Tollywood Hero
-
సందీప్ కిషన్ 'మజాకా'.. అభిమానులను అలరిస్తోన్న ఫోక్ సాంగ్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన సాంగ్కు ఆడియన్స్ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో క్రేజీ పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా మజాకా మూవీ నుంచి అద్భుతమైన జానపద పాటను విడుదల చేశారు. సొమ్మసిల్లి పోతున్నావే.. ఓ చిన్నా రాములమ్మా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ లిరిక్స్ అందించగా.. రేవంత్ ఆలపించారు. ఈ క్రేజీ ఫోక్ సాంగ్కు లియోన్ జేమ్స్ సంగీతమందించారు. ఈ చిత్రంలో మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నల్ల నల్లాని కళ్ళతో, నాజూకు నడుముతో నన్ను ఆగమే జేస్తివే 🎶❤️🔥The Most Viral Folk Sensation Of The Year - #SommasilliPothunnave Out Now✨️— https://t.co/JCqj0HaZyi🎵 @leon_james🎤 @singerrevanth✍🏻#RamuRathod @KumarBezwada#MazakaOnFeb26th #Mazaka @sundeepkishan @riturv… pic.twitter.com/8gEID6cJL0— AK Entertainments (@AKentsOfficial) February 21, 2025 -
టాలీవుడ్లో ఇప్పుడదే ట్రెండ్.. చిన్నోడు.. పెద్దోడు.. మళ్లీ వచ్చేస్తున్నారు..!
టాలీవుడ్ ప్రియులను అలరించిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముందు వరుసలో ఉంటుంది. విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు అన్నతమ్ముళ్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మించారు. 2013లో సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సినీ ప్రియులను మెప్పించింది.తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్కు సిద్దమైంది. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ టాలీవుడ్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని మరోసారి బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం ఫ్యాన్స్కు దక్కనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు థియేటర్లలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. ఈ ప్రకటనతో వెంకటేశ్, మహేశ్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. The wait is over! 🎬✨Relive the magic of family, love, and brotherhood with Peddhodu @VenkyMama & Chinnodu @urstrulyMahesh 🙌Catch the timeless classic #SeethammaVakitloSirimalleChettu in theatres on March 7th❤️🔥Get Ready to experience the nostalgia once again🔥… pic.twitter.com/mYD1RZvvnI— Sri Venkateswara Creations (@SVC_official) February 21, 2025 -
అమ్మ అంజనాదేవికి అస్వస్థత.. స్పందించిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అస్వస్థత గురైనట్లు వచ్చిన వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన ట్వీట్ చేశారు. మా అమ్మ అస్వస్థతకు గురైందని కొన్ని మీడియా కథనాలు చూశానని వెల్లడించారు. అమ్మ కొద్దిపాటి అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని.. రెండు రోజుల ముందు నుంచే ఆమెకు ఆరోగ్యం కాస్తా బాగాలేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని.. సంపూర్ణం ఆరోగ్యంతో ఉన్నారని చిరంజీవి తెలిపారు. అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నా అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థత గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే కేవలం రెగ్యూలర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లినట్లు వారి కుటుంబ సన్నిహితులు తెలిపారు. కానీ సోషల్ మీడియాలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కథనాలొచ్చాయి. దీంతో మెగాస్టార్ చిరు స్పందించారు. తాజాగా అమ్మ అంజనాదేవి ఆరోగ్యంపై అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార్ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. My attention is drawn to some media reports claiming our mother is unwell and is hospitalised. Want to clarify that she was a little indisposed for a couple of days. She is hale and hearty and is perfectly alright now. Appeal to all media not to publish any speculative reports…— Chiranjeevi Konidela (@KChiruTweets) February 21, 2025 -
ప్రతిష్టాత్మక ఈవెంట్కు జంటగా హాజరైన వీకే నరేశ్- పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు వీకే నరేశ్. విభిన్నమైన పాత్రలో వెండితెరపై అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తొమ్మిదో ఏట పండంటి కాపురం మూవీతో బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వీకే నరేశ్. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు చేసిన అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో కనిపించారు. ఇటీవల తన 65వ పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.అయితే ప్రముఖ నటి, దర్శకురాలు, వీకే నరేశ్ తల్లి విజయ నిర్మల జయంతి సందర్భంగా హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తన తల్లి విజయ నిర్మల పేరిట అవార్డులను ప్రకటించారు. ఫిబ్రవరి 20న ఆమె జయంతి సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ప్రతిష్టాత్మక అవార్డులను అందించారు. ఈ కార్యక్రమానికి నటి పవిత్ర లోకేశ్తో కలిసి ఆయన హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీరితో పాటు సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈ ఈవెంట్కు హాజరయ్యారు. కాగా.. ఈ ఈవెంట్లో జంధ్యాల జీవితంపై రైటర్ సాయినాథ్ రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. నాకు సినిమాల్లో ఓనమాలు నేర్పించిన జంధ్యాలను చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని ఆయన పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రోడక్షన్ థియేటర్నుప్రారంభించినట్లు పేర్కొన్నారు.అయితే తన కెరీర్లోనే 2025 బిజీగా ఉండబోతోందని ఇటీవల ఓ ఈవెంట్లో వెల్లడించారు. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నా.. బ్యూటీ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సినిమా మ్యూజియమ్ అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్ అనే కార్యక్రమాన్ని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి పేరుతో ప్రారంభించినట్లు వెల్లడించారు. అందులో విజయకృష్ణ మందిరం ఏర్పాటు చేయడం జరిగిందని.. నేను, పవిత్ర దీనిని ఓ మిషన్లా తీసుకుని కళాకారుల ఐక్య వేదిక సంస్థ పేరుపై ఏర్పాటు చేసినట్లు ఇటీవలే వివరించారు.Visuals of Actor & MAA President @iVishnuManchu, Director @AnilRavipudi, Actor @ItsActorNaresh, and #PavitraLokesh from the Vijaya Nirmala Awards function in Hyderabad! 📸🤩#ManchuVishnu #AnilRavipudi #ShivaBalaji #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/LkIrqymsGi— Telugu FilmNagar (@telugufilmnagar) February 20, 2025 -
నా సినిమాపై విమర్శలను అంగీకరిస్తున్నా: అభిమానులకు విశ్వక్ సేన్ లేఖ
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఇటీవలే లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో అభిమానులను అలరించారు. అయితే ఈ చిత్రం రిలీజ్కు ముందే వివాదానికి దారి తీయడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమాలు చేయలేకపోయానని ట్విటర్ వేదికగా వెల్లడించారు.విశ్వక్ సేన్ తన లేఖలో రాస్తూ..'అందరికీ నమస్కారం.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతిచ్చిన నా అభిమానులకు.. నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ.. ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నా. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్.. మాస్ ఏదైనా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే.. నన్ను విమర్శించే హక్కు మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే' అని రాసుకొచ్చారు.'అంతేకాకుండా నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు.. నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన నిర్మాతలు, పంపిణీదారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నాకు వెన్నెముకగా నిలిచి.. నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరో బలమైన కథతో ముందుకు వస్తా. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం- ఇట్లు మీ విశ్వక్ సేన్' అంటూ లేఖను విడుదల చేశారు.కాగా.. ప్రస్తుతం విశ్వక్సేన్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్లో ఫంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ అండ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.🙏 With gratitude #vishwaksen pic.twitter.com/c95Jyal2Il— VishwakSen (@VishwakSenActor) February 20, 2025 -
విమానంలో వివాహ వేడుక.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి తన వివాహా వార్షికోత్సవాన్ని చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు. విమానంలో తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. ఫ్టైట్లో దుబాయ్ వెళ్తూ తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నామని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. తాజాగా చిరు తమ పెళ్లి రోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన స్నేహితులతో కలిసి విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని చాలా జరుపుకుంటున్నాం. సురేఖ లాంటి డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నా బలం, నా యాంకర్ కూడా. ప్రపంచంలోని అద్భుతమైన నాకు తెలియని వాటిని నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. తను నా పక్కన ఉంటే సౌకర్యంతో పాటు అద్భుతమైన ప్రేరణ కూడా. ఈ సందర్భంగా నా సోల్మేట్ సురేఖకు ధన్యవాదాలు. నీ పట్ల నాకున్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేయడానికి ఇలాంటివీ మరిన్నీ సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార్ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Celebrating our wedding anniversary on a flight with some very dear friends en route Dubai ! 🎉I always feel I am very fortunate to have found a dream life partner in Surekha. She is my strength, my anchor and the wind beneath my wings. Always helps me navigate through the… pic.twitter.com/h4gvNuW1YY— Chiranjeevi Konidela (@KChiruTweets) February 20, 2025 -
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్.. క్రేజీ కాంబో మొదలైంది!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్ వినిపించింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తారని తెలిసింది. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది.ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీకి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు వెల్లడించింది. భారతీయ సినిమా చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు సమయం ఆసమన్నమైంది. ఎన్టీఆర్నీల్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సరికొత్త యాక్షన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. మొదటి జనవరిలోనే షూటింగ్ ప్రారంభిస్తారని భావించినా అలా జరగలేదు. దీంతో ఈ ఫిబ్రవరిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ యాక్షన్ మొదలైంది. కాగా.. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, డిఫరెంట్ గెటప్స్లో ఎన్టీఆర్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. The SOIL finally welcomes its REIGN to leave a MARK in the HISTORY books of Indian Cinema! 🔥🔥#NTRNeel shoot has officially begun. A whole new wave of ACTION & EUPHORIA is ready to grip the Masses 💥💥MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial… pic.twitter.com/yXZZy2AHrA— Mythri Movie Makers (@MythriOfficial) February 20, 2025 -
కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని.. పెళ్లి పనులు మొదలైనట్టేనా?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గతేడాది నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత దూళిపాలను చైతూ పెళ్లాడారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక అక్కినేని అభిమానులంతా అఖిల్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ ఏడాదిలోనే అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే అఖిల్- జైనాబ్ ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 24న గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది తాజా వీడియో. అఖిల్ అక్కినేని తనకు కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లేనని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అక్కినేని వారి చిన్న కోడలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబందించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్తో బిజీగా ఉన్నారు అఖిల్. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్.. ఆమెకు స్కిన్ కేర్కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్లో జైనాబ్ పెరిగింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్-జైనాబ్ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. Dhisti Teeyandra..😍😍Chinnodu ,Chinna Vadhina Merisipothunaru Iddharu ..😍#akhilakkineni & #zainabravdjee 👩❤️👨 pic.twitter.com/c9ovnyfnyc— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 18, 2025 Anna style vere level #Akhil6 #akhilakkineni pic.twitter.com/cfy3ZBOMUQ— SAITEJA VARMA (@Missile_Saiteja) February 18, 2025 -
సందీప్ కిషన్ 'మజాకా'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం మజాకా. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమాకు సంబంధించి క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 'హేయ్ పగిలి పగిలి అంటూ సాగే' లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. కాగా.. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు. -
కాశీనాథుని ఆలయంలో విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ సతీమణి కూడా!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే మహాకుంభ్ మేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ రోజు విమానం ఆలస్యం కావడంతో చాలా సేపు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ప్రయాగ్ రాజ్ చేరుకున్న విజయ్ తన తల్లి మాధవితో కలిసి పవిత్ర స్నానం చేసిన ఫోటోలను పంచుకున్నారు. అయితే తాజాగా మహాకుంభ్ మేళా జర్నీకి సంబంధించిన మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు. వీరితో పాటు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు వంశీ పైడిపల్లి, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ ప్రయాణం తనకెంతో జ్ఞాపకాలను అందించిందని పోస్ట్ రాసుకొచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యాక్షన్ మూవీ కింగ్డమ్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టైటిల్, టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ టీజర్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వాయిస్ను అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
నిరీక్షణకు తెరపడింది.. డాకు మహారాజ్ ఓటీటీ డేట్ ఫిక్స్
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో ఓటీటీ కోసం సినీ ప్రియులు, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గతంలోనే ఓటీటీకి వస్తుందని భావించినా అది జరగలేదు. తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈనెల 21 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. దీంతో ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.డాకు మాహారాజ్ కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju! Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025 -
రంగమార్తాండ కోసం నాన్న భోజనం కూడా చేయలేదు: రాజా గౌతమ్
టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (Brahma Anandam), ఆయన కుమారుడు రాజ గౌతమ్ (Raja Gautam) బ్రహ్మ ఆనందం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన రాజా గౌతమ్ తండ్రి బ్రహ్మనందం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీ నాన్న దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారని ప్రశ్నించగా.. దానికి సమాధానమిచ్చారు.రాజా గౌతమ్ మాట్లాడుతూ..' నాన్న దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా ఆయనకు నుంచి వచ్చిన క్వాలిటీ గ్రాటిట్యూడ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ ఈవెంట్ జరిగినా జంధ్యాల గారి పేరు రాకుండా ఉండదు. ఎవరైనా బాగా చేశారని తెలిస్తే వెంటనే ఫోన్ చేసి అభినందిస్తారు. రంగమార్తాండ చిత్రంలో వైఫ్ చనిపోతే చితి దగ్గర ఏడ్చే సీన్ ఉంటుంది. ఆ సీన్ కోసం నాన్న భోజనం చేయకుండా ఉన్నారు. ఆ సీన్లో నేను కొంచెం వీక్గా కనిపించాలి.. అందుకే భోజనం చేయకపోతే ఆ సీన్ ఎలివేట్ అవుతుంది అన్నారు. ఈ వయసులో కూడా ఆయన నిరూపించుకోవాలనే తపన ఉంది. అందుకే ఆయనే ఆదర్శం' అని ప్రశంసలు కురిపించారు.కాగా.. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. బ్రహ్మా ఆనందం చూసిన వారు నా నటన గురించి మాట్లాడుతుండటం హ్యాపీగా ఉందని రాజా గౌతమ్ పేర్కొన్నారు. -
పెద్దాయనకు తెలియకుండా రౌడీయిజం చేస్తున్నారు: మంచు మనోజ్
మంచువారి ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. తాజాగా మరోసారి వీరి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఓ రెస్టారెంట్పై దాడి జరగడంతో మంచు మనోజ్ బాధితులకు అండగా నిలిచారు. ఎవరూ కూడా భయపడవద్దని.. మీకు అండగా నేను ఉంటానని మంచు మనోజ్ వారికి భరోసానిచ్చారు. యూనివర్సీటీ దగ్గర్లో ఉన్న రెస్టారెంట్పై బౌన్సర్లు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.మనోజ్ మాట్లాడుతూ..'పెద్దాయనకు తెలియకుండా ఇక్కడ రౌడీయిజం చేస్తున్నారు. నాన్నకు, నాకు గ్యాప్ క్రియేట్ చేశారు. ఇది గత మూడేళ్లుగా జరుగుతోంది. కోట్లు వెచ్చించి, లోన్లు తీసుకుని హాస్టల్స్, హోటల్స్ పెట్టుకుని బతుకుతున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రశ్నించినవారిపై బౌన్సర్లు దాడికి పాల్పడుతున్నారు. మీరు ఎవరూ భయపడొద్దు. మీకు అండగా నేను ఉన్నా.' అని హామీ ఇచ్చారు.అనంతరం మాట్లాడుతూ..' ఇలాంటి ఫిర్యాదులు నా దృష్టి రావడం, ప్రశ్నించడం మొదలైనప్పటి నుంచి నాపై అభాండాలు వేస్తున్నారు. మాట వినకుంటే భార్య, పిల్లలు, తల్లులను టార్గెట్ చేస్తున్నారు. నావైపు నిజం... వాళ్ల వైపు నిజం లేదు. ఇది ఆస్తి గొడవ కాదు.. ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరు చేస్తున్న పోరాటం. తెలంగాణాలో మీడియా, పోలీసులు సహకారంతో బౌన్సర్ల ఆగడాలు కట్టడి చేయగలిగాం. ఇక్కడ కొందరు బౌన్సర్లు మద్యం సేవించి గొడవలు చేస్తున్నారు. అనుభవం ఉన్న వారిని రిటైర్డ్ ఆర్మీ వారిని నియమించుకుంటే బాగుంటుంది. గొడవలు చేసి ఆధారాలు లేకుండా సీసీ కెమెరాలు లాక్కెళ్లి పోవడం ఆనవాయితీ అయిపోయింది. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు' వెల్లడించారు. -
లైలా ఈవెంట్లో పృథ్వీదే వందశాతం తప్పు: బ్రహ్మజీ
టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన లైలా మూవీ ఈవెంట్ వివాదంపై స్పందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన మాటలు వందశాతం తప్పని బ్రహ్మజీ అన్నారు. ఈ విషయంలో పృథ్వీని టార్గెట్ చేయడం సరైందే అని తన అభిప్రాయం వెల్లడించారు. సినిమా ఈవెంట్కు వచ్చి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. బ్రహ్మజీ మాట్లాడుతూ..' లైలా ఈవెంట్లో పృథ్వీది తప్పు. సినిమా ఈవెంట్కు వచ్చి అలా మాట్లాడకూడదు. పృథ్వీ మీద రియాక్ట్ అయిన వాళ్లందరూ కరెక్టే. ఎలక్షన్స్ అయిపోయాయి. కొత్తగా నువ్వు ఇప్పుడు వచ్చి అలా మాట్లాడటం చాలా తప్పు. హీరో మంచి వ్యక్తి. ప్రతి చిన్న సినిమా ఫంక్షన్కు విశ్వక్ సేన్ వస్తాడు. పరిచయం లేకపోయినా సరే పిలిస్తే వెళ్లి సపోర్ట్ చేస్తాడు. మా బాపు సినిమా ఈవెంట్కు వచ్చి గంటన్నర్ర కారులోనే కూర్చున్నాడు. లైలా ప్రమోషన్లో ఉండి కూడా మాకు మద్దతు తెలిపేందుకు వచ్చాడు. అలాంటి వ్యక్తి సినిమాకు వచ్చి నువ్వేదో మాట్లాడటం సరైన పద్ధతి కాదు.' అని అన్నారు.(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్.. ఈ బుద్ధి ముందుండాలి!)ప్రస్తుతం బ్రహ్మాజీ బాపు మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే బాపు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. -
ఆయన జీవితాన్ని వెబ్ సిరీస్గా తీయాలనుకున్నా: అల్లు అరవింద్
ఈ ఏడాది అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ఏకంగా రూ. 21.27 కోట్లు రాబట్టింది. విడుదలైన వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అలరిస్తోంది. వందకోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో శ్రీకాకుళంలో గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన జీవితాన్ని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'మల్లయోధుడు కోడి రామ్మూర్తి గారి స్డేడియంలో మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆయన గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు. కానీ వారిని స్మరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రిత పుట్టి ప్రపంచప్రఖ్యాతి గాంచారు. ఈ జిల్లాకు ఎన్నో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. నేను ఆయన చరిత్ర చదివినప్పుడు వెబ్ సిరీస్గా తీయాలని అనుకున్నాం. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే రెండు కార్లను చేతులతో ఆపిన ఆయన కేవలం శాఖాహారి' అని తన మనసులో మాటను పంచుకున్నారు. శాకాహారి అయిన ఆయన శారీరక ధారుఢ్యంలో ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు. -
తండేల్ మూవీ.. మరోసారి డ్యాన్స్తో అదరగొట్టిన అల్లు అరవింద్
ఈ ఏడాది అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో రూ. 21.27 కోట్లు రాబట్టింది. విడుదలైన వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అలరిస్తోంది. వందకోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. దీంతో ఇటీవలే ఈ మూవీ సక్సెస్ కావడంతో హైదరాబాద్లో గ్రాండ్గా ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా మెప్పించింది.తాజాగా తండేల్ టీమ్ శ్రీకాకుళంలో సందడి చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో చిత్రబృంద సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మరోసారి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఈ చిత్రంలోనే హైలెస్సా.. హైలెస్సా అంటూ సాగే పాటకు స్టెప్పులు వేశారు. హీరోయిన్ సాయిపల్లవితో కలిసి వేదికపై డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాత బన్నీవాసు తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.కాగా.. ఈ చిత్రాన్ని మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. శ్రీకాకుళంకు చెందిన కొందరు మత్స్యకారులు పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున ప్రవేశించారు. దీంతో వారిని పాక్ కోస్ట్గార్డు బంధించి జైల్లో వేశారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. Sweetest moments of Success 💗💗#Thandel @chay_akkineni @Sai_Pallavi92 #AlluAravind pic.twitter.com/HGnQ4tDlS0— Bunny Vas (@TheBunnyVas) February 13, 2025 -
ఈ సినిమాపై కొందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో అభిమానులను అలరించనున్నారు. ఈ నేపథ్యంలోనే లైలా మూవీ రిలీజ్కు ముందు అభిమానులకు విజ్ఞప్తి చేశారు మన యంగ్ హీరో. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'అందరికీ నమస్తే. ఫైనల్గా లైలా విడుదలవుతోంది. కానీ మధ్యలో చాలా అపార్థాలు జరిగాయి. మా టీమ్ తరఫున క్షమాపణలు చెప్పాను మా తప్పు లేకపోయినా. అందరం కోపాలు తగ్గించుకుని.. మిస్ అండర్స్టాండిగ్స్ తగ్గించుకోవాలి. నేను మీలో ఒకడిని. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పాత్రలు చేయగలను. మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాం. నేను గెలిస్తే మీరు గెలిచినట్లే. చాలామంది కొత్త నటులు, డైరెక్టర్ లైఫ్ ఈ సినిమాపై ఆధారపడి ఉంది. ఇప్పటికైనా అందరం కలిసి సినిమాను గెలిపిద్దాం. మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి' అంటూ వీడియోను పోస్ట్ చేశారు.పృథ్వీ వ్యాఖ్యలతో వివాదం..లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్పై లైలా చిత్రబృందం స్పందించింది. హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు చెప్పారు. మా ఈవెంట్లో జరిగినందువల్లే మేము క్షమాపణలు చెబుతున్నట్లు విశ్వక్ సేన్ వెల్లడించారు. తాజాగా నటుడు పృథ్వీ సైతం తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు.#laila pic.twitter.com/pc1Mcpq6ho— VishwakSen (@VishwakSenActor) February 13, 2025 -
ప్రభాస్ చిత్రంలో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు.. డైరెక్టర్ ఎవరంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది కల్కి 2898తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ మారుతి డైరెక్షన్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు.ది రాజాసాబ్లో ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో పని చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్లో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, డైరెక్టర్తో హను రాఘవపూడితో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా.. అనుపమ్ ఖేర్ బాలీవుడ్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో మరింత ఫేమస్ అయ్యారు. ANNOUNCEMENT: Delighted to announce my 544th untitled film with the #Bahubali of #IndianCinema, the one and only #Prabhas ! The film is directed by the very talented @hanurpudi ! And produced by wonderful team of producers of @MythriOfficial ! My very dear friend and brilliant… pic.twitter.com/sBIXCS98t6— Anupam Kher (@AnupamPKher) February 13, 2025 -
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' టీజర్.. కొన్ని గంటల్లోనే రికార్డ్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వీడీ12 వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్తో పాటు టైటిల్ను కూడా రివీల్ చేశారు మేకర్స్. కింగ్డమ్ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. యూట్యూబ్లో 10 మిలియన్స్ వ్యూస్తో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను ఊపేస్తున్నాయి. ఈ టీజర్కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్కు మరింత హైప్ను క్రియేట్ చేసింది. దీంతో కింగ్డమ్ వ్యూస్ పరంగా మరింత వేగంగా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. #Kingdom Teaser delivers all the emotions with KING SIZED MOMENTS! 💥💥💥10M+ views and standing tall! ❤️🔥❤️🔥▶️ https://t.co/rHwYoKCDgI#VD12 #Saamraajya @TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla… pic.twitter.com/HpHNpmxWZi— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2025 -
'లవర్స్ డే రోజున దిల్ రూబా'.. ఫ్యాన్స్కు షాకిచ్చిన కిరణ్ అబ్బవరం
'క' మూవీ సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam) నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్రూబా (Dil Ruba). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లవర్స్ డే కానుకగా సినీ ప్రియులను అలరించనుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా దిల్రూబా మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 14న సినిమాను రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం ఎక్స్ ద్వారా వెల్లడించారు. కొంచెం ఆలస్యంగా వస్తున్నాం.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కిరణ్ హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్టైనర్లో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజున విడుదవుతుందని భావించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే రిలీజైన టీజర్కు అభిమానుల నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది.విశ్వక్ సేన్ లైలా రిలీజ్..అయితే ఈ లవర్స్ డే కానుకగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్లో అభిమానులను అలరించనున్నారు. ఈ మూవీకి రామ్ నారాయణ దర్శకత్వం వహించారు. Koncham late ga vastunam :) #dilruba pic.twitter.com/H6UMPDLuwr— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 12, 2025 -
విజయ్ దేవరకొండ 'వీడీ12'.. టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వీడీ12 టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ విడుదల చేశారు. అయితే ఈ సినిమా టీజర్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా విడుదలైన టీజర్ రౌడీ హీరో ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.అయితే ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అలాగే వీడీ12 మూవీకి హిందీ టీజర్కు యానిమల్ హీరో రణ్బీర్ కపూర్ తన వాయిస్ అందించారు. తమిళంలో స్టార్ హీరో సూర్య వాయిస్తో టీజర్ విడుదల చేశారు మేకర్స్. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోల వాయిస్తో టీజర్ను విడుదల చేయడం విశేషం.తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్లో విజయ్ దేవరకొండ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ ఆడియన్స్ను కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ టీజర్తో కింగ్డమ్పై అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఎదురుచూసిన అభిమానులకు ఆ కోరిక నేటితో తీరింది. 'జెర్సీ' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ కింగ్డమ్ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
బంధువుల పెళ్లిలో ప్రభాస్ సిస్టర్స్.. రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడంటోన్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన తన తాతయ్య గురించి మాట్లాడారు. మా కుటుంబంలో ఆయనకు ఓ ప్రత్యేకమైన అలవాటు ఉండేదని అన్నారు. ఆయన మంచి కళా పోషణ కలిగిన వ్యక్తి అని నవ్వుతూ మాట్లాడారు. బ్రహ్మనందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మెగాస్టార్.చిరంజీవి మాట్లాడుతూ..'మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన స్వస్థలం నెల్లూరు అయితే మొగల్తూరు వచ్చి స్థిరపడ్డారు. అక్కడే స్టేట్ ఎక్సైడ్ ఇన్స్పెక్టర్గా రిటైరయ్యారు. నీకు ఎవరి బుద్ది అయినా రావొచ్చు కానీ.. ఆయన బుద్ధి మాత్రం రాకూడదనేవారు. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. మా ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. వాళ్లద్దరిపై అలిగితే మూడో ఆమె దగ్గరికి వెళ్లేవారు. నాకు తెలిసి ముగ్గురే.. అలా నాలుగు, ఐదు ఉన్నారేమో నాకు తెలియదు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావ్ కదా జాగ్రత్త. అసలే అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయనను మాత్రం ఆదర్శంగా తీసుకొవద్దని చెప్పారు.' అని నవ్వుతూ సరదాగా అన్నారు మెగాస్టార్. ఇంకేముంది ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇదే ఈవెంట్లో బ్రహ్మానందం తన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..'మా అమ్మానాన్నల గురించి చెప్పడం అంటే దేవుడి గురించి చెప్పడమే. నా తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఒకవైపు పేదరికం.. మరోవైపు పెద్దరికంతో బతికారు. నా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఎప్పుడు గర్వపడుతుంటా. మా నాన్న నాకు ఒక మాట చెబుతుండేవారు.. ఒక మనిషి 18 రోజులు భోజనం చేయకపోతే చనిపోతాడు. 17 రోజుల వరకు ఎవరి దగ్గర చేయి చాచి అడగొద్దు. 18వ రోజు తప్పనిసరి అయితేనే ఎవరినైనా సాయం అడుగు అనేవారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తా. నా జీవితంలో అప్పు అనే మాట తావులేదు' అని అన్నారు.కాగా.. బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్తో కలిసి బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవలే ప్రభాస్ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు. -
పెళ్లి వేడుకలో ప్రభాస్ సిస్టర్స్.. రెబల్ స్టార్ మ్యారేజ్పై మొదలైన చర్చ!
