business news
-
SBI క్రెడిట్ కార్డు కొత్త రూల్.. జూలై 15 నుంచి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ (SBI Card) నిబంధనల్లో కొత్త మార్పులు చేస్తోంది. కనీస మొత్తం బకాయిలు (మినిమమ్ అమౌంట్ డ్యూ- ఎంఏడీ) లెక్కింపు పద్ధతిని సవరించింది. క్రెడిట్ కార్డు హోల్డర్ డిఫాల్ట్ అవ్వకుండా క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ గడువు తేదీ నాటికి తిరిగి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఎంఏడీ అంటారు. ఎంఏడీ లెక్కింపులో చేసిన ఈ సర్దుబాటుతో మినిమమ్ డ్యూ కట్టేద్దాంలే.. అనుకునే పెద్దమొత్తంలో బకాయిలున్న కొంతమంది క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇక కాస్తంత ఎక్కువ మినిమమ్ డ్యూ చెల్లించాల్సి రావచ్చు.ఎందుకంటే కొత్త ఎంఏడీ ఫార్ములా ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీలు ఫీజులను పూర్తిగా చెల్లించేలా చేస్తుంది. వాటిని పూర్తిగా చెల్లించకుండా లేదా ఏదో కొంత మొత్తం చెల్లించి తర్వాత పొడిగించుకుందామంటే కుదరదు. పెరిగిన ఎంఏడీ చెల్లింపు కొంతమందికి ప్రత్యేకించి రివాల్వింగ్ క్రెడిట్ కార్డ్ రుణం ఉన్నవారికి భారంగా అనిపించినప్పటికీ అది మంచిదే. క్రెడిట్ కార్డ్ రుణాన్ని రివాల్వింగ్ చేయడం అంటే సరళంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డు బకాయిని పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించేసి కొత్త కొనుగోళ్ల కోసం మిగిలిన క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం అన్నమాట.ఏం మారిందంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల కొత్త మినిమమ్ డ్యూ (MAD) ఫార్ములా, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ను ఎస్బీఐ కార్డ్ తమ వెబ్సైట్లో వివరించింది. జూలై 15 నుంచి కొత్త ఎంఏడీ లెక్కింపులో 100% జీఎస్టీ, 100% ఈఎమ్ఐ మొత్తం, 100% ఫీజులు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, ఏదైనా ఓవర్ లిమిట్ మొత్తం, మిగిలిన బ్యాలెన్స్ బకాయిలలో 2% ఉంటాయి. ఇంతకుముందు ఈఎంఐ, ఛార్జీల్లో కొంత భాగాన్ని మాత్రమే చేర్చేవారు. వినియోగదారులు కాస్త మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వీలుండేది.ఇక పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ విషయానికి వస్తే.. కార్డుదారుడి బకాయిపై అందుకున్న చెల్లింపులను 100% జీఎస్టీ, 100% ఈఎంఐ మొత్తం, 100% ఫీజు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, రిటైల్ ఖర్చులు, క్యాష్ అడ్వాన్స్తో సర్దుబాటు చేయాలని పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ పేర్కొంది. ఈ సవరించిన క్రమం వడ్డీ,పెనాల్టీ పడే భాగాలను మొదట క్లియర్ చేసేలా చేస్తుంది. దీంతో దీర్ఘకాలికంగా కార్డుదారులకు వడ్డీ పెరుగుదలను తగ్గిస్తుంది.యువతా.. క్రెడిట్ కార్డు భారం పెంచుకోవద్దుఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం.పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది.ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి.మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి.వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది.రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి.స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి.కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది. -
మారుతీ కార్లు కొనేవారికి ఊరట..
ఆటోమొబైల్స్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ కస్టమర్లకు వాహన రుణాల సదుపాయాన్ని అందించేందుకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. కొత్త కార్లు, యూజ్డ్ కార్లు, వాణిజ్య వాహనాలకి రిటైల్ రుణాల కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ తెలిపింది.మరింత పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యేందుకు, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లు అందించేందుకు ఇది తోడ్పడుతుందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు.👉 ఇది చదివారా? టాటా కారు ఓనర్లకు గుడ్న్యూస్.. మహీంద్రా చేతికి ఎస్ఎంఎల్ ఇసుజు వాణిజ్య వాహన తయారీ కంపెనీ ఎస్ఎంఎల్ ఇసుజులో మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) అనుమతి పొందింది. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా ఎక్స్లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఎస్ఎంఎల్ ఇసుజులో 58.96 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్లో ఎంఅండ్ఎం ప్రకటించింది.ఇందుకు రూ. 555 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా సంస్థలో సుమితోమో కార్పొరేషన్కున్న పూర్తి వాటా(43.96 శాతం)ను కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్లో పేర్కొంది. అంతేకాకుండా పబ్లిక్ వాటాదారుగా ఉన్న ఇసుజు మోటార్స్ నుంచి 15 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. -
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
దేశంలో హై-ఎండ్ ఇళ్లకు ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ధర ఎన్ని రూ.కోట్లయినా తగ్గేదే లేదంటున్నారు కొనుగోలుదారులు. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ లిమిటెడ్ తన సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ వెంచర్ ప్రివానా నార్త్లోని ఫ్లాట్లన్నీ కేవలం ఏడు రోజుల్లోనే పూర్తిగా అమ్మేసింది. గురుగ్రామ్లో 116 ఎకరాల సువిశాల టౌన్షిప్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ రూ .11,000 కోట్లకు పైగా అమ్మకాలను సాధించింది. ఇది దేశంలోని పెద్ద నగరాల్లో ప్రీమియం గృహాలకు ఉన్న బలమైన మార్కెట్ డిమాండ్ను తెలియజేస్తోంది.గురుగ్రామ్లోని 76, 77 సెక్టార్లలో 17.7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రివానా నార్త్ లో ఆరు ఎత్తైన 50 అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు డీఎల్ఎఫ్ అభివృద్ధి చేసిన అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్లు ఇవే. 1,152 నాలుగు పడక గదుల అపార్ట్మెంట్లు, డజను లగ్జరీ పెంట్ హౌస్లు ఉన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్ ధర రూ.9.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంది.👉ఇది చదివారా? హైదరాబాద్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ లోడింగ్డీఎల్ఎఫ్ గత లగ్జరీ లాంచ్లలో కనిపించిన విజయాన్ని ప్రతిబింబిస్తూ దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు ఈ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. డీఎల్ఎఫ్ గతంలో లాంచ్ చేసిన ప్రివానా సౌత్, ప్రివానా వెస్ట్ ప్రాజెక్ట్లలో సైతం ఇలాగే వేగంగా అమ్మకాలు నమోదయ్యాయి. హై-ఎండ్ నివాసాలకు ఉన్న డిమాండ్, డీఎల్ఎఫ్ నివాస ప్రాజెక్టులపై కొనుగోలుదారులకు ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రతిస్పందనకు కారణమని కంపెనీ నాయకత్వం పేర్కొంది.ప్రివానా నార్త్ వేగవంతమైన అమ్మకాలు హై-ఎండ్ గృహాల పట్ల విస్తృత ధోరణిని హైలైట్ చేస్తాయి. 2025 తొలి త్రైమాసికంలో రూ.4 కోట్లకు పైబడిన ఇళ్ల అమ్మకాలు 28 శాతం పెరిగాయని, ఇందులో ఢిల్లీ-ఎన్సీఆర్ వాటా సింహభాగం ఉందని సీబీఆర్ఈ తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో డీఎల్ఎఫ్ రికార్డు స్థాయిలో రూ.21,223 కోట్ల ప్రీ సేల్స్ సాధించింది. భవిష్యత్తులో గురుగ్రామ్, ముంబై, గోవాలలో లాంచ్ చేసే ప్రాజెక్టులకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని కంపెనీ ఆశిస్తోంది. -
జియో బ్లాక్రాక్ కొత్త ప్లాట్ఫామ్ ‘అలాదీన్’
జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ‘అలాదీన్’ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది. దీంతో బ్లాక్రాక్కు చెందిన పెట్టుబడుల విశ్లేషణ, రిస్క్ నిర్వహణ ప్లాట్ఫామ్ మొదటిసారి భారత ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది.‘‘పెట్టుబడులు ఇక ఎంతో సులభం. జియో ఫైనాన్షియల్, బ్లాక్రాక్ సంయుక్తంగా ఇదే నమ్మకాన్ని ఇన్వెస్టర్ల ముందుకు తీసుకొచ్చాయి. జియో డిజిటల్ ఫస్ట్ విధానానికి, బ్లాక్రాక్ సంస్థకు అంతర్జాతీయంగా పెట్టుబడుల్లో ఉన్న నైపుణ్యం కలగలసి ఇన్వెస్టర్లకు అనుకూలమైన సొల్యూషన్లను అందించనున్నాం’’అని జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్ ప్లాట్ఫామ్పై ట్వీట్ చేసింది.ఇది ఆరంభం మాత్రమేనంటూ.. అందరికీ అందుబాటు ధరలకే పెట్టుబడుల సేవలను అందించనున్నట్టు పేర్కొంది. జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్), యూఎస్ ఆధారిత బ్లాక్ రాక్ మధ్య 50:50 జాయింట్ వెంచర్. -
జాబ్లో చేరకుండానే రూ.25 లక్షలు..
ఆఫర్ లెటర్ అనేది ఉద్యోగ ఎంపికలో కీలక దశ. స్క్రీనింగ్ టెస్టులు, ఇంటర్వ్యూలు.. ఇలా ఎంపిక ప్రక్రియ అంతా పూర్తయి ఆఫర్ లెటర్ చేతికొచ్చేసిందంటే ఇక ఉద్యోగం ఖరారైపోయిందని అభ్యర్థులు ఆనందంగా భావిస్తారు. కానీ ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతమూ ఇవ్వకుండా వేధిస్తున్న కంపెనీని కోర్టుకు లాగి సరిగ్గా బుద్ధి చెప్పాడో అభ్యర్థి..ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోని అబుదాబిలోని ఓ కంపెనీపై స్థానిక కోర్టు తగిన చర్యలు తీసుకుంది. ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సదరు బాధిత ఉద్యోగికి 'బకాయి వేతనం'గా 1,10,400 దిర్హమ్లు అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.25 లక్షలు చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. 2024 నవంబర్ 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు తన వేతనాన్ని యజమానులు నిలిపివేశారని ఆరోపిస్తూ సదరు ఉద్యోగి కంపెనీపై దావా వేశారు.👉 సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!ఆఫర్ లెటర్ ప్రకారం.. ఉద్యోగితో ఆ కంపెనీ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 7,200 దిర్హమ్ల బేసిక్ వేతనం, నెలకు 24,000 దిర్హమ్ల ప్యాకేజీ ఇస్తామని ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ నిబంధనల్లో పేర్కొంది. కానీ అతని జాయినింగ్ తేదీని కంపెనీ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతం కూడా ఇవ్వకపోవడంతో సదరు ఉద్యోగి కంపెనీని కోర్టుకు లాగాడు.కోర్టు ఏం చెప్పిందంటే..వేతన నివేదిక, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సమర్పించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ల ఆధారంగా ఉద్యోగి విధుల్లో చేరిక జాప్యానికి కంపెనీ యాజమాన్యమే కారణమని స్పష్టమైందని కోర్టు పేర్కొంది. కార్మిక చట్టాల ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని స్పష్టం చేసింది. బాధిత ఉద్యోగికి రూ.1,10,400 (సుమారు రూ.25 లక్షల వరకు) వేతనం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.మరోవైపు, సదరు ఉద్యోగి సెలవుపై వెళ్లాడని, విధులకు హాజరు కాకపోవడం వల్ల అతను పూర్తి వేతనానికి అర్హుడు కాదని కంపెనీ వాదించింది. అయితే ఉద్యోగి విధులకు గైర్హాజరయ్యాడన్నదానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని విధుల్లో చేరిక జాప్యం పూర్తిగా కంపెనీ తప్పిదమేనని కోర్టు తేల్చిచెప్పింది. కాగా తాను ఎనిమిది రోజులు మాత్రమే సెలవు తీసుకున్నట్లు ఉద్యోగి చెప్పడంతో ఈ మేరకు అతని జీతంలో మినహాయించారు. -
ఇల్లు కొంటున్నారా?
-
ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది!
ఆదాయం అస్సలు సరిపోవడం లేదు.. నెలాకరు రాకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయి.. చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు.. సగటు మధ్యతరగతి జీవి తరచూ చెప్పుకొనే మాటలివి. నిజమే.. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కొన్ని వ్యయాలు మన అదుపులో ఉండవు. కానీ నిశ్శబ్దంగా, తెలియకుండానే జేబులు ఖాళీ చేసే ఖర్చులు కొన్ని ఉన్నాయి. సబ్స్క్రిప్షన్లు, చిన్న రోజువారీ కొనుగోళ్లు లేదా రుసుములు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా పెరుగుతాయి. ఈ ఖర్చులను తెలుసుకోవడం, తగ్గించడం వల్ల మీరు తీవ్రమైన జీవనశైలిలో మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా మీ పొదుపును చాలా వరకు పెంచుకోవచ్చు.సబ్స్క్రిప్షన్ ఆడిట్అనవసరమైన సబ్స్క్రిప్షన్ లను గుర్తించండి. చాలా మంది తాము అరుదుగా ఉపయోగించే సేవలకు సబ్ స్క్రైబ్ చేసుకుంటుంటారు. అన్ని యాక్టివ్ సబ్ స్క్రిప్షన్ లను జాబితా రాసుకుని వాటి అవసరాన్ని అంచనా వేయడం ద్వారా సబ్ స్క్రిప్షన్ ఆడిట్ నిర్వహించండి. పనికిరాని లేదా అరుదుగా ఉపయోగించే వాటిని రద్దు చేయండి. ఈ చిన్న నని మీకు ప్రతి నెలా చాలా డబ్బును ఆదా చేస్తుంది. దీన్ని మరింత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు.రోజువారీ ఖర్చులపై పర్యవేక్షణరోజువారీ చేసే చిన్న చిన్న కొనుగోళ్లను పర్యవేక్షించండి. రోజువారీ చిరు ఖర్చులు అంటే కాఫీ, స్నాక్స్ వంటి కోసం చేసేవి. ఇవి తక్కువే కదా అనిపించవచ్చు. కానీ నెలాఖరున లెక్కిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుస్తుంది. ఈ ఖర్చులను ఒక వారం పాటు తనిఖీ చేయండి. అవి మీ బడ్జెట్ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడండి. అలా అని సరదా విషయంలో రాజీపడాల్సిన పని లేదు. ఈ ఖర్చులను తగ్గించడానికి ఇంట్లో కాఫీ, స్నాక్స్ చేసుకుని ఆస్వాదించవచ్చు.అనవసర షాపింగ్ వద్దుషాపింగ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ కొంత మంది తరచూ షాపింగ్కు ప్రేరేపితం అవుతుంటారు. ఈ ప్రేరేపిత కొనుగోలు అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయిస్తుంది. బయటకు వెళ్ళే ముందు షాపింగ్ జాబితాలను తయారు చేయడం లేదా అత్యవసరం కాని వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్ సెట్ చేయడం వంటి వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా, మీరు ఆకస్మిక నిర్ణయాలను నియంత్రించగలుగుతారు. బదులుగా మీ ఆర్థిక ప్రాధాన్యతలకు సరిపోయే ఆలోచనాత్మక కొనుగోళ్లు చేయగలరు.ఛార్జీలపై అవగాహనబ్యాంకు ఫీజులు, ఛార్జీలను సమీక్షించుకోవడం అవసరం. ఇవే నిశ్శబ్దంగా వచ్చే ఖర్చులు. వీటిని అవగాహన, అప్రమత్తతో తగ్గించుకోవచ్చు. మెయింటెనెన్స్ ఛార్జీలు లేదా ఏటీఎం ఫీజులు వంటి ఏదైనా పునరావృత రుసుము కోసం బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా సమీక్షించండి. తక్కువ ఖర్చులు లేదా ఎటువంటి రుసుము లేని ఖాతాల కోసం ఎంపికలను అన్వేషించండి. బ్యాంకులు లేదా ఖాతా రకాలను మార్చడం కాలక్రమేణా గణనీయమైన పొదుపునకు దారితీస్తుంది.వినియోగ సామర్థ్యంయుటిలిటీ బిల్లులు మన అసమర్థ వినియోగ అలవాట్ల కారణంగా నిశ్శబ్ద ఖర్చుల ఉచ్చులో పడే మరొక ప్రాంతం. గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లను ఆపివేయడం. విద్యుత్తును తక్కువ వినియోగించే ఉపకరణాలను ఉపయోగించడం లేదా థర్మోస్టాట్ సెట్టింగులను సర్దుబాటు చేయడం వంటి సాధారణ చర్యలు ఇంట్లో సౌకర్య స్థాయిలతో రాజీపడకుండానే కాలక్రమేణా యుటిలిటీ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ఒక్క నెల ఇవన్నీ ప్రయత్నించి చూడండి. మీ ఖర్చుల్లో ఎంత మార్పు వస్తుందో మీరే తెలుసుకుంటారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. వారిని నియమించుకునేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు భారీ జీతాలు, ఆకట్టుకునే సౌకర్యాలతో వెంటపడేవి. ఇప్పుడా జమానా ముగిసింది. టెక్ పరిశ్రమలో జీతాల పెరుగుదల, పెద్దమొత్తం నియామక ప్రక్రియలు తగ్గుతున్నాయి. 2025లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు అనేక మార్పులను ఎదుర్కొంటున్నాయి. ఇవి ఆటోమేషన్, కొత్త వేతన ధోరణులు, కార్యాలయంలో మారుతున్న దృక్పథాలను ప్రతిబింబిస్తున్నాయి. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మార్పులుసాఫ్ట్వేర్ ఇంజినీర్ల ముఖ్యమైన పని అయిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే కోడ్ రాయడాన్ని కృత్రిమ మేధస్సు (AI) పూర్తిగా మార్చుతోంది. గిట్హబ్ కోపైలట్, కర్సర్చాట్ వంటి టూల్స్ ద్వారా ఎటువంటి అధునాతన కోడింగ్ నైపుణ్యాలు లేకుండానే ప్రోగ్రామింగ్ చేయడం సాధ్యమవుతోంది. అంటే సాధారణ టెక్ట్స్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఎలాంటి కోడ్ అయినా చిటికెలో వచ్చేస్తోంది. దీన్నే "వైబ్ కోడింగ్" అని పిలుస్తున్నారు.పెరుగుతున్న సైలెంట్ లేఆఫ్స్ సిలికాన్ వ్యాలీకి చెందిన టాప్ సంస్థల దగ్గర నుంచి భారతీయ ఐటీ కంపెనీల వరకూ అన్నీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. కంపెనీలు గతంలో లాగా ఒకేసారి పెద్ద సంఖ్యలో జాబ్లకు కోతలు పెట్టడం లేదు. బదులుగా ‘సైలెంట్ లేఆఫ్స్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ఉద్యోగులకు అనువైన వాతావరణాన్ని కల్పించి వారితో స్వచ్ఛందంగా రాజీనామా చేయించడం ద్వారా వదిలించుకుంటున్నాయి. ఆ స్థాయిలో జీతాల పెరుగుదల లేదుటెక్ రంగంలో వేతనాలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగా తక్కువ కాలంలోనే వేగంగా వేతనాలు పెరిగినట్లు ఇప్పుడు పెరగడం లేదు. ఒక ఉద్యోగాన్ని విడిచి మరొక ఉద్యోగం పొందడం ద్వారా ఎక్కువ జీతం పొందే అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి హై-డిమాండ్ నైపుణ్యాలు ఉన్నవారు ఇంకా గణనీయమైన వేతనాలను పొందుతున్నారు. వ్యూహాత్మక దృక్పథం అవసరం కొత్త ఉద్యోగానికి మారడం అనుకున్నంత మంచిది కాకపోవచ్చు. ఇప్పుడు ఉద్యోగం మారడానికి ముందుగా స్థిరత, ప్రయోజనాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2025లో ఆటోమేషన్, వేతన ధోరణులు, ఉద్యోగ మార్పులను అర్థం చేసుకున్న వారు మాత్రమే ఏఐ నైపుణ్యం, డిజిటల్ అనుసంధానం, ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకుంటూ విజయవంతం అవ్వగలరు.👉 ఇది చదివారా? ఈ టెక్ దిగ్గజంలో తొలగింపులు -
బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్.. పదే పదే కుదరదు
యూపీఐ లావాదేవీల విషయంలో కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. యూపీఐ చెల్లింపులకు ప్రతిస్పందన సమయాన్ని 10 సెకన్లకు తగ్గిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం (జూన్ 16) నుండి యూపీఐ ద్వారా లావాదేవీలు మరింత వేగవంతం కానున్నాయి.యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అనేది మొబైల్ ఫోన్ల ద్వారా అంతర్-బ్యాంకు లావాదేవీలను సులభతరం చేయడానికి ఎన్పీసీఐ అభివృద్ధి చేసిన రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థ. ఎన్పీసీఐ ఇటీవలి సర్క్యులర్ ప్రకారం నగదు బదిలీ, స్టేటస్ చెక్స్, రివర్సల్స్తో సహా లావాదేవీలు ఇక 10 నుంచి 15 సెకన్లలో పూర్తవుతాయి. ఇంతకు ముందు దీనికి 30 సెకన్ల వరకూ సమయం పట్టేది. బ్యాలెన్స్ చెకింగ్పై పరిమితిఎన్పీసీఐ మరో సర్క్యులర్ ప్రకారం, వినియోగదారులు తమ యూపీఐ యాప్ల ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోగలరు. ఇంతకు ముందు దీనిపై ఎలాంటి పరిమితి ఉండేది కాదు. రోజులో ఎన్ని సార్లైనా ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉండేది. సిస్టమ్ సామర్థ్యం, లోడ్ను సులభతరం చేయడానికి ఎన్పీసీఐ బ్యాలెన్స్ చెక్పై పరిమితి విధించినట్లు తెలుస్తోంది.మే నెలలో యూపీఐ ద్వారా లావాదేవీల సంఖ్య 33 శాతం పెరిగి 1,868 కోట్లకు చేరుకోగా, వాటి విలువ 23 శాతం పెరిగి రూ.25.14 లక్షల కోట్లకు చేరింది. సరైన లబ్ధిదారునికి డబ్బు పంపుతున్నట్లు వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ప్రమాదాన్ని నివారించడానికి యూపీఐ యాప్లు లావాదేవీల కోసం అంతిమ లబ్ధిదారుని పేరును మాత్రమే ప్రదర్శించాలని ఎన్పీసీఐ ఇదివరకే ఆదేశించింది. -
జియోకి ఏమైంది? గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో నెట్వర్క్ సేవల్లో అంతరాయాలు తలెత్తాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ, మొబైల్ సిగ్నల్, జియో ఫైబర్ సేవలకు సంబంధించిన సమస్యల గురించి వేలాది మంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దేశంలోని కేరళ ప్రాంతంలో జియో నెట్వర్క్ ద్వారా కాల్స్, ఇంటర్నెట్ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైనట్లు అనేక మంది సోషల్ మీడియా వేదికగా నివేదిస్తున్నారు.ఇప్పటివరకు 12,000కు పైగా రిపోర్టులు నమోదయ్యాయని అంతరాయాల ట్రాకింగ్ ప్లాట్ఫామ్ డౌన్డిటెక్టర్ తెలిపింది. ఇందులో ఎక్కువ ఫిర్యాదులు మొబైల్ డేటా వైఫల్యాలకు సంబంధించినవే. 32 శాతం మంది యూజర్లు కాల్ సంబంధిత సమస్యలను నివేదించగా, 12 శాతం మంది వినియోగదారులు జియో ఫైబర్ సేవల్లో అంతరాయం కలిగినట్లు ఫిర్యాదు చేశారు.మధ్యాహ్నం 1:45 గంటలకు ఈ సమస్య ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ సమయానికి దాదాపు 400 మంది వినియోగదారులు జియో సేవలను యాక్సెస్ చేసేటప్పుడు సమస్యలను నివేదించారు. తర్వాత మధ్యాహ్నం 2:15 గంటలకు కేరళ ప్రాంతం నుంచి గణనీయమైన సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేరళ ప్రాంతంలో మాత్రమే కొంత సమయం నెట్ వర్క్లో సమస్యలు వచ్చాయని, దేశంలోని మిగిలిన ప్రాంతాలలో ఎటువంటి సమస్యా లేదని జియో వర్గాలు వెల్లడించాయి. -
తత్కాల్ కొత్త రూల్ తెలుసు కదా.. ఆధార్ లింక్ చేశారా మరి!?
తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జూలై 1 నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) యాప్, వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది.ఆన్లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఏఐ బోట్లు, ఏజెంట్ల బెడదను నివారించేందుకు తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తత్కాల్ అనేది ఇండియన్ రైల్వే ఫాస్ట్ ట్రాక్ టికెట్ బుకింగ్ వ్యవస్థ. దీని ద్వారా అప్పటికప్పుడు ప్రయాణానికి ఒక రోజు ముందు తక్కువ సమయంలో రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.👉ఇది చదవలేదా? వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయంఇండియన్ రైల్వే అమలు చేస్తున్న కొత్త రూల్ ప్రకారం.. ఆన్లైన్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్సీటీసీ అకౌంట్కు యూజర్ ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం కావాల్సినవి యాక్టివ్ ఐఆర్సీటీసీ అకౌంట్, ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, ఓటీపీ వెరిఫికేషన్ కోసం మొబైల్ ఫోన్.ఆధార్ లింక్ చేసుకోండిలా..ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ( www.irctc.co.in )లోకి లాగిన్ అవ్వాలి.'మై అకౌంట్'పై క్లిక్ చేసి 'అథెంటికేట్ యూజర్' ఎంచుకోండి.మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.'వెరిఫై డీటెయిల్స్ అండ్ రిసీవ్ ఓటీపీ'పై క్లిక్ చేయాలి.మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.సమ్మతి బాక్సును టిక్ చేసి 'సబ్మిట్' నొక్కండి.మీ ఆధార్ విజయవంతంగా లింక్ అయిన తర్వాత ధ్రువీకరణ కన్పిస్తుంది. -
హైదరాబాద్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ లోడింగ్
నివాస విభాగాన్ని కరోనా కంటే ముందు, ఆ తర్వాత అని విభజించే పరిస్థితులు వచ్చాయి. కోవిడ్ కంటే ముందు వరకూ అపార్ట్మెంట్ విస్తీర్ణంలో కార్పెట్ ఏరియాకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అంటే ఫ్లాట్ ఏరియాలో వాస్తవంగా గృహ యజమాని వినియోగించే స్థలం ఎంత ఉందని చూసుకునేవారు. కానీ, కోవిడ్ తర్వాత నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. ఫ్లాట్లో నివాసితుడు వినియోగించే స్థలం కంటే క్లబ్హౌస్, పార్క్, గార్డెన్, లాబీ వంటి వసతులకు ఎంత స్థలం కేటాయిస్తున్నారనే దానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ లైఫ్ స్టయిల్ను కోరుకునే యువ జనరేషన్ పెరుగుతుండటంతో అపార్ట్మెంట్లో కార్పెట్ ఏరియా క్రమంగా తగ్గుతోందని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఅపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫ్లాట్ల స్థలంతో పాటు లిఫ్ట్, మెట్లు, క్లబ్హౌస్, పార్క్ ఇతరత్రా వసతుల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా కలిపితే దాన్ని సూపర్ బిల్టప్ ఏరియాగా పేర్కొంటారు. ఇక, ఫ్లాట్లో వాస్తవంగా గృహ యజమాని వినియోగించే స్థలం(గోడ నుంచి గోడ వరకూ ఉండే స్పేస్)ను కార్పెట్ ఏరియాగా పేర్కొంటారు. కరోనా మహమ్మారి కంటే ముందు వరకూ గృహ కొనుగోలుదారులు కార్పెట్ ఏరియాకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా.. కోవిడ్ తర్వాత నుంచి కార్పెట్ కంటే అపార్ట్మెంట్లోని వసతులకు(లోడింగ్) ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1) నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్ లోడింగ్ 40 శాతానికి చేరుకుంది. 2019లో ఇది 31 శాతంగా ఉంది. నివాస సముదాయాలలో అధునిక వసతులు, సౌకర్యాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్ల లోడింగ్(వసతులు)పెరుగుతోంది. విలాసవంతమైన జీవనశైలి కారణంగా గృహ కొనుగోలుదారులు అధిక వసతులు, సౌకర్యాలను కోరుతున్నారు.వసతులకు ప్రాధాన్యం దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్లలోని మొత్తం స్థలంలో 60 శాతం నివాసయోగ్యమైన స్థలం కాగా మిగిలిన 40 శాతం సాధారణ ప్రాంతం. లిఫ్ట్, లాబీ, మెట్లు, క్లబ్ హౌస్, వసతులు, ట్రెరస్ వంటి కామన్ ఏరియాలు. కరోనా కంటే ముందు వరకూ 30 శాతం కంటే తక్కువ లోడింగ్ సాధారణంగా భావించేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి విలాసవంతమైన జీవనశైలి అలవాటైపోయింది. ప్రాజెక్ట్ చిన్నదైనా, పెద్దదైనా ఆధునిక వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో అపార్ట్మెంట్లలో నివాసయోగ్యమైన స్థలం కార్పెట్ ఏరియా తగ్గుతుంది. గృహ కొనుగోలుదారులు ప్రాథమిక జీవనశైలి సౌకర్యాలతో సంతృప్తి చెందడం లేదు. ఫిట్నెస్ కేంద్రాలు, క్లబ్ హౌస్, పార్క్, గార్డెన్, గ్రాండ్ లాబీలు ఉండాలని కోరుకుంటున్నారు.రీసేల్ విలువ పెరుగుదల.. లోడింగ్ పెరిగితే కమ్యూనిటీ నివాస యోగ్యత, రీసేల్ విలువలను కూడా పెరుగుతుంది. అయితే గృహ కొనుగోలుదారులు తమ అపార్ట్మెంట్లలో వాస్తవంగా ఉపయోగించే స్థలాన్ని కోల్పోతారు. ప్రతి ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్లోని మొత్తం స్థలంలో గృహ కొనుగోలుదారులు వాస్తవంగా ఉపయోగించే స్థలం, సౌకర్యాల కోసం కస్టమర్లు ఎంత చెల్లిస్తున్నారో స్పష్టంగా పేర్కొనేలా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) నిబంధనలు రూపొందించాలి. దీంతో కస్టమర్లు చెల్లించే సొమ్ములో దేనికెంత వ్యయం అవుతుందో స్పష్టత ఉంటుంది.లోడింగ్ శాతాన్ని ఎలా లెక్కిస్తారంటే.. సూపర్ బిల్టప్ ఏరియా నుంచి కార్పెట్ ఏరియాను తీసి వేసి, కార్పెట్ ఏరియాతో భాగించాలి. వచ్చిన ఫలితాన్ని వందతో గుణిస్తే వచ్చేదే లోడింగ్ శాతం. ఉదాహరణకు.. హైదరాబాద్లో మీరు 1,500 చ.అ. అపార్ట్మెంట్ కొంటున్నారని అనుకుందాం. ఇందులో ఫ్లాట్లో కస్టమర్ వినియోగించే స్థలం 750 చ.అ.లే ఉంటుంది. మిగిలిన స్థలం లిఫ్టు, లాబీ, మెట్లు, క్లబ్ హౌస్ వంటి కామన్ ఏరియాలు ఉంటాయి. అంటే ఫ్లాట్ ఖరీదులో కస్టమర్ వాస్తవంగా వినియోగించే కార్పెట్ ఏరియాతో పాటు కామన్ ఏరియా కూడా కలిపే ఉంటుందన్నమాట. నగరంలో లోడింగ్ 38 శాతం..హైదరాబాద్లో లోడింగ్(వసతులు) శాతం 2019లో 30 శాతంగా ఉండగా.. 2022 నాటికి 33కు, ఈ ఏడాది క్యూ1 నాటికి ఏకంగా 38 శాతానికి పెరిగింది. 2025 క్యూ1 నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో అత్యధికంగా 43 శాతం లోడింగ్తో ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. 2019లోనూ ఈ ఆర్థిక నగరంలో అత్యధిక లోడింగ్ 33 శాతంతో టాప్లో నిలిచింది. అత్యల్పంగా 36 శాతం లోడింగ్తో చెన్నై చివరి స్థానంలో నిలిచింది. 2019లో ఇక్కడ లోడింగ్ 30 శాతంగా ఉంది. ఏటేటా బెంగళూరులో అపార్ట్మెంట్ లోడింగ్ క్రమంగా పెరుగుతోంది. 2019లో ఇక్కడ 30 శాతం లోడింగ్ ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 41 శాతానికి పెరిగింది. 2022లో ఇది 35 శాతంగా ఉంది. గత ఏడేళ్లలో బెంగళూరులో సగటు లోడింగ్ అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేస్తూ ఉంది. ఎన్సీఆర్ లో 2019లో లోడింగ్ శాతం 31 శాతం నుంచి 2025 క్యూ1 నాటికి 41 శాతానికి చేరింది. పుణేలో 32 శాతం నుంచి 40కు, కోల్కతాలో 30 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది. -
టెక్ దిగ్గజంలో తొలగింపులు
కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ ఫ్యాక్టరీల్లో పని చేసే ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రణాళిక వేసింది. వచ్చే జూలై మధ్యలో తొలగింపుల ప్రక్రియ ప్రారంభమై నెలాకరు కల్లా పూర్తికానుంది. కొత్త సీఈవో లిప్ బు టాన్ వచ్చాక ఇది తొలి, భారీ ఉద్యోగాల కోత కానుంది.ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ఇంటెల్ నేరుగా ప్రకటించనప్పటికీ ఈమేరకు కంపెనీ ఉద్యోగులకు ఇంటర్నల్ మెమోల ద్వారా తెలియజేసినట్లు పలు అంతర్జాతీయ వార్త పత్రికల్లో కథనాలు వచ్చాయి. కంపెనీ తన అంతర్గత తయారీ విభాగమైన ఇంటెల్ ఫౌండ్రీలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకుని, మరింత చురుకైన సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగానే ఉద్యోగ కోతలు చేపడుతోందని పేర్కొన్నాయి.కంపెనీ చేపడుతున్న ప్రస్తుత తొలగింపుల్లో ఎంత మందిపై ప్రభావం పడుతుందనే విషయం వెల్లడికాలేదు. సీనియర్ నాయకత్వం నిర్దేశించిన ఆర్థిక లక్ష్యాలను చేరుకునే వరకు, తొలగింపులను అమలు చేయడంలో వ్యాపార యూనిట్లకు విచక్షణ ఉంటుందని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమ్మకాలు క్షీణించడం, మరోవైపు ఎన్విడియా, ఏఎండీ వంటి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ముఖ్యంగా ఏఐ ఫోకస్డ్ హార్డ్ వేర్ లో ఉద్యోగ పునర్నిర్మాణంపై ఇంటెల్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. -
ఇలా చేస్తే.. ఇంటి పైకప్పు అదుర్స్!
