business news
-
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ స్థానంలో రోహిత్ జైన్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) రోహిత్ జైన్ నియామకానికి ఆమోదం తెలిపింది.ప్రస్తుతం జైన్ ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. రవి శంకర్కు పొడిగించిన పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జైన్ మే 3వ తేదీ లేదా ఆ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్బీఐ చట్టం–1934 ప్రకారం, కేంద్ర బ్యాంకుకు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి.వీరిలో ఇద్దరిని రిజర్వ్ బ్యాంక్ అంతర్గత అధికారుల నుంచి, ఒకరిని కమర్షియల్ బ్యాంకింగ్ రంగం నుంచి, మరొకరిని మానిటరీ పాలసీ విభాగానికి నేతృత్వం వహించేలా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఆర్బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎస్.సి. ముర్ము, పూనమ్ గుప్తా, స్వామినాథన్ జే తదితరులు ఉన్నారు. -
మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్
-
జస్ట్ 5 డేస్..7 కంపెనీలు.. నిండాముంచేసిన TCS, RELIANCE..
-
టాటా చరిత్రలోనే తొలిసారి డబుల్ బొనాంజా.. డబ్బులే డబ్బులు
-
విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె సబ్ స్క్రిప్షన్ సంగతి తెలిస్తే..
-
రూ.3 వేలు తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర తులం ఎంతంటే
-
బంగారం ధర మళ్లీ తగ్గిందోచ్.. ఇవాళ తులం ఎంతంటే..!
-
ఎల్పీజీ మార్పులు.. మే 1 నుంచి కొత్త రూల్స్
దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మే 1వ తేదీ నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా ఇంధన ధరలపై పడుతోంది. ధరల పెంపుతో పాటు, మే నెల నుంచి గ్యాస్ బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఅమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ధరల భారాన్ని వినియోగదారులపై గత నెలలోనే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరపై సుమారు రూ. 60పెరిగింది. ఇక కమర్షియల్ వినియోగదారులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఏప్రిల్ 2026 నాటికి ఏకంగా రూ. 196 పెరిగింది. మే 1వ తేదీన చమురు సంస్థలు నిర్వహించే నెలవారీ సమీక్షలో ధరలు మరోసారి సవరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.కొత్త బుకింగ్ నిబంధనలు ఇవే!కేవలం ధరలే కాకుండా, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది.బుకింగ్ గ్యాప్: నగరాల్లో నివసించే వారు ఒక బుకింగ్కు, మరో బుకింగ్కు మధ్య కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.OTP తప్పనిసరి: గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ఆధారిత ప్రామాణీకరణ ఇకపై శాశ్వతం కానుంది. సిలిండర్ల మళ్లింపును అరికట్టేందుకు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.ఆన్లైన్ బుకింగ్: ప్రస్తుతం 98% బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండగా, మే నెల నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయనున్నారు.ఆధార్ ఈ-కేవైసీ ఎవరికి అవసరం?గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీపై (e-KYC) సామాన్యుల్లో ఉన్న గందరగోళానికి అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఆర్థిక సంవత్సరంలో ఏడు రీఫిల్స్ పూర్తయ్యాక, ఎనిమిదో సిలిండర్ నుండి సబ్సిడీ పొందాలంటే ఈ ప్రామాణీకరణ అవసరం. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. -
కొనసాగుతున్న బంగారం ధరల పతనం... గోల్డ్ కొన్నవారికి వరుస షాక్స్
-
కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్లు.. లక్షకు 5 లక్షలొచ్చాయ్..
-
అమెజాన్లో మామిడి జాతర.. ఏఐతో నచ్చిన పండు
వేసవి కాలం రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండ్ల మధురమైన రుచి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అమెజాన్ ఇండియా 'ఆమ్-ఎజింగ్' పేరిట ప్రత్యేక మామిడి పండ్ల విక్రయాలను ప్రారంభించింది. పొలాల నుండి నేరుగా సేకరించిన అల్ఫోన్సో, కేసర్, సఫేదా, తోతాపురి వంటి మేలైన రకాలను అమెజాన్ నౌ, అమెజాన్ ఫ్రెష్ ద్వారా అందిస్తోంది. పండ్లతో పాటు మామిడి ఐస్ క్రీములు, ఆమ్రస్, ఊరగాయలు, పానీయాలపై 30% నుండి 70% వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సిఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలకు నిమిషాల వ్యవధిలోనే లేదా గరిష్టంగా 2 గంటల్లోపు డెలివరీ చేసే సదుపాయాన్ని కల్పించింది.ఈ సీజన్ షాపింగ్లో ప్రధాన ఆకర్షణ అమెజాన్ వారి ఏఐ-ఆధారిత షాపింగ్ అసిస్టెంట్ 'రూఫస్' (Rufus). వినియోగదారులు తమ మూడ్కు తగిన మామిడి పండును ఎంచుకోవడానికి రూఫస్ సహాయపడుతుంది. "రూ. 500 లోపు అల్ఫోన్సో చూపించు" లేదా "స్మూతీకి ఏ రకం బాగుంటుంది?" వంటి ప్రశ్నలకు ఇది తక్షణమే సమాధానాలిస్తుంది. అంతేకాకుండా, గత 30 నుండి 90 రోజుల ధరల చరిత్రను విశ్లేషించి, వినియోగదారులు సరైన డీల్ పొందుతున్నారో లేదో తెలియజేస్తుంది. ధర తగ్గినప్పుడు అలర్ట్లు పంపడం, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు చేయడం ద్వారా ఈ ఏఐ అసిస్టెంట్ షాపింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్గా మారుస్తోంది.ప్రతి వినియోగదారుని అవసరానికి తగినట్లుగా ఐదు రకాల కేటగిరీలను అమెజాన్ రూపొందించింది. తీపి కోరికలను తీర్చుకోవడానికి అల్ఫోన్సో రకాలు, వంటల కోసం తోతాపురి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఆమ్రస్, క్యాండీలు, ఆరోగ్య స్పృహ ఉన్నవారి కోసం ఫ్రీజ్ డ్రైడ్ చిప్స్, ప్రోటీన్ షేక్ వంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. -
గోల్డ్ మార్కెట్ లో ఊహించని ప్రళయం.. మళ్లీ లక్ష రూపాయలకు బంగారం ధర?