టాలీవుడ్ హీరోల్లో ఎవరి పెళ్లి కోసమైనా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే అది ఆయన ఒక్కరిదే. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. గతేడాదిలోనే నాగచైతన్య ఓ ఇంటివాడయ్యారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే అఖిల్ అక్కినేని సైతం పెళ్లి చేసుకోబోతున్నారు. అలా దాదాపు మన హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.ప్రభాస్ పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు..కానీ టాలీవుడ్ ఫ్యాన్స్కు ఇప్పటి వరకు తీరని కోరిక ఏదైనా ఉందంటే అది మన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వేడుకే. ప్రభాస్ పెళ్లి కోసం ఆయన ఫ్యామిలీ కంటే.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్లో ఏదో ఒక సందర్భంలో ఈ టాపిక్ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. అలానే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది.అందుకు కారణం ప్రభాస్ బంధువుల పెళ్లిలో ఆయన ముగ్గురు చెల్లెల్లతో పాటు కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కనిపించారు. పెళ్లిలో వారంతా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేశారు. ఇంకేముంది ప్రభాస్ అన్న పెళ్లి ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన బంధువుల పెళ్లికి కృష్ణంరాజు భార్య శ్యామల దేవి హాజరయ్యారు. ఆమెతో పాటు ముగ్గురు కుమార్తెలు(ప్రభాస్ చెల్లెళ్లు) ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి కూడా ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అందరూ కలిసి దిగిన ఫోటోలను ప్రసీద్ ఉప్పలపాటి తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ప్రభాస్ అన్నకు త్వరగా పెళ్లి చేయండి సిస్టర్స్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ప్రసీద తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారు. మిగిలిన ఇద్దరు సిస్టర్స్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) -
జూనియర్ ఎన్టీఆర్తో విజయ్ దేవరకొండ.. మొత్తానికి లుక్ రివీల్ చేశాడుగా!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీడీ12 టైటిల్, టీజర్ రిలీజ్పై అప్డేట్ ఇచ్చారు. ఈనెల 12న టీజర్తో పాటు టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఒక రోజంతా జీవితం, సమయాలు, సినిమా గురించి మీతో నవ్వుతూ మాట్లాడడం సంతోషంగా అనిపించింది.. టీజర్ డబ్బింగ్ చెబుతున్నప్పుడు మీరు కూడా నాలాగే ఎగ్జైట్ అయ్యారని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక రోజంతా సమయమిచ్చినందుకు థ్యాంక్ యూ తారక్ అన్న అంటూ ఎన్టీఆర్కు ధన్వవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.టీజర్కు ఎన్టీఆర్ డబ్బింగ్..అయితే విజయ్ దేవరకొండ తాజా చిత్రం వీడీ12కు జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. బుధవారం రిలీజ్ చేయనున్న టీజర్కు ఎన్టీఆర్ తన వాయిస్ను అందించారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. మాకు అవసరమైన సమయంలో మాకు మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు అన్న.. మీ వాయిస్తో వీడీ12 టీజర్ భావోద్వేగాలను మరోస్థాయికి తీసుకెళ్తుందని నాగవంశీ ట్వీట్ చేశారు.అయితే ఈ పోస్ట్లో విజయ్ దేవరకొండ లుక్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ మొహం కనిపించకుండా ఫోటోను పోస్ట్ చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ను కలిసిన సందర్భంగా తన వీడీ12 లుక్ను అభిమానులకు పరిచయం చేశాడు. ఫుల్ గడ్డంతో మాస్ హీరోగా దర్శనమిచ్చారు రౌడీ హీరో. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Spent most of yesterday with him. Chatting about life, times, cinema. Laughing about the same.. Sat through the dub of the teaser, him as excited as me seeing it come to life. Thank you @tarak9999 anna for a most wholesome day and for bringing your madness to our world… pic.twitter.com/f8YpVQcJSt— Vijay Deverakonda (@TheDeverakonda) February 11, 2025 -
మీ అందరికీ క్షమాపణలు.. మా సినిమాతో అతనికి సంబంధం లేదు: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా లైలా టీమ్ హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈవెంట్లో టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన చేసిన కామెంట్స్పై లైలా చిత్రబృందం స్పందించింది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు చెప్పారు. మా ఈవెంట్లో జరిగినందువల్లే మేము క్షమాపణలు చెబుతున్నట్లు విశ్వక్ సేన్ వెల్లడించారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన లైలా మూవీ టీమ్ టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తి మాట్లాడిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు. ఎందుకంటే నా ఈవెంట్లో జరిగినందువల్లే మీ అందరికీ సారీ చెబుతున్నా. అతను నటించాడు సినిమాలో. రెండు రోజుల్లో మా సినిమా జనాల్లోకి వెళ్తోంది. కానీ నా సినిమాను చంపేయకండి. ఏ వ్యక్తితో మాట్లాడి మేము ఈ విషయాన్ని లాగదలుచుకోవడం లేదు. సపోర్ట్ లైలా అంతే. అతను మాట్లాడిన దానికి.. మా సినిమాకు సంబంధం లేదు. సినిమా ఈవెంట్లో పాలిటిక్స్, నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే. చాలా కష్టపడి సినిమా తీశాం. నేను ఈ వివాదం ఇంతటితో ముగిస్తున్నా. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దంటూ' అభిమానులకు విజ్ఞప్తి చేశారు.నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా ట్రెండ్ అవ్వడం చూసి షాక్కు గురయ్యాం. అది మాకు తెలిసి జరగలేదు. సినిమాని అందరూ సినిమాగా చూడండి. గెస్ట్లుగా వచ్చిన వాళ్లు ఏమి మాట్లాడతారో మాకు తెలీదు' అని అన్నారు.పాలిటిక్స్ నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే.. దానికి నేను క్షమాపణ చెప్తున్నా 🙏 - Mass Ka Das #VishwakSen#Laila #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Ug5vuKKySM— Telugu FilmNagar (@telugufilmnagar) February 10, 2025 -
రామ్ చరణ్ ఫ్యాన్స్కు లవర్స్ డే కానుక.. రొమాంటిక్ చిత్రం రీ రిలీజ్
రామ్ చరణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ అభిమానులను రొమాంటిక్ ఎంటర్టైనర్ అలరించనుంది. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఆరెంజ్ ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆరెంజ్ సినిమా (Orange Movie) రీ రిలీజ్ కానుంది. ఆరెంజ్ సినిమా (Orange Movie) వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న థియేటర్లలో సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. హరీశ్ జయరాజ్ సంగీతం అందించాడు.ఈ చిత్రంలో షాజాన్ పదమ్సీ, ప్రభు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాగ బాబు కీలక పాత్రల్లో నటించారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ16 పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీతో సినీ ప్రియులను అలరించాడు చెర్రీ. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. -
పుష్ప వల్లే విదేశాల్లో కూడా గుర్తు పడుతున్నారు: సునీల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్గా రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో మెప్పించారు.పుష్ప-2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన వారికోసం థ్యాంక్స్ మీట్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు పుష్ప-2 టీమ్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన టాలీవుడ్ నటుడు సునీల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా వల్లే తనను ఎక్కడికెళ్లినా గుర్తు పడుతున్నారని తెలిపారు. స్పెయిన్లో షూటింగ్ జరుగుతుండగా కొందరు పాకిస్తాన్ అభిమానులు తనను గుర్తు పట్టారని వెల్లడించారు. అంతేకాదు తమకు భోజనాలు వండి పెట్టారని సునీల్ వివరించారు.సునీల్ మాట్లాడుతూ.. 'మూవీ షూట్ కోసం ఇటీవల స్పెయిన్ వెళ్లా. రాత్రి 10 గంటలకు అక్కడ రెస్టారెంట్లు క్లోజ్ చేస్తారు. నేను 9.45 గంటల సమయంలో ఒక పెట్రోల్ బంక్కు వెళ్లి స్నాక్స్ కోసం అక్కడే ఉన్న స్టోర్కి వెళ్లి అడిగా. కానీ అది అప్పటికే క్లోజ్ చేశారని అక్కడే ఉన్న ఓ మహిళ చెప్పింది. ఆ తర్వాత దగ్గర్లో హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని వెతికా. కబాబ్ పాయింట్ అనే ఓ చిన్న హోటల్ కనిపించింది. ఇండియన్ ఫుడ్కు సంబంధించిన హోటల్ అయి ఉండొచ్చని అక్కడి వెళ్లా. అప్పుడు సమయం అర్ధరాత్రి రెండున్నర అయింది. మేము కారు దిగగానే ఓ వ్యక్తి నన్నే అలాగే చూస్తూ ఉన్నాడు. వెంటనే తన ఫోన్లో పుష్ప ఇంటర్వెల్ సీన్ చూపించి మీరే కదా అని అడిగాడు. ఆ తర్వాత తెలిసింది అది పాకిస్థానీయుల రెస్టారెంట్ అని. నాతోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరికీ వారు వంట చేసి పెట్టారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడా' అని పంచుకున్నారు. పుష్ప తర్వాత తమిళం, కన్నడ, మలయాళంలో మంచి పాత్రలు వస్తున్నాయని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. నన్ను చూస్తే అందరికీ పుష్ప సినిమానే గుర్తుకు వస్తోందని అన్నారు. True global sensation @alluarjun 🙏🔥#Pushpa2TheRule #AlluArjun pic.twitter.com/B7phDjPLBh— Mad Max (@madmaxtweetz) February 8, 2025 -
స్నేహితులతో కలిసి మహాకుంభ మేళాకు ఉపాసన.. పోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్ మేళాకు వెళ్లారు. తన సోదరి, మరికొందరు స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్తున్న ఫోటోలను ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆరు గంటలకే ప్రయాగ్ రాజ్ విమానాశ్రయం చేరుకున్నట్లు పోస్ట్లో తెలిపింది. యూపీలోని ప్రయాగ్రాజ్లో కొద్ది రోజులు పలువురు సినీ ప్రముఖులు సైతం గంగానదిలో పవిత్రస్నానాలు ఆచరించారు. మూడు లడ్డూలతో కలిసి కుంభ్ మేళాను వెళ్తున్నానంటూ తన ఫ్రెండ్స్ను ఉద్దేశించి ఫన్నీగా రాసుకొచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్ సెట్లోని ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నందున రామ్ చరణ్ యాత్రకు వెళ్లలేదు. ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్ మూవీతో అభిమానులను పలకరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయింది.యూపీలో జరుగుతున్న కుంభ మేళాకు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ తన తల్లితో కలిసి ప్రయాగ్రాజ్ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తన తల్లి మాధవితో కలిసి మహాకుంభ్ మేళాకు హాజరయ్యారు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఇటీవలే కుంభ్ మేళాలో కనిపించారు. -
తండేల్ను వదలని పైరసీ భూతం.. రెెండో రోజే ఆన్లైన్లో ప్రత్యక్షం!
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ (Thandel Movie) మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది.తండేల్ను వదలని పైరసీ భూతం..అయితే సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. తాజాగా తండేల్ మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. సినీ ఇండస్ట్రీకి తీరని సమస్యగా మారింది. విడుదలైన రెండో రోజే తండేల్ సినిమా ఆన్లైన్లో పలు వెబ్సైట్స్లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిల్మీ జిల్లా లాంటి పైరసీ సైట్లో తండేల్ పూర్తి సినిమా అప్లోడ్ చేసినట్లు సమాచారం. దీంతో తండేల్ మూవీ మేకర్స్ ఆందోళనకు గురవుతున్నారు.కాగా.. అంతకుముందే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విడాముయార్చి మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. ఈ చిత్రం రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లో అప్లోడ్ చేసేశారు. సినీ ఇండస్ట్రీ, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పైరసీ కేటుగాళ్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా పైరసీ చేసేవారిని కఠినంగా శిక్షించాలని నిర్మాతలు, సినీ ప్రియులు కోరుతున్నారు. తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్..తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్ను తండేల్ దాటేసింది.విదేశాల్లోనూ హవా..విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
సాయిరామ్ శంకర్ సస్పెన్స్ థ్రిల్లర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
పూరి జగన్నాథ్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరో సాయిరాం శంకర్. 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో సినిమాలు చేసిన వినోద్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్కు ముందే విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని మూవీ టీమ్ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.ఒక పథకం ప్రకారం కథేంటంటే..ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్లగా అక్కడ భార్య మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని), సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ముందు నుంచే హింట్ ఇస్తూ వచ్చారు మేకర్స్ దానికి తోడు విలన్ ఎవరో కనిపెడితే పట్టుకుంటే పదివేలు అనే అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. సినిమా ఓపెనింగ్ నుంచే కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్లో ఏది గతమో.. ఏది ప్రస్తుతమో అర్థకాక ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజన్కి గురవడం ఖాయం. అయితే సిద్ధార్థ హత్య కేసులో చిక్కుకున్న తర్వాత సినిమా మీద ప్రేక్షకులలో కొంత క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ హీరో మీద అనుమానాలు పెంచేలా ఉంటుంది.ఆ తర్వాత సెకండ్ హాఫ్ పూర్తిగా గ్రిప్పింగ్గా తీసుకువెళ్లడంలో డైరెక్టర్ కొంతమేర సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు అంచనా వేసే విధంగానే ఉన్న దానిని కనెక్ట్ చేయడం మాత్రం ఫర్వాలేదనిపించేలా ఉంది. అయితే అసలు విలన్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ చిత్రం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితం సినిమా కావడంతో విజువల్స్ కొన్ చోట్ల లాజిక్ లెస్ సీన్స్గా ఉన్నాయి. కానీ సస్పెన్స్ విషయంలో మాత్రం దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. క్లైమాక్స్ కూడా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మలయాళ దర్శకుడు కావడంతో మలయాళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..నటీనటుల విషయానికి వస్తే లాయర్ పాత్రలో సాయిరాం శంకర్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఆషిమా నర్వాల్ తన పాత్ర మేర మెప్పించింది. కొంత సేపైనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖని, శృతి సోది, సుధాకర్ వంటి వారు తమ పాత్రల పరిధిలో న్యాయం చేశారు. ఇక సాంకేతి అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కత్తెరకు పని చెప్పాల్సింది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'మీ నాన్నకు తెలియనంత జాబ్ ఏం చేస్తున్నావ్?'.. ఆసక్తిగా టీజర్
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) 'జాక్' (Jack)మూవీతో అభిమానులను అలరించనున్నారు. గతేడాది టిల్లు స్క్వేర్తో ఫ్యాన్స్ను మెప్పించిన సిద్ధు మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న జాక్లో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఇవాళ సిద్ధు పుట్టిన రోజు కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా జాక్ మూవీ టీజర్ను ఫ్యాన్స్కు పరిచయం చేశారు.టీజర్ చూస్తే తండ్రి, కుమారుల మధ్య జరిగే స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సన్నివేశాలు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య, సిద్ధు మధ్య వచ్చే డైలాగ్స్ ఫ్యాన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, వీకే నరేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. #Jack Konchem Crack 😉But adento adagoddu - It’s confidential 🤫 Presenting an exhilarating character who will run a MASSIVE entertainment show 🔥— https://t.co/VWrugmWs2n#JackTeaser out now! #JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @SVCCofficial… pic.twitter.com/gQYQjYSW4o— SVCC (@SVCCofficial) February 7, 2025 -
'థౌజండ్ వాలా'గా ఎంట్రీ ఇస్తోన్న అమిత్.. ఆసక్తిగా పోస్టర్
అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్న టీమ్.. 1000వాలా నుంచి పోస్టర్ను రిలీజ్ చేసింది. త్వరలోనే పాటలు, ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో ఆడియన్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనేక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సత్తా ఉంది. ఈ సినిమా అందరి అంచనాలను మించి తప్పక భారీ విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సుమన్, నమిత, కీర్తి, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
నాగచైతన్య తండేల్ మూవీ.. సాయిపల్లవిలా అదరగొట్టిన దేవీశ్రీ ప్రసాద్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.అయితే ఈ మూవీ రిలీజ్కు ముందు దర్శకుడు చందు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తండేల్ను వీక్షించారు. సినిమా ఫైనల్ కాపీ చూసిన దేవీశ్రీ, చందు డ్యాన్స్తో అదరగొట్టారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాంగే పాటకు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తండేల్ సినిమా ఫర్ఫెక్ట్గా రావడంతో సంతోషంతో డ్యాన్స్ చేశారు. దీంతో తండేల్ సూపర్ హిట్ కావడం ఖాయమని ఫ్యాన్స్తో పాటు మేకర్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.(ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)మత్స్యకార బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ చిత్రాన్ని రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. గుజరాత్లో చేపల వేటకు వెళ్లిన కొందరు శ్రీకాకుళం మత్స్యకారులను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తండేల్ మూవీని రూపొందించారు. నిజజీవితంలో జరిగిన కథ కావడంతో తండేల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా శోభితతో నాగచైతన్య పెళ్లి తర్వాత వస్తోన్న మొదటి చిత్రం కావడం మరో విశేషం. ఏదేమైనా చైతూ ఖాతాలో హిట్టా? సూపర్ హిట్టా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. వస్తున్నాం దుల్లగొడ్తున్నాం 🌊🔥⚓That's the tweet. 😎🤙🏻#Thandel in cinemas from tomorrow 🔥 pic.twitter.com/YLclLTci5L— Geetha Arts (@GeethaArts) February 6, 2025 -
'మా మధ్య కాంపౌండ్స్ వేయకుర్రి'.. విశ్వక్ సేన్ అదిరిపోయే రిప్లై
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున అభిమానులను పలకరించనున్నారు. విశ్వక్ విభిన్నమైన పాత్రతో ఫ్యాన్స్ను అలరించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ఏఏఏ సినిమాస్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు.అయితే ఈవెంట్లో విశ్వక్ సేన్కు ఊహించని ప్రశ్న ఎదురైంది. మీరు ఈవెంట్స్కైనా నందమూరి హీరోలను పిలుస్తుంటారు కదా? సడన్గా మెగాస్టార్(బాస్)ను పిలిచారు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి విశ్వక్ సేన్ తనదైన స్టైల్లోనే అదిరిపోయే సమాధానం ఇచ్చారు. మాకు ఉన్నది ఒక్కటే కాంపౌండ్ అని విశ్వక్ సేన్ స్పష్టం చేశారు. మీరే మా మధ్య ఏదేదో సృష్టించవద్దని కోరారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' మా మధ్యలో కాంపౌండ్లు వేసేది మీరే. మాకు ఉన్నది ఇంటి కాంపౌండ్ ఒక్కటే. ఇక్కడ కంపౌండ్ లాంటివి ఏం లేవు. ఇండస్ట్రీ అంతా ఒక్కటే. బాస్ ఇజ్ బాస్. ప్రతిసారి వారిని ఇబ్బంది పెట్టి మా ఈవెంట్స్కు పిలవం కదా. మా నాన్న గారికి రాజకీయాల నుంచి చిరంజీవితో పరిచయం ఉంది. ఆ టైమ్లో మా డాడీ మలక్పేట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నా చిన్నప్పటి నుంచి వారి మధ్య మంచి రిలేషన్ ఉంది. కానీ మీరు వచ్చి ఇక్కడ లేనీ పోనీ కాంపౌండ్స్ వేయకండి. మీరు వచ్చి మధ్యన లేనివీ సృష్టించకండి. ఇండస్ట్రీలో ఎప్పటికైనా మేమంతా ఒక్కటే. మేము మంచి ఉద్దేశంతో సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు వారిని పిలుస్తాం. అంతే తప్ప ఇక్కడ అలాంటివే ఉండవు. మీరొచ్చి దాంటో ఏమీ వేయకుర్రి ' అని కాస్తా గట్టిగానే బదులిచ్చారు. రిపోర్టర్: ఏ EVENT కి అయినా నందమూరి HEROS ని పిలుస్తారు.. ఈసారి #Chiranjeevi గారు ఎందుకు?#VishwakSen: మీరు COMPOUND అనకండి.. నాకున్నది మా ఇంటి COMPOUND మాత్రమే.. #Laila #NandamuriBalakrishna #JrNTR #TeluguFilmNagar pic.twitter.com/a6NQeMjo9j— Telugu FilmNagar (@telugufilmnagar) February 6, 2025 -
విశ్వక్ సేన్ 'లైలా'.. ట్రైలర్ వచ్చేసింది
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా. ఈ మూవీ లేడీ పాత్రలో అభిమానులను అలరించనున్నాడు మన యంగ్ హీరో. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం రోజున థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్కు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ఏఏఏ సినిమాస్లో లైలా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ట్రైలర్ చూస్తే అభిమానులకు ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఖాయంగా కనిపిస్తోంది. లేడీ గెటప్లో విశ్వక్ సేన్ నటన అద్భుతమైన ఫర్మామెన్స్తో ఆకట్టుకున్నాడు. ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఫ్యాన్స్ను అలరించనుంది. సోనూ మోడల్గా మాస్ కా దాస్ అభిమానులకు లవర్స్ డే రోజున అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. ఇంకేందుకు ఆలస్యం లైలా కోసం వెయిట్ చేస్తున్న మజ్నులంతా ట్రైలర్ చూసేయండి. The fun and humor will go to the next level with Laila and Sonu Model 💥💥💥The entertaining #LailaTrailer out now ❤🔥▶️ https://t.co/ytb4SlU2qV#Laila GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹 @RAMNroars #AkankshaSharma @sahugarapati7 @Shine_Screens @leon_james… pic.twitter.com/Pf9QSZOfnn— VishwakSen (@VishwakSenActor) February 6, 2025 -
షూటింగ్లో బిజీగా రామ్ చరణ్.. సెట్లో క్లీంకార సందడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16తో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చెర్రీ నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన ఫోటోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ముద్దుల కూతురు క్లీంకారను ఎత్తుకుని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఈ పోస్ట్ చూసిన ఉపాసన కామెంట్ చేసింది. ఫోమో అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ సైతం లవ్ సింబల్ పోస్ట్ చేశాడు. కాగా.. ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతోంది. ఇక్కడ రామ్ చరణ్పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా తొలిసారిగా రామ్ చరణ్తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ప్రయాగ్ రాజ్లో పుష్పరాజ్.. పోలీసులు ఫిదా!
అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఇటీవల పుష్ప-2 ఓటీటీలో విడుదలవగా.. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్పై తెగ చర్చింకుంటున్నారు. హాలీవుడ్ అభిమానులు సైతం పుష్ప ఫైట్ సీన్పై వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లే పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక ఇండియావ్యాప్తంగా బన్నీ క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. పుష్ప-2 నార్త్లో ప్రభంజనం సృష్టించింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. గతంలో ఏ హిందీ సినిమాకు సాధించని ఘనతను సొంతం చేసుకుంది. దీంతో సౌత్ కంటే నార్లోనే పుష్పరాజ్ హవా ఎక్కువగా కొనసాగింది. దీంతో ఉత్తరాది ఫ్యాన్స్ బన్నీ మేనరిజానికి ఫిదా అయిపోయారు. పుష్ప స్టైల్లో డైలాగ్స్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.తాజాగా ఓ అభిమాని అచ్చం పుష్పరాజ్ స్టైల్లో కనిపించి సందడి చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని ప్రయాగ్రాజ్లో మహాకుంభ్ మేళాకు వచ్చాడు. పవిత్ర స్నానం చేసిన అల్లు అర్జున్ అభిమాని అచ్చం పుష్ప సినిమాలో దుస్తులు ధరించి డైలాగ్స్తో అదరగొట్టాడు. ఇది చూసిన పోలీసులు అతని స్టైల్కు ఫిదా అయ్యారు. అతన్ని చెప్పే డైలాగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.(ఇది చదవండి: పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్!)కాగా.. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసింది. తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప-2 ఓవరాల్గా రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో మెప్పించారు.Prayagraj: A fan of Allu Arjun, who came from Maharashtra to take the Maha Kumbh bath.During this, the fan also recited many dialogues from the movie Pushpa while acting, which became a topic of discussion among the devotees present there.#Prayagraj #AlluArjunFan #Mahakumbh pic.twitter.com/mK0s1wtasA— Our North East (@1OurNortheast) February 6, 2025महाकुम्भ स्नान करने के लिए महाराष्ट्र से आए अल्लू अर्जुन के एक फैन ने संगम में आस्था की डुबकी लगाई। इस दौरान फैन ने पुष्पा फिल्म की एक्टिंग करते हुए कई डायलॉग भी सुनाए, जो वहां मौजूद श्रद्धालुओं के बीच चर्चा का विषय बने। #Prayagraj #AlluArjunFan #Mahakumbh @MahaaKumbh pic.twitter.com/wxetmRuQoH— Dinesh Tiwari 🇮🇳 (@TiwariDineshTi1) February 5, 2025 -
ఆ 3 సినిమాలూ పుష్ప-2 కి పోటీ? ఎన్టీఆర్ - బన్నీ ఫైట్
అల్లు అర్జున్ మాస్ తాండవం చేసిన పుష్ప 2: రూల్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. తెలుగు సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా చాటింది. సుకుమార్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ చిత్ర నార్త్ సర్క్యూట్లో కలెక్షన్ల ఎర్త్క్వేక్స్ సృష్టించింది. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ దగ్గర పోగుపడిన అన్ని రికార్డులను తుడిచిపెట్టింది కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి రాబోయే సంచలన చిత్రాలకు పుష్ప 2 సెట్ చేసిన బెంచ్ మార్క్ రూ. 857.50 కోట్ల గ్రాస్. దీంతో ఈ అంకెను క్రాస్ చేసే సినిమా ఏది కావొచ్చనే అంశంపై ఆసక్తితో పాటు స్పెక్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి.పుష్ప2 రికార్డ్ బ్రేక్ చేయగలవు అనే అంచనాలున్న సినిమాలుగా ట్రేడ్ విశ్లేషకులు మూడింటిని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. అవేమిటంటే... వార్- 2, కాంతార- 2, హేరా ఫేరి -3 ... ఈ మూడింటిలో ఒకటి లేదా 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని తుడిచిపెట్టగలవని అంచనా వేస్తున్నారు.సీక్వెల్తో సీక్వెల్పై యుద్ధం..పుష్ప 2కు ప్రధాన పోటీదారుగా ఉన్న వార్- 2 సినిమా ఉత్తరాది, దక్షిణాది నుంచి ఇద్దరు సూపర్స్టార్స్ నటించిన చిత్రం కావడం విశేషం. నార్త్ నుంచి హృతిక్ రోషన్ సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ చిత్రం ఖచ్చితంగా పుష్ప2ని మించే అవకాశాలున్నాయని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 2025లో అత్యంత హైప్ చేయబడిన చిత్రం. స్పై యాక్షన్ డ్రామా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటోంది. వార్ 2 హిట్ అయితే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తదుపరి రూ.1000 కోట్ల గ్రాసర్గా నిలవడం ఖాయం. అలాగే నార్త్లోనూ రికార్డ్స్ బద్ధలవ్వొచ్చు. అదే జరిగితే టాలీవుడ్ హీరోల్లో బన్నీ మీద ఎన్టీయార్పై చేయి సాధించినట్టు కూడా అవుతుంది.కాంతారా... కలెక్షన్ల జాతరా?అదే సమయంలో కాంతారా ద్వారా అఖిల భారత స్థాయిలో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతోంది. వార్- 2 స్థాయిలో స్టార్స్ లేనప్పటికీ... తొలి భాగం సాధించిన భారీ విజయంతో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ ఆసక్తికి తగ్గట్టుగా కాంతారా తగిన బజ్ క్రియేట్ చేస్తే... తప్పకుండా పుష్ప రికార్డులపైకి గురి పెట్టొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన ఈ చిత్రం కూడా హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందితే 1000 కోట్ల రూపాయల క్లబ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.కామెడీతో కొట్టగలరా?బాక్సాఫీస్ పందెం కోళ్లలో పుష్ప-2కి మూడవ అతిపెద్ద పోటీ హేరా ఫేరి 3.. ఈ కల్ట్ కామెడీ మూడవ భాగం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది. ప్రియదర్శన్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు ధృవీకరించారు. అయితే ఈ సినిమా ఎంత బాగా తీశారు అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. మరోవైపు గత కొంత కాలంగా మంచి క్వాలిటీ కామెడీ ఎంటర్టైనర్ల కోసం ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ప్రియదర్శన్ హేరా ఫేరి బృందం దానిని అందించడంలో విజయవంతమైతే, ఈ చిత్రం ఇప్పటికే ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయవచ్చు.అంత ఈజీ కాదు...అయితే ఏది ఏమైనప్పటికీ, పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ రికార్డులను సవాలు చేయడం మాత్రం రాబోయే ఏ చిత్రానికి అంత సులభం కాదనేది నిజం ఎందుకంటే థియేటర్లలో అల్లు అర్జున్ సినిమా దాదాపు రెండు నెలలు నడిచింది, పెద్ద సినిమా ఏదీ దీనికి రోడ్బ్లాక్గా మారలేదు. పైన పేర్కొన్న సినిమాలు మార్కెటింగ్ ప్రమోషనల్ కార్యకలాపాలతో హైప్ను కొనసాగించగలిగితే, కంటెంట్తో ప్రేక్షకులను అలరించడంతో పాటు కనీసం 6 వారాల పాటు క్లీన్ ఫ్రీ థియేట్రికల్ ర¯Œ ను పొందగలిగితే, అవి పుష్ప 2 చారిత్రక రికార్డుకు ముప్పు తప్పదు. పై మూడింటితో పాటు ఇంకా పేరు పెట్టని అట్లీ–సల్మాన్ ఖాన్ చిత్రం రణబీర్ కపూర్ నటించిన రామాయణం, యానిమల్ పార్క్ బాక్సాఫీస్ రికార్డ్స్పై కన్నేశాయి. ఇవి కూడా పుష్ప 2 యొక్క హిందీ కలెక్షన్లను బద్దలు కొట్టగల శక్తి ఉన్నవేనని చెబుతున్నా -
'పుష్ప-2కు ఇంటర్నేషనల్ క్రేజ్'.. తమ్ముడి ట్వీట్ వైరల్!