సాక్షి, సిటీబ్యూరో: ఫాల్స్ సీలింగ్తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. దీంతో పాటు సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసే ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది.మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి.తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడక గది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది.గోడల రంగుకు, సీలింగ్కు ఒకే రకమైంది కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని వేసుకోవచ్చు. దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కని్పంచే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు.జాగ్రత్తలివే..ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి.ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 10–12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి.ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.ఉడెన్ ఫాల్స్ సీలింగ్లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
పాన్ కార్డు అలాగే వాడుతున్నారా? కట్టండి రూ.10వేలు!!
పాన్ కార్డు, ఆధార్ లేకుండా నేటి కాలంలో ఆర్థికపరమైన ఏ పనినీ పూర్తి చేయడం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాన్, ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికీ చాలా మంది తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోలేదు. అలాంటి వారి పాన్ కార్డులు ఇనాక్టియావ్గా మారాయి. అయినప్పటికీ కొందరు ఆర్థిక లావాదేవీల్లో ఇనాక్టివ్ పాన్ కార్డులను అలాగే ఉపయోగిస్తున్నారు.ఇలాంటి వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ కింద ఒక్కో లావాదేవీపై రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎవరైనా ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యంగా అధిక విలువ కలిగిన లావాదేవీలలో ఇనాక్టివ్ పాన్ ఉపయోగిస్తే ప్రతి సందర్భంలో ప్రత్యేక జరిమానా విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. బ్యాంకు ఖాతా తెరవడం లేదా నిర్వహించడం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేయడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వంటి లావాదేవీలు ఇందులో ఉన్నాయి.👉 ఆధార్ అప్డేట్కు కొత్త డెడ్లైన్రెండు పాన్ కార్డులున్నా తప్పే..ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఇలాంటి వారు రెండింటిలో ఒక పాన్ కార్డును సరెండర్ చేయాలి. అలా చేయకుండా పట్టుబడితే ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొంతమందికి రెండు పాన్ కార్డులు ఉండవచ్చు. ఉదాహరణకు పాన్ కార్డు వివరాల్లో తప్పులున్నప్పుడు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్పు కోసం కొత్త పాన్ కార్డు తీసుకొని ఉండవచ్చు. ఇలా రెండు పాన్ కార్డులు కలిగి ఉంటే ఎలాంటి జరిమానా విధించకుండా వదిలేస్తారు. అదే ఉద్దేశపూర్వకంగా రెండు పాన్కార్డులు పెట్టుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు. కాబట్టి ఎవరి దగ్గరైనా రెండు పాన్ కార్డులు ఉంటే వెంటనే సరెండర్ చేయడం మంచిది. -
ఆఫీస్ స్థలాలకు డిమాండ్.. అమెరికన్ కంపెనీల హవా..
దేశీయంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో అమెరికన్ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్ చ.అ. స్పేస్ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్స్పేస్ లీజింగ్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2022–24 క్యాలెండర్ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్ సంస్థలు ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్ నగరాల్లో ఆఫీస్ డిమాండ్కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి.ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్ఎల్ హెడ్ (ఆఫీస్ లీజింగ్, రిటైల్ సర్వీసెస్), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (కర్ణాటక, కేరళ) రాహుల్ ఆరోరా చెప్పారు. అమెరికన్ సంస్థలు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు. -
విప్రోలో మళ్లీ చేతులు మారిన ప్రమోటర్ల వాటాలు
ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఐటీ దిగ్గజం విప్రో ప్రమోటర్ల వాటాలో 1.72 శాతం చేతులు మారింది. స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సమాచారం ప్రకారం 1.72 శాతం వాటాకు సమానమైన 18.05 కోట్ల ఈక్విటీ షేర్లను అజీమ్ ప్రేమ్జీ ట్రస్ట్ విక్రయించింది. వీటిని షేరుకి రూ. 259 సగటు ధరలో ప్రమోటర్ గ్రూప్నకు చెందిన ప్రజీమ్ ట్రేడర్స్, జాష్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి.డీల్ విలువ రూ. 4,675 కోట్లుకాగా.. సోమవారం(9న) సైతం అజీమ్ ప్రేమ్జీ ట్రస్ట్ 1.93 శాతం వాటాకు సమానమైన 20.23 కోట్ల షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. వీటిని షేరుకి రూ. 250 సగటు ధరలో ప్రేమ్జీ ఇన్వెస్ట్కు చెందిన ప్రజీమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, హర్షమ్ ట్రేడర్స్ అండ్ ప్రజీమ్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి.డీల్ విలువ రూ. 5,057 కోట్లుకాగా.. గతేడాది నవంబర్లో ప్రజీమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా ప్రేమ్జీ ఇన్వెస్ట్ 1.6 శాతం వాటాకు సమానమైన 8.49 కోట్ల విప్రో షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 4,757 కోట్లు వెచ్చించింది. అయితే వీటిని ప్రజీమ్, జాష్ ట్రేడర్స్ వీటిని విక్రయించడం గమనార్హం! -
తక్కువ ధర.. నాణ్యమైన ఇల్లే కావాలి..
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం. అందుబాటు ధర.. నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు.. నగరంలో ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్లను నిర్మించాలని సూచించింది.మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వే చెబుతోంది. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి.ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.40 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడు మంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ సిటీ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టి సారిస్తున్నారు. -
ఎస్బీఐలో హోమ్లోన్లు.. గుడ్న్యూస్
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన రుణ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్ల కోత జూన్ 15 నుంచి అమలులోకి వస్తుందని, ప్రస్తుత రెపో లింక్డ్ రుణాలు, కొత్త రుణగ్రహీతలకు వర్తిస్తుందని ఎస్బీఐ పేర్కొంది.వారం రోజుల క్రితం ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటులో సగం శాతం తగ్గింపునకు అనుగుణంగా ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్), గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఈ తగ్గింపు తర్వాత ఈబీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గింది.రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత బ్యాంక్ ఆఫ్ బరోడా, మూడవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యుకో బ్యాంక్ వంటివి ఇప్పటికే రుణ రేట్లను తగ్గించాయి. ఎందుకంటే రెపో రేటుతో లింక్ అయిన లేదా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రుణాలుగా పిలిచే, ఫ్లోటింగ్ రేట్లలో ఉన్న రుణాలకు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించిన వెంటనే కాకపోయినా, వచ్చే నెల మొదటి రోజు నాటికి రెపో తగ్గింపును ప్రస్తుత రుణగ్రహీతలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. -
ఐపీవోకి వస్తోన్న సోలార్ కంపెనీ
న్యూఢిల్లీ: సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ రేజాన్ సోలార్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి సిద్ధమవుతోంది. రూ. 1,500 కోట్ల సమీకరణకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ని సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో నిర్వహణ కోసం కంపెనీ ఇప్పటికే పలు దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను నియమించుకుంది.తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కార్యకలాపాల విస్తరణకు కంపెనీ వినియోగించుకోనున్నట్లు సమాచారం. 2017లో ఏర్పాటైన రేజాన్ సోలార్ దేశీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సోలార్ పీవీ మాడ్యుల్స్ తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. సంస్థవెబ్సైట్ ప్రకారం గుజరాత్లోని కారంజ్, సావా ప్లాంట్లలో 6,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని సాధించింది. కంపెనీ ఇటీవల మార్చిలో ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 138 కోట్లు సమీకరించింది. -
ఆధార్ అప్డేట్కు కొత్త డెడ్లైన్
ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాల అప్డేట్కు గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరోసారి పొడిగించింది. ఆధార్లో డాక్యుమెంట్లను ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు గడువు జూన్ 14న ముగియాల్సి ఉండగా యూఐడీఏఐ ఈ సదుపాయాన్ని మరో ఏడాది పాటు అంటే 2026 జూన్ 14 వరకు పొడిగించింది. ఈ మేరకు ‘ఎక్స్’(ట్విటర్) ద్వారా యూఐడీఏఐ వెల్లడించింది.ఆధార్ను ఎవరు అప్డేట్ చేసుకోవాలంటే..ఆధార్ అప్డేట్కు గడువు పొడిగింపుతో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు ఉపశమనం కలగనుంది. ఈ ఉచిత సేవ మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్ చేయించుకుని ఇప్పటి వరకు అప్డేట్ చేసుకోని వారు ఆధార్ అప్డేట్ చేయాలని యూఐడీఏఐ కోరింది. వివాహం, బదిలీ లేదా ఇతర కారణాల వల్ల పేరు, చిరునామా లేదా మరేదైనా సమాచారం మారితే అప్డేట్ చేసుకునేందుకు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఈ ఆన్లైన్ సర్వీసుకు రూ.50 ఫీజు వసూలు చేసేవారు. డిజిటల్ మార్గాల ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ప్రోత్సహించడానికి యూఐడీఏఐ ఈ ఛార్జీని తొలగించింది. అయితే ఫిజికల్ ఆధార్ అప్డేట్ సెంటర్లలో చేసే అప్డేట్కు మాత్రం ఇంకా రుసుం వసూలు చేస్తున్నారు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోండిలా..🔹యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ( https://myaadhaar.uidai.gov.in ) సందర్శించండి.🔹ఆధార్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వండి.🔹సమాచారాన్ని సరిచూసుకుని 'ఐ వెరిఫై...'పై క్లిక్ చేయండి.🔹ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (PoI) ఎంచుకుని 2MB కంటే తక్కువ పరిమాణంలో (JPEG/PNG/PDF) డాక్యుమెంట్ కాపీని అప్లోడ్ చేయండి.🔹డాక్యుమెంట్ ఆఫ్ అడ్రస్ (PoA) సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ కాపీని అప్లోడ్ చేయాలి.🔹అగ్రీ అండ్ సబ్మిట్పై క్లిక్ చేయండి.🔹రసీదును డౌన్ లోడ్ చేసుకోండి. -
ఇల్లు కొనడానికి ఇదే సరైన కాలం..
వర్షంలో బయటకు వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో కారణాలెన్నో! కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షణ్ణంగా తెలుస్తుంది కాబట్టి.. సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. వర్షం నీరు వెళ్లే సౌకర్యం లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతానికి సంబందించి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్ స్టాండ్ లేక రైల్వే స్టేషన్కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.నాణ్యత తెలుస్తుంది.. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలంలోనే.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్లో కొనుగోలు చేసే కొనుగోలుదారుల మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశం అయ్యాక కామన్గా ఏర్పాటు చేసిన వసతుల్లో లీకేజ్లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా కాలంలో ప్రాజెక్ట్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్రూమ్, సీలింగ్, పంబ్లింగ్, డ్రైనేజీ లీకేజ్ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్ను కోరే వీలుంటుంది.👉 ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..రీసేల్ ప్రాపర్టీలనూ.. రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధ్రుడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా? అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్ మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది.వర్షంలో రాయితీలు.. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్–అక్టోబర్ పండగ సీజన్ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు. -
పిజ్జా కంపెనీలో రూ. 1801 కోట్ల షేర్లు అమ్మేసిన ప్రమోటర్లు
జూబిలెంట్ గ్రూప్ కంపెనీల్లో ప్రమోటర్లు గణనీయంగా వాటాలు విక్రయించారు. జూబిలెంట్ ఫుడ్వర్క్స్ (జేఎఫ్ఎల్), జూబిలెంట్ ఇన్గ్రేవియా, జూబిలెంట్ ఫార్మోవాలో రూ. 1,801 కోట్ల విలువ చేసే వాటాలను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేశారు.ఎన్ఎస్ఈలోని బ్లాక్ డీల్స్ డేటా ప్రకారం జూబిలెంట్ ఫుడ్వర్క్స్ ప్రమోటర్ అయిన జూబిలెంట్ కన్జూమర్ 1.06 కోట్ల ఈక్విటీ షేర్లను (1.61 శాతం వాటా) విక్రయించింది. అలాగే, జూబిలెంట్ ఇన్గ్రేవియా ప్రమోటింగ్ సంస్థలు (జూబిలెంట్ ఎన్ప్రో, నికిత రిసోర్సెస్, శ్యామ్ సుందర్ భార్తియా ఫ్యామిలీ ట్రస్ట్) 98.65 లక్షల షేర్లు (6.2 శాతం వాటా) విక్రయించాయి.అలాగే జూబిలెంట్ ఫార్మోవా ప్రమోటర్ సంస్థలు జూబిలెంట్ ఎన్ప్రో, నికిత రిసోర్సెస్ 32.86 లక్షల షేర్లను (2.06 శాతం వాటా) విక్రయించాయి. ఈ షేర్లను సగటున రూ. 662–1,060.37 రేటుకు అమ్మడంతో మొత్తం అన్ని లావాదేవీల విలువ కలిపి రూ. 1,800.98 కోట్లుగా నమోదైంది. -
సన్ ఫార్మాకు కొత్త ఎండీ.. టాప్ మేనేజ్మెంట్లో మార్పులు
ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు, చేర్పులు చేపట్టింది. ఇందులో భాగంగా కీర్తి గనోర్కర్ కంపెనీ ఎండీగా పదోన్నతి పొందారు. దిలీప్ సంఘ్వీ స్థానంలో సెప్టెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సంఘ్వీ కొనసాగుతారు.నార్త్ అమెరికా విభాగం ప్రెసిడెంట్, సీఈవో అభయ్ గాంధీ తప్పుకోనుండటంతో ఆయన స్థానంలో రిచర్డ్ ఆస్క్రాఫ్ట్ చేరతారని కంపెనీ తెలిపింది. ఎంబీఏ, కెమికల్ ఇంజినీర్ అయిన గనోర్కర్ 1996 నుంచి సన్ ఫార్మాలో వివిధ విభాగాల్లో పని చేశారు. 2019 జూన్ నుంచి సన్ ఫార్మా భారత విభాగానికి గనోర్కర్ నేతృత్వం వహిస్తున్నారు.ఆయన సారథ్యంలో వ్యాపారం, మార్కెట్ వాటా నిలకడగా పెరిగిందని సంస్థ వివరించింది. స్పెషాలిటీ విభాగాలు, జపాన్.. యూరప్ మార్కెట్లలోకి కూడా సన్ ఫార్మా విస్తరించడంలో గనోర్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. -
ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..
కొనేటప్పుడు తక్కువ ధరకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ రేటు రావాలనుకునేది ఒక్క స్థిరాస్తిలో మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో బూమ్ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే చాలు ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి అమ్మేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించలేవు. మార్కెట్ సెంటిమెంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గిరాకీ, సరఫరా కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని విక్రయించాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి.వసతులే కీలకం.. ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాల్స్ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆస్పత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే.. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరం ఉండదు కాబట్టి ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకం.సౌకర్యాలే ముఖ్యం కాదు.. ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజారవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు ఇలాంటివే కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే.. భవిష్యత్తులో ఇల్లు విక్రయించే సమయంలో కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి విలువ లెక్కగడతారని గుర్తుంచుకోవాలి.చిక్కులుండొద్దు.. స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నా ఓ విషయంలో మాత్రం చిన్నపాటి తేడా ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేము. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఉండాలన్నమాట. ఇంటికి లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటు మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.👉 ఇది చదవలేదా? రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..నిర్వహణతోనే రెట్టింపు విలువ.. గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది. ఇంటి విలువ కేవలం ఫ్లాట్కో.. ప్లాట్కో పరిమితం కాదు.. సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోంది. ఫుల్లీ ఫర్నీచర్, సెమీ ఫర్నీచర్ ఫ్లాట్లకు ఎక్కువే రేటు వస్తుంది. -
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
తక్కువ బడ్డెట్లో స్మార్ట్ఫోన్లు తయారు చేసే లావా మరోసారి బడ్జెట్ లో శక్తివంతమైన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను లాంచ్ చేసింది. లావా స్టోర్మ్ ప్లే 5జీ (Lava Storm Play 5G) ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.10,000 కంటే తక్కువ ధరకే హై ఎండ్ స్పెసిఫికేషన్లను ప్రవేశపెట్టిన డివైజ్ ఇది. బడ్జెట్ సెగ్మెంట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డైమెన్సిటీ 7060 చిప్సెట్, ఎల్పీపీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 120 హెర్ట్జ్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లావా స్టోర్మ్ ప్లే 5జీ ధరఈ లావా ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధరను కేవలం రూ.9,999గా నిర్ణయించారు. రూ.9,999 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 24 నుంచి అమెజాన్ లో తొలి సేల్ కు అందుబాటులో ఉండనుంది.👉 జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీఫీచర్లు..స్పెసిఫికేషన్లులావా స్టార్మ్ ప్లే 5జీ మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 7060 5జీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది.ఇందులో 6 జీబీ ఫాస్ట్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఇవ్వగా 6 జీబీ వర్చువల్ ర్యామ్తో మరింత విస్తరించుకోవచ్చు. అంటే మొత్తం 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఇక స్టోరేజ్ కోసం 128 జీబి యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.ఇందులో 6.75 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను ఇచ్చారు. కెమెరా సెటప్ విషయానికొస్తే, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.లావా స్టార్మ్ ప్లేలో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్, ఐపీ64 రేటింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి.అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15తో ఎలాంటి బ్లోట్ వేర్ లేకుండా, అంటే అనవసరమైన యాప్స్, పాప్ అప్ యాప్స్ లేకుండా పనిచేస్తుంది.2 సంవత్సరాల పాటు 1 ప్రధాన ఓఎస్ అప్ డేట్, సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. -
నేహా చెప్తే వింటారు! మనీ డీలింగ్.. మాస్ ఫాలోయింగ్
నేహా నాగర్.. దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహిళా పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్స్టాగ్రామ్లో ఈమెకు 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే ‘కాండేరే హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో స్థానం సంపాదించింది. సంపద సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, దాతలు, సాంస్కృతిక రూపకర్తలు, యువ నాయకులు, ప్రొఫెషనల్స్, ఇన్ఫ్లుయెన్సర్ ఫౌండర్లతో సహా అన్ని కేటగిరీల్లోని మహిళలతో ఈ జాబితాను రూపొందించారు.దేశ పర్సనల్ ఫైనాన్స్ ల్యాండ్ స్కేప్లో నాగర్ ఒక మార్గదర్శక స్వరం. వైవిధ్యంతో ఆమె అందించే కంటెంట్, ఆర్థిక పాఠాలు నేహా నాగర్ను ఆన్ లైన్ లో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్లలో ఒకరిగా చేశాయి. ఫైనాన్స్ కంటెంట్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన నాగర్ పన్నులు, బడ్జెట్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి సంక్లిష్ట ఆర్థిక అంశాలను సులభతరం చేయడంలో ప్రసిద్ధి చెందారు.👉 30 ఏళ్ల నాటి షేర్లు.. అప్పుడు లక్ష.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?వివిధ ప్లాట్ఫామ్లలో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె ఆర్థిక పాఠాలను వినోదంతో మిళితం చేసి కంటెంట్ ఫాలోవర్లకు అందిస్తుంది. అందరికీ అర్థమయ్యే బాలీవుడ్, క్రికెట్ వంటి అంశాలతో ఈమె ఫైనాన్స్ కంటెంట్ మిళితమై ఉంటుంది. నైకా, క్రెడ్, ఎయిర్ టెల్ వంటి టాప్ బ్రాండ్లతో కలిసి పనిచేసిన నేహా.. ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవసరమైన పరిజ్ఞానం అందించి జనానికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న ఆకాంక్షలతో మొదలైన నాగర్ ప్రయాణం ఎంబీఏ, వెల్త్ మేనేజ్ మెంట్ కు దారితీసింది. ముఖ్యంగా మహిళలకు సహాయం చేయాలనే తపనతో, వాళ్లు డబ్బును అర్థం చేసుకోవడం, నిర్వహించుకోగలగడంలో తన వంతు సాయం అందించడానికి ఆమె చివరికి డిజిటల్ ఫైనాన్స్ పాఠాల వైపు మొగ్గు చూపారు. పిల్లల్ని కనడానికి ముందు అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆర్థిక అక్షరాస్యతకు ఆమె చేసిన కృషికి ఫోర్బ్స్, సీఎన్బీసీ, ఎన్డీటీవీ, టీఈడీఎక్స్, ఇతర ప్రముఖ వేదికలలో కూడా ఆమె స్థానం పొందారు. -
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే ‘జిమ్నీ’.. లక్ష మంది కొనేశారు..
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే మారుతి సుజుకి జిమ్నీ విక్రయాల్లోనూ దూసుకెళ్లింది. సరికొత్త మైలురాయిని దాటింది. మారుతి సుజుకి జిమ్నీ మొదటిసారిగా 2023 జూన్లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుండి ఈ ఆఫ్-రోడ్ ఎస్యూవీ 5-డోర్ల వెర్షన్ లక్ష యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. ఆటోకార్ ప్రొఫెషనల్స్ నివేదిక ప్రకారం.. రెండు సంవత్సరాలలో ఈ వాహనం మొత్తం 1,02,024 యూనిట్ల అమ్మకాలను సాధించింది.మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మొత్తం విక్రయాల్లో దేశీయ మార్కెట్లో విక్రయించిన 26,180 యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి), 75,844 ఎగుమతి యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి) ఉన్నాయి. అయితే మారుతి సుజుకి జిమ్నీ అమ్మకాల సంఖ్య పరంగా దాని ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన మహీంద్రా థార్ శ్రేణి కంటే చాలా వెనుకబడి ఉంది. 2020 అక్టోబర్లో లాంచ్ అయినప్పటి నుండి 2025 ఏప్రిల్ చివరి వరకు మూడు డోర్ల థార్, థార్ రాక్స్ తో, ఎస్యూవీ శ్రేణి మొత్తం 2,59,921 యూనిట్లతో 2.5 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది.మారుతి సుజుకి జిమ్నీ మూడు డోర్ల వర్షన్ ప్రపంచ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. ఈ పాపులారిటీని పునరావృతం చేయడానికి కంపెనీ ఐదు డోర్ల వెర్షన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆఫ్-రోడర్ కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వాహనం 4×4 సిస్టమ్తో బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్తో వచ్చింది. ఈ ఎస్యూవీ భారత మార్కెట్లో రూ .12.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్మడవుతోంది. దీనిని గురుగ్రామ్ ప్లాంట్లో తయారు చేసి జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.మారుతి సుజుకి జిమ్నీలో సింగిల్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 105 బీహెచ్పీ పవర్ని, 134 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో జతచేయబడి ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 16.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 16.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. -
ఇన్ఫోసిస్లో రూ.కోట్లు సంపాదిస్తున్నారు.. ఇదిగో కొత్త డేటా
ఐటీ పరిశ్రమలో ఉద్యోగులకు రూ.లక్షల్లో వేతనాలు ఉంటాయన్నది తెలిసిందే. అయితే కొంత మంది ఉన్నతోద్యోగులు రూ.కోట్లలో సైతం పరిహారాలు అందుకుంటారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో రూ.కోట్లు సంపాదిస్తున్నవారి సంఖ్య ఈసారి పెరిగింది. అంతక్రితం ఏడాది క్షీణత తరువాత, వార్షికంగా రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరిగి 112కు చేరుకుంది.స్టాక్ ఇన్సెంటివ్స్ పర్క్విసైట్ విలువలో మార్పులు, అధిక వేరియబుల్ పే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. అదీకాకుండా 33 మంది అధిక సంపాదన కలిగిన ఉద్యోగులు ఇన్ఫోసిస్లో ఏడాది మధ్యలో చేరారు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. వీరు ఒక్కొక్కరు సగటున నెలకు రూ .8.5 లక్షలకు పైగా జీతం పొందుతున్నారు. కంపెనీలో రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే వారి సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది పూర్తీగా రివర్స్ అయింది. అప్పుడు వీరి సంఖ్య అంతకు ముందు ఏడాది కంటే 17 శాతం తగ్గింది.చారిత్రాత్మకంగా 2023 ఆర్థిక సంవత్సరం అత్యధికంగా 124 మంది ఉద్యోగులను నమోదు చేయగా, 2020 ఆర్థిక సంవత్సరం గత ఆరేళ్లలో అత్యల్పంగా 74 మందిని నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, టాప్ 10 ఎగ్జిక్యూటివ్ లను మినహాయించారని కంపెనీ స్పష్టం చేసింది. ఈ 112 మంది ఉద్యోగుల మొత్తం వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.203 కోట్లుగా ఉంది. సీఎఫ్వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.8.8 కోట్ల పరిహారంతో అగ్రస్థానంలో నిలవగా, చీఫ్ డెలివరీ ఆఫీసర్లు దినేష్ ఆర్ రూ.7.2 కోట్లు, సతీష్ హెచ్సీ రూ.6.9 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.👉 ఇదీ చదవండి: అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అధిక సంపాదనలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది 2000 సంవత్సరానికి ముందు నుండి ఇన్ఫోసిస్లో ఉన్నారు. కొందరు 1990 నాటివారూ ఉన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఇన్ఫోసిస్ మొత్తం వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో 4% పెరిగి రూ .85,950 కోట్లకు చేరుకుంది. ఇది దాని మొత్తం ఆదాయం రూ .1.63 లక్షల కోట్లలో 53 శాతం. 2025 మార్చి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.24 లక్షలుగా ఉంది. -
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
రిలయన్స్ జియో భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ. దేశంలోని మొబైల్ యూజర్లలో ఎక్కువ మంది జియోను వినియోగిస్తున్నారు. మీరు కూడా జియో యూజర్ అయి ఉండి, లాంగ్ బవ్యాలిడిటీతో తక్కువ ఖర్చులో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ సమాచారం మీ కోసమే. 84 రోజులు అంటే దాదాపు మూడు నెలలు వ్యాలిడిటీతో మంచి ప్రయోజనాలను అందించే మూడు రీఛార్జ్ ప్లాన్లను జియో ఇటీవల ప్రవేశపెట్టింది.జియో రూ.799 ప్లాన్జియో రూ .799 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితో పాటు, జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్తో పొందవచ్చు.జియో రూ.859 ప్లాన్ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ ఉన్నన్నిరోజులూ అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం ఆస్వాదించవచ్చు. దీంతోపాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అంతే కాకుండా జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్తో ఆనందించవచ్చు.👉 ఇదీ చదవండి: రూ.200 లోపే రీచార్జ్.. 2 నెలలుపైగా వ్యాలిడిటీజియో రూ.889 ప్లాన్జియో రూ .889 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్లో చేర్చారు. అలాగే జియో సావన్కు కూడా ఉచిత యాక్సెస్ను కూడా వినియోగదారులు పొందుతారు. -
అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!