-
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్
-
పేటీఎం పేమెంట్ బ్యాంక్పై ఆర్బీఐ కీలక నిర్ణయం
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుంచి (ఏప్రిల్ 24) అమల్లోకి వస్తుందని తెలిపింది.పేటీఎం పేమెంట్ బ్యాంక్లో డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో వ్యాపారం జరిగిందని ఆర్బీఐ పేర్కొంది. తమకు జారీ చేసిన పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులోని నిబంధనలను పాటించడంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దుపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని సంస్థ వెల్లడించింది.ఆర్బీఐ ఇవాళ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు ఇచ్చిన బ్యాంకింగ్ లైసెన్స్ను బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని సెక్షన్ 22(4) కింద రద్దు చేసింది.ఆంక్షలు విధించడంతో ఈ రోజు నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కి బ్యాంకింగ్ లైసెన్స్ ఇక చెల్లదు. ఇకపై బ్యాంకింగ్ వ్యాపారం (సెక్షన్ 5(b)) లేదా అదనపు వ్యాపారాలు (సెక్షన్ 6) నిర్వహించడానికి వీలు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలు, తదుపరి చర్యలు ప్రకటించనుంది. -
భారీ నష్టాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్
-
ఆరేళ్లలో లక్షకు 70 లక్షలొచ్చాయ్..! లాభాల పంట పండించిన మల్టీబ్యాగర్
-
భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
-
నీటితో నడిచే గ్యాస్ స్టవ్ తయారీ.. 100ML నీళ్లతో 6 గంటల వంట..
-
కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?
-
యాపిల్కి కొత్త కెప్టెన్ ఇతనే !
-
ఇన్వెస్టర్లకు కాసుల పంట.. లక్షకు 13 లక్షలు సంపాదించిపెట్టిన స్టాక్..
-
ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డియర్ అలవెన్స్ను 2 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో DA పెంపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా చెప్పొచ్చు. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం 60 శాతానికి చేరింది. ఈ ఏడాది జనవరి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. ఒకవైపు ఉద్యోగ సంఘాలు 8వ వేతన కమిషన్ కింద వేతన నిర్మాణంలో పెద్ద మార్పులు కోరుతూ.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83గా పెంచాలని, కనీస బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.69,000కి పెంచాలని ప్రతిపాదించాయి. అలాగే, వేతన లెక్కల్లో ఆధారపడిన తల్లిదండ్రులను కూడా ‘కుటుంబం’ నిర్వచనంలో చేర్చాలని.. వేతన వ్యత్యాసానికి పరిమితి పెట్టాలని, ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా అలవెన్సులు ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు, కేంద్రం సముద్ర రవాణా రంగానికి కూడా పెద్ద ఊరట ఇచ్చింది. సావరిన్ మారిటైం ఫండ్ పేరుతో రూ.13,000 కోట్ల నిధిని కేబినెట్ మీటింగ్లో ఆమోదించింది. దీని ద్వారా భారత్ నుంచి బయలుదేరే నౌకలకు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్ అందించనుంది. ఇది సముద్ర రవాణా రంగానికి భద్రతా పరంగా కీలకంగా మారనుంది.గ్రామీణ రహదారి అభివృద్ధి కోసం కూడా కేంద్ర మంత్రి మండలి మరో నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY)ను 2028 వరకు పొడిగించింది. అదనంగా రూ.3,000 కోట్ల కేటాయింపును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటానికి ఇది తోడ్పడనుంది. -
ITR ఫైల్ చేయట్లేదా ? చేయండి లేకపోతే..!
-
బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్!
-
జర్మనీలో జాబ్ కోసం ఇలా అప్లై చేసుకోండి
-
అక్షయ తృతీయ ముందు మహిళలకు గుడ్ న్యూస్...
-
లాభాల వరద పారించిన LIC స్టాక్.. 20 వేల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..
-
కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు
-
వరుసగా మూడో రోజు పెరిగిన గోల్డ్ రేటు.. అక్షయ తృతీయ ముందు మహిళలకు షాక్
-
ప్రపంచ యుద్ధ భయం.. కానీ స్టాక్ మార్కెట్లు ధ రికార్డులే కొడుతున్నాయి
-
Oracle ఉద్యోగాల ఊచకోత వెనుక అసలు కథ
-
పెట్రోల్, డీజిల్ ధరల పెంచేందుకు కేంద్రం ముహూర్తం ఫిక్స్..!
-
అక్షయ తృతీయ ముందు దెబ్బకొట్టిన గోల్డ్ రేట్...
-
చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?
-
ఇలా కొత్త పన్ను విధానంలో రూ. 15.85 లక్షల వరకు ఆదాయంపైనా జీరో టాక్స్..!
-
మ్యూచువల్ ఫండ్స్ లో ఈ 'స్కీమ్స్' కోసం ఎగబడిన జనం
-
అదరగొట్టిన HDFC స్కీమ్.. రూ.5 లక్షలు పెడితే రూ.18 లక్షలు!
-
ఒక్క సంవత్సరంలోనే లక్షకు 19 లక్షలొచ్చాయ్.. లాభాల వరద పారించిన స్టాక్..!
-
300 మంది టాప్ బాస్ లు ఔట్..TCS లో ఏం జరుగుతోంది..?
-
ETFలో ఇన్వెస్ట్ చేసినవారికి పండగే... భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్
-
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
-
లక్షను 26 లక్షలు చేసింది.. ఐదేళ్లలో కాసుల పంట పండించిన స్టాక్..!
-
ఇక గ్యాస్ సిలెండర్ ధర 4000 రూపాయల పైమాటే
-
ట్రంప్ డెడ్ లైన్ ఎఫెక్ట్.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
-
బెంగళూరు ఐటీలో అలజడి.. 80 శాతం ఉద్యోగాలకు AI ఎసరు..
-
భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
PAN CARD కొత్త రూల్స్ , ఆధార్ ఒక్కటే ఉంటే సరిపోదు అవన్నీ కావాల్సిందే!
-
SBI డీల్ ఎఫెక్ట్.. టాప్ గేర్ లో సాట్రిక్స్ షేర్..
-
మళ్ళీ షాక్ ఇస్తోన్న బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..!