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీపై ఐకాన్ స్టార్ తమ్ముడు అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ చిత్రానికి.. ఓటీటీలోనూ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దాదాపు ఏడు దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పుష్ప-2 చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆదరిస్తున్నందుకు అల్లు శిరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మీ సంస్కృతికి.. అంతగా పరిచయం లేని చాలా భిన్నమైన ఇలాంటి చిత్రానికి ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. క్లైమాక్స్ సీన్పై ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ స్పందించడం అద్భుతమని పోస్ట్ చేశారు.సుకుమారా- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప- 2 ది రూల్ జనవరి 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్తో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్రలో మెప్పించారు. టాలీవుడ్ నుంచి జగపతి బాబు, సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో ఫ్యాన్స్ను ఆకట్టుకున్నారు. I am glad the Pushpa 2 is receiving insane love from Western audience as well. Esp for a film like this which is vastly different from their culture or something they're not too familiar with.. @alluarjun @aryasukku @ThisIsDSP @MythriOfficial https://t.co/KprBKRPluw— Allu Sirish (@AlluSirish) February 4, 2025 -
నాగచైతన్య తండేల్.. టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం తండేల్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిలిచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో రూ.50 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే మల్టీప్లెక్స్ల్లో రూ.75 అదనంగా వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులను బంధించి పాక్కు తీసుకెళ్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా కోసం చైతూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్..తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. -
మా పెళ్లి ప్లానింగ్ అంతా తనదే: నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్గా కనిపించనుంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మన తండేల్ హీరో చైతూ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన భార్య శోభిత ధూలిపాళ్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా వెడ్డింగ్ ప్లానింగ్ విషయంలో క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందన్నారు. శోభిత మన తెలుగు సంప్రదాయాలను పాటిస్తుందని తెలిపారు. మా పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆమెనే డిజైన్ చేసిందని వెల్లడించారు. నా జీవితంలో ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేనని నాగచైతన్య అన్నారు. -
'అలా వైకుంఠపురములో చిత్రంపై పూజా హెగ్డే కామెంట్స్'.. బుట్టబొమ్మపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం
టాలీవుడ్లో బుట్టబొమ్మగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే దేవా మూవీలో షాహిద్ కపూర్ సరసన కనిపించింది. ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే అంతుకుముందు ఈ సినిమా ప్రమోషన్లలో మెరిసింది పూజా హెగ్డే. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో మాట్లాడింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్గా మారాయి. అంతే కాదు.. బుట్టబొమ్మ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందా.టాలీవుడ్లో పూజా హెగ్డే పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్స్తో సినిమాలు చేశారు. అల్లు అర్జున్ సరసన అలా వైకుంఠపురములో పూజా హెగ్డే మెరిసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని ఉద్దేశించి తాజాగా పూజా చేసిన కామెంట్స్ ఆగ్రహానికి దారితీశాయి. అలా వైకుంఠపురములో మూములుగా తమిళ చిత్రం అంటూ మాట్లాడింది. అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారని మాట్లాడింది. దీంతో పూజా హెగ్డే కామెంట్స్పై టాలీవుడ్ ఫ్యాన్స్తో పాటు బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అసలు మీరు ఏ భాషలో మూవీ చేశారో కూడా మర్చిపోయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలు చూస్తుంటే సిగ్గుగా ఉందని.. తెలుగు చిత్రంలో మీరు లీడ్ రోల్ చేసిన సినిమాను తమిళ్ చిత్రమని ఎలా చెబుతారంటూ నిలదీస్తున్నారు. కాగా.. అలా వైకుంఠపురములో హిందీ రీమేక్లో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను షెహజాదాగా బాలీవుడ్లో రిలీజ్ చేయగా.. ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది. -
'దయచేసి నా అభిమానులు ఆ పని చేయొద్దు'.. జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. మిమ్మల్ని కలిసేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని తెలిపాడు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని అన్నారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా మాట్లాడతానని వెల్లడించారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పాదయాత్రలు చేయొద్దు..అయితే తనను కలిసేందుకు పాదయాత్రలు లాంటివి చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. మీ సంక్షేమమే నాకు ముఖ్యమన్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న మీ ఆసక్తిని అర్థం చేసుకుని వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అధికారులతో అన్ని అనుమతులు తీసుకుని.. అందరినీ సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని తెలిపారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది.. ఈ విషయంలో అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.గతేడాది దేవర మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.A Statement from @tarak9999 Office#JrNTR #ManOfMasses𝐍𝐓𝐑#Devara #war2 #Ntrneel pic.twitter.com/erzTOohW0R— TigerNation 🐯 (@IamGanesh1718) February 4, 2025 -
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఇటీవల పుష్ప-2 ది రూల్ ఓటీటీకి కూడా వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అదనంగా యాడ్ చేసిన సీన్స్తో పాటు ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం అడియన్స్కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. అల్లు అర్జున్ గాల్లోకి ఎగిరే ఫైట్ సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఆ ఫైట్ సీక్వెన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు.బన్నీ ఫైట్ సీక్వెన్స్ వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ సైతం స్పందించారు. అమెరికా చిత్రాల కంటే బాగానే ఉందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మార్వెల్లో కూడా ఈ క్రియేటివీటీ సాధ్యం కాలేదు.. కానీ వాళ్లు చేసి చూపించారు అని మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. మరికొందరైతే పుష్ప-2 గ్లోబల్, ఇంటర్నేషనల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా పుష్పరాజ్ మూవీలోని డైలాగ్ను నిజం చేశారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Action scene from an Indian movie pic.twitter.com/k9lhfXDIdp— non aesthetic things (@PicturesFoIder) February 3, 2025 -
నెల రోజుల్లోపే ఓటీటీకి డాకు మహారాజ్.. ఆ డేట్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద రాణించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ వారంలోనే డాకు మహారాజ్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.#DaakuMaharaj OTT Release Sets to Premeire This Sunday on Netflix In Tamil Telugu Malayalam Kannada pic.twitter.com/SQbZvxNEqM— SRS CA TV (@srs_ca_tv) February 3, 2025 -
Rag Mayur: కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్
సినిమా బండి మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవలే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సివరపల్లి అనే వెబ్ సిరీస్లో హీరోగా నటించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి పాత్రలో మెరిశారు. ‘పంచాయత్’ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదవాలి అనుకునే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోకుండా పంచాయతీ సెక్రటరీగా మారితే ఎలా ఉంటుందనే కోణంలో తెరెకెక్కించారు. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే అదే రోజు గాంధీ తాత చెట్టు అనే సినిమా రిలీజైంది. సుకుమాక్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్గా సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ మరోసారి మెరిశాడు. నిజానికి అతనికి సినిమాలో ఉన్న స్క్రీన్ టైం తక్కువే అయినా తనదైన శైలిలో ఉన్న కాసేపు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో రాగ్ మయూర్ ఉండడంతో అది మరింత బాగా కలిసొచ్చింది. ఒకేరోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాతో పాటు సివరపల్లి వెబ్ సిరీస్ రెండిటికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఇలా భిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగులో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని భావిస్తున్న రాగ్ మయూర్.. ఇప్పటికే గీత ఆర్ట్స్2 లో ఒక పేరు పెట్టని సినిమాతో పాటు పరదా, అలాగే గరివిడి లక్ష్మి సినిమాలో కూడా నటిస్తున్నాడు.‘సివరపల్లి’ వెబ్ సిరీస్, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్గా రెండు భిన్న పాత్రలతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాగ్ మయూర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో దూసుకెళ్తున్నాడు. చదువులో స్టేట్ టాపర్ అయిన రాగ్ మయూర్ ప్రశాంతంగా చదువు పూర్తి చేసి తర్వాత నటన మీద శ్రద్ధ పెట్టాడు.. సినిమాల గురించి రివ్యూస్ రాసే స్థాయి నుంచి ఈరోజు అదే రివ్యూలలో తన గురించి రాయించుకునే స్థాయికి నటనతో ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.రాగ్ మయూర్ మొదటి సినిమా సినిమా బండిలో మరిడేష్ బాబు అనే పాత్రతో మెరిశాడు. ఆ పాత్రలో రాగ్ మయూర్ నటనతో సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక ఆ తర్వాత భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెళుతున్నాడు. భిన్నమైన జానర్ సినిమాలు చేస్తూ అందులో భాగంగానే కీడా కోలా అనే సినిమాలో లాయర్గా, బ్రహ్మానందం మనవడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వీరాంజనేయులు విహారయాత్రలో కూడా ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని పరితపించే సగటు కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అతని పాత్రల ఎంపిక చూస్తే ఏ ఒక్క దానికి మరో పాత్రకి సంబంధం ఉండదు. అలా భిన్నమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. -
తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్ప్రైజ్ వీడియోను అక్కినేని నాగచైతన్య షేర్ చేశారు. ది జర్నీ ఆఫ్ తండేల్(Thandel Transformation) పేరుతో గ్లింప్స్ను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. నాగచైతన్య తండేల్ రాజ్గా మారడాన్ని ఇందులో చూపించారు. తండేల్ షూటింగ్లో చైతూ జర్నీని వీడియో రూపంలో ప్రేక్షకులకు అందించారు. చైతూ నుంచి ఇంతలా ఫర్మామెన్స్ మాత్రం ఊహించలేదని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు.మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.Becoming Thandel Raju was challenging and extremely satisfying Here’s a glimpse into the journey https://t.co/uEuMtmVwWj-- #Thandel RajuSEE YOU ALL IN CINEMAS 7TH FEB. #ThandelonFeb7th pic.twitter.com/8rx997jCro— chaitanya akkineni (@chay_akkineni) February 3, 2025 -
మంచు ఫ్యామిలీ వివాదం.. కలెక్టర్ ఎదుట హాజరైన మోహన్ బాబు
మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. వీరి కుటుంబంలో ఆస్తి తగాదాలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. తాజాగా మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. కాగా.. మంచు మనోజ్ తన ఆస్తిలో పాగా వేశారంటూ కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మేజిస్ట్రేట్ హోదాలో వీరిద్దరికీ నోటీసులు జారీ చేయడంతో మోహన్ బాబు కూడా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. ఈ విషయంలో ఇప్పటికే మంచు మనోజ్ను అధికారులు విచారించారు.గతేడాది మొదలైన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. మొదట హైదరాబాద్లోని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసానికి మనోజ్ వెళ్లగా అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.పరస్పరం ఫిర్యాదులు..తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. కానీ, తనపై దాడి చేసింది ఎవరో ఆయన పేర్కనలేదు. అయితే, అది జరిగిన గంటలోనే మోహన్బాబు వాట్సాప్ ద్వారా రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబుకు ఫిర్యాదు పంపారు. తన కుమారుడు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతిలోనూ వివాదం..ఆ తర్వాత ఇటీవల తిరుపతిలో మరోసారి గొడవ మొదలైంది. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్ను లోపలికి అనుమతించకపోవడంతో గొడవ మళ్లీ పోలీసుల వద్దకు వెళ్లింది. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
నాగచైతన్య తండేల్.. నిజమైన తండేల్ రాజ్ను చూశారా?
అక్కినేని హీరో నాగచైతన్య(akkineni Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ మూవీతో(Thandel Movie) ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్న కూడా మేకర్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. సినిమా రిలీజ్కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. తాజాగా తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు.అయితే ఈ చిత్రాన్ని యధార్థ కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. కొందరు భారత జాలర్లు పాక్ భూభాగంలోకి పొరపాటున వెళ్లడంతో వారందరినీ పాకిస్తాన్ కోస్ట్గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తండేల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్)ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు రియల్ తండేల్ రాజ్(తండేల్ రామారావు) హాజరయ్యారు. తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు కూడా సినిమాలో అవకాశం ఇస్తే బాగుంటుందని తండేల్ రామారావు అన్నారు. తండేల్-2 లోనైనా నాకు ఏదైనా పాత్ర ఇచ్చినా ఫర్వాలేదని ఆయన అన్నారు. దీనికి తండేల్ రాజు భార్య మాట్లాడుతూ.. మీరు మళ్లీ పాకిస్తాన్ వాళ్లకి దొరికితేనే సాధ్యం అంటూ ఫన్నీగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. #Thandel Part 2 రావాలంటే.. నువ్వు మళ్ళీ పాకిస్థాన్ కి దొరకాలి 🤣 Real Bujji Talli to Real ThandelRaju pic.twitter.com/z9k2njOxdl— Rajesh Manne (@rajeshmanne1) February 2, 2025 -
లక్కీ భాస్కర్ వెరీ లక్కీ.. తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్
లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్కు సిద్ధమయ్యారు. టాలీవుడ్లోనే మరో సినిమాను ప్రకటించారు. ఈ సారి టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రానికి 'ఆకాశంలో ఒకతార' అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పిస్తుండగా లైట్బాక్స్ మీడియా బ్యానర్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. మరో నిర్మాత అశ్వనీ దత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్తో పాటు నటీనటుల వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.Finally a Little Sandhadi…❤️The Legendary Trio comes together to take our Star forward…💫#AakasamloOkaTara Journey Begins…❤️🔥#AOTMovie @dulQuer @Lightboxoffl @GeethaArts @SwapnaCinema @pavansadineni @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/3OuZlFeqG0— Geetha Arts (@GeethaArts) February 2, 2025 -
ఐపీఎల్కు ముందే క్రికెట్ సమరం.. సిద్ధమంటోన్న అఖిల్ అక్కినేని
క్రికెట్ సంబరానికి అంతా సిద్ధమైంది. ఇన్ని రోజుల తెరపై అభిమానులను అలరించిన సినీ తారలు గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు నటనతో కాదు.. బ్యాట్, బాల్తో ఫ్యాన్స్ను ఆకట్టుకోనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) సమరానికి సమయం ఆసన్నమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 8 నుంచి ఈ క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లో టాలీవుడ్ సినీ తారలకు చెందిన తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈవెంట్లో జట్టు కెప్టెన్ అఖిల్ (Akhil Akkineni)తో పాటు తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ పాల్గొన్నారు. జట్టు యజమాని సచిన్ జోషి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మేము నాలుగుసార్లు కప్ గెలిచామని వెల్లడించారు. ఈసారి మేమే ఛాంపియన్స్గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.కాగా.. ఈ సీసీఎల్ లీగ్లో మొత్తం 7 సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, పంజాబ్ ది షేర్, బోజ్పురి దబాంగ్స్ పోటీ పడుతున్నాయి. ఈ నెల 8న బెంగళూరు వేదికగా ఈ టోర్నీ మొదలు కానుంది. ప్రస్తుతం జరుగుతున్న 11 వ సీజన్ జనవరి 31న హైదరాబాద్లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో షెడ్యూల్లో మార్పులు చేశారు.కాగా.. ఈ ఏడాది సీసీఎల్ టోర్నమెంట్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభమై మార్చి 2 వరకు కొనసాగుతుంది. తొలి రోజు మ్యాచ్లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, సాయంత్రం కర్ణాటక బుల్డోజర్స్ టీమ్.. తెలుగు వారియర్స్ను ఢీకొంటుంది. హైదరాబాద్లో ఈనెల 14,15 తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సీజన్లో కూడా అఖిల్ అక్కినేని తెలుగు వారియర్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్లన్నీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతాయి. సెమీ-ఫైనల్, ఫైనల్ మార్చి 1, 2 తేదీల్లో జరగనున్నాయి. #TFNExclusive: Actor @AkhilAkkineni8 and Music sensation @MusicThaman snapped at CCL Telugu Warrior event in Hyderabad!!🏏📸#AkhilAkkineni #Thaman #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/WDxjeEsr1S— Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2025 The excitement is building! ⏳ Just 6 days to go for A23 Rummy CCL 2025! 🏏🔥 Brace yourselves for an electrifying season where cinema meets cricket!🎟 Grab your tickets now: https://t.co/xvVGHVHEcj📺 Catch the action LIVE on Sony Sports Ten 3 & Disney+ Hotstar#A23Rummy… pic.twitter.com/lBRRZaiwyH— CCL (@ccl) February 2, 2025 -
వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: రాచరికంనటీనటులు: వరుణ్ సందేశ్,అప్సరా రాణి, విజయ్ శంకర్ తదితరులుడైరెక్టర్: సురేష్ లంకలపల్లినిర్మాత: ఈశ్వర్నిర్మాణ సంస్థ: చిల్ బ్రాస్ ఎంటర్టైన్మెంట్ఎడిటర్: జేపీసినిమాటోగ్రఫీ: ఆర్య సాయి కృష్ణసంగీతం: వెంగీవిడుదల తేదీ: 31 జనవరి 2025వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాచరికం’. ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో గ్రాండ్గా రిలీజైంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్లో బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్తో ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ను అలరించిందా లేదా రివ్యూలో చూద్దాం.రాచరికం కథేంటంటే..? 1980ల నేపథ్యంలో రాచకొండలో ఈ కథ మొదలవుతుంది. భార్గవి రెడ్డి (అప్సర రాణి), వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) తోబుట్టువులు. వీరిద్దరూ రాజకీయంగా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తారు. శివ (విజయ్ శంకర్) మన శక్తి పార్టీ యువ నాయకుడు. క్రాంతి (ఈశ్వర్)ఆర్ఎస్ఎఫ్ నాయకుడు. శివ, భార్గవి రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆమె తండ్రి రాజా రెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) తెలియడంతో భార్గవి రెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. ఇక వీరి ప్రేమకు రాజకీయం అడ్డు వస్తుందా? ఈ ప్రేమ వల్ల రాచకొండలో ఏర్పడిన హింసాత్మక పరిణామాలు ఏంటి? భార్గవి, వివేక్ రెడ్డి రాజకీయాల్లో విజయం సాధించారా? తోబుట్టువుల మధ్య జరిగే కథ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా తీశారంటే..దర్శకుడు సురేష్ లంకలపల్లి ఈ సినిమాను చాలా ఎంగేజింగ్గా తీసినట్టు అనిపించింది. అయికే కథ, కథనం ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల ఊహకు అందేలా సాగుతుంది. ఇక చాలా వరకు సీన్లు ఆడియన్స్ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలం. రాచరికం మంచి పొలిటికల్ డ్రామాగా మలిచాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ రేసీగా ఉండటం, ఎమోషన్స్ కనెక్ట్ కావడం బాగా కలిసొచ్చింది.ఎవరెలా చేశారంటే..నటుడు వరుణ్ సందేశ్ తనలో కొత్త కోణాన్ని చూపించాడు. ఈ చిత్రంలోని వరుణ్ యాక్టింగ్ అంతా కూడా కొత్తగా అనిపించింది. ఆడియన్స్ను వరుణ్ సందేశ్ ఆకట్టుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్సర రాణి మూడు విభిన్న షేడ్స్లో అందరినీ మెప్పించింది. హీరో విజయ్ శంకర్ మంచి ఎమోషన్స్తో మంచి ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెరీర్ బెస్ట్ రోల్గా విజయ్ శంకర్ అదరగొట్టేశాడు. నిర్మాత ఈశ్వర్ ఆర్ఎస్ఎఫ్ లీడర్గా అసాధారణమైన నటనను కనబరిచాడు. శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి తనదైన నటనతో మరోసారి అలరించాడు. విజయ రామరాజు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రాచీ ఠాకర్,రూపేష్, ఫణి, సతీష్ సారిపల్లి, ఆది, రంగస్థలం మహేష్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్య సాయికృష్ణ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్లో కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. వెంగీ నేపథ్యం సంగీతం ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'పుష్ప కంటే కాటేరమ్మే నయం'.. ఆ విషయంలో నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతంలో ఎప్పుడులేని విధంగా పలు రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్పరాజ్ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా కలెక్షన్స్లో మొదటిస్థానంలో ఉంది.అయితే పుష్ప-2 తాజాగా ఓటీటీకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుడా ఇటీవల అదనంగా యాడ్ చేసిన సన్నివేశాలను ఓటీటీలో చూసే అవకాశాన్ని ఫ్యాన్స్కు కల్పించారు. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఓటీటీలో పుష్ప-2 చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ రప్పా రప్పా గురించి నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. గాల్లో తేలుతూ అల్లు అర్జున్ ఫైట్ చేసిన సన్నివేశాలైతే ఆడియన్స్కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.అయితే క్లైమాక్స్ సీన్పై ఒక పక్క ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపు విమర్శలు కూడా చేస్తున్నారు. ఆ ఫైట్స్ సీక్వెన్స్ను ప్రభాస్ సలార్ మూవీ కాటేరమ్మ ఫైట్ సీన్తో పోలుస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఈ ఫైట్ సీన్ను కామెడీగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది మాస్ హీరో సన్నివేశమా లేదా కామెడీ సన్నివేశమా? అని కామెంట్స్ చేస్తున్నారు. గాల్లోకి ఎగిరి ఫైట్ చేయడం చూస్తుంటే నవ్వడం ఆపుకోలేకపోయానంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే నేను బట్టలు ఉతుక్కోవడం ఇలాగే ఉంటుందని పోస్ట్ చేశారు.కాటేరమ్మ > రప్పా రప్పాపుష్ప-2 క్లైమాక్స్ ఫైట్ (రప్పా రప్పా) కంటే ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలోని కాటేరమ్మ ఫైట్ చాలా బాగుందని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 'రప్పా రప్పా' ఫైట్ సీన్ 'ఓవర్ ది టాప్' ప్రశంసించాడు. అయినప్పటికీ పుష్ప 2 క్లైమాక్స్ చాలా ఓవర్గా ఉంది. సలార్ కాటేరమ్మ సీన్ అదిరిపోయిందని తెలిపాడు. ఇది పుష్ప ఫైట్ కంటే కాటేరమ్మ సీక్వెన్స్కు ఎక్కువ రిపీట్స్ ఉన్నాయని రాసుకొచ్చాడు. అయితే ఇందులో అల్లు అర్జున్ గొప్పగా చేసినప్పటికీ రప్పా రప్పా కంటే కాటేరమ్మ సీన్ ఎక్కువని అభిప్రాయం వ్యక్తం చేశారు.In my opinion,Pushpa 2 climax was more over the top.Salaar kaateramma scene was worth it.It has a greater number of repeats than rappa sequence of pushpa.It's what I really felt.Nonetheless, AA did a great job.But for me,Kaateramma > Rappa#Salaar #Pushpa2 https://t.co/9DnePiuTtA— Sandeep (@02Sandeepdyh) January 31, 2025 How to Watch Pushpa 2 Without Regretting It:1. Intro Scene: Skip it entirely and jump straight to his wake-up scene.2. Songs: Whenever a song pops up, just fast-forward to the next scene.3. Climax Fight (Rappa Rappa): Do yourself a favour. Skip it completely (highly…— 𝓚𝓻𝓲𝓼𝓱𝓪𝓿 (@haage_summane) January 31, 2025 -
'కోయ్ కోయ్ కోడ్ని కోయ్' అంటోన్న విశ్వక్ సేన్.. ఈ మాస్ సాంగ్ చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak sen) నటించిన తాజా చిత్రం లైలా(Laila). ఈ మూవీ లేడీ గెటప్లో అభిమానులను అలరించునున్నారు మాస్ హీరో. ఈ సినిమాకు రామ్ నారయణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ మూవీలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది.ఈ నేపథ్యంలో లైలా మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓహో రత్తమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ మాస్ సాంగ్కు పెంచల్ దాస్ లిరిక్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటను సింగర్ మధుప్రియ, పెంచల్ దాస్ ఆలపించారు. విడుదలైన కొద్ది గంటల్లోనే మాస్ ఆడియన్స్ను తెగ ఊపేస్తోంది ఈ సాంగ్. అయితే ఈ సాంగ్ ఎత్తుగడలో ఈ మధ్య బాగా వైరలైన 'కోయ్ కోయ్ కోడ్ని కోయ్' అనే లిరిక్స్ వాడడంతో ఈ సాంగ్ తెగ వైరలవుతోంది.లేడీ గెటప్లో విశ్వక్ సేన్..ఈ మూవీలో సోనూ, లైలా అనే లేడీ పాత్రల్లో ఫ్యాన్స్ను అలరించనున్నాడు విశ్వక్ సేన్. ముఖ్యంగా లేడీ గెటప్లో విశ్వక్ సేన్ లుక్ ఫ్యాన్స్కు పిచ్చెక్కిస్తోంది. ఇటీవలే సోనూ మోడల్, లైలాగా అభిమానులను పలకరించనున్నాడు. ఇటీవలే లైలా మేకోవర్కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఆ లుక్ కోసం ఎంత కష్టపడ్డారో దాదాపు రెండు గంటల పాటు కష్టపడినట్లు వివరించారు. కాగా.. షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Mass vibe shuruuu! 😎Here's the massiest folk number #OhoRathamma from #Laila 🔊🕺💥▶️ https://t.co/DC4OjBYYlmA @leon_james musical Sung by #PenchalDas and #MadhupriyaLyrics by #PenchalDasGRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹 @RAMNroars #AkankshaSharma… pic.twitter.com/kAZJDM4eCr— VishwakSen (@VishwakSenActor) January 31, 2025 -
నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్న కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తండేల్ అంటే ఓనరా..?’, ‘ కాదు లీడర్’ అనే డైలాగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.సినిమా రిలీజ్కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆడియన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్లోనే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్పరాజ్ ఫర్ తండేల్ రాజ్... తండేల్ జాతర అంటూ పుష్పరాజ్ మాస్ పోస్టర్తో పాటు తండేల్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో చైతూ ఫ్యాన్స్తో పాటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండేల్ కథేంటంటే...శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 𝐏𝐔𝐒𝐇𝐏𝐀 𝐑𝐀𝐉🔥for 𝐓𝐇𝐀𝐍𝐃𝐄𝐋 𝐑𝐀𝐉𝐔 ⚓🌊ICON STAR @alluarjun garu will grace the #ThandelJaathara on February 1st in Hyderabad ❤️🔥Stay excited for more details #Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.#ThandelonFeb7th #AlluArjunYuvasamrat… pic.twitter.com/W9DfVSHkEK— Geetha Arts (@GeethaArts) January 31, 2025 -
ఎట్టకేలకు ఓటీటీకి పుష్ప-2.. అఫీషియల్గా డేట్ ప్రకటించిన నెట్ప్లిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్'పుష్ప 2 ది రూల్'( (Pushpa 2: The Rule)) మూవీ ఓటీటీ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. గత రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు నెట్ఫ్లిక్స్ ఫుల్స్టాప్ పెట్టింది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 30 నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్లో ట్రైలర్ వీడియోను పోస్ట్ చేసింది.రీ లోడెడ్ వర్షన్ కూడా..పుష్ప- 2 రీలోడెడ్ వర్షన్తో పాటు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. అదనంగా 23 నిమిషాల రీలోడెడ్ వర్షన్ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 ఓటీటీలో సందడి చేయనుంది.బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్పరాజ్..సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప-2 ది రూల్ (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత కోసింది. పుష్పరాజ్ దెబ్బకు పలు సినిమాల రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా రూ.1896 కోట్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలై ఏడు వారాల తర్వాత పుష్పరాజ్ ఓటీటీలో సందడి చేయనున్నాడు. Pushpa Bhau ne sun li aapki baat, ab Pushpa ka rule, Hindi mein bhi 🔥Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, on 30 January in Hindi, Telugu, Tamil, Malayalam & Kannada!#Pushpa2OnNetflix pic.twitter.com/smPXn4IMD9— Netflix India (@NetflixIndia) January 29, 2025 -
అంజనమ్మ బర్త్ డే వేడుక.. మెగాస్టార్ ఎమోషనల్ నోట్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన మాతృమూర్తి అంజనమ్మకు (Anjana Devi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్, మెగాస్టార్ దగ్గరుండి అంజనమ్మతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి.చిరు తన ఇన్స్టాలో రాస్తూ..'అమ్మా! ఈ ప్రత్యేకమైన రోజున మాటల్లో చెప్పలేనంతగా ప్రేమను అందుకున్నారు. మీరు ఊహించలేనంతగా గౌరవం అందించిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. మా ప్రియమైన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబానికి హృదయం లాంటి మీ స్వచ్ఛమైన, నిస్వార్థ ప్రేమకు కృతజ్ఞతలు. నీ పాదాలకి నమస్కరిస్తూ.. పుణ్యం చేసుకొన్న నీ సంతతి.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. అంతకుముందే ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. అంజనమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నాయనమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఇన్స్టా వేదికగా విషెస్ తెలిపింది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావడంతో వాయిదా వేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
లైలా కోసం ఇంత కష్టపడ్డారా?.. మాస్ కా దాస్ వీడియో చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం లైలా( Laila). ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.రెండు పాత్రల్లో విశ్వక్ సేన్..ఈ మూవీలో సోనూ, లైలా అనే లేడీ పాత్రల్లో ఫ్యాన్స్ను అలరించనున్నాడు విశ్వక్ సేన్. ముఖ్యంగా లేడీ గెటప్లో విశ్వక్ సేన్ లుక్ ఫ్యాన్స్కు పిచ్చెక్కిస్తోంది. తాజాగా తన లుక్ సోనూ మోడల్ నుంచి లైలా ఎలా మారిందో చూశారా? అంటూ ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఆ లుక్ కోసం ఎంత కష్టపడ్డారో మీరు కూడా చూసేయండి.ఆ ఫోటోను వాడకండి..తన లుక్ గురించి ఇటీవల సాంగ్ లాంఛ్ ఈవెంట్లో కూడా మాట్లాడారు. లైలా లుక్పై విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో తన పాత్ర ముఖ్యంగా అమ్మాయి గెటప్లో ఉన్న ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి అని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. కత్తిలా ఉందని పొగిడి కామెంట్ చేసి అక్కడికి వదలేయండి అంటూ నవ్వుతూ మాట్లాడారు.Here's how #sonumodel transformed to #Laila 💄Meet #Laila in theatres from FEBRUARY 14th ❤️ ▶️ https://t.co/qpfZPFKbuy@RAMNroars #AkankshaSharma @sahugarapati7 @Shine_Screens @leon_james @JungleeMusicSTH @MediaYouwe pic.twitter.com/EzyK4AO9wa— VishwakSen (@VishwakSenActor) January 27, 2025 -
ఓటీటీకి పుష్ప-2.. ఆడియన్స్కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నెట్ఫ్లిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఇప్పటికే బాహుబలి, బాహుహలి-2, కేజీఎఫ్ లాంటి సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డ్పై కన్నేసిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలో పుష్ప-2 ఓటీటీకి సంబంధించి ఈ రోజు పెద్దఎత్తున వార్తలొస్తున్నాయి. దీనికి కారణం నెట్ఫ్లిక్స్లో పుష్ప-2 రీ లోడెడ్ వర్షన్ కమింగ్ ఆన్ థర్స్డే అనే పోస్టర్ కనిపించింది. దీంతో ఈ వారంలోనే పుష్ప-2 ఓటీటీకి రానుందని అంతా ఫిక్సయిపోయారు. ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ను బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో చూసేద్దాం.ఉదయం నుంచి పుష్ప-2 ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అంతా రాసుకొచ్చారు. కానీ తాజాగా నెట్ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది. పుష్ప-2 మూవీ త్వరలోనే ఓటీటీకి రానుందని ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇవాళ నెట్ఫ్లిక్స్లో గురువారం అని ఇచ్చారు కానీ.. ఈ వారంలోనా.. లేదంటే వచ్చేవారంలోనా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఆడియన్స్లో కన్ఫ్యూజన్కు తెరదించేందుకు నెట్ఫ్లిక్స్ పోస్టర్ను రిలీజ్ చేసింది. మరీ ఈ వారంలోనే ఓటీటీకి వస్తుందా? ఫిబ్రవరి 6న రానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ఫిబ్రవరి 6 నుంచే ఛాన్స్..పుష్ప-2 చిత్రం రిలీజైన ఫిబ్రవరి 6వ తేదీకి రెండు నెలలు పూర్తవుతుంది. ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం 56 రోజుల తర్వాతే ఓటీటీకి రావాలి. ఈ లెక్కన చూస్తే ఈ వారంలో ఓటీటీకి వచ్చే ఛాన్స్ లేదు. నెట్ఫ్లిక్స్ చేసిన పొరపాటుకు ఆడియన్స్ ఈ వారంలోనే వస్తుందని ఫిక్స్ అయిపోయారు. మరి పుష్పరాజ్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేస్తాడా? లేదంటే ఫిబ్రవరిలోనా అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.బాక్సాఫీస్ వద్ద జోరు..పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.The man. The myth. The brAAnd 🔥 Pushpa’s rule is about to begin! 👊 Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, coming soon in Telugu, Tamil, Malayalam & Kannada! pic.twitter.com/ZA1tUvNjAp— Netflix India (@NetflixIndia) January 27, 2025 -
నందమూరి బాలకృష్ణకు అల్లు అర్జున్ అభినందనలు
నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పద్మభూషణ్ అవార్డుకు పూర్తిగా అర్హులంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. తెలుగు సినిమాకు అందించిన సేవలకు సరైన గుర్తింపు లభించిందన్నారు. అజిత్ కుమార్ సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా పద్మ అవార్డులకు ఎంపికైన శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్లకు అభినందనలు తెలిపారు. పద్మ అవార్డులు సాధించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. కళల విభాగంలో గుర్తింపు దక్కడం నా హృదయాన్ని సంతోషంతో నింపిందని అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. Heartfelt congratulations to #NandamuriBalakrishna garu on receiving the prestigious #PadmaBhushan award, this recognition is well-deserved for your contributions in telugu cinema. My dear #AjithKumar garu, your achievement is equally inspiring and commendable.Also…— Allu Arjun (@alluarjun) January 27, 2025 -
వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈనెల 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ వెల్లడించింది.సంక్రాంతికి వస్తున్నాం మూవీకి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలతో పోటీపడి రాణిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి భీమ్ సిసిరోలియో సంగీతమందించారు.(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)ఈ సినిమా కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. #BlockbusterSankranthikiVasthunam continues it's Box Office Sambhavam 💥💥💥260crore worldwide gross in just 12 days for #SankranthikiVasthunam 🔥🔥 ALL TIME HIGHEST FOR A REGIONAL FILM ❤️🔥❤️🔥❤️🔥Victory @venkymama @anilravipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo… pic.twitter.com/rgDgmuI2GW— Sri Venkateswara Creations (@SVC_official) January 26, 2025 -
మోహన్ బాబు రిపబ్లిక్ డే విషెస్.. ఆ సాంగ్ వింటే ఇప్పటికీ గూస్ బంప్స్!
