అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్‌లిస్ట్‌లో రిషి సునాక్‌ దంపతులు | Rishi Sunak, Wife Akshata Murty Wealth Soars | Sakshi
Sakshi News home page

అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్‌లిస్ట్‌లో రిషి సునాక్‌ దంపతులు

May 17 2024 6:31 PM | Updated on May 17 2024 7:03 PM

Rishi Sunak, Wife Akshata Murty Wealth Soars

ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ  పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్‌ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్‌ యూరోలకు పెరిగింది.  

‘సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్‌ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.

ఇన్ఫోసిస్‌లో
2023లో రిషి సునాక్‌ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్‌ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్‌లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్‌ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్‌ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. 

కింగ్ చార్లెస్ సంపద
ఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని,  600 మిలియన్‌ యూరోల నుండి  610 మిలియన్‌ యూరోలకు పెరిగినట్లు  సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్‌ చేసింది.  

తగ్గిపోతున్న బిలియనీర్లు
2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా..  మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .

యూకేలోనూ భారతీయుల హవా
బ్రిటన్‌లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్‌ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్‌ యూరోల నుండి 37.2 బిలియన్‌ యూరోలకు పెరిగింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement