breaking news
Tollywood Hero
-
సజ్జనార్కు ఎన్టీఆర్ అభిమాని ఫిర్యాదు.. ఎందుకంటే?
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది లేకుండా పోతోంది. వారి ఫోటోలను ఎలా పడితే అలా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ స్టార్స్ ఇలాంటి వాటి బారిన పడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీపీ సజ్జనార్కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి సీపీని కలిసి ఫిర్యాదును సమర్పించారు.తమ హీరో ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. ఇప్పటికే చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎన్టీఆర్ ప్రతిష్ట దెబ్బ తీసేలా ఉన్న వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలను వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. We sincerely thank Hyderabad Commissioner of Police Mr. V.C. Sajjanar, IPS garu, and the entire Hyderabad Police Department for their prompt response and assurance to take swift and appropriate action against those responsible for morphing and posting objectionable content… pic.twitter.com/Pg4dX2k4in— NandipaTi muRali (@NtrMurali9999) October 22, 2025 -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీ ఆగిపోయిందా?.. అసలు నిజమెంత?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్నీల్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ పాన్ ఇండియా చిత్రంపై నెట్టింట కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఇలాంటి బ్యాడ్ న్యూస్ రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ను నిరాశకు గురి చేస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మధ్య కంటెంట్ సృజనాత్మక విషయంలో విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్పుట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నారట. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతోనే ఈ మూవీ ఆగిపోయిందని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ కానీ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై మేకర్స్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2026 జూన్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇప్పటికే వెల్లడించారు. Who’s the culprit behind spreading fake news on #NTRNeel ?Some Paid Agenda working behind.... https://t.co/q16nhnWksa— prashanth Neel (@Prashant_neell) October 21, 2025 -
పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్.. ముహూర్తం ఫిక్స్!
టాలీవుడ్లో హీరో నారా రోహిత్ (Nara Rohith) పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన ప్రియురాలు శిరీష మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. ఇటీవలే శిరీష సోషల్ మీడియా వేదికగా పసుపు దంచే కార్యక్రమం అంటూ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి.తాజాగా నారా రోహిత్- శిరీషల పెళ్లి వేడుకకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు వీరి గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈనెల 30వ తేదీన వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్లోనే గ్రాండ్గా జరగనుంది.(ఇది చదవండి: నారా రోహిత్ పెళ్లి సందడి.. హీరోయిన్ ఇంట హల్దీ ఫంక్షన్)ఆ సినిమాతో శిరీషతో పరిచయం..నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్లో వీరికి ఎంగేజ్మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.రోహిత్ కెరీర్..బాణం సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమయ్యాడు రోహిత్. సోలో మూవీతో హిట్ కొట్టాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో మెప్పించాడు.Two hearts. One destiny. Infinite memories ahead ❤️The beautiful journey of #NaraRohith & Sireesha begins with a celebration as grand as their love story 💍A 4-Day grand wedding festivities to be held in Hyderabad with the Muhurtham on 30-10-25 ❤️Here’s to forever filled… pic.twitter.com/AqGedliw78— Ramesh Bala (@rameshlaus) October 22, 2025 -
వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబో.. హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్పై టాలీవుడ్లో చర్చ మొదలైంది. అంతేకాకుండా హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ సరసన కనిపించనున్న హీరోయిన్ పేరును రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ హీరోయిన్ పేరును వెల్లడించింది. కేజీఎఫ్తో స్టార్డమ్ దక్కించుకున్న శ్రీనిధిశెట్టి ఈ మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టి పోస్టర్ను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కేజీఎఫ్ తర్వాత టాలీవుడ్లో నాని హిట్- 3, ఇటీవలే విడుదలైన సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలతో మెప్పించింది. కాగా..ఈ చిత్రం వెంకీ మామ కెరీర్లో 77వ సినిమాగా రానుంది. అయితే ఈ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు.Here’s wishing the gorgeous and graceful @SrinidhiShetty7 a fantastic Birthday! ❤️#HBDSrinidhiShetty 💫Excited to have you join the journey of our Production No.8 | #Venky77 | #VenkateshXTrivikram | 🎬Victory @VenkyMama #Trivikram #SRadhaKrishna @haarikahassine pic.twitter.com/AALKT17vZ4— Haarika & Hassine Creations (@haarikahassine) October 21, 2025 -
దీపావళి మరింత స్పెషల్.. వారసుడితో వరుణ్ తేజ్ సెలబ్రేషన్స్!
దీపావళి వచ్చిందంటే చాలు.. సినీతారల సందడి మామూలుగా ఉండదు. కుటుంబంతో కలిసి ప్రతి ఒక్కరూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ దీపావళిని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పండుగ టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ దంపతులకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. తమ ముద్దుల వారసుడితో కలిసి దీపావళిని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా.. మెగా హీరో వరుణ్ తేజ్ రెండేళ్ల క్రితమే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 10న ఈ జంటకు బాబు పుట్టాడు. ఇటీవలే బారశాల వేడుక కూడా నిర్వహించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడి పేరుని బయటపెట్టారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు.కాగా.. నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
దీపావళి వేడుకల్లో నాగచైతన్య-శోభిత.. పెళ్లి తర్వాత తొలిసారిగా..!
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) దంపతులు దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా తొలిసారి దివాళీని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చైతూ సతీమణి శోభిత ధూలిపాల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. గతేడాది డిసెంబర్లో చైతూ-శోభిత వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేశ్ కూడా పాల్గొన్నారు. కాగా.. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) గతేడాది తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
శర్వానంద్ కొత్త సినిమా.. టైటిల్ రివీల్ చేసిన మేకర్స్
టాలీవుడ్ హీరో శర్వానంద్ కొత్త సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ దిపావళీకి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. తన లేటేస్ట్ మూవీ టైటిల్ను రివీల్ చేశాడు. ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను ప్రకటించారు. బైక్పై శర్వానంద్ లుక్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు బైకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కించునున్నారు. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. #Sharwa36 is #BIKER 🏍️🏁May you conquer every corner, every jump and every obstacle in life and aim for glory 🏁Wishing you a Happy Diwali 🪔✨#GoAllTheWay #BikerMovieCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj… pic.twitter.com/zKUND8GQwL— UV Creations (@UV_Creations) October 20, 2025 -
ఎలన్ మస్క్ ఎరికేనా మీకు.. ఆ రాకెట్ ఇదే.. నవ్వులు పూయిస్తోన్న లేటేస్ట్ ప్రోమో!
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju). ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనుంది. ఈ సినిమా రిలీజ్కు ఇంకా దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ ఛాన్స్ వస్తే చాలు ప్రమోషన్స్లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే దసరా సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది.తాజాగా ఇవాళ దివాళీ కావడంతో మరో ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే ఫస్ట్ సాంగ్ను కూడా విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియో ప్రోమోలో పటాకుల దుకాణంలో నవీన్ పొలిశెట్టి హీరోగా చేసిన హంగామా తెగ నవ్వులు తెప్పిస్తోంది. అరే హ్యాపీ దివాళీ అన్న.. ఏం కావాలి అన్న.. ఏమీ దొరుకుతాయి ఇక్కడ అని కస్టమర్ అనగానే.. పట్టు చీరలు, శిల్క్ శారీలు అన్నీ ఉన్నాయి.. పటాకాయల షాపుకొచ్చి పట్టుచీరలు దొరుతుతాయా అన్నా అంటూ నవీన్ నవ్వులు పూయించాడు. ఎల్లన్న.. అంటే ఎలన్ మస్క్ ఎరికేనా నీకు.. మార్స్లో నీళ్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పంపించిన రాకెట్స్ ఇవే.. సేమ్ పీస్.. అందుకే వారంటీ కోసం మస్క్ ఫోటో కూడా వేయించా.. మీకు ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఆయనకు ఫోన్ చేయుర్రి.. మనం నీళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వాచ్మెన్ను పంపిస్తాం.. ఈ డబ్బులు ఉన్నోళ్లు ఏంది రాకెట్స్ పంపిస్తరు.. పైసలు ఉన్నోళ్ల పైత్యం లే.. అంటూ ప్రోమో ఫుల్ కామెడీతో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. JaaneJigars. First song from #AnaganagaOkaRaju BLASTING SOON 🔥🔥 Mee andariki Deepavali Subhakankshalu. Love you guys. Can’t wait for Sankranthi😍🔥Here is the DIWALI BLAST promo 💣▶️ https://t.co/YI94w3Q97c @Meenakshiioffl #Maari @MickeyJMeyer @dopyuvraj @vamsi84… pic.twitter.com/5jHE399ZXg— Naveen Polishetty (@NaveenPolishety) October 20, 2025 -
మహేష్ ఎక్కడ? నమ్రతకు ఫ్యాన్స్ ప్రశ్న...!
దీపావళి పండుగ సెలబ్రిటీలకు చాలా ఇష్టమైన పండుగ అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా జరుపుకోవడం మాత్రమే కాదు బిజీ జీవితంలో అరుదుగా మాత్రమే కలవగలుగుతున్న సన్నిహితులకు, పరిచయస్థులకు దీపావళి బాష్ పేరిట పార్టీలు ఇవ్వడానికి కూడా ఇదే చక్కని సందర్భంగా స్టార్స్ భావిస్తారు. దాంతో ఈ సమయంలో దీపావళి పార్టీలు జోరుగా సాగుతాయి. మన టాలీవుడ్తో పోలిస్తే బాలీవుడ్లో ఇవి ఒక సంప్రదాయంగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో ముంబైలో ఝాన్సీరెడ్డి అనే సన్నిహితులు ఇచ్చిన ఈ పార్టీకి పలువురు బంధుమిత్రులతో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి ఆమె సోదరి శిల్పా శిరోడ్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పార్టీలో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పార్టీలో మహేష్, నమ్రతల కుమార్తె తాజా యాడ్ వరల్డ్ యంగెస్ట్ సెన్సేషన్ సితార కూడా పాల్గొంది.ఈ సందర్భంగా నమ్రత తమ ఘట్టమనేని అభిమానులతో తన దీపావళి వేడుకల విశేషాలను పంచుకున్నారు. తన కుమార్తె సితార ఘట్టమనేని సోదరి శిల్పా శిరోద్కర్తో తాము కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఆ ఛాయా చిత్రాలను పంచుకుంటూ, నమ్రత ‘వెచ్చదనం, వెలుగులు అద్భుతమైన వ్యక్తులతో నిండిన సాయంత్రం... నిజంగా మరపురాని దీపావళి రాత్రులు... మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు‘ అంటూ క్యాప్షన్లో రాశారు. ఈ ఫొటోలో హైదరాబాద్ నగర ప్రముఖులు పింకీ రెడ్డి వంటివారు కూడా నమ్రత బృందంలో కనిపించారు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ అభిమాన కధానాయకుడు లేకుండా ఆయన భార్య వేడుకలు జరుపుకుంటే.. అడగకుండా ఉంటారా? అందుకే ఆ ఫొటోల కింద కామెంట్లు వెల్లువెత్తాయి. మహేష్ బాబు ఎక్కడ అంటూ పలువురు ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపించారు. ఒకరు, ‘మన సూపర్ స్టార్ ఎక్కడ?‘ అని ఆరా తీయగా మరికొందరు, ‘బాబు ఎక్కడ‘ అనీ అడిగారు. నమ్రతను తన కుమార్తెతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలను షేర్ చేయమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభ్యర్ధించారు. మరోవైపు రాజమౌళి తీస్తున్న సినిమా షూటింగ్లో మహేష్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ను రిలీజ్ చేశారు. గన్స్ అండ్ రోజెస్ అనే ఫుల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వ వేమూరి లిరిక్స్ అందించగా..హర్ష ఆలపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. -
డీజీపీని కలిసిన మంచు మనోజ్ దంపతులు
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉందని ట్వీట్లో రాసుకొచ్చారు.మంచు మనోజ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'నేను, నా భార్య మౌనిక గౌరవనీయులైన డీజీపీ శివధర్రెడ్డిని కలిశాం. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉంది. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ప్రయాణం క్రమశిక్షణ, ధైర్యం, నైతిక పోలీసింగ్ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.Me and my wife @BhumaMounika met Shri B. #ShivadharReddy Garu, the new @TelanganaDGP 💐Delighted to see a leader of integrity and vision take charge. His journey from the grassroots to the top reflects discipline, courage, and an unshakable commitment to ethical policing.… pic.twitter.com/0f4g3YS7FP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 17, 2025 -
సుధీర్ బాబు జటాధర.. ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజైంది. కాగా.. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. 'పూర్వం ధనాన్ని దాచిపెట్టి... మంత్రాలతో బంధనాలు వేసేవాడు' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఈ కథను ధనపిశాచి అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సోనాక్షి సిన్హా ధనపిశాచి పాత్రలో విశ్వరూపం చూపించింది. నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సీన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా కథేంటో ట్రైలర్ చూస్తేనే ప్రేక్షకులను తెలిసిపోతోంది. -
మీ ఫేవరేట్ హీరో ఎవరు?.. సిద్ధు జొన్నలగడ్డ ఏమన్నారంటే?
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా వస్తోన్న రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ తెలుసుకదా. ఇప్పటికే ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ నిర్మించారు.రిలీజ్కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో సిద్ధు సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు. ట్విట్టర్ వేదికగా ఆస్క్ సిద్దు పేరుతో చిట్ చాట్ నిర్వహించారు. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధనాలిచ్చారు సిద్ధు. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ గురించి సైతం పలువురు అడిగారు. అంతేకాకుండా మీ ఫెవరేట్ హీరో ఎవరని కూడా ప్రశ్నించారు. దీనికి సిద్ధు తన నచ్చిన హీరో రణ్బీర్ కపూర్ అంటూ ఆన్సరిచ్చారు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ త్వరలోనే జరగనుందని రిప్లై ఇచ్చాడు. Ranbir kapoor ! Fan boy moment Yet to happen— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) October 16, 2025 -
ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు
ఆసియా కప్ హీరో తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. ప్రస్తుతం మనశంకరవరప్రసాద్గారు మూవీలో నటిస్తోన్న చిరు.. ఈ టీమిండియా క్రికెటర్ను సత్కరించారు. ఈ సందర్భంగా మూవీ సెట్లో కేక్ కట్ చేసిన తిలక్ వర్మకు.. ఆసియా కప్ ఫైనల్ నాటి ఫోటోను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో నయనతార, అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు.కాగా..ఇటీవల దుబాయ్లో పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ విజయం కీలకమైన సమయంలో రాణించాడు. దీంతో తిలక్ వర్మపై పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మీసాల పిల్ల అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Megastar #Chiranjeevi Garu met young cricket sensation #TilakVarma on the sets of #ManaShankaraVaraPrasadGaru and felicitated him for his stellar contribution to India’s glorious win against Pakistan. 🏏💫A proud moment as the Megastar appreciated the Hyderabad boy’s talent,… pic.twitter.com/9HVOg2ZRy4— Team Megastar (@MegaStaroffl) October 16, 2025 -
మెగాస్టార్ సంక్రాంతి సినిమా.. రొమాంటిక్ ఫుల్ సాంగ్ అవుట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్తో ఫుల్ స్వింగ్లో దూసుకెళ్తున్నారు.ఇటీవల దసరా సందర్భంగా క్రేజీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మీసాల పిల్లా అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. డేరింగ్ సీన్ లీక్!
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం చెర్రీ సరసన బాలీవుడ్ భామ, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పుణెలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఓ బ్యూటీఫుల్ సాంగ్ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. పర్వత ప్రాంతంలో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. చెర్రీ ఓ రాయిపై నిలబడి డ్యాన్స్ చేయడంపై డేరింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్ డేరింగ్ డ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్ షూట్ సీన్ లీక్ కావడం టాలీవుడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట విజువల్ ట్రీట్గా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే పర్వత ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. View this post on Instagram A post shared by IWMBuzz (@iwmbuzz) -
సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రైలర్.. రిలీజ్లో ట్విస్ట్!
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada). ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఈనెల 12 వైజాగ్ ఈవెంట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఊహించని విధంగా ట్రైలర్ రిలీజ్ తేదీపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని పోస్టర్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 13న ఉదయం 11 గంటల 34 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సిద్ధు ఫ్యాన్స్ కాస్తా డిస్సాపాయింట్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.UNAPOLOGETICALLY RADICAL 💥💥#TelusuKadaTrailer out tomorrow at 11.34 AM. Love will be unhinged ❤🔥#LoveU2#TelusuKada in cinemas worldwide from October 17th!STAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @harshachemudu @vishwaprasadtg… pic.twitter.com/EwAIC1yWyI— People Media Factory (@peoplemediafcy) October 12, 2025 -
గ్రాండ్గా నార్నే నితిన్ పెళ్లి వేడుక.. బామ్మర్ది పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ సందడి!
మ్యాడ్ స్క్వేర్ హీరో నార్నే నితిన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్.. గతేడాది శివానీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట. తాజాగా ఇవాళ జరిగిన పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో సందడి చేశారు. పెళ్లికూతురి బ్యాక్ గ్రౌండ్ ఇదే..కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో గతేడాది నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాల కంటే ముందుగానే ఆయన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) అనే మూవీలో నటించారు. అదే నార్నే నితిన్ నటించిన మొదటి చిత్రం కావడం విశేషం. Mana tarak Anna 😍👌🔥 at Nithin naren wedding #JrNTR @tarak9999 pic.twitter.com/sRVaBcBZR6— NTR Fans (@NTR2NTR_FC) October 10, 2025 -
అట్లీ మూవీ షూటింగ్ గ్యాప్.. విదేశాల్లో వాలిపోయిన బన్నీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఏఏ22 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ముంబయిలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించనున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్కు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఐకాన్ స్టార్ వెకేషన్లో చిల్ అవుతున్నారు. తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నారు. తాజాగా ఈ ఫోటోలను బన్నీ భార్య సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
సర్వస్వం నువ్వే.. నా జీవితంలో ఆదర్శం నువ్వే.. మంచు మనోజ్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి తమ్ముడు, హీరో మంచు మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో నువ్వే నాకు ఎల్లప్పుడు ఆదర్శం అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఒక తల్లిగా, నటుడిగా, నిర్మాతగా నువ్వు జీవిస్తున్న విధానం అద్భుతం అంటూ కొనియాడారు. నువ్వు అడుగుపెట్టే ప్రతి ఇంటికి వెలుగునిచ్చి.. నీ దయ, బలంతో ఎన్నో జీవితాలను మార్చేశావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు.ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే ఉండి.. నువ్వు వెళ్లే ప్రతిచోటా నీ వెలుగును ప్రకాశింపజేస్తూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మంచు మనోజ్ ఎమోషనలయ్యారు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్కా ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు లక్ష్మీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది భైరవం, మిరాయ్ చిత్రాలతో అలరించాడు. ఇటీవలే విడుదలైన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.Wishing my sister and my everything, @LakshmiManchu akka, a very happy birthday ❤️You’ve always been my biggest inspiration, akka. The way you handle life as a mother, actor, producer, and a person with such a big heart is just incredible.You light up every room you walk into… pic.twitter.com/aKNF6Qme5n— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 8, 2025 -
20 నెలల తర్వాత మళ్లీ.. వెంకీమామ మూవీపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత!
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ మామ.. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ను ఇటీవలే ప్రకటించారు. అనిల్ రావిపూడితో కలిసి బ్లాక్బస్టర్ విక్టరీ కొట్టిన వెంకటేశ్ నెక్ట్స్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో చేయనున్నట్లు తెలిసింది. ఈ మూవీని కుటుంబ కథాచిత్రంగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లో 77వ చిత్రంగా నిలవనుంది. వెంకటేశ్ నెక్స్ట్ మూవీకి సంబంధించి తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. దాదాపు 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు రాధాకృష్ణ(చినబాబు) నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. వీరిద్దరి కలిసి మరోసారి మ్యాజిక్ను సృష్టించడానికి సెట్స్పైకి వెళ్లనున్నారని రాసుకొచ్చారు. వెంకీతో త్రివిక్రమ్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.After 20 long months, the wizard of words #Trivikram garu is back behind the camera, joining hands with everyone’s favourite, Victory @VenkyMama garu! 🙌❤️The OGs of entertainment are back on sets to recreate the magic once again! ❤️😉🎬Produced by #SRadhaKrishna (Chinababu)… pic.twitter.com/781uxgmQ5P— Naga Vamsi (@vamsi84) October 8, 2025 -
టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. ఎన్టీఆర్ బామ్మర్ది మ్యారేజ్ డేట్ ఫిక్స్!
ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్. వరుసకు మన యంగ్ టైగర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్.. శివానీ అనే అమ్మాయితో గతేడాది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో కలిసి వేడుకలో సందడి చేశారు. ఈ నిశ్చితార్థానికి హీరో కల్యాణ్ రామ్, వెంకటేశ్ కూడా హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నార్నే నితిన్- శివాని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక అక్టోబర్ 10న గ్రాండ్గా జరగనుందని టాక్. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. -
కిరణ అబ్బవరం కె ర్యాంప్.. మరో సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
29 ఏళ్ల నిన్నే పెళ్లాడతా.. ఫ్యాన్స్ వీడియో వైరల్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన కల్ట్ మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జునే నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ రిలీజై అక్టోబర్ 4వ తేదీ నాటికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన టబు హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.ఈ చిత్రం విడుదలైన 29 ఏళ్లు పూర్తి కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాలోని పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. ఏటో వెళ్లిపోయింది మనసు.. ఎలా ఒంటరైంది మనసు.. ఓ చల్లగాలి..ఆచూకి తీసి.. కబురివ్వలేవా ఏమైయిందో.. అంటూ సాగే పాట పాడుతూ చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నాగ్ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. అభిమానుల శక్తి అద్భుతం.. ఫ్యాన్స్ కలిసి వచ్చినప్పుడు నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.The power of fandom is incredible, and when fans come together, it's truly a special experience! 👏Cult King Fan's at one frame 😍 .@iamnagarjuna ❤️ 😍 💖 #29YearsForNinnePelladutha ❤️#KingNagarjunaForver ❤️ 😍 💖 #King100 🔥 🔥 pic.twitter.com/M22sNnl0kZ— NagaKiran Akkineni (@NagaKiran60) October 7, 2025 -
కారు ప్రమాదంపై విజయ్ దేవరకొండ ట్వీట్!