-
కేంద్రం కీలక నిర్ణయం... SIM Binding తప్పనిసరి...
-
లక్ష పెడితే 69లక్షలొచ్చాయ్.. కాసుల వర్షం కురిపించిన స్టాక్..!
-
ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!
-
బంగారం ఒక్కరోజులో మళ్లీ భగ్గుమంది! వెండి మాత్రం..!
-
నెలకు రూ.55 కడితే చాలు.. జీవితాంతం పెన్షన్
-
లోన్స్ నుండి సిబిల్ వరకు core ఏప్రిల్ 1 నుండి కొత్త బ్యాంకింగ్ రూల్స్..
-
SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే 5 కోట్లు సంపాందించొచ్చు..!
-
భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ కనిష్టానికి రూపాయి విలువ
-
ఏకంగా 7 లక్షల కోట్లు..! లాభాల్ని నింపుకునేందుకు రెడీగా ఉండండి..!
-
ఫిక్స్డ్ డిపాజిట్లను మించి లాభం ఏడాదిలో హైరిటర్న్స్ ఇచ్చిన 5 మ్యూచువల్ ఫండ్స్ ఇవే
-
ఒక్కసారిగా షాకిచ్చిన గోల్డ్..! రాత్రికి రాత్రే భారీ మార్పు..
-
ఏప్రిల్ 1 నుంచి కొత్త మార్పులు.. ఈ వివరాలు ఇవ్వాల్సిందే..!
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
శ్రీరామనవమికి షాక్ ఇచ్చిన బంగారం.. తులం ఎంతంటే..?
-
ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ
-
ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ
-
4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..
-
HDFC చైర్మన్ రాజీనామా.. భారీగా పడిపోయిన షేర్లు అసలేం జరిగిందంటే..!
-
ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...
-
బంగారం కొన్నవారికి నిద్రలేని రాత్రులు.. పాతాళానికి గోల్డ్ రేట్స్..
-
పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!
-
మాంసం ప్రియులకు షాక్! ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరలు
-
రూ. 1 లక్ష పెట్టినోళ్లకు 15 ఏళ్లలోనే 16 లక్షలొచ్చాయ్..!
-
యుద్ధ బీభత్సం 50 లక్షల కోట్ల నష్టం..
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు.. భవిష్యత్లో బంగారం లక్షకు పడిపోనుందా..?
-
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
పడిపోతున్న పసిడి ధరలు... కొనాలా? వెయిట్ చేయాలా?
-
ఇన్ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి
న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి నెమ్మదించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షీణించడంతో 2.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 3.4 శాతంగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఫిబ్రవరిలో ఎరువులు, సిమెంటు, విద్యుదుత్పత్తి వరుసగా 3.4 శాతం, 9.3 శాతం, 0.5 శాతం మేర క్షీణించింది.అయితే బొగ్గు, ఉక్కు ఉత్పత్తి మాత్రం మెరుగ్గా నమోదైంది. ఇక ఏప్రిల్–ఫిబ్రవరి మధ్యకాలంలో ఇన్ఫ్రా వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 4.4 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందు నుంచే కీలక రంగాల వృద్ధి నెమ్మదించిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. -
సిబిల్ స్కోరుపై పెరుగుతున్న అవగాహన
ముంబై: రుణాల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ట్రాన్స్యూనియన్ సిబిల్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 18.3 కోట్ల మంది భారతీయులు తమ సిబిల్ స్కోరును స్వయంగా పరిశీలించుకుంటున్నారు.తొలిసారిగా పరిశీలించుకునే వారి సంఖ్య గతేడాది డిసెంబర్ గణాంకాల ప్రకారం వార్షికంగా 27 శాతం పెరిగింది. క్రెడిట్ మానిటరింగ్ చేసుకుంటున్న వారి సగటు స్కోరు 728గా ఉంది. ఇలా పర్యవేక్షించుకుంటున్న వారిలో సుమారు 45 శాతం మంది ఆరు నెలల వ్యవధిలో తమ స్కోరును మరింత మెరుగుపర్చుకుంటున్నారు.సాధారణంగా వ్యక్తిగత రుణాల్లాంటివి అవసరమైనప్పుడు మాత్రమే వినియోగదారులు స్కోరును తెలుసుకునే వారని, కానీ ప్రస్తుతం తరచుగా తెలుసుకోవడం, దాన్ని మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నారని సంస్థ ఎండీ భవేష్ జైన్ తెలిపారు. మిలీనియల్స్, జెన్ జెడ్ తరం, మహిళలు ఈ విషయంలో ముందుంటున్నారని పేర్కొన్నారు. మెట్రోయేతర ప్రాంతాల్లో స్కోరు ను పరిశీలించుకునే ధోరణి పెరుగుతోందన్నారు. -
మినీ రత్న హోదాకు దగ్గర్లో ‘ఫ్యాక్ట్’
కోచి: ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ (ఫ్యాక్ట్) మినీరత్న హోదా పొందేందుకు కావాల్సిన దాదాపు అన్ని ముఖ్యమైన నిబంధనలను పూర్తి చేసిందని కంపెనీ డైరెక్టర్ (మార్కెటింగ్) అనుపమ్ మిశ్రా ప్రకటించారు. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోందని.. ఇది పూర్తయితే హోదా లభిస్తుందన్నారు.ఈ హోదాతో కంపెనీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎరువులు సహా ప్రతీ రంగంలోనూ స్వావలంబన దిశగా దేశం అడుగులు వేస్తోందంటూ.. ఈ దిశగా ఫ్యాక్ట్ తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు.‘‘ప్రభుత్వానికి వరుసగా మూడో ఏడాది డివిడెండ్లు చెల్లించాం. వరుసగా ఏడు సంవత్సరాల నుంచి లాభాల్లో కొనసాగుతున్నాం. ఐదేళ్లుగా కంపెనీ నికర విలువ సానుకూల స్థితిలో ఉంది. 2018–19లో కంపెనీ టర్నోవర్ రూ.18,00–1,900 కోట్లుగా ఉంటే.. నేడు రూ.5,000 కోట్లకు పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లకు చేరింది’’అంటూ సంస్థ సాధించిన పురోగతిని మిశ్రా వివరించారు. -
ఎస్బీఐకి ఐటీ శాఖ భారీ ట్యాక్స్ నోటీసు..
