు మనదేశ సంస్కృతిలో భాగం: డైరెక్టర్ మృతి పట్ల మెగాస్టార్ సంతాపం
ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. మనదేశంలో అత్యుత్తమ డైరెక్టర్లలో ఆయన ఒకరని కొనియాడారు. ఆయన సినిమాలు, డాక్యుమెంటరీలు మనదేశం గొప్ప సంస్కృతిని తెలుపుతాయంటూ ట్వీట్ చేశారు. మన హైదరాబాదీ, మాజీ రాజ్యసభ సభ్యుడైన శ్యామ్ బెనెగల్ సాబ్ రచనలు ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని మెగాస్టార్ పోస్ట్ చేశారు.డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మృతి..సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం1934 డిసెంబర్ 14న హైదరాబాద్లో జన్మించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ విద్యను అభ్యసించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983, త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. Deeply saddened at the departure of Shri Shyam Benegal,one of the finest film makers and great intellectuals of our country. He discovered & nurtured some of the brightest film talents of India. His films, biographies and documentaries form part of India’s greatest cultural…— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2024 -
వివాహ వేడుకలో అల్లు అర్జున్, మెగాస్టార్.. ఫోటోలు వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఓ పెళ్లిలో సందడి చేశారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన ఓ వివాహా వేడుకలో తన భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ ఈ ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు.అయితే ఈ పెళ్లి వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కనిపించడం మరో విశేషం. వధూవరులను మెగాస్టార్ ఆశీర్విదిస్తున్న ఫోటో తెగ వైరలవుతోంది. ఓకే పెళ్లికి అల్లు, మెగా ఫ్యామిలీ సభ్యులు హాజరవడంతో టాలీవుడ్ మరోసారి హాట్టాపిక్గా మారింది. అయితే ఇటీవల ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వస్తున్నాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా అల్లు అరవింద్ ఫ్యామిలీ, మెగాస్టార్ చిరంజీవి ఓకే పెళ్లిలో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి వేడుకల్లో అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.మరోవైపు అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 భారీ కలెక్షన్స్తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.621 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా సాధించని విధంగా ఆల్ టైమ్ రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. View this post on Instagram A post shared by साधना सिंह📿 (@sadhnasingh1) -
అఫీషియల్: మెగాస్టార్తో జతకట్టిన హిట్ డైరెక్టర్.. హీరో నాని కూడా!
దసరా మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీతో మరింత క్రేజ్ దక్కించుకున్న శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది. అంతా ఊహించినట్లుగానే వీరి కాంబోలో మూవీ ఖరారైంది.ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న చిత్రానికి దసరా హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ను కూడా షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంపై ఫ్యాన్స్లో మరింత ఆసక్తి నెలకొంది.నాని తన ట్వీట్లో రాస్తూ..'ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ఆయన కోసం గంటల తరబడి క్యూలైన్స్లో వెయిట్ చేశా. నా సైకిల్ను కూడా కోల్పోయా. కానీ ఆయన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా. ఇప్పుడు ఆయన్నే మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇదంతా ఒక చక్రం లాంటిది. దర్శతుడు శ్రీకాంత్తో కలిసి ఆ కల నెరవేరబోతోంది' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.మెగాస్టార్ రిప్లైశ్రీకాంత్ ఓదెల, నానితో కలిసి పనిచేయడం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోందంటూ మెగాస్టార్ రిప్లై ఇచ్చారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాతే చిరంజీవి- శ్రీకాంత్ కాంబోలో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.Thrilled at this collaboration and looking forward to this one my dear @NameisNani 🤗@odela_srikanth#ChiruOdelaCinema Natural Star @NameisNani @UnanimousProd@sudhakarcheruk5 @SLVCinemasOffl https://t.co/AGfKjrwjDL— Chiranjeevi Konidela (@KChiruTweets) December 3, 2024 -
చిరంజీవి కాళ్లకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో విలనిజంతో ఆకట్టుకున్న నటుడు సత్యదేవ్. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. తాజాగా నటించిన చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కాళ్లకు ఆయన నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు. చాలా రోజులుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్ ఈ సినిమాతోనైనా ట్రాక్లో పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.Megastar #Chiranjeevi's MEGA Grand Entry At #ZEBRA Pre Release Event 💫💥❤️Mana Andari Aradhya Daivam 🙏❤️@KChiruTweets @ActorSatyaDev #MegastarChiranjeevi pic.twitter.com/rZ82BHPjgf— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) November 12, 2024 -
'క' టీమ్ను అభినందించిన మెగాస్టార్.. కిరణ్ అబ్బవరం పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది.(ఇది చదవండి: కిరణ్ పనైపోయిందన్నారు.. కానీ పోరాటం ఆపలేదు: బన్నీ వాసు)తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'క' మూవీ టీమ్ను అభినందించారు. వారితో దాదాపు గంటకుపైగా మాట్లాడారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చిరంజీవితో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ నాకెంతో ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుందని కిరణ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Appreciation from the BOSS 😇Thank you so much @KChiruTweets gaaru for the 1 hour long memorable conversation ❤️Always feels blessed whenever i meet you sir 😇#KA #DiwaliKAblockbuster pic.twitter.com/9TdAp5hqwT— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 10, 2024 -
షాపులో నగలన్నీ చిరంజీవి హీరోయిన్ ఒంటిపైనే! (ఫొటోలు)
-
విశ్వంభర గ్రాఫిక్స్ పై చిరు కు బిగ్ టెన్షన్..!
-
మెగాస్టార్ సరసన కథనాయకి.. ఈ స్టార్ హీరోయిన్ తల్లిని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
Chiranjeevi:ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది
-
ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్
పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ఘనతను సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ఆయనను వరించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. ఈ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏఎన్ఆర్పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో నాకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో భావోద్వేగానికి గురైన చిరు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.చిరంజీవి మాట్లాడుతూ..' ఎవరైనా ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను. ఇంట గెలిచే అవకాశం సినీ వత్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా భావించా. కానీ నాకు లెజెండరీ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు. ఆ సమయంలో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా. పద్మవిభూషణ్ సహా ఎన్ని అవార్డులొచ్చినా ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది' అని అన్నారు.ఏఎన్నార్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. 'ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ఏఎన్నార్ అవార్డ్ అందుకున్నప్పుడు ఇంట గెలిచాననిపిస్తోంది. ఇప్పుడు ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను. ఈ అవార్డ్ గురించి నాగార్జున, వెంకట్ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డా. నాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్తో సహా ఎన్ని అవార్డులు వచ్చినా ఈ రోజు నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా అనిపించింది. అన్ని పురస్కారాలకు మించిన ఘనత ఇదేనని నాగార్జునతో చెప్పా. ఇదే మాట స్టేజీ మీద కూడా చెబుతున్నా.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
అక్కినేనికి డై హార్డ్ ఫ్యాన్ ఆమెనే: మెగాస్టార్ చిరంజీవి
తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నాపు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.మెగాస్టార్ మాట్లాడుతూ..'మా అమ్మ అంజనాదేవిని ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణముంది. ఏఎన్ఆర్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్స్లో అమ్మ కూడా ఒకరు. మొగల్తూరులో నిండు గర్భంతో ఉన్నప్పటికీ ఆ సమయంలో ఏఎన్ఆర్ సినిమా చూసేందుకు వెళ్లారు. అప్పట్లో సినిమా చూసేందుకు నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్లి చూడాలి. ఆ సినిమా పేరు 'రోజులు మారాయి'.. అప్పట్లో సూపర్ హిట్ సినిమా. దీంతో జట్కా బండిలో సినిమాకు బయలుదేరారు. కానీ అప్పుడే ఓ బస్సు వీరి బండికి ఎదురొచ్చింది. ఆ బస్సుకు దారి ఇచ్చే సమయంలో వీరి ప్రయాణిస్తున్న జట్కా బండి పక్కన ఉన్న పొలాల్లో పడిపోయింది. అందరూ కిందపడ్డారు. నాన్న ఇంటికి వెళ్దామని చెప్పినా వినకుండా సినిమా చూడాల్సిందేనని అమ్మ పట్టుబట్టి మరి వెళ్లింది. ఎలాగైనా సరే ఆ మూవీ చూసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది' అని అన్నారు. నాకు డ్యాన్స్లో అక్కినేని నాగేశ్వరరావు ఆదర్శమని చిరంజీవి కొనియాడారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి వల్లే మనందరం ఇక్కడ ఉన్నామని తెలిపారు. అక్కినేని కుటుంబంతో నాకున్న అనుబంధం చాలా గొప్పదని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ రావడమనేది నా పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. అమితాబ్ చేతుల మీదుగా తీసుకోవడం మరింత ఆనందం కలిగించిందని మెగాస్టార్ అన్నారు. -
మెగాస్టార్కు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం.. అందజేసిన అమితాబ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ అగ్రతారలు, దర్శక నిర్మాతలు, నటీనటులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా పాల్గొన్నారు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు అల్లు అరవింద్, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, నాని, బ్రహ్మనందంతో పాటు పలువురు సినీతారలు హాజరయ్యారు. -
‘నాగబంధం’ సినిమాకు క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
దేవి శ్రీ ప్రసాద్ కి చిరంజీవి గారంటే ఎంత ఇష్టమో చూడండి..
-
నాగబంధం సినిమా గ్రాండ్ ఓపెనింగ్లో మెగాస్టార్ చిరంజీవి విజువల్స్
-
డైరెక్టర్ వి.వి.వినాయక్ బర్త్డే.. విషెస్ చెప్పిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి
-
రాజకీయాల కోసం ఇంతలా దిగజారకూడదు: కొండా సురేఖ కామెంట్స్పై మెగాస్టార్
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. మహిళా మంత్రిగా ఉండి ఆమె చేసిన కామెంట్స్ చూసి చాలా బాధపడ్డానని అన్నారు. వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీ సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తామని చిరంజీవి స్పష్టం చేశారు.చిరు తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డా. సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ సభ్యులు టార్గెట్గా మారడం సిగ్గుచేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని మహిళలను ఇందులోకి లాగడం సరైంది కాదు. తమ రాజకీయ మనుగడ కోసం అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు చేయడం మంచిది కాదు. రాజకీయాల కోసం ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానం: ఖుష్బూ సుందర్)సమాజాన్ని మంచిగా మార్చడానికి మేము నాయకులను ఎన్నుకుంటామని మెగాస్టార్ ట్వీట్లో ప్రస్తావించారు. మీ ప్రసంగాల ద్వారా దానిని కలుషితం చేయకూడదని హితవు పలికారు. రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు ఉదాహరణగా ఉండాలని సూచించారు. ఇలాంటి హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని నమ్ముతున్నానని చిరంజీవి పోస్ట్ చేశారు. I am extremely pained to see the disgraceful remarks made by an honourable woman minister. It is a shame that celebs and members of film fraternity become soft targets as they provide instant reach and attention. We as Film Industry stand united in opposing such vicious verbal…— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2024 -
శంకర్బాబుని పిలవండి... డ్యాన్స్ చేస్తాడనేవారు
156 చిత్రాలు... 537 పాటలు... 24 వేల డ్యాన్స్ మూమెంట్స్... ఆ 24వేల డ్యాన్స్ మూమెంట్స్ హీరో చిరంజీవి పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చేరేలా చేశాయి. యాక్టర్, డ్యాన్సర్ విభాగంలో ‘మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు చిరంజీవిని ఈ రికార్డ్కి ఎంపిక చేశారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవికి ఈ రికార్డ్ని అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘నటనకు అవార్డులు వస్తాయని తెలుసు. కానీ ఇలా డ్యాన్సులకు రావడం అనేది ఊహించలేదు. నాకు నటన మీదకన్నా డ్యాన్స్ మీద ఆసక్తి ఎక్కువ. బహుశా అదే నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టి ఉంటుందని అనుకుంటున్నా. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కి, మనకు సంబంధం ఏంటి? అని అనుకుంటాం కదా. అందుకని ఈ రికార్డు గురించి నాకు ఊహే లేదు. డ్యాన్స్ అనేది నాకు అదనపు అర్హత అయితే నా కొరియోగ్రాఫర్లు, నా ఈ విజయంలో నా దర్శక–నిర్మాతలు, అభిమానుల పాత్ర మరువలేనిది. నటనకన్నా ముందే డ్యాన్స్కి ఓనమాలు చిన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికి వివిధభారతి, రేడియో సిలోన్లో వచ్చే పాటలకు డ్యాన్సులు చేసేవాడిని. రేడియోల్లో పాటలు రాగానే, ‘శంకర్బాబు (చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్) ని పిలవండి. డ్యాన్సులు వేస్తాడు’ అనేవారు. ఉత్సాహంగా స్టెప్పులు వేసేవాడిని. ఎన్సీసీలో చేరాక సాయంత్రాల్లో తిన్నాక అల్యూమినియమ్ ప్లేట్లను తిరగేసి వాయించి డ్యాన్సులు వేసేవాడిని కాలు జారి పడినా ఆపలేదు ఒకసారి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సావిత్రి, రోజా రమణి, కవిత, నరసింహరాజు... ఇలా అందరూ సాయంత్రం ఓ పంచలో కూర్చున్నారు. లైట్గా వర్షం పడుతోంది. నన్ను డ్యాన్స్ చేయమని అడిగారు. వర్షానికి కాలు జారి కిందపడినా ఆపలేదు. దాన్ని నాగిని డ్యాన్సులాగా మార్చేసి స్టెప్పులేశాను. అక్కడున్న కో–డైరక్టర్ చూసి దర్శకుడు క్రాంతికుమార్గారికి చె΄్పారు. ప్రాణం ఖరీదు’కి నన్ను తీసుకున్నప్పుడు ‘ఏలియల్లో ఏలియల్లో ఎందాక...’ అనే పాటను పెట్టారు. ఆ పాటకు స్టెప్ వేశాను. దానికన్నా ముందు ‘పునాది రాళ్లు’లోనూ డ్యాన్స్ వేస్తూ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాను. చిరంజీవి ఉంటే ఎక్కువ డబ్బు అన్నారు ఆ రోజుల్లో లింగమూర్తిగారు డిస్ట్రిబ్యూషన్కి చీఫ్. ఆయన ఏ నిర్మాత కథ వింటారు? ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారనే పరిస్థితి ఉండేది. ఒకసారి ఆయన ‘చిరంజీవి అని కొత్తగా వస్తున్నాడు. అతనితో సినిమాలు చేస్తే మీకు ఇంత డబ్బు ఇస్తాను. లేదంటే లిమిటెడ్గా ఇస్తాను’ అన్నారు. దాంతో అందరూ చిరంజీవినే పెట్టుకుందాం అనుకునేవారు. లింగమూర్తిగారికి ప్రజానాడి తెలుసు. ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసమే సినిమాలకు వస్తున్నారు. అలాంటప్పుడు ఇతనితో సినిమాలు చేస్తే నాలుగు డబ్బులు వస్తాయి కదా అని ఆయన మా నిర్మాతలతో అనడం.. వాళ్లు కూడా నాకు అవకాశాలు ఇవ్వడం అన్నది నాకు ప్లస్ అయింది’’ అన్నారు. ఆ డ్యాన్సుల్లో మనసు కనబడుతుందిఆమిర్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు ఫోన్ చేసి, ఈవెంట్కి రావాలని అడిగినప్పుడు ‘అడగకూడదు... మీరు ఆర్డర్ వెయ్యాలి’ అన్నాను. చిరంజీవిగారి డ్యాన్సులు ఎందుకు బాగుంటాయంటే ఆ డ్యాన్సుల్లో ఆయన మనసు కనబడుతుంది. తనని తాను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తారు కాబట్టి చూడ్డానికి మనకు రెండు కళ్లూ సరిపోవు’’ అన్నారు. 537 పాటలు చూడటం నాకో మంచి అనుభూతి రిచర్డ్ స్టెన్నింగ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి 46 ఏళ్ల కెరీర్లో రిలీజైన కమర్షియల్ సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం. 156 సినిమాలనేది అద్భుతమైన అచీవ్మెంట్. ఆ సినిమాల్లో ఆయన డ్యాన్స్ చేసిన పాటలను తీసుకున్నాం. 537 పాటల్లో ఆయన వేసిన 24 వేల డ్యాన్స్ మూవ్స్ చూశాం. ఆ పాటలు చూడటం వ్యక్తిగతంగా నాకు మంచి అనుభూతినిచ్చింది. ఆయనకు గిన్నిస్ రికార్డ్ అందించాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్కు చిరంజీవి ఓ పెన్నుని బహుమతిగా అందజేశారు. ఇంకా దర్శక–నిర్మాతలు కోదండ రామిరెడ్డి, కె. రాఘవేంద్ర రావు, బి. గోపాల్, గుణశేఖర్, బాబీ, వశిష్ఠ, అశ్వనీదత్, కేఎస్ రామారావు, అల్లు అరవింద్, డి. సురేష్బాబు, శ్యామ్ప్రసాద్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, పి. కిరణ్, చిరంజీవి కుటుంబ సభ్యులు సుష్మిత, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజునే చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకోవడం ఓ విశేషం. కాగా సరిగ్గా చిరంజీవి పుట్టిన సంవత్సరం 1955లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కి శ్రీకారం జరిగింది. అయితే చిరంజీవి పుట్టిన తేదీ 22 కాగా... ఈ రికార్డ్కి శ్రీకారం చుట్టింది 19వ తేదీన.25 రోజులుగా చికున్ గున్యాతో చిరంజీవి బాధపడుతున్నారని, అయినప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని యాంకర్ పేర్కొన్నారు. ఆయన కోలుకుంటున్నారని కూడా తెలిపారు. -
సీఎంకు చెక్కులు అందజేసిన మెగాస్టార్ చిరంజీవి
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరద ధాటికి నష్టపోయిన బాధితులకు సినీతారలు అండగా నిలిచారు. తమవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చిరంజీవి రూ. 50 లక్షలు చెక్ అందించారు. అంతేకాకుండా తన కుమారుడు రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు.కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
ఆయన మరణం తీవ్రంగా కలిచివేసింది: మెగాస్టార్ ట్వీట్
సిపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కన్నుమూశారనే వార్త తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. విద్యార్థి కార్యకర్త స్థాయి నుంచి సామాన్య ప్రజల గొంతుగా ఆయన చేసిన కృషి మరువలేనిదని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. సీతారాం ప్రజా సేవ, దేశం పట్ల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని మెగాస్టార్ పోస్ట్ చేశారు. కాగా.. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరిన సీతారాం ఏచూరి మరణించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు)కాగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. . సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష కనిపించనుంది. చాలా ఏళ్ల తర్వాత ఈ జంట వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. Deeply distressed by the news of the passing of Shri Sitaram Yechury, a veteran leader with over five decades of political journey and a tall leader of the CPM. Since starting as a student activist, Shri Yechuri had always strived to be the voice of the downtrodden and common…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 13, 2024 -
అప్యాయంగా పలకరించుకున్న మెగాస్టార్- బాలయ్య.. వీడియో వైరల్!
ఓకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ప్రముఖ టాలీవుడ్ రచయిత కుమారుడి వివాహ రిసెప్షన్లో కనిపించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ఈనెల 22న ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్లో ఈనెల 24న నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య సందడి చేశారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఓకే ఫంక్షన్లో కలిశారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చిరు ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు బాలకృష్ణ ఎన్బీకే 109 చిత్రంతో బిజీగా ఉన్నారు. Chiru 🤝Balayya @KChiruTweets | #NandamuriBalakrishna pic.twitter.com/0Kz6jLN4cr— Whynot Cinemas (@whynotcinemass) August 24, 2024 -
ఇంద్ర మూవీ రీ రిలీజ్.. చిత్రబృందానికి మెగాస్టార్ స్పెషల్ ట్రీట్!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈనెల 22న ఆయన బర్త్ డేను తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ పుట్టినరోజు మరింత స్పెషల్గా మారింది. ఎందుకంటే దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆయన నటించిన బ్లాక్బస్టర్ మూవీ ఇంద్ర సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ హంగామా చేశారు.ఈ సందర్భంగా మెగాస్టార్ ఇంద్ర మూవీ టీంను ఘనంగా సత్కరించారు. ఇంద్ర క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేసుకుంటూ నిర్మాత అశ్వనీదత్, డైరెక్టర్ బి గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు మణిశర్మ, కథ అందించిన చిన్ని క్రిష్ణను ఆయన సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోను చిరంజీవి తన ట్విటర్లో పోస్ట్ చేశారు.అదిరిపోయే కలెక్షన్స్దాదాపు 22 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ మూవీ ఇంద్ర. మొదటి రోజు అదిరిపోయే రీతిలో కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.3.05 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఇంద్ర' క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ 22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయిన సందర్భంగా, 'ఇంద్ర' టీంకి 'చిరు' సత్కారం! అలాగే ప్రొడ్యూసర్ @AshwiniduttCh గారు, డైరెక్టర్ B.Gopal, మరపురాని డైలాగ్స్ ని అందించిన #ParuchuriBrothers , కధనందించిన చిన్ని క్రిష్ణ,… pic.twitter.com/UfGpOd2gkE— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024 -
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్.. బన్నీ ట్వీట్కు స్పందించిన మెగాస్టార్!
ప్రస్తుతం టాలీవుడ్ అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్యన వార్ నడుస్తోంది. ఇటీవల మారుతీనగర్ సుబ్రమణ్యం ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో మళ్లీ ఫ్యాన్స్ రచ్చ నడుస్తోంది. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను ఉద్దేశించే బన్నీ అలా మాట్లాడారంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం మెగా ఫ్యాన్స్పై మండిపడుతున్నారు. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్గా మారిపోయింది.అయితే ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డేను పురస్కరించుకుని అల్లు అర్జున్ విషెస్ తెలిపారు. మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు. తాజాగా బన్నీ చేసిన పోస్ట్కు మెగాస్టార్ చిరంజీవి సైతం రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ డియర్ బన్నీ అంటూ చిరు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇక్కడితోనైనా ఫ్యాన్స్ మధ్య నెట్టింట వార్కు ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి. అసలు బన్నీ ఏమన్నారంటే...హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల వల్లే తాను హీరో అయ్యానని ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ బన్నీ మాట్లాడారు. అది ఫ్రెండైనా, బంధువైనా, నా అభిమానులైనా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అది కాస్తా బన్నీ, మెగా ఫ్యాన్స్కు మధ్య వార్కు దారితీసింది. గతంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైకాపా అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లగా.. మెగా ఫ్యాన్స్ విమర్శలు చేశారు. అందుకు కౌంటర్గానే ఇప్పుడు బన్నీ మాట్లాడారంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసారం ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు బన్నీ పుష్ప-2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. Thank you dear Bunny.— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024 -
మెగాస్టార్ బర్డే.. ఘనంగా సెలెబ్రేట్ చేసిన ఫ్యాన్స్..
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు (ఫొటోలు)
-
క్లాస్ అయినా మాస్ అయినా.. వన్ అండ్ ఓన్లీ బాస్.. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ (ఫొటోలు)
-
తిరుమల చేరుకున్న మెగాస్టార్ ఫ్యామిలీ.. వీడియో వైరల్!
మెగాస్టార్ చిరంజీవి మరో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈనెల 22న మెగాస్టార్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి నెలకొంది. ఆయన బర్త్ డే సందర్భంగా మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు సైతం చేపట్టనున్నారు. అంతేకాకుండా బ్లాక్బస్టర్ మూవీ దాదాపు 22 ఏళ్ల తర్వాత రీ రిలీజవుతోంది. ఇప్పటికే టికెట్స్ కూడా అమ్ముడైపోయాయి.చిరంజీవి తన జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బయలుదేరి వెళ్లారు. తన కుటుంబసభ్యులతో కలిసి ఎయిర్పోర్ట్లో వెళ్తున్న వీడియో వైరల్గా మారింది. మెగాస్టార్తో పాటు భార్య సురేఖ, అమ్మ అంజనాదేవి కూడా ఉన్నారు. అక్కడే చిరంజీవి తన ఫ్యాన్స్కు అభివాదం చేస్తూ కనిపించారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.రేపు చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్న కుటుంబ సభ్యులు💐😍🤗#MEGASTAR #MegastarChiranjeevi #Chiranjeevi #HappyBirthdayMegastar #Tirumala @KChiruTweets @JspBVMNaresh pic.twitter.com/x7xUQXYfAp— uppalapati Ram varma (@uppaalapatiRam) August 21, 2024 -
మెగాస్టార్తో డ్యాన్స్ చేసేందుకు భయపడ్డా: ఇంద్ర హీరోయిన్
తనదైన నటనతో అభిమానుల గుండెల్లో ప్రత్యేకస్థానం దక్కించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈనెల 22న ఆయన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నటించిన బ్లాక్బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ చేయనున్నారు. 2002లో విడుదలైన ఈ చిత్రంలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ మూవీని మరోసారి థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ సోనాలి బింద్రే.. ఇంద్ర రీ రిలీజ్ కావడంపై స్పందించింది. చిరంజీవి పక్కన నటించడం తనకు దక్కిన అతిపెద్ద గౌరవమని అన్నారు. ఆయనతో కలిసి స్టెప్పులు వేయడం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఇంద్ర షూటింగ్ సమయంలో చిరుతో డ్యాన్స్ వేసేందుకు భయపడేదాన్ని అని పేర్కొన్నారు. హైదరాబాద్లో షూటింగ్ జరిగిన సమయంలో చాలా ఎంజాయ్ చేశానని.. చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారని వెల్లడించారు. మరోసారి ఇంద్ర మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని.. బిగ్స్క్రీన్పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోనాలి బింద్రే తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ తన ట్విటర్లో షేర్ చేశారు. Relive the magic of #INDRA with @iamsonalibendre as she takes us down memory lane and shares her excitement for the August 22nd re-release. 🎬https://t.co/RBGJ5iBcYq#Indra4K Megastar @KChiruTweets @AshwiniDuttCh #BGopal #AarthiAgarwal @tejasajja123 #ManiSharma @GkParuchuri… pic.twitter.com/KFFkCHHlze— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 21, 2024 -
'ఆ డైలాగ్ వింటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తోంది'.. మెగాస్టార్ స్పెషల్ వీడియో!
మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్పై సి అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం బిగ్ కమర్షియల్ హిట్గా నిలిచింది. అయితే దాదాపు 22 ఏళ్ల తర్వాత మరోసారి ఈ హిట్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పెషల్ వీడియోను విడుదల చేశారు. మెగాస్టార్ మాట్లాడుతూ..'ఇంద్ర.. ఇంద్రసేనారెడ్డి ఆ డైలాగ్ వినగానే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం కథ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరూ మనసుపెట్టి పనిచేశారు. అందుకే ఇప్పటికీ ఇంద్ర గురించి మాట్లాడుకుంటున్నాం. నా సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న చిత్రం ఇంద్ర. ఒక్కమాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రాలకు నిర్వచనం ఇంద్ర. 22 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది' అంటూ మాట్లాడిన స్పెషల్ వీడియోను వైజయంతి మూవీస్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర 4కే వెర్షన్ లో మరోసారి వస్తోంది. ఆగస్ట్ 22న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ కాగా.. టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, ముకేశ్ రిషి కూడా తమదైన నటనతో మెప్పించారు.Indra Sena Reddy is back 💥💥💥Our dearest Megastar @KChiruTweets garu reflects on the journey of #INDRA and shares his excitement for the worldwide grand re-release on August 22nd. 🤗https://t.co/wdY0I7hZiE#Indra4K @AshwiniDuttCh #BGopal @iamsonalibendre #AarthiAgarwal… pic.twitter.com/gZWrBcBvV8— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 20, 2024 -
చిరంజీవి మహోనతమైన వ్యక్తి...
-
ఒలింపిక్ క్రీడాకారులకు మెగాస్టార్ అభినందనలు.. వినేశ్ పోగాట్పై ప్రశంసలు!
ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు. అలాగే ఇండియా తరఫున పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న 117 మంది క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మెడల్స్ సాధించిన వారిపై ప్రశంసలు కురిపించారు. మనూభాకర్, సరబ్జీత్ సింగ్, నీరజ్ చోప్రా, స్వప్నిల్ కుశాలే, అమన్ షెరావత్, ఇండియా హాకీం టీమ్ను అభినందించారు. వినేశ్ ఫొగాట్ నీవు నిజమైన పోరాట యోధురాలివంటూ కొనియాడారు. ఈ సందర్భంగా వారి ఫోటోలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ చూసేందుకు చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. My Heartfelt Congratulations to Our Shooting stars @realManuBhaker 🥉 @SarabjotSingh30 & Manu Bhaker 🥉 #SwapnilKusale 🥉 Our Team #IndianHockey & Legend @16Sreejesh 🥉 Our Javelin champ @Neeraj_Chopra1 🥈 Star wrestler @AmanSehrawat57🥉 To each and every player… pic.twitter.com/VK2hMttDNN— Chiranjeevi Konidela (@KChiruTweets) August 10, 2024 -
కేరళకు మెగాస్టార్.. సీఎంకు కోటి రూపాయల చెక్!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కేరళలోని వయనాడ్ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం రిలీప్ ఫండ్కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి.. తాజాగా చెక్ను అందజేశారు. త్రివేండ్రం వెళ్లిన మెగాస్టార్ కేరళ సీఎం పినరయి విజయన్ను కలిసి చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా వయనాడ్ ఘటనపై చిరంజీవి ఆరా తీశారు. బాధితులకు అందిస్తోన్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా.. కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మరణించారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో సోషయో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష కనిపించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. #TFNReels: Megastar @KChiruTweets lands in Trivendra, Kerala to handover ₹1 cr cheque to Kerala CM. ❤#Chiranjeevi #RamCharan #WayanadLanslide #TeluguFilmNagar pic.twitter.com/tP0S4TBEOQ— Telugu FilmNagar (@telugufilmnagar) August 8, 2024 -
ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే: చిరంజీవి
టాలీవుడ్ ఇండస్ట్రీలో అవార్డులను పునరుద్ధరిస్తూ గద్దర్ అవార్డ్స్ పేరిట తీసుకురావడం శుభపరిణామమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిన విషయమన్నారు. సమాజంలో మార్పు కోసం జీవితమంతా ప్రయత్నించిన నిరంతర శ్రామిక కళాకారుడైన గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమన్నారు. ఈ మేరకు గతంలో పద్మ అవార్డుల కార్యక్రమంలో తాను మాట్లాడిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. మెగాస్టార్ ట్వీట్లో రాస్తూ..'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని.. సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ.. సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు.. ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్' ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామం. తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్' తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024 -
మెగాస్టార్తో సెల్ఫీ కోసం యత్నం.. ఇలా చేశారేంటి?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార్ ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్కు కాస్తా గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ పారిస్ ఒలింపిక్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి పారిస్ చేరుకున్న చిరంజీవి అక్కడి వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.అయితే తాజాగా మెగాస్టార్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న చిరంజీవితో అక్కడే ఉన్న కొందరు సిబ్బంది సెల్పీలు దిగేందుకు యత్నించారు. అందులో ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. Padma Vibhushan Chiranjeevi at Airport pic.twitter.com/sTvtP2qW3R— Milagro Movies (@MilagroMovies) July 30, 2024 -
పారిస్లో స్టార్స్
సాక్షి, హైదరాబాద్: పారిస్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన 2024 ఒలింపిక్ పోటీలకు దేశం నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పోటీలను తిలకిచడానికి నగరం నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా పారిస్ వెళ్లారు. కుటుంబ సభ్యులు సురేఖ, రామ్చరణ్, ఉపాసనతో పాటు మనుమరాలు క్లీంకారతో తీసుకున్న ఫొటోలను సోషల్ యాప్లో పోస్ట్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్యాషన్ ఐకాన్ సుధారెడ్డి కూడా పారిస్ ఒలింపిక్స్లో మెరిశారు. అయితే 117 మందితో కూడిన భారత ఒలింపిక్ క్రీడాకారుల బృందంలో నగరం నుంచి నలుగురు మహిళా అథ్లెట్లు పాల్గొంటున్నారు. అంతేకాకుండా భారత జాతీయ ఫ్లాగ్ బేరర్గా తెలుగమ్మాయి పీవీ సింధూ నాయకత్వం వహించడం విశేషం. జాతీయ జెండా రంగులతో రూపొందించిన చీరతో పీవీ సింధూ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. -
ఇంద్ర మళ్లీ వస్తున్నాడు
చిరంజీవి కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన చిత్రం ‘ఇంద్ర’ (2002). ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. బి. గోపాల్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఇంద్ర సేనారెడ్డి అలియాస్ శంకర్ నారాయణ పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమా రీ–రిలీజ్కు సిద్ధం అవుతోంది. వైజయంతీ మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్ని సెలబ్రేట్ చేస్తూ, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘ఇంద్ర’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తోంది. -
ఒలింపిక్ ఆరంభ వేడుకలకు మెగా ఫ్యామిలీ.. చిరంజీవి పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష కనిపించనుంది. ఈ సినిమాను సోషియో ఫ్యాంటసీ అడ్వెంచెరస్గా తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కాగా.. విశ్వంభర సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.అయితే ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు బయలుదేరి వెళ్లారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి లండన్లో విహరిస్తున్నారు. ఓ పార్క్లో తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ఒలింపిక్స్ ఆరంభ ఈవెంట్ కోసం పారిస్కు వెళ్తున్నట్లు తెలిపారు. రేపటిలోగా అక్కడికి చేరుకుంటామని వెల్లడించారు. తాజాగా లండన్లోని హైడ్ పార్క్లో కుటుంబంతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈనెల 26 నుంచి పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. Relishing a serene moment with family and the grand little one Klin Kaara at Hyde Park London, en route our journey to Paris tomorrow! Summer Olympics 24 Inaugural Event Beckons :) pic.twitter.com/bFa31zBh3a— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2024 -
మెగాస్టార్ బర్త్ డే.. రీ రిలీజవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ!