కారు ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా బాగానే ఉందని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో తన కారు దెబ్బతిందని.. కానీ మాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఇప్పుడే వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వచ్చానని పోస్ట్ చేశారు. నా గురించి ఆరా తీసిన మీ అందరికీ లవ్ యూ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దని అభిమానులకు సూచించారు.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. కాగా.. ఇటీవల రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టిపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ది రాజా సాబ్ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్స్ షూటింగ్ చేసేందుకు రాజా సాబ్ టీమ్ యూరప్కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. డైరెక్టర్ మారుతితో ఫ్లైట్లో ఉన్న పిక్ను పోస్ట్ చేశారు. ఈ సాంగ్స్ను షూట్ చేసేందుకు చిత్రబృందం యూరప్కు పయనమయ్యారు. కాగా.. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. కల్కి తర్వాత వస్తోన్న ప్రభాస్ మూవీ కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
నా డ్రీమ్ అదే.. నాన్నలాగే అలాంటి సినిమాలు చేయాలని!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya ) తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నాగ చైతన్య తాజాగా ఓ ప్రోగ్రామ్కు హాజరయ్యారు. టాలీవుడ్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము.. నిశ్చయమ్మురా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలనుందని మనసులోని మాటను బయటపెట్టారు. నాన్నలాగా అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు చేయాలనుందని కోరికను వెల్లడించారు. ఇది విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు.. ఆయన సన్నిదిలో విజయ దేవరకొండ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో రూమర్స్ వస్తోన్న రష్మికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. హైదరాబాద్లోని విజయ్ సృగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ప్రముఖ ఆలయంలో కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విజయ్ పుట్టిపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ వర్గాలు అతనికి ఘన స్వాగతం పలికాయి. ఇకపోతే విజయ్ దేవరకొండకి పుట్టపర్తితో ఉన్న అనుబంధం తెలిసిందే. అక్కడే శ్రీ సత్యసాయి పాఠశాలలో ఆయన చదువుకున్నారు. Puttaparthi ❤️🙏Sensational @TheDeverakonda visits Bhagwan Satya Sai Baba's Maha Samadhi and seeks blessings ✨#VijayDeverakonda has a special connection with this place from childhood❤️ pic.twitter.com/pOq8fY02Hy— Pavan Kumar (@pavankumar__123) October 5, 2025 -
రాయలసీమ బిడ్డగా ఎంతోమందికి స్ఫూర్తి: సతీమణిపై మంచు మనోజ్ ప్రశంసలు
టాలీవుడ్ హీరో మంచు మనజ్ ఇటీవలే మిరాయ్ మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో విలన్గా అభిమానులను అలరించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఏడాది గట్టిగా కమ్ బ్యాక్ ఇచ్చాడు మంచు మనోజ్. భైరవం తర్వాత మిరాయ్ మూవీతో ఆకట్టుకున్నారు.ఇదిలా ఉంచితే మంచు మనోజ్ 2023లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. తాజాగా అక్టోబర్ 4న తన సతీమణి మౌనిక పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు మంచు మనోజ్. ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన భూమా మౌనిక.. ఆది పరాశక్తి అంటే నువ్వే. నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి పూర్తిగా మారిపోయింది. టెన్షన్లో ఉన్నప్పుడు నీ మౌనం, కష్టాల్లో కూడా నీ దయ, ప్రజల పట్ల, నిన్ను బాధపెట్టే వారి పట్ల కూడా నీ అచంచలమైన కరుణ మాయాజాలాన్ని నేను చూశాను. ఆ బలం, స్వచ్ఛత నన్ను విస్మయంతో తల వంచేలా చేస్తాయి ఎప్పటికీ. నా భార్యగా ప్రేమను పంచావు. ధైరవ్, దేవసేన.. లిటిల్ జోయాకు తల్లిగా.. నువ్వు వారి ప్రతి అడుగును నడిపించే వెలుగుగా మారావ్. మా ఇంటిని నవ్వులతో నింపేశావ్. నమస్తే వరల్డ్ సీఈవో, వ్యవస్థాపకురాలిగా ఏమి సాధించగలదో నువ్వు చూపించావు. రాయలసీమ బిడ్డగా.. ప్రజలకు నీ నిరంతర సేవ నిన్ను నాయకురాలిగా మాత్రమే కాకుండా లెక్కలేనన్ని జీవితాలకు ప్రేరణగా నిలుస్తుందని' కొనియాడారు.నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ దురాశ పడలేదు.. ఎప్పుడూ నీ కష్టాన్ని నమ్ముకున్నావు.. నీ ఆత్మగౌరవం నన్ను నేను మరింత గౌరవించుకునేలా చేసిందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. నీ వల్లే నేను ఈ రోజు మెరుగైన వ్యక్తిగా మారాను.. నాపై అలాగే రాబోయే మన అందమైన ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. నీ సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.. నీ ధైర్యం నాకు స్ఫూర్తినిస్తూనే ఉందంటూ మనోజ్ రాసుకొచ్చాడు. నా జీవితాన్నే మార్చేసిన నా ప్రేమ, నా భాగస్వామి, నా బలం, నా శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ వల్లే ఈ ప్రపంచం, పిల్లలు నా లైఫ్లో దక్కిన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. Dear @BhumaMounika thalli, You are the very meaning of Adhi Parashakti. From the day you entered my life, I have seen the magic of your silence in chaos, your grace even in hardship, and your unshakable compassion for people, even those who hurt you. That strength and purity… pic.twitter.com/LgjNwgCENv— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 4, 2025 -
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. కంచు కనకమాలక్ష్మి అప్డేట్!
మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'కంచు కనకమాలక్ష్మి'. ఈ సినిమాను గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ దసరాకు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.విజయ దశమి సందర్భంగా ఈ మూవీ షూటింగ్ను గ్రాండ్గా ప్రారంభించారు. పాటల రికార్డింగ్తో పాటు చిత్రీకరణ మొదలెట్టారు. ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ మూవీని వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ అగస్త్య మాట్లాడుతూ.."ఇది క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. అందరికీ కంచు కనకమాలక్ష్మి స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది. విజయదశమి నాడు అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్తో మొదలుపెట్టాం. ఈ నెల 10 నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్తున్నాం. విజయనగరం, పట్టిసీమ, అరకు పరిసర ప్రాంతాల్లో 28 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఆ తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తామని' వెల్లడించారు. -
ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్తోనే!
ఓజీ డైరెక్టర్ సుజిత్ అప్పుడే మరో సినిమాకు సిద్ధమైపోయారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఓజీ ఇటీవలే థియేటర్లో రిలీజైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా ఓజీ డైరెక్టర్ సుజిత్ మరో టాలీవుడ్ స్టార్తో జతకట్టారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టాలీవుడ్ హీరో నానితో మూవీకి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను సుజిత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. SKY IS THE LIMIT…🔥#NaniXSujeeth @NameisNani @Sujeethsign pic.twitter.com/lIylWc2taZ— Niharika Entertainment (@NiharikaEnt) October 2, 2025 With @NameIsNani anna 🤗❤️#NaniXSujeeth pic.twitter.com/gDBYKZtoD4— Sujeeth (@Sujeethsign) October 2, 2025 -
డైరెక్టర్గా జబర్దస్త్ కమెడియన్.. హీరోగా రాజ్ తరుణ్.. టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న తాజా చిత్రం చిరంజీవ(). ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్.. అదిరే అభి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.ఇవాళ దసరా సందర్భంగా చిరంజీవ టీజర్ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే..మైథలాజికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో హీరో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. ఆంబులెన్స్ డ్రైవర్.. అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో కుషిత హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆహా వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. Chiranjeeva Meter lo chala Matter undhi 🧭#Chiranjeeva Premieres 7th Nov only on #aha#ChiranjeevaOnAha #AnAhaOriginalFilm pic.twitter.com/yknNbBuTGT— ahavideoin (@ahavideoIN) October 2, 2025 -
జూనియర్ ఎన్టీఆర్ దేవర-2.. కొరటాల శివ బిగ్ ప్లాన్!
జూనియర ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర పార్ట్-1. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.దేవర సూపర్ హిట్ కావడంతో పార్ట్-2 కూడా ఉంటుందని కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ కోసం ప్లాన్ రెడీ చేస్తున్నారు. దాదాపు స్క్రిప్ట్ అంతా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవర-2కు సంబంధించిన నెట్టింట ఓ బజ్ నడుస్తోంది. పార్ట్-2 కోసం ఓ పవర్ఫుల్ రోల్ను కొరటాల క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రోల్లో తమిళ స్టార్ శింబును అనుకుంటున్నట్లు లేటేస్ట్ టాక్.అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కథలో బలమైన ప్రభావం చూపించేలా దేవర-2 స్క్రిప్ట్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. శింబు అయితే ఈ పవర్ఫుల్ రోల్కు సెట్ అవుతాడని కొరటాల అతని వైపే మొగ్గు చూపుతున్నారని టాక్. ఈ విషయంపై ప్రస్తుతం అతనితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా దేవర-2 రోల్ కోసం శింబు పేరు తెరపైకి రావడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.Buzz - For #Devara2, Koratala Siva has made significant changes to the script to create a stronger impact....🤞🏼 He has crafted a powerful character in this film...👀 The producer has planned to cast a new actor in this role, and discussions are underway suggesting that Tamil… pic.twitter.com/5kx8QAlQUY— Movie Tamil (@_MovieTamil) September 30, 2025 -
బాలయ్య కామెంట్స్పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. అలా చేయొద్దన్న చిరంజీవి
మెగా అభిమాన సంఘాలకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న ఫ్యాన్స్కు వద్దని వారించారు. అది మన సంస్కారం కాదంటూ అఖిల భారత చిరంజీవి యువతకు సూచించారు. మెగాస్టార్ విజ్ఞప్తితో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్తున్న అభిమానులు విరమించుకున్నారు. ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఫ్యాన్స్.. బాలయ్యపై పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.మెగాస్టార్ వద్దని వారించడంతో తమ ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. అభిమాన సంఘాల విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే అప్రమత్తమై వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. -
ప్రభాస్ డార్లింగ్స్.. 'ది రాజా సాబ్' ట్రైలర్ వచ్చేసింది
ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ ఫిల్మ్ 'ది రాజాసాబ్'. హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అదిరిపోయే ట్వీట్ ఇచ్చారు. ఎన్నో రోజుల వెయింటింగ్కు ఎండ్ కార్డ్ పడేశారు. తాజాగా ది రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ది రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. హారర్ సీన్స్, మొసళ్లతో ఫైట్ రెబల్ స్టార్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఏందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా? అనే డైలాగ్ ట్రైలర్లో హైలెట్గా నిలిచింది. సంజయ్ దత్ విలన్ రోల్ మరింత అగ్రెసివ్గా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాదాపు 3 నిమిషాల 34 సెకన్ల నిడివితో ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
సతీమణికి అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ తనతో ఉన్న ఫోటోలు పంచుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం స్నేహ రెడ్డికి విషెస్ చెబుతున్నారు.ఇక సినిమాల బన్నీ సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రం కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతుంది. ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్ రేంజ్కు తీసుకెళ్లనున్నారు. Happy Birthday Cutie 🖤#AlluSnehaReddy pic.twitter.com/yNlsg72J0x— Allu Arjun (@alluarjun) September 29, 2025 -
పాన్ ఇండియా హీరోగా టాలీవుడ్ కమెడియన్.. ఆసక్తిగా టైటిల్!
జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు లాంటి చిత్రాలతో మెప్పించాడు. తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. తన కెరీర్లో వస్తోన్న ఐదో చిత్రానికి హైలెస్సో అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్తో పాటు పోస్టర్ను రిలీజ్ చేశారు.ఈ మూవీకి కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ నాలుగు భాషల్లోనూ రిలీజ్ చేసిన మూవీ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా హీరోగా మారనున్నారు. With the divine blessings of Gangalamma Thalli, we humbly begin our journey🙏Here's #HaiLesso Motion Poster🔥In Telugu, Tamil, Malayalam & Kannada✨ @Iamnatashasingh @naksha_saran #AksharaGowda @actorsivaji @sivacherry9 #Ravikiran @iamkumarkota @anudeepdev @ChotaKPrasad… pic.twitter.com/1I7DyDkBRI— Sudigali Sudheer (@sudheeranand) September 29, 2025 An arrival of our holy diety in her fierce avatar ❤️🔥@sudheeranand's next #SS5 titled as #HaiLesso 🔥A divine & rooted tale of our culture is coming to thrill you all 🙏💥Shoot begins soon⌛️In Telugu, Tamil, Malayalam & Kannada✨ Directed by @iamkumarkotaProduced by… pic.twitter.com/KtYZR7LyD0— Sudigali Sudheer (@sudheeranand) September 29, 2025 -
తండ్రిగా ఎప్పుడు గర్వపడుతుంటా.. మెగాస్టార్ ట్వీట్
ఒక తండ్రిగా నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటానని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అభినందించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సినీ ప్రయాణం నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనయుడికి విషెస్ తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'చరణ్ బాబు.. 18 ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు' అంటూ పోస్ట్ చేశారు.రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత రిలీజై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మరోవైపు చెర్రీ ప్రస్తుతం పెద్ది అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.చరణ్ బాబు,18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను.నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను… https://t.co/ovp9cINzfq— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025 -
మిరాయ్ టీమ్పై ఐకాన్ స్టార్ ప్రశంసలు
మిరాయ్ (Mirai Movie) మూవీ టీమ్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. తేజ సజ్జా హార్డ్ వర్క్, డెడికేషన్ అద్భుతమని కొనియాడారు. మై బ్రదర్ మంచు మనోజ్ తన ప్రదర్శనతో అదరగొట్టేశాడని అన్నారు. రితికా నాయక్ తన ఫర్మామెన్స్తో అదరగొట్టేసిందని.. శ్రియా, జగపతి బాబు పవర్ఫుల్ రోల్స్లో మెప్పించారని ప్రశంసించారు. మిరాయ్ మూవీ టెక్నికల్గా అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా సీజీ, ఆర్ట్, మిక్సింగ్ టీమ్ వర్క్ గొప్పగా ఉందన్నారు.డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటిక్ విజన్.. కొత్త కమర్షియల్ డైరెక్టర్ను అందించిందని అల్లు అర్జున్ ప్రస్తావించారు. అలాగే ఈ సినిమా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు అభినందనలు తెలిపారు. గ్రేట్ సక్సెస్ సాధించినందుకు మిరాయ్ టీమ్ను ఐకాన్ స్టార్ అభినందించారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తొలి రోజు నుంచే హిట్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.Congratulations to the #MIRAI team! Brilliantly crafted with passion and conviction.Brother @tejasajja123, respect for your hard work and dedication. Huge credit for mounting a film like this.My brother @HeroManoj1, you killed it! Sweet presence by @RitikaNayak_ & powerful… pic.twitter.com/Pt1v02be6r— Allu Arjun (@alluarjun) September 23, 2025 -
మొన్న ట్రైలర్.. నేడు సినిమా.. ఓజీ ఫ్యాన్స్కు మరో బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. మాఫియా నేపథ్యంలోన తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆడియన్స్ను బ్యాడ్న్యూస్. ఓవర్సీస్ అభిమానులకు ప్రత్యంగిరా సినిమాస్ ఊహించని ఝలక్ ఇచ్చింది. ఓజీ తమిళ వర్షన్ నార్త్ అమెరికాలో రిలీజ్ చేయడం లేదని వెల్లడించింది. కేవలం తెలుగు, హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. తమిళంలో రిలీజ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించింది.కంటెంట్ ఆలస్యం కారణంగానే ఓజీ తమిళ వెర్షన్ ఉత్తర అమెరికాలో విడుదల కావడం లేదని తెలిపింది. అయితే తెలుగు, హిందీ వర్షన్లు ముందు అనుకున్న ప్రకారమే నార్త్ అమెరికా అంతటా ప్రదర్శిస్తామని పోస్ట్ చేసింది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నామని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది.కాగా.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ట్రైలర్ అనుకున్న టైమ్కు రిలీజ్ కాలేదు. టైమ్, డేట్ ప్రకటించినా అనుకున్నట్లు విడుదల చేయలేకపోయారు. దీంతో ఓజీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఉత్తర అమెరికాలో తమిళ వర్షన్ రిలీజ్ చేయకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. సకాలంలో కంటెంట్ అందించలేకపోయినా ఓజీ మేకర్స్ ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది.Due to unavoidable content delays, the Tamil version of #TheyCallHimOG will not be releasing in North America. However, the Telugu and Hindi versions will be screened across the region as planned. We sincerely regret the inconvenience and thank you for your understanding and…— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 23, 2025 -
ఇప్పటికే టికెట్ రూ.1000.. ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పవన్ కల్యాణ్ ఓజీ మూవీకి ఏపీ ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా కోసం ప్రత్యేక జీవోను జారీ చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. ముందుగా అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ వేసుకోవచ్చని జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా రిలీజ్కు ముందు రోజే రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలకు ప్రత్యేకంగా అనుమతులు ఇస్తూ జీవోను విడుదల చేసింది.ఒక్కో టికెట్ రూ.1000..ఇప్పటికే బెనిఫిట్ షో టికెట్ ధరను భారీగా పెంచారు. ఏకంగా ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా విడుదల రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్స్లో రూ.125, మల్టీప్లెక్స్ల్లో రూ.150 వసూలు చేసుకోవచ్చని దోపీడికి అవకాశమిచ్చారు. ఓజీ ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఖండించారు.కాగా.. తెలంగాణలోనూ ఓజీ మూవీకి ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.150 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. -
'అసలు పాసులు ఎందుకిచ్చావ్'.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు ఘోర అవమానం!
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నెల 21 భారీస్థాయిలో హైదరాబాద్లోని ఎల్బీ స్డేడియంలో ఓజీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరయ్యారు.అయితే ఎంతో ఆశతో ఈవెంట్కు వచ్చిన పవన్ కల్యాణ్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పాసులు ఉన్న తమను లోపలికి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు స్టేడియం గేటు బయటే వేచి చూశామని అభిమానులు వాపోయారు. మాకు పాసులు ఇచ్చిన లోపలికి పంపకపోవడంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం అంతా ఖాళీగానే ఉందని.. తమను ఎందుకు పంపరని పోలీసులపై మండిపడ్డారు.ఇది బైట ఉన్న Fans పరిస్థితి !🙏🏻What a management of Telangana Police services truly excellent with this worst…#TheyCallHimOG #PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/ixIFG1Z1Dr— Karthikuuu (@Anchor_Karthik_) September 21, 2025 -
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను..!
సినీ రంగంలో స్టార్ అనే హోదా చాలామందికి వస్తుంది. కానీ ఆ గుర్తింపును కెరీర్ మొత్తం కొనసాగించాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇక ఇండస్ట్రీలో మెగాస్టార్ అనిపించుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. మన తెలుగు సినీరంగంలో అలాంటి ఘనత సొంతం చేసుకున్న హీరో ఆయనొక్కరే. మన టాలీవుడ్లో ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయనే మెగాస్టార్. ఆయనే మన కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.చిరంజీవి తన కెరీర్ మొదలుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. 22 సెప్టెంబర్ 1978న ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యానని ట్వీట్ చేశారు. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ ముందు మెగాస్టార్గా నిలబెట్టిందన్నారు. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పోస్ట్ చేశారు.(ఇది చదవండి: హౌస్లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్బాంబ్ వేసిన మనీష్)చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..'22 సెప్టెంబర్ 1978 'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను.. ప్రాణం ఖరీదు.. చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.. మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమే కారణం. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావీ కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ... కృతజ్ఞతలతో మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. మెగాస్టార్గా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర, మనశివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాలు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో తన యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా రాణిస్తున్నారు. ఇవాళ తన తొలి సినిమా పూర్తై 47 ఏళ్లు కావడంతో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.22 సెప్టెంబర్ 1978'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025 -
'మీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'.. ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాగే మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ..' మై డియరెస్ట్ డైరెక్టర్ అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీపై మా ప్రేమ ఎల్లప్పుడు ఉండాలి. ఈ ప్రత్యేక రోజున మీకు ఆనందం, ప్రేమ, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నా. మీరు దర్శకత్వంలో రానున్న సినిమాటిక్ మ్యాజిక్ను అందరూ ఆస్వాదించే వరకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. తొలిసారి అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ ఏఏ22 పేరును ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు అట్లీ ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు.Happy Birthday to my dearest director @Atlee_dir garu. May abundance shower upon you. Wishing you all the joy, love, and prosperity. Can’t wait for everyone to experience the cinematic magic you’re creating 🖤 pic.twitter.com/Sb7S8Bfpmp— Allu Arjun (@alluarjun) September 21, 2025 -
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ.. ఇంటర్నేషనల్ షూట్కు అంతా రెడీ!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో జతకట్టారు. కేజీఎఫ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా లోకేషన్స్ వెతుకుతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చేలా ఈ మూవీని విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అది నిజమేనని ఇవాల్టితో నిజమైంది.తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్కు వెళ్లారు. ప్రశాంత్ నీల్తో సినిమా షూటింగ్ కోసం వీసా అనుమతుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ట్విటర్లో షేర్ చేసింది. యంగ్ టైగర్తో ఉన్న ఫోటోలను పంచుకుంది.అమెరికా కాన్సులేట్కు విచ్చేసిన ఎన్టీఆర్ను స్వాగతించడం అనందంగా ఉందని లారా విలియమ్స్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్లో చిత్రీకరణ.. రాబోయే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం.. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్- నీల్ చిత్రం మూవీ షెడ్యూల్ త్వరలోనే అమెరికాకు షిఫ్ట్ కానుంది.కాగా... ప్రశాంత్ నీల్ కేజీఎఫ్లాగే కోలార్ గోల్డ్ ఫీల్డ్, సలార్లా ఖాన్సార్ ప్రాంతాలు ఉన్నట్లే ఈ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని టాక్. అందుకే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్లో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025 -
రవితేజ వారసుడి కొత్త సినిమా.. మాస్ గ్లింప్స్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న చిత్రం మారెమ్మ. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ఇవాళ మాధవ్ భూపతిరాజు పుట్టినరోజు కావడంతో గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్.తాజా గ్లింప్స్ చూస్తే మాధవ్ మాస్ లుక్లో కనిపించాడు. కబడ్డీ కోర్టులో ఫుల్ మాస్ యాక్షన్ హీరో లుక్లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందిస్తున్నారు. కాగా.. మాధవ్ ఇప్పటికే మిస్టర్ ఇడియన్ అనే చిత్రంలో కనిపించారు. -
ఈ లవ్ స్టోరీ చూసి ఫుల్ ఎంటర్టైన్ అయ్యా: అల్లు అర్జున్ ప్రశంసలు
టాలీవుడ్లో ఇటీవలే విడుదలైన చిన్న సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్ తన మనసును దోచుకుందని ట్వీట్ చేశారు. చాలా సరదాగా నవ్వులు పూయించారని అల్లు అర్జున్ కొనియాడారు. ఈ యంగ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా, వినోదంగా అనిపించిందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు ఐకాన్ స్టార్. డైరెక్టర్ సాయి మార్తాండ్ పనితీరు తనకు నచ్చిందని.. మ్యూజిక్ రిఫ్రెసింగ్గా అనిపించిందని పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని థియేటర్లకు తీసుకువచ్చినందుకు నిర్మాత బన్నీ వాసుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg— Allu Arjun (@alluarjun) September 11, 2025 -
వరుణ్ తేజ్కు పోలాండ్ యువకుడు అభినందనలు.. సోషల్ మీడియాలో వైరల్!
మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్తో పాటు అభిమానులంతా ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత రామ్ చరణ్ సైతం వరుణ్ తేజ్కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.తాజాగా వరుణ్ తేజ్కు పోలాండ్కు చెందిన జాక్ అభినందనలు తెలిపారు. వరుణ్ తేజ్తో కలిసి మిస్టర్ చిత్రంలో నటించానని జాక్ వెల్లడించారు. నా సహనటుడు మిస్టర్ వరుణ్ తేజ్ తండ్రి కావడం గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. మెగా కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ చేశాడు. మిస్టర్ షూటింగ్లో వరుణ్ తేజ్తో ఉన్న ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. పోలాండ్ యువకుడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఈ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది.Congrats to my costar of the Film #Mister @IAmVarunTej on being a proud Father to a baby Boy.May the new Born follow the Legacy and be a product of the iconic Mega family and follow the foot steps of @KChiruTweets, @NagaBabuOffl and #powerstar @pawankalyan and be successful in… pic.twitter.com/eG1KK9VeXl— Zbigniew A C (@ZbigsZach) September 10, 2025 -
జూనియర్ ఎన్టీఆర్తో సినిమా.. మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరో విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది భైరవం మూవీతో మెప్పించిన మనోజ్ మిరాయ్తో అలరించనున్నారు. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ చిత్రంలో విలన్గా అభిమానులను మెప్పించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో తెరకెక్కించిన మిరాయ్ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తన అభిమానులతో ఎక్స్ వేదికగా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆస్క్ బ్లాక్స్వార్డ్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్లో ఫ్యాన్స్ పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఓ అభిమాని నిన్ను, జూనియర్ ఎన్టీఆర్ను తెరపై చూడాలన్న కోరిక ఉందని అడిగాడు. దీనికి మంచు మనోజ్ స్పందిస్తూ..నాది కూడా అదే కోరిక అంటూ రిప్లై ఇచ్చారు.మరో అభిమాని మీరు నంద్యాలకు ఎప్పుడు వస్తారు అన్న అని అడిగాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. మిరాయ్ సెలబ్రేట్ చేసుకునేందుకు వస్తా.. నంద్యాల వైబ్ యే వేరు.. అది మిస్సయితే నా ఇంట్లో నాకు ఫుడ్ కూడా ఉండదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ట్విటర్లో సమాధానాలిచ్చాడు మంచు మనోజ్. కాగా.. మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Nakkuddaaa…♥️♥️♥️ #Tfi 🙏🏼❤️#AskBlackSword #Mirai https://t.co/P3PF1GwCat— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 Joining in to celebrate #Mirai big time!!! 🙌🏼Nandyal vibe ye veru :) ♥️♥️ Miss ayithe, na intilo naku food vundadhu… #AskBlackSword https://t.co/jw2isqn1LC— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 -
కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పటి వరకు హీరోగా అభిమానులను మెప్పించిన ఆయన.. నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. తన డ్రీమ్ను ఇవాళ నేరవేర్చుకున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఓఎంఐ అనే సంస్థను లాంఛ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.శర్వానంద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ..' ఈరోజు నా హృదయానికి దగ్గరైన కల.. ఓఎంఐకి నాంది పలికింది. ఈ దార్శనికతను ప్రారంభించినందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కృతజ్ఞతలు. ఓఎంఐ అనేది సృజనాత్మకత, స్థిరత్వం, మానవ సంబంధాన్ని పెంపొందించడానికి మొదలెట్టిన ఒక వాగ్దానం' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారుఇక సినిమాల విషయానికొస్తే శర్వానంద్ భోగి చిత్రంలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ డింపుల్ హయతి లీడ్ రోల్ చేస్తున్నారు.Today marks the beginning of a dream close to my heart, #OMI 🤍I feel truly honored and grateful to the Former Vice President of India, Shri @MVenkaiahNaidu Garu, for launching this vision.OMI is a promise to nurture creativity, sustainability, and human connection. pic.twitter.com/aoRjamGuMz— Sharwanand (@ImSharwanand) September 9, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చేసింది!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ను కపిల్ కపిలన్ ఆలపించారు. -
డిజే టిల్లు దర్శకుడి కొత్త సినిమా.. హీరోగా ఎవరంటే?
టాలీవుడ్ హీరో రాగ్ మయూర్ మరో సినిమాకు రెడీ అయిపోయారు. డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ డైరెక్షన్లో పని చేయనున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్లో వస్తోన్న ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఈ బ్యానర్లో వస్తోన్న నాలుగో చిత్రం కావడం విశేషం. ఇవాళ నిర్వహించిన పూజా వేడుకలో హీరో రాగ్ మయూర్ పాల్గొన్నారు.మేఘ చిలక స్నేహ, జగ్తియాని క్లాప్ కొట్టగా.. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విమల్ కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు. ఈ చిత్రానికి సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని అందిస్తుంఽగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్, నవీన్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
సింగర్గా రామ్ పోతినేని.. ఆంధ్ర కింగ్ తాలూకా సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే.. రామ్కు జంటగా నటిస్తోంది. ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 28న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని పప్పీ షేమ్ అనే పాటను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ను రామ్నే ఆలపించడం విశేషం. ఆ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించహా.. వివేక్, మెర్విన్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. -
అభిమానులకు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప తర్వాత పాన్ ఇండియా నుంతి పాన్ వరల్డ్ రేంజ్కు ఎదిగిపోయారు. పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ రికార్డ్స్ను షేక్ చేశారు. దేశంలోని అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్కు తెలుగులో మాత్రమే కాదు.. కేరళలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమా వచ్చిందంటే చాలు మలయాళీలు థియేటర్లకు క్యూ కడతారు. అంతలా మాలీవుడ్లోనూ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో మన ఐకాన్ స్టారే.ఇవాళ కేరళలో ప్రతిష్టాత్మక ఓనం పండుగ కావడంతో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. మలయాళీలందరికీ హృదయపూర్వక ఓనం పండుగ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈ పండుగ మీ శ్రేయస్సు, శాంతితో కొత్త ప్రారంభానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. ఇట్లు మీ దత్తపుత్రుడు అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఇది చూసిన మలయాళ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.Heartfelt Onam wishes to all Malayalis!May this Onam mark a new beginning filled with prosperity and peace. 🤍🙏🏽Your adopted son pic.twitter.com/c1EIxyc76S— Allu Arjun (@alluarjun) September 5, 2025 -
దట్ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్.. రికార్డ్ ధరకు అమ్ముడైన ఫోటో!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ది మ్యాన్ ఆఫ్ మాసెస్కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్, దేవర, వార్-2 చిత్రాలతో జూనియర్ వరల్డ్ వైడ్గా క్రేజ్ను సొంతం చేసుకున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్తో కలిసి వార్-2 చిత్రంలో ప్రేక్షకులను అలరించారు. కూలీతో పోటీపడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాతో మన యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.అయితే జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే కాదు.. ఆయన ఫోటోకు కూడా ఇంత క్రేజ్ ఉందని అర్థమైంది. బులా రుబీ అనే పెన్సిల్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను తన టాలెంట్తో ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోటోకు అదిరిపోయే ధర వచ్చింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు చెందిన పెన్సిల్ ఆర్ట్కు ఇంత భారీ ధరకు అమ్ముడవ్వలేదు. తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ట్కు ఏకంగా రూ.1,45,300 రూపాయలు అమ్ముడైంది. ఈ విషయాన్ని ఆర్టిస్ట్ బులా రూబీ ట్విటర్ ద్వారా షేర్ పంచుకుంది.ఎన్టీఆర్ ఆర్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.. నా పెన్సిల్ ఆర్ట్ ఇలా చరిత్ర సృష్టిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈరోజు నా జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైనది. ఈ ఘనతకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు దట్ ఈజ్ ఎన్టీఆర్ క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన టాలెంట్తో ఎన్టీఆర్ ఫోటోను ఆవిష్కరించిన బులా రూబీకి అభినందనలు చెబుతున్నారు.History made! NTR ART ATR 🔥Feeling absolutely speechless… Never in my dreams did I imagine my pencil art would create history. Today, My pencil art of our man of masses @tarak9999 is now the most expensive pencil art of a Telugu actor ever sold !! #JRNTR𓃵 Grateful and… pic.twitter.com/qStUDcw3kT— Buelah Ruby (@buela_ruby) September 2, 2025 -
మళ్లీ తెరపైకి రాజ్ తరుణ్ ఎపిసోడ్.. పోలీసులకు లావణ్య ఫిర్యాదు!
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నార్సింగి పీఎస్లో అతనిపై మరో కేసు నమోదైంది. కోకాపేట విల్లాలో ఉండగా రాజ్తరుణ్ అతని అనుచరులతో దాడి చేశారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్తరుణ్తో పాటు అతని అనుచరులైన మణికంఠ, రాజశేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజపై కేసు నమోదు చేశారు. తనపై మూడు సార్లు దాడి చేశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుతో లావణ్య- రాజ్ తరుణ్ ఎపిసోడ్ టాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది.కాగా.. 2016లో రాజ్ తరుణ్తో కలిసి కోకాపేట్లోని విల్లా కొనుగోలు చేసిన విషయాన్ని కూడా లావణ్య పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని తెలిపారు. అయితే విల్లాలో తాను నివసిస్తున్న సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారని బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
చెఫ్గా మారిన శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్య కామెంట్ చూశారా?
హీరోయిన్ శోభిత ధూలిపాళ్ల గతేడాది అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది. వీరిద్దరి వివాహా వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన శోభిత సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తోన్న శోభిత.. సెట్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇందులో శోభిత వంట చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. వంట చేయడం మనిషి ప్రాథమిక నైపుణ్యమని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన నాగచైతన్య.. తన సతీమణి పోస్ట్కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఈ నైపుణ్యాల రుచిని చూడటానికి వేచి ఉన్నా అంటూ భార్య పోస్ట్కు కామెంట్ చేశాడు చైతూ. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అక్కా.. మీకు వంట కూడా వచ్చా అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
కదల్లేని స్థితిలో టాలీవుడ్ కమెడియన్.. పరామర్శించిన మంచు మనోజ్
'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్లో 100కి పైగా చిత్రాల్లో నటించారు.అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పెరాలసిస్ సోకడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని రామచంద్ర వెల్లడించారు.ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రామచంద్రను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కలిశారు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్య చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతని పరిస్థితిని చూసిన మనోజ్ చలించిపోయారు. సినీ ఇండస్ట్రీ తరఫున తన సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.#ManchuManoj met comedian Ramachandra, who is going through health issues related to paralysis.pic.twitter.com/M84yGNvZoM— Filmy Bowl (@FilmyBowl) September 1, 2025 -
ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ హీరో సిస్టర్.. ఎవరో తెలుసా?
మన చిన్నప్పటి ఫోటోలు దొరకడం చాలా అరుదు. ఈ రోజుల్లో అయితే మన పిల్లల్ని మొబైల్ ఫోన్ బంధిస్తున్నాం కానీ.. 1990ల్లో మాత్రం సెల్ఫోన్ అందుబాటులో లేదు. బాల్యంలో దిగిన ఫోటోలను పెద్దయ్యాక చూసుకుంటే ఎంత బాగుంటుందో. ఆ ఆనందం వేరే లెవెల్. అలా మన చిన్నప్పటి ఫోటోలు ఎవరైనా పంపిస్తే చూసి తెగ మురిసిపోతాం కూడా. అలాగే మనకు ఇష్టమైన వాళ్ల బర్త్డే రోజు చిన్నప్పటి ఫోటోలు పంపితే కలిగే సంతోషమే వేరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.టాలీవుడ్ హీరో సుశాంత్ అనుమోలు.. తాజాగా తన సిస్టర్కు సంగీత అనుమోలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్ డే సిస్టర్ అంటూ ఆమెతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇందులో బాల్యంలో అమ్మా, నాన్నతో తన సిస్టర్ దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు. చాలా అరుదైన చిన్నప్పటి ఫోటోలో సుశాంత్ సిస్టర్ క్యూట్ క్యూట్గా కనిపించింది. ఈ పిక్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ సుశాంత్ సిస్టర్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సుశాంత్ పోస్ట్కు సంగీత కూడా రిప్లై ఇచ్చింది. ఇక హీరో సుశాంత్ విషయానికొస్తే..ఆయన హీరోగా పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్ కుమార్, రాజ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 18 సుశాంత్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించి.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు . ఇందులో ఎక్సార్సిస్ట్ (భూత వైద్యుడు)గా సుశాంత్ కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) -
విడాకులపై క్లారిటీ ఇచ్చిన గౌతమీ.. టాలీవుడ్ హీరోపై భార్య సంచలన ఆరోపణలు..!
-
'ఈ ఒక్క ఏడాదే మిస్సవుతున్నా'.. తనయుడికి టాలీవుడ్ ప్రిన్స్ విషెస్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమ్కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది నీ పుట్టినరోజును మిస్సవుతున్నా అంటూ పోస్ట్ చేశారు. నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుందని ట్విటర్లో రాసుకొచ్చారు. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్.. ఎప్పటికీ ఇలాగే ఎదుగుతూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ గౌతమ్లో చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ తనయుడిపై ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన అభిమానులు సైతం గౌతమ్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.మహేశ్ తన ట్వీట్లో రాస్తూ.. '19 ఏళ్ల నా కుమారుడు.. ప్రతి సంవత్సరం నన్ను కొంచెం ఎక్కువగానే ఆశ్చర్యపరుస్తున్నావ్. ఈ సంవత్సరం నీ పుట్టినరోజు మిస్ అవుతున్నా. నా ప్రేమ నీ ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్... ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ, ఎదుగుతూ ఉండు' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారిగా యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలో పూర్తి చేసుకుంది. ఈ మూవీ కోసం మహేశ్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.Happy 19 my son!! Each year you amaze me a little more… ♥️♥️♥️ Missing your birthday this year, the only one i have ever missed… my love is with you every step of the way….😘😘😘 Always your biggest cheerleader in whatever you do… keep shining and keep growing…🤗🤗🤗 pic.twitter.com/0bV51ZRR8S— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2025 -
బాలయ్యను చూస్తే ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది : తమన్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా బాలయ్య ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్లో బాలయ్య మాస్ యాక్షన్ సీన్స్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ దసరాకు రిలీజ్ కావాల్సిన అఖండను మేకర్స్ వాయిదా వేశారు. కొత్త రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.(ఇది చదవండి: అనుకున్నదే అయింది.. అఖండ-2 వాయిదా.. పవన్ కల్యాణ్ కోసమేనా?)అయితే బాలకృష్ణ సినీ ప్రస్తానం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆయనను సత్కరించింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బాలయ్యపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనను చూస్తే మాటలు రావని.. ఏదో ఒకటి తీసి కొట్టాలని అనిపిస్తుందని అన్నారు. మ్యూజికల్ పరంగా నా చేతుల్లో కొత్తగా కత్తులు, కర్రలు వచ్చేస్తాయి.. ఈ విషయం నాకు కూడా అర్థం కాదన్నారు. అలా ఎందుకు జరుగుతుందో డాక్టర్స్ నా డీఎన్ఏ టెస్ట్ చేయాలని ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలో అఖండ 2 రికార్డులు కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అఖండ -2 సినిమాకు తమన్ సంగీతమందిస్తున్న సంగతి తెలిసిందే. -
టాలీవుడ్ కింగ్.. 65 ఏళ్లు దాటినా యువకుడే.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
టాలీవుడ్ కింగ్ అంటే ఠక్కున ఆయన పేరే గుర్తుకొస్తుంది. ఆయనకు 65 ఏళ్లు దాటినా ఇంకా యువకుడిలానే కనిపించే తెలుగు హీరోల్లో ఓకే ఒక్కడు. హీరోయిన్లకు మన్మధుడిలా గుర్తుండిపోయిన స్టార్ అతనే. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో నవ, యువ మన్మధుడు నాగార్జున అక్కినేని. ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.ఆగస్టు 29న నాగార్జున పుట్టనరోజు కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసింది. కింగ్ నాగ్ నటించిన చిత్రాల్లోని సన్నివేశాలను ఓకే వీడియోలో రూపొందించి రిలీజ్ చేసింది. ఈ వీడియో అక్కినేని ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఇది చూసిన అభిమానులు టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటూ కామెంట్స్ చేస్తున్నారు.నాగార్జున ఇటీవలే రజినీకాంత్ మూవీ కూలీలో కనిపించారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. లోకేశ్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అంతకుముందు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన కుబేర మూవీలో కీలక పాత్రలో నటించారు. He broke the norms with his versatility, ruled hearts with his aura, and redefined style with his unmatched swag. Wishing our timeless King @iamnagarjuna garu, a very Happy Birthday 👑✨-https://t.co/YcYp7fvh5w#HBDKingNagarjuna ❤️🔥 pic.twitter.com/CmVkQmKDrl— Annapurna Studios (@AnnapurnaStdios) August 28, 2025 -
నేరుగా ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
రోహన్, రిదా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "గప్ చుప్ గణేశా". ఈ సినిమాకు సూరి ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్పై కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... "ఈ చిత్రం టైటిల్ చాలా బాగుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. గతంలో కూడా కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్పై రిచ్చిగాడి పెళ్లి అనే చిత్రం హేమ్రాజ్ దర్శకత్వంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చిన్న సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్" అని అన్నారు.చిత్ర నిర్మాత హేమ్రాజ్ మాట్లాడుతూ.. "మా చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంఛ్ చేసిన ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ సార్కు కృతజ్ఞతలు. ఆయన ఎంతో బిజీగా ఉన్న మా కోసం ఆయన సమయాన్ని కేటాయించి మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చినందుకు థాంక్స్" అన్నారు. దర్శకుడు సూరి ఎస్ మాట్లాడుతూ... "మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆయన సమయాన్ని కేటాయించి మాకు అండగా నిలబడిన ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ సార్కు మా చిత్ర బంధం తరఫున ధన్యవాదాలు" అన్నారు.ఇక ట్రైలర్ విషయానికి వస్తే... ఒక వ్యక్తి మొహమాటంతో తన ఉద్యోగాన్ని.. అలాగే తన జీవితంలోకి వచ్చిన ఉన్నత అధికారితో ఎలా మసులుకుంటాడు అనేది ఎంతో ఫన్నీగా ఉండనుందని అర్థమవుతోంది. అతని క్యారెక్టర్ చూస్తే ఎంతోమంది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమాలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా.. అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా పని చేశారు. -
రామ్ చరణ్ పెద్ది.. వెయ్యిమందికి పైగా డ్యాన్సర్స్తో స్పెషల్ సాంగ్
గేమ్ ఛేంజర్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పటికే పెద్ది షాట్ పేరుతో గ్లింప్స్ విడుదల చేయగా మెగా ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కొట్టిన షాట్ అద్భుతమైన క్రేజ్ను దక్కించుకుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ప్రస్తుతం పెద్ది షూటింగ్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతోంది. ఓ స్పెషల్ సాంగ్ను జానీమాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో ఈ స్పెషల్ సాంగ్ను షూట్ చేస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వెయ్యిమందితో చిత్రీకరిస్తోన్న ఈ ప్రత్యేక సాంగ్ పెద్ది మూవీలో హైలెట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్స్టార్ శివ రాజ్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ సినిమా మార్చి 27, 2026న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్లో వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. May Lord Ganesha bring peace, success and positivity into your lives.అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ✨@PeddiMovieOffl pic.twitter.com/DmGpC7wbuZ— Ram Charan (@AlwaysRamCharan) August 27, 2025 -
పుష్ప స్టైల్లో వినాయకుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి నుంచి వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు. ఈ మూవీతో పాన్ వరల్డ్ హీరోగా బన్నీ గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన పుష్ప-2 బాక్సాఫీస్ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక పుష్పరాజ్ మేనరిజంకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.తాజాగా వినాయక చవితి వేడుకల్లో పుష్పరాజ్ స్టైల్లో గణేశున్ని అలంకరించారు. ఎర్రచందనం దుంగల తరహాలో గణేశుని మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మీ అభిమానం సల్లగుండా అంటూ ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. పుష్ప స్టైల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి తమిళనాడులోని హోసురుకు చెందిన ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ దట్ ఈజ్ పుష్ప క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అట్లీ.. బన్నీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై ఐకాన్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonliine_) -
కాబోయే భార్యతో ఈవెంట్కు టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన తాజా చిత్రం సుందరకాండ. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్లో సుందరకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో నారా రోహిత్, మంచు మనోజ్ సందడి చేశారు. మొదటిసారిగా నారా రోహిత్ తన కాబోయే భార్య శిరీషాతో కలిసి ఈవెంట్కు హాజరయ్యారు. తొలిసారి ఈవెంట్లో కాబోయే టాలీవుడ్ జంట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ ఏడాది భైరవం మూవీతో అలరించిన నారా రోహిత్ తనపెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. అయితే నారా రోహిత్, నటి శిరీషాల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్లో జరిగింది. త్వరలో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్లో అకాల మరణం చెందడం వల్ల పెళ్లికి బ్రేకులు పడ్డాయి.'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారిద్దరు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. -
మెగాస్టార్-బాలయ్య కాంబోలో సినిమా.. అనిల్ రావిపూడి ఏం చెప్పారంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చేశారు. బుధవారం విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇవాళ అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చారు. మెగా 157 టైటిల్ను రివీల్ చేశారు. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.ఈ ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రాబోయే రోజుల్లో మెగాస్టార్- బాలయ్యతో కలిసి సినిమా చేస్తారా అని? మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అనిల్ రావిపూడి స్పందించారు. వెంకటేశ్, చిరంజీవితో మన ప్రయాణం మొదలైంది.. బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో చిరంజీవిగారే మైకులో చెప్పారని అనిల్ తెలిపారు. ఇద్దరు కూడా ఎవరికీ వారు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న హీరోలు.. వారికి తగిన కథ సెట్ అయితే తప్పకుండా చేస్తానన్నారు. అలాంటి కథ కుదిరితే ఎవరు చేసినా బాగుంటుందని అనిల్ రావిపూడి అన్నారు. -
'అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబో.. మీ ఊహకు మించి ఉంటుంది'
ఈ రోజు మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి సినిమాల అప్డేట్స్ రావడంతో డబుల్ ఎనర్జీతో పుట్టినరోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ను కూడా రివీల్ చేశారు. టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరు గురించి మాట్లాడారు.చిరంజీవి సినిమాల్లో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు అంటే తనకు చాలా ఇష్టమన్నారు. రీ ఎంట్రీలో చిరంజీవి స్వాగ్ను చూపించాలకున్నట్లు తెలిపారు. చివరగా నాకు ఆ అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి ఉంటుందని అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మీకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తానని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా లేడీ సూపర్స్టార్ నయనతార నటిస్తోంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్లో ప్రజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. -
మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఈ ఏడాది కూడా అక్కడేనా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈనెల 22న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే రెడీ అయిపోయారు. దీంతో ఒక్కరోజు ముందుగానే అభిమానులకు విశ్వంభర బిగ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ చిరు 70వ బర్త్డే మరింత గ్రాండ్గా జరుపుకోనున్నారు.తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం చిరంజీవి ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. తన ఫ్యామిలీతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఎప్పటిలాగే బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో శ్రీజ కూతురు, తన మనవరాలితో మెగాస్టార్ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. చిరువెంట ఆయన భార్య సురేఖతో పాటు చిన్నకూరుతు శ్రీజ సైతం విమానాశ్రయంలో కనిపించారు. ఈ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసనతో పాటు.. వీరి కుమార్తె క్లీంకారా కూడా పాల్గొననున్నారు.ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
సాఫ్ట్వేర్ అమ్మాయి.. రైతుగా అబ్బాయి.. ఈ ప్రేమకథ ట్రైలర్ చూశారా?
శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా నటించిన చిత్రం కన్యాకుమారి. ఈ సినిమాకు సృజన్ అట్టాడ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు.ట్రైలర్ చూస్తే బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ అవ్వాలనుకుంటున్న అమ్మాయి, ఊర్లోనే వ్యవసాయం చేసుకునే అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథే ఈ కన్యాకుమారి. ట్రైలర్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. పక్కా గ్రామీణ ప్రేమకథ కావడంతో ప్రేమికులకు ఫుల్గా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. మాస్ సాంగ్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. రగిలే రగిలే అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట విజయ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
'మా సినిమాకు ఏ అవార్డులు వద్దు.. ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్'
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా ఓ మాల్లో నిర్వహించిన మూవీ ప్రమోషన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడియన్స్ను ఉద్దేశించి ఎమోషనల్గా మాట్లాడారు.మా సినిమా అవార్డులు అక్కర్లేదని.. డబ్బులు వస్తే చాలని అన్నారు. మలయాళ సినిమాలు ఇక్కడ హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ కావాలన్నారు. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయాలని డైరెక్టర్ ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. మీరు ట్వీట్ చేస్తే కనీసం కొంతమంది ప్రేక్షకులైనా మా మూవీ చూస్తారని దర్శకుడు అన్నారు.ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ..'ప్రతి కథ హీరో చుట్టే తిరగాలని లేదు. అనుపమ కూడా పెద్ద స్టార్. నా సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. మా సినిమాకు అవార్డులు వద్దు. డబ్బులు కావాలి. కచ్చితంగా ఈ చిత్రంపై నాకు నమ్మకముంది. ఇక్కడ లేడీ ఓరియంటెడ్ కాదు.. మెన్ ఓరియంటెండ్ కాదు.. ఇది కేవలం సినిమా అంతే. మన దగ్గర మలయాళ చిత్రాలు హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమాలు అక్కడ బ్లాక్బస్టర్ కొట్టాలి. అందుకే మలయాళ నటులను పెట్టాను. సినిమా బాగుంటేనే చూడండి. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్. మీవల్ల ఎంతోమంది మా చిత్రం చూస్తారు.' అని ఆడియన్స్ను కోరారు. కాగా.. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
హీరో అంటే ఇంత పిచ్చేంటి సామీ?.. చేయి కోసుకుని మరి..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ అరంగేట్రం చేసిన తారక్.. అభిమానులను మరోసారి బిగ్ స్క్రీన్పై అలరించాడ. దేవర తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ రోజే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. జూనియర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హల్ చల్ చేశారు.ఓ అభిమాని అయితే ఏకంగా తన రక్తంతో వీరతిలకం దిద్దారు. తన చేతి వేలి రక్తాన్ని ఎన్టీఆర్ పోస్టర్కు తిలకం దిద్దుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అతన్ని చూసి షాకవుతున్నారు. మరి ఇంత పిచ్చేంట్రా సామీ అంటూ విమర్శిస్తున్నారు. ఎంత అభిమానులు ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇవాళ థియేటర్లలో విడుదలైన వార్ -2కు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజినీకాంత్ కూలీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. ఈ మూవీ యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ముగిసిన దగ్గుబాటి రానా ఈడీ విచారణ
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ఈడీ విచారణ ముగిసింది. ఆయనను దాదాపు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులకు రానా అందించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే రానా వెళ్లిపోయారు.కాగా.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా. ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే గతంలోనే హాజరు కావాల్సి ఉండగా.. తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. ఈడీని కాస్త సమయం కోరడంతో ఆగస్టు 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో సోమవారం విచారణకు హాజరై ఈడీ అధికారులకు వివరణ ఇచ్చారు. అలాగే ఈ బుధవారం అంటే 13వ తేదీన మంచు లక్ష్మి హాజరు కావాల్సి ఉంది.ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ని 6 గంటలు విచారించగా, విజయ్ దేవరకొండని అధికారులు 4 గంటల పాటు విచారించారు. -
రవితేజ 'మాస్ జాతర'.. టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ యాక్షన్ థ్రిల్లర్కు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.(ఇది చదవండి: Mass Jathara: ‘ఓలే ఓలే' పాట రిలీజ్.. రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అదుర్స్)కొద్ది రోజుల క్రితమే ఓలే ఓలే అనే మాస్ సాంగ్ను విడుదల చేసిన మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. మాస్ జాతర టీజర్ను ఈనెల 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తామని సితార ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో అభిమానులకు మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. A full meal of MASS 🔥A full heart of ENTERTAINMENT 🤩All served together with #MassJatharaTeaser tomorrow at 11:08 AM ❤️🔥#MassJathara #MassJatharaOnAug27th Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna… pic.twitter.com/9QIbjkvgF0— Sithara Entertainments (@SitharaEnts) August 10, 2025 -
అల్లు అర్జున్ను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. అసలేం జరిగిందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తు పడతారు. పుష్ప తర్వాత బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. మనదేశంతో పాటు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందిప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో బిజీ అయిపోయారు ఐకాన్ స్టార్. ఇటీవలే ముంబయి ట్రిప్కు వెళ్లారు. తన కుటుంబంతో కలిసి వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే ముంబయి ఎయిర్పోర్ట్లో బన్నీకి చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ముఖానికి మాస్క్, అద్దాలు తీసి ఫేస్ చూపించాలని అడిగారు. పక్కనే ఉన్న వ్యక్తిగత సిబ్బంది అల్లు అర్జున్ అని చెప్పినా కూడా వినలేదు. భద్రతా కారణాల దృష్ట్యా నిబంధనల ప్రకారం మొహం చూపించాల్సిందేనని ఎయిర్పోర్ట్ సిబ్బంది అడిగారు. దీంతో బన్నీ వెంటనే మాస్క్, కళ్లద్దాలు తొలగించి ఫేస్ చూపించి లోపలికి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. స్టార్ హీరోలను చూస్తే సెల్ఫీల కోసం జనాలు ఎగబడతారని గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి వెళ్లడం సాధారణమే.. అయినప్పటికీ విమానాశ్రయాల్లో రూల్స్ ఎవరికైనా ఒక్కటే కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.Good & Responsible Gesture From #AlluArjun👏At the airport security check yesterday, Allu Arjun was requested by an officer for a standard face and ID verification. Without a hint of hesitation, he obliged — removing his face covering, presenting his ID, and cooperating fully… pic.twitter.com/8TvJqGt3Zs— cinee worldd (@Cinee_Worldd) August 10, 2025 -
కూలీ సినిమా రిలీజ్.. అక్కినేని ఫ్యాన్స్కు నాగార్జున బిగ్ సర్ప్రైజ్!
అక్కినేని నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. 1990లో రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున సైతం శివ రోజులను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్లో ఒకటిగా నిలుస్తుందని నాన్న చెప్పారని అన్నారు.4కెలో శివ ..అయితే అప్పట్లో సినీ ప్రియులను ఓ రేంజ్లో అలరించిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజైతే ఎలా ఉంటుంది. శివ సినిమాను ఇప్పుడున్న టెక్నాలజీతో మీ ముందుకు తీసుకొస్తే మీ ఫీలింగ్ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే మీ కోసమే నాగార్జున బిగ్ ప్లాన్తో వస్తున్నారు. సరికొత్త టెక్నాలజీతో శివ మూవీ చూసే అవకాశం త్వరలోనే రానుంది. మొట్ట మొదటిసారి అత్యాధునిక 4కె డాల్బీ అట్మాస్ సౌండ్తో ఈ చిత్రాన్ని వీక్షించే ఛాన్స్ అభిమానులకు దక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాగార్జున వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులకు నాగ్ గుడ్ న్యూస్ చెప్పారు.కూలీ థియేటర్లలో ట్రైలర్..అంతే కాకుండా రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ మూవీ రిలీజ్ రోజే నాగార్జున్ ఈ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదే రోజు థియేటర్లలో శివ ట్రైలర్ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దీంతో కూలీ సినిమా చూసే నాగ్ ఫ్యాన్స్కు డబుల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. శివ రీ రిలీజ్ డేట్ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నాగార్జున ట్వీట్ చేశారు. ఇది చూసిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కంగ్రాట్స్ టూ శివ టీమ్ అంటూ పోస్ట్ చేశారు.Hey @iamnagarjuna CONGRATS to #ShivaTeam ,and all your FANS #Shiva4KDolbyAtmos https://t.co/6zfsam7uvr— Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2025 -
జపాన్ భాషలో మాట్లాడిన నాగార్జున, చైతూ.. ఏం చెప్పారంటే?
టాలీవుడ్ సినిమాలకు కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటు మనదేశంలోనూ క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. మనదేశంలో అత్యంత ఆదరణ దక్కించుకుంటోన్న ఇండస్ట్రీలో మన సినిమాలే ముందుంటాయి. ఇక విదేశాల్లోనూ మన చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఇక జపాన్ ప్రజలైతే ఇండియన్ సినిమాలంటే పడి చచ్చిపోతారు. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు అక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే పలు టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు జపాన్లో విడుదల చేశారు. జపాన్కు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఏకంగా తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే మరో టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాన్ని జపాన్లో విడుదలైంది. అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ నటించిన మనం సినిమా జపాన్ థియేటర్లలో సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. జపాన్ ప్రజలను వారి భాషలోనే పలకరిస్తూ మాట్లాడారు. ఈ సినిమా తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. మీకు కూడా ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నామంటూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో నాగ్, చైతూ జపాన్ భాషలో మాట్లాడడం విశేషం.కాగా.. అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ను కవర్ చేస్తూ వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం 'మనం'. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సైతం నటించారు. సమంత, శ్రియా శరణ్ హీరోయిన్లుగా మెప్పించిన ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. గతేడాది పదేళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. దీంతో సమంత-నాగ చైతన్యను బిగ్ స్క్రీన్పై మరోసారి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.The evergreen classic #Manam releasing in Japan on August 8th ❤️🔥Here's the special video byte by King @iamnagarjuna & Yuvasamrat @chay_akkineni to all the audience of Japan #ANRLivesOn pic.twitter.com/Fu5gxBRhx4— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) August 7, 2025 -
క్రికెట్ టీమ్కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్.. వైరలవుతోన్న పెద్ది షాట్!
ఏపీలో క్రికెట్ క్రీడా సమరానికి అంతా సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఏపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ నేటి నుంచే క్రికెట్ ఫ్యాన్స్ను అలరించనుంది. ఈ సందర్భంగా మెగా హీరో ఆ టీమ్కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. విజయవాడ సన్ షైనర్స్ టీమ్కు అల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో పాటు పెద్ది మూవీలోని క్రికెట్ షాట్ను రీ క్రియేట్ చేసిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యంలో విజయవాడ సన్ షైనర్స్ టీమ్ లీగ్లో పాల్గొంటొంది. ఈ సీజన్లో మొత్తం ఏడు జట్లు ఆడనున్నాయి.మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి పెద్ది అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. రూరల్ క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కాగా.. ఈ ఏడాది ఏప్రిల్లో పెద్ది మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయగా.. రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. క్రికెట్లో డిఫరెంట్ షాట్ను అభిమానులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.#APL2025 begins today in the beautiful city of Visakhapatnam.All the best to the teams participating. Sending special wishes to @vjasunshiners owned by the dearest @MythriOfficial Hoping for a cracking tournament.@theacatweets pic.twitter.com/4wtDtvmtXl— Ram Charan (@AlwaysRamCharan) August 8, 2025 -
'ఉండిపోవే నా తోనే బంగారం'.. అలరిస్తోన్న కిష్కింధపురి సాంగ్!
బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కిష్కింధపురి. ఈ మూవీలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ ఏడాది భైరవం తర్వాత బెల్లంకొండ నటిస్తోన్న చిత్రం కావడంతో భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఉండిపోవే నాతోనే బంగారం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ బెల్లంకొండ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా.. జావెద్ అలీ ఆలపించారు. ఈ సాంగ్ను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. -
నువ్వు హీరో ఏంట్రా బాబు అన్నారు: 90s కిడ్స్ ఫేమ్
90s మిడిల్ క్లాస్ బయోపిక్తో ఫేమ్ తెచ్చుకున్న యువకుడు మౌళి తనూజ్ ప్రశాంత్(Mouli Tanuj Prasanth). ప్రస్తుతం ఆ యువకుడే ఏకంగా లీడ్ రోల్తో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాడు. తాను హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం లిటిల్ హార్ట్స్. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే నెల 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగారం ఈ చిత్రంలో హీరోయిన్గా మెప్పించనుంది.తాజాగా ఈ సినిమా నుంచి రాజగాడికి అనే సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మౌళి తనూజ్ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మీరు హీరోనా అని ఎవరైనా మిమ్మల్ని అడిగారా? అన్న ప్రశ్న ఎదురైంది.మౌళీ తనూజ్ మాట్లాడుతూ..' నువ్వు హీరోనా అని అన్నారు. నేను లీడ్ రోల్లో చేస్తున్నా అని రెండేళ్ల క్రితం మా అమ్మకు చెప్తేనే నవ్వింది. మూడేళ్ల క్రితం వీడు హీరోగా చేస్తాడా అనుకుంటారు. ఎందుకు ఒక్కోసారి నేను అనుకుంటా. ఇంటర్ చదివేటప్పుడు విష్ణు, నేను కలిసి మీమ్స్ చేసేవాళ్లం. మూవీ ప్రమోషన్స్ వస్తే వారానికి వంద రూపాయలు వచ్చేవి. అవే మాకు చాలా ఎక్కువ. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, మీమ్స్, రీల్స్ చేస్తూ ఈరోజు ఇక్కడి వచ్చా. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్' అని అన్నారు.కాగా.. ఈ సినిమాను బన్నీవాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎస్.ఎస్.కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతమందిస్తున్నారు. -
కింగ్డమ్ మూవీపై వివాదం.. స్పందించిన నిర్మాణ సంస్థ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం వంద కోట్ల మార్క్కు చేరువలో ఉంది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది.అయితే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై వివాదం మొదలైంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్ శ్రీలంక తమిళులను కించపరిచేలా ఉన్నాయని తమిళ అనుకూల పార్టీ అయిన నామ్ తమిజర్ కట్చి (NTK) కార్యకర్తలు ఆరోపించారు. దీంతో తమిళనాడులోని మధురై, తిరుచ్చిలోని థియేటర్ల వద్ద కింగ్డమ్ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ చిత్రం ప్రదర్శనను నిషేధించాలని వారు పిలుపునిచ్చారు.అయితే తాజాగా ఈ వివాదంపై కింగ్డమ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్పందించింది. ఈ సినిమాలో శ్రీలంక తమిళులను కించపరచలేదని.. తమపై వస్తున్న కథనాలను ఖండించింది. ఈ కథ అంతా కల్పితమని.. నిజ జీవిత సంఘటనలకు సంబంధించినది కాదని నిర్మాతలు తెలిపారు."తమిళ ప్రజల మనోభావాలను మేము గౌరవిస్తున్నాము. పక్క రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో ఎలాంటి సన్నివేశాలు లేవని మేము హామీ ఇస్తున్నాం. ఈ కథ పూర్తిగా కల్పితం. అంతా ఊహజనితమే. ఇదంతా సినిమా డిస్క్లైమర్లోనే ప్రస్తావించాం' సితార ఎంటర్టైన్మెంట్స్ తమ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటే చింతిస్తున్నామని తెలిపింది. మీరు మా సినిమాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. మరోవైపు తమిళనాడులోని సినిమా పంపిణీదారులు పోలీసు రక్షణ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. శ్రీలంక నేపథ్యంలోనే కింగ్డమ్ మూవీని తెరకెక్కించారు.Official statement from Sitara Entertainment about the #Kingdom issue in Tamil Nadu !! pic.twitter.com/Cbx9U5hffV— AmuthaBharathi (@CinemaWithAB) August 6, 2025#Kingdom - banners torn by the members of Naam Tamizhar Katchi to protest bad portrayal of Eelam tamils in the movie ! pic.twitter.com/BYieY0Iszy— Prashanth Rangaswamy (@itisprashanth) August 5, 2025திருப்பூர் ஸ்ரீ திரையரங்கில் ஈழத்தமிழர்களை தவறாக சித்தரிக்கும் கிங்டம் படம் திரையிடக்கூடாதென்று கடிதம் வழங்கப்பட்டது #BanKingdomMovie #Kingdom pic.twitter.com/4hLg8eATAc— NTK IT Wing (@_ITWingNTK) August 6, 2025 -
నాకు మొదటి ఫోన్ గిఫ్ట్ ఇచ్చిందే ఆయనే: ఉదయ భాను
టాలీవుడ్ యాంకర్ ఉదయభాను కేవలం యాంకరింగ్ మాత్రమే కాదు.. నటిగానూ అభిమానులను మెప్పించింది. పలు చిత్రాల్లో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఉదయభాను నటిస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. సత్యరాజ్ కీలక పాత్రలో వస్తోన్న ఈ మూవీలో ఉదయభాను ఛాలెంజింగ్ రోల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు. మెగాస్టార్ బర్త్ డే రోజున అంటే ఆగస్ట్ 22న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రెస్మీట్కు హాజరైన ఉదయభాను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మెగాస్టార్ గురించి కూడా మాట్లాడారు. చిరంజీవికి తానంటే చాలా ఇష్టమని తెలిపారు. నన్ను అభినందించి మొదటి ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది చిరంజీవినే అని ఉదయభాను వెల్లడించారు. ఈ విషయాన్ని తానెప్పుడు చెప్పలేదని అన్నారు. మా సినిమా మెగాస్టార్ బర్త్ డే రోజు విడుదలవ్వడం ఆనందంగా ఉందని ఉదయభాను సంతోషం వ్యక్తం చేశారు.ఇటీవల యాంకర్గా మిమ్మల్ని తొక్కేస్తున్నారని చేసిన కామెంట్స్పై ఉదయభానుకు ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ నేనెప్పుడు నిజాలే మాట్లాడతానని ఉదయభాను అన్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడానికి ఇది సందర్భంగా కాదని తెలిపారు. ఈ విషయంపై ఎవరిని అడిగినా నిజాలే మాట్లాతారని ఉదయభాను అన్నారు.కాగా.. సత్యరాజ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సత్యం రాజేశ్, వశిష్ఠ ఎన్.సింహ, సాంచి రాయ్ కీలకపాత్రల్లో నటించారు. -
అమెరికాలో పుష్ప క్రేజ్.. అల్లు అర్జున్ ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పుష్ప మేనరిజానికి టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. డేవిడ్ వార్నర్ లాంటి ఓవర్సీస్ అభిమానులు కూడా ఉన్నారు. తాజాగా పుష్ప సినిమాను సాంగ్ను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. అమెరికా గాట్ టాలెంట్ డ్యాన్స్ షోలో ఇండియాకు చెందిన బీ యూనిక్ క్రూ పుష్ప సాంగ్కు ఒళ్లు గగుర్పొడ్చేలా ప్రదర్శన ఇచ్చారు. ఇది చూసిన ఆడియన్స్ చూస్తున్నంతసేపు ఆందోళనతో పాటు భయానికి గురయ్యారు.బీ యూనిక్ క్రూ టీమ్ చేసిన సర్ప్రైజ్ ప్రదర్శనకు అక్కడ న్యాయ నిర్ణేతలు సైతం షాకయ్యారు. ఈ వీడియోను పుష్ప టీమ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసి అల్లు అర్జున్ సైతం ఫిదా అయ్యారు. వావ్.. మైండ్ బ్లోయింగ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన ప్రదర్శనను మీరు కూడా చూసేయండి. Wow … Mind Blowing . 🖤 https://t.co/pwVRkSpbqD— Allu Arjun (@alluarjun) August 4, 2025 -
ఫ్రెండ్షిప్ డే స్పెషల్.. స్నేహస్ఫూర్తిని అందించిన తెలుగు పాటలెన్నో...!