ఆర్టిఫీషియల్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇది లేదనకుండా ఏఐ అన్ని పనులూ చేసేస్తోంది. నోయిడాకు చెందిన అనుభవజ్ఞురాలైన ప్రొడక్ట్ మేనేజర్ రాధికా శర్మకు ఇటీవల ఒక ప్రత్యేకమైన ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ఎదురైంది. అక్కడ ఆమెను హ్యూమన్ ప్యానెల్కు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ ఇంటర్వ్యూయర్ అంచనా వేశారు.టెక్ లో దాదాపు దశాబ్ద అనుభవం ఉన్న శర్మ బిజినెస్ ఇన్ సైడర్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు. వర్చువల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఆమె నైపుణ్యాలను అంచనా వేయడమే కాకుండా ఆమె వస్త్రధారణపైనా ఫీడ్ బ్యాక్ అందించిందని వెల్లడించారు. ఈ అనుభవాన్ని "అద్భుతమైన అదేసమయంలో కలవరపరిచేది"గా ఆమె అభివర్ణించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియ నుండి లాభనష్టాలు, ఇతర కీలక అంశాలను చర్చించారు.చిన్నదైన కుమార్తె సంరక్షణ కోసం రాధికా శర్మ తన ప్రొడక్ట్ ఓనర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ పొజిషన్ ను వెతుక్కుంటూ మళ్లీ జాబ్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఒక సాస్ కంపెనీ ఆమెను ఏఐ(AI) ఆధారిత స్క్రీనింగ్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోవాలని, కంప్యూటర్లోని ట్యాబ్ లను మార్చవద్దని, పర్యవేక్షణ కోసం స్క్రీన్ షేరింగ్ చేయాలని అవతల నుంచి సూచనలు వచ్చాయి.‘ఇంటర్వ్యూ ప్రారంభమైన వెంటనే, సుమారు 20 నిమిషాల టైమర్ ప్రారంభమైంది. అటు పక్క నుంచి మహిళా వాయిస్ తో కూడిన ఖాళీ స్క్రీన్ నన్ను పలకరించింది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా నిర్దిష్టమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది" అని రాధికా శర్మ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుందని కంపెనీ ముందుగానే స్పష్టంగా పేర్కొంది. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే శర్మ ఏఐ టూల్ నుంచి సవివరమైన పనితీరు మదింపును అందుకున్నారు.తాను నిమగ్నమయ్యే విధానం, ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, భంగిమలు, వస్త్రధారణ వంటి అన్ని కొలమానాలతో పాటు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ అంచనా వేసింది. ఆమె సాంకేతిక నైపుణ్యాలు బాగా సాధించినప్పటికీ, ఆమె దుస్తులు ప్రొఫెషనల్గా ధరించలేదని, ఐ కాంటాక్ట్ సక్రమంగా లేదని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని, అమ్మో ఏఐ అన్నింటినీ క్షణ్ణంగా గమనిస్తుందని రాధికా శర్మ చెప్పుకొచ్చారు. -
పాలసీ బజార్లో సీనియర్ సిటెజెన్స్కు ప్రత్యేక సర్వీస్
సీనియర్ సిటిజన్లకు వారి ఆరోగ్య సంరక్షణ, బీమా ప్రయాణంలో ప్రతి దశలో సహకారం అందించేందుకు ఉద్దేశించిన 'సారథి' అనే ప్రత్యేక వృద్ధుల సంరక్షణ సేవలను పాలసీబజార్ ప్రవేశపెట్టింది. పాలసీబజార్ బీమా భాగస్వాముల ద్వారా ఈ సారథి సర్వీస్ లభిస్తుంది. ఇది సీనియర్ సిటిజన్లకు సరైన బీమా ప్రణాళికలను ఎంచుకోవడానికి సహాయపడుతుంది. క్లెయిమ్ సహాయాన్ని అందిస్తుంది. కొనసాగుతున్న, వ్యక్తిగతీకరించిన ఫాలో-అప్లను అందిస్తుంది.ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు నివసిస్తుంటారు. అలాంటి వినియోగదారులు కూడా మరో నగరంలో నివసిస్తున్న వృద్ధులైన తమ తల్లిదండ్రుల కోసం పాలసీ బజార్ ‘సారథి’ ద్వారా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయవచ్చు. ఆన్-గ్రౌండ్ ఎమర్జెన్సీ సపోర్ట్ను వారికి అందించవచ్చు.2050 నాటికి భారత్ లో వృద్ధుల సంఖ్య 31.9 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పెరుగుతున్న విభాగానికి ప్రతిస్పందనగా, సారథి ఈ కింది సేవలు అందిస్తుంది.పాలసీలను సరళంగా వివరించడానికి శిక్షణ పొందిన సలహాదారులువృద్ధుల సంరక్షణలో శిక్షణ పొందిన ఎగ్జిక్యూటివ్ లతో సీనియర్ల కోసం హెల్ప్ లైన్ఆసుపత్రులతో సమన్వయం, అంబులెన్స్ మద్దతుతో సహా సహాయాన్ని క్లెయిమ్ చేస్తుంది.హోమ్ హెల్త్ కేర్, డయాగ్నస్టిక్ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో సేవలుకాల్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా పునరుద్ధరణలు, ప్రీమియం రిమైండర్లు, చెక్-ఇన్లలో సహాయం కోసం ప్రతి సారథి వినియోగదారుడికి 24/7 రిలేషన్షిప్ మేనేజర్ను కేటాయింపుడాక్యుమెంట్ల డోర్ డెలివరీ, డిజిటల్ క్లెయిమ్ సబ్మిషన్లకు సహకారం. -
టాటా గ్రూపునకు మాయని మచ్చ..
టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారంప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్ను సమీక్షించడంలో టాటా గ్రూప్ నిబద్ధతను చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్రటాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్ నిర్మించింది.జేఆర్డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాను 1932లో జేఆర్డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్ డాలర్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.మెగా విలీనం - 2024 నవంబర్లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్ప్రెస్తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి. -
సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్.. ఇప్పుడు ఫుడ్డెలివరీ బాయ్..
మనం రోజూ ఎంతో మంది చిరు ఉద్యోగులను చూస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బందిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని కొంత మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి నేపథ్యాలు తెలిస్తే పశ్చాత్తాపడక తప్పదు. అలాంటి వారిలో ఒకరే పద్మనాభన్.బెంగళూరుకు చెందిన నితిన్ కుమార్ ఫుడ్ కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ అతని ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు, తాను ఆహారాన్ని మాత్రమే ఆశించగా అతన్ని లోతుగా కదిలించే కథ పరిచయమైంది. కేవలం బతడం కోసమే కాకుండా ఒకప్పుడు తాను నడుపుతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేందుకు ఫుడ్ డెలివరీలు చేస్తున్న పద్మనాభన్ అనే ఎంట్రప్రెన్యూర్ పరిచయమయ్యారు. ఆయన కథనే నితిన్ కుమార్ ‘ఎక్స్’లో షేర్ చేశారు."ఇదితో నా స్విగ్గీ డెలివరీ పార్టనర్ ఇది నాకు అప్పగించారు" అంటూ పోస్ట్ను ప్రారంభించిన నితిన్ కుమార్ దానికి ఓ రెజ్యుమ్ మొదటి పేజీ చిత్రాన్ని జతచేశారు. ‘డెలివర్డ్ విత్ కర్, బట్ విత్ కోడ్’ అని రెజ్యుమ్పై క్యాప్షన్ ఉంది. డెలివరీ పార్ట్నర్ పద్మనాభన్దే ఆ రెజ్యుమ్. అందులో "19+ సంవత్సరాల అనుభవం ఉన్న ఫుల్-స్టాక్ డెవలపర్" అని ఆయన వృత్తిపరమైన సమాచారం ఉంది.పద్మనాభన్ ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉండేవారు. కానీ ఆయనిప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తాను ఈ పని చేస్తున్నది "మనుగడ కోసం మాత్రమే కాదు, (తన వ్యాపారాన్ని) మొదటి నుండి నిర్మించడానికి" ఆయన రెజ్యూమ్ హైలైట్ చేస్తోంది.👉ఇదీ చదవండి: అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..డెలివరీ బాయ్కు బదులుగా మరేదైనా మంచి ఉద్యోగం ఇప్పించమంటావా అని అడిగితే.. ‘వద్దు, నా వ్యాపారాన్ని తిరిగి ట్రాక్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను‘ అంటూ పద్మనాభన్ బదులిచ్చాడని నితిన్ కుమార్ పేర్కొన్నారు. కాగా పద్మనాభన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2018లో తమిళనాడులో తన సంస్థను స్థాపించాడు. టెక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు. -
Gold Price: మళ్లీ రూ.లక్ష దాటిన బంగారం ధర
-
మళ్లీ రూ.లక్ష దాటిన బంగారం ధర
-
ట్రంప్ దగ్గర ఉద్యోగం.. మస్క్ సంపద మటాష్!
ప్రపంచ టెక్ బిలీయనీర్, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత స్నేహంగా మెలిగారు. ఎన్నికల సమయం నుంచే ట్రంప్నకు మద్దతుగా నిలుస్తూ ఆయన విజయానికి కృషి చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి సలహాదారుగా నియమితులయ్యాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ సంపద 25 శాతం అంటే సుమారు 113 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) క్షీణించిందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది.తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, బహిరంగ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందిన మస్క్, దూకుడు వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఫెడరల్ వ్యయాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన డోజ్లో కీలక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ చొరవ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంది. ట్రంప్ దగ్గర పనిచేసినందుకు ఎలాన్ మస్క్ తగిన మూల్యం చెల్లించుకున్నారని, 25 శాతం సంపద కోల్పోయారని పేర్కొన్న బ్లూమ్బర్గ్ నివేదికను జేడీ వాన్స్ న్యూస్ @JDVanceNewsX అనే ఎక్స్ యూజర్ ఇటీవల షేర్ చేయగా దానికి ఎలాన్ మస్క్ స్పందించారు. నిజమే అన్నట్టుగా ‘వర్త్ ఇట్’ అంటూ కామెంట్ చేశారు.మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్ 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను మస్క్ విమర్శించడం, అభిశంసనకు గురిచేయాలని సూచించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. తన మిత్రపక్షాలతో జరిగిన వ్యక్తిగత చర్చల్లో మస్క్ ను 'పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలకు బానిస'గా ట్రంప్ అభివర్ణించారు. నాసా చీఫ్గా మస్క్ ఎంపిక చేసిన జారెడ్ ఐజాక్మన్ నామినేషన్ను ట్రంప్ వెనక్కి తీసుకోవడం వారి సంబంధాలపై మరింత ఒత్తిడి పెంచింది.Worth it https://t.co/fQk2ULx7jh— Elon Musk (@elonmusk) June 11, 2025 -
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలు, వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవి అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.భారీ స్థాయి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆన్లైన్లో పలు కథనాలు వచ్చాయి. ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే రూ.3,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి.మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్న యూపీఐ మే నెలలో 1868 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. అనేక అంతరాయాలు వచ్చినప్పటికీ ఏప్రిల్లో 1789 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతకు ముందు మార్చిలో 1830 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఏప్రిల్లో రూ.23.95 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరగగా మే నెలలో రూ.25.14 లక్షల కోట్లకు పెరిగాయని ఎన్పీసీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.Speculation and claims that the MDR will be charged on UPI transactions are completely false, baseless, and misleading. Such baseless and sensation-creating speculations cause needless uncertainty, fear and suspicion among our citizens.The Government remains fully committed…— Ministry of Finance (@FinMinIndia) June 11, 2025 -
రైల్వే తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి..
రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 'ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలి అని రైల్వే శాఖ తన సర్క్యులర్ లో పేర్కొంది.జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత ఆరు నెలల్లో 2.5 కోట్ల అనుమానాస్పద ఐఆర్సీటీసీ ఐడీ (IRCTC ID)లను బ్లాక్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. టికెట్ బుకింగ్ కోసం బాట్ సాఫ్ట్వేర్లను ఉపయోగించినందుకు ఆయా ఐడీలను బ్లాక్ చేశారు. ఈ అనధికార ఐడీలను ఏరివేయడానికి వ్యక్తిగత వినియోగదారులకు తత్కాల్ ఈ-టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని సర్క్యులర్లో పేర్కొన్నారు.ఏజెంట్లకు షాక్..దీంతో పాటు ఆథరైజ్డ్ ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. అంటే ఏసీ తరగతులకు 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు 11.30 గంటల తర్వాత మాత్రమే ఏజెంట్లకు టికెట్ బుకింగ్కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్ లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్లను నిలిపివేయడానికి గానూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.👉ఇదీ చదవండి: వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం -
వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం
రైలు ప్రయాణం అంటే చివరి వరకూ టెన్షనే.. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకైతే తమ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా లేదా అన్నది రైలు బయలుదేరేంత వరకూ గందరగోళమే. ఈ తికమకను తొలగించడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరేందుకు 24 గంటల ముందే తుది చార్టును సిద్ధం చేయాలని నిర్ణయించింది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మే 21న బికనీర్ పర్యటన సందర్భంగా ఈ ఆలోచన వచ్చింది. చివరి నిమిషంలో గందరగోళాన్ని తగ్గించడానికి ముందుగానే చార్ట్ ను సిద్ధం చేయాలని స్థానిక రైల్వే అధికారులు సూచించారు. ఇప్పటివరకూ రైలు బయలుదేరడానికి 2.3 గంటల నుండి 4 గంటల ముందు మాత్రమే తుది చార్ట్ తయారు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో అనిశ్చితి నెలకొంది.👉ఇదీ చదవండి: తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరితుది చార్ట్ను 24 గంటల ముందే అందుబాటులోకి తేవాలన్న ఆలోచనకు మంత్రి వెంటనే ఆమోదం తెలపడంతో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. బికనీర్ డివిజన్లో జూన్ 6 నుంచి ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ట్రయల్ ప్రారంభ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రయాణికులు మెరుగైన స్పష్టతను చూశారు. టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ఎక్కువ సమయం లభించింది. బికనీర్ ట్రయల్ విజయవంతమైన తరువాత, భారతీయ రైల్వే ఇప్పుడు ఈ విధానాన్ని ఇతర అధిక ట్రాఫిక్ మార్గాలకు విస్తరించాలని యోచిస్తోంది. -
అంబానీ ఫ్యామిలీ సందడి.. ఆటపాటలతో హంగామా
ఎప్పుడూ వ్యాపారాలపరంగా వార్తల్లో నిలిచే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం.. తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులతోపాటు కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతాతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్, శ్లోకాల స్నేహితుడిదే ఈ వివాహ వేడుక.కొడుకు, కోడళ్ల స్నేహితుడి పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా హాజరవడమే కాదు.. అందరూ హుషారుగా డ్యాన్స్లు వేశారు. శ్లోకా అయితే మైక్ పట్టుకొని పాటలు పాడేసింది. ఇక ఆకాష్ కూడా సరదాగా వెడ్డింగ్ గేమ్ లో పాల్గొంటూ వరుడితో కలిసి నేలపై కూర్చొని డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇలా ఆ కుటుంబం చేసిన అల్లరి, హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.👉ఇది చదివారా? అనిల్ అంబానీకి భారీ ఉపశమనంస్కూల్ ఫ్రెండ్స్ అయిన ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా చాలా ఏళ్ల సుదీర్ఘ స్నేహం తరువాత 2019లో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు 2018లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆకాశ్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) చైర్మన్గా ఉండగా, శ్లోకా దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరికి పృథ్వీ, వేద అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by The Wedding Anchor Junaid Arif Currimbhoy (@theweddinganchor) -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలలో ముగిశాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాల మధ్య ఇతర ఆసియా మార్కెట్ల సంకేతాలతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 82,783.5 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 123 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 82,515.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కేవలం 37.15 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 25,141.4 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.49 శాతం, 0.53 శాతం క్షీణించాయి. రంగాలవారీ సూచీలు మిశ్రమ ధోరణులను కనబరిచాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.47 శాతం, ఐటీ 1.26 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ షేర్లలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.48 శాతం క్షీణించి 13.66 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఉద్యోగులు ఆఫీస్కు రాకపోతే.. గూగుల్ కొత్త ఎత్తుగడ
ఉద్యోగులను తగ్గించుకునేందకు టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఎత్తుగడ ఎత్తుకుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానం బలోపేతం పేరుతో సాధ్యమైనంత మేర ఉద్యగులను వదిలించుకునేందుకు ప్రణాళిక వేసింది. అమెరికాలో రిమోట్ వర్క్ విషయంలో గూగుల్ కఠినమైన విధానాన్ని తీసుకుంది. ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఎంచుకోవాలని కోరింది.కొత్త ఆదేశాల ప్రకారం.. గూగుల్లోని కోర్, మార్కెటింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ (కేఅండ్ఐ), కమ్యూనికేషన్స్ సహా కీలక విభాగాల్లోని ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రధానంగా గూగుల్ కార్యాలయానికి 50 మైళ్ల లోపల నివసించే ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఇది పనిప్రాంత అంచనాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.ఈ పరివర్తనను సులభతరం చేయడానికి, గూగుల్ కొత్త మార్గదర్శకాలను పాటించని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు స్వచ్ఛంద తొలగింపు ప్యాకేజీలను అందిస్తోంది. అయితే ఇవి తొలగింపులు కాదని గూగుల్ చెబుతున్నప్పటికీ, ఇలాంటి నిష్క్రమణ కార్యక్రమాలు చారిత్రాత్మకంగా విస్తృతమైన శ్రామిక శక్తి తగ్గింపులకు ముందు అమలవుతున్నవే.ఉద్యోగుల వ్యక్తిగత సహకారం నేరుగా ఆఫీస్లలో ఉండాలని భావిస్తున్న గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐ ఫోకస్డ్ కార్యక్రమాలనూ టెక్ దిగ్గజం వేగవంతం చేసింది. కంపెనీలు తమ సొంత రిమోట్ వర్క్ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నందున, ఈ విధానం టెక్ పరిశ్రమ అంతటా ప్రకంపనలు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.👉ఇది చదివారా? లక్షలకొద్దీ టెకీలు.. బెంగళూరు కొత్త రికార్డ్గూగుల్ తాజా ఈ ప్రకటన కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. గతంలో గూగుల్ ఇదే తరహా ఎగ్జిట్ ఆఫర్లు ఇచ్చి ఉద్యోగాల కోత విధించింది. 2023లో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది కూడా ట్రెజరీ, బిజినెస్ సర్వీసెస్ వంటి విభాగాల్లో చిన్నపాటి తొలగింపులు చేపట్టింది. ఈసారి ఎంతమందిపై ప్రభావం పడుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. గూగుల్ తన ఎక్కువ మంది సిబ్బందిని ఆఫీస్లకు తిరిగి రప్పించాలని భావిస్తోంది. ఇందుకు ఇష్టపడని వాళ్లు ఉద్యోగం వీడాల్సి ఉంటుంది. -
రూ.200 లోపే రీచార్జ్.. 2 నెలలుపైగా వ్యాలిడిటీ
దేశంలో ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటికీ మొబైల్ కనెక్షన్ చేరింది. మనలో చాలా మందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు ఉంటాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పాటు చాలా మందికి బీఎస్ఎన్ఎల్ నంబర్ కూడా ఉంటుంది. అయితే పెరిగిన రీచార్జ్ ధరల కారణంగా అన్నింటికీ రీచార్జ్ చేయించడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో నంబర్ను యాక్టివ్గా ఉంచుకునే అద్భుతమైన ప్లాన్ బీఎస్ఎన్ఎల్లో ఉంది.ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్ఫోలియోలో అనేక ప్లాన్లు ఉన్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం కంపెనీ వివిధ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిలో ఓ చౌక ప్లాన్ ఉంది. ఇది తక్కువ ఖర్చుతో మీ నంబర్ను చాలా రోజులు యాక్టివ్గా ఉంచుకునేందుకు సహాయపడుతుంది. అదే రూ .197 ప్లాన్. ఇందులో పరిమిత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. నంబర్ యాక్టివ్గా ఉంటే చాలు అనుకునేవారికి సరిపోతుంది.రూ.197 ప్లాన్ ప్రయోజనాలుబీఎస్ఎన్ఎల్ రూ.197 ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజుల వరకు ఉంది. అంటే, ఈ ప్లాన్ మీ కనెక్షన్ను 70 రోజులు యాక్టివ్గా ఉంచడమే కాకుండా ఇన్కమింగ్ సదుపాయం కూడా కొనసాగుతుంది. ఈ ప్లాన్ ఫీచర్ల విషయానికొస్తే, ఇది 15 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోమింగ్ అందిస్తుంది. దీనితో పాటు 15 రోజుల పాటు రోజూ 2 జీబీ అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. దీనితో పాటు 15 రోజుల పాటు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి.15 రోజుల తర్వాత లోకల్ కాలింగ్ కు నిమిషానికి రూ.1, ఎస్టీడీ కాలింగ్ కు నిమిషానికి రూ.1.3 ఖర్చవుతుంది. వీడియో కాలింగ్ కోసం లోకల్, నేషనల్కు నిమిషానికి రూ.2 చెల్లించాలి. ఇక ఎస్ఎంఎస్ విషయానికొస్తే లోకల్ ఎస్ఎంఎస్కు 80 పైసలు, నేషనల్ ఎస్ఎంఎస్కు రూ.1.20 పైసలు ఖర్చవుతుంది. డేటా విషయానికొస్తే, ఉచిత డేటా ముగిసిన తర్వాత, ఒక్కో ఎంబీకి 25 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. -
30 ఏళ్ల నాటి షేర్లు.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?
అదృష్టం ఎవరి జీవితంలో ఎప్పుడు పలకరిస్తుందో చెప్పలేం. 1990వ దశకంలో తన తండ్రి కొన్న షేర్లు ఇప్పుడు కొడుక్కి జీవితం మారిపోయే అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. అప్పట్లో తన తండ్రి కేవలం లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన పాత జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్ సర్టిఫికెట్లు అనుకోకుండా ఇటీవల కొడుక్కి దొరికాయి. వాటి విలువ ఇప్పుడు కొన్ని పదుల కోట్ల రూపాయలు.రెడిట్లో తన దృష్టికి వచ్చిన ఈ కథను ఇన్వెస్టర్ సౌరవ్ దత్తా ‘ఎక్స్’ పోస్ట్ లో వివరించారు. ‘ఓ రెడిట్ యూజర్ తన తండ్రి 1990లలో రూ.1లక్షకు కొన్న జేఎస్డబ్ల్యూ షేర్లను ఇటీవల కనుగొన్నాడు. ఇప్పుడు వాటి విలువ రూ.80 కోట్లు. సరైన సమయంలో కొనడం, అమ్మడానికి ఉన్న శక్తి ఇదే’ అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు సౌరవ్ దత్తా.ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కొన్న షేర్ల విలువ ఇప్పుడు కోట్లలో ఉండటంతో ఇప్పుడు ఒక తరానికే సంపదను సృష్టించాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి ఉన్న శక్తి ఏంటో తెలియజేస్తున్నాయి. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతూ ఈ పోస్ట్కు ప్రతిస్పందించారు. ఇక రిటైర్ అయి ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చని ఒకరు.. ఇది కేవలం పెట్టుబడి కాదు.. వారసత్వ సృష్టి.. అంటూ పలు విధాలుగా కామెంట్లు చేశారు.జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ దేశంలో ప్రముఖ ఉక్కు తయారీదారు. బలమైన మార్కెట్ ఉనికితో ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. ప్రస్తుతానికి ఈ కంపెనీ షేరు ధర రూ.1004.90 వద్ద ఉండగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.37 లక్షల కోట్లుగా ఉంది. జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు కొన్నేళ్లుగా గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి.👉ఇది చదివారా? జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..ఈ సంఘటన దీర్ఘకాలిక పెట్టుబడుల ఆవశ్యకతను తెలియజేస్తోంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరి కెరియర్ను ప్రారంభించిన యువత సేవింగ్స్పై ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలి. సంపాదనలో కొంత మొత్తాన్ని సేవింగ్స్కు, ఇన్వెస్ట్మెంట్కు తప్పనిసరిగా కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. బ్యాంక్ షేర్లదే హవా...
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. లండన్ లో యూఎస్-చైనా వాణిజ్య చర్చలకు ముందు సానుకూల ప్రపంచ సెంటిమెంట్, బలమైన యూఎస్ ఉద్యోగాల డేటా, యూఎస్-ఇండియా వాణిజ్య చర్చల పురోగతి వంటి అంతర్జాతీయ అంశాలతో పాటు ఆర్బీఐ బలమైన ద్రవ్య విధాన చర్యల మద్దతుతో భారతీయ ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సానుకూలంగా చలించాయి. ఇంట్రాడేలో 82,669 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 256.22 పాయింట్లు (0.31 శాతం) పెరిగి 82,445.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 100.15 పాయింట్లు లేదా 0.4 శాతం లాభపడి 25,103.20 వద్ద ముగిసింది. రంగాలవారీగా చూస్తే రియల్టీ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనార్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్స్, ఐటీ, ఎనర్జీ 1 శాతానికి పైగా పెరిగాయి.సెన్సెక్స్లో కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అదేసమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.13 శాతం, 1.57 శాతం లాభాలతో ముగిశాయి. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.43 శాతం పెరిగి 14.69 వద్ద స్థిరపడింది. -
మోతీలాల్ ఓస్వాల్ నుంచి కొత్త ఫండ్..
బీఎస్ఈలో నమోదైన టాప్–1000 కంపెనీల్లో పెట్టుబడులకు అవకాశం కల్పించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ.. బీఎస్ఈ 1000 ఇండెక్స్ ఫండ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ను ప్రారంభించింది. ఈ నెల 19 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.500. అభిరూప్ ముఖర్జీ ఈ పథకానికి మేనేజర్గా వ్యవహరించనున్నారు. మార్కెట్ విలువ పరంగా టాప్100 లార్జ్క్యాప్ కంపెనీల్లో, తదుపరి మార్కెట్ విలువ పరంగా 150 మిడ్క్యాప్ కంపెనీలలో, ఆ తదుపరి 400 స్మాల్క్యాప్ కంపెనీల్లో, వీటి తర్వాత మార్కెట్ విలువ పరంగా 350 టాప్ మైక్రోక్యాప్ కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. టాప్250 కంపెనీలు మినహా మిగిలిన 750 కంపెనీలు స్మాల్, మైక్రోక్యాప్ కనుక అస్థిరతల రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఇన్వెస్టర్లు గమనించాలి.ఎమ్కే ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎస్ఎంఐడీ క్యాప్ ఫండ్ ఎమ్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సంస్థ తాజాగా ఎస్ఐఎండీ క్యాప్ గ్రోత్ ఇంజిన్ ఫండ్ను ఆవిష్కరించింది. 2025–26లో రూ. 500–1,000 కోట్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్ పరిమాణం) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఫండ్ ప్రధానంగా స్మాల్, మిడ్క్యాప్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ద్రవ్యోల్బణం .. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం, కుటుంబాల ఆదాయం మెరుగుపడుతూ, వినియోగం పెరుగుతుండటం తదితర అంశాలన్నీ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు సానుకూలంగా నిలుస్తున్నాయని సంస్థ డైరెక్టర్ మనీష్ సంతాలియా తెలిపారు. వచ్చే 3–5 ఏళ్లలో ఈ షేర్లు మెరుగైన రాబడులు అందించే అవకాశాలు ఉన్నందున, ఇన్వెస్టింగ్కు అనువైనవిగా కనిపిస్తున్నాయని వివరించారు. -
డబ్బులు ఊరికే రావు: ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెలరీ
తమిళనాడుకు చెందిన ప్రముఖ జువెలరీ రిటైలర్ లలితా జ్యువెలరీ మార్ట్ క్యాపిటల్ మార్కెట్లలోకి అడుగు పెడుతోంది. ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు వస్తోంది. ఈమేరకు సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ఈ ఐపీవోలో భాగంగా ఫ్రెష్ ఈక్విటీ షేర్ల కింద రూ.1,200 కోట్ల విలువైన షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ జారీ చేయనున్నారు.1985లో ఏర్పాటైన లలితా జ్యువెల్లరీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే రూ.1,014.5 కోట్లను భారత్ లో 12 కొత్త స్టోర్ల ఏర్పాటుకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని యోచిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 46 నగరాల్లోని 56 స్టోర్ల ద్వారా ఆభరణాల ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తోంది.లలితా జ్యువెల్లరీ 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.359.8 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అలాగే ఆదాయం 26 శాతం పెరిగి రూ.16,788 కోట్లకు చేరింది. 2024 డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ.262.3 కోట్ల లాభం, రూ.12,594.7 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ గా ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఎక్విరస్ క్యాపిటల్ను నియమించారు. -
టాటా కారు ఓనర్లకు గుడ్న్యూస్..
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ తమ కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా మాన్సూన్ చెకప్ క్యాంప్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 6న ప్రారంభమైన ఈ క్యాంపులు 20వ తారీఖు వరకు కొనసాగుతాయని వివరించింది. 500 నగరాల్లో 1,090 ఆథరైజ్డ్ వర్క్షాప్లలో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.ఈ క్యాంపులో భాగంగా వాహనంలోని ముప్ఫై కీలక పాయింట్లను పరీక్షించే సమగ్ర హెల్త్ చెకప్ సేవలు పొందవచ్చని వివరించింది. కార్ టాప్ వాష్, ఒరిజినల్ స్పేర్ పార్టులు, ఇంజిన్ ఆయిల్, యాక్సెసరీలు, లేబర్ చార్జీలపై ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చని టాటా మోటార్స్ తెలిపింది.టాటా మోటార్స్ ఇండియా దేశంలో కర్వ్, టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ, ఇటీవల లాంచ్ చేసిన టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ తో సహా ఏడు ఐసీఈ కార్లను అందిస్తోంది. అలాగే కర్వ్.ఈవీ, నెక్సాన్.ఈవీ, పంచ్.ఈవీ, టియాగో.ఈవీ, టిగోర్.ఈవీ, ఇటీవల లాంచ్ చేసిన టాటా హారియర్.ఈవీ వంటి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా బ్రాండ్ జాబితాలో ఉన్నాయి. -
గౌతమ్ అదానీ వేతనం పెరిగింది.. కానీ..
అదానీ గ్రూప్ చైర్మన్, దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ .10.41 కోట్ల వేతనం అందుకున్నారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అదానీ గ్రూప్లోని తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (రూ.2.54 కోట్లు), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (రూ.7.87 కోట్లు) నుంచి ఆయనకీ ఆదాయం వచ్చింది.గతంతో పోలిస్తే ఈసారి వేతనం పెరిగినప్పటికీ, అదానీ పారితోషికం దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి పారిశ్రామిక అధినేతల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. తోటి వ్యాపారాధినేతలైన సునీల్ భారతి మిట్టల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.32.27 కోట్లు), రాజీవ్ బజాజ్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.53.75 కోట్లు), పవన్ ముంజాల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.109 కోట్లు), ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.76.25 కోట్లు), ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఎస్ పరేఖ్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.80.62 కోట్లు) వంటి వారు అదానీ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన గ్రూప్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్లలో కొంతమంది అదానీ కంటే ఎక్కువ పారితోషిక ప్యాకేజీలను అందుకున్నారు. ఏఈఎల్ సీఈవో వినయ్ ప్రకాశ్ రూ.69.34 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎండీ వినీత్ ఎస్ జైన్ రూ.11.23 కోట్లు ఆర్జించారు. ఇది భారతదేశ కార్పొరేట్ నాయకత్వంలోని విభిన్న వేతన నిర్మాణాలను హైలైట్ చేస్తుంది. ఇక్కడ కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వేతన ఆధారిత సంపాదనలో కంపెనీ వ్యవస్థాపకులనే అధిగమిస్తుండటం గమనించవచ్చు. -
అమెరికా స్టాక్మార్కెట్లో ఇండియన్ కంపెనీ
న్యూఢిల్లీ: దేశీ మెడికల్ టెక్నాలజీ కంపెనీ ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్ తాజాగా అమెరికాలోని నాస్డాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యింది. ఈ సందర్భంగా ఓపెనింగ్ బెల్ మోగించే కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు సు«దీర్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.కంపెనీ రూపొందించిన ఎస్ఎస్ఐ మంత్ర సర్జికల్ రోబోటిక్ సిస్టం ప్రస్తుతం దేశీయంగా 75 ప్రాంతాల్లోని 80 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. వీటితో 100 పైగా సర్జికల్ ప్రొసీజర్లకు సంబంధించి 4,000 పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు సంస్థ తెలిపింది.అటు అంతర్జాతీయంగా నేపాల్, కొలంబియా, ఉక్రెయిన్, ఈక్వెడర్ తదితర దేశాల్లోనూ కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. 2024 డిసెంబర్తో ముగిసిన సంవత్సరంలో కంపెనీ ఆదాయం 3.5 రెట్లు వృద్ధి చెంది 5.9 మిలియన్ డాలర్ల నుంచి 20.6 మిలియన్ డాలర్లకు పెరిగింది. స్థూల మార్జిన్లు 12.3 శాతం నుంచి 40.9 శాతానికి ఎగిశాయి. -
జెన్ఏఐలో పోటీలు.. రూ. 10 లక్షలు బహుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెక్ట్స్వేవ్, ఓపెన్ఏఐ అకాడమీ కలిసి దేశీయంగా అతి పెద్ద జెన్ఏఐ ఇన్నోవేషన్ బిల్డ్థాన్కి శ్రీకారం చుట్టాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర మొత్తం 7 రాష్ట్రాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. 500 క్యాంపస్ల నుంచి 25 వేల మందికి పైగా విద్యార్థులు జెన్ ఏఐ టెక్నాలజీలో నైపుణ్యాలను పెంచుకునేందుకు ఇదొక అవకాశం కాగలదని పేర్కొన్నాయి.మూడు రౌండ్లలో జరిగే ఈ పోటీల్లో విజేతలకు మొత్తం రూ. 10 లక్షల బహుమతితో పాటు ఓపెన్ఎఐ వ్యవస్థలో కెరియర్ను తీర్చిదిద్దుకునే అవకాశాలు లభిస్తాయి. పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన టీమ్స్.. రియల్ టైమ్ శిక్షణ, మెంటార్ సపోర్ట్, సరి్టఫికెట్లు మొదలైనవి పొందవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా 2,000కు పైగా ఏఐ ప్రాజెక్టులకు రూపకల్పన జరగవచ్చని నెక్ట్స్వేవ్ అంచనా వేస్తోంది. -
జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..
సాంకేతిక పురోగతి, మారుతున్న సంస్థల అవసరాలతో ఉద్యోగ అన్వేషణ తీరులో వేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలను నిర్ణయించడానికి కంపెనీలు రెజ్యూమెలు, ఇంటర్వ్యూలను దాటి వెతుకుతున్నాయి. చాలా సంస్థలు ఇప్పుడు అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాన్ని అంచనా వేయడానికి వారి క్రెడిట్ స్కోర్ను కూడా తనిఖీ చేస్తున్నాయి. ఇది నేరుగా ఉద్యోగ పనితీరుతో సంబంధం లేనప్పటికీ, అభ్యర్థి ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతకు సూచికగా క్రెడిట్ స్కోర్ను యాజమాన్యాలు పరిగణిస్తున్నాయి.అయితే ప్రతి కంపెనీ ఉద్యోగార్థుల క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేయదు కానీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు మాత్రం ఈ వైఖరిని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఫైనాన్స్, బ్యాంకింగ్, అకౌంటింగ్ లేదా సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరమయ్యే ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుంటే నియామక ప్రక్రియలో భాగంగా మీ క్రెడిట్ స్కోర్ను పరిగణనలోకి తీసకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా కంపెనీలు అభ్యర్థుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ కసరత్తును నిర్వహించడానికి థర్డ్ పార్టీ ఏజెన్సీలను సైతం నియమించుకుంటున్నాయి.జాబ్ అప్లికేషన్పై క్రెడిట్ స్కోర్ ప్రభావంక్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల సంఖ్య, దీనిని ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడానికి తరచుగా ఉపయోగిస్తాయి. ఇది 300 నుండి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, అనుకూలమైన వడ్డీ రేటుతో రుణాలు త్వరగా ఆమోదం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇది మీ రుణ అర్హత గురించి రుణదాతకు హామీ ఇస్తుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని ఎటువంటి డిఫాల్ట్ లేకుండా సకాలంలో తిరిగి చెల్లంచగలరు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది.మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులను మిస్ అయ్యారని, అవసరానికి మించి అప్పు తీసుకున్నారని లేదా రుణాలను డిఫాల్ట్ చేశారని చూపిస్తుంది. దీని వల్ల డబ్బు దొంగిలించడం, డేటా లీక్ చేయడం లేదా మోసానికి పాల్పడటం వంటి విషయాలకు మీరు ఎక్కువగా గురవుతారని కంపెనీ యజమాన్యం అనుకోవచ్చు.ఒక కంపెనీ మీ క్రెడిట్ హిస్టరీని చెక్ చేసిందంటే.. మీరు రుణాలు, క్రెడిట్ కార్డులు, బిల్లు చెల్లింపులను ఎంత బాగా నిర్వహించారు వంటి మీ గత ఆర్థిక ప్రవర్తనను చూస్తోందని అర్థం. మీరు అప్పుల్లో ఉంటే, మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించడం లేదని ఇది సూచిస్తుంది.👉ఇదీ చదవండి: టీనేజ్ అప్పులు.. తీరని తిప్పలు!తక్కువ క్రెడిట్ స్కోర్ మీరు పనిలో చాలా పరధ్యానంలో ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇది తప్పులు చేయడానికి, గడువులను కోల్పోవటానికి దారితీస్తుంది. ఆర్థిక విషయాలను నిర్వహించే పాత్రలకు, మీరు సరైన వ్యక్తి కాదని కంపెనీలు భావించవచ్చు.క్రెడిట్ స్కోరు మీ ఉద్యోగ దరఖాస్తును నేరుగా ప్రభావితం చేయదు కానీ, కొన్నిసార్లు ఇది కొన్ని రంగాలలో నియామక నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సున్నితమైన ఆర్థిక విషయాలను బాధ్యతాయుతంగా నిర్వహించగలరని భరోసా ఇవ్వడానికి తమ క్రెడిట్ స్కోర్ను షేర్ చేయాలని కంపెనీలు అడగవచ్చు. -
ఐపీవోకి వస్తున్న ఏక్వస్
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, వైమానిక విడిభాగాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా 20 కోట్ల డాలర్లు(రూ. 1,700 కోట్లు) సమీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.తాజా ఈక్విటీ జారీ, ప్రస్తుత ఇన్వెస్టర్ల వాటా విక్రయం ద్వారా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్కానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీలో ఇప్పటికే అమికస్, అమన్సా, స్టెడ్వ్యూ క్యాపిటల్సహా కాటమారన్, స్పర్ట గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. కంపెనీ ఏరోస్పేస్, కన్జూమర్ రంగాలకు ప్రెసిషన్ మ్యాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ను సమకూర్చుతోందిఏక్వస్ భారత్తోపాటు ఫ్రాన్స్, మూఎస్ఏలలో తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. బహుళ పరిశ్రమ విభాగాలలో తన ప్రపంచ కస్టమర్ బేస్కు ఉత్పత్తులను అందిస్తోంది. ఈ సంస్థకు భారత్లోని కర్ణాటకలో మూడు తయారీ క్లస్టర్లు (బెల్గావి, హుబ్బళ్ళి, కొప్పల్) ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. టాటా ఎలక్ట్రానిక్స్, మదర్సన్ గ్రూప్, జబిల్తో కలిసి ఏక్వస్ కూడా యాపిల్ ఉత్పత్తుల కోసం మెకానికల్ విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది. -
అనిల్ అంబానీకి భారీ ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దివాలా చర్యలను నిలిపివేస్తూ తాజాగా అపిల్లేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు జారీ చేసింది. తమ అప్పీల్ మేరకు ఎన్సీఎల్టీ ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశిస్తూ ఇంతక్రితం ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ సీపీ(ఐబీ)/624(ఎంబీ)2022 కేసులో 2025 మే 30న జారీ చేసిన ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసినట్లు పేర్కొంది. తమకు సౌర విద్యుత్ సరఫరా చేసిన ధుర్సర్ సోలార్ పవర్కి చెల్లింపులు జరపలేదంటూ రిలయన్స్ ఇన్ఫ్రాపై ఆరోపణలు ఉన్నాయి. ధుర్సర్కి సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరించిన ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ సంస్థ 2022 ఏప్రిల్లో రిలయన్స్ ఇన్ఫ్రాపై కార్పొరేట్ దివాలా పరిష్కార చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. రిలయన్స్ ఇన్ఫ్రా 2018 ఆగస్టు 28 నుంచి అసలు రూ. 88.68 కోట్లతో పాటు వడ్డీ కూడా బాకీ పడిందని వివరించింది.దీనితో రిలయన్స్ ఇన్ఫ్రాపై ఎన్సీఎల్టీ దివాలా చర్యలకు ఆదేశించింది. అయితే, ధుర్సర్ సోలార్ పవర్కు పూర్తిస్థాయిలో రూ. 92.68 కోట్లు చెల్లించేసినందున దివాలా చట్ట చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. ఇంధన కొనుగోలు ఒప్పందంలో భాగంగా టారిఫ్లకింద సొమ్ము చెల్లించినట్లు తెలియజేసింది. -
టీనేజ్ అప్పులు.. తీరని తిప్పలు!
దేశంలో టీనేజర్లు అప్పులు చేస్తున్న ధోరణి ఇటీవల పెరుగుతోంది. భారత యువత ముఖ్యంగా టీనేజర్లు అప్పుల కోసం డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్లు, క్రెడిట్ కార్డులు, ఇతర అనధికారిక మార్గాలను ఆశ్రయిస్తున్నారు. రుణ ప్రాప్యత ఆర్థిక సౌలభ్యాన్ని అందించినప్పటికీ, ఆర్థిక అవగాహన అంతగా లేని యువ రుణగ్రహీతలకు ముప్పును కూడా కలిగిస్తుంది.పైసాబజార్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మూడు తరాలలో మొదటిసారి అప్పు తీసుకునే సగటు వయస్సు 21 సంవత్సరాలకు తగ్గింది. చాలా ఆలస్యంగా రుణాలు తీసుకోవడం ప్రారంభించిన మునుపటి తరాలతో పోలిస్తే, నేటి యువత ఇప్పుడు వారి క్రెడిట్ ప్రయాణాలను 20 ల మధ్యలో ప్రారంభిస్తున్నారు. "బై నౌ, పే లేటర్" వంటి పథకాలు, స్వల్పకాలిక వ్యక్తిగత రుణాలు పెరగడం వల్ల రుణాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఏదేమైనా, భారతీయ యువతలో ఆర్థిక అవగాహన తక్కువగా ఉంది, రుణ నిర్వహణపై చాలా మందికి ఆచరణాత్మక పరిజ్ఞానం లేదు.రిస్క్లు, పర్యవసానాలురుణ ఉచ్చులు: అధిక వడ్డీ రేట్లు, దాచిన రుసుములు దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి.ఆర్థిక ఒత్తిడి: పేలవమైన ఆర్థిక ప్రణాళిక, అధిక రుణాలు ఆందోళనకు కారణమవుతాయి. మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి.క్రెడిట్ స్కోర్ డ్యామేజ్: తప్పిన చెల్లింపులు క్రెడిట్ స్కోర్లను దెబ్బతీస్తాయి. ఇది భవిష్యత్తు ఆర్థిక అవకాశాలను ప్రభావితం చేస్తుంది.మితిమీరిన రుణాలు: అనియంత్రిత రుణాలు వ్యక్తులకు, ఆర్థిక పరిశ్రమకు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి.బాధ్యతాయుతమైన రుణం.. జాగ్రత్తలుఫైనాన్షియల్ ఎడ్యుకేషన్: బాధ్యతాయుతమైన రుణాలు, ఆర్థిక నిర్వహణపై పాఠశాలలు, తల్లిదండ్రులు టీనేజర్లకు అవగాహన కల్పించాలి.బడ్జెట్ నైపుణ్యాలు: ఖర్చులను ట్రాక్ చేయడానికి, వాస్తవిక తిరిగి చెల్లించే ప్రణాళికలను సెట్ చేయడానికి యువ రుణగ్రహీతలను ప్రోత్సహించడం.రుణ నిబంధనలను అర్థం చేసుకోవడం: రుణం తీసుకునే ముందు, టీనేజర్లు వడ్డీ రేట్లు, ఫీజులు, తిరిగి చెల్లించే పరిస్థితులను క్షణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి.రుణాన్ని పరిమితం చేయండి: అవసరమైనప్పుడు మాత్రమే రుణం తీసుకోండి. ఒకేసారి ఎక్కువ రుణాలు తీసుకోవడం మానుకోండి.మార్గదర్శకత్వం పొందండి: ఆర్థిక సలహాదారులు లేదా మార్గదర్శకులను సంప్రదించడం టీనేజర్లకు సమాచారంతో కూడిన రుణ నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. -
లక్షల కొద్దీ టెకీలు.. బెంగళూరు కొత్త రికార్డ్
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు సరికొత్త రికార్డును సాధించింది. ప్రపంచంలోని టాప్ టెక్నాలజీ హబ్లలో చేరింది. రియల్ ఎస్టేట్ సేవల సంస్థ సీబీఆర్ఈ విడుదల చేసిన గ్లోబల్ టెక్ టాలెంట్ గైడ్బుక్ 2025 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 12 'పవర్హౌస్' మార్కెట్లలో ఒకటిగా బెంగళూరు అవతరించింది.అలాగే ఒక సరికొత్త మైలురాయిని కూడా బెంగళూరు చేరుకుంది. ఇక్కడ 10 లక్షలమందిపైగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే టెకీల అత్యధిక ఉన్న నగరంగా బెంగళూరు నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 12 'పవర్హౌస్' మార్కెట్లలో శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ మెట్రో, లండన్, టోక్యో, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన సాంకేతిక కేంద్రాలు ఉన్నాయి.టెక్ టాలెంట్ లభ్యత, నాణ్యత, ఖర్చు ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 115 మార్కెట్లను సీబీఆర్ఈ నివేదిక అంచనా వేసింది. కేవలం శ్రామిక శక్తి పరిమాణంలోనే కాకుండా ప్రత్యేక నైపుణ్యాల్లో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లోనూ బెంగళూరు ప్రత్యేకతను చాటుకుంది. అగ్రశ్రేణి యూఎస్ టెక్ మార్కెట్లలో కనిపించే స్థాయిలతో సరిపోలుతూ భారతదేశంలో కృత్రిమ మేధ నిపుణులు ఈ నగరంలో అత్యధికంగా ఉన్నారని నివేదిక పేర్కొంది.2019 నుండి 2024 వరకు బెంగళూరులో పనిచేసే వయసులో ఉన్నవారి జనాభా 2.4 శాతం పెరిగింది. వీరు ఆ నగర జనాభాలో 75.5% మంది ఉన్నారు. ఈ డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ టెక్నాలజీ రంగంలో బెంగళూరు విస్తరణకు కీలక చోదకాలలో ఒకటి. 28 యూనికార్న్ సంస్థలు, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల బలమైన ప్రవాహంతో నగరంలో స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. ఒక్క 2024లోనే బెంగళూరు 3.3 బిలియన్ డాలర్ల విలువైన 140 వీసీ ఒప్పందాలను దక్కించుకుంది. -
హైదరాబాద్లో పెరిగిన ఆఫీస్ అద్దెలు.. అయినా తక్కువే..
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో ఆఫీసు స్పేస్ అద్దెలు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా తర్వాత ఆఫీసు స్పేస్ విభాగం శరవేగంగా కోలుకుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్ నగరాలలో కార్యాలయ స్థలాలు హాట్స్పాట్గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు, అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయమైన పెరుగుదల నమోదు చేస్తోందని అనరాక్ సంస్థ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోదాదాపు అన్ని బహుళ జాతి, దేశీయ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ విధానానికి స్వస్తి చెప్పాయి. పూర్తి స్థాయిలో కార్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఆఫీసు స్పేస్కు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో కార్యాలయాల అద్దె విలువలు వృద్ధి చెందుతున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ మోడల్ పని విధానాలు మరింత సంప్రదాయక, నిర్మాణాత్మక కార్యాలయ కార్యకలాపాలకు దారి తీసింది. కంపెనీలు ప్రధాన నగరాలలో తమ ఉనికిని రెట్టింపు చేశాయి. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), టెక్ దిగ్గజాలు, బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు గ్రేడ్–ఏ కార్యాలయ స్థలాల లీజులు, కొనుగోళ్లకు మొగ్గు చూపించాయి. మన దేశంలో ఆఫీసు స్పేస్ విభాగంలో జీసీసీలు చోదకశక్తిగా మారాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే జీసీసీలు ఏకంగా 83.5 లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకున్నాయంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు.అమెరికాలో అనిశ్చితితో.. యూఎస్ కంపెనీలు మన దేశంలోని గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ లీజులపై ఆసక్తి చూపిస్తుంటాయి. ప్రస్తుతం దేశీయ ఆఫీసు స్పేస్ విభాగంలో అమెరికాకు చెందిన సంస్థల వాటా 45 శాతం ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో వ్యాపార విధానంలో అనిశ్చితి ఏర్పడటంతో ఇండియా లోని ఆఫీసు స్పేస్కు మరింత డిమాండ్ ఏర్పడింది. ముంబైలోని ఆఫీసు స్పేస్ లీజులలో అమెరికాకు చెందిన బ్యాంక్లు, ఆర్థిక సంస్థల వాటా ఏకంగా 48 శాతంగా ఉంటుంది.అత్యధికంగా ముంబైలో.. నాలుగేళ్లలో అత్యధికంగా ముంబైలో అద్దెలు 28 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత హైదరాబాద్లో 24.1 శాతం వృద్ధి చెందాయి. ఇక ఢిల్లీ–ఎన్సీఆర్లో 20 శాతం, బెంగళూరులో 15.8 శాతం, పుణెలో 11.1 శాతం, చెన్నైలో 9.1 శాతం మేర పెరిగాయి. 2022లో ముంబైలో చ.అ. అద్దె నెలకు రూ.131గా ఉండగా.. 2025 నాటికి రూ.168కి చేరింది. హైదరాబాద్లో నాలుగేళ్ల క్రితం రూ.58గా ఉండగా.. ఇప్పుడది రూ.72కు చేరింది.మన దగ్గరే తక్కువ.. హైదరాబాద్లో ఆఫీసు స్పేస్ అద్దెలు గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్లలో 24.1 శాతం మేర వృద్ధి చెందాయి. నాలుగేళ్లలో ప్రధాన నగరాలలో ఆఫీసు స్పేస్ అద్దెల వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అయినా కూడా ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇప్పటికీ మన దగ్గరే అద్దెలు తక్కువగా ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం, అందుబాటు ధరలు, చురుకైన ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ వంటివి నగరంలో ఆఫీసు స్పేస్ అద్దెల వృద్ధికి ప్రధాన కారణాలు. -
గోల్డ్ లోన్ కొత్త రూల్స్ ఖరారు..
బంగారు, వెండి వస్తువులు, ఆభరణాల తాకట్టుపై ఇచ్చే రుణాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖరారు చేసింది. ఈ మేరకు బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలకు తుది మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు (పేమెంట్ బ్యాంకులు మినహా), సహకార బ్యాంకులు (అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్ఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్ఎఫ్సీలు) ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.నూతన మార్గదర్శకాలు ఇవే.. బ్యాంకులు, రుణ సంస్థలు గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) యూనిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణాన్ని మంజూరు చేయకూడదు.బంగారం యాజమాన్యం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు దానిపై రుణాలు మంజూరు చేయకూడదు. బంగారం సదురు వ్యక్తిదేనా అని రుజువు చేసే డాక్యుమెంట్ గానీ, డిక్లరేషన్ గానీ రుణగ్రహీత నుంచి తీసుకోవాలి.ఇప్పటికే తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండిపై మళ్లీ రుణాలు మంజూరు చేయకూడదు.వాల్యుయేషన్ విషయానికి వస్తే, పూచీకత్తుగా స్వీకరించిన బంగారం లేదా వెండిని దాని వాస్తవ స్వచ్ఛతకు (క్యారెట్లు) సంబంధించిన రిఫరెన్స్ ధర ఆధారంగా అంచనా వేయాలి. ఇందుకోసం బంగారం లేదా వెండి తాకట్టుకు వచ్చిన మునుపటి 30 రోజుల సగటు ముగింపు ధర లేదా క్రితం రోజు ముగింపు ధరను పరిగణనలోకి తీసుకోవచ్చు.ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐబీజేఏ) లేదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నియంత్రించే కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రచురించిన విధంగా దీనిని ఉపయోగించాలి.ఇక బంగారంపై ఎంత అప్పు ఇవ్వచ్చన్న దానికి సంబంధించి గరిష్ట లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తుల విషయానికి వస్తే.. రూ.2.5 లక్షలు, అంత కంటే తక్కువ రుణం తీసుకునేవారికి తాకట్టు పెట్టే బంగారం విలువలో 85 శాతం లోన్గా ఇస్తారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలు దాటితే 75 శాతం రుణంగా ఇస్తారు.తాకట్టుగా తీసుకునే బంగారం ఆభరణాల రూపంలో అయితే 1 కేజీ, కాయిన్ల రూపంలో అయితే 50 గ్రాములు మించకూడదు.ఒకవేళ రుణం తిరిగి చెల్లించని పక్షంలో సెక్యూరిటీగా తీసుకున్న బంగారం, వెండి వస్తువులు వేలం వేసే ప్రక్రియ గురించి రుణ గ్రహీతకు ముందే తెలియజేయాలి.రుణం తిరిగి చెల్లించిన వెంటనే తాకట్టులో ఉన్న బంగారం, వెండి వస్తువులను రుణగ్రహీతకు అప్పగించాలి. 7 పని దినాల్లో వస్తువులు విడుదల చేయకపోతే రోజుకు రూ.5000 చొప్పున పెనాల్టీని రుణగ్రహీతకు చెల్లించాలి. -
రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..
గృహాలకు డిమాండ్ పెరుగుతుండటంతో గృహ రుణ మార్కెట్ కూడా బలపడుతోంది. అర్బన్ మనీ గణాంకాల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాలలో 2025 ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల పంపిణీ పరిమాణం 10 శాతం, విలువలు 15 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా రూ.కోటి కంటే ఎక్కువ టికెట్ సైజు ఉన్న రుణాలు ఏడాది కాలంలో గృహ రుణ పంపిణీలో 21 శాతం మేర వృద్ధి చెందాయి. తుది గృహ కొనుగోలుదారుల డిమాండ్, పట్టణీకరణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలతో గృహ రుణాలు సులభతరంగా పంపిణీ అవుతున్నాయి. గృహ రుణ పరిమాణం, విలువలు రెండు అంకెల వృద్ధిని నమోదు స్తోందని అర్బన్ మనీ రీసెర్చ్ వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని ప్రధాన నగరాలలో మహిళా గృహ రుణ గ్రహీతలు పెరుగుతున్నారు. ప్రతి ఐదు గృహ రుణాలలో ఒక మహిళా రుణ గ్రహీత ఉంది. గృహరుణ పంపిణీలో పురుషుల వాటా 10 శాతం కాగా.. మహిళ రుణ గ్రహీతల వాటా 9 శాతంగా ఉంది. అదే లోన్ అమౌంట్లో చూస్తే మగవారి వాటా 14 శాతంగా ఉండగా.. మహిళల వాటా 23 శాతంగా ఉంది. అర్బన్ మనీ నివేదిక ప్రకారం ప్రధాన నగరాలలో సగటు రుణం రూ.74 లక్షలుగా ఉంది. ఇది ఏటేటా 5 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. సగటు రుణం రూ.70 లక్షలు సగటున పురుషులు రూ.76 లక్షల రుణం తీసుకుంటుంటే.. మహిళా రుణ గ్రహీతలు రూ.70 లక్షల రుణం తీసుకుంటున్నారు. పురుషులు తీసుకునే లోన్ అమౌంట్ ఏటా 3 శాతం వృద్ధి చెందుతుండగా.. మహిళల రుణం ఏకంగా 13 శాతం పెరుగుతోంది. లోన్ అమౌంట్ వారీగా చూస్తే.. రూ.కోటి కంటే ఎక్కువ రుణం వాటా 21 శాతం కాగా.. రూ.45 లక్షల నుంచి రూ.కోటి మధ్య లోన్ వాటా 32 శాతం, రూ.45 లక్షల కంటే తక్కువ లోన్ వాటా 47 శాతంగా ఉంది. -
రూ.500 నోట్లు మళ్లీ రద్దవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే..