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తన అభిమానులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తాను నటించిన మేజర్ చంద్రకాంత్ మూవీలో సాంగ్ను అభిమానులతో పంచుకున్నారు. 1993లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా నటించారు.ఈ చిత్రంలోని దేశభక్తి సాంగ్ ఎప్పటికీ భారతీయుల గుండెల్లో నిలిచి ఉంటుంది. 'పుణ్య భూమి నాదేశం నమోనమామి.. ధన్య భూమి నాదేశం సదా స్మరామీ' అంటూ సాగే ఈ పాట దేశభక్తిని చాటి చెబుతుంది. ఈ పాటను జాలాది రాజారావు రాయగా.. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతమందించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మేజర్ చంద్రకాంత్ అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. Wishing you all a Happy Republic Day!🇮🇳"Major Chandrakanth" (1993): 🎶"Punyabhoomi Naadesam" – A timeless patriotic anthem that resonates deeply with Telugu audiences. With lyrics by Sri. Jaladi Raja Rao, sung soulfully by Sri. S.P. Balasubrahmanyam, and composed masterfully by… pic.twitter.com/xvVqP6Ht66— Mohan Babu M (@themohanbabu) January 26, 2025 -
మాస్ మహారాజా 'మాస్ జాతర'.. గ్లింప్స్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'మాస్ జాతర'. ఈ మూవీ రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ‘సామజవరగమన చిత్రానికి రైటర్గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో శ్రీలీల మరోసారి రవితేజ సరసన హీరోయిన్గా కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా నటించిన ధమాకా సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.ఇవాళ మాస్ మహారాజా బర్త్ డే కావడంతో ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మాస్ జాతర మూవీ గ్లింప్స్ను ఫ్యాన్స్కు పరిచయం చేశారు. దాదాపు 61 సెకన్ల పాటు వీడియో గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే మాస్ జాతరను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రం మే 09న థియేటర్లలో సందడి చేయనుంది. The Swag.The Energy.The Vibe. 🔥🔥🔥𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is here to deliver an ALL ROUND SHOW! 😎❤️🔥#MassJathara ~ Mass Rampage Glimpse out now 💥— https://t.co/1s6R68jgYG #HappyBirthdayRaviTeja garu ❤️@sreeleela14 @BhanuBogavarapu @vamsi84… pic.twitter.com/Tp9Zn1vouZ— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2025 -
బాబాయికి అభినందనలు తెలిపిన యంగ్ టైగర్
నందమూరి బాలకృష్ణకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డ్కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. మీరు అటు సినిమా.. ఇటు ప్రజలకు అందించిన సేవలకు దక్కిన గుర్తింపు అంటూ ట్వీట్ చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్, నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. నటసింహంగా గుర్తింపు..నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.బాలకృష్ణ హీరోగా తొలి చిత్రం..1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానం..‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.— Jr NTR (@tarak9999) January 25, 2025 -
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నితిన్
టాలీవుడ్ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన భార్య షాలిని, కుమారుడితో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ప్రస్తుతం హీరో నితిన్ రాబిన్హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. భీష్మ తర్వాత వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.రిలీజ్ వాయిదా..గతేడాది క్రిస్టమస్ విడుదల కావాల్సిన 'రాబిన్ హుడ్' వాయిదా పడింది. పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి కూడా ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో వచ్చేనెల ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Youth Star @actor_nithiin visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏#Nithiin #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/tCR1B93mPH— Telugu FilmNagar (@telugufilmnagar) January 25, 2025 -
ఆ ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి: విశ్వక్ సేన్ విజ్ఞప్తి
మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్ మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది లవర్స్ డే కానుకగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో అభిమానులను పలకరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇచ్చుకుందాం బేబీ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ను విశ్వక్ ఫ్యాన్స్ను అలరిస్తోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో తన పాత్ర గురించి మాట్లాడారు. ముఖ్యంగా అమ్మాయి గెటప్లో ఉన్న ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి అని అభిమానులకు సలహా ఇచ్చారు. పర్లేదు.. కత్తిలా ఉందని పొగిడి కామెంట్ చేసి అక్కడికి వదలేయండి అంటూ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.#Vishwaksen about #Laila Make-over 😂🖤 pic.twitter.com/2BQYHIq1po— Rebel 🦁 (@Setti_Tweetz) January 23, 2025 -
బ్యాడ్ బాయ్గా వస్తోన్న నాగ శౌర్య.. ఆసక్తిగా ది డెవిల్స్ ఛైర్ పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తోన్న తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఈ మూవీ విధి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇవాళ నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తే హీరో నుదిటిపై రక్తంతో కూడిన "మూడు గోవింద నామాలు", చేతులపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.ది డెవిల్స్ ఛైర్ ఫస్ట్ లుక్ పోస్టర్..జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ది డెవిల్స్ చైర్ (The Devils chair). ఈ సినిమాను గంగ సప్త శిఖర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సీఆర్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై కేకే చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మొదటి పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ..'సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు ది డెవిల్స్ చైర్ పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్తో అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి" అని కోరుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..'ది డెవిల్స్ చైర్ చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏఐ టెక్నాలజీతో సరికొత్త కథతో నిర్మిస్తున్నాం. ప్రతి సీన్ అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొందిస్తున్నాం. షూటింగ్ అంతా పూర్తయింది. మా చిత్రాన్ని ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేస్తాం" అని తెలిపారు. -
గుంటూరు కారం సాంగ్.. ఆ దేశంలో క్రేజ్ చూశారా!
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు గతేడాది సంక్రాంతికి అభిమానులను అలరించాడు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ఈ మూవీలో కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్లో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తన స్టెప్పులతో ఫ్యాన్స్ను ఊపేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా తమన్ మ్యూజిక్ మహేశ్ బాబు ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులను అలరించింది.అయితే సినిమా రిలీజైన ఏడాది దాటిపోయినా కుర్చీని మడతపెట్టి సాంగ్కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా నేపాల్లో ఈ పాటకు ఇద్దరు యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డు పక్కన యువతులు గుంటూరు కారం సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. అంతేకాకుండా నేపాల్లోని ఓ కళాశాలలో స్టూడెంట్స్ సైతం కుర్చినీ మడతపెట్టి అనే సాంగ్కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. మహేశ్బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాట అభిమానులకు గూస్బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్ యూట్యూబ్లో రిలీజవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాట యూట్యూబ్లో ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) వ్యూస్ సాధించింది. #KurchiMadathapetti Mania in NEPAL ❤️🔥Global sensation @urstrulyMahesh - @MusicThaman 🥁 #MaheshBabu | #GunturKaaram pic.twitter.com/mfJcQurGrS— VardhanDHFM (@_VardhanDHFM_) January 22, 2025 -
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో మరో శుభకార్యం జరగనుంది. గతేడాది చైతూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయన వివాహమాడారు. అంతకుముందే అఖిల్ అక్కినేని సైతం ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ ఏడాది మార్చిలో అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం అఖిల్, జైనాబ్ ఈ ఏడాది మార్చి 24న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అంటే మార్చి చివరి వారంలో అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది.అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి తేదీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చైతూ బాటలోనే అఖిల్..అయితే అఖిల్ పెళ్లి వేడుక కూడా హైదరాబాద్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. చైతూ- శోభిత పెళ్లి మాదిరే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి వివాహా వేడుక జరగనున్నట్లు టాక్. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందే నాగచైతన్య పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు స్థాపించినందున ఈ స్టూడియో నాగార్జున కుటుంబానికి సెంటిమెంట్గా కనెక్ట్ అయింది. అయితే మరోవైపు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్కు కూడా వెళ్లే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే జరిగితే టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్లో రిసెప్షన్ను నిర్వహించనున్నారు. అయితే పెళ్లి తేదీ, వేదికపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. -
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే.. పవిత్రా లోకేశ్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ మరో ఏడాది పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదారాబాద్లో ఆయన జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ సందర్భంగా నరేశ్పై ప్రశంసలు కురిపించారు పవిత్రా లోకేశ్.పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' నరేశ్ గారి బర్త్ డేను అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం శుభ పరిణామం. ఆయన వేసుకున్న షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను. పెద్దల ఆశీర్వాదం ఆయనకు ఎప్పుడు ఉంటుంది. నరేశ్ గారికి ఇద్దరు గురువులు. వారిలో ఒకరు జంధ్యాల అయితే.. మరొకరు విజయనిర్మల. ప్రతి రోజు గురువుగారిని తలచుకుంటారు. తన కుటుంబాన్ని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. దాదాపు 10 మందికి ఉండే ఎనర్జీ నరేశ్ గారికి ఉంటుంది. ఏపని చేసినా చాలా సిస్టమాటిక్గా చేస్తారు. యంగ్ డైరెక్టర్స్కు చాలా టైమ్ ఇస్తారు. వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. గతంలో వీరిద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీ చాలా వివాదానికి దారి తీసింది. అప్పట్లో నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం టాలీవుడ్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.Latest Visuals of Actor #VKNaresh along with #PavitraLokesh pic.twitter.com/39UnKTPV4e— Telugu Film Producers Council (@tfpcin) January 19, 2025#TFNExclusive: Visuals of Actor @ItsActorNaresh's birthday celebrations in Hyderabad!!🎊#Naresh #PavitraLokesh #TeluguFilmNagar pic.twitter.com/2kXbVEmaWr— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
స్నేహితురాలిని పెళ్లాడిన జెర్సీ మూవీ సింగర్.. పోస్ట్ వైరల్
ప్రముఖ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు ధరల్ సురేలియాను ఆయన పెళ్లాడారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు సింగర్. ఈ వివాహా వేడుకలో బంధువులతో పాటు సన్నిహితులు కూడా పాల్గొన్నారు.తాజాగా సింగర్ దర్శన్ రావల్ తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. సింగర్ దర్శన్ పలు సూపర్ హిట్ సినిమాలకు తన గాత్రాన్ని అందించాడు.దర్శన్ కెరీర్..దర్శన్ రావల్ 2014లో ఇండియాస్ రా స్టార్ మొదటి సీజన్లో పాల్గొన్నాడు. ఆషోలో ఒడిశాకు చెందిన రితురాజ్ మొహంతి చేతిలో ఓడిపోయాడు. ఆ తరవాత ది టాలెంట్ హంట్ షో అతనికి మంచి వేదికను ఇచ్చింది. అప్పటి నుంచి బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. 2015లో షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన హిమేష్ రేష్మియాకు ధన్యవాదాలు. లవ్యాత్రి చిత్రంలోని చోగడ పాటతో అతనికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత షేర్షా చిత్రం నుంచి కభీ తుమ్హే, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీలోని ధిండోరా బజే రే, ఇష్క్ విష్క్ రీబౌండ్ సినిమా నుంచి సోనీ సోని లాంటి సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా గుజరాతీలో పాటలు కూడా పాడారు. తెలుగు హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలోని నీదా పదధాని అనే తెలుగు సాంగ్ను అలపించారు దర్శన్ రావల్. View this post on Instagram A post shared by Darshan Raval (@darshanravaldz) -
'నువ్వు ఈ జన్మలోనే తెలుసుకుంటావ్'.. మంచు ఫ్యామిలీలో ట్విటర్ వార్!
మంచు వారి ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ దంపతులు వెళ్లగా మరోసారి వివాదం మొదలైంది.మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డితో కలిసి తాత, నానమ్మకు నివాళులర్పించేందుకు రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లకుండా వారిని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ అనుచరులు గేటు పైకి ఎక్కి లోనికి దూసుకెళ్లారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గతనెలలో తలెత్తిన వివాదం మరవకముందే మరోసారి గొడవ మొదలైంది.తాజాగా ఈ వివాదం తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. మొదట మంచు విష్ణు ట్వీట్ తన రౌడీ సినిమాలో డైలాగ్ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్ను పోస్ట్ చేశారు.అయితే దీనికి అదే స్టైల్లో మంచు మనోజ్ కౌంటరిచ్చారు. కన్నప్ప సినిమాలో కృష్ణం రాజులా అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్' అంటూ కృష్ణం రాజు సినిమాల పోస్టర్లను పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో అన్నదమ్ముల వార్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. అయితే ఇన్డైరెక్ట్గా మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న కన్నప్ప మూవీని మంచు మనోజ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025 ఇరువురిపై కేసులు..ఇప్పటికే మనోజ్, మోహన్బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు.#Kannapa lo #RebelStar Krishnam raju garu laga, Simham avalli ani prathi fraud kukkaki vuntudhi,e vishyam nuvu idhe janamlo telusukuntav. #VisMith (crack this guys) Clue (his Hollywood venture) pic.twitter.com/iJXIdEx59y— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 17, 2025 -
'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు'.. టీజర్ చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం లైలా. గతేడాది మెకానిక్ రాకీతో అలరించిన హీరో.. ఈ లవర్స్ డే రోజున ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. లైలా టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లోనూ ఫ్యాన్స్ను అలరించనున్నాడు. 'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు' అనే డైలాగ్ మాస్ కా దాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. Welcome to the world of #Laila filled with fun, action and romance ❤🔥The Echipaad #LailaTeaser out now 💥💥▶️ https://t.co/YHl8j4IgAKGRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th @RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/OQ5I4yzaJN— VishwakSen (@VishwakSenActor) January 17, 2025 -
లవర్స్కు గుడ్ న్యూస్.. ఆ రోజే ఏకంగా ఐదు సినిమాలు!