స్నేహం అనే భావన మనసులను తాకే అంశం. తెలుగు, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్హిట్ స్నేహగీతాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్మరణీయమయ్యాయి. ఆ పాటలు కేవలం సంగీతానికే కాకుండా, స్నేహ బంధం విలువను గుర్తు చేస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. తెలుగు సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆ సినిమాల్లోని హిట్ పాటలు వింటూ మన చిన్ననాటి స్నేహితులు, ప్రాణ స్నేహితులను గుర్తు చేసుకోకుండా ఉండలేం. అలాంటి కొన్ని పాటల్ని, మన స్నేహితుల్ని స్నేహితుల దినోత్సవం సందర్భంగా...గుర్తు చేసుకుంటూ...స్నేహస్ఫూర్తిని అందించిన తెలుగు పాటలెన్నో...సాక్షాత్తూ అల్లా దిగివచ్చి వరమిస్తా కోరుకో అంటే.. కూడా ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్కనేస్తం చాలంటాను... అంటూ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నవాడు ఎంత సంపన్నుడో వివరిస్తుందీ పాట. 1974లో విడుదలైన నిప్పులాంటి మనిషి సినిమాలోని ‘‘స్నేహమేరా జీవితం’’. పాట ఫరెవర్ ఫ్రెండ్ షిప్ సాంగ్ అని చెప్పాలి. మాధవపెద్ది సత్యం సంగీత దర్శకత్వంలో గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో పాటు గాయకుడు జి. ఆనంద్ కూడా తన గాత్రం జత చేశారు. రచయిత : సి.నా.రె. అక్షరాద్భుతాలు ఆవిష్కరించగా సంగీతదర్శకుడు: రోహిణీ చంద్ర. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడి పోయాడు ఎందుకో ఈనాడు.. అంటూ స్నేహితుడి బాధను పంచుకోవడానికి కులమతాల అడ్డులేదంటూ చాటుతుందీ పాట. సినిమాలో స్నేహితుడైన ఎన్టీయార్ ను ఉద్ధేశిస్తూ లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ ఆవిష్కరించిన పాటాభినయం మరచిపోలేనిది.స్నేహానికన్న మిన్న లోకాన లేదురా...ప్రాణ స్నేహితులు (1988) చిత్రంలోని ఈ పాట స్నేహ బంధానికి సాటిలేని విలువను అందిస్తుంది. తుల తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా... . బంధువులెందరు ఉన్నా, నిజమైన స్నేహానికి సాటిరారనే భావాన్ని పల్లవి – చరణాలలో గొప్పగా ఆవిష్కరిస్తుంది. ‘త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం స్నేహం ... అంటూ స్పష్టం చేస్తుంది. స్నేహం గొప్పతనాన్ని చాటడానికి బహుశా ఇంత కన్నా మంచి పాటను ఎంచుకోలేమేమో...భువన చంద్ర పదాలు, రాజ్కోటి స్వరాలు కూర్చిన ఈ పాటకు గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తన గాత్రంతో జీవం పోశారు. కృష్ణంరాజు, శరత్బాబు, మురళీమోహన్ లు స్నేహితులుగా నటించారు.మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ...స్నేహం అంటే యుక్త వయస్కుల మధ్యే కాదు నడి వయస్కుల మధ్య కూడా ఉంటుంది. వయసుతో పాటే పరిణితి చెందిన ఆ స్నేహ బంధపు గొప్ప తనాన్ని చాటి చెబుతుంది. 1999లో విడుదలైన స్నేహం కోసం చిత్రంలోని మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ పాట. మెగాస్టార్ చిరంజీవి, తమిళ నటుడు విజయ్కుమార్ లు స్నేహితులుగా జీవించిన పాట ఇది. ప్రతీ ఒక్కరికీ అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించేలా ఈ పాటలోని సాహిత్యాన్ని లెజండరీ రైటర్ కీ.శే.సిరివెన్నల సీతారామశాస్త్రి రాయగా గాయకుడు రాజేష్ అద్భుతంగా ఆలపించారు. ఒక్క పాటలో స్నేహం అంటే ఆటలు, పాటలతో పాటు పరస్పర బాధ్యత కూడా అంటూ చూపించడం జరిగింది. స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నీను వీడ అంటూ సాగే ఆ పాటలో..ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు తల్లీ తండ్రినైనా ప్రేమ పంచినా తీరులోన నే నిన్ను మించగలనా ఏ పుణ్యం చేసానో నీ స్నేహం పొందాను నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా? వంటి పదాలు స్నేహ పరిపూర్ణతను చాటుతాయి. ‘ముస్తఫా ముస్తఫా‘ (ప్రేమ దేశం – 1996)..ఏ.ఆర్. రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట బాధ్యతలెరుగని స్నేహ బంధాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తుంది. స్నేహితుల మధ్య ఉన్న సరదాలను, చిలిపి బంధాన్ని వినిపిస్తుంది. ఇప్పటికీ ఈ పాట వినపడని ఫ్రెండ్షిప్ డే వేడుక అరుదే. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వీడిపోనిది ఫ్రెండ్ ఒక్కడే హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే... అంటూ సాగే ఈ పాట నాటి యువ హీరోలు అబ్బాస్, వినీత్ల సాక్షిగా కోడె వయసు కుర్రకారు ఫ్రెండ్ షిప్కి ఇచ్చే విలువను కళ్లకు కడుతుంది.చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో...1989లో విడుదలైన చిన్నారి స్నేహం అనే సినిమాలోని ఈ పాట చదువు ముగించుకుని కెరీర్లు వెదుక్కుంటూ సాగిపోయే దశలో..వీడ్కోలు పలుకుతున్న స్నేహితుల భారమైన హృదయాలకు అద్దం పడుతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కధగానే రాసుకో.మనసైతే మళ్లీ చదువుకో మరుజన్మకైనా కలుసుకో ఏ నాటికి ఏదవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే సాగిపో.. అంటూ ఎవరెక్కడ ఉన్నా చిన్నారి స్నేహాన్ని మాత్రం చిర కాలం నిలుపుకోవాలని కాంక్షిస్తూ సాగే ఈ పాటను వేటూరి సుందరరామ్మూర్తి హృద్యంగా రాయగా చక్రవర్తి అంతే హాౖయెన స్వరాలు సమకూర్చారు. చంద్రమోహన్, రఘు, సీత తదితరులు చిన్నారి స్నేహితులుగా మెప్పిస్తారు. -
సమంత-చైతూ పెళ్లి పీటలెక్కిన సినిమా.. థియేటర్లలో రిలీజ్
అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ను కవర్ చేస్తూ వచ్చిన చిత్రం మనం. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సైతం నటించారు. సమంత హీరోయిన్గా మెప్పించిన ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. గతేడాది పదేళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. దీంతో సమంత-నాగ చైతన్యను బిగ్ స్క్రీన్పై మరోసారి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.తాజాగా అభిమానులకు సామ్-నాగ్ జంటను మళ్లీ బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీని జపాన్లో విడుదల చేయనున్నట్లు నాగచైతన్య ట్వీట్ చేశారు. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న చిత్రం మనం.. ఈ సినిమా జపాన్ ప్రజలకు చేరువవుతుండటం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు. మనం ఆగస్టు 8న థియేటర్లలో విడుదల కానుందని చైతూ వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడియన్స్కు మరోసారి సామ్- చైతన్యను బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం దక్కనుంది.అక్కినేని ఫ్యామిలీ నటించిన ఈ చిత్రం 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో అనుప్ రూబెన్స్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మార్మోగిపోతూనే ఉంటాయి.అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన సమంత- నాగ చైతన్య రియల్ లైఫ్లోనూ పెళ్లి పీటలెక్కారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. గతేడాది డిసెంబర్లో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. ప్రస్తుతం సమంత ఇప్పటి వరకు సింగిల్గానే ఉంటోంది. అయితే బాలీవుడ్ డైరెక్టర్తో రిలేషన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.Thrilled that #Manam a film very close to my heart is making its way to the people of Japan . The film will be releasing on the 8th August in theaters . #Anrliveson #50YearsOfAnnapurnastudios pic.twitter.com/3x6u3XlRVV— chaitanya akkineni (@chay_akkineni) August 3, 2025 -
బబ్లూ పృథ్వీరాజ్ సెకండ్ ఇన్నింగ్స్.. 60 ఏళ్ల వయసులోనూ ఫిట్గానే (ఫోటోలు)
-
తండేల్ సినిమాను తలపించేలా తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా?
తాజాగా కింగ్డమ్ మూవీతో అలరించిన సత్యదేవ్ మరో ఆసక్తికర కంటెంట్తో అభిమానుల ముందుకొస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్కు వీవీ సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తోన్న ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాను తలపించేలా కనిపిస్తోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లోనే ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను పాకిస్తాన్కు బందీలుగా దొరికిపోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆసక్తి పెంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ సిరీస్లో ఆనంది, నాజర్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు.ఇది కేవలం బ్రతకడం గురించి కాదు. మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొకరు అండగా నిలబడతారో చూపిస్తుందని దర్శకుడు సూర్య కుమార్ అన్నారు. సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. నా కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయాణాలలో ఒకటని సత్యదేవ్ అన్నారు. కష్టాలు, త్యాగాల మధ్య చిక్కుకున్న ఒక పాత్రను పోషించడం చాలా సవాల్తో కూడుకున్నదని చెప్పారు. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని,.. అన్యాయంపై పోరాడే మహిళగా నటించడం సంతృప్తినిచ్చిందని హీరోయిన్ ఆనంది తెలిపారు. -
'ఉదయం నుంచి నన్ను ఏడిపించేశారు'.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యూఎస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో కింగ్డమ్ మూవీ అంతా సక్సెస్ సంబురాల్లో మునిగిపోయింది. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి హైదరాబాద్లో సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు.మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైందని విజయ్ దేవరకొండ అన్నారు. మీ సపోర్ట్తో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని తెలిపారు. ఉదయం నుంచి నాకు ఫోన్ చేసి అన్నా... మనం కొట్టినాం అని ఎంతోమంది నన్ను ఏడిపించేశారని ఎమోషనలయ్యారు. మా మేనేజర్ అనురాగ్ సైతం ఏడ్చేశారు. ఈ సినిమా విజయంతో నాకు బిగ్ రిలీఫ్ దక్కింది. నా వెనుక మీరు ఎంతమంది ఉన్నారో చూస్తూనే ఉన్నా.. నా ఫ్యాన్స్ అందరి ప్రేమ, ఆదరణ వెలకట్టలేనిది అన్నారు. యూఎస్ ఫ్యాన్స్ను తప్పకుండా కలుస్తా.. ఆగస్టులో అమెరికాకు వస్తా అని విజయ్ దేవరకొండ వెల్లడించారు. -
నాతో ఒక్క సినిమా చేయమని డైరెక్టర్ను రిక్వెస్ట్ చేశా: సాయి ధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) విరూపాక్ష, బ్రో చిత్రాల తర్వాత గతేడాది మరో మూవీని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీతోనే మెగా హీరో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాం సాయి ధరమ్ తేజ్ కెరీర్లో 18వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.ఇక సినిమా సంగతి పక్కనపెడితే సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) తాజాగా ఓ ఈవెంట్కు హాజరయ్యారు. మయసభ పేరుతో వస్తోన్న తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో ఒక సినిమా చేయాలని మయసభ డైరెక్టర్ దేవా కట్టను రిక్వెస్ట్ చేశానని మెగా హీరో అన్నారు. తన బ్యాడ్ టైమ్లో నాతో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దేవాకట్టా మాత్రమేనని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'దాదాపు 10 ఏళ్ల క్రితమే నా జర్నీ దేవాకట్టాతో స్టార్ట్ అయింది. మేమిద్దరం జిమ్లో కలిసేవాళ్లం. సార్ నాతో ఒక సినిమా చేయండని రిక్వెస్ట్ చేసేవాడిని. అలా చేస్తే చివరికీ రిపబ్లిక్ మూవీతో జతకట్టాం. నా బ్యాడ్ టైమ్లో నాకు వెలుగునిచ్చిన వ్యక్తి దేవాగారు. రిపబ్లిక్ సినిమా టైమ్లో నేను ఏదైతే క్లైమాక్స్ కోరుకున్నానో అదే ముందుకు తీసుకెళ్లారు దేవా కట్టా' అని తెలిపారు.కాగా.. దేవా కట్ట డైరెక్షన్లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మయసభ. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కృష్ణమ నాయుడు, ఎంఎస్ రామిరెడ్డి పాత్రల్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది.A friendship tested by ambition.A rivalry that redefined leadership.A story that changed the fate of a state.#Mayasabha Trailer out now.#Mayasabha – A gripping political saga – Starts streaming from August 7th on @sonyliv@devakatta @AadhiOfficial @IamChaitanyarao pic.twitter.com/ZKMWVxqpei— Sony LIV (@SonyLIV) July 31, 2025 -
ఎవరికోసమో మారను.. నన్ను ఎవరూ వెలేత్తి చూపొద్దు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత కింగ్డమ్పై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయింది. సినిమా రిలీజ్కు ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉండడంతో తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తానెప్పుడు ఎవరికోసమే మారనని.. ఎవరికీ భయపడనని అన్నారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'నేనేప్పుడు లోపల ఏది అనిపిస్తే అదే మాట్లాడతా.. కెరీర్ ప్రారంభంలో అగ్రెసివ్గా ఉన్నా. అప్పుడు నాలో డిఫెన్స్ మెకానిజంతో ఉండేవాన్ని. ఎవరూ నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను అనుకున్నది సాధించాలి. అందుకే కెరీర్ ప్రారంభంలో దూకుడుగా ఉన్నానేమో. మనం సినిమాల్లోనూ చూస్తుంటాం కదా.. హీరో ముందుగా పవర్ఫుల్గా ఉంటాడు. అమ్మ, అమ్మాయి ఎవరో ఒకరి వల్ల తర్వాత సాఫ్ట్ అయిపోతాడు.' అని అన్నారు.ఆ తర్వాత మాట్లాడుతూ..'ఇప్పుడు నా అభిమానుల ప్రేమతో నేను కూడా సాఫ్ట్ అయిపోయా. ఇప్పుడైతే నాకేలాంటి ఫియర్ లేదు. మొదట్లో నాకు కొద్దిగా భయముండేది. ఇప్పుడైతే అలాంటిదేం లేదు. నా చుట్టూ ఉండే వాతావరణం వల్లే అలాంటి ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడైతే ఆడియన్స్ లవ్ వల్ల ఫియర్ పోయి ప్రశాంతంగా ఉన్నా' అని విజయ్ దేవరకొండ తెలిపారు. -
కింగ్డమ్ ఫీవర్.. విజయ్ దేవరకొండ భారీ కటౌట్.. ఎన్ని అడుగులో తెలుసా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా కింగ్డమ్ ఫీవర్ నడుస్తోంది. మాస్ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సారి గట్టిగా కొడుతున్నాం అంటూ ఫ్యాన్స్లో జోష్ నింపారు.ఈ నేపథ్యంలోనే విజయ్ అభిమానులు కింగ్డమ్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. దాదాపు 75 అడుగుల ఎత్తు ఉన్న కటౌట్ను ఫ్యాన్స్ రెడీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.కాగా.. ఇటీవలే ట్రైలర్ లాంఛ్ సందర్భంగా తిరుపతిలో 40 అడుగుల విజయ్ దేవరకొండ కటౌట్ను ఆవిష్కరించారు,. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై బజ్ను మరింత పెంచింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నటులు సత్య దేవ్, వెంకటేష్, అయ్యప్ప శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. 'కింగ్డమ్' జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. MASSive 75ft Biggest @TheDeverakonda Cut-Out at Sudharshan 35MM, RTC X Roads❤️🔥Get Ready to Celebrate #VijayDeverakonda’s Rage in #KINGDOM 💥💥💥 #KingdomOnJuly31st pic.twitter.com/gsR0uRcThc— Vijay Deverakonda Celebrations👑 (@VDCelebrations) July 30, 2025 -
కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విజయ్ దేవరకొండ మదర్ ఎమోషనల్!
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కింగ్డమ్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్కు విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అనిరుధ్ రవిచందర్ కింగ్డమ్ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం విజయ్ కెరీర్లో కచ్చితంగా మైల్ స్టోన్గా నిలుస్తుందని అన్నారు. మీరందరూ సినిమాను ఇష్టపడతారని ఆశిస్తున్నానని అనిరుధ్ మాట్లాడారు. అదే సమయంలో అక్కడే విజయ్ మదర్ మాధవి భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడి చిత్రం సూపర్ హిట్ కావాలని దేవుడిని ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఆ నటుడి ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. రొమాంటిక్ హారర్ కామెడీగా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ సంజయ్ దత్ బర్త్ డే కావడంతో స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆయన 66వ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ పోస్టర్లో సంజయ్ దత్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. దక్షిణాది సినిమాలతో సంజయ్ దత్ బిజీగా ఉన్న సంజయ్ దత్.. బాలీవుడ్లోనూ 'బాఘి 4', 'వెల్కమ్ టు ది జంగిల్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన మరో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్- 2' ఆగస్టు 1 న థియేటర్లలోకి రిలీజ్ కానుంది.Team #TheRajaSaab wishes the Powerhouse and versatile Sanju Baba - @DuttSanjay a very Happy Birthday 💥💥Get ready to witness a terrifying presence that will shake you to the core this Dec 5th in cinemas 🔥🔥#TheRajaSaabOnDec5th#Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi… pic.twitter.com/PFgPzOnqea— The RajaSaab (@rajasaabmovie) July 29, 2025 -
'ఈ సారి మనం గట్టిగా కొడుతున్నాం'.. ఫ్యాన్స్ను తలచుకుని విజయ్ దేవరకొండ ఎమోషనల్
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్విహంచారు. యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సారి మనం గట్టిగా కొడుతున్నాం అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మరో రెండు రోజుల్లో థియేటర్లో కలుస్తాం. ఓవైపు టెన్షన్గా.. మరోవైపు హ్యాపీగా ఉంది. ఈ రోజు సినిమా కంటే మీ అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నా. మీరు దేవుడిచ్చిన వరం. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా మీ ప్రేమలో మార్పు ఉండదు. ఈ రోజు దాదాపు 2000 మంది ఫాన్స్ను కలిశా. అన్నా ఈసారి మనం కొడుతున్నాం అన్నా.. మనం హిట్ కొడుతున్నాం.. టాప్లోకి వెళ్తున్నాం అంటున్నారు. మనం అనే పదం ఓన్ చేసుకుంటేనే వస్తుంది. ఎవరో కుంభమేళాకి వెళ్లి నా పోస్టర్తో మునిగి నేను హిట్ కొట్టాలని కోరుకున్నారు. హిట్ కొట్టిన తర్వాత కచ్చితంగా అతన్ని కలుస్తా. ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు కానీ కానీ.. మీరు గౌరవించే సినిమాలే చేస్తా. వ్యక్తిగతంగా మీ అందరికీ నా వంతుగా ఏదో ఒక మంచి పని చేస్తా. ఈ రెండూ నా బాధ్యతలు' అని ఫ్యాన్స్ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. Trailer వచ్చాక చాలా మంచి Response వచ్చింది...వాళ్ళ DP లు చూస్తే... Superstar... Icon Star...Tiger...మీ అందరినీ నేను కలవకపోవచ్చు కానీ..మీందరికి ఏదొక Positive Contribution చేసే పోతా..#VijayDeverakonda #Kingdom #KingdomOnJuly31st pic.twitter.com/OAGAgfBUWe— Suresh PRO (@SureshPRO_) July 28, 2025 -
క్రైమ్ థ్రిల్లర్గా వరుణ్ సందేశ్ మూవీ.. గ్రాండ్గా ప్రారంభం!
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'వన్ వే టికెట్'. ఈ సినిమాకు ఏ. పళని స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జొరిగే శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన కుష్బూ చౌదరి కనిపించనుంది.తాజాగా ఈ మూవీ గ్రాండ్గా ప్రారంభమైంది. హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాధరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.నక్కిన త్రినాధరావు మాట్లాడుతూ .. ‘మా వరుణ్ సందేశ్ చిత్ర ప్రారంభోత్సవానికి రావడం నాకు ఆనందంగా ఉంది. వరుణ్ సందేశ్ వైభోగం ఒకప్పుడు నేను చాలా చూశా. మా డార్లింగ్ వరుణ్ సందేశ్కు ఓ హిట్ అవ్వాలన్నదే నా కల. ఈ ‘టికెట్’ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.వరుణ్ సందేశ్ మాట్లాడుతూ .. 'వన్ వే టికెట్ టైటిల్ విన్న వెంటనే నాకు కొత్తగా అనిపించింది. పళని చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇందులో కొత్త పాత్రను పోషించబోతోన్నాను. ఈ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా సినిమాకు కార్తీక్ మంచి మెలోడీస్ ఇవ్వబోతోన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నాం' అని అన్నారు. ఈ వన్ వే టికెట్ మూలీ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుందని దర్శకుడు పళని స్వామి తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మనోజ్ నందం, సుధాకర్, రామ్ తిరుపతి ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా కార్తిక్ పనిచేస్తున్నారు. -
కింగ్డమ్పై రష్మిక ట్వీట్.. ముద్దు పేరేంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!
గతేడాది పుష్ప-2తో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఈ ఏడాది కూడా ఛావా మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసింది. వరుస సినిమాలతో రష్మిక దూసుకెళ్తోంది. ఇటీవలే కుబేరా మూవీతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే ఆమె నటించిన ది గర్ల్ఫ్రెండ్ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీలో కనిపించనుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే శ్రీవల్లికి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్పై చాలాసార్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్తో జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్ గురించి చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలోనే రష్మిక.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కింగ్డమ్ ట్రైలర్ను విజయ్ దేవరకొండ పోస్ట్ చేయగా.. ఆ ట్వీట్కు రిప్లై ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఆ రోజు విజయ్ దేవరకొండ ఫైర్ చూడాలని ఉందంటూ పోస్ట్ చేసింది. గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్, విజయ్ దేవరకొండతో పాటు ముగ్గురు జీనియస్లు కలిసి సృష్టించిన చిత్రం కోసం ఎంతో ఆసక్తిగదా ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన విజయ్ దేవరకొండ సైతం రష్మికకు రిప్లై ఇచ్చాడు. రస్సీలు అంటూ లవ్ సింబల్తో పాటు ఎంజాయ్ ది కింగ్డమ్ అని ట్వీట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.Rushhielu ❤️Enjoy this one - #Kingdom 🤗— Vijay Deverakonda (@TheDeverakonda) July 27, 2025 -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ యాక్షన్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.తాజాగా ఈ సినిమా టికెట్ రేట్ల పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. సినిమా విడుదల రోజు నుంచి పది రోజుల వరకు ధరలు పెంచుకోవచ్చని ఆదేశాలిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ల్లో రూ.75 అదనంగా వసూలు చేసేందుకు అనుమతులు జారీ చేసింది. కాగా.. ఈరోజు రిలీజైన పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు భారీగా ధరలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్ల తర్వాత రిలీజైంది. క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ చిత్రం చివరికి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ముగించారు. అభిమానుల భారీగా అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే తొలి రోజు నుంచే ఈ సినిమాకు నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ ఫ్యాన్స్ సైతం సినిమా చూసి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల అంచనాలను అందుకోవడంతో హరిహర వీరమల్లు విఫలమైనట్లు తెలుస్తోంది.అయితే అభిమానుల సంగతి పక్కనపెడితే ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం చేసిన కామెంట్స్ మరింత హాట్టాపిక్గా మారాయి. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ సమాధానమిచ్చారు. హరిహర వీరమల్లు పార్ట్-2 గురించి ప్లాన్ చేస్తున్నారా? అని ఓ ఛానెల్ రిపోర్టర్ నిర్మాతను అడిగారు. దీనికి రత్నం మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్ అయ్యాకే దాని గురించి అలోచిస్తాం అని అన్నారు. ఏఎం రత్నం సమాధానం చూస్తే ఆయనకే ఈ సినిమా హిట్ కావడంపై డౌట్ ఉన్నట్లు అర్థమవుతోంది. తమ చిత్రం సూపర్ హిట్ అవుతుందన్న ఆత్మవిశ్వాసం నిర్మాతకు లేదంటే హరిహర వీరమల్లుకు పెద్ద షాకే. ఇప్పటికే ఫ్యాన్స్ నిరాశలో ఉండడంతో నిర్మాత కామెంట్స్తో హరిహర వీరమల్లు హిట్ కావడంపై ఆశలు ఇక లేనట్లే.కాగా.. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కీలక పాత్ర పోషించారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏంతమేరకు కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాల్సిందే.Appude Guess Cheyalsindi, We did a Mistake pic.twitter.com/b7hGjkbqMi— Shiva Akunuri (@AkunuriShivaa) July 23, 2025 -
టాలీవుడ్ మూవీ షూటింగ్లో ప్రమాదం.. అడివి శేష్, మృణాల్కు గాయాలు!
టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా జరుగుతున్న షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హీరోతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్కు కూడా గాయాలైనట్లు సమాచారం. అయినప్పటికీ ఈ రోజు షూట్ను యథాతథంగా కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అడివి శేష్కు కాలు బాగా వాపు రావడంతో ఆస్పత్రికి వెళ్లనున్నట్లు టాక్.కాగా.. ఇప్పటికే డకాయిట్ మూవీ నుంచి ఫైర్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డకాయిట్ను ప్రేక్షకులమ ముందుకు తీసుకొస్తున్నారు. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. చివరికీ ఈ నెల 31 థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ఇది చదవండి: గమనిక: వైరల్ అవుతున్న 'విజయ్ దేవరకొండ' స్టంట్?)మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కింగ్డమ్ మూవీ ట్రైలర్ తేదీని ప్రకటించారు. ఈ నెల 26న ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. తిరుపతిలో ట్రైలర్ గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఇటీవలే హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ ఫీవర్ సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత కింగ్డమ్ మూవీ ప్రమోషన్లలో పాల్గొనున్నారు. #KINGDOMTrailer is coming. JULY 26th - Tirupati 🙏❤️ pic.twitter.com/a5t3mZukeU— Vijay Deverakonda (@TheDeverakonda) July 22, 2025 Countless prayers One man’s journey!Watch his destiny unfold. Every step towards his #Kingdom 🔥👑#KingdomTrailer - Out on JULY 26! 💥💥Grand Trailer Launch Event at Tirupati! 🤩@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @dopjomon… pic.twitter.com/weHN7vFA5L— Sithara Entertainments (@SitharaEnts) July 22, 2025 -
టాలీవుడ్ చిన్న సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్!