టాలీవుడ్లో కొంతకాలంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయినా చాలా చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. ఇటీవల హీరోల బర్త్ డే రోజున బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ సైతం రీ రిలీజ్కు సిద్ధమైంది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన ఇంద్ర మూవీని మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ను పంచుకుంది.కాగా..2002లో రిలీజై బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే మెగాస్టార్ సరసన హీరోయిన్లుగా నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ నిర్మించారు. కాగా.. ఆగస్టు 22న వైజయంతి మూవీస్ స్థాపించి 50 ఏళ్ల పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే 50 స్వర్ణోత్సవాల వేడుకతో పాటు చిరంజీవి బర్త్ డే కావడంతో ఇంద్ర సినిమాను మరోసారి టాలీవుడ్ ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.22 glorious years of MEGA BLOCKBUSTER #Indra, a film that etched its mark on cinema and our hearts forever ❤️In celebration of 50 GOLDEN YEARS OF VYJAYANTHI MOVIES, let’s relive the magic with a 𝐆𝐫𝐚𝐧𝐝 𝐑𝐞-𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐨𝐧 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟐, in honour of Megastar… pic.twitter.com/jF3eSXrUX7— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2024 -
మాటలు ఆరంభం
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.అందుకు తగ్గట్టు ఓ వైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మరోవైపు పోస్ట్ప్రోడక్షన్ పనులు మొదలుపెట్టింది చిత్రబృందం. గురువారం మాటల (డబ్బింగ్) పనులను ప్రారంభించారు. ‘‘క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ‘విశ్వంభర’ రూపొందుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ భక్తుడిగా కనిపిస్తారు చిరంజీవి. యాక్షన్ సీక్వెన్స్లు అద్భుతంగా ఉంటాయి. పోస్ట్ ప్రోడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ పడుతుంది. అందుకేప్రోడక్షన్, పోస్ట్ప్రోడక్షన్ పనులను ఏకకాలంలో చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్లో చిరంజీవి చేరారు. గోల్డెన్ వీసా అంటే..విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన విదేశీ పౌరులకు యూఏఈ ప్రభుత్వం జారీ చేసేదే గోల్డెన్ వీసా. దీన్ని గరిష్టంగా పదేళ్ల కాలపరిమితికి అందిస్తారు. గోల్డెన్ వీసా వల్ల యూఏఈలో దీర్ఘకాల నివాసానికి వీలవుతుంది. వందశాతం ఓనర్షిప్తో సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం సాధ్యమవుతుంది. -
మళ్లీ షురూ
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ‘విశ్వంభర’ సెట్స్కు వెళ్లారు చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్ని హైదరాబాద్లో చిత్రీకరించారు. ఈ భారీ షెడ్యూల్ తర్వాత చిరంజీవి ఈ సినిమా చిత్రీకరణ నుంచి చిన్న విరామం తీసుకున్నారు.కాగా మళ్లీ హైదరాబాద్లోనే ఈ సినిమా తాజా షెడ్యూల్ షురూ అయింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. -
సరిగ్గా 22 ఏళ్ల క్రితం.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తోంది. అయితే ఇవాళ మేడే సందర్భంగా మెగాస్టార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.సరిగ్గా 22 ఏళ్ల క్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసిన వీడియోను పోస్ట్ చేశారు. పసి పిల్లలను పనివాళ్లుగా చేయొద్దని ఆ వీడియోను రూపొందించారు. ఇవాళ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో మెగాస్టార్ వీడియోను పంచుకున్నారు. ఈ రోజుకీ సంబంధించిన వీడియో కావడంతో షేర్ చేస్తున్నాను అంటూ మెగాస్టార్ ట్విటర్లో రాసుకొచ్చారు. సే నో టూ చైల్డ్ లేబర్.. హ్యాపీ మే డే టూ ఆల్ అంటూ పోస్ట్ చేశారు. 22 సంవత్సరాల క్రితం ... పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దని International Labour Organisation, ILO కోసం చేసిన "చిన్ని చేతులు" campaign. ఈ రోజుకీ relevant అనిపించి share చేస్తున్నాను. Say NO to Child Labour.Happy May Day to all !International #LaborDay #MayDay pic.twitter.com/q5EqvxeoY6— Chiranjeevi Konidela (@KChiruTweets) May 1, 2024 -
రష్యా ప్రతినిధులతో మెగాస్టార్ భేటి.. ఎందుకంటే?
ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో నుంచి వచ్చిన రష్యా బృందం నేరుగా హైదరాబాద్లోని చిరంజీవికి ఇంటికి వెళ్లి కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సహకారంపై వారితో చర్చించారు. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్తో సహా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్ను ప్రమోట్ చేయడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారతీయ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ, రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ప్రతినిధి బృందం చిరంజీవితో మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మెగాస్టార్ను కలిసిన వారిలో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందంలోని సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చెర్కెజ్ జాడే, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ మాస్కో, యూనివర్సల్ యూనివర్శిటీ డైరెక్టర్ మరియా సిట్కోవ్స్కాయా ఉన్నారు. కాగా.. భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర. బింబిసార డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న విడుదల కానుంది. A high level delegation of the Ministry Of Culture - Moscow has met #Chiranjeevi garu at his residence today Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/NPLmjrUo1q — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 18, 2024 -
టాలీవుడ్ నటుడిని సన్మానించిన మెగాస్టార్.. ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా సమాజం కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరిట సేవా కార్యక్రామాలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. గత 26 ఏళ్లుగా పేద ప్రజలకు ఉచితంగా రక్తనిధులు సమకూరుస్తున్నారు. అయితే చిరంజీవి అభిమానులు ప్రతి ఏటా రక్తదానం క్యాంపులు కూడా నిర్వహిస్తుంటారు. అలా బ్లడ్ బ్యాంక్ ప్రారంభం నుంచి రక్తదానం చేసే వారిలో నటుడు మహర్షి రాఘవ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన వందసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను మెగాస్టార్ అభినందించారు. ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఆయన సేవలను మెగాస్టార్ కొనియాడారు. రక్తదానం విషయంలో ప్రతి ఒక్కరూ రాఘవను ఆదర్శంగా తీసుకోవాలని చిరు ఆకాక్షించారు. ఇలాంటి దాతల వల్లే ఎంతోమందికి రక్తం అందిస్తున్నామని తెలిపారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. భోళాశంకర్ తర్వాత చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. MEGASTAR #Chiranjeevi garu felicitates Maharshi Raghava's milestone 100th Blood Donation at @CCTBloodBank Chiranjeevi Blood Bank Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/q6yNNGDZSz — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 18, 2024 -
వారికి మెగాస్టార్ చిరు సలహా.. ట్వీట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి నేపథ్యంలో చిరు సలహా ఇచ్చారు. నీటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బెంగళూరులోని తన ఫామ్హౌస్లో అవలంభించిన పద్ధతులను వివరించారు. తన ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఫోటోలను పంచుకున్నారు. అంతే కాకుండా తన ట్వీట్లో కన్నడ భాషలో రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇది చదవండి: చిరంజీవి రెండుసార్లు అడిగినా నో చెప్పిన హీరో.. ఎవరంటే?) కాగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్తో రూపొందిస్తున్నారు. 2006లో వచ్చిన స్టాలిన్ తర్వాత త్రిష మరోసారి చిరంజీవితో జతకట్టనుంది. యూవీ క్రియేషన్స్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ಈ ಪೋಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಉದ್ದವಾಗಿದ್ದರೂ, ಪಾಯಿಂಟ್ ಚಿಕ್ಕದಾದರೂ... ಬಹಳ ಮುಖ್ಯ. ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತೆ, ನೀರು ಅತ್ಯಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಸ್ತು, ನೀರಿನ ಕೊರತೆಯು ದೈನಂದಿನ ಜೀವನವನ್ನು ಕಷ್ಟಕರವಾಗಿಸುತ್ತದೆ. ಇಂದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನೀರಿನ ಕೊರತೆ ಎದುರಾಗಬಹುದು. ನಾಳೆ ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ ಸಂಭವಿಸಬಹುದು.ಆದ್ದರಿಂದ ನೀರನ್ನು ಸಂರಕ್ಷಿಸಲು ಸಹಾಯ… pic.twitter.com/HwoWhSiZW5 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2024 -
Chiranjeevi Srikanth Latest Photos: శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మరీ కేక్ కట్ చేయించిన మెగాస్టార్ (ఫోటోలు)
-
అత్తమ్మపై మెగా కోడలు ప్రశంసలు.. ఎందుకంటే?
మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సంబంధం లేనప్పటికీ ఎంటర్ప్రెన్యూరర్గా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆస్పత్రి ద్వారా మహిళల గతేడాది ఈ జంటకు కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వూలోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే రెండో బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ అంతర్జాతీయ మహిళ దినోత్సవం కావడంతో ప్రత్యేకంగా విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. అదేంటో చూసేద్దాం. తాజాగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన కొణిదెల ట్వీట్ చేసింది. అత్తమ్మ, చిరంజీవి భార్య సురేఖపై ప్రశంసలు కురిపించింది. ఈ మహిళ దినోత్సవం రోజున 60 ఏళ్లలో మా అత్తమ్మ ఎంటర్ప్రెన్యూరర్గా రాణిస్తోంది. మనదేశంలో చాలామంది అత్తమ్మలు, అమ్మలు బిజినెస్లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమకు ఇష్టమైన వృత్తిలో సాధించిన విజయాలను ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఉపాసన పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా..ఇటీవల ఉపాసన నాలెడ్జి సిటీలోని టి–హబ్లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి.. ఆమే నాకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రస్తుత కాలంలో ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. This Women’s Day my mother-in-law is making her debut as an entrepreneur in her 60’s 🙌 Imagine how rich our country would be if more athammas & amma’s became entrepreneurs!! Let’s celebrate more women joining the workforce & following their passion https://t.co/WhQ2JmjsaG pic.twitter.com/05tz4UPBfE — Upasana Konidela (@upasanakonidela) March 8, 2024 -
విశ్వంభర సినిమాలో చిరంజీవి ఎప్పుడూ చేయని రోల్.
-
ఇదే కదా నిజమైన ఆనందం: మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకి జోడీగా లియో భామ త్రిష కనిపించనుంది. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు సిల్వర్ స్క్రీన్పై కనిపించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఇటీవలే మెగాస్టార్కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యున్నత పురస్కారం చిరంజీవిని వరించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్కు అభినందనలు తెలిపారు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్కు ఘనమైన స్వాగతం లభించింది. అక్కడి తెలుగువారు చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించారు. లాస్ఎంజిల్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన చిరుపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. చిరంజీవి మాట్లాడుతూ..'పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చినప్పుడు ఆనందం, సంతోషం కలిగింది. అవార్డ్ వచ్చినందుకు నాకంటే మీరు బాగా ఆనందపడుతున్నారు. నా పట్ల మీరు చూపిస్తున్న అభిమానం వెల కట్టలేనిది. ఇంతమంది ఆనందంగా ఉన్నారంటే.. ఇదే కదా అసలు సిసలైన ఆనందం. ఇంతకంటే అవార్డ్ ఇంకా ఏముంటుంది' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
త్వరలోనే మళ్లీ కలుస్తా.. మెగాస్టార్ పోస్ట్ వైరల్!
భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా కోసమే మెగాస్టార్ తీవ్రమైన కసరత్తులు చేశారు. జిమ్లో కష్టపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. చిరంజీవి దీంట్లో భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. 2025 సంక్రాంతికి విశ్వంభర విడుదల కానుంది. అయితే ఇవాళ వాలెంటైన్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. అంతే కాకుండా తన భార్య సురేఖతో కలిసి హాలిడే ట్రిప్కు యూఎస్ఏ వెళ్తున్నట్లు వెల్లడించారు. మళ్లీ త్వరలోనే విశ్వంభర షూట్లో కలుస్తానంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ చిరు దంపతులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Off to USA for a short holiday with my better half Surekha. Will resume shoot of #Vishwambhara as soon as I get back! See you all soon! And of course Happy Valentines Day to All 💝 !! pic.twitter.com/zAAZVHjjFG — Chiranjeevi Konidela (@KChiruTweets) February 14, 2024 -
'మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు'.. మెగాస్టార్ ట్వీట్!