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్బీఐ ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.అసలు ఏం జరిగింది?ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(3), 144సి(3), 144బి కింద ఐటీ శాఖ మార్చి 19న ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి (AY24) సంబంధించి నిర్వహించిన స్క్రూటినీ అసెస్మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ పన్ను డిమాండ్ ఉత్పన్నమైందని బ్యాంక్ తెలిపింది. వివిధ అంశాల్లో ఆదాయపు పన్ను శాఖ చేసిన కోతలే (Disallowances) ఈ భారీ మొత్తానికి కారణమని తెలుస్తోంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే ఏవైనా ప్రధాన పరిణామాలు చోటుచేసుకుంటే వాటిని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పన్ను డిమాండ్ మొత్తం 'మెటీరియాలిటీ థ్రెషోల్డ్' (నిర్ణీత పరిమితి) కంటే ఎక్కువగా ఉన్నందున, పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్లో భాగంగా ఎస్బీఐ ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఎస్బీఐ తదుపరి చర్యలుఈ నోటీసుపై ఎస్బీఐ ధీమాగా ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి అంశాలపైనే బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోందని, తాజా నోటీసును కూడా అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పన్ను నోటీసు వల్ల బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణపై ఎటువంటి ప్రభావం ఉండదని ఎస్బీఐ యాజమాన్యం పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. -
లక్ష పెడితే ₹58 లక్షలు.. మ్యాన్ బ్రో ఇండస్ట్రీస్ షేర్ సంచలనం
-
నిన్న ₹7,000 పతనం.. ఇవాళ మళ్లీ పెరిగిన బంగారం ధర!
-
మార్కెట్లు పడిపోతున్నా ఈ 5 స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి..?
-
1 షేరు కొంటే 4 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.1.84 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్
-
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట.. ఇ-కేవైసీ వారికి మాత్రమే!
-
గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి నష్టం తప్పదు
-
ఘనంగా సీడీకే 'కన్వర్జెన్స్ 2026' వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ సంస్థ 'సీడీకే' (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో 'కన్వర్జెన్స్ 2026' వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడంతో పాటు, భారతీయ సంస్కృతి కుటుంబ విలువలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏడాది "మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం" అనే థీమ్తో వేడుకలు నిర్వహించారు.ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే సీడీకే సంస్థ, 2019 నుండి వరుసగా 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (GPTW) గుర్తింపును పొందుతోంది. అంతేకాకుండా, 2025 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ 100 ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయాల వెనుక ఉద్యోగుల శ్రమతో పాటు వారి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని ఈ వేడుక చాటిచెప్పింది.కన్వర్జెన్స్ 2026 వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించిన వేదికపై సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోన్ ఆకట్టుకుంది. ఇదే వేదికపై సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులకు 'రివార్డ్స్ అండ్ రికగ్నిషన్' విభాగంలో అవార్డులను అందజేసి గౌరవించారు. -
గోల్డ్ రూ.21 వేలు, వెండి లక్షన్నర పతనం.. తులం బంగారం ఎంతంటే..!
-
మళ్లీ బంగారం కొనే టైమొచ్చింది..! ఐదో రోజు పతనమైన గోల్డ్ రేట్
-
మహిళలకు ఇదే లక్కీ ఛాన్స్.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..!
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధర... ఒక్క రోజులో జంప్..
-
మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!
దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీగా పెరిగిన డేటా వినియోగం భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.జీబీకి రూ.1 పన్ను వేధించినా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వినియోగదారులపై ప్రభావంప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
రంగంలోకి రిలయన్స్! ఇక జోరుగా గ్యాస్ ఉత్పత్తి
ప్రపంచ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో దేశీయంగా వంటగ్యాస్ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న తన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ సముదాయాల్లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తిని పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ కీలక ఇంధనాలకు నిరంతర సరఫరా కొనసాగడం జాతీయ ప్రాధాన్యతగా ఉందని పేర్కొంది.అలాగే కేజీ-డీ6 బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజవాయువును ప్రాధాన్య రంగాలకు మళ్లించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. జాతీయ ఇంధన అవసరాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.“భారతదేశ ఇంధన భద్రత, కోట్లాది భారతీయ కుటుంబాల సంక్షేమం మా సంస్థకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తూ జాతీయ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉంటాం. అవసరమైన రంగాలకు ఇంధన సరఫరా నిరంతరం అందేలా చర్యలు కొనసాగిస్తాం” అని కంపెనీ తెలిపింది. అవసరమైన సమయంలో దేశానికి అండగా నిలబడటం రిలయన్స్ బాధ్యతగా భావిస్తుందని కూడా పేర్కొంది. ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో దేశ ఇంధన భద్రతకు మద్దతుగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా దేశంలోని అన్ని రిఫైనరీలు ప్రొపేన్, బ్యూటేన్, ప్రొపైలిన్, బ్యూటెన్స్ వంటి సి3, సి4 స్ట్రీమ్లను పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికి వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా ఉత్పత్తి అయ్యే వంటగ్యాస్ను దేశీయ వినియోగదారులకు మాత్రమే అందించాలని స్పష్టం చేసింది.ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే నిత్యావసర వస్తువుల చట్టం–1955చ పెట్రోలియం ఉత్పత్తుల (ఉత్పత్తి, నిల్వ, సరఫరా నిర్వహణ) ఆర్డర్–1999 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
Gold Prices: మహిళలు గుడ్ న్యూస్.. మళ్లీ పడిపోయిన పసిడి ధరలు..
-
10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
-
దేశీయ స్టాక్ మార్కెట్లు క్రాష్.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
-
ఈనెల 11 నుంచే ప్రభుత్వ సంస్థ.. ఏకంగా రూ.6000 కోట్లు.. రెడీగా ఉండండి..
-
టాటా స్టీల్ రూ. 11,000 కోట్ల పెట్టుబడులు
రాంచీ: అధునాతన గ్రేడ్ ఉక్కును తయారు చేసే దిశగా జంషెడ్పూర్ ప్లాంటుపై రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఇందుకోసం తాము రూపొందించిన టెక్నాలజీతో ఉక్కు ప్రాసెసింగ్ వేగవంతమవుతుందని, అలాగే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని చెప్పారు. నెదర్లాండ్స్లో ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయిన నేపథ్యంలో 2030 నాటికి జంషెడ్పూర్లో 1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. హైడ్రోజన్ ట్రక్కులపై కూడా టాటా మోటర్స్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. ఇక జార్ఖండ్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని టాటా గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఒక్కరోజులోనే కుప్పకూలిన బంగారం ధరలు.. ఈరోజు రేట్లు ఇవే..!
-
నౌకలు నిల్చిపోతే కీలక రంగాలపై ఎఫెక్ట్
పశ్చిమాసియాలో యుద్ధంతో (#IranIsraelUSWar) హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వారానికి పైగా నిల్చిపోతే దేశీయంగా పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో వెల్లడించింది. ఇంధన మార్కెట్ల నుంచి ఎరువుల సరఫరా, పరిశ్రమలకు ముడిపదార్థాలు, నిర్మాణ రంగ మెటీరియల్స్తో పాటు ఇతరత్రా ఎగుమతి రంగాలకు కూడా సవాళ్లు తప్పవని పేర్కొంది.‘‘దీనితో తక్షణం పెట్రోలియంపై ప్రభావం పడుతుంది. 2025లో పశ్చిమాసియా నుంచి భారత్ 70 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్రోలియం క్రూడ్, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్ వద్ద 30 రోజులకు సరిపడేంత ఇంధన నిల్వలే ఉన్నాయి. ఒకవేళ షిప్మెంట్స్లో ప్రతిష్టంభన మరింత దీర్ఘకాలం కొనసాగితే ఇంధనాల ధరలు వేగంగా పెరిగిపోతాయి. దీంతో రవాణా వ్యయాలతో పాటు మిగతా అన్నింటి ధరలూ పెరుగుతాయి. డీజిల్ రేట్ల వల్ల రైతులకు ఇరిగేషన్ పంపులు, ట్రాక్టర్ల నిర్వహణ వ్యయాల భారం పెరుగుతుంది’’ అని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. -
₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
-
Gold: వరుసగా నాలుగో రోజు పతనమైన బంగారం ధర
-
యుద్ధం దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
-
పాన్ కార్డు ఉంటే రూ.5 లక్షలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
-
NSE ఐపిఓ వచ్చేస్తోంది...టార్గెట్ రూ 23 వేల కోట్లు.. జేబులు నింపుకోడానికి రెడీగా ఉండండి
-
టాటా ఏఐజీ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్సిడెంట్ సూపర్ గార్డ్ ప్లస్’ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో సమగ్ర ఆర్థిక రక్షణను అందించే వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ఇదని, దేశంలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. వ్యక్తుల ఆదాయం, అప్పులు, జీవనశైలి రిస్క్లకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.ప్రమాద మరణం, శాశ్వత పాక్షిక, పూర్తి వైకల్యంలో ఏక మొత్తంలో బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అయ్యే ఖర్చులకు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. లోన్ షీల్డ్ (రుణాల కోసం), ఈఎంఐ ప్రొటెక్షన్, పెట్కేర్ పేరుతో ఐచ్ఛిక కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిపై వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ ప్లాన్ను తీసుకోవచ్చు. వేతన జీవులకు ప్రీమియంలో అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. -
సిమ్ బైండింగ్పై ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం లాంటి యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు తప్పనిసరిగా యాక్టివ్ సిమ్కార్డుతో లింక్ అయి ఉండాల్సిందేనంటూ (సిమ్ బైండింగ్) కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది టెలికమ్యూనికేషన్స్ చట్టాన్ని అతిక్రమించడమేనని, రాజ్యాంగవిరుద్ధమని టెలికం శాఖ కార్యదర్శి అమిత్ అగ్రవాల్కి ఫిబ్రవరి 23న రాసిన లేఖలో వ్యాఖ్యానించింది.దీని వెనుక గల అసలు కారణాలను తాము అర్థం చేసుకోగలమని, కాకపోతే నియంత్రణ సంస్థ జోక్యమనేది నిర్దిష్ట చట్టపరిధికి లోబడి ఉండాలని కోరుతున్నామని పేర్కొంది. మెటా, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలన్నీ బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరంలో సభ్యులుగా ఉన్నాయి. దేశ భద్రత రీత్యా సిమ్ బైండింగ్ నిబంధనలను మార్చే ప్రసక్తి లేదంటూ కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన నేపథ్యంలో బీఐఎఫ్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ద్రవ్యలోటు రూ.9.8 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జనవరి చివరికి (10 నెలల్లో) రూ.9.8 లక్షల కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సం బడ్జెట్ అంచనాలో ఇది 63 శాతానికి సమానం. క్రితం ఆర్థిక సంవత్సరం జనవరి చివరికి ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 74.5 శాతంగా ఉండడం గమనార్హం. 2025–26 సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (రూ.15.58 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది బడ్జెట్ అంచనా. ఈ వివరాలను కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. జనవరి చివరికి ప్రభుత్వానికి రూ.27.08 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.20.94 లక్షల కోట్లు పన్ను ఆదాయం కాగా, పన్నేతర రూపంలో రూ.5.57 లక్షల కోట్లు, రుణేతర మార్గాల్లో రూ.57,129 కోట్ల ఆదాయం సమకూరింది. -
కోడింగ్, ఎగ్జిక్యూట్ అంతా Aiతోనే.. మరి కొన్ని నెలల్లో ఐటీ ఉద్యోగాలన్నీ ఊస్ట్
-
ఈ ఒక్క స్టాక్ ఉంటే చాలు.. కాలు మీద కాలేసుకుని బతికేయొచ్చు..!
-
బ్యాంకులకు వరుస సెలవులు.. ఇదే చివరి నెల!
మార్చి నెలలో అడుగు పెడుతున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి నెల. పూర్తి చేయాల్సిన బ్యాంకు పనులు చాలానే ఉంటాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు కస్టమర్లు ఈ మార్చి నెలలో తమ బ్యాంకు బ్రాంచ్ల సందర్శనలను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పండుగలు, రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక సెలవులు, అలాగే సాధారణ ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల కారణంగా అనేక రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ముందస్తుగా షెడ్యూల్ను చూసుకోవడం ద్వారా నగదు ఉపసంహరణలు, చెక్ క్లియరెన్సులు వంటి ఇతర బ్రాంచ్ సేవలలో ఆలస్యాలను నివారించవచ్చు.మార్చిలో బ్యాంకు సెలవులు» మార్చి 1 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.» మార్చి 2: హోలికా దహన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 3: హోలి, డోల్జాతర తదితర పండుగల సందర్భంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు. మార్చి 4: యోసాంగ్ (రెండవ రోజు)తో పాటు హోలీ వేడుకల నేపథ్యంలో త్రిపుర, గుజరాత్, మిజోరం, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 8 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 13: చాప్కార్ కత్ సందర్భంగా మిజోరంలో బ్యాంకులు మూసివేత.» మార్చి 14 (రెండో శనివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 15 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 17: షాబ్ ఈ ఖదర్ సందర్భంగా జమ్మూ & కాశ్మీర్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 19: ఉగాది, గుడి పడ్వా, సాజిబు నోంగ్మా పంబా వేడుకల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, జమ్మూ & కాశ్మీర్, గోవా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.మార్చి 20: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్), జమాత్ ఉల్ విదా సందర్భంగా జమ్మూ కాశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 21: రంజాన్-ఈద్, సర్హుల్ తదితర పండుగల కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 22 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 26: శ్రీ రామ నవమి సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 28 (నాలుగో శనివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 29 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 31: మహవీర్ జయంతి సందర్భంగా ఆర్బీఐ సెలవుగా గుర్తించినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరాంత లావాదేవీల దృష్ట్యా ప్రభుత్వ వ్యాపారం నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులు ఆ రోజున తెరిచి ఉంటాయి.యథావిధిగా డిజిటల్ సేవలుబ్యాంకు బ్రాంచీలకు సెలవులు ఉన్నప్పటికీ ఏటీఎంలు, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సేవలు కొనసాగుతాయి. నిధుల బదిలీలు, బిల్లు చెల్లింపులు వంటి డిజిటల్ లావాదేవీలు అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటాయి. -
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తున్నట్లు ట్రూజాన్ సోలార్ పేరిట సౌర విద్యుదుత్పత్తుల సేవలందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు సీహెచ్ భవానీ సురేష్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 300–350 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికి రెట్టింపు స్థాయిలో రూ. 600–650 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇప్పటివరకు రెసిడెన్షియల్, కమర్షియల్ తదితర విభాగాల్లో 10,000కు పైగా రూఫ్టాప్ ఇన్స్టాలేషన్స్ చేసినట్లు ఆయన చెప్పారు.ప్రస్తుతం 600 మంది పైగా సిబ్బందితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు 5 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని సురేష్ తెలిపారు. వచ్చే నాలుగైదు నెలల్లో తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ తదితర 4 రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు దాదాపు రూ. 80 కోట్లు ఇన్వెస్ట్ చేశామన్నారు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
-
మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
-
భారీగా తగ్గిన వెండి.... దూసుకుపోతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?
-
వరల్డ్ ఫేమస్ హలీమ్ తయారీ.. పిస్తా హౌజ్ లో
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
4 రోజులుగా షాకిస్తున్న గోల్డ్ రేట్స్... రూ.7 వేల పైనే పెరిగిన బంగారం ధర..
-
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాక్..!
-
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ షాక్
-
SBI నుంచి మరో అతిపెద్ద IPO.. రూ.1.36 లక్షల కోట్లు..
-
మళ్లీ షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
-
జస్ట్ మూడేళ్లలో లక్షకు 62 లక్షలొచ్చాయ్.. లాభాల వరద పారించిన స్టాక్..
-
సైలెంట్ గా షాకిచ్చిన బంగారం, వెండి ధరలు
-
లోకల్తో పోటీకి బ్రిటానియా రెడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిన్న సంస్థలతో పోటీ పడేందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిన్న సంస్థలతో పోటీపడేందుకు స్టార్టప్ స్వభావంతో బ్రిటానియా వ్యవహరిస్తుందని.. ఈ–కామర్స్ విభాగంలో బిస్కెట్లు, రస్క్, కేక్, వేఫర్ల విభాగాల్లో మరింత బలంగా అవతరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో రక్షిత్ హర్గవే తెలిపారు.‘‘ప్రాంతీయ పోటీని ఎదుర్కొంటాం. ఈ–కామర్స్లో విస్తరణపై పెట్టుబడులు పెడతాం. అమ్మకాలు పెంచుకునేందుకు మాకు తగినన్ని అవకాశాలున్నాయని భావిస్తున్నాం’’అని వాటాదారులతో నిర్వహించిన కాల్లో భాగంగా చెప్పారు. విక్రయాలు పెంచుకునేందుకు మరింత మంది వినియోగదారులను చేరుకోవడం కీలకమని పేర్కొన్నారు. గుడ్డే, టైగర్, నూట్రిచాయిస్, మ్యారీగోల్డ్ తదితర పాపులర్ బ్రాండ్లు బ్రిటానియా ఇండస్ట్రీస్ సొంతం. చిన్న కంపెనీలను ప్రాంతీయ పోటీదారులుగానే చూస్తామంటూ.. కేవలం తూర్పునే కాకుండా దేశవ్యాప్తంగా చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీని సవాలుగా పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం వల్లే.. ద్రవ్యోల్బణం, ధరలు పెంచడంలో జాప్యం లోగడ మార్జిన్లపై ప్రభావం చూపించిందని, కమోడిటీ ధరలు దిగిరావడతో కంపెనీ లాభదాయకత మెరుగుపడినట్టు రక్షిత్ హర్గవే చెప్పారు. కీలకమైన ముడి పదార్థాలు, పాలు గోధుమల ధరలు స్థిరంగానే ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలన్నారు. చెక్కెర, కోకోవా ధరలు స్థిరంగా ఉండొచ్చన్నారు. కొనుగోళ్లకూ సై.. విస్తృతమైన పోర్ట్ఫోలియో నిర్మాణం దిశగా అవసరమైతే కొనుగోళ్ల అవకాశాలనూ బ్రిటానియా ఇండస్ట్రీస్ పరిశీలిస్తుందని చెప్పారు. అన్నీ సొంతంగానే నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు. చిన్న సంస్థలు ప్రాంతీయంగా అక్కడి ప్రజల ఇష్టాలు, అభిరుచులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలవని, అవి వాటి బలమని బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విపిన్ కటారియా తెలిపారు. వాటితో పోటీపడేందుకు బ్రాండ్ నిర్మాణంపై పెట్టుబడులు పెడుతున్నట్టు వాటాదారుల సమావేశంలో చెప్పారు. -
6 ఏళ్లలో లక్షకు రూ.14 కోట్లు.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం
-
Stock Market: ఈ ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోయినట్టే..!
-
Penny Stocks: చిన్న స్టాక్.. పెద్ద అద్భుతం.. ఐదేళ్లలో లక్షకు అరకోటి లాభం..!
-
కేవలం రూ.150 పెట్టుబడితో రూ.24 లక్షలు..
-
SBI గుడ్ న్యూస్.. రూపాయి కంటే తక్కువ వడ్డీకే Personal Loan..
-
Stock Market: దూసుకుపోతున్న టేక్ సొల్యూషన్స్ 6 నెలల్లో 416% లాభం
-
SIP Plan: 10 వేల సిప్ తో ఏకంగా 16కోట్లు లాభం
-
MRF ఇన్వెస్టర్లపై కాసుల వర్షం..
-
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఇవాళ రేట్లు ఎంతంటే..?
-
Stock Market: లక్షకు 9 లక్షలు.. 7 రూపాయల షేరు 65కు జంప్.. రాత మారిపోయింది..!
-
రూట్ మార్చిన బంగారం, వెండి.. ఇవాళ ఎంత పెరిగిందంటే
-
రిలయన్స్ చేతికి సదరన్ హెల్త్ ఫుడ్స్
న్యూఢిల్లీ: అనుబంధ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్(ఆర్సీపీఎల్) తాజాగా తమిళనాడు కంపెనీ సదరన్ హెల్త్ ఫుడ్స్ను సొంతం చేసుకుంటున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అయితే డీల్ విలువను తెలియజేయలేదు.తాజా కొనుగోలు ద్వారా తృణ ధాన్యాల(మిల్లెట్స్) ఆధారిత ఫుడ్ విభాగంలో రిలయన్స్ కన్జూమర్ విస్తరించనుంది. రెండు దశాబ్దాలుగా ఆరోగ్యకర ఆహార విభాగంలో మన్నా బ్రాండ్తో సదరన్ హెల్త్ ఫుడ్స్ విభిన్న ప్రొడక్టులను విక్రయిస్తోంది. ఆర్సీపీఎల్ ఇటీవలే ఆ్రస్టేలియా సంస్థ గుడ్నెస్ గ్రూప్ గ్లోబల్ పీటీవైను సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. తద్వారా బెటర్ ఫర్ యు బ్రాండ్ పానీయాల బిజినెస్ను సొంతం చేసుకున్న విషయం విదితమే. -
లక్షను 40 లక్షలు చేసిన స్టాక్.. జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు..
-
చైనా దూకుడు.. ఆపకుండా బంగారం కొంటున్న డ్రాగన్!
బంగారం, వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన అనంతరం తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో కొత్త కదలికలకు దారితీసింది. ధరలు తీవ్ర అస్థిరతను చూపుతున్నప్పటికీ, చైనా మాత్రం బంగారం కొనుగోలును దూకుడుగా కొనసాగిస్తోంది. చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) వరుసగా 15వ నెల కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంది.2,307 మెట్రిక్ టన్నుల బంగారంపీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా విడుదల చేసిన డేటా, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. గత జనవరి నెలలో కూడా చైనా బలమైన బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. జనవరి చివరి నాటికి చైనా మొత్తం బంగారం నిల్వలు 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు (ఒక ఫైన్ ట్రాయ్ ఔన్సు అంటే 31.1035 గ్రాములు మొత్తం 2,307.56 మెట్రిక్ టన్నులు) చేరాయి. ఇది డిసెంబర్ చివర్లో నమోదైన 74.15 మిలియన్ ట్రాయ్ ఔన్సులతో పోలిస్తే స్వల్ప పెరుగుదలే అయినప్పటికీ, నిల్వల మొత్తం విలువ మాత్రం గణనీయంగా పెరిగింది.ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకే?జనవరి చివరి నాటికి చైనా బంగారం నిల్వల మొత్తం విలువ 369.58 బిలియన్ డాలర్లకు చేరింది. గత నెలలో ఇది 319.45 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఈ భారీ పెరుగుదలకి ప్రధాన కారణాలుగా నెల ప్రారంభంలో ఉన్న అధిక బంగారం ధరలు, అలాగే చైనా నిరంతర కొనుగోలు వ్యూహాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ప్రమాదాల నేపథ్యంలో చైనా తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే భాగంగా బంగారం నిల్వలను పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చైనా నుంచి వచ్చిన బలమైన డిమాండ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జరిగిన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణంగా జనవరిలో బంగారం ధరలు ఔన్సుకు 5,600 డాలర్ల చారిత్రక గరిష్టాన్ని తాకాయి. అయితే ఈ ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్లో తదుపరి కీలక నాయకత్వ పాత్రకు కెవిన్ వార్ష్ను పరిగణనలోకి తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడడంతో మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా స్పాట్ గోల్డ్ ధరలు గణనీయంగా పడిపోయాయి.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,887 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ దిద్దుబాటు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరల దిశపై అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొనుగోలు చేస్తుండగా, అదే సమయంలో దేశీయ వినియోగదారుల బంగారం వినియోగం మాత్రం వరుసగా రెండో ఏడాది కూడా తగ్గుముఖం పట్టింది.భారత్ పసిడి నిల్వలు ఇలా..జనవరి 2026 నాటికి, భారతదేశ కేంద్ర బ్యాంకు తన విదేశీ మారక నిల్వలలో సుమారు 880 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. తాజా విదేశీ నిల్వల డేటా ప్రకారం జనవరి చివరి నాటికి భారతదేశ మొత్తం రిజర్వ్ వాల్యుయేషన్కు ఆర్బీఐ బంగారం హోల్డింగ్స్ సుమారు 123 బిలియన్ డాలర్లు దోహదపడ్డాయి. ప్రపంచ ధరల లాభాలతో భారతదేశ బంగారం నిల్వ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ తాజా పసిడి కొనుగోళ్లు గణనీయంగా మందగించాయి. -
పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన గోల్డ్ రేట్
-
గోల్డ్, సిల్వర్ రేట్స్ సీన్ రివర్స్.. ఒక్కసారే రూ. 20000 ఢమాల్
-
భారత్లో ‘ఐకియా’కు మరిన్ని నష్టాలు
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన ఫర్నిచర్, గృహ ఫర్నిషింగ్ రిటైల్ కంపెనీ ‘ఐకియా’ ఇండియా ప్రైవేటు లిమిటెడ్కు భారత్లో నష్టాలు మరింత అధికమయ్యాయి. 2024–25 సంవత్సరానికి రూ.1,325 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. విక్రయాల ద్వారా ఆదాయం 3.33 శాతం తగ్గి రూ.1,749 కోట్లకు పరిమితమైంది. ఈ సంస్థ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1,810 కోట్ల ఆదాయంపై రూ.1,299 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవైపు భారీ నష్టం ఎదురవుతున్నా కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలపై 14 శాతం అధికంగా రూ.224 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ రూపంలో చేసిన వ్యయం రూ.196 కోట్లు, ఐకియా ఇండియా రుణ భారం రూ.8,335 కోట్లకు పెరిగింది. 2024 మార్చి నాటికి రుణ భారం రూ.7,060 కోట్లుగానే ఉంది. -
ఇక స్టార్టప్ అంటే రూ. 200 కోట్లు!