రూ.500 నోట్లు మరోసారి రద్దవుతాయంటూ సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వచ్చే ఏడాది నాటికి రూ.500 నోటును రద్దు చేస్తారంటూ వచ్చిన వాదనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు దీనిపై స్పష్టత ఇచ్చింది.2026 మార్చి నుంచి రూ.500 నోట్లను దశలవారీగా రద్దు చేస్తామని పేర్కొంటూ గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో ఓ వీడియో వైరల్ కావడంతో కరెన్సీ నోట్ల భవిష్యత్తుపై భయాందోళనలు మొదలయ్యాయి. క్యాపిటల్ టీవీ అనే ఛానెల్లో అప్లోడ్ చేసిన 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో జూన్ 2 నుంచి ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలపై స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు ఎటువంటి తప్పుడు సమాచారానికి గురికావద్దని భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ సూచించింది. ‘రూ.500 నోట్లను రద్దు చేయలేదు. చట్టబద్ధంగానే ఉన్నాయి. వార్తలను నమ్మి.. షేర్ చేసే ముందు అధికారిక సోర్స్లను ఎప్పటికప్పుడు సందర్శించి నిర్ధారించుకోండి’ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పీఐబీ పోస్ట్ పేర్కొంది.కొత్త రూ.500 నోట్లు ఎప్పుడొచ్చాయంటే..2016 నవంబర్ లో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత నోటు 66 మిమీ x 150 మిమీ కొలతల్లో స్టోన్ గ్రే కలర్ లో ఉంటుంది. దీని వెనుక భాగంలో భారతీయ వారసత్వ ప్రదేశాల థీమ్ కు అనుగుణంగా ఎర్రకోట చిత్రం ఉంటుంది. -
రియల్ఎస్టేట్ మోసాలకు ‘రెరా’ రెడ్ లైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల కొనుగోలుదారుల ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రమోటర్లు, డెవలపర్లు, రియల్టర్లు కొనుగోలుదారులను మోసగించే చర్యలను సహించేది లేదని రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ సంస్థలకు రూ.42 కోట్ల జరిమానాలు విధించినట్లు చెప్పారు. కొనుగోలుదారుల ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్న కొన్ని వాణిజ్య ప్రకటనల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.2023 జూన్లో రెరాకు పూర్తిస్థాయిలో చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించిన తర్వాత ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సత్యనారాయణ వివరించారు. 500 చదరపు అడుగులకు పైబడిన లేదా కనీసం తొమ్మిది.. అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు, ప్లాట్లు నిర్మించే ప్రతి ప్రాజెక్టు ‘రెరా’కింద రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలని తెలిపారు. అనుమతుల సమయంలో హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాలు, సంస్థలు కూడా విధిగా ‘రెరా’రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రమోటర్లు, డెవలపర్లకు సూచిస్తున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. రెరాలో ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి? ఈ ఏడాది మే చివరి నాటికి ‘రెరా’లో 9,641 ప్రాజెక్టులు నమోదయ్యాయి. 4,237 వ్యక్తులు/సంస్థలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నమోదు చేసుకున్నారు.రెరా ప్రధాన బాధ్యతలేంటి? ప్రమోటర్లు, డెవలపర్లు కొనుగోలుదారులకు జవాబుదారీగా ఉండేలా చేయడం, న్యాయబద్ధంగా వ్యవహరించేలా చూడడం, పారదర్శకత నెలకొల్పి మోసాలను నివారించడం, ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులకు సకాలంలో ప్రాపర్టీలను పూర్తిచేసి అందించేలా చూడడం, ఒప్పందాలు సరిగా అమలయ్యేందుకు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం రెరా ప్రధాన బాధ్యతలు. ప్రజల నుంచి రెరాకు ప్రధానంగా ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం లేదని, ఒప్పందం మేరకు నిర్ణీత గడువులోగా ఫ్లాట్లను అప్పగించటంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సకాలంలో ప్రాజెక్టులు మొదలుపెట్టకపోవటం, లేఅవుట్ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో అభివృద్ధి చేయకపోవడం, అ సంపూర్తిగా ఉన్న ఫ్లాట్లను రిజిస్టర్ చేయడం, నిధు లను మళ్లించడం, కొనుగోలుదారుల నుంచి వసూ లు చేసిన డబ్బును దుర్వినియోగం చేయడం, అగ్రిమెంట్లలో పేర్కొన్న మేరకు వసతులు కల్పించకపోవడం, ఒకే ప్లాట్/ఫ్లాట్ను ఇద్దరు ముగ్గురికి విక్రయించడం, వినియోగదారుల నుంచి డబ్బు వసూ లు చేసి కనిపించకుండా పోవటం, రెరాలో రిజిస్టర్ చేసుకోని ఏజెంట్లు ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడంపై ప్రధానంగా ఫిర్యాదులు వస్తున్నాయి.రెరా అనుమతి లేకుండానే ప్రకటనలు వస్తున్నాయి. వాటికి చెక్పెట్టే విధానం ఉందా? రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులపై సుమోటోగా కేసులు నమోదుచేస్తున్నాం. ప్రమోటర్ల అధికారిక వెబ్సైట్లను పరిశీలించి రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులను గుర్తించి షోకాజ్ నోటీసులు ఇస్తున్నాం. రెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిస్తే.. 040–29394972కు ఫోన్ చేసిగానీ, 9000006301 నంబర్కు వాట్సాప్ ద్వారా గానీ, rera&maud@telangana.gov.in, secy&rera&maud@telangana.gov.in వెబ్సైట్లలోగానీ ఫిర్యాదు చేయవచ్చు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ప్రీ లాంచింగ్ కార్యక్రమాలు చేపట్టడం రెరా చట్టరీత్యా నేరం. రిజిస్టర్ చేసుకోని సంస్థల ప్రకటనలను నియంత్రించేందుకు రెరా త్వరలోనే అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోబోతోంది. ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి? అందులో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? చర్యల తరువాత సంస్థల తీరు మారిందా? మీ నిర్ణయాలపై అప్పిలేట్కు వెళ్లిన కేసులెన్ని? 2,198 ఫిర్యాదులు అందాయి. వాటిలో 1,278 ఫి ర్యాదులను పరిష్కరించాం. 862 ప్రాజెక్టులపై జరిమానాలు విధించాం. 42 కేసుల్లో అప్పీల్కు వెళ్లారు.ఇప్పటివరకు ఎంత జరిమానా విధించారు? అందులో సంస్థలు ఎంత చెల్లించాయి? నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు రూ.41,04,09,425 జరిమానా విధించాం. అందులో రూ.15,76,82,170 వసూలు అయ్యింది. వసూలు కాని జరిమానాను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తారా? 92 కేసుల్లో రెవెన్యూ రికవరీ చట్టం కింద జరినామాలు వసూలు చేయాలని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను కోరాం. అందులో 3 కేసుల్లో ఆర్ఆర్ యాక్ట్ కింద జరిమానాలు వసూలు చేశారు. మిగతావి కూడా త్వరలో వసూలు చేస్తాం.రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నరెడ్కో, క్రెడాయ్, తెలంగాణ బిల్డర్స్ ఫోరం, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్, వినియోగదారుల సంఘాల సహకారంతో రియల్ మోసాలను అరికట్టే చర్యలు చేపట్టాం. రెరా అమలులో ఇతర రాష్ట్రాలు ఏవిధంగా ముందుకెళ్తున్నాయి? మన రాష్ట్రంలో రెరా పర్మనెంట్ అథారిటీని ప్రారంభించి రెండేళ్లు అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో అంతకంటే ముందునుంచే ఉన్నా యి. అయినా వాటితో సమానంగా మన దగ్గర రిజిస్ట్రేషన్లు జరిగాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో రెరాను 2017లోనే ప్రారంభించారు. మన రాష్ట్రంలో రెరా చైర్మన్గా నన్ను, సభ్యులుగా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణను 2023 జూలైలో నియమిస్తే.. సిబ్బందిని 2024 నవంబర్లో కేటాయించారు. సభ్యులు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణలతో కలిసి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. -
కుర్రకారూ.. పడొద్దు బోల్తా..!
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపులు భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. డిజిటల్ పేమెంట్స్ లో యూపీఐ చెల్లింపులదే ఆధిపత్యం. ముఖ్యంగా టీనేజర్లు, కుర్రకారు ఎక్కువగా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. దాదాపు అందరికీ యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసు. కానీ మోసాలకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై చాలా మంది దృష్టి పెట్టడం లేదు. ఆన్లైన్ లావాదేవీలను లక్ష్యంగా చేసుకునే మోసాలు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.తాజా నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ప్రకారం, 15-29 సంవత్సరాల వయసువారిలో దాదాపు 99.5 శాతం మందికి యూపీఐ లావాదేవీలు నిర్వహించే సామర్థ్యం ఉంది. ఇది డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా స్వీకరించడాన్ని హైలైట్ చేస్తున్నప్పటికీ, స్కామర్లు సైతం తమ వ్యూహాలను అమాయక యూజర్లను మోసం చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.యూపీఐ లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?మోసాన్ని నివారించడానికి వినియోగదారులు ఈ భద్రతా ప్రోటోకాల్స్ పాటించాలని అధికారులు, ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.యూపీఐ పిన్ షేర్ చేయకండి: సైబర్ నేరగాళ్లు తరచూ బ్యాంకు అధికారులు లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ వినియోగదారులను మోసం చేస్తుంటారు.లావాదేవీ లింక్లను సరిచూసుకోండి: స్కామర్లు చట్టబద్ధమైన ప్లాట్ ఫారమ్ లను అనుకరించే నకిలీ యూపీఐ చెల్లింపు లింక్ లను పంపవచ్చు. లావాదేవీలను ఆమోదించడానికి ముందు ఎల్లప్పుడూ క్రాస్ చెక్ చేయండి.పేమెంట్ రిక్వెస్ట్ల పట్ల జాగ్రత్త: తెలియని వ్యక్తుల నుంచి పేమెంట్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు వాటికి స్పందించే ముందు సోర్స్ను చెక్ చేసుకోండి.అధికారిక యాప్లు, ప్లాట్ ఫామ్ ఉపయోగించొద్దు: భద్రతా ప్రమాదాలను తగ్గించడానికి ధ్రువీకరించిన బ్యాంకింగ్ లేదా పేమెంట్ యాప్ల ద్వారా యూపీఐ లావాదేవీలు జరిగేలా చూసుకోండి.అకౌంట్లో ఏం జరుగుతోందో చూసుకోండి: యూపీఐ లావాదేవీలను ట్రాక్ చేయడం అనధికార చెల్లింపులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. -
వెండిపై ‘రిచ్డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి సంచలనం
బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా తారా స్థాయికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 13 ఏళ్ల తర్వాత వెండి ధర ఔన్స్కు కొత్త గరిష్టం 35 డాలర్లు దాటింది. 2012 ఫిబ్రవరి తర్వాత వెండి ధర ఇదే అత్యధికం. శుక్రవారం (జూన్ 6) 36 డాలర్లకు పైగా ట్రేడ్ అయిన వెండి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రిచ్డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై సంచలన అంచనాను వెల్లడించారు.వెండి ధర అకస్మాత్తుగా పెరగడానికి కారణమేమిటో ప్రస్తుతానికి తెలియలేదు. కానీ చాలా మంది మార్కెట్ విశ్లేషకులు, పరిశ్రమ నిపుణులు ఇది పూర్తిగా 'నిష్పత్తి ట్రేడింగ్' అని పిలుస్తున్నారు. అంటే బంగారం-వెండి నిష్పత్తి 100కు దిగువకు రావడమే వెండి ధరల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు.బంగారం-వెండి నిష్పత్తి అంటే.. ఒక ఔన్స్ బంగారంతో ఎన్ని ఔన్సుల వెండి కొనొచ్చే తెలిపే ఆర్థిక ప్రమాణాన్ని బంగారం-వెండి నిష్పత్తిగా పేర్కొంటారు. దీని దీర్ఘకాల సగటు 70 కాగా జనవరి నుంచి 100 వద్ద ఉంటూ వస్తోంది. నేడు (జూన్ 6న) బంగారం-వెండి నిష్పత్తి 93.33 వద్ద చలించింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్స్కు 3,360 డాలర్లు, వెండి ధర 36 డాలర్లుగా ఉంది. బంగారం-వెండి నిష్పత్తిలో ఈ భారీ పతనమే ఇప్పుడు వెండి ధరలను ప్రేరేపించిందని తెలుస్తోంది.రాబర్ట్ కియోసాకి ఏమన్నారంటే.. తన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ ద్వారా ప్రసిద్ధి చెందిన రచయిత, ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి వెండి, బంగారంపై పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ మధ్య బిట్ కాయిన్లపై ఇన్వెస్ట్ చేయడాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అయితే ప్రస్తుతం వెండి ధర ఔన్స్కు 35 డాలర్లను తాకిన తరుణంలో రాబర్ట్ కియోసాకి ఓ సంచలన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "వెండి ఈ రోజు ఉత్తమ బేరం అని నేను నమ్ముతున్నాను. సిల్వర్ ఈ ఏడాది డబుల్ అంటే 70 డాలర్లు కావొచ్చని భావిస్తున్నాను'' అని ‘ఎక్స్’ (ట్విటర్) పోస్ట్లో పేర్కొన్నారు.ఒక్క రోజే రూ.4వేలు పెరిగిన వెండిదేశంలో వెండి ధరలు అమాంతం ఎగిశాయి. శుక్రవారం (జూన్ 6) ఒక్కరోజే వెండి ధర కేజీకి రూ. 4వేలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో కేజీ వెండి ధర రూ.3000 పెరిగి రూ.1,07,000లకు చేరింది. మరోవైపు హైదరాబాద్ ప్రాంతంలో కేజీ వెండి రూ.4వేలు ఎగిసి రూ.1,17,000లను తాకింది. -
ఫ్లిప్కార్ట్ నుంచి ఇక నేరుగా లోన్లు..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కి రిజర్వ్ బ్యాంక్ నుంచి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ (ఎన్బీఎఫ్సీ) లైసెన్సు లభించింది. ఈ ఏడాది మార్చిలో ఆర్బీఐ దీన్ని మంజూరు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్లిప్కార్ట్ దీన్ని ధ్రువీకరించినప్పటికీ, ఇతర వివరాలను వెల్లడించలేదు.ఎన్బీఎఫ్సీ లైసెన్సు లభించడంతో ఇకపై కస్టమర్లకు ఫ్లిప్కార్ట్ నేరుగా రుణాలు అందించేందుకు వీలు లభిస్తుంది. ఫ్లిప్కార్ట్లో అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్కి ప్రస్తుతం 80 శాతం వాటాలు ఉన్నాయి. త్వరలో ఐపీవోకి వచ్చే యోచనలో ఉన్న ఫ్లిప్కార్ట్ తమ హోల్డింగ్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్కు మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.ఈ ఎన్బీఎఫ్సీ లైసెన్సు ఫ్లిప్కార్ట్కు ఆర్థిక సేవల రంగంలో కొత్త అవకాశాలను తెరుస్తుంది. ముఖ్యంగా డిజిటల్ రుణాలు, క్రెడిట్ ఉత్పత్తులు, కస్టమర్ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు సౌలభ్యం కల్పిస్తుంది. భారత్లో ఈ-కామర్స్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఈ లైసెన్సు ఫ్లిప్కార్ట్కు పోటీలో ముందంజలో ఉండటానికి, వినియోగదారులకు సమగ్ర సేవలను అందించడానికి సహాయపడుతుంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు భారీ ర్యాలీని చవిచూశాయి.ఇంట్రాడేలో 82,299.89 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 746.95 పాయింట్లు (0.92 శాతం) పెరిగి 82,189 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 252.15 పాయింట్లు లేదా 1.02 శాతం లాభపడి 25,003.05 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.92 శాతం పెరిగాయి.ఆర్బీఐ ఎంపీసీ 50 బేసిస్ పాయింట్ల రేట్ల కోతను ప్రకటించి, అంతర్జాతీయ వృద్ధి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని 'న్యూట్రల్' నుంచి 'న్యూట్రల్'కు మారుస్తూ రెపో రేటు కోతను ప్రకటించింది. అయితే వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు ఆర్బీఐ ఎంపీసీ నాలుగు విడతల్లో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లో 100 బేసిస్ పాయింట్ల కోత విధించింది. అయితే పాలసీ ప్రసంగం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రేట్లను తగ్గించే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. ఎంపీసీ సభ్యులందరూ రేట్ల వైఖరితో ఏకీభవించారని ఆయన స్పష్టం చేశారు.ప్రతిపాదిత గోల్డ్ లోన్ నిబంధనలను సడలించవచ్చని ఆర్బీఐ చెప్పడంతో ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి గోల్డ్ ఫైనాన్షియర్ల షేర్లు శుక్రవారం పెరిగాయి. ముత్తూట్ ఫైనాన్స్ 6.6 శాతం, మణప్పురం ఫైనాన్స్ 3 శాతం పెరిగాయి.ఈ ప్రకటనతో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.5 శాతం లాభంతో 56,650 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. రంగాలవారీగా చూస్తే రేట్ సెన్సిటివ్ రంగాలు దూసుకుపోతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ దాదాపు 5 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.5 శాతం, నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.4 శాతం పెరిగాయి. -
ఈపీఎఫ్వో UAN యాక్టివేషన్ గడువు పెంపు
ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకానికి సంబంధించి ముఖ్యమైన చర్యల గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మరోసారి పొడిగించింది. ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను యాక్టివేట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేసుకోసుకునేందుకు గడువును జూన్ 30 వరకు పొడిగించింది.యూఏఎన్ అంటే..యూఏఎన్ అనేది వేతన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఇచ్చే 12 అంకెల సంఖ్య. ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది. వ్యక్తి ఉద్యోగం మారినప్పటికీ ఒకేలా ఉంటుంది. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను ఆన్లైన్లో సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి, నిర్వహించడానికి యూఏఎన్ సహాయపడుతుంది.యూఏఎన్ యాక్టివేట్ చేయడం ఎలా?ఉద్యోగులు ఆధార్ ఆధారిత ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) ఉపయోగించి తమ యూఏఎన్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలాగో చూడండి..ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ను సందర్శించండి."ఇంపార్టెంట్ లింక్స్" విభాగం కింద "యాక్టివేట్ యూఏఎన్" పై క్లిక్ చేయండి.యూఏఎన్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్కు పర్మిషన్ ఇవ్వడానికి 'అగ్రీ' క్లిక్ చేయండి.మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ రావడానికి "గెట్ ఆథరైజేషన్ పిన్" పై క్లిక్ చేయండి.యాక్టివేషన్ పూర్తి చేయడానికి ఓటీపీ ఎంటర్ చేయండి. మీ యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పాస్వర్డ్ వస్తుంది. -
పన్ను ఆదా కోసం ఫేక్ చేస్తే.. కొత్త రూల్స్తో కొరడా
ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు సీజన్ నడుస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్కు గడువు సాధారణంగా జూలై 31 వరకూ ఉండగా ఈసారికి ఆ గడువును సెప్టెంబర్ 15కు పెంచింది ప్రభుత్వం. ట్యాక్స్ ఫైలింగ్ అంటేనే అందరి దృష్టి ట్యాక్స్ డిడక్షన్లపైనే ఉంటుంది. అయితే కొంతమంది పన్ను ఆదా కోసం తప్పుడు ట్యాక్స్ డిడక్షన్లతో మోసానికి పాల్పడుతున్నారు.ఆదాయపు పన్ను శాఖ ఇటీవల చేసిన దర్యాప్తులో 90,000 మందికి పైగా వేతన జీవులు తప్పుడు మినహాయింపులు క్లెయిమ్ చేసినట్లు తేలింది. ఇది దేశ పన్ను ఖజానాకు రూ .1,070 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించింది. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఈసారి ఫైలింగ్ ప్రక్రియను కఠినతరం చేసింది. మోసపూరిత పన్ను మినహాయింపులు క్లయిమ్ చేయడం ఇప్పుడు అంత సులువు కాదు. నవీకరించిన ఆదాయపు పన్ను రిటర్న్ యుటిలిటీలు ఐటీఆర్ -1, ఐటీఆర్ -4 ఇప్పుడు ఆదాయపు పన్ను చట్టంలోని కీలక విభాగాలలో మినహాయింపులకు బలమైన రుజువును కోరుతున్నాయి.ఎల్ఐసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ వంటి పెట్టుబడులను కవర్ చేసే సెక్షన్ 80సీ కింద చేసే క్లెయిమ్లలో పాలసీ నంబర్లు లేదా డాక్యుమెంట్ ఐడీలు ఉండాలి. సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా కోసం, పన్ను చెల్లింపుదారులు బీమా కంపెనీ పేరు పాలసీ నంబర్ను పేర్కొనాల్సి ఉంటుంది. రుణాలపై కోరే మినహాయింపులనూ ప్రభుత్వ కఠినతరం చేసింది. సెక్షన్ 80ఈ, 80ఈఈ, 80ఈఈఏ కింద క్లయిమ్ చేసే ఎడ్యుకేషన్, హోమ్ లోన్ బెనిఫిట్స్ కు బ్యాంకుల పేర్లు, లోన్ అకౌంట్ నంబర్లు, మంజూరు తేదీలతో సహా సవివరంగా వెల్లడించాల్సి ఉంటుంది. సెక్షన్ 80ఈఈబీ కింద ఎలక్ట్రిక్ వాహనాల మినహాయింపుల కోసం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను కూడా వెల్లడించాలి.200 శాతం జరిమానాట్యాక్స్ ఫైలర్లు చేసిన క్లెయిమ్లను క్రాస్ చెక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్) ను ఉపయోగించుకుంటుంది. నకిలీ క్లెయిమ్లను అరికట్టడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ద్వారా సమ్మతిని పెంచడం ఈ కఠిన నిబంధనల లక్ష్యం. కాబట్టి పన్ను చెల్లింపుదారులు తాము చేసే ప్రతి మినహాయింపునకు సరైన డాక్యుమెంటేషన్తో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే పన్ను బకాయిపై 200 శాతం జరిమానాను 24 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. సెక్షన్ 276సీ కింద దర్యాప్తును కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
గూగుల్ సంచలన యాప్.. ఇంటర్నెట్ లేకుండా ఏఐ..
విస్తృతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ ఫోన్లలో ఏఐ వినియోగాన్ని భిన్నంగా మార్చే ఓ సంచలన యాప్ను తీసుకొచ్చింది. దీని పేరు ‘ఏఐ ఎడ్జ్ గ్యాలరీ’. ఈ యాప్ ద్వారా శక్తిమంతమైన ఏఐ మోడల్స్ను మొబైల్స్లో ఆఫ్లైన్లోనే రన్ చేయొచ్చు. అంటే ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఏఐతో ఇమేజ్లను సృష్టించడం, కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి చేయొచ్చన్న మాట.ఇందులో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. యూజర్ ప్రైవసీకి ముప్పు చాలా తక్కువ. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం ఫోన్లోనే రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తుంది. అలాగే పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. సర్వర్ కోసం వేచిచూసే పనిలేకుండా యూజర్ల అడిగే ప్రశ్నలకు నేరుగా స్పందించేందుకు ఏఐకి ఆస్కారం కలుగుతుంది.గెమ్మా 3 1బీ అనే లాంగ్వేజ్ మోడల్పై ఆధారపడి ఈ యాప్ పనిచేస్తుంది. కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే ఈ కాంపాక్ట్ మోడల్ సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్ట్స్ను క్షణాల్లో జనరేట్ చేయగలదు. గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కోరిన కంటెంట్ను సృష్టించడం దగ్గర నుంచి డాక్యుమెంట్ విశ్లేషణ, స్మార్ట్ రిప్లైల వరకు అన్నింటినీ క్షణాల్లో చేయగలిగినంత శక్తివంతమైనది.ప్రస్తుతానికి ఈ యాప్ను "ప్రయోగాత్మక ఆల్ఫా విడుదల" గా గూగుల్ పేర్కొంటున్నప్పటికీ, అపాచీ 2.0 లైసెన్స్ కింద పూర్తిగా ఓపెన్ సోర్స్గా ఈ యాప్ అందుబాటులో ఉంది. అంటే డెవలపర్లు, కంపెనీలు దీనిని ఉపయోగించవచ్చు. మార్పులు చేయవచ్చు. వాణిజ్య ఉత్పత్తులలో జోడించవచ్చు. కాగా గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ ఐఓఎస్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. -
రేటెక్కిన బంగారం.. ఇప్పుడు తులం..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజులు నిలకడగా కొనసాగిన పసిడి ధరలు నేడు (జూన్ 2) పెరుగుదల బాట పట్టాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్ 2 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.👉ఇది చదివారా? గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వంఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,790🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,650ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.100 పెరిగి రూ.1,11,000 వద్దకు చేరింది. ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 పెరిగి రూ. 1,00,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
353 బ్యాంకులపై ఆర్బీఐ జరిమానాలు
నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. భారీ జరిమానాలు విధిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 353 బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలపై రూ .54.78 కోట్ల జరిమానాలు విధించినట్లు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన తన వార్షిక నివేదికలో తెలిపింది.సైబర్ సెక్యూరిటీ, ఎక్స్పోజర్ నిబంధనలు, ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, కేవైసీ మార్గదర్శకాలు, మోసాల వర్గీకరణ, రిపోర్టింగ్ విషయాల్లో నిబంధనలు పాటించని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, సహకార బ్యాంకులపై ఆర్బీఐ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుంది. సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్కు డేటాను సమర్పించడం, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం వంటి అంశాల్లోనూ ఆయా సంస్థలు అలసత్వం ప్రదర్శించాయి.మొత్తం జరిమానాలలో సహకార బ్యాంకులే అత్యధికంగా ఎదుర్కొన్నాయి. రూ.15.63 కోట్ల విలువైన 264 జరిమానాలను ఆర్బీఐ వాటిపై విధించింది. 37 ఎన్బీఎఫ్సీలు, ఏఆర్సీలు రూ.7.29 కోట్ల జరిమానా ఎదుర్కొన్నాయి. 13 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రూ.83 లక్షల జరిమానాను ఆర్బీఐ విధించింది. ఇక వాణిజ్య బ్యాంకుల్లో 8 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.11.11 కోట్లు, 15 ప్రైవేటు రంగ బ్యాంకులకు రూ.14.8 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు విదేశీ బ్యాంకులపైనా ఆర్బీఐ జరిమానా విధించింది. -
యాపిల్ మూడో స్టోర్ బెంగళూరులో.. రెంట్ ఎంతో తెలుసా?
స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్ భారత్లో తన రిటైల్ ఉనికిని విస్తరించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని ముంబై, ఢిల్లీలలో తమ రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్.. మూడో స్టోర్ను బెంగళూరులో తెరుస్తోంది. ఉత్తర బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో యాపిల్ కొత్త స్టోర్ను ఏర్పాటు చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి.ఢిల్లీ స్టోర్తో ఉత్తర భారతదేశంలో.. ముంబై స్టోర్తో పశ్చిమ భారత్లో ఆదరణను పెంచుకున్న యాపిల్.. ఇప్పుడు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న స్టోర్తో దక్షిణ భారత్లోనూ తమ ఉనికి విస్తరిస్తుందని భావిస్తోంది. తమ తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ కూడా ఇక్కడ కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.బెంగళూరు స్టోర్ రెంట్ ఎంతంటే..యాపిల్ బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న స్టోర్కు నెలకు రూ.16 లక్షలకు పైగానే అద్దె చెల్లించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ బెంగళూరులోని తన స్టోర్ కోసం రూ .2.09 కోట్ల వార్షిక అద్దెతో 7,997.8 చదరపు అడుగుల స్థలాన్ని 10 సంవత్సరాల లీజుకు తీసుకుందని రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ ద్వారా పొందిన లీజు ఒప్పందాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. 2024 నవంబర్ 8న లీజు అధికారికంగా ప్రారంభం కాగా, 2025 ఆగస్టు 8 నుంచి అద్దె చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాపర్టీ స్పార్కిల్ వన్ మాల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినది. -
దండుకున్న బ్యాంకులు దిగొస్తున్నాయి..!
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేని సామాన్యుల దగ్గర నుంచి మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల కింద రూ. కోట్లు దండుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడిప్పుడే దిగొస్తున్నాయి. అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లేకపోతే విధించే చార్జీలను తొలగిస్తున్నాయి. ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తాజాగా అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది. అయితే ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదన్న కారణంతో బ్యాంకులు కస్టమర్ల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నాయో తెలిస్తే అవాక్కవుతారు..మూడేళ్లలో రూ.5,614 కోట్లు లాక్కున్నాయి..2024 ఆర్థిక సంవత్సరంలో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఖాతాదారుల నుంచి రూ. 2,331 కోట్లు వసూలు చేశాయి. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన రూ. 1,855.43 కోట్లతో పోలిస్తే 25.63 శాతం ఎక్కువ. గత మూడు సంవత్సరాలలో (2022–2024) ఈ బ్యాంకులు మొత్తం రూ.5,614 కోట్లు సామాన్య కస్టమర్ల నుంచి మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల రూపంలో దోచేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐదు ప్రధాన ప్రైవేటు బ్యాంకులు (యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్) కలిపి కనీస బ్యాలెన్స్ కోసం రూ.21,000 కోట్లకు పైగా వసూలు చేశాయి.సామాన్య ఖాతాదారుల నుంచి చార్జీలు దండుకోవడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ముందువరసలో నిలిచింది. 2024లో ఈ బ్యాంకు రూ.633.4 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 386.51 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 369.16 కోట్లు దండుకున్నాయి. సాధారణంగా, మెట్రో ప్రాంతాల్లో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) రూ.3,000 – రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,000–రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.500–రూ.1,000 ఉంటుంది. దీనిని నిర్వహించకపోతే రూ.400–రూ.500 జరిమానా రూపంలో బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆ వస్తువులు ఇక అమ్మరు..