ఇటీవల ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుల్లో శక్తి బ్యాండ్ సత్తాచాటింది. ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు 2024లో ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్రామ్ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. మెగాస్టార్ ప్రశంసలు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వారికి అభినందనలు తెలిపారు. గ్రామీ అవార్డులతో మువ్వన్నెల భారతజెండా మరింత ఎత్తుకు ఎగురుతుందని అన్నారు. 'గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ గెలుచుకున్న అద్భుతమైన శక్తి టీమ్కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా శంకర్ మహదేవన్తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నా కోసం అద్భుతమైన పాటలు పాడారు. మీరు మా అందరికీ గర్వకారణం, మీ అద్భుతమైన విజయాలు కోట్లాది మంది భారతీయులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని మెగాస్టార్ ఆకాక్షించారు. The Indian flag 🇮🇳 flies high at the #GRAMMYs Joining the party a bit late, but Hearty Congrats to the amazing Team #Shakti for winning the ‘Global Music Album of the year’! Kudos to Ustad @ZakirHtabla , @Shankar_Live #SelvaGanesh , #GaneshRajagopalan for seizing ‘This… — Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2024 -
విశ్వంభర కోసం మెగాస్టార్ కసరత్తులు..
-
ఆ పాత్రలకు టాలీవుడ్ స్టార్ హీరోలు.. ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్!
హనుమాన్ మూవీతో బ్లాక్బాస్టర్ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదే జోరులో మరో చిత్రానికి రెడీ అవుతున్నారు ప్రశాంత్ వర్మ. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ జై హనుమాన్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హనుమంతుడు, రాముడి పాత్రలకు ఎవరు చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రశాంత్ వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పాత్రలకు స్టార్ హీరోలు నటించే అవకాశముందని తెలిపారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..'జై హనుమాన్ మూవీ స్కేల్ చాలా పెద్దది. ఈ చిత్రంలో పెద్ద స్టార్స్ నటించే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాల విషయంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఆ పాత్ర మనం బయట చూసే హనుమాన్లా ఉండదు. ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. హనుమాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటులు రెడీగా ఉన్నారు. అయితే చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండొచ్చు. మెగాస్టార్కు పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత నేను కలవలేదు. అన్నీ కుదిరితే చిరంజీవి ఆ పాత్ర చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ముందు ఏం జరగబోతోందో ఇప్పుడే చెప్పలేం. రాముడిగా నా మనసులో ఉన్న నటుడైతే మహేశ్బాబు. ఎందుకంటే సోషల్మీడియాలో రాముడిగా క్రియేట్ చేసిన మహేశ్ బాబు ఫొటోలను చూశా. మా ఆఫీస్లో కూడా ఆయన ముఖంతో రీక్రియేట్ చేసి చూశాం' అని అన్నారు. అంతే కాకుండా జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. -
మెగాస్టార్ను మర్యాదపూర్వకంగా కలిసిన నటుడు అలీ..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మ విభూషణ్ పొందిన చిరుకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని తర్వాత ఈ అవార్డ్ అందుకున్న నటుడిగి మెగాస్టార్ ఘనత సాధించారు. అంతే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్స్ బాబీ, గోపించద్ మలినేని, నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవిశంకర్ కూడా మెగాస్టార్ను అభినందించారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ అప్డేట్స్ రానున్నాయి. Blockbuster directors @dirbobby, @megopichand, Producers #NaveenYerneni, @mythriravi & comedian #Ali met and conveyed their best regards to #PadmaVibhushanChiranjeevi garu for being bestowed with the prestigious #PadmaVibhushan award ✨@Kchirutweets @MythriOfficial… pic.twitter.com/0z8YD9DG5U — Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2024 -
కనిపించే దేవతకు జన్మదిన శుభాకాంక్షలు: మెగాస్టార్ ట్వీట్
ఇటీవలే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఆయనను వరించింది. ఈ అవార్డ్తో ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్న మెగాస్టార్ కీర్తి మరింత పెరిగింది. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత దక్కించుకున్న నటుడిగా నిలిచారు. అయితే తాజాగా మెగాస్టార్ మాతృమూర్తి అంజనాదేవి జన్మదినాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం అంజనాదేవికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్ను రివీల్ చేశారు. మెగాస్టార్ నటిస్తోన్న ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.💐💐 pic.twitter.com/MFOttIdoPj — Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2024 -
మీరే నాకు ఎప్పటికీ ఆదర్శం: మెగాస్టార్ కూతురు ప్రశంసలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించింది. 75వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత అందుకున్న నటుడిగా మెగాస్టార్ నిలిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చిరంజీవికి అభినందనలు తెలిపారు. మెగా కోడలు ఉపాసన సైతం మామయ్యకు కంగ్రాంట్స్ చెబుతూ ట్వీట్ చేసింది. తాజాగా మెగాస్టార్ పెద్దకూతురు సుస్మిత శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. నాన్న మీరు ఒక స్ఫూర్తి, గౌరవం, ఆశీర్వాదం కూడా. పద్మవిభూషణ్ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు. అలాదే ఈ ఏడాదిలో పద్మ అవార్డులు దక్కించుకున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేసింది. Dad, you are an Inspiration, an honour and a blessing. #PadmaVibhushan Heartiest congratulations to all the Padma awards this year. @KChiruTweets pic.twitter.com/jT17b8hdZd — Sushmita Konidela (@sushkonidela) January 28, 2024 -
మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు
-
నేను ఊహించని అవార్డ్ రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్లోని తన బ్లడ్ బ్యాంక్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను ఊహించని.. నేను ఎదురు చూడని పద్మవిభూషణ్ అవార్డ్ రావడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, వరుణ్ తేజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నా సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా పద్మశ్రీ, పద్మభూషణ్ పొందిన తెలుగు రాష్ట్రాలవారికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'వెంకయ్యనాయుడు గారి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతిష్టాత్మకమైన 'పద్మవిభూషణ్' రావడం ఆనందంగా ఉంది. మీ సుదీర్ఘమైన ప్రజాసేవ, మీ జ్ఞానం, రాజకీయాల్లో గౌరవప్రదమైన మీ ప్రసంగం..మీ స్థాయిని పెంచుతుంది. మీతో పాటు అవార్డ్ దక్కడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ప్రతిభావంతులైన వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రమణ్యం, అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నా సోదర వర్గానికి, తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రియమైన మిథున్ దా (చక్రవర్తి), ఉషా ఉతుప్ జీ, దాసరి కొండప్ప, ఉమా మహేశ్వరి , గడ్డం సమ్మయ్య , కూరెళ్ల విట్టలాచార్య,ఎ వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్, విజయకాంత్ (మరణానంతరం)గారితో పాటు ప్రతి ఒక్కరికీ అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. Heartiest congratulations to Shri @MVenkaiahNaidu garu on the coveted ‘Padma Vibhushan’! Your long, relentless public service, your wisdom and dignified presence in politics enhances the stature and quality of political discourse. It is an even greater honour for me to be in… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2024 -
పద్మ విభూషణ్.. ఆ దిగ్గజ నటుడి తర్వాత మెగాస్టార్కే!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్ఠాత్మక అవార్డులైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించింది. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. అయితే తెలుగు సినీరంగంలో ఈ అవార్డ్ ఇప్పటివరకు ఒక్కరికే మాత్రమే వచ్చింది. ఆయనెవరో కాదు నట దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు. తాజాగా ఇప్పుడు మన మెగాస్టార్ను వరించింది. దీంతో అయితే దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డు కేవలం ఇద్దరికీ మాత్రమే దక్కింది. అక్కినేనికి పద్మ విభూషణ్ మొదట 2011లో నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఈ లెజెండరీ నటుడు 67 ఏళ్ల సినీ కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు సినీ చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్న మహోన్నత వ్యక్తి అక్కినేని. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, కలిమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డులు (7 సార్లు), జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాసు లాంటి ఎన్నో విలువైన అవార్డులను అందుకున్నారు. అవార్డుల రారాజు మెగాస్టార్ తాజాగా ఆ ఘనత కేవలం మెగాస్టార్కు మాత్రమే దక్కింది. తెలుగు సినీ రంగంలో ఏఎన్ఆర్ తర్వాత అరుదైన ఘనత దక్కించుకున్న నటుడిగా చిరంజీవి నిలిచారు. అంతకుముందే మెగాస్టార్కు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. -
చిరు భాయ్కి హృదయపూర్వక అభినందనలు: మెగాస్టార్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ మెగాస్టార్ను దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించి సత్కరించింది. ఈ ఘనత దక్కడం పట్ల మెగాస్టార్ ఎమోషనలయ్యారు. ఈ ఘనత దక్కడానికి కారణం మీరేనంటూ అభిమానులను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్కు అత్యున్నత గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్ వేదికగా సినీ ప్రముఖులు మెగాస్టార్ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు. పద్మవిభూషణ్కు ఎంపికైనందుకు ప్రియమైన చిరు భాయ్కి హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, నటుడు సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్, రాధిక శరత్కుమార్ ట్విటర్ ద్వారా మెగాస్టార్కు కంగ్రాట్స్ తెలియజేశారు. Congratulations to #Megastar @KChiruTweets on being honoured with the #PadmaVibhushan , a great honour bringing great pride to #TeluguCinema and to his people who love him. Hard work never fails🙏 pic.twitter.com/2l4SEPFIII — Radikaa Sarathkumar (@realradikaa) January 25, 2024 Hearty congratulations, Dear Chiru Bhai, for being conferred with the Padma Vibhushan.@KChiruTweets — Mammootty (@mammukka) January 25, 2024 Congratulations sir ❤️❤️ You are always an Inspiration 😊#PadmaVibhushanChiranjeevi #Megastar https://t.co/41qCnAkw2K — Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 25, 2024 Many congratulations to you, Sir @KChiruTweets Gaaru, on the honor bestowed upon you. You rightly deserve it. Your contribution to cinema, the world of art, your philanthropic lifestyle, your good work for the public and the blessings of your elders brings you this. As a friend,… https://t.co/DXKj4RgZw7 — KhushbuSundar (@khushsundar) January 26, 2024 Good morning Padma Vibhushan Chiranjeevi gaaru :) ♥️@KChiruTweets 🙏🏼 — Hi Nani (@NameisNani) January 26, 2024 Telugu vadi Garva Karanam Mega 🌟 Padma Vibhushan@KChiruTweets garu #MegastarChiranjeevi Garu — Teja Sajja (@tejasajja123) January 25, 2024 Congratulations Annaya @KChiruTweets on being recipient to the second highest civilian award #PadmaVibhushan Much Deserving Honour for your inspiring legacy & contribution. Thank you for holding cinema high at every instance. ❤️ pic.twitter.com/SvqDpnCBfI — Satya Dev (@ActorSatyaDev) January 25, 2024 My favorite picture I have of us sir @KChiruTweets ❤️ Thank you for always being kind and warm to me. Thank you for the amazing films. Thank you for the brilliant performances. Thank you for being our MEGASTAR. You are now a #PadmaVibhushan Sir. A proud moment for us, for TFI… pic.twitter.com/Wa7Q9x6V4P — Adivi Sesh (@AdiviSesh) January 26, 2024 Congratulations to our BOSS @KChiruTweets Garu on being felicitated with the honorary award #PadmaVibhushan ❤️ Thank you for making us all proud yet again and again. pic.twitter.com/pW5LEbVtuo — Vassishta (@DirVassishta) January 25, 2024 -
ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు: మెగాస్టార్ ఎమోషనల్
టాలీవుడ్ మెగాస్టార్కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటిచండంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మెగాస్టార్ మాట్లాడుతూ..'కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండ దండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా.' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. 'నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతల కు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరం అయినప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. మీరు నా పై చూపిస్తున్నకొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తుంది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు' అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు మెగాస్టార్కు అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. -
Chiranjeevi: మెగాస్టార్కు పద్మ విభూషణ్.. ఉపాసన ట్వీట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు కరోనా, లాక్డౌన్లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్తో సత్కరించింది. (ఇది చదవండి: మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి) తాజాగా మెగాస్టార్కు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది. చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. కంగ్రాట్స్ మామయ్య అంటూ పద్మ విభూషణ్కు అవార్డులు పొందిన వారి లిస్ట్ను పోస్ట్ చేసింది.ఇది చూసిన అభిమానులు సైతం మెగాస్టార్కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరు ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అది నిజమేనంటూ పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి 2006లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. Congratulations dearest Mamaya ❤️❤️❤️❤️ @KChiruTweets pic.twitter.com/4AtL1e7mJf — Upasana Konidela (@upasanakonidela) January 25, 2024 -
మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్కు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. -
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంలో చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి విజువల్స్
-
మెగా స్టార్ చిరంజీవి రామ్ ఎంట్రీ అయోధ్యలో..!
-
అయోధ్య చేరుకున్న మెగాస్టార్ దంపతులు
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరు కానున్నారు. 500 ఏళ్లనాటి భారతీయుల కల సాకారమవుతున్న వేళ.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. మధ్యాహ్నం.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మెగాస్టార్ కుటుంబం పాల్గొననుంది. మెగాస్టార్, రామ్ చరణ్ అయోధ్యకు పయనమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ఇప్పటికే అయోధ్య ఆహ్వానం రావడాన్ని తన పూర్వ జన్మ సుకృతమని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నా ఆరాధ్య దైవం హనుమంతుడు నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లుగా భావిస్తున్నానని చిరంజీవి తన్మయత్వానికి లోనయ్యారు. MegaStars ✨ #RamCharan and #Chiranjeevi garu are being Welcomed in Ayodhya 🚩#RamMandirPranPrathistha 🕉️🙏pic.twitter.com/WbUcOsvtaQ — Ujjwal Reddy (@HumanTsunaME) January 22, 2024 Creating history Evoking history Everlasting in History This is truly an overwhelming feeling.. I consider this invitation a godsend opportunity to witness the consecration of Ram Lalla at Ayodhya. That glorious chapter, when the excruciating wait of generations of Indians… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2024 -
ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ అవకాశం: మెగాస్టార్ ట్వీట్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపులు అయోధ్య వైపే ఉన్నాయి. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహా ఘట్టానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం అయోధ్యకు చేరుకున్నారు. జనవరి 22న జరగనున్న మహా ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సైతం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. అయోధ్యలో రామ్లల్లాకు పట్టాభిషేకానికి ఆహ్వనం రావడం దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'చరిత్ర సృష్టిస్తోంది. చరిత్రను ఉర్రూతలూగిస్తోంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది నిజంగా అద్భుతమైన అనుభూతి. అయోధ్యలో రామ్లల్లా పట్టాభిషేకం చూసే ఆహ్వానం రావడం నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. ఐదు వందల సంవత్సరాలకుపైగా తరతరాలుగా వేచి చూస్తోన్న భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న మహత్తర అధ్యాయం. ఆ దివ్యమైన 'చిరంజీవి' అయిన హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే.. స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కుమారుడు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు అనిపిస్తోంది.' అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. అంతే కాకుండా..' ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ యోగి జీ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. జై శ్రీరామ్ ' అని తెలిపారు. Creating history Evoking history Everlasting in History This is truly an overwhelming feeling.. I consider this invitation a godsend opportunity to witness the consecration of Ram Lalla at Ayodhya. That glorious chapter, when the excruciating wait of generations of Indians… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2024 -
యండమూరి చేతుల్లో మెగాస్టార్ జీవిత చరిత్ర
మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్రను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్కు అప్పగించారు చిరంజీవి. ఈ విషయాన్ని వైజాగ్లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఎఎన్ఆర్ శత జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చిరంజీవి ఈ ప్రకటన చేశారు. లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యండమూరితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులకు అవార్డులు అందించారు ఫౌండేషన్ ప్రతినిధి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ల గురించి ప్రశంసాపూర్వక ప్రసంగం చేసిన చిరంజీవి తన బయోగ్రఫీ గురించి మాట్లాడుతూ.. తన బయోగ్రఫీ రాసేంత సమయం తనకు లేదని.. నా బయోగ్రఫీ రాసే సామర్ధ్యం ఒక్క యండమూరికి మాత్రమే ఉందని.. అందుకే ఆ బాద్యతను యండమూరికి అప్పగిస్తున్నాను అని అన్నారు. సమకాలీన రచయితల్లో యండమూరికి సాటి మరెవరూ లేరు. తెలుగులో ఉన్న ఏకైక స్టార్ రచయిత ఎవరన్నా ఉన్నారా అంటే అది యండమూరి మాత్రమే. అలాంటి గొప్ప రచయిత ఈ రోజు నా బయోగ్రఫీ రాస్తాను అనడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆయన రాసిన అభిలాష చిత్రంతోనే సినీ పరిశ్రమలో నా స్థానం పధిలమని అప్పుడే నిర్ణయించుకున్నాను అంటూ యండమూరిపై ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి. -
విశాఖలో లోక్నాయక్ పురస్కారాల ప్రదానోత్సవం
-
సంక్రాంతి వేళ.. సినిమా పోస్టర్ల కళకళ!
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడే వేరు. కొత్త ఏడాదిలో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే పండగ ఇదొక్కటే. అంతలా ప్రాముఖ్యత ఉన్న ఈ ఫెస్టివల్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లకు సంక్రాంతి పండుగ ఓవరం లాంటిదనే చెప్పాలి. అగ్ర హీరోలంతా ఈ పండుగకు సినిమాలు రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతారు. అలానే ఈ ఏడాది కూడా తెలుగులో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటి మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నాసామిరంగ చిత్రాలు ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే మరికొందరు హీరోలు ఈ ఫెస్టివల్కే అప్డేట్స్ సిద్ధమయ్యారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా సినిమా హీరోలంతా క్రేజీ అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. మెగాస్టార్, ప్రభాస్, సూర్య, విజయ్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలు తమ మూవీ పోస్టర్స్తో అలరించారు. అంతే కాకుండా అలా ఈ ఏడాది పొంగల్కు మన ముందుకు వచ్చిన కొత్త సినిమాల పోస్టర్స్పై ఓ లుక్కేద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం టైటిల్ను సంక్రాంతి రోజే మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఇప్పటికే ప్రభాస్- మారుతి డైరెక్షన్లో మూవీ టైటిల్ను వెల్లడించారు మేకర్స్. ది రాజాసాబ్ అంటూ యంగ్ రెబల్ స్టార్ వచ్చేస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తూ వీడియోను విడుదల చేశారు. వీటితో పాటు శర్వానంద.. శతమానంభవతి పార్ట్-2 రానుందని పోస్టర్ విడుదలైంది. మరోవైపు కోలీవుడ్ స్టార్స్ విజయ్, సూర్య సినిమాలకు సంబంధింటిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మీరు కూడా మీ అభిమాను హీరోల చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ చూసేయండి. அனைவருக்கும் இனிய பொங்கல் நல்வாழ்த்துகள் 😇☀️🌾#VETTAIYAN 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #FahadhFaasil @RanaDaggubati @ManjuWarrier4 @ritika_offl @officialdushara @srkathiir @philoedit @KKadhirr_artdir… pic.twitter.com/bbuCtkAgLG — Lyca Productions (@LycaProductions) January 15, 2024 The Art behind the aesthetic! 🎨✨ Delve into the making of the vibrant & colourful VETTAIYAN 🕶️ poster! ✨ Art by 🖌️ @sthabathy Designed by 🖼️ @gopiprasannaa Photographed by 📸 @anand16na#VETTAIYAN 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions… pic.twitter.com/wQiW2hiaZ1 — Lyca Productions (@LycaProductions) January 15, 2024 pic.twitter.com/Tl8mrlT8fT — Vijay (@actorvijay) January 15, 2024 Echoes of freedom in every note. 🇮🇳 #OperationValentine All set to launch our first song at the iconic Wagah border, Amritsar 💥#VandeMataram song launch on Jan 17th 🎶#HappySankranti ✨ pic.twitter.com/5CkfhnZykN — Varun Tej Konidela (@IAmVarunTej) January 15, 2024 For he was touched by fire, chosen as a beacon of hope🔥 Unveiling the #Kanguva2ndLook tomorrow at 11 AM⚔️#Kanguva🦅⚔️ #HappyPongal🌾 #HappyMakarSankranti🌞@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions #Vamsi… pic.twitter.com/pzW6yWR5pw — UV Creations (@UV_Creations) January 15, 2024 7 years ago, #ShathamanamBhavathi Celebrated Sankranthi with its timeless magic ❤️ Now, get ready for another chapter unfolding with even more enchantment in 2025! 😍 More Details loading soon 😉 వచ్చే సంక్రాంతికి కలుద్దాం ❤️🔥 pic.twitter.com/yJT5xump4Q — Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2024 Igniting the MASS MODE 🥁🕺 Presenting the delightful #TheRajaSaab Title Announcement 🤩 - https://t.co/IhcaisVZsy 𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐨𝐨𝐧 🌋#PrabhasPongalFeast #Prabhas A @DirectorMaruthi film Produced by… — People Media Factory (@peoplemediafcy) January 15, 2024 The celestial bodies are making way for the MEGA MASS BEYOND UNIVERSE 🔥 #Mega156 title today at 5 PM 💫🌠 MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @AforAnilkumar @UV_Creations pic.twitter.com/bsyqxtE6Hk — UV Creations (@UV_Creations) January 15, 2024 -
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసిన చిరంజీవి
-
టాలీవుడ్ సీనియర్ నటి ఇంట్లో శుభకార్యం.. హాజరైన మెగాస్టార్!
టాలీవుడ్ సీనియర్ నటి ప్రభ ఇంట్లో జరిగిన శుభకార్యంలో స్టార్ హీరోలు సందడి చేశారు. ఆమె కుమారుడు రాజా రమేశ్ వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. విజయవాడకు చెందిన సాయి అపర్ణను రాజా రమేశ్ పెళ్లాడారు. హైదరాబాద్లోని గండిపేట గోల్కోండ రిసార్ట్స్లో వివాహా వేడుక ఘనంగా జరిగింది. ప్రభ – రమేష్ (దివంగత) దంపతుల ఏకైక కుమారుడు రాజా రమేశ్ అమెరికాలో స్థిరపడ్డారు. ఈ వేడుకలో చిరంజీవి, వెంకటేశ్తో పాటు మురళీ మోహన్, సుమన్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సురేష్ , ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,, మోహనకృష్ణ, రేలంగి నరసింహారావు, రోజా రమణి, అన్నపూర్ణమ్మ లాంటి ప్రముఖులు కూజా హాజరయ్యారు. సీనియర్ నటి ప్రభ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏపీలోని తెనాలికి చెందిన ప్రభ 1974లో ‘నీడ లేని ఆడది’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగు భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించారు. సంప్రదాయ నృత్య కళాకారిణి అయిన ప్రభ సినిమాలతో పాటు సీరియల్స్ తో కూడా నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ అర్టిస్ట్గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. -
Navishka Birthday Celebrations Pics: మెగాస్టార్ మనవరాలు నవిష్క బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మెగా లిటిల్ ప్రిన్సెస్కు ఐదేళ్లు.. శ్రీజ పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెలుగువారికి సుపరిచితమే. 2016లో శ్రీజ.. నటుడు కళ్యాణ్ దేవ్ను వివాహాం చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కూతురు కూడా జన్మించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. వీరి ముద్దుల కూతురు నవిష్క వారంలో కొద్ది రోజులు మాత్రమే కల్యాణ్ దేవ్ వద్ద ఉంటోంది. (ఇది చదవండి: గుడ్న్యూస్ చెప్పిన బిగ్బాస్ బ్యూటీ..) తాజాగా నవిష్క బర్త్ డే సందర్భంగా శ్రీజ తన ఇన్స్టాలో కూతురి ఫోటోను షేర్ చేసింది. నా కూతురు అప్పుడే ఐదేళ్లు పూర్తి చేసుకుందని తెలిపింది. నవిష్క వైట్ డ్రెస్లో ఉన్న ఫోటోను పంచుకుంది. ఇది చూసిన మెగా అభిమానులు హ్యాపీ బర్త్ డే మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీజ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. క్రిస్మస్ సందర్భంగా సోమవారం నిర్వహించిన వేడుకల్లో శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డా: మెగాస్టార్ ట్వీట్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ సార్కు గాయమైందన్న విషయం తెలిసి చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. ఆయనకు శస్త్ర చికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇప్పటికే సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్ తెలిపారు. కేసీఆర్ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగా 156 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బింబిసార చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ చాలా గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్తో చిరంజీవి కోసం కథ సిద్ధం చేశారు. యూవీ క్రియేషన్స్ ద్వార విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Deeply pained to learn about the injury suffered by Sri KCR garu! Wishing him a successful surgery and a very speedy recovery. — Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2023 -
'నా జీవితంలో అద్భుతమైన క్షణం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్!
మెగా ఇంట ఇటీవలే పెళ్లి సందడి ముగిసింది. నాగబాబు తనయుడు , మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో జరిగిన వీరి పెళ్లికి మెగాస్టార్ దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహాం చాలా గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మాదాపూర్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాలో ఓ ఫోటోను పంచుకున్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిలో మెగాస్టార్ దంపతులు సందడి చేశారు. తాజాగా దీనికి సంబంధించి హల్దీ వేడుకలో దిగిన ఫోటోను చిరంజీవి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరు తన ఇన్స్టాలో రాస్తూ.. ఇటలీలో ఒక అందమైన సాయంత్రం. ఇది చాలా కాలం క్రితం జరిగింది కాదు. ప్రేమతో ఒకటైన రెండు హృదయాలు ఎన్నో మధురమైన క్షణాలు, జ్ఞాపకాలను తీసుకొచ్చాయి. అలాంటి ఒక అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
నటి త్రిషకు అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి
-
'ఆయన కోసమే అలా చేయించుకున్నా'.. మెగాస్టార్పై వైష్ణవ్ తేజ్ కామెంట్స్!
చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన మూవీతో అభిమానులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం ఆదికేశవతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రం పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల జంటగా నటిస్తోంది. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ మెగాస్టార్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిరు అని పేరు వచ్చేలా క్రాఫ్ చేయించుకున్న ఫోటోపై స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. 'మామయ్య పుట్టినరోజుకు అందరూ గిఫ్ట్స్ తెచ్చారు. సాయి ధరమ్ తేజ్ పెద్ద కత్తిని బహుమతిని తీసుకొచ్చాడు. నేను మాత్రం ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వగలనని అనుకున్నా. అందుకే చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. చిరు అని వచ్చేలా హెయిర్ కట్ చేయించుకున్నా. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా రామ్ చరణ్ అన్న అందరినీ ఆకట్టుకుంటాడు. సాయిధరమ్ తేజ్ బాగా అల్లరి చేస్తాడు. తన యాక్సిడెంట్ మా అందరికీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఆ విషయాన్ని మేము ఎప్పుడో మర్చిపోయాం.' అని అన్నారు. -
ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు: శ్రీకాంత్
మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. 2004లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా హీరో శ్రీకాంత్ మెప్పించారు. అయితే ఈ మూవీని మెగా ప్రొడక్షన్స్ ద్వారా నవంబర్ 4న భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈ రి రిలీజ్కు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ట్రైలర్ను నాగబాబు, హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. '2004ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మున్నాభాయ్ లగేరహో రీమేక్ వార్త వినిపించింది. హీరో పక్కన ఉండే కారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అన్నయ్యా?' అని చిరంజీవిని అడిగా. అలా నవ్వి ఇలా వదిలేశారు. కానీ చివరకు ఆ పాత్ర నాకే వచ్చింది. అన్నయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయనది ఎంతో కష్టపడే మనస్తత్వం. ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. నాగబాబు మాట్లాడుతూ.. 'ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతూ ఉంటుంది. టీవీ, యూట్యూబ్లో పాత సినిమాలను ఎవరూ చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు మళ్లీ మళ్లీ చూసే ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఇలాంటి చిత్రాలను ఒకప్పుడు థియేటర్లో మళ్లీ ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ, ఛానెళ్లలో వస్తున్నాయి. ఇలాంటి సినిమా మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి.' అని అన్నారు. -
అప్పట్లో కింగ్ లా బ్రతికాను కానీ..!
-
నాకు పునర్జన్మను ఇచ్చారు: మెగాస్టార్ చిరంజీవి
-
ఆ దృశ్యం నా హృదయాన్ని కదిలించింది..!
-
నా జీవితంలో ఎవరినైనా మోసం చేసానంటే..!
-
'హ్యాపీ బర్త్ డే గురూజీ'.. మెగాస్టార్ స్పెషల్ విషెస్!
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. అంతే కాకుండా సైరా నరసింహారెడ్డి చిత్రంలోని ఫోటోలను పంచుకున్నారు. 1942 అక్టోబర్ 11న జన్మించిన అమితాబ్ బచ్చన్ ఇవాళ 81వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ తారలు, బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముంబయిలోని ఆయన నివాసం వద్దకు వచ్చిన అభిమానుల కోసం బయటకు వచ్చి అభివాదం చేశారు బిగ్ బీ. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' గురూజీ.. మీకు 81వ జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంతోషం, మంచి ఆరోగ్యంతో నిండిన దీర్ఘాయువుతో ఆశీర్వదించబడాలి. మీ నటనా ప్రతిభా పాటవాలతో, అనేక సంవత్సరాల పాటు మీరు లక్షలాది మందిని ఆకట్టుకుని స్ఫూర్తినిస్తూనే ఉండండి. ఈ మీ పుట్టినరోజు కూడా నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మీ కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఈ రోజు రాత్రి వర్చువల్గా నా ఆరాధ్యదైవమైన మిమ్మల్ని కలిసేందుకు నేను ఎదురు చూస్తున్నాను.' అంటూ పోస్ట్ చేస్తున్నారు. కాగా.. అమితాబ్ ఈ ఏడాది ప్రభాస్ కల్కి 2298 ఏడీ మూవీతో పాటు గణపత్ చిత్రంలో నటిస్తున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్లో సినిమా చేయనున్నారు. A Very HAPPY 81st BIRTHDAY 🙏 Guru Ji @SrBachchan ! 💐💐 May you be blessed with a long life, filled with happiness & good health! May you keep enthralling & inspiring millions of us for many many years to come, with your acting genius!! 🙏🙏 This Birthday of yours is also… pic.twitter.com/bLQY3OjwkU — Chiranjeevi Konidela (@KChiruTweets) October 11, 2023 -
మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!
మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే ఒక్కటి కానున్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి సంబరాలు జరగనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్గా మారింది. (ఇది చదవండి: ఉంగరాలు మార్చుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి) వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ మెగాస్టార్ తన ట్విటర్ ద్వారా ఫోటోలు పంచుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెగాస్టార్ దంపతులు పాల్గొన్నారు. కాబోయే వధూవరులైన వరుణ్-లావణ్యతో ఫోటోలు దిగారు. ఫ్యామిలీ మొత్తం ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. జూన్ 9న ఎంగేజ్మెంట్ మెగా హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ మణికొండలోని నాగబాబు నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్ 9న జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా హాజరయ్యారు. చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన కూడా పాల్గొన్నారు. కాగా.. 2017లో విడుదలైన ‘మిస్టర్’ కోసం వరుణ్ - లావణ్య తొలిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏడాదిలోనే వీరి కాంబినేషన్లో అంతరిక్షం మూవీ వచ్చింది. ఈ క్రమంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చూస్తే ఈ నెలలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంలో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో వరుణ్తేజ్ సరసన అందాల భామ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) About Last evening .. Pre Wedding Celebrations of @IAmVarunTej & @Itslavanya #MomentsToCherish pic.twitter.com/TwUqaSUmXD — Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2023 View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
సినిమానే తన జీవితంగా మలచుకున్న నిత్యవిద్యార్థి: ఆయనపై మెగాస్టార్ ప్రశంలు
నంది అవార్డు గ్రహీత, స్క్రిప్ట్ రైటర్ సత్యానంద్పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. సత్యానంద్ తన సినీ ప్రస్థానం ప్రారంభించి 50 పూర్తయిన సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన సేవలను కొనియాడుతూ ఫోటోలు పంచుకున్నారు. మెగాస్టార్ తన ట్విటర్లో రాస్తూ..' ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్గా ఉంటూ.. ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటార్ గా, ఒక గైడింగ్ ఫోర్స్గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్గా ఉంటూ, సినిమాని ప్రేమిస్తూ, సినిమానే ఆస్వాదిస్తూ, సినిమాని తన జీవన విధానంగా మలచుకున్న నిత్య సినీ విద్యార్ధి , తరతరాల సినీ ప్రముఖులందరికీ ప్రియ మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్ గారు తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు.' అని రాసుకొచ్చారు. (ఇది చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?) అంతే కాకుండా..' ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం , నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది. డియరెస్ట్ సత్యానంద్ గారు.. మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్తగా, మరో అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను. మోర్ పవర్ టూ యూ' అంటూ ప్రశంసలు కురిపించారు. ట్వీట్తో పవన్ కల్యాణ్, నాగబాబుతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన సత్యానంద్.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది అగ్ర నటులతో పనిచేశారు. చిరంజీవి, శివాజీ గణేశన్, నందమూరి తారక రామారావు, రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ సినిమాలకు సేవలందించారు. సత్యానంద్ దేవుడు చేసిన పెళ్లి(1974) సినిమాతో డైలాగ్ రైటర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత జ్యోతి (1976), అర్ధాంగి (1977), అమెరికా అల్లుడు(1985), క్షణ క్షణం(1991), అన్నయ్య(2000) లాంటి మరెన్నో చిత్రాలకు డైలాగ్స్ కూడా రాశారు. (ఇది చదవండి: సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్ చరిత్ర ఇదే) అంతే కాకుండా మోసగాడు(1980), గూండా (1984), యముడికి మొగుడు (1988), పెళ్లాం ఊరెళ్లితే (2003), సుభాష్ చంద్రబోస్ (2005) చిత్రాలకు సత్యానంద్ స్క్రిప్ట్లు రాశారు. సముద్రం(1999), ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి(2004), నచ్చావులే (2008), రారండోయ్ వేడుక చూద్దాం(2017) చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే… pic.twitter.com/Tc7aphFOD2 — Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2023 -
చరణ్ నా ముందే వారిని బెదిరించాడు.. నేను చూసి షాక్ అయ్యాను
-
మీకు తెలియని నిజాలు బయటపెట్టిన చిరంజీవి గారు
-
నన్ను తప్పుగా అనుకోవద్దు అని రామ్ చరణ్ ఏం చేశాడంటే..!
-
కొన్ని విషయాల్లో పిల్లల్ని బలవంతం చేయను: మెగాస్టార్
-
తమన్నా భాటియా నటన గురించి మెగాస్టార్ చిరంజీవి
-
భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్
టాలీవుడ్ దిగ్గజం, వెండితెరపై చెరదని ముద్ర వేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తన సినీ జీవితంలో దాదాపు 250కు పైగా చిత్రాలతో ఏడు దశాబ్దాల కాలం పాటు వెండితెరపై అలరించిన నటుడు బహుదూరపు బాటసారి ఆయన. 16 ఏళ్ల వయసులోనే పుల్లయ్య చిత్రం ధర్మపత్నిలో చిన్నవేషం వేసినా.. అక్కినేని సినీ యాత్ర మొదలైంది మాత్రం 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాతోనే. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన శతజయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!) మెగాస్టార్ ట్వీట్లో రాస్తూ.. 'శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి , నా సోదరుడు నాగార్జునకు, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు !!' శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా పేరొందిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఈ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. 🙏🙏 ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని… pic.twitter.com/yrAxhk7pgb — Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2023 -
మెగా ఇంట్లో సందడి.. ఈ సారి ప్రత్యేకత ఏంటో తెలుసా?
మెగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది వినాయకచవితి మెగా ఫ్యామిలీకి మరింత స్పెషల్. ఎందుకంటే తొలిసారిగా మెగా వారసురాలితో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జూన్లో మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన దంపతులకు బేబీ పుట్టింది. అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మినిచ్చింది. మెగా వారసురాలు అడుగుపెట్టిన సందర్భంగా ఫ్యాన్స్తో పాటు కుటుంబసభ్యులు సైతం ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. (ఇది చదవండి: వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!) తన మనవరాలి పేరును మెగాస్టార్ దంపతులు రివీల్ చేశారు. కొణిదెల క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా క్లీంకారతో కలిసి ఈ ఏడాది వినాయకచవితిని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన తమ ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇవీ చూసిన మెగా ఫ్యాన్స్ సైతం తాము అభిమానించే ఫ్యామిలీకి వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏 ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊 Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd — Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023 (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) రామ్ చరణ్ ఇన్స్టాలో రాస్తూ.. 'అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ప్రభాస్ కల్కి.. మెగాస్టార్ బర్త్ డేకు సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. ఇప్పటికే టైటిల్ రివీల్ చేసిన చిత్రబృందం.. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో గ్లింప్స్ రిలీజ్ చేశారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. (ఇది చదవండి: 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త.. దానికి భయపడి!) మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. కల్కి చిత్రం ఎడిటింగ్ రూమ్లోని వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రభాస్ లుక్ను రివీల్ చేశారు మేకర్స్. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రభాస్ ఫైర్ గన్తో కనిపించి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అటు చిరు లీక్స్ నుంచి తాము ప్రేరణ పొందినట్లు చెప్పడంతో మెగా ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ఈ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేయగా..అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం ట్వీట్ చేస్తూ రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ చేశారు. How is fiery🔥 Prabhas look from Kalki 2898AD? ||#Kalki2898AD | #Prabhas || pic.twitter.com/vklelV8kxL — Manobala Vijayabalan (@ManobalaV) August 22, 2023 -
మెగాస్టార్ టాప్ టెన్ హిట్స్ మీకు తెలుసా?
శివశంకర వరప్రసాద్ అంటే కొందరు గుర్తు పట్టలేరమో తెలియదు కానీ.. మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండియాలో ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతలా సినీ ఇండస్ట్రీలో తన ముద్ర వేసుకున్నారు మెగాస్టార్. ఆగస్టు 22, 1955న ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూరులో జన్మించిన చిరంజీవి తన నట జీవితాన్ని 1970లో ప్రారంభించారు. దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించిన మెగాస్టార్ ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఠాగూర్ సూపర్ హిట్ చిత్రాలతో స్టార్డమ్ తెచ్చుకున్నారు. 1978లో పునాదిరాళ్లు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన మెగాస్టార్ ఆ తర్వాత విజేత, గూఢచారి -116 లాంటి వంటి చిత్రాలలో విభిన్న పాత్రలలో మెప్పించారు. 1980లలో చిరంజీవి ఖైదీ, జ్వాల, ఛాలెంజ్ వంటి చిత్రాలు ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, స్నేహం కోసం, ఠాగూర్ బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఆగస్టు 22, 2023న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్గా చిత్రాలేవో తెలుసుకుందాం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇరవైకి పైగా సినిమాలు చేశారు మెగాస్టార్. చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన పసివాడి ప్రాణం ఓ రేంజ్లో క్రేజ్ను తెచ్చి పెట్టింది . అలాగే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన స్వయంకృషి ఆయన ప్రతిభను ఓ రేంజ్కు తీసుకెళ్లింది. ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా ఈ సినిమాకు అందుకున్నారు. 1.పసివాడి ప్రాణం 2. స్వయంకృషి 3. జగదేకవీరుడు అతిలోకసుందరి 4.గ్యాంగ్ లీడర్ 5.ఖైదీ 6. ముఠామేస్త్రి 7.ఘరానా మొగుడు 8.చూడాలని ఉంది 9.ఠాగూర్ 10.ఇంద్ర ఇవే కాకుండా అప్పట్లో చిరు ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. ఛాలెంజ్, రుద్రవీణ, అడవి దొంగ , విజేత, చంటబ్బాయి, ఆరాధన, స్టేట్ రౌడీ, ఆపద్బాంధవుడు, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్, స్నేహం కోసం, సైరా నరసింహా రెడ్డి, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమా లు చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచాయి. అయితే ఇటీవల రిలీజైన మెగాస్టార్ 156వ చిత్రం భోళాశంకర్ మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. -
మెగాస్టార్ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్.. లిస్ట్ ఇదిగో!
మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ ఇండియాలో అంత క్రేజ్ మరెవరికీ లేదు. అంతలా కళామతల్లి ఒడిలో ఒదిగిపోయాడు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1978లో పునాదిరాళ్లు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఇటీవల రిలీజైన భోళాశంకర్ వరకు ఆయన ప్రయాణంతో ఇండస్ట్రీలో చెరగని ముద్రవేశారు. తన కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చిరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకే పెద్దదిక్కులా ఉన్నారు. ఆయన సినిమాల్లో బ్లాక్ బస్టర్స్తో పాటు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే సినీ కెరీర్లో 150కి పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఆగస్టు 22న 1955లో ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూరులో జన్మించారు. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. ఆంజనేయస్వామి భక్తుడైన మెగాస్టార్కు ఇండస్ట్రీలో చిరంజీవిగా ముద్రపడిపోయింది. ఆగస్టు 22, 2023న ఆయన బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. 1. చమక్ చమక్ చాం - కొండవీటి దొంగ - విజయంశాంతి 2. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గె రెడ్ చూశా- అల్లుడా మజాకా - రంభ 3. రగులుతోంది మొగలిపొద- ఖైదీ- మాధవి 4. భద్రాచలం కొండ సీతమ్మవారి దండ- గ్యాంగ్ లీడర్- విజయశాంతి 5. బంగారు కోడిపెట్ట వచ్చేనండి- ఘరానా మొగుడు- డిస్కో శాంతి 6. మంచమేసి.. దుప్పటేసి.. మల్లెపూలు చల్లానురా- కొండవీటి రాజా- విజయశాంతి 7. ఇందువదన కుందరదన - ఛాలెంజ్- విజయశాంతి 8. సందె పొద్దులకాడ - అభిలాష- రాధిక శరత్కుమార్ 9. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - రాక్షసుడు- సుహాసిని 10. సిన్ని సిన్ని కోరికలడగ - స్వయంకృషి- విజయశాంతి 11. నమ్మకు నమ్మకు ఈ రేయిని -రుద్రవీణ- శోభన 12. జై చిరంజీవ జగదేకవీరా.. - జగదేకవీరుడు అతిలోక సుందరి- శ్రీదేవి 13. చుక్కల్లారా చూపుల్లారా - ఆపద్బాంధవుడు- మీనాక్షి 14. దాయి దాయి దామ్మ- కులుకే కుందనాల బొమ్మ- ఇంద్ర- సోనాలి బింద్రే 15. ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్- మృగరాజు- సిమ్రాన్ 16. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. - ఠాగూర్- జ్యోతిక, శ్రియాశరణ్ 17. వానా వానా వెల్లువాయే.. కొండకొన తుల్లిపోయే- గ్యాంగ్ లీడర్- విజయశాంతి 18. ఆంటీ కుతురా.. అమ్మో అప్సరా.. ముస్తాబు అదిరింది- బావగారు బాగున్నారా?- రంభ 19. బంగారం తెచ్చి.. వెండి వెన్నెల్లో ముంచి- ఇద్దరు మిత్రులు -
ఆ సీటు కోసమే చిరంజీవి కామెంట్స్..!
-
విశాఖ మీకు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? : మంత్రి అమర్నాథ్
-
మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
ఈ ఏడాది మెగా ఇంట్లో పెద్ద పండగే జరిగింది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. జూన్ నెలలో రామ్ చరణ్ భార్య ఉపాసనకు బేబీ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ తన మనవరాలి పేరును ప్రకటించారు. గతనెలలో నామకరణం ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) అయితే మెగా వారసురాలికి వచ్చిన గిఫ్ట్లపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బిడ్డకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ పంపినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను మెగా ఫ్యామిలీ కొట్టిపారేసింది. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన మెగా వారసురాలికి మెగాస్టార్ ఏ గిఫ్ట్ ఇచ్చారనే విషయంపై ఎక్కడా కూడా చర్చ జరగలేదు. కానీ తన మనవరాలికి చిరంజీవి దంపతులు ఓ చిరు కానుక ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ దంపతులు తమ మనవరాలు క్లీంకారకు ఆంజనేయస్వామి రూపంతో ఉన్న బంగారు డాలర్స్ను అందమైన డిజైన్తో తయారు చేయించి ఇచ్చినట్లు ఉపాసన వెల్లడించింది. మెగా ఫ్యామిలీ హనుమాన్ భక్తులు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి ఆంజనేయస్వామిని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే తన మనవరాలికి ఇష్టదైవాన్నే ప్రతిరూపంగా బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే ఉపాసన తల్లిదండ్రులు బంగారు ఉయలను గిఫ్ట్గా ఇచ్చినట్లుగా తెలుస్తోంది..!! కాగా.. ప్రస్తుతం మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!) ప్రెగ్నెన్సీ జర్నీపై ఉపాసన మాట్లాడుతూ.. 'ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు' అని అన్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ భోళాశంకర్..!