అధర్వ, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మై బేబీ. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి నిర్మించారు. ఈనెల 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.35 లక్షల వసూళ్లు సాధించింది. చిన్న సినిమా అయినా కలెక్షన్లపరంగా ఫర్వాలేదనిపిస్తోంది. మూడు రోజులకే రికార్డు స్థాయిలో వసూళ్లు చేసి చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో అమ్మ ప్రేమ, నాన్న బాధ్యతను చూపే కథగా మంచి పేరు తెచ్చుకుంది. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం మరోసారి రుజువైంది. ఇంతటి గొప్ప విజయం ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు చిత్రయూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. -
మహేశ్బాబుకు అతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది: ప్రముఖ ఎయిర్లైన్స్ పోస్ట్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. తొలిసారి దర్శకధీరుడు రాజమౌళితో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీని ఒడిశాలోని అందమైన లోకేషన్స్లో మొదటి షెడ్యూల్ను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీని ఎస్ఎస్ఎమ్బీ 29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు.అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా విరామం లభించడంతో ప్రిన్స్ విదేశాల్లో చిల్ అవుతున్నారు. మన ప్రిన్స్ తరచుగా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్లకు వెళ్తుంటారు. ఇటీవల మహేశ్ బాబు శ్రీలంక ట్రిప్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోను ఏకంగా శ్రీలంక ఎయిర్లైన్స్ తమ ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దక్షిణ భారత సినీ స్టార్ హీరో మహేష్ బాబును ఆహ్వానించడం మాకు, మా సిబ్బందికి ఆనందంగా ఉందంటూ మహేశ్బాబుతో సెల్పీ దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇంత గొప్ప అతిథిని మా విమానంలోకి ఆతిథ్యం ఇచ్చినందుకు మా సిబ్బంది ఎంతో సంతోషించారని తెలిపింది. మాతో పాటు శ్రీలంకకు ప్రయాణించినందుకు మహేశ్బాబుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో దట్ ఈజ్ ప్రిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.We had the pleasure of welcoming South Indian cinema icon Mahesh Babu on his journey from Hyderabad to Colombo with SriLankan Airlines!Our crew was delighted to host such a celebrated guest onboard.Thank you for flying with us.@urstrulyMahesh #SriLankanAirlines… pic.twitter.com/44euwfcfCB— SriLankan Airlines (@flysrilankan) July 21, 2025 -
మరో ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ఈ ఏడాది వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే ఎలెవన్, బ్లైండ్ స్పాట్ లాంటి థ్రిల్లర్ సినిమాలతో మెప్పించారు. ఆ తర్వాత నవీన్ చంద్ర నటించిన మరో చిత్రం 'షో టైమ్'. ఈ మూవీ జూలై 4న థియేటర్లలో రిలీజైంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దీంతో ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూలై 25 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.అయితే ఈ మూవీని మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు హీరో నవీన్ చంద్ర తెలిపారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుందని ఓ పోస్టర్ను పంచుకున్నారు. అయితే స్ట్రీమింగ్ డేట్ను మాత్రం రివీల్ చేయలేదు. ఈ ప్రకటనతో షో టైమ్ రెండు ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది. సన్ నెక్స్ట్తో పాటు అమెజాన్ ప్రైమ్లోనూ స్ట్రీమింగ్ కానుంది.షో టైమ్ అసలు కథేంటంటే..'షో టైమ్' విషయానికొస్తే.. ఓ ఇంటిలో రాత్రి 11 గంటలప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా అక్కడికి వచ్చిన సీఐ లక్ష్మీకాంత్(రాజా రవీంద్ర).. అర్థరాత్రి న్యూసెన్స్ ఏంటని వార్నింగ్ ఇస్తాడు. దీంతో సూర్య(నవీన్ చంద్ర), శాంతి(కామాక్షి).. సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడుతున్న టైంలో ఓ సంఘటన జరుగుతుంది. స్టోరీ మలుపు తిరుగుతుంది. సూర్య-శాంతి ఓ కేసులో ఇరుక్కుంటారు. దీని నుంచి ఎలా బయడపడ్డారు. వీళ్లకు లాయర్ వరదరాజులు(వీకే నరేశ్) ఎలాంటి సాయం చేశాడనేదే మిగతా స్టోరీ.When the truth is too dangerous to reveal, how long can you keep running?#ShowTime, coming soon on Amazon Prime. @PrimeVideoIN#ShowTime #KamakshiBhaskarla @ItsActorNaresh @Rajaraveendar @AnilSunkara1 @kishore_Atv @aruvimadhan #ShekarChandra @sarath_edit @cinemakaran_dop… pic.twitter.com/Ptd0ilnxPG— Actor Naveen Chandra (@Naveenc212) July 21, 2025 -
సీఈవోగా ప్రభాస్.. హెచ్ఆర్గా అనుష్క.. సోషల్ మీడియాలో వైరల్!
సోషల్ మీడియా వచ్చాక ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతున్నారో అర్థం కావట్లేదు. కొందరు ఫేమస్ అవుతుంటే.. మరికొందరు ఊహించని విధంగా బుక్కైపోతున్నారు. తాజాగా లండన్లో ఓ కంపెనీ సీఈవో అండ్ హెచ్ఆర్ చీఫ్ ఓ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరయ్యారు. వీరిద్దరు అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో నెట్టింట తెగ వైరలైంది. దీంతో ఆ కంపెనీ సీఈవో ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాతో ఫేమస్ అవ్వడం మాత్రమే కాదు.. ఉద్యోగం కూడా ఊడుతుందన్న సంగతి తెలిసొచ్చింది.అయితే ఈ సీన్తో లింక్ చేస్తూ బాహుబలి టీమ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. మాహిస్మతి రాజ్యానికి సీఈవో అండ్ హెచ్ఆర్ అంటూ ప్రభాస్, అనుష్క పోస్టర్ను పోస్ట్ చేసింది. ఇందులో ప్రభాస్- అనుష్క అచ్చం కోల్డ్ ప్లే కన్సర్ట్లో చేసిన స్టైల్లోనే ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కోల్డ్ప్లే కన్సర్ట్ వర్సెస్ భల్లాలదేవా కన్సర్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కెమెరామెన్ కట్టప్ప అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అసలేం జరిగిందంటే..ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ లో తన సహోద్యోగినితో సన్నిహితంగా మెలుగుతూ.. ముద్దు పెట్టుకొన్న వీడియో వైరల్ కావడంతో ఆయన ఏకంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో ఆండీ బైరోన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ క్యాబెట్ను కౌగిలించుకుని మసాచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని గిల్లెట్ స్టేడియంలో వీళ్లిద్దరు కెమెరాలకు చిక్కారు. ఆ వెంటనే నాలుక్కరుచుకొని ఇద్దరు విడిపోయి దాక్కొన్నారు. దీంతో కోల్డ్ప్లే క్రిస్ మార్టిన్ ‘‘వారు అఫైర్లో అయినా ఉండి ఉండాలి.. లేదా సిగ్గుతో దాక్కొని ఉండాలి’’ అంటూ కామెంట్ చేయడంతో అది మరింత వైరల్గా మారింది.ఈ వ్యవహారం కంపెనీకి తలవంపులుగా మారింది. దీంతో సీఈవో ఆండీ బైరోన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించింది. ఈ విషయం వైరల్ కావడంతో ఆస్ట్రానమర్ కంపెనీ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆండీ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లింక్డిన్లో ఆ కంపెనీ ఒక పోస్టు ద్వారా తెలియజేసింది.కాగా.. క్రిస్ట్రిన్ క్యాబెట్కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. ఆండీ బైరోన్కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్ కెరిగన్ బైరోన్.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే ఆండీ వీడియో వైరల్ కావడంతో ఆ కాపురంలోనూ కలతలు చెలరేగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. View this post on Instagram A post shared by Baahubali (@baahubalimovie) -
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబో.. అప్పుడే లీక్ చేశారుగా!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం రిలీజ్ కాలేదు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల కావొచ్చని టాక్ వినిపిస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే చిరంజీవి విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో మూవీ రానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించనుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ఓ సీన్ షూట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నీటిలో పడవపై మెగాస్టార్, నయనతార కూర్చుని ఉండగా.. పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట లీక్ కావడంతో హల్చల్ చేస్తోంది. కేరళలోని అలప్పుజలో చిరంజీవి, నయనతారలపై పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమాను మెగా157 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. -
హీరో రానా మెచ్చిన టాప్-5 సినిమాలు.. ఒక్క తెలుగు సినిమా లేదుగా!
టాలీవుడ్ హీరో రానా ఈ ఏడాదిలో రానా నాయుడు వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. వెంకటేశ్- రానా కాంబోలో వచ్చిన ఈ సిరీస్కు మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా రానా సమర్పణలో వస్తోన్న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 18న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రానాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ ఫేవరేట్ సినిమాల్లో టాప్-5 ఏంటని యాంకర్ రానాను అడిగింది. ఈ ప్రశ్నకు రానా తనకిష్టమైన చిత్రాల పేర్లను వెల్లడించారు. మొదటిది స్టార్ వార్స్ అని.. ఆ తర్వాత కమల్ హాసన్ నాయకన్, స్కార్ఫేస్, గ్లాడియేటర్, లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బారెల్స్ అని హాలీవుడ్ సినిమాల పేర్లను ప్రస్తావించారు. అయితే టాప్-5లో ఒక్క తెలుగు మూవీ కూడా లేకపోవడం విశేషం. రానా చెప్పిన సినిమాల్లో కోలీవుడ్ హీరో కమల్ హాసన్ మూవీ ఉండడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రానా కూడా కమల్ హాసన్ అభిమాని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. #RanaDaggubati and #PraveenaParuchuriShare their #imdb top 5 listIn Rana's list just one Indian film that is #Nayakan Even in Praveena's list Nayakan is thereJust Aandavar admiration things ❤️#KamalHaasan#ManiRatnam#KothapalliloOnJuly18pic.twitter.com/fZxzHei0SK— Kamal Abimaani (@Kamalabimaani1) July 17, 2025 -
బాలకృష్ణ స్క్విడ్ గేమ్ ఆడితే.. ఎలా ఉంటుందో చూశారా?
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్ అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఈ గేమ్ సిరీస్కు ఓటీటీ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతలా ఆకట్టుకున్న ఈ వెబ్ సిరిస్లో మన తెలుగు తారలు నటిస్తే ఎలా ఉంటుంది. ఒకసారి మీరే ఉహించుకోండి. అలా అనుకుని ఏఐతో క్రియేట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మన టాలీవుడ్ సినీతారలు స్క్విడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో ఊహించుకుని చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో బాలకృష్ణ, అనసూయ, రాజీవ్ కనకాలను చూపించారు. ఈ వీడియో చూస్తే ఫన్నీగా ఉండడంతో తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ వీడియోలో బాలయ్య నటిస్తోన్న అఖండ-2 చిత్రంలోని ఫైట్ సీన్ను కూడా రీ క్రియేట్ చేశారు. అందరినీ బాలయ్య ఒక్క దెబ్బకు పైకి విసిరేయడం చూస్తే బాలయ్య సినిమాల్లో పైట్ సీన్ను గుర్తుకు తెచ్చింది. కాగా.. ఇప్పటికే పలువురు తారలపై ఇలాంటి ఏఐ వీడియోలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. స్క్విడ్గేమ్లో హీరో నంబర్ 456.. ఏఐ వీడియోలో కూడా బాలకృష్ణ ప్లేయర్ నెం.456గా కనిపించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ సరదా వీడియో మీరు కూడా చూసేయండి.pic.twitter.com/gmR5ALIZmR— Out of Context Telugu (@OutOfContextTel) July 17, 2025 -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ ఈ నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా అన్నదమ్ముల ఎమోషనల్ సాంగ్ను విడుదల చేశారు.ఈ సినిమాలో విజయ్, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించారు. ఈ ఇద్దరి అనుబంధం నేపథ్యంతో రూపొందిన అన్నా అంటూనే అనే సాంగ్ను రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అనిరుధ్ ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. -
'కట్టప్ప బాహుబలిని చంపకపోయుంటే?'.. రానా అదిరిపోయే రిప్లై!
తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన దర్శదధీరుడు రాజమౌళిదే. ఆయన డైరెక్షన్లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు ప్రపంచస్థాయిలో మనసత్తా చాటాయి. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్ గెలుపుతో మరోసారి వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా పేరు వినిపించేలా చేసింది. ఇంత ఘనత తీసుకొచ్చిన రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’(Baahubali: The Epic) పేరుతో మరోసారి రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల రాబోతుందని రాజమౌళి ప్రకటించారు. కాగా.. బాహుబలి చిత్రంలో ప్రభాస్తో పాటు రానా కీలక పాత్రలో కనిపించారు.అయితే తాజాగా బాహుబలి టీమ్ ప్రశ్నకు హీరో రానా ఇచ్చిన సమాధానం నెట్టింట తెగ వైరలవుతోంది. ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగి ఉండేదని ట్విటర్ వేదికగా టీమ్ ప్రశ్నించింది. ఇది చూసిన హీరో రానా స్పందించాడు. కట్టప్ప ఆ పని చేయకపోతే.. నేను బాహుబలిని చంపేసేవాడినని రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ భళ్లాల దేవ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.బాహుబలి విషయానికొస్తే.. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం లిభాగం 2015 జులై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజై తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది. బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.I would have killed him instead 😡🥂 https://t.co/8oe6qUZP9l— Rana Daggubati (@RanaDaggubati) July 16, 2025 -
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కెమియో రోల్.. ఎందుకు చేశానంటే: సిద్ధార్థ్
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే 3బీహెచ్కే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. శ్రీ గణేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ఫర్వాలేదనిపించింది. ఈ మూవీలో మీతా రఘునాథ్ హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రల్లో మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధార్థ్ తెలుగు సినిమాలో కెమియో రోల్ చేయడంపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా మూవీలో మీరెందుకు ఆ రోల్ చేయాల్సి వచ్చిందని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన ఫ్రెండ్ అడగడంతోనే ఆ రోల్ చేశానని సిద్దార్థ్ తెలిపారు. ఏంటండి ఇలా అడిగారు.. ఎన్టీఆర్ సినిమాలో ఒక ఫ్రెండ్ అడిగితే ఐదు నిమిషాల రోల్ చేశా.. ఆ రోల్ చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. అంత పెద్ద హీరో, పెద్ద సినిమాలో.. అది కూడా నా క్యారెక్టర్ పేరు సిద్ధు అని పెడితే ఎందుకు చేయకుండా ఉంటామని బదులిచ్చారు.కాగా.. తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఫేమస్ అయిన సిద్ధార్థ్ టాలీవుడ్లో నటించారు. ఆ తర్వాత కోలీవుడ్లో చాలా చిత్రాల్లో హీరోగా చేశారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్లోనూ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఆ సాంగ్ ప్రోమో వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. ఈనెల 25న విడుదల కావాల్సినా ఈ చిత్రం వారం రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో ఈ నెలాఖర్లో అంటే జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీలోని అన్నా అంటూనే సాగే ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ పాటను కృష్ణకాంత్ రాయగా.. అనిరుధ్ ఆలపించారు. కాగా.. ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
వారి కష్టాలు, బాధలు చాలా దగ్గరగా చూశా: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
కోలీవుడ్ సినిమా షూటింగ్లో స్టంట్ మ్యాన్ రాజు మృతిపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విచారం వ్యక్తం చేశారు. అలాంటి వారి బాధలను తాను చాలా దగ్గరగా చూశానని మనోజ్ తన బాధను వ్యక్తం చేశారు. వెట్టువం మూవీ సెట్లో స్టంట్ లెజెండ్ ఎస్.ఎం.రాజు (మోహన్రాజ్) మరణించిన విషయం నాకు ఇప్పుడే తెలిసిందని ట్వీట్ చేశారు. స్టంట్మ్యాన్ కుటుంబానికి మద్దతుగా ఉంటానని.. ఇలాంంటి విషాద సమయంలో మన పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరుతున్నానంటూ పోస్ట్ చేశారు.మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..'మూవీ సెట్లో స్టంట్ లెజెండ్ ఎస్.ఎం.రాజు (మోహన్రాజ్) విషాదకరంగా మరణించిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. గాయాలు జరిగినప్పుడు, ప్రాణాలు పోయినప్పుడు స్టంట్ పెర్ఫార్మర్లు, వారిని ప్రేమించేవారు ఎలాంటి బాధను అనుభవిస్తారో నేను దగ్గరగా చూశా. ఒక స్టంట్మ్యాన్గా వారి కుటుంబానికి మద్దతుగా మన పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ నిలబడాలని కోరుతున్నా. మన పనిలో ఉండటం మనకు, మన కుటుంబాలకు అంత సులభం కాదు. మన పరిశ్రమ ధైర్యాన్నిస్తుంది. కానీ ధైర్యం ఎప్పుడూ మన భద్రతను కాపాడలేదు. ప్రతి మూవీ సెట్లో శిక్షణ, భీమా, జవాబుదారీతనం, బలమైన ప్రోటోకాల్ను యూనియన్లు అమలు చేయాలి. రాజు ప్రాణ త్యాగం మనకు మేల్కొలుపులాంటిది. మన హీరోలను, వారి కుటుంబాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. స్టంట్ మ్యాన్ రాజు మృతిపై కోలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ తెలిపారు.I just learned about the tragic loss of stunt legend SM Raju garu (Mohanraj) on the Vettuvam set. My deepest condolences to his family. I’ve seen up close how stunt performers and their loved ones suffer when injuries happen and lives are too often forgotten. As a fellow… pic.twitter.com/AvjG1t8PHD— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 14, 2025 -
టాలీవుడ్లో నెపోటిజం.. ఇక్కడ పనిచేయవు.. ఆ హీరోకు మంచు మనోజ్ కౌంటరిచ్చాడా!
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం నెపోటిజం. ఈ పదం ఇటీవల సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పదానిరి అర్థం మరి సింపుల్గా చెప్పాలంటే.. తన కుటుంబం బ్యాక్గ్రౌండ్ అండతో స్టార్గా ఎదగడమే. ఒక రకంగా బంధుప్రీతి అన్నమాట. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు అలానే వచ్చినప్పటికీ.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. అలా ఎదిగిన వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. అయితే తాజాగా నెపోటిజంపై హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.సుహాస్ హీరోగా వస్తోన్న ఓ భామ అయ్యో రామా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మంచు మనోజ్ మాట్లాడారు. యూట్యూబ్తో కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదని సుహాస్పై ప్రశంసలు కురిపించారు. తాను కూడా నెపో కిడ్నే అని.. కానీ టీమ్ అంతా కష్టపడితేనే మూవీ సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడారు. దీనికి కౌంటర్గానే మంచు మనోజ్ మాట్లాడి ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ)మంచు మనోజ్ మాట్లాడుతూ..'నేను కూడా నెప్టో కిడ్నే. అయితే ఇక్కడ ఆ పప్పులేం ఉడకవు. బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే సినిమాల్లో వస్తారంటే అది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. నేను కూడా అలానే వచ్చా. నెప్టో కిడ్గా చెబుతున్నా.. ఇక్కడ అలాంటివి పనిచేయవు. ఎవరైనా దేకాల్సిందే. ఒక సినిమా సక్సెస్ అనేది.. పెద్ద స్టార్ చేశారా? ఎంత డబ్బు అనేది ముఖ్యం కాదు.. సినిమా ఎప్పటికీ సినిమానే. మనస్ఫూర్తిగా మనం కష్టపడి పనిచేస్తే సినిమా సక్సెస్ అవుతుంది.' అని అన్నారు. కాగా.. మాళవికా మనోజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను రామ్ గోదాల డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది.🚨#ManchuManoj latest 💥pic.twitter.com/xXf7hb0M9N— Tollywood Movies ✨ (@TollyMovies4u) July 8, 2025 -
ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. జూలై 25న రావాల్సిన కింగ్డమ్ మరో ఆలస్యంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెలాఖర్లో బిగ్ స్క్రీన్పై కింగ్డమ్ రిలీజ్ కానుంది. ఓ స్పెషల్ వీడియోతో కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్క్రిప్ట్ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటున్నట్లు వెల్లడించారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో మనకు ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఈ స్క్రిప్ట్ బాగాలేదు.. ఈ సినిమా నేను చేయను.. అని ముక్కుసూటిగా చెప్పలేం. గతంలో నాకు ఇంత ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అదే ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న నటుడికే అవకాశం వస్తే.. ఆ స్క్రిప్ట్ను చేయనని ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఆ తర్వాత అతని తండ్రి వచ్చి మరో మూడు, నాలుగు నెలలు ఆగండి. వీలైతే ఎక్కువమంది రైటర్లను తీసుకొస్తానని అంటాడు. నేనైతే ఇటీవల స్క్రిప్ట్ల విషయంలో కాస్త కఠినంగానే ఉంటున్నా. నా దగ్గరకు వచ్చిన దర్శకులతో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాకు డబ్బుతో పాటు కెరీర్ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చేసేదానితో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నా. స్క్రిప్ట్తో ఓకే అనిపించిన తర్వాతే ముందుకు వెళ్తున్నా' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిటారు. ఈ యాక్షన్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
బాక్సాఫీస్ బరిలో దీర్ఘాయుష్మాన్ భవ.. రిలీజ్ డేట్ ఫిక్స్
కార్తీక్రాజు, నోయల్ ,మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం "దీర్ఘాయుష్మాన్ భవ". ఈ సినిమాకు ఎం.పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం ట్రైలర్, పాటలను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..'కొత్త నిర్మాతలకు చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అయితే కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమ మీద కనీసం ఒక ఏడాది పాటు అవగాహన పెంచుకుని వస్తే బాగుంటుంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ తరపున మేము ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. పెద్ద, చిన్న సినిమాల సమస్యలు, సాధ్యాసాధ్యాల గురించి ఛాంబర్లో చర్చించబోతున్నాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, మంచి అభిరుచితో, మంచి కాంబినేషన్ ఆర్టిస్టులతో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తోంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా" అని అన్నారు.నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. "చిన్న సినిమాల సమస్యలను తీర్చేందుకు ఇటు పరిశ్రమ, అటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. మల్టీ ఫ్లెక్స్ల్లో పేదవాడు సినిమా చూసే విధంగా ఆక్యుపెన్సీలో 20 శాతం టిక్కెట్ రేట్లను 75 రూపాయలుగా నిర్ణయించాలి. ఫామిలీ అంతా కూర్చుని హాయిగా చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది" అని అన్నారు. చిత్ర దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ.. "ఫ్యామిలీ ప్యాక్ చిత్రమిది. అందరినీ ఆహ్లదపరిచే కామెడీ, ఉంది. సోసియో ఫాంటసీగా దీనిని మలిచాం" అని తెలిపారు. ఈ చిత్రంలో ఆమని, కాశీ విశ్వనాధ్, పృథ్వీరాజ్, సత్యం రాజేష్, గెటప్ శ్రీను , తాగుబోతు రమేష్, జె మిని సురేష్, నోయల్, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వినోద్ సంగీతమందించారు. ఈ చిత్రం ఈనెల 11న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. -
'రామ్చరణ్ ఒప్పుకోకుంటే సినిమా రిలీజ్ అయ్యేది కాదు'.. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి
మెగా హీరో రామ్ చరణ్ వివాదంపై దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. గేమ్ ఛేంజర్ కోసం చరణ్ మాకు పూర్తిగా సహకరించారని తెలిపారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని విడుదల చేయమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదంగా మారడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..'మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్వీసీ సంస్థకు, రామ్ చరణ్కు అవినాభావ సంభంధం ఉంది. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైనా చిన్న మాట దొర్లినా రామ్ చరణ్కు, అభిమానులకు నా క్షమాపణలు. నేను అన్న ఉద్దేశం కాదు. మాకు మెగా హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి వాళ్లను నేను అవమానించేంత ముర్ఖుణ్ణి కాదు. రామ్ చరణ్ వల్లే సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశాం. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు అంటాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చేలా ప్రవర్తించకండి. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కావడం వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి. త్వరలోనే రామ్ చరణ్తో మరో సినిమా చేయబోతున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025 -
డకాయిట్ నుంచి శృతి హాసన్ అవుట్.. కారణం అదేనన్న అడివి శేష్!