'ఫిబ్రవరి అంటే వెంటనే... సినిమా లవర్స్కు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రేమ నేపథ్యంలో వచ్చే చిత్రాలను విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు ప్రయత్నిస్తే, ప్రేక్షకులు కూడా లవ్ మూవీస్ని ఆశిస్తారు. దానికి తగ్గట్టే ఫిబ్రవరిలో అరడజను ప్రేమకథా చిత్రాలు థియేటర్స్లోకి రానున్నాయి. వీటితో పాటు యాక్షన్, ఎమోషనల్ మూవీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా వచ్చే ఫిబ్రవరి నెలలో సినిమాల సందడి మరింత పెరగనుంది. 'రాజుగాడి లవ్స్టోరీ..‘లవ్స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి జోడీగా నటించిన సినిమా ‘తండేల్’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ఇంటెన్స్ లవ్స్టోరీ ఫిల్మ్ను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... ఉత్తరాంధ్ర మత్స్యకారులు జీవనో΄ాధి కోసం గుజరాత్కు వెళ్తారు. అక్కడి సముద్ర తీరంలో తెలియక ఇండియన్ బోర్డర్ దాటి, పాకిస్తాన్ కోస్టు గార్డులకు బంధీలుగా చిక్కుతారు. వీరందరి జీవితాలు ఏమయ్యాయి? అన్నదే ‘తండేల్’ సినిమా కథ అని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాలోని రాజు పాత్ర కోసం నాగచైతన్య, ఉత్తరాంధ్రకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్నారు.సాయిరామ్ శంకర్ 'ఒక పథకం ప్రకారం'..ఇక ‘ఒక పథకం ప్రకారం’ అంటూ ఇదే రోజు థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు హీరో సాయిరామ్ శంకర్. ‘143, బంపర్ ఆఫర్’ వంటి సినిమాల్లో నటించిన సాయిరామ్ శంకర్ నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఒక పథకం ప్రకారం’. క్రైమ్ మిస్టరీగా రానున్న ఈ మూవీలో సాయిరామ్ శంకర్ అడ్వొకేట్ పాత్రలో, సముద్ర ఖని పోలీస్ ఆఫీసర్గా నటించారు. గార్లపాటి రమేష్తో కలిసి ఈ చిత్రదర్శక–నిర్మాత వినోద్ కుమార్ విజయన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. శ్రుతీ సోధి, ఆషిమా నర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఆర్ఆర్ అందించారు. ఇక ఈ సినిమాల కంటే ముందు అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లీడ్ రోల్స్లో నటించిన ‘రాచరికం’ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. దర్శక–ద్వయం సురేష్ లంకపల్లి, ఈశ్వర్ వాసె దర్శకత్వంలో ఈ మూవీని ఈశ్వర్ నిర్మించగా, ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్కు సిద్ధం అవుతోంది. ఇటు ప్రేమ... అటు సంఘర్షణవిశ్వక్ సేన్ హీరోగా నటించిన యూత్ ఫుల్ లవ్స్టోరీ మూవీ ‘లైలా’ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోనూగా, అమ్మాయి లైలాగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్స్లో నటిస్తున్నారు విశ్వక్ సేన్. రామ్ నారాయణ్ డైరెక్షన్లో సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఆకాంక్షా శర్మ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.కిరణ్ అబ్బవరం దిల్ రూబా..మరోవైపు ఇటీవలే ‘క’తో ఓ మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లవర్స్ డే రోజున ‘దిల్ రూబా’ అనే లవ్ అండ్ యాక్షన్ మూవీతో థియేటర్స్లోకి వస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా, నాజియా డేవిసన్ మరో కీలక ΄ాత్రలో నటించిన ఈ మూవీకి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయిన ఓ అబ్బాయి, మరోసారి మరో అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లుగా తెలిసింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఈ రెండు సిటీ లవ్స్టోరీ మూవీస్తో పాటు ఓ గ్రామీణ లవ్స్టోరీ కూడా ఇదే రోజున థియేటర్స్లోకి రానుంది. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ సినిమాలు తీసిన దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి, మరో నిర్మాత రాహుల్ మోపిదేవితో కలిసి ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే తెలంగాణ గ్రామీణ ప్రేమకథ తీశారు. ఖమ్మం– వరంగల్ల సరిహద్దు నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీతో సాయిలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గత ఏడాది నవంబరులో జరిగిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ గ్లింప్స్ వీడియోలో ఈ మూవీని ఫిబ్రవరి 14న థియేటర్స్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా నటీనటులు సాంకేతిక నిపుణులపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. తాతా మనవడు... తండ్రీకొడుకుఈ ప్రేమికుల దినోత్సవం రోజున లవ్స్టోరీ మూవీస్ మాత్రమే కాదు.. ఎమోషనల్ చిత్రాలు కూడా థియేటర్స్లోకి వస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ‘బ్రహ్మా ఆనందం’ మూవీలో మాత్రం తాతా మనవళ్లుగా నటించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కానీ గురువారం ఈ సినిమా టీజర్ను విడుదల చేసి, ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు.ధన్రాజ్ 'రామం రాఘవం'నటుడు ధన్రాజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘రామం రాఘవం’ మూవీ కూడా ఫిబ్రవరి 14నే రిలీజ్ కానుంది. తండ్రి పాత్రలో సముద్రఖని, తనయుడి పాత్రలో ధన్రాజ్ కనిపిస్తారు. తండ్రీకొడుకుల ఎమోషన్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీని గత ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. కొడుకు ప్రయోజకుడైతే చూడాలనుకునే తండ్రి, తనను తన తండ్రి సరిగా అర్థం చేసుకోవడం లేదనుకునే ఓ కొడుకు మధ్య సాగే భావోద్వేగ సంఘర్షణల నేపథ్యంలో ఈ ‘రామం రాఘవం’ మూవీ రానుంది.సందీప్ కిషన్ మజాకా..గత ఏడాది ఫిబ్రవరిలో ‘ఊరి పేరు భైరవకోన’ అనే ఓ హారర్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు సందీప్ కిషన్. ఈ సెంటిమెంట్ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారేమో. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మజాకా’ మూవీతో సందీప్ కిషన్ వస్తున్నారు. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా, రావు రమేశ్, ‘మన్మధుడు’ ఫేమ్ నటి అన్షు ప్రధాన ΄ాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘మజాకా’. ‘నేను లోకల్, ధమాకా’ చిత్రాల ఫేమ్ నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సందీప్ కిషన్, రావు రమేశ్ తండ్రీ కొడుకులుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేశ్ దండా నిర్మించిన ఈ ‘మజాకా’ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.శివరాత్రికి నితిన్..శివరాత్రికి ‘తమ్ముడు’గా థియేటర్స్లోకి రానున్నారు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘తమ్ముడు’ అనే మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు.ఇక సుధీర్బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘జటాధర’. శాస్త్రీయ, పౌరాణిక అంశాలతో ఈ మూవీకి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రేరణా అరోరా, సివిన్ నారం, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమా ఫస్ట్ లుక్స్ను రిలీజ్ చేశారు. ఆ సమయంలో ‘జటాధర’ మూవీని మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ‘తమ్ముడు, జటాధర’ రిలీజ్ డేట్స్పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.అలాగే ఫిబ్రవరి 28న థియేటర్స్లో ఆది పినిశెట్టి ‘శబ్దం’ చేయనున్నారు. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా మూవీ ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ల్స్, ఎం.ఎస్. భాస్కర్ ఇతర కీలక ΄ాత్రల్లో ఈ మూవీని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఫిబ్రవరి నెల ఆరంభానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యేందుకు మరికొన్ని సినిమాలు బరిలోకి రావొచ్చు లేదా ఆల్రెడీ ఫిబ్రవరి రిలీజ్కు రెడీ అయిన సినిమాల్లో విడుదల వాయిదా పడే అవకావం లేకపోలేదు. మరి... ఫిబ్రవరిలో ఫైనల్ రిలీజ్ బెర్త్లు ఖరారు చేసుకున్న సినిమాలేవో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. అనువాదాలు రెడీ..అజిత్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘విదాముయర్చి’. తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో అర్జున్ నటించారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ్ర΄÷డక్షన్స్ నిర్మించిన ఈ యాక్షన్ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది.ఇక అనిఖా సురేంద్రన్, పవిష్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని, ఫిబ్రవరిలోనే రిలీజ్ ఉండొచ్చనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.2022లో విడుదలైన ‘లవ్ టుడే’ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగు ప్రేక్షకులకు నటుడిగా దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరోగా నటించిన తమిళ చిత్రం ‘డ్రాగన్’ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. తమిళంలో లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా, కేఎస్ రవికుమార్, మిస్కిన్, వి.జె. సిద్ధు, హర్షద్ ఖాన్లు ఇతర లీడ్ రోల్స్లో నటించారు. తెలుగులోనూ ఈ మూవీని ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.– ముసిమి శివాంజనేయులు -
మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం వేళ.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. గతంలో జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో మోహన్ బాబు ఆస్పత్రి పాలయ్యారు. ఓ ప్రైవేట్ చికిత్స తీసుకుని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల సంక్రాంతి వేడుకల్లో కూడా మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అంత బాగుందనుకున్న తరుణంలో మరోసారి వివాదం మొదలైంది.ఈ పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబుకు యూనివర్సీటికి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. మనోజ్ దంపతులను లోపలికి అనుమతించక పోవడంతో ఆయన అనుచరులు గేటు పైకి ఎక్కి లోపలికి ప్రవేశించారు. మనోజ్కు అనుమతి లేదని వారు చెప్పడంతో ఇరువర్గాల వారు దూషణకు దిగారు. మనోజ్ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు. ఆపై ఎంబీయూలో పని చేస్తున్న కిరణ్ కుమార్పై దాడి చేశారు.మంచు విష్ణు ట్విటర్ పోస్ట్ వైరల్..ఈ గొడవల నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్ ఆడియోను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. నా ఫేవరేట్ డైలాగ్స్లో ఇది ఒకటి.. నా ఫేవరేట్ డైరెక్టర్ ఆర్జీవీ ఈ సినిమాను అందించాడు. ఇందులో ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ అంటూ ఇండస్ట్రీలో మోహన్ బాబు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో చూసేద్దాం.'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్ను మంచు విష్ణు షేర్ చేశారు. అయితే వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటి పోస్ట్ చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్ను ఉద్దేశించే చేశారా? అనే తెగ చర్చించుకుంటున్నారు. కేసులు నమోదు..ఈ వివాదంతో చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు అయ్యాయి. మనోజ్, మోహన్బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురిపై పోలీసులు నమోదు చేశారు.తాత, నానమ్మకు మంచు మనోజ్ దంపతుల నివాళులు..తిరుపతికి వెళ్లిన మంచు మనోజ్.. తన భార్యతో కలిసి తాత, నానమ్మల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు. శ్రీవిద్యానికేతన్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంచు మనోజ్ చెప్పారు. ఆపై సుమారు 200 మందితో కలిసి ర్యాలీగా శ్రీవిద్యానికేతన్ మీదుగా నారావారిపల్లెకు చేరుకున్న మనోజ్.. అక్కడ మంత్రి నారా లోకేశ్తో సుమారు 25 నిమిషాల పాటు భేటీ కావడం విశేషం. One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025 -
'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్.. మూడు రోజుల్లోనే క్రేజీ మార్క్!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.కాగా.. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మూడు రోజులకే వందకోట్ల మార్క్ను అధిగమించి మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది.ఓవర్సీస్లో రికార్డ్ స్థాయి వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.చదవండి: కట్టెల పొయ్యిపై చేపల పులుసు వండిన నాగ చైతన్యఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ.Any centre, single hand ~ Victory @venkymama 🔥🔥🔥106Cr+ Gross worldwide in 3 Days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥❤️🔥❤️🔥The OG of Sankranthi has set the box office on fire, bringing festive celebrations alive in theatres 💥— https://t.co/ocLq3HYNtH… pic.twitter.com/AR5ZlaPvjR— Sri Venkateswara Creations (@SVC_official) January 17, 2025 -
రామ్ చరణ్తో బుచ్చిబాబు సినిమా.. జగపతి బాబు లుక్ చూశారా?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో చెర్రీ నటించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. షూట్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూట్కు సంబంధించిన వీడియోను ట్విటర్ షేర్ చేశారు.ఈ చిత్రంలో తన పాత్ర కోసం మేకోవర్ చేస్తున్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సీ 16 కోసం మంచి పని పెట్టాడు..గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది'అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆర్సీ16గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాను బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతమందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025 -
టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం గేమ్ ఛేంజర్(Gam Changer Movie). శంకర్(sankar) డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలి రోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.186 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.వెంటాడుతున్న పైరసీ..అయితే సినీ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నా వైరస్ పైరసీ. తాజాగా గేమ్ ఛేంజర్లో విషయంలోనూ పైరసీ ఇండస్ట్రీని షాకింగ్కు గురి చేస్తోంది. ఏకంగా లోకల్ ఛానెల్లో గేమ్ ఛేంజర్ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో పైరసీ అంశం మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్( శ్రీనివాస కుమార్) రియాక్ట్ అయ్యారు. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్కేఎన్ తన ట్విట్లో రాస్తూ.. 'ఇది ఏమాత్రం సహించదగినది కాదు. సినిమా విడుదలై కేవలం 4-5 రోజులు మాత్రమే అయింది. వారం రోజులు కాకముందే సినిమాను స్థానిక కేబుల్ ఛానల్స్, బస్సులలో ప్రసారం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సినిమా అనేది కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి మాత్రమే కాదు. ఎంతోమంది మూడు, నాలుగు సంవత్సరాల కృషి, వారి అంకితభావం, వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఈ సినిమా విజయంపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాను రక్షించడానికి.. సినీ ఇండస్ట్రీ మెరుగైన భవిష్యత్తు కోసం మనందరం ఐక్యంగా నిలబడి పోరాడుదాం.' అని పోస్ట్ చేశారు. అంతే కాకుండా 'సేవ్ది సినిమా' అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు.లీక్ చేస్తామంటూ బెదిరింపులు..తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ కొందరు బెదిరించారు. వారిపై చిత్రబృందం సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని.. సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.దీనిపై ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్పై నెగెటివ్ ప్రచారం చేస్తున్న కొన్ని ఖాతాల పైనా కూడా చిత్రబృందం ఫిర్యాదు చేసింది. This is unacceptable. A film that was released just 4-5 days ago being telecasted on local cable channels & Buses raises serious concerns. Cinema is not just about the Hero, director or producers – it’s the result of 3-4 years of hard work, dedication and the dreams of thousands… https://t.co/ukPHIpi6ko— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 15, 2025 -
ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్!
యాటిట్యూడ్ స్టార్గా పాపులర్ అయిన సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్ తొలి సినిమానే 'రామ్ నగర్ బన్నీ'. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్గా నటించారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. గతేడాది అక్టోబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు.రామ్ నగర్ బన్నీ కథేంటంటే..?రామ్నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.Relationships, responsibilities, and redemption—Attitude star's emotional rollercoaster begins on from Jan 17 #RamNagarBunny @parkyprabhakar #Chandrahass@DivijaPrabhakar @vismayasri #RichaJoshi #ambikavani @Rithumanthra @iammadhunandan #ActorSameer #aslisaleempheku… pic.twitter.com/klP7FtkTjB— ahavideoin (@ahavideoIN) January 14, 2025