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహానటి కీర్తిసురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా.. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ఈ చిత్రాన్ని తమిళంలో వేదాళంకు రీమేక్గా తెరకెక్కించారు. (ఇది చదవండి: 'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్) తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. భోళాశంకర్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆగస్టు 11 నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు భోళాశంకర్ సిద్ధమైంది అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్కు ప్రేక్షకుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. (ఇది చదవండి: 'భోళాశంకర్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..) Experience Mega 🌟 @KChiruTweets's MASSive Euphoria on the Big screens worldwide💥💥#BholaaShankar Certified with U/A 🔥& All set to entertain you all in Theatres from AUGUST 11th ❤️🔥 A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA… pic.twitter.com/TQC37G0GK0 — AK Entertainments (@AKentsOfficial) August 2, 2023 -
'మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ'.. అంటోన్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన తాజాగా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో సుశాంత్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘భోళా మేనియా ’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. (ఇది చదవండి: భోళా శంకర్: మెగాస్టార్, నందమూరి ఫ్యాన్స్ కోసం భలే స్కెచ్!) తాజాగా మరో లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. 'మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ' అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ రిలీజైంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది. అన్నా, చెల్లి అనుబంధాలతో ముడిపడి ఉన్న ఓ మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతమందించారు. (ఇది చదవండి: పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!) A delightful melody that weaves a beautiful tapestry of emotions this rainy season❤️#MilkyBeauty Lyrical song out now❤️🔥 - https://t.co/qXFH0C7ghG#BholaaShankar 🔱@SagarMahati thumping musical 🥁 A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial… pic.twitter.com/qw0fkamyVd — Chiranjeevi Konidela (@KChiruTweets) July 21, 2023 -
చిరంజీవి, విజయ్ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న
నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్లలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకరు. నటిగా శాండిల్ వుడ్లో పుట్టి టాలీవుడ్లో ఎదిగి, కోలీవుడ్లోనూ మెరిసి తాజాగా బాలీవుడ్లో వాలిన ఫీనిక్స్ బర్డ్ రష్మిక. అయితే తమిళం, హిందీ భాషల్లో నటించిన చిత్రాలు ఆశించిన విధంగా విజయాన్ని సాధించలేదనే కొరత ఉందన్నది ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతోంది. కాగా హిందీ చిత్రాలతో బిజీగా ఉండటం వల్లో, ఇతర కారణాల వల్లో గానీ ఇటీవల టాలీవుడ్లో అవకాశాలను జారవిడుచుకుంటోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' టైటిల్, గ్లింప్స్ విడుదల.. హాలీవుడ్ రేంజ్లో సీన్స్) కాగా ఈ భామ ఇటీవల ఒక భేటీలో తన సినీ జీవితం గురించి పేర్కొంటూ కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా నంబర్ వన్ కావచ్చని చెప్పింది. తాను ప్రారంభ దశలో మోడలింగ్ చేసి ఆ తర్వాత నటిగా పరిచయం అయినట్లు పేర్కొంది. సినిమా రంగంలో అదృష్టం చాలా ముఖ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు తమిళంలో విజయ్ సూపర్ హిట్ సినిమా మాస్టర్ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినా, చేజార్చుకున్నానని తెలిపింది. అంత పెద్దస్టార్స్ తో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని, అలాంటిది ఆ అవకాశాలను వదులుకోవడం బాధనిపించిందని పేర్కొంది. సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని పేర్కొంది. ప్రేమ పెళ్లి అనేది కొన్ని సమయాల్లో విడదీయలేని బంధం అవుతాయని పేర్కొంది. అయితే కొన్ని సార్లు అవి బలహీనంగా కూడా మారతాయని చెప్పింది. (ఇదీ చదవండి: గుంటూరు కారం కోసం మహేష్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!) -
మెగా ఇంట్లో బారసాల వేడుక.. వారికి గిఫ్ట్గా ఏమిచ్చారంటే?
మెగా వారసురాలు రాకతో చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. రామ్ చరణ్-ఉపాసనకు తొలిసారి బిడ్డ పుట్టడంతో ఫ్యాన్స్తో పాటు వారి కుటుంబసభ్యులు సంబురాలు చేసుకుంటున్నారు. జూన్ 20న ఉపాసన పాపకు జన్మనివ్వగా.. జూన్ 30న బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సన్నిహితులు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలి పేరును వెల్లడించారు. క్లీంకార కొణిదెల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: రామ్చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) ఖరీదైన గిఫ్ట్! అయితే ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఎలాంటి బహుమతులు ఇచ్చారనే విషయంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మెగా ఇంట్లో ఈ వేడుకను ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతే కాకుండా బారసాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి అత్యంత సుందరంగా అలకరించారు. ఈ వేడుకలో పాల్గొన్న వారికి మెగా ఫ్యామిలీ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫంక్షన్కు వచ్చిన ప్రతి ఒక్కరికి పట్టుచీర గాజులతో పాటు గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. చిరంజీవి తన మనవరాలి పేరును రివీల్ చేస్తూ అర్థాన్ని కూడా వివరించారు. రామ్ చరణ్- ఉపాసన కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) -
కేజీఎఫ్లో బానిసల్లా చూస్తాడు!
‘‘బాక్సాఫీస్ బాలు ఫ్యామిలీ మేము. డబ్బులు అతని దగ్గర తీసుకోండి’ అనే డైలాగ్తో మొదలవుతుంది ‘సామజ వరగమన’ సినిమా ట్రైలర్. శ్రీ విష్ణు హీరోగా ‘వివాహభోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను హీరో చిరంజీవి విడుదల చేసి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే.. కేజీఎఫ్లో బానిసల్లా చూస్తాడు’ (వీకే నరేశ్), ‘ఎప్పుడైనా ఏదైనా పనికొచ్చే పని చేశావా.. చెత్త నుంచి కూడా కరెంట్ తీస్తున్నారు’ (శ్రీ విష్ణు) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘అమ్మాయిల పట్ల విరక్తి పెంచుకునే ఓ మధ్యతరగతి కుర్రాడు బాలు. అయితే రిచ్ లైఫ్స్టైల్ కోరుకునే ఓ అమ్మాయి అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ’’ అనిచిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సహనిర్మాత: బాలాజీ గుత్తా. -
సులభమైన మార్గం.. మీకు కూడా మంచిదే: మెగాస్టార్
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రాణాలను కాపాడటానికి, మానవాళికి తోడ్పడటానికి సులభమైన, సమర్థవంతమైన, ఖర్చులేని మార్గం రక్తదానమని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉటామని సూచించారు. రక్తదానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. (ఇది చదవండి: షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!) రక్తదాతలైన సోదర, సోదరిమణులకు రక్త దానంలోపాల్గొనేలా అవగాహన కల్పించేవారికి మెగాస్టార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరికీ సంతోషాన్ని కోరుకుంటున్నానని ట్వీట్లో ప్రస్తావించారు. The simplest, effective, no cost way to save lives and contribute to humanity. And guess what .. this is one donation that makes us healthier too !! Donate Blood & Save Lives!! Wishing everyone a Happy #WorldBloodDonorsDay ! And More power to all my Blood Brothers / Blood… pic.twitter.com/8Fqb0dt5jK — Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2023 -
'అమెరికాలో పూనకాలు లోడింగ్'.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
డీఎస్పీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పేరు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే తన మ్యూజిక్తో ఆడియన్స్ను ఊర్రూతలూగించడం ఆయన టాలెంట్. టాలీవుడ్లో మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల సినిమాల దాకా తన మ్యూజిక్తో అభిమానులను అలరించాడు. అందుకే టాలీవుడ్లో అతన్ని ముద్దుగా డీఎస్పీ అని పిలుస్తారు. అయితే తాజాగా తన టాలెంట్ను అమెరికాలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు డీఎస్పీ. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి డీఎస్పీ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'అమెరికాలో పూనకాలు లోడింగ్' అంటూ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) అమెరికాలోని నాసా ఆధ్వర్యంలో నిర్వహించే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్కు సంబంధించిన మోషన్ పోస్టర్ను కూడా మెగాస్టార్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాసా అధ్వర్యంలో దేవి శ్రీ ప్రసాద్తో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. జులై 2న డల్లాస్, జులై 8న ఫిలడెల్ఫియా, జులై 15న సియాటెల్, జులై 22న సాన్ జొస్ , జులై 29న చికాగోలో ఈవెంట్స్ జరగనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్స్లో సింగర్ ఇంద్రవతి , సాగర్, గీతా మాధురి , హేమ చంద్ర , రీటా , పృథ్వి , మౌనిక అలరించనున్నారు. ప్రముఖ యాంకర్ నటి అనసూయ ఈ షోస్ను హోస్ట్ చేయనున్నారు. గతంలో నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లతో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నాసా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించారు. ఇటీవలే సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!) ℒℴ𝓋ℯ 𝓎ℴ𝓊 𝓂𝓎 𝒷ℴ𝓎 𝐑𝐎𝐂𝐊 𝐓𝐇𝐄 𝐒𝐇𝐎𝐖𝐖𝐖𝐖 Just do KUMMUDU..🎶🕺 Wishing ROCKSTAR @ThisIsDSP & his TEAM All The Very Best for DSP-USA TOUR 2023 *#DSPOoAntavaTourUSA*https://t.co/c6jea4ILUe@sagar_singer @itsvedhem @PrudhviChandrap @geethasinger… pic.twitter.com/8AvvNUZKQi — Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2023 -
ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు: మెగాస్టార్ ట్వీట్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన రక్తదాతలకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !) చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..'నా విజ్ఞప్తికి స్పందించి.. ఒడిశాలో బాలసోర్ ట్రైన్ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా రక్తదానం చేసిన సోదర సోదరి మణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!' అంటూ పోస్ట్ చేశారు. ట్వీట్తో పాటు పలు వార్త పత్రికల్లో వచ్చిన క్లిప్స్ షేర్ చేశారు. (ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్స్టోరీకి ఐదేళ్లు) Hearty Thanks to each and every Blood brother / sister who has responded to my appeal and donated blood specifically to help the #BalasoreTrainAccident victims in Odisha! My heartfelt gratitude to you all ! 🙏@Chiranjeevi_CT pic.twitter.com/nj6PJGJyHo — Chiranjeevi Konidela (@KChiruTweets) June 9, 2023 -
విషాదం.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ, దర్మక నిర్మాత కె.వాసు కన్నుమూశారు. టాలీవుడ్లో పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా.. ప్రాణంఖరీదు, కోతలరాయుడు, ఇంట్లో శ్రీమతి-వీధిలో కుమారి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. (ఇది చదవండి: సంతోషం దూరం.. అందుకే విడిపోయాం.. రెండో పెళ్లిపై నటుడి క్లారిటీ) రేపు ఉదయం 6 గంటలకు ఫిల్మ్ నగర్లో ఆయన ఇంటికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. ఇటీవలే సీనియర్ నటుడు శరత్ బాబు కూడా అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ను వెండితెర పరిచయం మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు కె.వాసునే వెండితెరకు పరిచయం చేశారు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుకు దర్శకత్వం వహించారు. చిరు మొదటి సినిమా పునాది రాళ్లు అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు సినిమా అనే చెప్పాలి. కె.వాసు తండ్రి ప్రత్యగాత్మ, ఆయన సోదరుడు హేమాంబరధరరావు ఇద్దరూ దర్శకులే. తెలుగులో చిత్ర పరిశ్రమలో ఎన్నో మంచి సినిమాలను రూపొందించారు. వారి బాటలోనే నడిచిన వాసు కూడా చక్కని చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన తీసిన భక్తి చిత్రం ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ తెలుగు ప్రేక్షకులకే కాదు, ప్రతి సాయిబాబా భక్తుడి మదిలోనూ నిలిచిపోయింది. (ఇది చదవండి: 'బిచ్చగాడు' హీరో.. రియల్ లైఫ్లో కూడా హీరోనే!) 22 ఏళ్లకే దర్శకత్వం కాాగా.. కె. వాసు 1951, జనవరి 15 న జన్మించారు. చిన్నతనం నుంచి దర్శకత్వంపై మక్కువ పెంచుకున్న వాసు.. తన తండ్రి వద్దే ఆదర్శకుటుంబం, మనసు మాంగల్యం, పల్లెటూరి బావ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తరువాత ఆడపిల్లల తండ్రి అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. 22 ఏళ్లకే దర్శకత్వం వహించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. -
మెగాస్టార్ 'భోళాశంకర్'.. ఫోటోలు లీక్ చేసిన చిరు!
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహానటి కీర్తిసురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా.. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. (ఇది చదవండి: కోల్కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?) షూటింగ్కు సంబంధించిన అప్డేట్స్ మెగాస్టార్ ఎప్పటికప్పుడు తన ట్విటర్లో పంచుకుంటున్నారు. తాజాగా తమన్నాతో ఓ సాంగ్ షూటింగ్ సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. స్విట్జర్లాండ్లోని అందమైన లోకేషన్స్లో తీసిన సాంగ్ షూట్ ఎంతో ఆహ్లాదంగా జరిగిందంటూ ట్వీట్ చేశారు. స్విట్జర్లాండ్లో జరుగుతున్న షూటింగ్ ఫోటోలను మెగాస్టార్ అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకొస్తా.. అప్పటివరకు 'చిరు లీక్స్' పిక్స్ నవ్వుతున్న ఏమోజీని జత చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ మీ పాట కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: రప్ఫాడిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ క్రేజీ అప్డేట్) స్విట్జర్లాండ్ 🇨🇭లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం ! అప్పటివరకూ ఈ 'చిరు… pic.twitter.com/VfT8Jx2QNC — Chiranjeevi Konidela (@KChiruTweets) May 23, 2023 -
'శరత్ బాబు వెండితెర 'జమిందార్'': మెగాస్టార్ చిరంజీవి
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. హుందాతనంతో ఉట్టిపడే నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని.. అనేక చిత్రాలలో నా సహనటుడుగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!) కాగా.. అనారోగ్య కారణాలత హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో శరత్ బాబు సోమవారం మధ్యాహ్నాం కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్కు తరలించిన కుటుంబసభ్యులు.. మంగళవారం చెన్నై ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: 3 వేలమందిలో ఒకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా… pic.twitter.com/za0FpSyeJV — Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2023 -
సంగీత దర్శకుడు మృతి.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు రాజ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన సంగీతం, అద్భుతమైన బాణీలు నా చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. సంగీత దర్శకుడు కోటితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన ఆయన మన మధ్య లేకపోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) కాగా.. 1983లో ప్రళయ గర్జన వీరిద్దరూ కలిసి పనిచేసిన మొదటి చిత్రం. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు రాజ్ కోటి ద్వయం సంగీతాన్ని సమకూర్చారు. ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. కాగా.. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. (ఇది చదవండి: నాకు జరిగిన అవమానాలను గుర్తు పెట్టుకుంటా: డైరెక్టర్ తేజ) ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ… pic.twitter.com/uPifYfmtFE — Chiranjeevi Konidela (@KChiruTweets) May 21, 2023 -
మెగాస్టార్ను కలిసిన ఇండియన్ ఐడల్ సింగర్
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో తన మధురమైన గొంతుతో ప్రేక్షకులను మెప్పించిన ఇండియన్ ఐడల్ ప్రణతి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. (ఇది చదవండి: సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!) అక్కడే అన్నమాచార్య కీర్తన పాడి అందరినీ మెప్పించింది. ప్రణతి ప్రతిభకు మెగాస్టార్ దంపతులు ఫిదా అయ్యారు. భవిష్యత్తులో గొప్ప సింగర్ కావాలని ఆకాంక్షించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -2లో సక్సెస్ సాధించాలని ఆశీర్వదించారు. కాగా.. విశాఖపట్టణానికి చెందిన ప్రణతి సీజన్ మొదటి రోజే తన గాత్రంతో మెప్పించి అందరి ప్రశంసలు అందుకుంది. (ఇది చదవండి: ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!) -
శ్రీజను టార్గెట్ చేస్తూ వీడియో షేర్ చేసిన కల్యాణ్దేవ్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ల పెళ్లి జరగ్గా కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలు డిలీట్ చేసేయడం సహా మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కల్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో ఈ రూమర్స్ నిజమనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు ఈ పుకార్లపై నేరుగా స్పందించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఇన్డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు. తాజాగా కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ పోస్ట్ చూస్తే వీరిద్దరి మధ్య ఎంత అగాధం ఉందన్నది స్పష్టమవుతుంది. ఈ వీడియోలో ఓ స్కూల్ పాప కల్చరల్ ఈవెంట్లో పాల్గొంటుంది. తన పేరెంట్స్ ఎక్కడున్నారా అని స్టేజ్పై ఉండి వెతుక్కుంటుంది. వాళ్ల తల్లిదండ్రులను చూడగానే సంతోషంతో చాలా ఎగ్జయిట్ అవుతుంది. ఈ వీడియోను కల్యాణ్దేవ్ షేర్ చేస్తూ.. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, సపోర్ట్ కావాలి. మిస్సింగ్ నవిష్క, నివిత్రి అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.దీంతో భార్యభర్తలు విడిపోయినా పిల్లలకు ఇద్దరి ప్రేమ దక్కాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలోనూ కూతుళ్లను తలుచుకుంటూ కల్యాణ్ దేవ్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. -
కోల్కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తోన్న చిత్రం 'భోళాశంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ కోల్కతాకు బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది చిత్రబృందం. కోల్కతాకు ఓ ప్రత్యేకత కోల్కతాలో రేపటి నుంచే భోళాశంకర్ మూవీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ‘చూడాలని ఉంది’ కోల్కతా బ్యాక్డ్రాప్లోనే వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమాలో మెగాస్టార్ టాక్సీ డ్రైవర్గా అలకించారు. మళ్లీ ఇప్పుడు ‘భోళా శంకర్’ టీమ్ కోల్కతాకు బయలుదేరడంతో అదే సీన్ రిపీట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. (ఇది చదవండి: మెగా ఫ్యాన్స్కు ఉగాది సర్ప్రైజ్.. భోళాశంకర్ రిలీజ్ అప్పుడే!) కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుండగా.. నటుడు సుశాంత్ లవర్ బాయ్ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణను హైదరాబాద్లో చిత్రీకరించారు. భోళా శంకర్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్తో పాటు ఐఫీస్ట్ అనిపించే పాటలు ఉంటాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. (ఇది చదవండి: అప్పుడు భూమిక.. ఇప్పుడు శ్రీముఖి.. భోళాశంకర్లో ఆ సీన్ రిపీట్..!) కాగా.. తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్గా టాలీవుడ్లో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తరవాత తెలుగులో రీమేక్ చేస్తున్నారు. The new schedule of Mega 🌟 @KChiruTweets's #BholaaShankar 🔱 will begin in Kolkata from tomorrow💥 A few major sequences will be shot in this schedule at the premises of Yamahanagari❤️ In Theatres on AUG 11th 🤟🏻@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial pic.twitter.com/rUfTaHzn0G — BholāShankar (@BholaaShankar) May 3, 2023 Megastar 🤩😍🔥🔥🔥🔥🔥🔥@BholaaShankar 🔱 “Boss” look as Taxi 🚖 Driver in #Kolkata Tremendous response from everyone 🎉Big thanks to print & web media for their support @AKentsOfficial @AnilSunkara1 @dudlyraj #Mahatiswarasagar @prakash3933 @cinesoul1 @Yugandhart_ #Ramlaxman pic.twitter.com/AM7FDVWA44 — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) May 2, 2023 -
రప్ఫాడిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుండగా.. నటుడు సుశాంత్ లవర్ బాయ్ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణను హైదరాబాద్లో ప్రారంభించింది చిత్రబృందం. చిరంజీవి, షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణంపై ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. మరోవైపు డబ్బింగ్ పనులకు కూడా గురువారమే శ్రీకారం చుట్టారు. భోళా శంకర్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్తో పాటు ఐఫీస్ట్ అనిపించే పాటలు ఉంటాయి. చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. జూన్లో షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. -
మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ.. సాయి ధరమ్ తేజ్ నాన్నకు ఏంటీ సంబంధం?
మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలో ఎవరినీ అడిగినా గుర్తుపట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. ఆయన కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత మెగా వారసుడు రామ్ చరణ్ ఆయన బాటలోనే ప్రయాణిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి దూసుకొస్తున్న మరో యంగ్ హీరో, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈనెల 21న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇదంతా మీకు తెలిసిన విషయమే కావొచ్చు. కానీ సాయి ధరమ్ తేజ్ తండ్రి గురించి మీకు తెలుసా? అంతే కాదండోయ్ ఆయనొక నిర్మాత అని మీరెప్పుడైనా విన్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తండ్రి జీవీఎస్ ప్రసాద్ ఓ సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో ఆయన సినిమా తీశారు. ఆ బ్లాక్ బస్టర్ మూవీ గురించి ప్రేక్షకులందరికీ తెలిసు. కానీ ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్ నాన్న నిర్మాతగా ఉన్నారన్న సంగతి కొద్ది మందికే తెలుసు. ఇంతకీ ఆయన తీసిన సినిమా ఏదో తెలుసుకోవాలనుందా? పదండి అదేంటో చూసేద్దాం. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఓ రేంజ్ ఉండేది. ఆయన సినిమాల్లో చేసే డ్యాన్స్ను అందరూ ఫిదా అయిపోయేవారే. అలా వెండితెరపై ఆయనొక ఎవర్ గ్రీన్ నటుడు. ఆయనతో సాయి ధరమ్ తేజ్ నాన్న జీవీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'రౌడీ అల్లుడు'. చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో ద్విపాత్రాభియం చేశారు మెగాస్టార్. చిరు కెరీర్లో రౌడీ అల్లుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా 1991 అక్టోబర్ 18న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి కళ్యాణ్గా, ఆటో జానీగా రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ఆ తర్వాత జీవీఎస్ ప్రసాద్ మరో సినిమా నిర్మించలేదు. మొత్తంగా ‘రౌడీ అల్లుడు’ సినిమా మెగాస్టార్ అభిమానులకు ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. -
20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!
హీరోయిన్ శ్రియ శరన్ క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అలరిస్తుంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన శ్రియ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే కుర్ర హీరోలతో పాటు బడా హీరోలతోనూ జతకట్టింది. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రంలో చిరు సరసన హీరోయిన్గా నటించింది. అయితే ఇప్పుడు మరోసారి చిరుతో స్టెప్పులు వేయనుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం శ్రియను సంప్రదించగా, ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. చదవండి: ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా? ఫస్ట్ జాబ్ అదేనట -
రంజాన్ స్పెషల్: చిరంజీవిని కలిసిన అలీ..ఫోటోలు వైరల్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా సినీ నటుడు అలీ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇక రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. కాగా అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. -
సోగ్గాడుగా చిరు?..సస్పెన్స్ లో మెగా ఫ్యాన్స్
-
మేనల్లుడి 'విరూపాక్ష' హిట్.. చిరంజీవి ఎంత ఆనందంగా ఉన్నారో
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ దండు తెరకెక్కిచిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది. మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో సాయితేజ్కు జంటగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా సస్పెన్స్ ఎలిమెంట్స్తో హిట్ టాక్తో థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి విరూపాక్ష టీంకు అభినందనలు తెలిపారు. సతీమణి సురేఖ సాయితేజ్కు కేక్ తినిపిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. విరూపాక్ష సినిమాపై అద్భుతమైన స్పందన వస్తోంది. సాయితేజ్ విరూపాక్షతో గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నీ సినిమాని ప్రేక్షకులు మెచ్చుకోవడం, వారి ఆశీస్సులు అందించడం సంతోషంగా ఉంది. వీరూపాక్ష టీంకు హృదయపూర్వక అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి మేనల్లుడు సాయితేజ్ స్పందిస్తూ.. థ్యాంక్యూ అత్తా, మామ. లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. Hearing fabulous reports about #Viroopaksha ! I am so happy for you dear @IamSaiDharamTej that you have made your come back with a bang. 🤗Delighted that the audience is appreciating and blessing your film! Hearty Congratulations to the entire team! 💐💐@iamsamyuktha_… pic.twitter.com/eeBh7L2skm — Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2023 -
హాట్టాపిక్గా మారిన చిరంజీవి చిన్నల్లుడి పోస్టులు.. నెట్టింట వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ల పెళ్లి జరగ్గా మనస్పర్థల కారణంగా వీరు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలు డిలీట్ చేసేయడం సహా మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కల్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో రూమర్స్ మొదలయ్యాయి. కొన్నాళ్లుగా వీరిద్దరి పర్సనల్ లైఫ్పై ఇప్పుడు రకరకాల పుకార్లు వస్తున్నా మెగా ఫ్యామిలీ కానీ, ఇటు కల్యాణ్ దేవ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తమ రిలేషన్షిప్పై ఇన్డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు. తాజాగా కల్యాణ్ దేవ్ షేర్చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. 'ఇతరులు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధల గురించి మనకు తెలిసింది గోరంత అయితే తెలియనది కొండంత. అందుకే ఎదుటి వారి పట్ల మనం దయ, జాలితో ఉండాలి అంటూ' ఓ కొట్ను షేర్చేశారు. ఇక మరొక పోస్ట్లో.. క్రమశిక్షణ వల్లే వచ్చే బాధ, విచారం వల్ల కలిగే బాధ ఇలా రెండుంటాయి. వాటిలో మీరు ఏది కోరుకుంటారు అంటూ కల్యాణ దేవ్ చేస్తున్న వరుస పోస్టులు నెట్టింట వైరల్గా మారాయి. -
అల్లు అర్జున్కు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే విషెస్.. ట్వీట్ వైరల్
మెగా ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐకాన్ స్టార్గా క్రేజ్ దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో పాన్ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొని నేషనల్ స్టార్గా ఎదిగాడు.నేడు(శనివారం) అల్లు అర్జున్ 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి బన్నీకి పెద్దె ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా బన్నీకి బర్త్డే విషెస్ను తెలియజేశారు. 'హ్యాపీ బర్త్డే డియర్ బన్నీ.. పుష్ప-2 ది రూల్ ఫస్ట్ లుక్ రాకింగ్గా ఉంది. ఆల్ ది బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా చిరంజీవి సినిమాతోనే అల్లు అర్జున్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి హీరోగా నటించిన ‘విజేత’ సినిమాలో బాల నటుడిగా కనిపించిన బన్నీ ఆ తర్వాత ‘స్వాతిముత్యం’, ‘డాడీ’ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ‘గంగోత్రి’ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. నేడు పుష్ప చిత్రంతో పాన్ఇండియా స్థార్గా సత్తా చాటుతున్నారు. Happy Birthday Dear Bunny @alluarjun ! Many Happy Returns!! 💐💐 Also The First Look of #Pushpa2TheRule Rocks! All The Very Best!! — Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2023 -
అలా చూపిస్తే వాల్తేరు వీరయ్య హిట్ అయ్యేది కాదు: పరుచూరి
ప్రముఖ lతెలుగు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూను వెల్లడించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'వాల్తేరు వీరయ్య చాలా సింపుల్ స్టోరీ. కానీ రవితేజ బదులు రామ్ చరణ్ చేసి ఉంటే చిరంజీవికి మైనస్ మార్కులు పడేవి. ఎందుకంటే తమ్ముడి పాత్రలో రవితేజ పాత్ర చూశాక.. చరణ్ చేస్తే బాగుండదనే నిర్ణయానికి వచ్చా. అందుకే రవితేజను పెట్టారు. ఆయన అద్భుతంగా నటించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకం. పైగా ఒక ఫిషర్ మ్యాన్కు జోడిగా శృతిహాసన్ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ చిరంజీవి సినిమా మెగా ఆడియన్స్ను దృష్టిలో ఉంచుకుని తీశారు. చిరంజీవి, రవితేజ.. హీరోయిన్స్తో ప్రేమాయణం లాంటివి కథలో చూపిస్తే సినిమా హిట్ అయ్యేది కాదు.' అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్, ఎక్కడో తెలుసా?) చిరంజీవి నటనపై పరుచూరి మాట్లాడూతూ..' తనకు వర్టిగో వ్యాధి ఉందని చెప్పే సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతంగా ఉంది. మనకు తెలియకుండా ఆ వ్యాధితో ఏమైపోతాడోననే భయాన్ని ఆసాంతం ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. సంభాషణలు, పొడి పొడి మాటలు బాగున్నాయి. ఊహకందని ట్విస్టులు సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. మలేషియాకు వెళ్లినప్పుడు బంపర్ ట్విస్ట్ ఇచ్చారు. మలేషియా నుంచి ఓ కాంట్రాక్ట్ తీసుకుని వచ్చిందే కథ. ఇందుకు కథ రచయిత బాబీని మెచ్చుకోవాలి. అప్పట్లో చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే కనిపించారు. ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, కేథరిన్ బాగా నటించారు. వారి పాత్రలూ సినిమా విజయంలో స్థానం దక్కించుకున్నాయని' అని అన్నారు. మెగా ఫ్యాన్స్కు అద్భుతమైన అనుభూతిని అందించిన చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూనకాలు లోడింగ్' అనే పదం కేవలం అభిమానుల కోసమే పెట్టారని వెల్లడించారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. -
ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్.. 'ఎన్టీఆర్ 30' లాంఛ్కు ఊహించని గెస్ట్!
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న మూవీ ఎన్టీఆర్ 3. ఈ చిత్రం ఓపెనింగ్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఈ మూవీ లాంచింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఓపెనింగ్ సమయంలో కొరటాల టీమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అలాగే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఎవరు ఊహించని గెస్ట్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ఆర్ఆర్ఆర్ టీమ్ కంటే ముందే ఎన్టీఆర్ ఇండియా తిరిగివచ్చేశాడు. దీంతో ఎన్టీఆర్-కొరటాల మూవీ ఓపెనింగ్ ఈనెలలో వుంటుందనే వార్తలపై నమ్మకం కుదిరింది. అసలు ఫిబ్రవరిలోనే ఈ సినిమాను లాంఛ్ చేయాలనుకున్నారు. అయితే తారకరత్న చనిపోవటం.. ఆతర్వాత ఎన్టీఆర్ అమెరికా వెళ్లటంతో ఎన్టీఆర్ 30 మూవీ వాయిదా పడింది. ఇక జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఆచార్యతో కొరటాల భారీ ఫ్లాప్ను ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ 30తో బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ పాన్ వరల్డ్ హిట్ కావటంతో.. కొరటాల కూడా ముందు అనుకున్న స్టోరీ కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉన్న స్టోరీ రెడీ చేశాడు. సముద్రం బ్యాక డ్రాప్లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం కొరటాల ఇప్పటికే తన టీమ్తో కలిసి హైదరాబాద్లో సముద్రం సెట్, ఓ దీవి సెట్ను ఇప్పటికే సిద్ధం చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. అంతే కాదు ఈ సినిమాలో ఎన్టీఆర్తో తలపడేందుకు విలన్గా బాలీవుడ్ నటుడిని ఫిక్స్ చేశారు. ప్రభాస్ మూవీలో ఆదిపురుష్ లంకేశ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ను ఎన్టీఆర్ 30 లో విలన్గా నటించనున్నట్లు సమాచారం. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ సినిమాకి ఒప్పించినట్లు తెలుస్తోంది. విలన్గా సైఫ్ అలీఖాన్! మార్చి 23న జరిగే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ ప్రోగ్రామ్ సైఫ్ అలీఖాన్ వస్తాడనే ప్రచారం ఫిల్మ్నగర్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇక విలన్గా సైఫ్ అలీఖాన్ అధికారిక ప్రకటన కూడా ఆరోజే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మార్చి 23న జరగబోయే ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ గ్రాండ్గా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూవీ ఓపెనింగ్కి ఊహించని గెస్ట్ కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి ఆహ్వానం! ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిందనేది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. ఆచార్య తర్వాత చిరు, కొరటాల మధ్య దూరం పెరిగిందనేది ఇండస్ట్రీ టాక్. ఆచార్య డిజాస్టర్ తర్వాత చిరంజీవి ఇన్ డైరెక్ట్గా కొరటాలపై కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ 30 ఓపెనింగ్కి చిరంజీవిని ఆహ్వానిస్తే... కచ్చితంగా వస్తారనే మాట వినిపిస్తోంది. కొరటాల సంగతి పక్కన పెడితే... ఎన్టీఆర్ కోసమే కాకుండా జాన్వీకపూర్ ఎంట్రీ ఇవ్వనుండడంతో చిరంజీవి వస్తాడనే టాక్ నడుస్తోంది. అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి,రామ్ చరణ్ రానున్నారట. ఈ సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ కాబట్టి .. తారక్ తో పాటే సందడి చేస్తాడు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మార్చి 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
చిరంజీవికి షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు..!