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న తాజా డగాయిట్. క్షణం, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్గా పనిచేసిన షానీల్ డియో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్ సరసన హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు.అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ను ఎంపిక చేశారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఆమె తప్పుకోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ను ఎంచుకున్నారు. తాజాగా శృతి హాసన్ మూవీ తప్పుకోవడంపై అడివి శేష్ స్పందించారు. శృతిహాసన్తో తనకు విభేదాలు తలెత్తాయని వచ్చిన రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)డకాయిట్ నుంచి శృతిహాసన్ తప్పుకోవడంపై ఎలాంటి వివాదం లేదని అడివి శేష్ అన్నారు. మా ఇద్దరి మధ్య విభేదాల వల్లే తాను తప్పుకుందని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇక్కడ ప్రధానంగా వర్కింగ్ స్టైల్ కుదరక పోవడం వల్లే తాను తప్పుకుందని తెలిపారు. అంతేకాకుండా శృతిహాసన్ కూలీ మూవీతో బిజీగా ఉన్నారని శేష్ తెలిపారు.అడివి శేష్ మాట్లాడుతూ..'కూలీతో ఆమె బిజీగా ఉన్నారు. సినిమా చేయడానికి నాకు చాలా టైమ్ పడుతుంది. ఆ ప్రాసెస్లో నాకు సింక్ అవ్వాలి. అంతే తప్ప ఇందులో ఎలాంటి వివాదం లేదు. మృణాల్ స్క్రిప్ట్ వినగానే ఓకే చెప్పారు. పది గంటలకు కథ చెప్పగానే.. మధ్యాహ్నం ఒంటిగంటకే ఓకే చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అరవై శాతం పూర్తయింది' అని పంచుకున్నారు. కాగా.. డకాయిట్ మూవీని తెలుగు, హిందీలో ఓకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ డైరెక్టర్ మాట వల్లే కన్నప్ప వాయిదా వేశా: మంచు విష్ణు
కన్నప్ప మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు హీరో మంచు విష్ణు. తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరెకెక్కించిన కన్నప్ప ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంటోంది. దీంతో కన్నప్ప బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప సక్సెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు మంచు విష్ణు హాజరై మాట్లాడారు. కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సంచలన డైరెక్టర్ ఆర్జీవీ వల్లే తాను మూవీని పోస్ట్పోన్ చేశానని వెల్లడించారు. దీనికి గల కారణాలను మీడియాతో పంచుకున్నారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'నా జనరేషన్లో నేను నమ్మే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇవాళ ఆయన నాకు ఓ మేసేజ్ పెట్టాడు. మార్చిలో నాన్నగారిని కలవడానికి వచ్చారు. ఆ రోజు ఇంట్లో కన్నప్ప సినిమా మేకింగ్ నాలుగు నిమిషాల వీడియోను ఆయనకు చూపించాను. మీ సినిమా మొత్తం గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్..ఎక్స్ట్రార్డినరీ అని వీవీఎస్ రవి అన్నారు. ఈ మాట విన్న రాంగోపాల్ వర్మ ఒక మాట అన్నారు. ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్ను వదిలిపెడతాడా.. అవీ కూడా బ్రహ్మండగానే ఉంటాయి అన్నారు. అది విన్న తర్వాత భయపడి పోస్ట్పోన్ చేసేశా. ఈ రోజు కూడా టెక్నికల్గా మా డైరెక్టర్, ఎడిటర్, నేను చాలా సీక్వెన్స్లు వదిలిపెట్టేశాం. మేము అనుకున్నంతగా వీఎఫ్ఎక్స్ రాలేదు. ఇది మాకు ఒక పెద్ద గుణపాఠం' అని వెల్లడించారు. #RamGopalVarma అన్న ఒక్క మాటకి ఏప్రిల్ నుంచి పోస్టుపోన్ చేశాను - #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/yiMnZW5RdU— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2025 -
'నా జీవితంలో అత్యుత్తమమైన రోజు'.. పెళ్లి తర్వాత అఖిల్ పోస్ట్
అక్కినేని హీరో అఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని ఆయన పెళ్లాడారు. ఈ నెల ఆరో తేదీన వీరిద్దరు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. జూబ్లీహిల్స్లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో టాలీవుడ్ తారలు, సన్నిహితులు సందడి చేశారు.పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. తాజాగా పెళ్లి తర్వాత తొలిసారి తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించిందని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మధుర జ్ఞాపకాలు అందించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. ఈ ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
కన్నప్ప మూవీ రిలీజ్.. ఆనందంతో చొక్కా చింపుకున్న అభిమాని!
మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన చిత్రం కన్నప్ప అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి పాజిటివ్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాపై మంచు మనోజ్ సైతం ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ రోల్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్ల వద్ద అభిమానులు మంచు విష్ణు, ప్రభాస్ అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు.అయితే కన్నప్ప చూసిన ఓ అభిమాని థియేటర్ వద్ద తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. థియేటర్కు వచ్చిన అభిమాని కన్నప్ప మూవీపై బ్లాక్బస్టర్ హిట్ అంటూ కేకలు వేశాడు. మంచు విష్ణును ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి చెబుతున్నా.. పక్కా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా హిట్ అంటూ ఏకంగా తన షర్ట్నే చింపుకుని మరి కన్నప్పపై తన అభిమానం చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు సైతం సూపర్ హిట్ అంటూ కామెంట్స్ చేశారు. -
న్యూజిలాండ్లో 7 వేల ఎకరాలు.. మంచు విష్ణు రియాక్షన్ వైరల్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.న్యూజిలాండ్లో మీరు 7000 ఎకరాలు కొన్నారా? సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై మీరేమంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి మంచు విష్ణు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నీకు ఓ వంద ఎకరాలు రాసిస్తా నువ్వు కూడా వచ్చేయ్ అంటూ మీడియా ప్రతినిధికి నవ్వుతూ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ఇటీవల 7 వేల ఎకరాలు కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. దీనిపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా..భారీ బడ్జెట్తో తెరకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా బాలనటులుగా నటించారు.న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్నారా? Vishnu Manchu Reaction 🤣 pic.twitter.com/EfEJ1BugO6— Rajesh Manne (@rajeshmanne1) June 26, 2025 -
‘కన్నప్ప’ నిర్మాణ సంస్థ వార్నింగ్.. అలా చేయడం వల్లేనన్న విష్ణు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అయితే ఇటీవల'కన్నప్ప' తీసిన నిర్మాణ సంస్థ చాలా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. క్రిటిక్స్, యూట్యూబర్స్ ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లు నోట్లో రాసుకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ప్రెస్మీట్లో మంచు విష్ణు స్పందించారు.చెన్నైలో కన్నప్ప సినిమా చూసిన ఒకతను నన్ను కౌగిలించుకుని ఏడ్వడం మొదలెట్టారు.. చివరిగంట నా లైఫ్లో చూడలేదని చెప్పాడు. మహానటుడు రజినీకాంత్ సినిమా చూసిన చెప్పిన మాట నా లైఫ్లో మర్చిపోలేనని అన్నారు. అయితే కన్నప్ప చూసిన ఒకతను రివ్యూ ఇచ్చేశాడు. ఈ రివ్యూ వచ్చిన మూడు గంటల్లో ట్విటర్లో దాదాపు 42 మంది రివ్యూలు రాసి 0.5 రేటింగ్ ఇచ్చారని తెలిపారు. అయితే కొందరు కన్నప్ప సినిమా చూడకుండానే ట్విటర్లో రివ్యూలు ఇచ్చారని అన్నారు. అందువల్లే ఇలాంటి వారిని అరికట్టడం కోసమే కాపీరైట్ స్ట్రైక్, లీగల్ ప్రొసీజర్ తప్ప ఎవర్నీ బెదిరించడం నా ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. మీ వల్లే సినిమాలు వెళ్తాయని.. సినిమా చూస్తూ రివ్యూలు పెట్టడం పైరసీ చేయడంతో సమానమన్నారు. ట్విటర్, యూట్యూబ్లో సినిమా చూసేటప్పుడు పెట్టే వాళ్లను బ్లాక్ చేశామని తెలిపారు. అంతే తప్ప వార్నింగ్ ఇచ్చే సీన్ నాకు ఎక్కడిదంటూ నవ్వుతూ అన్నారు.కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఇందులో బాలనటులుగా చేశారు. -
కన్నప్ప తీసింది వాళ్ల కోసమే.. కక్కుర్తి పడి కాదు: మంచు విష్ణు
సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంచు విష్ణు స్పందించారు. కన్నప్ప మూవీ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. తన సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని.. వాళ్లను ఇబ్బందిపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. అందుకే టికెట్ రేట్లు పెంచలేదని అన్నారు. తెలంగాణలో టికెట్లకు ఎలాంటి పెంపు లేదని తెలిపారు. ఏపీలో కూడా కేవలం కొన్ని సెంటర్లలో మాత్రమే పెంపు ఉంటుదని మంచు విష్ణు వెల్లడించారు.అమెరికాలో సైతం కన్నప్ప ప్రీమియర్ షోలకు కేవలం 16 డాలర్లుగా మాత్రమే నిర్ణయించామని మంచు విష్ణు వెల్లడించారు. ఆ తర్వాత పెద్దవారికి 14 డాలర్లు, పిల్లలకు 12 డాలర్లుగా టికెట్ ధరలు ఉన్నాయని తెలిపారు. ఏ రోజు అయితే పాప్కార్న్, కోక్ ధరలు తగ్గిస్తారో ఆ రోజు నుంచి నేను మల్టీప్లెక్స్లో టికెట్స్ పెంచడానికి ఆలోచిస్తానని అన్నారు. అంతే తప్పా నా కక్కుర్తి కోసం టికెట్ రేట్స్ పెంచడం లేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను పిల్లలు ఎక్కువగా చూడాలన్నదే తన కోరిక అని తెలిపారు. నా చిన్నప్పుడు రామాయణ, మహభారతం గురించి నేను టీవీల్లో చూసేవాడిని.. మన చరిత్ర, దేవుళ్ల గురించి సినిమాలు, కామిక్ బుక్ కల్చర్ ద్వారే తనకు తెలిసిందన్నారు. పిల్లలకు కూడా ఈ సినిమా నచ్చాలనే ఉద్దేశంతోనే కథను తీశామని విష్ణు స్పష్టం చేశారు.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. -
కన్నప్ప కోసం వెయిటింగ్.. వారి కోసమంటూ మంచు మనోజ్ పోస్ట్!
కన్నప్ప టీమ్కు మంచు మనోజ్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ శుక్రవారం విడుదలయ్యే కన్నప్ప సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం నాన్న, ఆయన టీమ్ ఎన్నో ఏళ్లు ఎంతో కష్టపడ్డారని రాసుకొచ్చారు. మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్రామ్ల అందమైన జ్ఞాపకాలను థియేటర్లో చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్ ద్వారా మనోజ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' కన్నప్ప చిత్రానికి, టీమ్కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కోసం నాన్నతో పాటు ఆయన బృందం ఎంతో శ్రమించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే మా లిటిల్ ఛాంపియన్స్ అరియానా, వివియానా, అవ్రామ్ల అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్పై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. తనికెళ్ల భరణిగారి జీవితకాల కల జీవం పోసుకుని.. ఈ శుక్రవారమే కన్నప్ప విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్, మోహన్లాల్ , అక్షయ్కుమార్, ప్రభుదేవాతో పాటు ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరు సినిమా కోసం చేసిన చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. మంచు మనోజ్ ఇటీవలే భైరవం మూవీతో అభిమానులను అలరించారు. అయితే ఈ ట్వీట్లో ఎక్కడూ కూడా తన సోదరుడు మంచు విష్ణు పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. All the best to Team #Kannappa!My Dad and his team have poured years of effort and love into this film. I’m praying it roars to blockbuster success.Can’t wait to see my little champs Ari, Vivi, and Avram make memories on the big screen.So happy that #TanikellaBharani garu's… pic.twitter.com/CLg6wpinVx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 26, 2025 -
మంచు విష్ణు కన్నప్ప.. ఏపీలో టికెట్ ధరల పెంపు
ఏపీలో కన్నప్ప సినిమా టికెట్ రేట్లు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. రిలీజ్ రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు జారీ చేసింది. అయితే కేవలం హయ్యర్ క్లాస్ టికెట్ రేట్లు మాత్రమే పెంచుకునేందుకు సడలింపు ఇచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. టికెట్ రేటుకు అదనంగా రూ.50 పెంచుకునేందుకు ఉత్తర్వులిచ్చింది. తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా టికెట్ ధరల పెంపు కోసం ఏపీ గవర్నమెంట్కు మంచు విష్ణు దరఖాస్తు చేసుకోవడంతో టికెట్ పెంపునకు అనుమతిచ్చింది.బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
కన్నప్ప రిలీజ్.. శ్రీశైల ఆలయంలో మంచు విష్ణు పూజలు
కన్నప్ప విడుదలకు ముందు మంచు విష్ణు శ్రీశైల ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరెకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు నటించారు.తన ఆధ్యాత్మిక ప్రయాణంలోని మధుర క్షణాలను మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శించినట్లు తెలిపారు. పన్నెండు జ్యోతిర్లింగాలు. ఒక ప్రయాణం. శాశ్వత శాంతి. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ శైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పవిత్ర దర్శనం ఇప్పుడే పూర్తి చేసుకున్నానంటూ ఫోటోలను షేర్ చేశారు.ఈ సందర్శనతో పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలకు నా ప్రయాణం ముగింపునకు చేరుకుంది.. నా హృదయం నిండిపోయిందని.. నా ఆత్మ ధన్యమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చారు. ప్రస్తుత జీవితం సానుకూలత, కృతజ్ఞత, శాంతి తప్ప మరేమీ లేదని పోస్ట్ చేశారు. నా హృదయానికి దగ్గరగా ఉన్న చిత్రం.. ఈ రోజు నేను మోస్తున్న స్ఫూర్తిని ప్రతిబింబించే కథ.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కన్నప్ప కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. . హర హర మహాదేవ్ అంటూ పోస్ట్ చేశారు. Twelve Jyotirlingas. One journey. Eternal peace.Just completed the sacred darshan at Sri Sailam Mallikarjuna Swamy Temple — one of the twelve revered Jyotirlingas of Lord Shiva.With this visit, my journey to all twelve Jyotirlinga temples comes to a divine close.My heart is… pic.twitter.com/COYa872JrG— Vishnu Manchu (@iVishnuManchu) June 25, 2025 -
తను లేకపోతే ఫీలవుతుందని డైరెక్టర్ చెప్పారు: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కన్నప్ప. ఇప్పటికే టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చేశాయి. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు.అంతేకాకుండా ఈ మూవీలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ కూడా నటించారు. ఇటీవల అతని షూటింగ్కు సంబంధించిన వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో విష్ణు కుమార్తెలిద్దరు అరియానా- వివియానా సైతం ప్రత్యేక భక్తి పాటలో మెరిశారు. దీంతో ఈ మూవీలో మంచు విష్ణు ఫ్యామిలీ అంతా కనిపించనుంది. అయితే మంచు విష్ణుకు మరో కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మంచు విష్ణు ముగ్గురు పిల్లలు నటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో తన చిన్న కుమార్తె గురించి మాట్లాడారు. తాను కూడా ఈ సినిమాలో ఉందని తెలిపారు. చిన్నపాపను కూడా ఓ సీన్లో పెట్టేశామని అన్నారు. అవ్రామ్ నా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తాడని వివరించారు. నా చిన్న కూతురిని ఓ సీన్లో పెట్టమని డైరెక్టర్ సలహా ఇచ్చారు. లేకపోతే పెద్దయ్యాక తను ఫీలవుతుందని చెప్పారు. ఎక్కడైనా చిన్నపిల్లల సీన్లో ఛాన్స్ ఉంటే పెట్టేయండి అని చెప్పానని..తను డైలాగ్ కూడా చెప్పిందని మంచు విష్ణు తెలిపారు. దీంతో మొత్తంగా విష్ణు నలుగురు పిల్లలు కన్నప్పలో కనిపించనున్నారు. -
కన్నప్ప సెన్సార్.. 12 కట్స్.. రన్ టైమ్ ఎంతంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న కన్నప్ప రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.తాజాగా కన్నప్ప మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్టైమ్ దాదాపు 182 నిమిషాలు కాగా.. అంటే మూడు గంటల రెండు నిమిషాలుగా ఉంది. మైథలాజికల్ నేపథ్యంలో వస్తోన్న మూవీ కావడంతో రన్టైమ్ కాస్తా ఎక్కువగానే ఉంది. 195 నిమిషాల నిడివితో ఈ సినిమాను తెరకెక్కించగా.. సెన్సార్ బోర్డ్ 12 కట్స్ చెప్పింది. సీబీఎఫ్సీ నిబంధనల ప్రకారం చిత్రం మార్పులకు అంగీకరించింది. రాబందు ఓ చిన్నారిని పై నుంచి పడేయటం.. తిన్నడుకు సంబంధించిన కొన్ని సీన్స్, మూడు పాటల్లోని విజువల్స్ను తొలగించారు.మరోవైపు కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుంచి మొదలవుతాయని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇప్పటికే ఓవర్సీస్లో బుకింగ్స్ ఓపెన్ కాగా.. తెలుగు అభిమానులకు బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నాయని విష్ణు వెల్లడించారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప సినిమా తర్వాత దాదాపు 50 ఏళ్లకు మరోసారి కన్నప్ప కథ రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. #Kannappa Advance bookings open in Telugu tomorrow, 25th June 🙏🔥! #HarHarMahadev— Vishnu Manchu (@iVishnuManchu) June 24, 2025 -
అంజనా దేవికి అస్వస్థత.. నాగబాబు ఏమన్నారంటే?
తన మాృతమూర్తి అంజనాదేవి అనారోగ్యంపై తనయుడు నాగబాబు స్పందించారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని అభిమానులను కోరారు. మా అమ్మ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. వాటిని ఎవరు కూడా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.కాగా.. ఇవాళ ఉదయం అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారంటూ రూమర్స్ వచ్చాయి. ఆమె తీవ్ర అస్వస్థత గురయ్యారంటూ కథనాలు రావడంతో నాగబాబు స్పందించారు. అంతేకాకుండా ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ హైదరాబాద్ వచ్చారని రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సైతం షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు.అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది.There is some inaccurate information being circulated,but she is absolutely fine.— Naga Babu Konidela (@NagaBabuOffl) June 24, 2025 -
అమ్మ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్!
గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో రానున్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కనిపించనుంది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.అయితే తాజాగా ఇవాళ తన తల్లి బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ స్పెషల్ ఫోటోను పంచుకున్నారు. అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం నిర్మలమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.అవార్డుల అల్లు అర్జున్..పుష్ప-2 సినిమాకు గానూ 'అల్లు అర్జున్' ఉత్తమ నటుడిగా 'గద్దర్' అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్ పేరు చేరింది. అదే విధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) నిలిచారు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. కాగా.. బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21.. అయితే ఉత్తమ నటుడిగా 11సార్లు నామినేట్ అయ్యాడు. ఏడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్ అందుకున్నాడు. మొత్తంగా దేశంలో పేరు పొందిన 18 అవార్డ్స్ను ఆయన సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
మీ నాన్న పాకెట్లో ఎంత కొట్టేసేవారు?.. కుబేర డైరెక్టర్కు నాగచైతన్య సరదా ప్రశ్న!
అక్కినేని నాగార్జున, ధనుశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో నాగార్జున కూడా పాల్గొంటున్నారు. తాజాగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగార్జునను హీరో నాగచైతన్య ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరిని నాగచైతన్య సరదా ప్రశ్నలు అడిగారు. మీ చిన్నప్పుడు నాన్న పాకెట్ నుంచి ఎంత మనీ కొట్టేశారు? అంటూ చైతూ ఇద్దరినీ ప్రశ్నించారు. దీనికి శేఖర్ కమ్ముల ఆసక్తికర సమాధానమిచ్చారు. పతంగులు కొనేందుకు 50 పైసలు తీసుకునేవాడిని డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత నాన్న జేబు నుంచి రూపాయి, రెండు రూపాయల నోట్లు తీసుకునేవాడినని నాగార్జున వెల్లడించారు. అప్పుడు వాళ్ల పాకెట్లో కూడా అంతే ఉండేవని.. పెద్ద నోటు అంటే అప్పట్లో కేవలం పది రూపాయలేనని నాగార్జున అన్నారు. ఆ తర్వాత నా టైమ్లో బిగ్ నోట్ 500 రూపాయలని నాగచైతన్య నవ్వుతూ మాట్లాడారు. కాగా.. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగచైతన్య- సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ మూవీలో నటించారు. -
మంచు విష్ణు కన్నప్ప.. అతని ఎంట్రీ మరిచిపోలేని జ్ఞాపకం!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా మంచు విష్ణు తన కుమారుడి వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.తన కుమారుడు అవ్రామ్ కన్నప్ప మూవీతో అరంగేట్రం చేయడం సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తను సెట్లోకి రావడం, మాటలు చెప్పడం, ఈ డ్రీమ్ ప్రాజెక్ట్లో నటించడం నా జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటని తెలిపారు. ఒక తండ్రిగా నేను ఒకప్పుడు కలలు కన్న అదే ఆకాశం కింద మన బిడ్డ ప్రకాశించడం చూస్తే అంతకు మించింది ఏదీ ఉండదు..ఇది కేవలం అరంగేట్రం కాదు. ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని తన పోస్ట్లో రాసుకొచ్చారు. మీరు ఎల్లప్పుడూ నాకు ఇచ్చిన అదే ప్రేమ, ఆశీర్వాదాలతో మీరందరూ నా కుమారుడిపై కూడా చూపిస్తారని నేను ఆశిస్తున్నా.. అవ్రమ్ ప్రయాణం ప్రారంభం.. అది కన్నప్పతో మొదలు కావడం చాలా సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. కన్నప్పలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటించారు. ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు నటించారు. వీరితో పాటు అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, సప్తగిరి, ముఖేష్ రిషి, మధుబాల, ఐశ్వర్య భాస్కరన్, బ్రహ్మాజీ, దేవరాజ్, రఘు బాబు, శివ బాలాజీ కీలక పాత్రల్లో మెప్పించారు. కాగా.. ఈ సినిమాను ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'.. ఆ బిగ్ మూవీతో పోటీ పడనుందా?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈనెలలో విడుదల కావాల్సినా ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ నెలలోనే థియేటర్లలో చూడాలనుకున్న ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమా పలుసార్లు వాయిదా పడడం.. పెద్దగా బజ్ లేకపోవడంతో హరిహర వీరమల్లుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు. ఇక చేసేదేం లేక జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేయక తప్పలేదు.తాజాగా ఈ హరిహర వీరమల్లుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మూవీ విడుదల తేదీని గురువారం ప్రకటిస్తామని పోస్టర్ను పంచుకున్నారు. ఈ ప్రకటనతో పవన్ అభిమానుల్లో కాస్తా ఆశలు చిగురించాయి. అయితే ఈ నెల చివరి వారంలో బాక్సాఫీస్ వద్దకు రానుందా..వచ్చే నెలలో రిలీజ్ కానుందా? అనేది రేపు క్లారిటీ రానుంది. అయితే మరో వైపు జూలై 25న థియేటర్లలో రానుందని సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ విడుదల కానుంది. ఆ డేట్ కనుక ఖరారైతే బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్తో హరిహర వీరమల్లు పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. Release Date Announcement Tomorrow 🦅💥#HariHaraVeeraMallu @MegaSuryaProd pic.twitter.com/9v6jryuTV0— HariHaraVeeraMallu (@HHVMTeam) June 18, 2025 -
ది రాజా సాబ్ టీజర్.. ఆ డైలాగ్ను ఇలా కూడా వాడేస్తున్నారా?