ఆన్లైన్ షాపింగ్ అన్నది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. దుస్తుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల వరకూ అన్నింటినీ ఈ-కామర్స్ సంస్థల్లోనే కొనేస్తున్నారు. అయితే ఇలా అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లో విక్రయించేందుకు వీల్లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, జియోమార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు వాకీ-టాకీల విక్రయాలను నిలిపేశాయి.రేడియో పరికరాల అక్రమ లిస్టింగ్, అమ్మకాల నివారణ, నియంత్రణ కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) మార్గదర్శకాలను జారీ చేసిన మీదట ఈ-కామర్స్ సంస్థలు తమ విక్రయ వస్తువుల జాబితా నుంచి వాకీ-టాకీలను తొలగించాయని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. రేడియో కమ్యూనికేషన్ పరికరాలు ముఖ్యంగా భద్రతా ముప్పును కలిగించే వాకీ-టాకీలను ఆన్లైన్లో అనధికారికంగా విక్రయించడాన్ని అరికట్టడానికి ఈ మార్గదర్శకాలను జారీ చేశారు.టెలికమ్యూనికేషన్స్ విభాగం, హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు సీసీపీఏ పీఐబీ ప్రకటనలో పేర్కొంది. చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు లేదా లైసెన్సింగ్ వివరాలు లేకుండానే చాలా సంస్థలు ఆన్లైన్లో వాకీటాకీలను విక్రయిస్తున్నట్లు గుర్తించామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా సంస్థలు వాకీటాకీల ఫ్రీక్వెన్సీ రేంజ్, వాటిని వినియోగానికి లైసెన్స్ అవసరమా అన్న వివరాలను పేర్కొనకుండా, ఆ పరికరాలను స్వేచ్ఛగా ఉపయోగించవచ్చని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని గుర్తించిన మీదట తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.దీంతో కొన్ని ఈ- కామర్స్ సంస్థలు తమ లిస్టింగ్ నుంచి వాకీటాకీలను తొలగించినప్పటికీ మరికొన్ని మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగిస్తుండటం గమనార్హం. అన్ని ప్రధాన ఆన్లైన్ విక్రయ సంస్థల్లో 16,970 వస్తువులకు సంబంధించి ఫ్రీక్వెన్సీ, అవసరమైన లైసెన్సింగ్ వివరాలు లేకపోవడంపై సీసీపీఏ గతంలోనే 13 నోటీసులు జారీ చేసింది. ఈ ప్లాట్ ఫామ్ లు నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయి. -
బ్యాంకు అకౌంట్లో పైసా లేకపోయినా పర్లేదు..!
బ్యాంక్ అకౌంట్.. దేశంలోని ప్రతి పౌరుడికీ కనీస అవసరంగా మారింది. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం అందరూ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. కానీ ఆ బ్యాంకు అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉంచడం పేదలు, సామాన్యులకు భారంగా మారింది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జీల పేరుతో బ్యాంకులు బాదేస్తున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు ఇప్పుడిప్పుడే సామాన్యులకు ఉపశమనం కల్పిస్తున్నాయి.తాజాగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు జూన్ 1 నుంచి అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని, తక్కువ లేదా జీరో బ్యాలెన్స్కు ఎటువంటి జరిమానాలు విధించని జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను మరికొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇలాంటి అకౌంట్లను ఏయే బ్యాంకులు అందిస్తున్నాయి.. ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.. ఈ కథనంలో తెలుసుకోండి...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్బీడీఏ)ను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ యాక్టివేట్ చేయడానికి లేదా అకౌంట్ క్లోజర్కు ఎలాంటి ఛార్జీలు ఉండవు.వడ్డీ రేటు: రూ .10 కోట్ల వరకు సంవత్సరానికి 2.70%అర్హత: భారతీయ నివాసితులు; చెల్లుబాటు అయ్యే కేవైసీ (ఆధార్, పాన్ మొదలైనవి) అవసరం.అదనపు గమనికలు: గరిష్ట బ్యాలెన్స్ పై గరిష్ట పరిమితి లేదు; ఏటీఎం లేదా బ్రాంచీల వద్ద విత్ డ్రా ఫారాల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్:జూన్ 1 నుండి, కెనరా బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ జరిమానాలను తొలగించింది. జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా మార్చింది.ఫీచర్లు: తక్కువ లేదా జీరో బ్యాలెన్స్ లకు ఛార్జీలు ఉండవు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను ప్రోత్సహిస్తాయి.సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐ ఎస్బీ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది.ఇండియన్ బ్యాంక్:బీఎస్బీడీఏ, మైనర్ల ఖాతాలు వంటి నిర్దిష్ట జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను అందిస్తుంది (గరిష్టంగా రూ. 2,00,000 ఉన్న ఖాతాలకు కనీస బ్యాలెన్స్ లేదు).ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్బుక్, ఇంటర్నెట్ / మొబైల్ బ్యాంకింగ్ (అభ్యర్థనపై).వడ్డీ రేటు: సంవత్సరానికి 2.75% –2.90% (2024 లో బ్యాలెన్స్ ఆధారంగా).గమనిక: సాధారణ పొదుపు ఖాతాలకు రూ .500 (చెక్బుక్ లేకుండా) లేదా రూ. 1,000 (చెక్బుక్తో) కనీస బ్యాలెన్స్ అవసరం, కానీ ఈ ఖాతాలలో ఈ మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోయినా ఎటువంటి జరిమానాలు ఉండవు. నిర్దిష్ట పథకాలకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయి.యాక్సిస్ బ్యాంక్:ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, బేసిక్ బ్యాంకింగ్ సేవలు (డిపాజిట్లు/ ఉపసంహరణలు), ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% –3.5% (బ్యాలెన్స్ ఆధారంగా).బ్యాంక్ ఆఫ్ బరోడా:ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో కూడిన బరోడా రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్, జీరో బ్యాలెన్స్కు ఎలాంటి పెనాల్టీలు ఉండవు.వడ్డీ రేటు: మారుతుంది (సాధారణంగా సంవత్సరానికి 2.75%–3.25%).హెచ్డీఎఫ్సీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్బీడీఏను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, అపరిమిత ఏటీిఎం ఉపసంహరణలు, ఉచిత నెట్ / మొబైల్ బ్యాంకింగ్, ఎల్పీజీ సబ్సిడీలు, డీబీటీ వంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు ప్రాప్యత.వడ్డీ రేటు: ఏడాదికి 3 శాతం (రూ.50 లక్షలలోపు బ్యాలెన్స్లకు), 3.5 శాతం (రూ.50 లక్షలకు మించిన బ్యాలెన్స్లకు).ఐసీఐసీఐ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్బీడీఏ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, 15,000+ ఏటీఎంలకు యాక్సెస్, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్బుక్, ఆప్షనల్ ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% (ప్రారంభ రేటు).కోటక్ మహీంద్రా బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా కోటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది.ఫీచర్లు: 811 యాప్ లేదా వెబ్సైట్ ద్వారా తక్షణ ఖాతా తెరవడం, ఉచిత వర్చువల్ డెబిట్ కార్డు (సంవత్సరానికి రూ.199 వద్ద ఫిజికల్ కార్డు), అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, డెబిట్ కార్డు చెల్లింపులపై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 4% వరకుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్:కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా ప్రథమ్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు (మైక్రో ఏటీఎంలతో సహా), ఉచిత నెట్/ మొబైల్ బ్యాంకింగ్, నెలవారీ వడ్డీ క్రెడిట్లు, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. రూ.35 లక్షల ప్రమాద బీమా, డైనింగ్ డీల్స్).వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు (లిస్టెడ్ బ్యాంకుల్లో అత్యధికం).ఆర్బీఎల్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు (విత్ డ్రా లిమిట్ రూ.50,000/రోజు), ఉచిత అన్ లిమిటెడ్ నెఫ్ట్/ఆర్టీజీఎస్, ఉచిత నెట్/మొబైల్/ఫోన్ బ్యాంకింగ్, షాపింగ్/డైనింగ్ పై డిస్కౌంట్లు.వడ్డీ రేటు: ఏడాదికి 7.5% వరకు.యస్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత అంతర్జాతీయ డెబిట్ కార్డు, యెస్ బ్యాంక్ ఏటీఎంలలో అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు, ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్/ ఐఎంపీఎస్, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. యాక్సిడెంటల్ డెత్ కవర్).వడ్డీ రేటు: ఏడాదికి 2.75% (రూ.50 లక్షల వరకు), 3.25% (రూ.40 కోట్ల వరకు).డీసీబీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత ఏటీఎం కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఉచిత నెట్/ మొబైల్/ ఫోన్ బ్యాంకింగ్, ఫిజికల్/ ఈమెయిల్ స్టేట్మెంట్లు.వడ్డీ రేటు: వనరులలో పేర్కొనబడదు, కానీ సాధారణంగా పోటీ.ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:సెల్ఫీ సేవింగ్స్ అకౌంట్ (జీరో బ్యాలెన్స్, యువతను లక్ష్యంగా చేసుకుని) అందిస్తోంది.ఫీచర్లు: నో మినిమమ్ బ్యాలెన్స్, ఉచిత డెబిట్ కార్డు, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, కాంపిటీటివ్ వడ్డీ రేట్లు.వడ్డీ రేటు: పరిశ్రమలో అత్యధికం (క్రెడిట్ త్రైమాసికం).ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, రూ .5,000 వరకు కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు. -
ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్కార్డులపై కొత్త చార్జీలు.. జూలై 1 నుంచి..
ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఛార్జీలను పెంచుతున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ రెండూ క్రెడిట్ కార్డు లావాదేవీల నిబంధనలను సవరించాయి. కొత్త చార్జీలను ప్రవేశపెడుతున్నాయి. ఇవి జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు కస్టమర్లకు ఆయా బ్యాంకులు నోటిఫికేషన్లు పంపించాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్పులివే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీల నిబంధనలను సవరించింది. గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ ఛార్జీలపై జూలై 1 నుండి కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టింది. డ్రీమ్ 11, రమ్మీ కల్చర్, జంగ్లీ గేమ్స్ లేదా ఎంపీఎల్ వంటి ప్లాట్ఫామ్లలో నెలకు రూ .10,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే 1% ఛార్జీ వర్తిస్తుంది. ఇది గరిష్టంగా రూ.4,999గా ఉంటుందని, ఆన్ లైన్ గేమింగ్ లావాదేవీలపై ఎలాంటి రివార్డు పాయింట్లు లభించవని బ్యాంక్ తెలిపింది.క్రెడిట్ కార్డును ఉపయోగించి పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్ లేదా ఓలా మనీ వంటి ప్లాట్ఫామ్లలో నెలకు రూ .10,000 కంటే ఎక్కువ వాలెట్ లోడింగ్ చేస్తే 1% చార్జీ వసూలు చేస్తారు. నెలకు మొత్తం వాలెట్ లోడింగ్ ఖర్చుకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. గరిష్టంగా రూ .4,999 ఉంటుంది.క్రెడిట్ కార్డులతో నెలకు రూ.50,000 లకు మించిన యుటిలిటీ లావాదేవీలపై 1% ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నెలకు మొత్తం యుటిలిటీ ఖర్చులకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఇది రూ .4,999 వరకు ఉంటుంది. అయితే బీమా లావాదేవీలను యుటిలిటీ లావాదేవీలుగా పరిగణించబోమని, అందువల్ల వీటిపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని బ్యాంక్ స్పష్టం చేసింది.👉ఇది చదివారా? కొత్త ఈపీఎఫ్వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులురెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ కేటగిరీలకు సంబంధించి ఒక్కో లావాదేవీకి గరిష్ట ఛార్జీని రూ.4,999గా నిర్ణయించారు. ప్రస్తుతం రూ .15,000 మించిన ఇంధన లావాదేవీలపై మాత్రమే 1% ఛార్జీ వసూలు చేస్తున్నారు. జూలై 1 నుంచి అన్ని అద్దె లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. అయితే కాలేజీ/స్కూల్ వెబ్సైట్లు లేదా వాటి పీఓఎస్ మెషీన్లలో థర్డ్ పార్టీ యాప్ చెల్లింపుల ద్వారా చేసే విద్యా లావాదేవీలకు మాత్రం ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చార్జీలుడీడీ (డిమాండ్ డ్రాఫ్ట్), పీవో (పే ఆర్డర్), ఏటీఎం ఇంటర్చేంజ్, ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డు ఫీజులను ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. నగదు డిపాజిట్, చెక్కు, డీడీ, పీవో బదిలీకి ఛార్జీలను ప్రతి రూ.1000కు రూ.2గా సవరించింది. ఇది కనిష్ఠంగా రూ.50, గరిష్టంగా రూ.15 వేలు ఉంటుంది. గతంలో రూ.10,000 వరకు అయితే రూ.50, రూ.10,000 దాటితే ప్రతి రూ.1000కు రూ.5 చొప్పున జనరల్ చార్జీలు వసూలు చేసేవారు.ఏటీఎం ఇంటర్ఛేంజ్ లావాదేవీలకు 3 మూడు దాటితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఆర్థికేతర లావాదేవీకైతే రూ.8.5 లుగా బ్యాంకు సవరించింది. ఇవి గతంలో వరుసగా రూ.21, రూ.8.5లుగా ఉండవి. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు 5 దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్కు ఛార్జీని రూ.21 నుంచి రూ.23కు పెంచారు. డెబిట్ కార్డు వార్షిక ఫీజును రూ.200 నుంచి రూ.300కు, రీప్లేస్ మెంట్ కార్డు ఫీజును రూ.200 నుంచి రూ.300కు పెంచారు. -
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు అడ్డాగా హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లోని వాణిజ్య స్థిరాస్తి రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) జోరు కొనసాగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలు గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీపీ)లకు అడ్డాగా మారాయి. దేశంలోని 7 ప్రధాన నగరాలలో 2025 తొలి త్రైమాసికం(క్యూ1)లో 1.94 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగగా.. ఇందులో 43 శాతం వాటా జీసీసీలదేనని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.సౌత్ జోరు.. 2025 క్యూ1లో జీసీసీలు 83.5 లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అదే 2024 క్యూ1లో జరిగిన 48.7 లక్షల చ.అ. జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. అత్యధికంగా దక్షిణాది నగరాలలో 64 శాతం వాటా 53.4 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో 19.5 లక్షల చ.అ. లీజులు జరిగాయి. జీసీసీ లావాదేవీల్లో అత్యధికంగా ఐటీ, ఐటీఈఎస్ రంగం వాటా 35 శాతం కాగా.. బీఎఫ్ఎస్ఐ రంగం 22 శాతం, తయారీ, పారిశ్రామిక రంగం వాటా 13 శాతంగా ఉంది. 100–110 బిలియన్ డాలర్లకు.. 2024 ముగింపు నాటికి ఏడు నగరాలలో మొత్తం 1,700 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ సుమారు 52 బిలియన్ డాలర్లు. ఆయా జీసీసీలలో 17–18 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2030 నాటికి 2,200–2,300 జీసీసీ సెంటర్లకు చేరుతుందని అంచనా. వాటి మార్కెట్ విలువ 100–110 బిలియన్ డాలర్లకు చేరుతుంది. అలాగే ఆయా జీసీసీలలో ఉద్యోగుల సంఖ్య 24–28 లక్షలకు చేరుతుంది.జీసీసీ అంటే? జీసీసీలకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందకొస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు. -
హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాలలో వీకెండ్ అంటే సంథింగ్ స్పెషల్.. నిద్ర లేచే సమయం నుంచి తినే తిండి, తిరిగే ప్రాంతం వరకూ.. ప్రతీది డిఫరెంట్గా ఉండాలనుకుంటారు. కరోనా తర్వాత నుంచి ఈ అభిరుచికి పర్యావరణం కూడా తోడైంది. దీంతో వారంలో కనీసం రెండు రోజులైనా పచ్చని ప్రకృతిలో సేదతీరాలని భావిస్తున్నారు. చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, రణగొణ ధ్వనులు, కాలుష్యం లేని ప్రాంతం.. ఇంటికి తిరిగొస్తూ వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు వెంట తెచ్చుకునే వీలూ ఉండాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే వీకెండ్ హోమ్స్ ఆదరణ పెరిగింది.ఈ ప్రాంతాల్లో డిమాండ్ కడ్తాల్, తలకొండపల్లి, షాద్నగర్, శంకర్పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు. కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే.. అందమైన వీకెండ్ హోమ్స్ను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది.ఎక్కడ చూసినా గ్రీనరీనే.. వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్లలో సాధ్యమైనంత స్థలాన్ని గ్రీనరీకే కేటాయిస్తారు. ఒకవేళ వీకెండ్ హోమ్స్ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని డెస్టినేషన్ వెండింగ్స్ కోసం వినియోగించి.. వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. ఒకవేళ కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకునేందుకు వీలుగా తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తారు. -
ఇది అమలైతే.. ఇన్సూరెన్స్ అంత ఈజీ కాదు..
దేశ బీమా రంగంలో భారీ మార్పు రాబోతోంది. పారదర్శకతను పెంపొందించడం, మోసాలను అరికట్టడంలో భాగంగా రిస్క్ అంచనా కోసం జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సిబిల్ వంటి క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థను తీసుకొచ్చేపనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కోరింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తే ఇన్సూరెన్స్ తీసుకోవడం అంత సులువుగా ఉండదు. ముఖ్యంగా ఫ్రాడ్ హిస్టరీ ఉన్న హైరిస్క్ వ్యక్తులను గుర్తించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలకు సులభమవుతుంది.పాలసీదారులపై ప్రభావంబ్యాంకులు రుణ దరఖాస్తుదారులను వారి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఎలా అంచనా వేస్తాయో, బీమా ప్రొవైడర్లు కూడా దరఖాస్తుదారులను వారి గత బీమా రికార్డుల ఆధారంగా మదింపు చేస్తారు. క్లీన్ క్లెయిమ్స్ చరిత్ర ఉన్న వ్యక్తులు తక్కువ ప్రీమియంల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇక మోసపూరిత క్లెయిమ్లకు పాల్పడిన చరిత్ర ఉన్నవారు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. కవరేజీ తిరస్కరణను కూడా ఎదుర్కోవచ్చు.మోసపూరిత క్లెయిమ్లతో రూ. వేల కోట్ల నష్టంప్రస్తుతం బీమా రంగంలో మోసపూరిత క్లెయిమ్లు ఏటా రూ.12,000-రూ.15,000 కోట్లుగా ఉన్నాయి. ఇది బీమా సంస్థలకు సవాలుగా మారింది. బీమా క్రెడిట్ స్కోర్లను అమలు చేయడం ద్వారా తప్పుడు క్లెయిమ్లను తగ్గించడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, మరింత ప్రీమియంలతో పాలసీలను అందించేందుకు బీమా కంపెనీలకు వీలవుతుంది. ఇది బాధ్యతాయుతమైన పాలసీదారు ప్రవర్తనను ప్రోత్సహిస్తుందని, బీమా ఉత్పత్తులకు విస్తృత అందుబాటును నిర్ధారిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.బీమా పరిశ్రమకు గేమ్ ఛేంజర్..క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థ భారత బీమా పరిశ్రమకు గేమ్ ఛేంజర్గా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు, గోప్యత, డేటా వినియోగానికి సంబంధించి ఆందోళనలు ఉన్నప్పటికీ, నియంత్రణ సంస్థలు డేటా సంరక్షణ చట్టాలను కచ్చితంగా పాటిస్తామని హామీ ఇస్తున్నాయి. ఇటు బీమా కంపెనీలకు, అటు పాలసీదారులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే ఈ బీమా క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థ 2026 ప్రారంభం నాటికి అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. -
హైదరాబాద్లో ఇంటి సెంటిమెంట్..
ఓ వైపు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.. నలువైపులా విస్తరిస్తోంది.. అందుకు తగ్గట్టే నివాస భవనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ.. నగరవాసుల్లో సొంతింటి పట్ల ఆసక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నా ఇల్లు అనే భావోద్వేగ బంధానికి, సెంటిమెంట్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన ‘బియాండ్ బ్రిక్స్: ది పల్స్ ఆఫ్ హోం బయింగ్’ అనే అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరోరియల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా సొంతింటి కల సాకారం చేసుకోవాలనే తపన మాత్రం నగరవాసుల్లో తగ్గడం లేదని తేల్చిన ఈ అధ్యయనం దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నగరాల్లో ప్రజలు సొంత ఇంటి గురించిన ఆలోచనా విధానాన్ని పరిశీలించారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలివి..ఇల్లు కొనాల్సిందే..సొంతింటిని కోరుకుంటున్న నగరాల వ్యాప్తంగా చూస్తే, అత్యధిక శాతం మందికి అది సెంటిమెంట్గా మారిన నగరంగా చెన్నై తొలిస్థానంలో నిలిచింది. ఆ నగరంలో 86శాతం మంది సొంత ఇంటికి జైకొడుతున్నారు. ఆ తర్వాత స్థానాన్ని 85శాతంతో ముంబై దక్కించుకుంది. ఇక అహ్మదాబాద్వాసుల్లో 83శాతం మంది నా ఇల్లే నా స్వర్గం అంటుంటే.. ఆ తర్వాత స్థానంలో నిలిచిన మన హైదరాబాద్లో 81శాతం మంది ఇల్లు కొనాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. మన నగరం తర్వాత 80శాతంతో కోల్కతా, 74శాతంతో ఢిల్లీ, 73శాతంతో బెంగళూర్లు సొంతింటి కలలో తేలిపోతున్నాయి. సొంతిల్లు ఎందుకంటే.. సుదీర్ఘకాలం సురక్షితంగా భద్రంగా జీవించాలి అంటే సొంత ఇల్లు ఉండాల్సిందేనని నగరవాసులు భావిస్తున్నారు. సొంతిల్లు వైపు నడిపిస్తున్న తర్వాతి కారణాల్లో ఆర్థిక స్థిరత్వం.. అంటే ఇల్లు కొనడమేననే ఆలోచన బలంగా ఉండటం, 3వ కారణంగా సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న సొంత ఇల్లు అనే భావన.. వంటివి ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. రూ.50 లక్షలు పైబడిన ఆదాయం ఉన్న అధికాదాయ వర్గాల వారిలో 91శాతం మంది సొంతిల్లు కావాలంటుంటే, అత్యల్ప ఆదాయం ఉన్న వారిలోనూ 71శాతం మంది అదే కోరిక వ్యక్తం చేస్తున్నారు.ఇల్లు కావాలి.. అవి కూడా కావాలి..ఇల్లు కొనేటప్పుడు ప్రధానంగా ఏం చూస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా వైద్య సౌకర్యాలకే అత్యధికులు ప్రాధాన్యత ఇచ్చారు. ఆస్పత్రులకు సమీపంలో నివసించడానికే 58శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. షాపింగ్కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. తమ ఇల్లు మార్కెట్స్కు సమీపంలో ఉండాలని 53శాతం మంది ఆశిస్తుంటే, రవాణా సౌకర్యాలు బాగుండే చోటైతేనే రైటు అంటున్నవారు 40శాతం మంది. అంతేనా ఇరుగు పొరుగుతో కాలక్షేపం ఉండాల్సిందే అంటున్న 23శాతం మంది కమ్యూనిటీ క్లబ్లకు సమీపంలోని ఇంటిని ఇష్టపడుతున్నారు. సొంత ఇంటితో పాటే ఆరోగ్యమూ మా తోటే అంటున్న నగరవాసుల్లో 16శాతం మంది జిమ్ తదితర వ్యాయామ సౌకర్యాలు దగ్గరలో ఉన్న ఇంటిని కోరుకుంటున్నారు. నగరంలో అత్యధికులు సొంత ఇంటిని ఇప్పటికీ సెంటిమెంట్గా భావిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుతం కనిపిస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలోని ఒడిదుడుకులు తాత్కాలికమేనని స్పష్టం అవుతోంది. సొంత ఇంటి కల నిజం చేసుకునేవారి కల సాకారం చేసే విధంగా అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు అందజేయగలిగితే.. సిటీ రియల్ రంగానికి భవిష్యత్తుకి దోకా ఉండదు. -
పసిడి పలుకు: బంగారం మళ్లీ పెరిగిందా.. తగ్గిందా?
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం రోజున కాస్త పెరిగిన పసిడి ధరలు నేడు (మే 31) నిలకడగా కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. మే 31 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.👉ఇది చదివారా? గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వంఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,460🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,350ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,10,900 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
అపోలో హాస్పిటల్స్కు పెరిగిన లాభం.. వాటాదారులకు డివిడెండ్
ముంబై: ఆరోగ్య సంరక్షణా సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 54 శాతం జంప్చేసి రూ. 390 కోట్లను తాకింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 254 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.కాగా.. మొత్తం ఆదాయం రూ. 4,944 కోట్ల నుంచి రూ. 5,592 కోట్లకు ఎగసింది. పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం దూసుకెళ్లి రూ. 1,446 కోట్లను తాకింది. 2023–24లో రూ. 899 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 19,059 కోట్ల నుంచి రూ. 21,974 కోట్లకు బలపడింది. రానున్న ఐదేళ్లలో రూ. 8,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ప్రతాప్.సి.రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో సంస్థ షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 6,878 వద్ద ముగిసింది. -
మహీంద్రా థార్ రాక్స్: డాల్బీ అట్మాస్తో తొలి ఎస్యూవీ ఇదే..
మహీంద్రా థార్ రాక్స్ ఎస్యూవీ ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించింది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీని పొందిన ప్రపంచంలోని తొలి ఎస్యూవీగా ఇది నిలిచింది. మహీంద్రా, డాల్బీ ల్యాబొరేటరీస్ మధ్య కుదిరిన భాగస్వామ్యం ఈ అద్భుతమైన ఫీచర్ను థార్ రాక్స్ ఏఎక్స్7ఎల్ వేరియంట్కు తీసుకువచ్చింది. సాహసోపేతమైన థార్ రాక్స్ డ్రైవింగ్కు డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ తోడై థ్రిల్లింగ్ అనుభవాన్ని జోడిస్తుంది.ఈ ఎస్యూవీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో గానా యాప్ అనుసంధానం చేశారు. దీని ద్వారా వినియోగదారులు పాటలను నిరంతరాయంగా వినవచ్చు. ప్రీమియం 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టంతో నాలుగు ఛానెళ్ల లీనమయ్యే ఆడియో డాల్బీ అట్మాస్ సమకూర్చింది.థార్ రాక్స్ భారత విపణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. గత సంవత్సరం ఆగస్టులో విడుదలైన దీని ఉత్పత్తిని మహీంద్రా గణనీయంగా పెంచింది. థార్ రాక్స్, మూడు డోర్ల థార్ కలిపి 2.5 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేశాయి. ఉత్పత్తి పెరగడం వల్ల థార్ రాక్స్ వేచి ఉండే సమయం 18 నెలల నుండి గరిష్టంగా ఆరు నెలలకు తగ్గింది.థార్ రాక్స్ ధరలు రూ.12.99 లక్షల నుండి రూ.23.39 లక్షల వరకు ఉంటాయి (రెండు ఎక్స్-షోరూమ్ ధరలు). ఇది రెండు శక్తివంతమైన పవర్ట్రైన్ ఎంపికలు అందిస్తుంది: 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ 161.8బిహెచ్పి శక్తి 330ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ 176.8బిహెచ్పి శక్తి 380ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.డీజిల్ ఇంజిన్ కూడా రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభ్యమవుతోంది. మాన్యువల్ 152.1 బీహెచ్పీ శక్తి 330ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఆటోమేటిక్ రెండు ట్యూన్లలో వస్తుంది. ఒకటి మాన్యువల్ శక్తిని ఇస్తే, ఇంకొకటి 174.8 బీహెచ్పీ శక్తి 370ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్లు కేవలం ఆర్డబ్ల్యూడితో వస్తే, డీజిల్ వినియోగదారులు ఆర్డబ్ల్యూడీ, ఫోర్డబ్ల్యూడీలను ఎంపిక చేసుకోవచ్చు. -
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులు
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిలలో రికార్డు స్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు ఐదేళ్లలో హైదరాబాద్లో రికార్డు స్థాయిలో పెరిగాయని ఓ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చ.అ.కు రూ.7,450గా ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు చూస్తే.. 2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో రూ.12,400గా ఉండగా.. 2024 నాటికి రూ.15,350కి పెరిగాయి.👉ఇది చదివారా? హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..అందుబాటు గృహాలలో 15 శాతం ఏడు ప్రధాన నగరాలలో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో అత్యధికంగా ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది.మధ్యతరగతిలో 18 శాతం ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాలలో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువలలో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్లోనే నమోదైంది. మన నగరంలో మిడ్సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది. -
ఎంఎస్ఎంఈలు నాణ్యత ప్రమాణాలను అనుసరించాలి
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ఉత్పత్తుల తయారీలో స్వచ్ఛంద, తప్పనిసరి ప్రమాణాలను పాటించాలని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సూచించారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్టు చెబుతూ.. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు.ఎంఎస్ఎంఈలు తమ సమస్యల గురించి తెలియజేయడం, సత్వర పరిష్కారాలను పొందే విషయంలో మరింత చురుగ్గా ఉండాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రమాణాల కోసం పరిశ్రమ డిమాండ్ చేయాలని.. వాటిని రూపొందించడంలో పాలు పంచుకోవాలని కోరారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వేగంగా ప్రమాణాలను రూపొందించగలదంటూ.. ప్రమాణాల విషయంలో పరిశ్రమ పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.నాణ్యమైన ఉత్పత్తుల దిశగా గత కొన్నేళ్లలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న టెస్టింగ్ ల్యాబ్లను బలోపేతం చేయడంతోపాటు, కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు రూ.78 కోట్ల నిధులకు ఇటీవలే ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఏ దేశం అయినా అంతిమంగా తన ఉత్పత్తులు, సేవల్లో విశ్వసనీయతతోనే వృద్ధి చెందగలదని గుర్తు చేశారు. దిగుమతయ్యే నాసిరకం ఉత్పత్తులను తిరస్కరించే ప్రమాణాలను భారత్ కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉగాండా, రువాండాలకు సైతం నాణ్యత నియంత్రణలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం 23,000 వరకు భారతీయ ప్రమాణాలు ఉండగా, అవన్నీ స్వచ్ఛందమేనన్నారు. -
నాన్టెక్లో టెకీలుగా దూసుకొస్తున్న మహిళలు
ముంబై: టెక్యేతర రంగాల్లో మహిళా టెకీల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. 2020 తర్వాత నుంచి ఈ ధోరణి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2020లో టెక్నాలజీ ఉద్యోగాల్లో మహిళల వాటా 1.90 శాతంగా ఉండగా, 2023లో 11.8 శాతానికి, 2024 నాటికి 14 శాతానికి పెరిగిందని టీమ్లీజ్ డిజిటల్ ఒక నివేదికలో వెల్లడించింది. 2020–2024 మధ్యకాలంలో 13,000 మంది టీమ్లీజ్ డిజిటల్ టెక్ కాంట్రాక్ట్ సిబ్బంది డేటా విశ్లేషణ ఆధారంగా దీన్ని రూపొందించారు.దీని ప్రకారం పురుషాధిక్యత ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మహిళల వాటా 2020లో 9.51 శాతంగా ఉండగా 2024లో 27.98 శాతానికి పెరిగింది. నాన్–టెక్ రంగాల్లో టెక్నాలజీపరమైన విధుల్లో మహిళల నియామకాలు మెరుగుపడుతుండటాన్ని ఇది సూచిస్తోందని రిపోర్ట్ పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. హోదాపరంగా చూస్తే సీనియర్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం 3.35 శాతానికే పరిమితం కాగా, మిడ్–లెవెల్లో 4.07 శాతంగా, ఎంట్రీ స్థాయిలో 3.03 శాతంగా ఉంది. లీడర్షిప్ హోదాలను చేరుకోవడంలో మహిళలకు ఇప్పటికీ సవాళ్లు ఎదురవుతున్నాయనడానికి ఇది నిదర్శనం. పరిశ్రమలవారీగా నైపుణ్యాల ఆధారిత విశ్లేషణ ప్రకారం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఇటు నాన్–టెక్నికల్, అటు టెక్నికల్ నైపుణ్యాల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉంది. ఇది వరుసగా 49.28 శాతం, 44.31 శాతంగా నమోదైంది. 47.32 శాతం, 34.58 శాతం వాటాతో లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్కేర్ ఆ తర్వాత స్థానంలో నిల్చింది. టెక్నాలజీయేతర రంగాల్లో టెకీ ఉద్యోగాల్లో మహిళల వాటా 14 శాతానికి చేరడమనేది సమ్మిళితత్వం పెరుగుతుండటాన్ని సూచిస్తోంది. అయితే, లీడర్షిప్ హోదాల్లో వారికి అంతగా ప్రాతినిధ్యం ఉండటం లేదు. ఈ అంతరాలను సరిచేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి. మహిళలకు కూడా అవకాశాలు ..వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా, పరిశ్రమపరమైన అవరోధాలను పరిష్కరించేలా, సిబ్బందిలో వారి సంఖ్య మరింత పెరిగేలా చూడటంపై కంపెనీలు మరింత దృష్టి పెట్టాలి. -
ఇంటి పొదుపు రూ.22 లక్షల కోట్లు..! ఎస్బీఐ అంచనా
కోల్కతా: గృహాల నికర పొదుపులు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) రూ.22 లక్షల కోట్ల మేర ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ తన అంచనాలు ప్రకటించింది. జాతీయ స్థూల ఖర్చు చేయతగిన ఆదాయం (జీఎన్డీఐ)లో ఇది 6.5 శాతానికి సమానమని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గృహ నికర పొదుపులు జీఎన్డీఐలో 5.1 శాతంగా ఉంటే, దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో 4.9 శాతం మేర పెరిగినట్టు తెలిపింది.ఆర్థిక పొదుపులు పెరగడం అన్నది ప్రభుత్వం, కార్పొరేట్ నిధుల లోటును భర్తీ చేసేందుకు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎంతో కీలకమని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్బీఐ మిగులు నిల్వలను ప్రస్తావించింది. రూపాయి అస్థిరతల కట్టడికి సెంట్రల్బ్యాంక్ తీసుకునే చర్యలు ఈ పరిమాణాన్ని నిర్దేశిస్తాయని తెలిపింది. 2024–25లో ఆర్బీఐ బ్యాలన్స్ షీటు 8.19 శాతం విస్తరించగా.. అదే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు పేర్కొంది.ఆర్బీఐ మిగులు నిల్వలు రూ.2.69 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయడం (డివిడెండ్) ద్రవ్య వెసులుబాటును ఇస్తుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మోసాల కేసులు తగ్గినప్పటికీ.. మోసపోయిన మొత్తం మూడు రెట్లు పెరిగి రూ.36,014 కోట్లకు చేరినట్టు గుర్తు చేసింది. -
మెట్రోల్లో తగ్గిన బ్యాంకు రుణాలు!