న్యూఢిల్లీ: అంకుర సంస్థల నిర్వచనాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టర్నోవరు పరిధిని రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచింది. డీప్ టెక్ స్టార్టప్ల పరిధిని కూడా విస్తరించింది. ఇకపై రిజిస్టరయిన 20 ఏళ్ల వరకు, వాటిని స్టార్టప్లుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఇది పదేళ్లుగా ఉంది.టర్నోవరు పరిమితిని కూడా రూ. 300 కోట్లకు ప్రభుత్వం పెంచింది. డీప్ టెక్ సంస్థలకి భారీ స్థాయిలో పెట్టుబడులు కావాల్సి ఉంటుందని, వ్యాపార కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు సుదీర్ఘ సమయం పట్టేయొచ్చని డీపీఐఐటీ నోటిఫికేషన్లో పేర్కొంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు తదితరాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా నిర్దిష్ట కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్లకు కూడా స్టార్టప్ గుర్తింపునివ్వనుంది.ఇదే సమయంలో ఈ మార్పులతో స్టార్టప్ వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టర్నోవరు, కాలపరిమితుల పెంపుతో ఎక్కువ సంస్థలు స్టార్టప్ హోదా పొందే అవకాశం ఏర్పడనుంది. దీంతో పన్ను రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, ఫండింగ్ అవకాశాలు విస్తరించనున్నాయి. ముఖ్యంగా డీప్ టెక్, అగ్రి టెక్, క్లైమేట్ టెక్ వంటి రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ, సహకార రంగాల్లోనూ సాంకేతికత ఆధారిత వ్యాపారాలు పెరగడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. -
పాస్పోర్ట్ కొత్త రూల్స్.. పది రోజుల్లో అమల్లోకి!
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త పాస్పోర్ట్ నిబంధనలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళంగా మార్చడం, భద్రతను బలోపేతం చేయడం, అలాగే దేశవ్యాప్తంగా సేవలను వేగవంతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి 15 తర్వాత ఈ నిబంధనలు పూర్తిగా అమల్లోకి రానున్నాయి.దీంతో పాస్పోర్ట్ పొందడం లేదా పునరుద్ధరించుకోవడం మరింత సమర్థవంతంగా మారనుంది. చివరి నిమిషంలో దరఖాస్తు తిరస్కరణలు లేదా ఆలస్యాలు ఎదురుకాకుండా ఉండేందుకు, దరఖాస్తుదారులు ముందుగానే కొత్త నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.సరళీకృత పత్రాలు, వేగవంతమైన ధ్రువీకరణకొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం.. పాస్పోర్ట్ దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితాను క్రమబద్ధీకరించారు. పేపర్వర్క్ను తగ్గించేందుకు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేశారు. ఆధార్ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, తక్కువ సర్టిఫికెట్లతోనే దరఖాస్తు పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో పాస్పోర్ట్ కార్యాలయాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.అయితే అసంపూర్ణం లేదా తప్పుగా అప్లోడ్ చేసిన పత్రాలతో చేసే దరఖాస్తులు మాత్రం పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో పత్రాలు అప్లోడ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం.పోలీస్ వెరిఫికేషన్లో కీలక మార్పులుపాస్పోర్ట్ జారీ ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకునే పోలీస్ ధ్రువీకరణను కూడా సవరించారు. ఇకపై ఇది ప్రధానంగా డిజిటల్ మార్గాల్లోనే జరగనుంది. సమన్వయ వ్యవస్థల ద్వారా అనేక సందర్భాల్లో వారాల పాటు పట్టే ధ్రువీకరణను కొన్ని రోజుల్లోనే పూర్తిచేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ ముందుగా జారీ చేసి, తరువాత వెరిఫికేషన్ చేసే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. దీంతో మొత్తం ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.మరింత సులభమైన ఆన్లైన్ సేవలుప్రభుత్వ పాస్పోర్ట్ పోర్టల్ను యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో అప్గ్రేడ్ చేశారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులు లేకుండానే ఫారమ్లు పూరించడం, పత్రాలు అప్లోడ్ చేయడం, అపాయింట్మెంట్ స్లాట్లను బుక్ చేయడం చేయవచ్చు. రియల్ టైమ్ నోటిఫికేషన్లతో దరఖాస్తు స్థితిని సులభంగా ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది.మైనర్లకు సంబంధించి తల్లిదండ్రుల సమ్మతి, డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాలు లేదా పాఠశాల ఐడీలను సులభంగా అంగీకరించేలా నిబంధనల్లో స్పష్టత తీసుకొచ్చారు. దీని వల్ల పిల్లల పాస్పోర్ట్ జారీకి పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువగా సేవలుదేశవ్యాప్తంగా పాస్పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా పాస్పోర్ట్ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
-
కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
12 కంపెనీల IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్.. ఇన్వెస్టర్లకు పండగే..!