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. రొమాంటిక్ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ మన రాజా సాబ్ టీజర్ విడుదలైంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్ థ్రిల్లింగ్గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.అయితే ఈ టీజర్లోని ఓ డైలాగ్ను ఏకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడేశారు. ప్రజలకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. అందులో ది రాజాసాబ్ టీజర్లోని డైలాగ్ను చూపించారు. హలో హలో బండి కొంచెం మెల్లగా.. అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్తో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం కల్పించే ప్రయత్నం చేశారు.అంతేకాకుండా ప్రభాస్ మిర్చి సినిమాలో విజువల్స్ను కూడా ట్రాఫిక్ పోలీసులు వినియోగించారు. మిర్చి చిత్రంలో హెల్మెట్ ధరించిన బైక్పై వస్తున్న విజువల్స్ను ఇందులో చూపించారు. వీటితో పాటు సాహో మూవీలోని కొన్ని సీన్స్ను కూడా ఇందులో కలిపేశారు. కనీసం ఇది చూసైనా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా పోలీసులు చేసినా ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.మారుతి రియాక్షన్..ఈ వీడియో చూసిన ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి స్పందించారు. ఇది చాలా ఫర్ఫెక్ట్.. మా సినిమా డైలాగ్ను పాజిటివ్ కోణంలో ఉపయోగించడం సూపర్ అంటూ ఆ ట్వీట్కు రిప్లై ఇచ్చారు. కాగా.. ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ది రాజా సాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. Yes sir perfect... thank u for using our footage in positive manner— Director Maruthi (@DirectorMaruthi) June 17, 2025 #HYDTPweBringAwareness📢ℋℯ𝓁𝓁ℴ... ℋℯ𝓁𝓁ℴ....!బండి కొంచెం మెల్లగా #𝕯𝖗𝖎𝖛𝖊 చేయండి డార్లింగ్❤️𝖉𝖆𝖗𝖑𝖎𝖓𝖌.🏍️#WearHelmet#DarlingPrabhas #TheRajaSaab pic.twitter.com/OHSeM6kd1D— Hyderabad Traffic Police (@HYDTP) June 17, 2025 -
రష్మిక మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన విజయ్ దేవరకొండ!
నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో ధనుశ్ బిచ్చగాడి పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ధనిక-పేద తేడా, రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది . సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. బిగ్ స్క్రీన్పై సందడి చేయబోతున్న కుబేర చిత్రానికి అభినందనలు తెలిపారు. శేఖర్ కమ్ముల సర్ పేరు నా ప్రయాణంలో ఎల్లప్పుడూ ప్రత్యేకం.. నాలాంటి చాలా మంది నటులకు ఆయనే ఆదర్శమని కొనియాడారు. ఈ మూవీలో ధనుశ్, నాగార్జున సర్, రష్మిక లాంటి స్టార్లను చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కుబేర టీమ్కు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఇక వేచి ఉండలేను అంటూ రాసుకొచ్చారు. రష్మిక మూవీకి విజయ్ దేవరకొండ ఆల్ ది బెస్ట్ చెప్పడంపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.Wishing #Kuberaa all the very best as it heads to the big screen. @sekharkammula sir will always be a special name in my journey — he gave many actors like me hope. To see him now telling a story on this scale, with a cast filled with personal favourites like @dhanushkraja,…— Vijay Deverakonda (@TheDeverakonda) June 17, 2025 -
వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు!
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుశ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో తెరెకెక్కించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర కమ్ములపై ప్రశంసలు కురిపించారు.తాను నమ్మే సిద్ధాంతాలకు.. చేసే సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదని రాజమౌళి అన్నారు. కానీ శేఖర్ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని తెలిపారు. శేఖర్ చాలా సాప్ట్గా ఉంటారని.. తన సిద్ధాంతాలకు ఏది అడ్డొచ్చినా కొంచెం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరని వెల్లడించారు. తాను నమ్మినా సిద్ధాంతాలపైనే సినిమాలు తీస్తారని... అందుకే ఆయనంటే ఎంతో గౌరవమని కొనియాడారు. మీరు వాట్సాప్ వాడుతారా అని శేఖర్ కమ్ములను రాజమౌళి అడగ్గా.. తాను ఉపయోగించనని ఆయన సమాధానమిస్తారు.ఈ కార్యక్రమంలో కుబేర ట్రైలర్ను కూడా రాజమౌళి విడుదల చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. -
ప్రభాస్ ది రాజాసాబ్ టీజర్.. టైమ్ ఫిక్స్ చేసిన డైరెక్టర్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ను తేదీని కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.అయితే ఇప్పటికే జూన్ 16న ఉదయం 10:52 గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ మారుతి తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఆల్ సెట్ డార్లింగ్స్.. లెట్స్ రాక్ ఫ్రమ్ టుమారో' అంటూ టైమ్ ఫిక్స్ చేశారు.టీజర్పై అధికారిక ప్రకటన రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం. ది రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.All SET darlings Hope u all ready 💖 Let's rock from tomorrow 10.52 am#TheRajaSaabTeaser pic.twitter.com/Q2aGbYAcnU— Director Maruthi (@DirectorMaruthi) June 15, 2025 -
మిస్టరీ థ్రిల్లర్గా హంటర్ ఛాప్టర్ -1.. గ్రాండ్ రిలీజ్
హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హంటర్ ఛాప్టర్ 1'. ఈ చిత్రంలో నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమాకు షరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ.రాజశేఖర్, సాయి కిరణ్ బత్తుల నిర్మించారు.తాజాగా మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించారు. బాలాజీ కె రాజా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోనుంది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. రెబల్ స్టార్ ప్రభాస్ పోస్ట్
అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ దుర్ఘటన నిజంగా దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అన్నారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ విషాదంపై ఇప్పటికే టాలీవుడ్ సినీతారలతో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం విచారం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారుయ ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. -
కథ, పాత్రలో దమ్ముంటే చాలు ఇలాంటి సినిమాలు హిట్టే
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో హీరో సాయి కుమార్ చెప్పిన డైలాగులకు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయ్. హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపిస్తే అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు దక్కే మజానే వేరు. ఖాకీ డ్రెస్లో లాఠీ, తు పాకీ చేతబట్టి ఆన్ డ్యూటీలో భాగంగా పవర్ఫుల్ డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ సందడి చేస్తుంటారు.పైగా పోలీస్ బ్యాక్డ్రాప్ అన్నది ఎవర్ గ్రీన్ ఫార్ములా. కథ, పాత్రలో దమ్ముంటే చాలు పోలీస్ సినిమాలు హిట్టయిపోతాయ్. ఇప్పటికే పోలీస్ కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల్లో ‘ఆన్ డ్యూటీ’ అంటూ పోలీస్గా విజృంభిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ముత్తువేల్ పాండియన్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ (2023) చిత్రం సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్గా ముత్తువేల్ పాండియన్ సత్తా ఏ రేంజ్లో ఉంటుందన్నది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అయితే ‘జైలర్ 2’లో విద్యాబాలన్ నటించనున్నారని టాక్. అయితే ఆమె పాత్ర ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. కెరీర్లో తొలిసారి... వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్తో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ‘ఈశ్వర్’ (2002) సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారాయన. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో, ఈ జనరేషన్ హీరోల్లో ఖాకీ డ్రెస్ వేయని ఒకే ఒక్క హీరో ప్రభాస్. ఆయన్ని ఖాకీ డ్రెస్లో, పవర్ఫుల్ పాత్రలో చూడాలని ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ‘స్పిరిట్’ సినిమాతో ఫుల్స్టాప్ పడింది. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పిరిట్’.ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా త్రిప్తి డిమ్రీ నటిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణణ్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఖాకీ డ్రెస్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ‘స్పిరిట్’లో పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ ఏ రేంజ్లో విజృంభిస్తారో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి. పోలీస్ జాతర పోలీస్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు హీరో రవితేజ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘వెంకీ’ (2004)లో మొదటిసారి ఖాకీ డ్రెస్లో కనిపించినప్పటికీ ఆ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించరు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’ (2006) సినిమాలో విక్రమ్ రాథోడ్గా పవర్ ఫుల్ పోలీసాఫీసర్గా కనిపించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘ఖతర్నాక్, మిరపకాయ్, పవర్, టచ్ చేసి చూడు, క్రాక్’ వంటి సినిమాల్లో పోలీసాఫీసర్గా తనదైన మేనరిజమ్తో ప్రేక్షకులను అలరించారు రవితేజ.చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలోనూ ఏసీపీ విక్రమ్ సాగర్గా కనిపించారు. తాజాగా రవితేజ పోలీస్ ఆఫీర్గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందుతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా మే 9న విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ని ప్రకటించలేదు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్లో... పవన్ కల్యాణ్ పోలీసాఫీసర్ పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో మరోసారి ఖాకీ డ్రెస్లో కనిపించారు పవన్ కల్యాణ్. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. కాగా తనకు ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో మరోసారి పోలీసాఫీసర్గా నటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. పవన్ కల్యాణ్తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.డబుల్ ధమాకా హీరో కార్తీ పోలీసాఫీసర్గా ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘సర్దార్’ (2022) చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్గా నిలిచింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సీక్వెల్గా కార్తీ–పీఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే ‘సర్దార్ 2’ రానున్న సంగతి తెలిసిందే. ఆషికా రంగనాథ్, మాళవికా మోహనన్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సినిమాలో కార్తీ తండ్రీ కొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు. తండ్రి ఖైదీ పాత్రలో కనిపించనుండగా ఆయన కొడుకు పాత్ర పవర్ పోలీసాఫీసర్గా కనిపిస్తారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుందట. హిట్ 4లో.... తెలుగులో ‘హిట్’ సిరీస్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సిరీస్లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (విశ్వక్ సేన్), ‘హిట్: ది సెకండ్ కేస్’ (అడివి శేష్), ‘హిట్: ది థర్డ్ కేస్’ (నాని) సినిమాలు విజయం సాధించాయి. ఈ సిరీస్లో రానున్న నాలుగో చిత్రం ‘హిట్ 4’. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించనున్నారు. ఏసీపీ వీరప్పన్గా కార్తీ నటించనున్నట్లు ‘హిట్: ది థర్డ్ కేస్’ క్లైమాక్స్లో చూపించారు మేకర్స్.స్పై పోలీస్ ఆఫీసర్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్గా సందడి చేయనున్నారట విజయ్.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటిæవరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.రెండోసారి... హీరో విశ్వక్ సేన్ రెండోసారి పోలీసాఫీసర్గా చార్జ్ తీసుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ అధికారిగా నటించారు విశ్వక్. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా విశ్వక్ సేన్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా మరోసారి ఆయన ఖాకీ దుస్తులు ధరించారు. శ్రీధర్ గంగా దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వీఎస్ 13’ (వర్కింగ్ టైటిల్). ఎస్ఎల్వీసీ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో చూస్తుంటే విశ్వక్ మరోసారి పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారని స్పష్టం అవుతోంది. విశ్వక్ ఫేస్ కనిపించకుండా పాకెట్లో తు పాకీతో అటువైపు తిరిగి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ప్రతి యాక్షన్కి అదిరిపోయే రియాక్షన్ ఉంటుంది’ అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ‘బందూక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. రక్షక్! నటనకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్లో బిజీ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన ఓ హీరోగా నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదలైంది. ఈ చిత్రంలో గజపతి వర్మ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు మనోజ్. అదే విధంగా తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘మిరాయ్’ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర చేస్తున్నారు మనోజ్. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షక్’. ఈ చిత్రం ద్వారా నవీన్ కొల్లి దర్శకునిగా పరిచయమవుతున్నారు.శ్రీనిధీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతోంది. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోలీసాఫీసర్గా నటిస్తున్నారు మంచు మనోజ్. మే 20న ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్లోని మనోజ్ శక్తిమంతమైన లుక్ ఆకట్టుకునేలా ఉంది. కొందరు తాము చేసిన నేరాన్ని బయటకు రాకుండా దాచి పెట్టడానికి ప్రయత్నిస్తే హీరో ఎలా వెలికి తీశాడు? అన్నది కథలో ఆసక్తిగా ఉంటుం దట. అంతేకాదు... ప్రస్తుతం సమాజంలో మహిళల మీద జరుగుతున్న వేధింపులను కూడా ఇందులో ప్రస్తావించారని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. తండ్రి బాటలో... పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు సాయికుమార్. ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో ఆయన నటన, డైలాగులను ఎప్పటికీ మరచిపోలేరు ప్రేక్షకులు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పోలీసాఫీసర్గా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు సాయికుమార్. తాజాగా ఆయన తనయుడు ఆది సాయికుమార్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘ఎస్ఐ యుగంధర్’. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు రాకేందు మౌళి విలన్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్పై ప్రదీప్ జూలూరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా వైవిధ్యమైన కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ పాత్రలో ఆది నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
'మాట పోయి మనిషి బతికినా.. పోయినట్టే లెక్క'.. ఆసక్తిగా తమ్ముడు ట్రైలర్
టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'మాట పోయి మనిషి బతికినా.. మనిషి పోయినట్టే లెక్క.. మాట బతికి మనిషి పోతే.. మనిషి బతికున్నట్లే లెక్క' అనే డైలాగ్ ఆడియన్స్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. A powerful promise sparks a fierce battle for survival...! 👪Presenting the absolutely intense #BangerFromThammudu 🎯🌄▶️ https://t.co/QX2opY8tyDIn theatres from July 4th, 2025 🔒#ThammuduOnJuly4th @actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya #SaurabhSachdeva… pic.twitter.com/NoSyNMSTlF— Sri Venkateswara Creations (@SVC_official) June 11, 2025 -
కన్ఫ్యూజన్కు ఫుల్స్టాప్.. ఆ స్టార్ హీరోతోనే త్రివిక్రమ్ సినిమా.. నిర్మాత హింట్!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడంతా ఫుల్ బిజీ అయిపోయారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ఇటీవలే వార్-2 షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం ప్రశాంత్నీల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ స్టార్స్ కోసం మరో డైరెక్టర్ వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల అల్లు అర్జున్- అట్లీ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో బన్నీతో మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్కు నిరాశే ఎదురైంది. ఇప్పట్లో బన్నీ- త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేలా కనిపించడం లేదు.అయితే ఈ గ్యాప్లోనే త్రివిక్రమ్.. మెగా హీరో రామ్ చరణ్తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇదిలా ఉండగానే బన్నీ ప్లేస్లో మరో స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్తోనే తెరకెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సంస్కృతి భాషలో ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్తో ప్లాన్ చేసిన మైథలాజికల్ ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నట్లు నాగవంశీ హింట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయ భగవానుడి పాత్రలో అడుగుపెడుతున్నట్లు ఆ ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది. 'అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో నాకు అత్యంత ఇష్టమైన అన్న ఒకరు' అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్తో ఎన్టీఆర్తోనే త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.ఆసక్తికర విషయం ఏంటంటే.. మొదట ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్తోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాతే అల్లు అర్జున్ కు ఆఫర్ చేశారు. ఇప్పుడు బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జత కట్టడంతో నిర్మాతలు మరోసారి ఎన్టీఆర్వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.కాగా.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం' తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గతంలో వెంకటేశ్, రామ్ చరణ్తో సినిమాల వార్తలొచ్చినా అవేమీ ఇంకా అప్డేట్స్ రాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్తోనే సినిమాకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు లేటేస్ట్ టాక్. నాగవంశీ ట్వీట్తో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. GOD OF WAR is Coming!! pic.twitter.com/MoIcrKduNw— Naga Vamsi (@vamsi84) June 11, 2025 My most favourite anna as one of the most powerful gods. pic.twitter.com/Vq4dFV3lJd— Naga Vamsi (@vamsi84) June 11, 2025 -
రామ్ చరణ్తో త్రివిక్రమ్ ప్లాన్.. బన్నీనే కారణమా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అభిమానులు ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నారు.గుంటూరు కారం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, వెంకటేశ్తో ఆయన సినిమా చేయనున్నట్లు టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. తాజాగా త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో జతకట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కాంబోలో ఓ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్తో సోషయో ఫాంటసీని చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్లో అర్జున్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీలో హీరోయిన్గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఇప్పుడు బన్నీ అట్లీతో కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించడంతో త్రివిక్రమ్ సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు. దీంతో బన్నీతో సినిమా ఇప్పట్లో పట్టలెక్కేలా కనిపించడం లేదు. ఈ గ్యాప్లోనే త్రివిక్రమ్.. రామ్ చరణ్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చి బాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కన్నప్పలో ఆ పేర్లపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు!
కన్నప్ప మూవీ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించారు. ఎవరిని కించపరిచేలా కన్నప్ప సినిమాను తీయలేదని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మా సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ఆ పరమశివుడిని భక్తితో చూపించామని విష్ణు వెల్లడించారు. కాగా.. ఈ మూవీలోని పాత్రల పేర్లపై ఇటీవల బ్రాహ్మణ సంఘాల ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు స్పందించారు.అసలేంటి వివాదం..?ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది కన్నప్ప టీమ్. ఈ క్రమంలోనే ఇటీవల మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే గుంటూరు కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.'మంచు మోహన్బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటామని శ్రీధర్ హెచ్చరించారు. ఈ వివాదంపై బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.కాగా.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ లాంటి అగ్రతారలు నటించారు. -
అఖిల్ పెళ్లి.. 33 ఏళ్లనాటి సీన్ రిపీట్.. అచ్చం నాన్నలాగే..
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యారు. ఈ నెల 6న తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జైనాబ్ రవ్దీని అఖిల్ పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంలో కొత్త జీవితం ప్రారంభించారు.తాజాగా వీరి పెళ్లి వేడుక తర్వాత నాగార్జున పెళ్లి ఫోటోను వైరలవుతోంది. అఖిల్- జైనాబ్ పెళ్లిని నాగార్జున- అమల్ పెళ్లి (వీరి వివాహం 1992లో జరిగింది) ఫోటోతో పోలుస్తూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అచ్చం నాన్న స్టైల్లోనే అఖిల్ పెళ్లి ఫోటో ఉందంటూ ఇద్దరి ఫోటోలను జత చేస్తూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చూసేందుకు రెండు ఫోటోలు ఓకేలాగా కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ - జైనాబ్ కూడా నాగార్జున-అమల మాదిరిగానే కుర్తా, చీరను ధరించారు. అఖిల్ పెళ్లి వేళ నాగార్జున-అమల వివాహ వేడుక ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, మహేష్ బాబు, యశ్తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. 2016లోనే వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియ భూపాల్తో అఖిల్కు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2017లో ఊహించని విధంగా వివాహం రద్దైన సంగతి తెలిసిందే. #KingNagarjunaAmala #AkhilZainab Same pattern... ❤️ pic.twitter.com/R2z5vyH8uw— NagaKiran Akkineni (@NagaKiran60) June 8, 2025 -
ఏంటి మీ గోల?.. డౌట్స్ ఉంటే ట్రైలర్ చూడండి..!
ఇటీవల టాలీవుడ్ మూవీ ప్రమోషన్లలో డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. అందరికంటే కాస్తా భిన్నంగా చేస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తమ్ముడు' మేకర్స్ అదే అలానే ట్రై చేశారు. గతంలో మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసేందుకు కొత్తగా ట్రై చేశారు. తాజాగా ట్రైలర్ అపేడేట్ ఇచ్చేందుకు మరోసారి అదే స్టైల్నే ఫాలో అయ్యారు. హీరోయిన్లు హడావుడి చేస్తూ ట్రైలర్ డేట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో 'నేను అడగడం వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విషయంలోనూ అంతే' అంటూ వర్ష బొల్లమ్మ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. అయితే మేము చెప్తాం అంటూ అక్కడే ఉన్న హీరోయిన్ సప్తమీ గౌడ, స్వాసిక చెబుతారు. ఈ మాట విన్న లయ అసలు మీరిద్దరు ఎవరు? అని ప్రశ్నిస్తుంది. వేరే సినిమాలో నటించి.. తమ్ముడు అనుకున్నారా? అంటూ వర్ష బొల్లమ్మ నవ్వులు పూయిస్తుంది. చివర్లో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చి.. ఏంటి మీ గోల? మీ డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ట్రైలర్ చూడండి అని అనడంతో వీడియో ముగుస్తుంది.టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు ట్రైలర్ను జూన్ 11న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. -
థియేటర్ల సంఖ్య తగ్గుతున్నా.. తెలుగు ఇండస్ట్రీ ఎదుగుతోంది: రానా
టాలీవుడ్ హీరో రానా ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో వచ్చిన సీజన్కు అద్భుతమైన స్పందన రావడంతో సీజన్-2 తెరకెక్కించారు. ఈ సూపర్ హిట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా హీరో రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు. థియేటర్లు తగ్గుతున్న కాలంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన బాహుబలి, పుష్ప , ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చాయన్నారు.రానా మాట్లాడుతూ..'ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక విధంగా థియేటర్లు తగ్గుతున్నాయి. ఏడేమినిదేళ్ల క్రితం ఉన్న థియేటర్ల సంఖ్య ఇప్పుడు మూడు రెట్లు తగ్గిపోయాయి. దీనికి కారణం వినోదం అందించేందుకు చాలా ఎక్కువ మాధ్యమాలు ఉన్నాయి. వాటిలో ఓటీటీ, యూట్యూబ్, మీ మొబైల్ ఫోన్ కూడా భాగమైంది. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో సవాళ్లు ఉన్నప్పటికీ సినిమా ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కనిపెడుతూనే ఉంది. ఇటీవల రిలీజైన కోర్ట్ మూవీ చిన్న సినిమా అయినా థియేటర్ల వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి రోజుల్లో కూడా కోర్ట్ మూవీ కథ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమం ఇతర వాటితో పోలిస్తే మెరుగ్గా రాణిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో సినిమా షూటింగ్లకు అయ్యే ఖర్చు ముంబయి, ఢిల్లీతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటోంది. అది కూడా ఒక అడ్వాంటేజ్.' అని అన్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలలో బంధుప్రీతి గురించి మాట్లాడుతూ.. ఏదేమైనా చివరికి మీరు కెమెరా ముందు నిలబడాలి, నటించాలి కదా' అని తెలిపారు.