ముంబై: దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాంకుల రుణాల వాటా చెప్పుకోతగ్గ మేర క్షీణించింది. ఐదేళ్ల క్రితం బ్యాంకుల మొత్తం రుణాల్లో 63.5 శాతంగా ఉంటే 2025 మార్చి చివరికి 58.7 శాతానికి తగ్గినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో రుణ వితరణ పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.డిపాజిట్ల విషయంలో దీనికి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే మెట్రోపాలిటన్ శాఖల్లోనే అధికంగా 11.7 శాతం వృద్ధి 2025 మార్చిలో నమోదైంది. ఇదే కాలంలో గ్రామీణ శాఖల్లో 10.1 శాతం, సెమీ అర్బన్ శాఖల్లో 8.9 శాతం, అర్బన్ శాఖల్లో 9.3 శాతం నమోదైంది.ముంబై, ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాంకుల రుణాల వాటా తగ్గడం, గ్రామీణ, చిన్న పట్టణాల్లో రుణ వితరణ పెరగడం కొన్ని ముఖ్యమైన ఆర్థిక పరిణామాలను సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ ప్రాప్తి పెరగడం అక్కడి వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, అలాగే చిన్న తరహా పరిశ్రమల విస్తరణకు తోడ్పడవచ్చు. దీని ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థ మరింత సమతుల్యత సాధించవచ్చు.చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల పెరుగుదల వల్ల స్థిరాస్తి, పేదరిక నిర్మూలన, అలాగే ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. బ్యాంకులు పెద్ద నగరాల బదులుగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. మెట్రోపాలిటన్ నగరాల్లో రుణాల వాటా తగ్గడం, డిపాజిట్ల వృద్ధి ఎక్కువగా ఉండటం ఆదాయ స్థాయిలు పెరుగుతుండటం, పొదుపు అలవాట్లు మెరుగుపడటం వంటి జీవన శైలి మార్పులను సూచిస్తున్నాయి. -
గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వం
దేశంలో బంగారు రుణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అత్యవసర నగదు అవసరాల కోసం లక్షలాది మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి గోల్డ్ లోన్లే ఆధారం. అయితే, గోల్డ్లోన్ మంజూరుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రతిపాదించిన నిబంధనల మార్పులు తీవ్రమైన చర్చకు దారితీశాయి. చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే గ్రహీతలపై తీవ్ర ప్రభావం పడనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగింది.కఠిన నిబంధనలుగోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేసే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. వీటిలో..లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని 75 శాతానికి పరిమితం చేయడం అంటే రుణగ్రహీతలు తమ బంగారం మార్కెట్ విలువలో 75% వరకు మాత్రమే రుణంగా పొందవచ్చు.బంగారు రుణాలకు నిజమైన, ధ్రువీకరించదగిన ఆస్తుల మద్దతు ఉందని నిర్ధారించడానికి కఠినమైన పూచీకత్తు అవసరం.రుణ మంజూరులో మరింత పారదర్శకత కోసం బ్యాంకులు, రుణ సంస్థలపై పర్యవేక్షణ పెంచడం.ప్రభుత్వ జోక్యంఅయితే, కొత్త నిబంధనలు చిన్న రుణగ్రహీతలను, ముఖ్యంగా వ్యవసాయ వర్గాలను దెబ్బతీస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది.కఠినమైన నిబంధనల నుంచి రూ.2 లక్షల లోపు రుణాలను మినహాయించడం ద్వారా చిన్న రుణగ్రహీతలకు సులభంగా రుణాలు అందుతాయి.కొత్త నిబంధనలకు సజావుగా మారడానికి బ్యాంకులు, రుణ సంస్థలకు తగినంత సమయం ఇవ్వడానికి వాటి అమలును 2026 జనవరి 1 వరకు వాయిదా వేయాలని ఆర్బీఐకి ఆర్థిక శాఖ సూచించింది. -
జియో 5 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్తో..
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్ దృష్ట్యా రిలయన్స్ జియో ఒక పెద్ద అడుగు వేసింది. కంపెనీ ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. వీటిలో ఉచితంగా జియోగేమ్స్ క్లౌడ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అంటే ఖరీదైన హార్డ్వేర్ లేకుండా యూజర్లు తమ మొబైల్, పీసీ, జియో సెట్-టాప్ బాక్స్లో కన్సోల్ లాంటి గేమ్స్ను ఆస్వాదించగలరు. ఈ ప్లాన్లు రూ.48 నుంచి ప్రారంభమవుతాయి.ఏమిటీ జియోగేమ్స్ క్లౌడ్?ఇది క్లౌడ్ ఆధారిత గేమింగ్ సర్వీస్. దీని ద్వారా యూజర్లు గేమ్ను డౌన్లోడ్ చేయకుండా నేరుగా ఆన్లైన్లో ఆడవచ్చు. సాధారణంగా దీని సబ్ స్క్రిప్షన్ రూ.398. కానీ కొత్త ప్లాన్లలో ఈ సదుపాయాన్ని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జియో ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రస్తుతం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్ పెయిడ్, బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఇది అందుబాటులో లేదు.జియో కొత్త గేమింగ్ ప్లాన్స్ ఇవే..రూ.48 ప్లాన్: ఇది గేమింగ్ ప్రయత్నించాలనుకునే స్వల్పకాలిక వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ప్లాన్. ఈ ప్లాన్ 10 ఎంబీ డేటా, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ ను 3 రోజుల పాటు అందిస్తుంది.రూ.98 ప్లాన్: ఈ ప్లాన్తో 7 రోజుల పాటు 10 ఎంబీ డేటా, గేమింగ్ యాక్సెస్ లభిస్తుంది. ఇది డేటా వోచర్, కాబట్టి దీనిని ఉపయోగించడానికి యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండటం అవసరం.రూ.298 ప్లాన్: జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ తో పాటు 3 జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. ఇది కూడా డేటా వోచర్. యాక్టివ్ ప్లాన్ తో మాత్రమే ఉపయోగించవచ్చు.రూ.495 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు అందిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్, జియోసినిమా (డిస్నీ+ హాట్స్టార్ మొబైల్), ఫ్యాన్కోడ్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.రూ.545 ప్లాన్: ఇది అత్యంత ప్రీమియం ప్లాన్. 2 జీబీ రోజువారీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత 5 జీ డేటా ఇందులో లభిస్తాయి. మిగతా ఫీచర్లన్నీ రూ.495 ప్లాన్ మాదిరిగానే ఉంటాయి. -
ఇదీ సంపాదనంటే.. 24 గంటల్లో రూ.13600 కోట్లు
ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. మార్కెట్లో ఒక్కో వస్తువు ఒక్కోసారి ట్రెండ్ అవుతుంది. అదే క్రమంలో ఇప్పుడు ఓ బొమ్మ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. స్టోర్లలో అల్లర్లకు కారణమైంది. సెలబ్రిటీల ఫేవరెట్ గా మారింది. దాని సృష్టికర్త సంపదను అమాంతం పెంచేసింది. ఎంతలా అంటే 24 గంటల్లో రూ.13,600 కోట్లకు పైగా సంపాదించేంతలా...చైనీస్ బొమ్మల కంపెనీ పాప్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ సీఈఓ వాంగ్ నింగ్ సంపద ఒక్క రోజులోనే 1.6 బిలియన్ డాలర్లు (రూ.13,600 కోట్లకు పైగా) పెరిగింది. ఆ సంస్థ సృష్టించిన ‘లబుబు’ (Labubu) బొమ్మలే ఇందుకు కారణం. విచిత్రమైన గ్రెమ్లిన్ ముఖంతో రూపొందించిన ఈ బుజ్జి బొమ్మల క్రేజ్ ప్రపంచాన్ని ఊపేసింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ గర్ల్ గ్రూప్ బ్లాక్పింక్ లీసా, రోస్, రిహన్నా, అనన్య పాండే వంటి చాలా మంది సెలబ్రిటీల దగ్గర ఈ లబుబు బొమ్మలు కనిపించాయి.టాప్ డౌన్లోడింగ్ యాప్లబుబు బొమ్మల క్రేజ్ ఎంతలా ఉందంటే.. ఈ బొమ్మల కోసం కస్టమర్లు గొడవపడటంతో పాప్ మార్ట్ యూకేలో ఇన్ స్టోర్ అమ్మకాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆన్లైన్లో ఈ బొమ్మలు విక్రయించే పాప్ మార్ట్ మొబైల్ యాప్ అమెరికాలో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న షాపింగ్ యాప్గా నిలిచింది, ఇది వాంగ్ నింగ్ నెట్వర్త్ను 18.7 బిలియన్ డాలర్లకు పెంచింది.లబుబు బొమ్మతో బ్లాక్పింక్ రోస్ఏప్రిల్ 2025 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, వాంగ్ నింగ్ అమెరికాలో తన కంపెనీకి పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా ఒక్క రోజులో 1.6 బిలియన్ డాలర్ల ధనవంతుడు అయ్యాడు. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, అమెరికన్లు లబుబు బొమ్మలను కొనడానికి గంటల తరబడి క్యూ కట్టారు. ఫోర్బ్స్ ప్రకారం వాంగ్ నింగ్ రియల్ టైమ్ నెట్వర్త్ 18.7 బిలియన్ డాలర్లుగా ఉంది. -
EPFO గుడ్న్యూస్.. ఇక అలాంటి రిజెక్షన్స్ ఉండవు
ఉద్యోగాలు మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బదిలీ ప్రక్రియలో తలెత్తుతున్న ఇబ్బందులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తొలగించింది. వివిధ సంస్థల్లో పనిచేసిన సందర్భంలో సర్వీస్ వ్యవధులు సరిపోలని కారణంగా పీఎఫ్ బదిలీ క్లెయిమ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీనిపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు కొత్త వివరణ ఇచ్చింది. ఇలాంటి సాంకేతికతల కారణంగా ఆలస్యాన్ని ఎదుర్కొన్న వేతన జీవులకు ఇది ఉపశమనం కలిగిస్తుంది.పీఎఫ్ బదిలీ క్లెయిమ్స్ ఎందుకు స్తంభిస్తున్నాయంటే..ఇటీవలి కొన్ని నెలలుగా అనేక ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలు (ఆర్పిఎఫ్ఓలు) పీఎఫ్ బదిలీ అభ్యర్థనలను తిరస్కరించడమో లేదా తిరిగి పంపడమో చేస్తున్నాయి. ఒక ఉద్యోగాన్ని అధికారికంగా విడిచిపెట్టడానికి ముందే కొత్త ఉద్యోగంలో చేరినవారి విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. రెండు సంస్థలలో ఏక కాలంలో పనిచేసినట్లు ఉండటంతో ప్రాసెసింగ్ ఆలస్యం అవుతోంది.👉 ఇది చదివారా? కొత్త ఈపీఎఫ్వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులుఈపీఎఫ్వో తాజా ఆదేశాలుపీఎఫ్ బదిలీ క్లెయిమ్ను పూర్తిగా తిరస్కరించడానికి సర్వీసు వ్యవధిని కారణాలుగా పరిగణించరాదని స్పష్టం చేస్తూ న్యూఢిల్లీలోని ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం మే 20న ఒక సర్క్యులర్ జారీ చేసింది. పెన్షన్ డివిజన్ గతంలో జారీ చేసిన సర్క్యులర్ను కూడా ఇందులో ప్రస్తావించింది. ఎక్కువ ఖాతా నంబర్లున్న సందర్భాల్లో ఈపీఎస్ ప్రయోజనాలను ఎలా నిర్వహించాలో ఆ సర్క్యులర్లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగి రికార్డులో సర్వీస్ ఓవర్ ల్యాప్ ఉన్నప్పటికీ పీఎఫ్ బదిలీ క్లెయిమ్లను ప్రాసెస్ చేయాలని అన్ని బదిలీ కార్యాలయాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. -
బాలీవుడ్ నటుడు సహా 58 మందిపై సెబీ బ్యాన్
షేర్ల కొనుగోలు విషయంలో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సహా మరికొంత మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చర్యలు చేపట్టింది. సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సిఫారసు చేస్తూ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో పాటు మరో 57 మంది వ్యక్తులు, సంస్థలను ఏడాది నుంచి ఐదేళ్ల వరకు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది.అర్షద్ వార్సీ, ఆయన భార్య మారియాకు చెరో రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించిన సెబీ సాధన బ్రాడ్ కాస్ట్ (ప్రస్తుతం క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్ లిమిటెడ్) ప్రమోటర్లతో సహా మరో 57 మంది వ్యక్తులు, సంస్థలపై సెబీ రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించింది. అంతేకాకుండా, రూ.58.01 కోట్ల అక్రమ లాభాలను దర్యాప్తు ముగిసినప్పటి నుంచి వాస్తవ చెల్లింపు తేదీ వరకు 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సెబీ ఈ సంస్థలను ఆదేశించింది.ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా అర్షద్ వార్సీ రూ.41.70 లక్షలు, ఆయన భార్య మారియా రూ.50.35 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు సెబీ పేర్కొంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక సూత్రధారులు గౌరవ్ గుప్తా, రాకేశ్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా అని సెబీ తుది ఉత్తర్వుల్లో గుర్తించింది. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఆర్టీఏ డైరెక్టర్గా ఉన్న సుభాష్ అగర్వాల్ మనీష్ మిశ్రా, ప్రమోటర్ల మధ్య జీవోగా వ్యవహరించారని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
మైక్రోసాఫ్ట్, యోటా జట్టు.. ఏఐ వినియోగానికి మరింత జోరు
న్యూఢిల్లీ: భారత్లో కృత్రిమ మేథని (ఏఐ) మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్, యోటా డేటా సర్వీసెస్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం యోటా ఏఐ క్లౌడ్ ప్లాట్ఫాం అయిన శక్తి క్లౌడ్లో మైక్రోసాఫ్ట్ తమ అజూర్ ఏఐ సర్వీసులను అందుబాటులోకి తెస్తుంది.దీంతో డెవలపర్లు, స్టార్టప్లు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండియాఏఐ మిషన్లో భాగమైన సంస్థలకు అధునాతన సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశీయంగా కృత్రిమ మేథ సామర్థ్యాలను పెంపొందించడం, నవకల్పనలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను పటిష్టపర్చడం ద్వారా ఇండియాఏఐ మిషన్ లక్ష్యాల సాధనకు కూడా మైక్రోసాఫ్ట్–యోటా భాగస్వామ్యం తోడ్పడనుంది.👉ఇదీ చదవండి: టీసీఎస్లో భారీగా ఏఐ ఏజెంట్లు..ఇండియాఏఐ మిషన్ అనేది దేశంలోని కృత్రిమ మేధ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ చొరవ. ఏఐ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం, స్వదేశీ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడం, పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సృష్టించడం ఈ మిషన్ లక్ష్యం. దేశీ ఏఐ మోడల్స్ను రూపొందించడానికి సంబంధించి 2025 మే నాటికి ఇండియాఏఐ మిషన్కు 500 పైగా ప్రతిపాదనలు వచ్చాయి. -
గోల్డ్ హాట్రిక్.. మరోసారి తగ్గిన బంగారం ధర..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుదల బాట పట్టిన పసిడి ధరలు నేడు (మే 29) వరుసగా మూడో రోజూ దిగివచ్చాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. మే 29 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? ఇలా అయితే బంగారం అందరూ కొనుక్కోవచ్చు..ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,190🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,100ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.100 తగ్గి రూ.1,10,900 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 క్షీణించి రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయ్..
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) గత ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి. 2024–25లో 13% వృద్ధితో 50 బిలియన్ డాలర్లు తరలివచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇవి 44.42 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం ఎఫ్డీఐలు(ఈక్విటీలు, రిఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, ఇతర మూలధనం) 14% పెరిగి 81.04 బిలియన్ డాలర్లుగా నిలిచాయి. గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికం. 2023–24లో ఇవి 71.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సమీక్షా కాలం(2024–25లో)లో సింగపూర్ నుంచి అత్యధిక (14.95 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో మారిషస్(8.34 బి. డాలర్లు), అమెరికా (5.45 బి. డాలర్లు), నెదర్లాండ్స్(4.62 బి.డాలర్లు), యూఏఈ(3.12 బి.డాలర్లు), జపాన్(2.47 బి.డాలర్లు), సైప్రస్(1.2 బి.డాలర్లు), యూకే(795 మిలియన్ డాలర్లు), జర్మనీ (469 మి.డాలర్లు), కైమన్ ఐస్లాండ్(371 మి.డాలర్లు) ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2023–24)తో నెదర్లాండ్స్, జపాన్, యూకే, జర్మన్ల నుంచి పెట్టుబడులు తగ్గాయి. రంగాల వారీగా చూస్తే... సర్వీసెస్, ఎగుమతి, టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్, నిర్మాణాభివృద్ధి, పునరుత్పాదక, రసాయన రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నిర్మాణ కార్యకలాపాలు, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో పెట్టుబడులు తగ్గాయి. 2024–25లో అత్యధికంగా మహారాష్ట్ర (19.6 బి.డాలర్లు) ఎఫ్డీఐ పొందింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (6.61 బి.డాలర్లు), న్యూఢిల్లీ (6 బి.డాలర్లు), గుజరాత్ (5.7 బి.డాలర్లు), తమిళనాడు (3.68 బి.డాలర్లు), హర్యానా (3.14 బి.డాలర్లు), తెలంగాణ (2.99 బి.డాలర్లు)లు ఉన్నాయి. కాగా గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 24.5 శాతం తగ్గి 9.34 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2023–24 ఏడాది ఇదే త్రైమాసికంలో భారత్లోకి 12.38 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. -
టీసీఎస్లో భారీగా ఏఐ ఏజెంట్లు.. ఉద్యోగులతో కలిసే..
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) ఏదో ఆషామాషీ టెక్నాలజీ కాదని, మానవ జాతి పురోగమనాన్ని మలుపు తిప్పే ఒక శక్తివంతమైన సాధనమని ఐటీ దిగ్గజం టీసీఎస్ బోర్డు, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అన్ని పరిశ్రమలకూ ఇది ప్రయోజనకరంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కలిసి పనిచేసే ఏఐ ఏజెంట్లను భారీ స్థాయిలో రూపొందిస్తామని చంద్రశేఖరన్ చెప్పారు.భవిష్యత్తులో ‘హ్యూమన్ ప్లస్ ఏఐ‘ మోడల్ కింద సర్వీసులు అందిస్తామని షేర్హోల్డర్లకు టీసీఎస్ మాతృ సంస్థ టాటా సన్స్కి కూడా చైర్మన్ అయిన చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే, ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు.హార్డ్వేర్ ప్రొవైడర్లు, సొల్యూషన్స్ ఆవిష్కర్తలు, స్టార్టప్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని వివరించారు. ఏఐ సాంకేతిక వినియోగంలో టీసీఎస్ ముందు వరుసలో ఉంటోందని, పలు సొల్యూషన్స్లో దీన్ని ఉపయోగిస్తోందని చంద్రశేఖరన్ తెలిపారు. ‘టీసీఎస్ విజ్డంనెక్ట్స్’ పేరిట కంపెనీల కోసం జెన్ ఏఐ ప్లాట్ఫాంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.👉 ఇది చదివారా? జాబ్ చేంజ్ అంటే ఇదీ.. రూ.5.5 లక్షల నుంచి రూ.45 లక్షల జీతానికి.. -
అమెరికా వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు
న్యూఢిల్లీ: అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం విజయవంతమైతే ప్రస్తుత అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని, ఎగుమతులు ఇతోధికం అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. భారత్పై విధించిన 26 శాతం అదనపు టారిఫ్లను 90 రోజుల పాటు (జూలై 8 వరకు) అమెరికా నిలిపివేయడం తెలిసిందే. దీంతో ఆలోపే అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు భారత్ విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తోంది. తద్వారా భారత ఎగుమతులపై టారిఫ్ల పూర్తి మినహాయింపు ప్రయోజనం పొందొచ్చని భావిస్తోంది.అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య పెట్టుబడులకు భారత్ ఎంతో విశ్వసనీయ, ఆశావహ కేంద్రంగా కొనసాగుతుందని ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. మధ్యకాలిక వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని మరింత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వస్తాయని అంచనా వేసింది. నైపుణ్యాలు, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు చేపడుతున్న విధానపరమైన చర్యలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ సంస్థల నివేదికలను ప్రస్తావించింది.ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ సహా పలు సంస్థలు 2025–26లో భారత వృద్ధి రేటు 6.2–6.7 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొనడం గమనార్హం. బలమైన దేశీ ఆర్థిక మూలాలు, మెరుగైన స్థూల ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ మూలధన వ్యయాల పెంపును ఈ నివేదిక ప్రస్తావించింది. దీంతో వెలుపలి షాక్లను ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడగలదని పేర్కొంది. వినియోగం దన్ను.. వినియోగం బలంగా ఉండడం, గ్రామీణ వినియోగం పుంజుకోవడం, సేవల ఎగుమతులు పటిష్టంగా ఉండడం దేశీ వృద్ధి చోదకాలుగా పనిచేస్తాయని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. వస్తు ఎగుమతుల్లో ఉన్న బలహీనతలను సేవల ఎగుమతులు భర్తీ చేస్తున్నట్టు వివరించింది. రూపాయి స్థిరంగా ఉండడంతోపాటు బలమైన విదేశీ మారకం నిల్వలు వెలుపలి షాక్లకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా గత బడ్జెట్లో ఆదాయపన్ను భారాన్ని తగ్గించడం, ద్రవ్య నియంత్రణ కోసం తీసుకున్న చర్యలు, ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు వినియోగాన్ని, పెట్టుబడులను పెంచుతాయని అంచనా వేసింది. దీంతో ఆర్థిక వృద్ధి మరింత పుంజుకుని 6.3–6.8 శాతం అంచనాల్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని తెలిపింది.ప్రైవేటు రంగం మూలధన వ్యయాలు ఒక్కటే పుంజుకోవాల్సి ఉన్నట్టు తెలిపింది. ఆహార ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉండొచ్చని అంచనా వేసింది. రబీ సాగు సానుకూలంగా ఉండడం, వేసవిలో పంటల సాగుతో రానున్న రోజుల్లో ఆహార వస్తువుల పరంగా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండొచ్చని వివరించింది. ఇక నైరుతిలో సాధరణం కంటే అధిక వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతోపాటు, చమురు ధరలు కనిష్టాల్లో ఉండడం ఆర్థిక వ్యవస్థకు అనుకూలిస్తాయని అభిప్రాయపడింది. -
సెబీ మాజీ చీఫ్ మాధవికి క్లీన్ చిట్
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ విషయంలో అనైతికంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బచ్కు లోక్పాల్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెపై ఆరోపణలన్నీ ఊహాగానాలు, అభిప్రాయాలతో కూడుకున్నవేనని వ్యాఖ్యానించింది.టీఎంసీ ఎంపీ మహువా మైత్రా సహా ఇతరుల ఫిర్యాదులన్నీ కూడా, అదానీ కంపెనీలను టార్గెట్ చేసుకుంటారని పేరొందిన ఓ షార్ట్సెల్లర్ నివేదిక ఆధారంగా చేసినవేనని పేర్కొంది. ఇవన్నీ నిరాధారమైనవేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఆదేశించడానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.వాటిపై సెబీ చైర్మన్ హోదాలో బచ్ విచారణ జరపాల్సినప్పటికీ.. అదానీ గ్రూప్ కుంభకోణంతో సంబంధమున్న ఆఫ్షోర్ ఫండ్స్లో గతంలో ఆమెకి, ఆమె భర్తకి వాటాలు ఉన్నందున సరైన చర్యలు తీసుకోలేదంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. ఈ ప్రాతిపదికన దాఖలైన ఫిర్యాదులను లోక్పాల్ తాజాగా కొట్టివేసింది. -
ఐటీసీలో రూ. 12,941 కోట్ల షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: మాతృ సంస్థ, బ్రిటిష్ దిగ్గజం బ్రిటిష్ అమెరికన్ టొబాకో(బీఏటీ) తాజాగా దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీలో మైనారిటీ వాటా విక్రయించింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో బ్లాక్డీల్స్ ద్వారా 2.5 శాతం వాటా అమ్మివేసింది. షేరుకి రూ. 413కుపైగా సగటు ధరలో 31.3 కోట్ల షేర్లను విక్రయించింది. వీటి విలువ రూ. 12,941 కోట్లు(1.51 బిలియన్ డాలర్లు)కాగా.. ఎన్ఎస్ఈలో మంగళవారం ధర రూ. 434తో పోలిస్తే 4.8 శాతం డిస్కౌంట్లో వాటాను ఆఫర్ చేసింది.కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ లావాదేవీకి ముందు కంపెనీలో బీఏటీ వాటా 25.44 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థల ద్వారా ప్రస్తుతం 22.94 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ఐటీసీలో 1900 సంవత్సరం ప్రారంభంలోనే బీఏటీ పెట్టుబడులకు తెరతీసింది.తద్వారా దీర్ఘకాలంగా రెండు దిగ్గజాలూ లబ్ధి పొందుతూ వస్తున్నాయి. అయితే 2024 మార్చిలోనూ ఐటీసీలో 3.5 శాతం వాటాను రూ. 17,485 కోట్లకు బీఏటీ విక్రయించడం గమనార్హం! బ్లాక్డీల్ నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో బుధవారం 3.2 శాతం క్షీణించి రూ. 420 వద్ద ముగిసింది. -
హీరో ఫిన్కార్ప్ ఐపీవోకు వచ్చేస్తోంది..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం హీరో ఫిన్కార్ప్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.వీటికి జతగా మరో రూ. 1,568 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 3,668 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. లిస్టింగ్కు వీలుగా 2024 ఆగస్ట్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ మూలధన అవసరాలకు ఎన్బీఎఫ్సీ హీరో ఫిన్కార్ప్ వినియోగించనుంది. తద్వారా రుణ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. 2024 మార్చికల్లా కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ. 51,281 కోట్లుగా నమోదయ్యాయి. -
జాబ్ చేంజ్ అంటే ఇదీ.. ఏకంగా రూ.45 లక్షల జీతానికి..
తరచూ ఉద్యోగాలు మారడం కార్పొరేట్ సంస్కృతిలో భాగంగా మారింది. ఎందుకంటే జాబ్ మారిన ప్రతీసారి జీతాలు, హోదాలు, ఇతర ప్రయోజనాలు పెరుగుతాయి. సాధారణంగా ఉద్యోగాలు మారడం ద్వారా సగటున 30–40 శాతం లేదా కొన్ని సందర్భాల్లో 100 శాతానికి పైగానే ఉద్యోగులు జీతాలను పెంచుకుంటున్నారు. కానీ ఒక్క స్విచ్లో ఏకంగా 700 శాతానికి పైగా జీతం పెరిగిందంటే నమ్ముతారా?మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఓ టెక్కీ విషయంలో ఇలాగే జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జాబ్ స్విచ్ స్టోరీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఒక ప్రముఖ టెక్ కంపెనీలో తన వార్షిక వేతనం రూ.5.5 లక్షల నుంచి కేవలం ఏడాదిలోనే రూ.45 లక్షలకు పెరిగిందని ఆ యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇటీవల తన కెరీర్ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో అతని పోస్ట్ త్వరగా దృష్టిని ఆకర్షించింది. విస్తృతమైన చర్చను రేకెత్తించింది.దేవేష్ అనే డెవలపర్ ఏడాది క్రితమే ఫుల్ టైమ్ కెరీర్ ప్రారంభించారు. మామూలు వేతనంతో ప్రారంభమైన ఆయన ఇప్పుడు తన ప్రారంభ వేతనానికి దాదాపు తొమ్మిది రెట్లు సంపాదిస్తూ ఒక అగ్రశ్రేణి గ్లోబల్ టెక్ కంపెనీలో స్థానం సంపాదించినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఇప్పుడిప్పుడే కెరీర్లో అడుగుపెడుతున్నవారికి కొన్ని సూచనలూ ఇచ్చారు. అధిక ప్రారంభ వేతనాల కంటే నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఆ తర్వాత భారీ వేతనాలను సాధించవచ్చని సూచించారు. -
విజయ్ మాల్యా ట్వీట్.. గట్టిగా తగులుకున్న నెటిజన్లు
బ్యాంకులకు రూ. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యాను తాజాగా సోషల్మీడియాలో యూజర్లు గట్టిగా తగులుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుపై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్కు విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు.ఆర్సీబీని ప్రశంసిస్తూ ‘ఎక్స్’(ట్విటర్)లో విజయ్ మాల్యా ఓ పోస్ట్ పెట్టాడు. అంతే దొరికాడురా అంటూ నెటిజన్లు గట్టిగా తగులుకున్నారు. ఆయన చేసిన పోస్టును ట్రోల్ చేస్తూ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు భారత్కు తిరిగి రావాలని కోరారు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఇండియా రావచ్చుగా.. అని ఒకరు ట్వీట్ చేయగా భారత్లో ప్లేఆఫ్స్ చూడటానికి రండి.. అంటూ మరొకరు ట్వీట్ చేశారు. 'కమ్ బ్యాక్ టు ఇండియా మ్యాన్'.. "ఎప్పుడు వస్తున్నావు?".. ఇలా మరికొందరు కామెంట్లు చేశారు.ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ గా పేరొందిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంతో దివాలా తీశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఎస్బీఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు రూ .9,000 కోట్లకు పైగా ఎగ్గొట్టి ఆర్థిక మోసం, మనీలాండరింగ్ ఆరోపణల మధ్య 2016లో దేశం నుండి పారిపోయాడు. ప్రస్తుతం యూకేలో ఉంటున్న మాల్యా.. దివాలా, భారత్ కు అప్పగింతపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. -
టిప్ తంటా.. క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు నోటీసులు
ముందస్తు టిప్ల పేరుతో వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్న క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. "అడ్వాన్స్ టిప్" డిమాండ్ చేస్తున్నందుకు ఓలా, ఉబెర్, రాపిడో సహా నాలుగు క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థలు అవలంబిస్తున్న అనైతిక కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషి ఇటీవల స్పందించారు.సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తొలుత మే 21న ఉబెర్పై ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించింది. ఆ తర్వాత మిగతా సంస్థలపైనా సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఓలా, రాపిడోలపై కూడా దర్యాప్తును విస్తరించింది. అయితే కొన్ని వర్గాలు నమ్మ యాత్రి యాప్ కూడా ఇలాంటి ఫీచర్ను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నాయి. కానీ ఇంతవరకు దానికి నోటీసు జారీ కాలేదు.మరోవైపు తమకు ఇంతవరకు ఎలాంటి ఫార్మల్ నోటీసు అందలేదని రాపిడో తెలిపింది. తాము ఆటోలు, క్యాబ్ల కోసం జీరో-కమిషన్ మోడల్ను అనుసరిస్తున్నామని, బైక్ రైడ్ల కోసం స్పష్టంగా అదనపు ఛార్జీలను వినియోగదారులకు ఎంపికగా అందిస్తున్నామని వివరించింది. ఈ సంస్థలు వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయా అని సీసీపీఏ పరిశీలిస్తోంది. నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ఉబెర్కు 15 రోజుల సమయం ఇచ్చింది.గతంలో కూడా ఓలా, ఉబెర్లు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ల ఆధారంగా ధరలలో వ్యత్యాసం చూపినందుకు దర్యాప్తును ఎదుర్కొన్నాయి. ఈ తాజా చర్య వినియోగదారుల హక్కులను కాపాడేందుకు కేంద్రం తీసుకుంటున్న కఠిన చర్యలను సూచిస్తుంది. రైడ్ను త్వరగా అందుకునేందుకు ఈ సంస్థలు వినియోగదారుల నుండి ముందస్తు టిప్లు చెల్లించమని కోరడం అనైతికమని, దోపిడీ స్వభావమని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి విమర్శించారు. టిప్ అనేది స్వచ్ఛందంగా, సేవ అనంతరం ఇవ్వాల్సినదిగా ఉండాలి కానీ, వేగవంతమైన రైడ్ల కోసం ముందస్తు షరతుగా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. -
మహిళలకు ఆర్థిక శక్తి.. ఎన్ఎస్ఈ, తెలంగాణ వి హబ్ ఒప్పందం
ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), తెలంగాణ ప్రభుత్వ చొరవ కార్యక్రమం వి హబ్ ఫౌండేషన్ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం, నిధుల సమీకరణలో మహిళా పారిశ్రామిక వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమక్షంలో హైదరాబాద్లో ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్, వి హబ్ ఫౌండేషన్ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. మధ్య జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వి హబ్ ఫౌండేషన్ తో కలిసి ఎన్ఎస్ఈ మదుపరుల అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళలలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది. మహిళల నేతృత్వంలోని పరిశ్రమలకు నిధుల సమీకరణ, లిస్టింగ్ ప్రక్రియలో మార్గనిర్దేశం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఎఫ్ఎస్ఐ రంగంలో స్టూడెంట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ను అమలు చేస్తుంది.2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు ఎన్ఎస్ఈ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 14 భాషలలో 14,679 మదుపరుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. వీటి ద్వారా 8 లక్షలకు పైగా పెట్టుబడి కార్యకలాపాల్లో పాల్గొనేవారు చేరారు. స్టూడెంట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కింద వివిధ రాష్ట్రాలలో 7500 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. అలాగే, వివిధ రంగాలకు చెందిన 615 కంపెనీలు ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయ్యాయి. సమిష్టిగా రూ. 17,083 కోట్లకుపైగా నిధులు సమీకరించాయి. ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 1,80,000 కోట్లు. -
అడ్రస్ ఆధార్.. ప్రభుత్వం కొత్త కసరత్తు!
దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన అధికారిక గుర్తింపు రుజువు కోసం తీసుకువచ్చిన ఆధార్ మాదిరిగానే ప్రతి చిరునామాకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీ ఉండే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా అందించడానికి సహాయపడుతుంది.దుర్వినియోగం కట్టడి..ప్రస్తుతం, చిరునామా డేటా నిర్వహణకు సంబంధించి దేశంలో ఎటువంటి ప్రామాణిక వ్యవస్థా లేదు. స్పష్టమైన నిబంధనలు లేని కారణంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండా వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు భౌతిక చిరునామాలనూ జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తద్వారా తమ చిరునామా వివరాల వినియోగానికి సంబంధించిన అధికారం స్పష్టమైన వినియోగదారు చేతుల్లో పెట్టడం ఈ కొత్త చొరవ లక్ష్యం.ఆర్థిక వ్యవస్థకూ నష్టం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, యాప్ ఆధారిత డెలివరీ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితమైన, ప్రామాణిక చిరునామాలకు డిమాండ్ పెరిగింది. అయితే దేశంలోని చాలా చిరునామాలు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉంటున్నాయి. కొన్ని సమీప ల్యాండ్ మార్క్ లపై ఆధారపడున్నాయి. ఈ స్పష్టత లేకపోవడం వల్ల తప్పుడు డెలివరీలు, లాజిస్టిక్ అసమర్థతల కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఏటా 10–14 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఇది దేశ జీడీపీలో సుమారు అరశాతం.👉ఇది చదివారా? ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందంటే..చిరునామాలను ఎలా రాయాలి.. నిల్వ చేయాలి... సురక్షితంగా యాక్సెస్ చేసుకోవాలో నిర్వచించడానికి ప్రతిపాదిత పరిష్కారం సమగ్ర 'డిజిటల్ అడ్రస్ సిస్టమ్'ను రూపొందించారు. ఒక వ్యక్తి చిరునామాను డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లలో వినియోగించాలంటే ఆ వ్యక్తి అనుమతి తప్పనిసరి. ఈ మేరకు ప్రైవసీ ప్రోటాకాల్స్ను ప్రవేశపెట్టనున్నారు.ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో తపాలా శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. ముసాయిదా పాలసీని త్వరలోనే ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థ తుదిరూపు దాల్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్వర్క్ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.డిజిపిన్.. స్మార్ట్ అడ్రస్ కోడ్ఈ వ్యవస్థలో గుండెకాయ లాంటిది డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్). కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేట్ల ఆధారంగా ప్రతి చిరునామాకు విశిష్టమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇస్తారు. పెద్ద ప్రాంతాలను కవర్ చేసే సాంప్రదాయ పిన్ కోడ్ల మాదిరిగా కాకుండా డిజిపిన్లు వ్యక్తిగత గృహాలు లేదా వ్యాపారా సంస్థలకు స్పష్టమైన కచ్చితత్వాన్ని అందిస్తాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక జనావాసాలు, సాంప్రదాయ చిరునామా వ్యవస్థలు లేని అడవులు, కొండలు వంటి భౌగోళిక సవాళ్లతో కూడిన ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. -
కొత్త ఈపీఎఫ్వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు
మే నెల ముగింపునకు వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో జూన్ నెల ప్రారంభం కాబోతోంది. దేశంలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇవి మీ పొదుపు, క్రెడిట్ కార్డు వాడకం, ప్రావిడెంట్ ఫండ్ రాబడిని ప్రభావితం చేస్తాయి. జూన్ 1 నుంచి ఏయే మార్పులు అమల్లోకి రానున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ఓ 3.0ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) జూన్ 1 నుంచి అప్గ్రేడ్ చేసిన నూతన ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థను ప్రారంభించనుంది. పీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేయడం, కేవైసీ అప్డేట్లను క్రమబద్ధీకరించడం, క్లెయిమ్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడం ఈ కొత్త విధానం లక్ష్యం. ఈపీఎఫ్ నిధులను సులభంగా, వేగంగా పొందేందుకు వీలుగా ఏటీఎం తరహా కార్డులను ప్రవేశపెట్టడం ఇందులో ప్రధాన ఆకర్షణ.క్రెడిట్ కార్డ్ రూల్స్🔸యాక్సిస్ బ్యాంక్ జూన్ 20 నుంచి క్రెడిట్ కార్డు లావాదేవీల వర్గీకరణలో సవరణలు చేయనుంది. రివార్డ్ పాయింట్లు, ఫీజు మినహాయింపులు ఏ లావాదేవీలకు వర్తిస్తాయో కొత్త అప్ డేట్ స్పష్టం చేస్తుంది.🔸కోటక్ మహీంద్రా బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్లు, ఫీజులలో జూన్ 1 నుండి మార్పులను అమలు చేస్తుంది. ఖర్చు కేటగిరీలలో సంపాదించిన రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులు రానున్నాయి. అలాగే కొన్ని క్రెడిట్ కార్డ్ ఫీజులు పెరుగుతాయి. ఇవి కార్డు రకాన్ని బట్టి మారుతాయి. సవరించిన బెనిఫిట్ లు, ఖర్చులకు అనుగుణంగా కార్డుదారులు తమ కార్డు వినియోగాన్ని మార్చుకోవాలి.ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల సవరణలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇప్పటికే తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను తగ్గించాయి. మరిన్ని బ్యాంకులు జూన్ 1 నుండి వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ప్రస్తుత రేట్లు 6.5 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉన్నందున, రేట్ల కోతకు ముందు అధిక రాబడిని పొందడానికి ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను ఇప్పుడే లాక్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.సెబీ మ్యూచువల్ ఫండ్ కటాఫ్ టైమింగ్ మార్పులుసెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జూన్ 1 నుండి ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ (ఎంఎఫ్ఓఎస్) కటాఫ్ సమయాలను సవరించనుంది. ఈ మార్పు క్లయింట్ ఫండ్స్ తాకట్టు ఆధారిత అప్ స్ట్రీమింగ్ను క్రమబద్ధీకరిస్తుంది. ఒక రోజులో మెచ్యూరిటీ అయ్యే రిస్క్ లేని ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఓవర్నైట్ ఫండ్లు సర్దుబాటు చేసిన రిడంప్షన్, లావాదేవీ సమయాలను కలిగి ఉంటాయి. ఇది నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఏవీ) లెక్కలను ప్రభావితం చేస్తుంది. -
పోర్ట్ ఆఫ్ రోటర్డామ్తో ఏఎం గ్రీన్ ఒప్పందం
హైదరాబాద్: భారత్, ఐరోపా మధ్య గ్రీన్ ఎనర్జీ సరఫరా గొలుసు నిర్మాణానికి హైదరాబాద్కు చెందిన గ్రీన్కో అనుబంధ సంస్థ ఏఎం గ్రీన్, పోర్ట్ ఆఫ్ రోటర్డామ్ అథారిటీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గ్రీన్ ఇంధనాల బంకరింగ్, సస్టైనబుల్ ఏవియేషన్ ఇంధనాల (SAF) సరఫరా, రోటర్డామ్లో టెర్మినల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.సంవత్సరానికి 10 లక్షల టన్నుల గ్రీన్ ఇంధనాల ఎగుమతి, సుమారు 1 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని సాధ్యం చేసే ఈ సహకారం, భారతదేశ నెట్ జీరో లక్ష్యాలు, ఐరోపా డీకార్బనైజేషన్ లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. ఏఎం గ్రీన్ 2030 నాటికి 50 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యం, 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. కాకినాడలో తొలి ఉత్పత్తి ప్రారంభమవుతుంది.రోటర్డామ్ పోర్ట్, ఐరోపాలో 13శాతం ఇంధన డిమాండ్ను నిర్వహిస్తూ, హైడ్రోజన్ హబ్గా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భాగస్వామ్యం గ్లోబల్ కార్బన్-రహిత శక్తి వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఏఎం గ్రీన్ వ్యవస్థాపకుడు అనిల్ చలమలసెట్టి, రోటర్డామ్ సీఈఓ బౌడెవిజన్ సీమన్స్ తెలిపారు. -
సైలెంట్గా రూ.6000 కోట్లు దానమిచ్చేసిన గూగుల్ కోఫౌండర్
ప్రపంచ కుబేరుల్లో దానశీలత పెరుగుతోంది. వివిధ సందర్భాల్లో విరాళాలు ఇస్తూ తమ వితరణ గుణం చాటుకుంటున్నారు కార్పొరేట్ సంపన్నులు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తాజాగా భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు. 700 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.6,000 కోట్ల విలువైన ఆల్ఫాబెట్ షేర్లను ఆయన విరాళంగా ఇచ్చినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక పేర్కొంది.దానమిచ్చింది వీటికే.. బ్లూమ్ బర్గ్ న్యూస్ కథనం ప్రకారం.. సెర్గీ బ్రిన్ తాజా విరాళంలో ఎక్కువ భాగం నాడీ సంబంధిత వ్యాధులు, వాతావరణ మార్పు పరిష్కారాలపై పరిశోధన నిమిత్తం కాటలిస్ట్4 సంస్థకు వెళ్లింది. ఈ లాభాపేక్షలేని సంస్థను స్వయంగా ఆయనే స్థాపించారు. 5.8 లక్షల ఆల్ఫాబెట్ షేర్లను బ్రిన్ తన కుటుంబ ఫౌండేషన్ కు కేటాయించగా మరో 2.82 లక్షల షేర్లను పార్కిన్సన్ వ్యాధి పరిశోధనలు చేసే మైఖేల్ జె ఫాక్స్ ఫౌండేషన్ కు ఇచ్చారు. బ్రిన్ మొత్తం 4.1 మిలియన్ ఆల్ఫాబెట్ షేర్లను విరాళంగా ఇచ్చినట్లు ఇదివరకే రెగ్యులేటరీ ఫైలింగ్స్ వెల్లడించాయి. అయితే గ్రహీతలు ఎవరన్నది అప్పుడు తెలియలేదు.👉 ఇది చదివారా? అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..గతంలోనూ.. సెర్గీ బ్రిన్ భారీ మొత్తంలో విరాళాలు అందించడం ఇదే మొదటిసారి కాదు. 2023లో గూగుల్ ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ లాంచ్ సందర్భంగా 600 మిలియన్ డాలర్లు, 2024లో మరో 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. బ్లూమ్ బర్గ్ డేటా ప్రకారం.. సెర్గీ బ్రిన్ 2004లో గూగుల్ ఐపీఓకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 11 బిలియన్ డాలర్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు.దానాలకు పోయినా అత్యంత ధనవంతుడే...బ్రిన్ 2019 లో ఆల్ఫాబెట్ అధ్యక్ష పదవి నుండి వైదొలిగినప్పటికీ, బోర్డులో మాత్రం కొనసాగుతున్నారు. రష్యాలో జన్మించిన బ్రిన్ ఆరేళ్ల వయసులోనే సెమెటిక్ వ్యతిరేక హింస నుంచి తప్పించుకునేందుకు అమెరికాకు వలస వచ్చారు. 1998లో స్టాన్ఫోర్డ్లో చదువుతున్నప్పుడు ల్యారీ పేజ్తో కలిసి గూగుల్ను స్థాపించారు. అలా ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒక్కరయ్యారు. భారీ స్థాయిలో విరాళాలు, వితరణలు పోయినా కూడా 51 ఏళ్ల బ్రిన్ సంపద 134 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.11.52 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 8వ స్థానంలో ఉన్నారు. -
గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఇప్పుడు...
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజుల క్రితం గణనీయంగా పెరిగిన పసిడి ధరలు నేడు (మే 26) కాస్త దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? ఇలా అయితే బంగారం అందరూ కొనుక్కోవచ్చు..చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,790🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,650ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి. వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు స్వల్ప పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.100 పెరిగి రూ.1,11,000 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 క్షీణించిపెరిగి రూ. 1,00,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
80సి డిడక్షన్లు.. ట్యూషన్ ఫీజు..
80సిలో 20 అంశాలు ఉన్నాయి. కొన్ని ఇన్వెస్ట్మెంట్లు, కొన్ని సేవింగ్స్, కొన్ని ఖర్చులు, కొన్ని ఆస్తుల కొనుగోలుకు సంబంధించినవి వీటిలో ఉన్నాయి. వీటిలో ట్యూషన్ ఫీజు విషయానికొస్తే .. ఇది చాలా పెద్ద ఖర్చు. ప్రతి సంవత్సరం తప్పనిసరి. చాలా మంది తమ పిల్లలను చదివిస్తున్నారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ఈ అంశాన్ని చేర్చారు. చదువుకు ప్రాముఖ్యత ఇచ్చే తల్లిదండ్రులు, అలాగే ఈపీఎఫ్, జీపీఎఫ్ కంపల్సరీ కాని వర్గాలు (వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, ఆర్టిస్టులు, కళాకారులు.. ఇలా సొంత కాళ్ల మీద నిలబడేవారికి) పిల్లల చదువు కోసం చేసే ఖర్చుతో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇద్దరు పిల్లల చదువు కోసం చెల్లించే ఫీజుకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ముగ్గురు లేదా నలుగురు పిల్లలున్న పక్షంలో ట్యాక్స్ ప్లానింగ్లో భాగంగా ఇద్దరి ఖర్చును తల్లిదండ్రుల్లో ఒకరు, మిగతా వారి ఖర్చును మరొకరు చూపించి, మినహాయింపును పొందవచ్చు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా లేక ఈపీఎఫ్ కంపల్సరీగా ఉండే ఉద్యోగం చేస్తున్నా .. ఈ అంశం వల్ల అదనంగా ప్రయోజనం ఉండకపోవచ్చు. తప్పనిసరిగా చెల్లించే ఈపీఎఫ్, జీపీఎఫ్ల మొత్తం ఒక్కొక్కరికి రూ. 1,50,000 దాటితే, స్కూల్ ఫీజుల మినహాయింపులపరంగా ఎటువంటి ప్రయోజనం దక్కదు. అయితే, స్థూలపరిమితి అయిన రూ. 1,50,000 నుంచి పీఎఫ్ నిమిత్తం వార్షికంగా పోతున్న మొత్తాన్ని తీసివేయగా, ఏదైనా మిగిలితే, దానికి స్కూల్ ఫీజు కింద మినహాయింపు పొందవచ్చు. ఈ కింది ఉదాహరణలు గమనించండి.. 🔸 రత్నాకర్, అతని భార్య.. ఇద్దరిదీ ప్రైవేట్ ప్రాక్టీసు. ఈపీఎఫ్, జీపీఎఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఇద్దరు పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తున్నారు. ఫీజులు భారీగానే కడతారు. ఇద్దరూ అస్సెస్సీలే. ఒకరి అసెస్మెంట్లో అబ్బాయి స్కూల్ ఫీజును, మరొకరి అసెస్మెంట్లో అమ్మాయి స్కూల్ ఫీజును చూపించి మినహాయింపు పొందుతారు. 🔸 విజయకిరణ్కి కన్సల్టెన్సీ సంస్థ ఉంది. భార్య సింధు వ్యాపారం చేస్తుంది. ఒక్కడే కొడుకు. స్కూల్ ఫీజు భారీగానే ఉంటుంది. భార్యకి సంబంధించిన ఇన్కం ట్యాక్స్ అసెస్మెంట్లో కొడుకు స్కూల్ ఫీజును క్లెయిమ్ చేశారు. విజయకిరణ్ కూడా తన ఇన్కం ట్యాక్స్ అసెస్మెంట్లో కొడుకు స్కూల్ ఫీజును క్లెయిమ్ చేస్తాడు. చట్టంలో స్పష్టత లేనందున ఇద్దరూ ఒకే సంతానం మీద చెల్లించే స్కూల్ ఫీజుకి మినహాయింపు పొందుతున్నారు. 🔸 కుటుంబరావుగారు, ఆయన భార్య సంతానానికి గంపెడు పిల్లలేమీ లేరు. కానీ రెండు సార్లు కవలలు కా>వడంతో.. మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన లంకంత ఇల్లు ఉంది. ఇద్దరూ లాయర్లుగా బాగా సంపాదిస్తున్నారు. భర్త తన అసెస్మెంట్లో ఇద్దరు పిల్లల ఫీజులను, భార్య తన అసెస్మెంట్లో మిగతా ఇద్దరి పిల్లల ఫీజులను క్లెయిమ్ చేస్తారు. 🔸 అనంత మూర్తి, భార్య శారద.. ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే. ఒక్కర్తే ఆడపిల్ల. ఒకరి అసెస్మెంట్లో పిల్ల స్కూల్ ఫీజును క్లెయిమ్ చేస్తారు. మరొకరు కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉన్నా.. అలా చేయకుండా.. ఈపీఎఫ్, వీపీఎఫ్లో జమ చేస్తారు. 🔸 గురునాధ్, సావిత్రికి ముగ్గురు పిల్లలు. గురునాధ్ ఇద్దరు పిల్లల చదువుల ఫీజులను క్లెయిమ్ చేస్తారు. సావిత్రి బొటిక్ నడిపిస్తుంది. తన అసెస్మెంట్లో మూడో సంతానం చదువులకయ్యే ఫీజులను క్లెయిమ్ చేస్తోంది. పాత కాలంలోలాగా గంపెడు పిల్లలు ఉంటే ఏం చేయలేం కానీ.. నలుగురి వరకు స్కూల్ ఫీజులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీజుల మీద మినహాయింపు వస్తుంది. డొనేషన్లు, క్యాపిటేషన్, డెవలప్మెంట్ నిమిత్తం ఇస్తే ఎలాంటి మినహాయింపు రాదు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. మీకు ఏది సూట్ అవుతుంది. ఏది అనుకూలంగా ఉంటుందో అది చేయండి. ఏదైనా చట్టానికి లోబడి చేయాలి సుమా!! పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
బ్యాంకు డిపాజిట్లకు మరింత భద్రత.. త్వరలో బీమా పరిమితి పెంపు!
బ్యాంకుల్లో డబ్బులు పెడితే భద్రంగా ఉంటాయనేది చాలా మంది విశ్వాసం. ఎందుకంటే వీటికి బీమా రక్షణ ఉంటుంది. ప్రస్తుతం రూ.5లక్షల వరకూ డిపాజిట్లపై ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. డిపాజిటర్లలో విశ్వాసాన్ని మరింత పెంచేందుకు బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన బీమా పరిమితిని ప్రస్తుత రూ.5 లక్షల నుండి మరింత పెంచే దిశగా చర్చలు జరుపుతోంది. రాబోయే ఆరు నెలల్లో ఈ పెంపు అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖలోని ఒక సీనియర్ అధికారిని ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్ట్ పత్రిక పేర్కొంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) ప్రస్తుతం ఒక డిపాజిటర్కు ఒక బ్యాంకులో గల సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ బీమా సౌకర్యం వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార బ్యాంకులకు కూడా వర్తిస్తుంది.ఇటీవల న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకు వంటి కొన్ని బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో, డిపాజిటర్లలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి ఈ బీమా పరిమితిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త బీమా పరిమితి రూ.8 లక్షల నుండి రూ.12 లక్షల వరకు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు.ఈ బీమా పరిమితి పెంపు వల్ల బ్యాంకులు డీఐసీజీసీకి చెల్లించే ప్రీమియం ఖర్చులు పెరగనున్నాయి. దీని వల్ల బ్యాంకుల లాభదాయకతపై ఏటా రూ.1,800 కోట్ల నుండి రూ.12,000 కోట్ల వరకు ప్రభావం పడవచ్చని, ఫలితంగా రిటర్న్ ఆన్ అసెట్స్ (ROA), రిటర్న్ ఆన్ ఈక్విటీ (ROE) తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ నిర్ణయాన్ని డిపాజిటర్లకు మరింత ఆర్థిక భద్రతను అందించడంతో పాటు, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. అయితే, ఈ పెంపును అమలు చేయడానికి ముందు బ్యాంకుల ఆర్థిక స్థితిపై దాని ప్రభావాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
కొత్త క్రెడిట్ కార్డు.. యూపీఐ పేమెంట్లపై క్యాష్బ్యాక్
ముంబై: యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ గ్రూప్నకు చెందిన క్రెడిట్ ఫస్ట్ యూపీఐ ప్లాట్ఫామ్ ‘సూపర్.మనీ’ భాగస్వామ్యంతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. ‘యాక్సిస్ బ్యాంక్ సూపర్.మనీ రూపే క్రెడిట్ కార్డ్’ అన్నది రూపే నెట్వర్క్పై పనిచేస్తుంది. యూపీఐ చెల్లింపులకు, పీవోఎస్ టెర్మినళ్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఏటీఎంలలో దీన్ని వినియోగించుకోవచ్చని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. కార్డు దారులు సూపర్.మనీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని.. దీని సాయంతో స్కాన్ చేసి చెల్లింపులు చేస్తే 3 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఇతర విభాగాల్లో ఈ కార్డుతో చేసే వ్యయాలపై ఒక శాతం క్యాష్ బ్యాంక్ లభిస్తుంది. ఎలాంటి వార్షిక ఫీజులు లేకుండా జీవితకాలం ఉచిత సదుపాయంతో ఈ కార్డు లభిస్తుందని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. -
ఇన్వెస్ట్మెంట్ కోసం ఇల్లు కొనడం మంచి నిర్ణయమేనా?
అంతర్గతంగా విలువ దాగి ఉన్న స్టాక్స్ను గుర్తించడం ఎలా? – కపిల్ శర్మవాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్ను గుర్తించం అన్నది ఒక కళ. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో గుర్తించి, ఆ మేరకు చెల్లించేందుకు ముందుకు రావడం. ఇక్కడ ఎన్నో అంశాలు లెక్కించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అనే అంశాన్ని కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మెరుగ్గా వినియోగిస్తున్నార? ప్రమోటర్లు విశ్వసనీయత కలిగిన వారేనా? ఆయా రంగంలో కంపెనీకి వృద్ధికి అవకాశం ఉందా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, ఎంపిక చేసుకున్న మెరుగైన కంపెనీల గురించి వచ్చే ప్రతికూల వ్యాఖ్యానాలను విశ్లేషించుకునే సామర్థ్యం.. తటస్థ వైఖరి కావాలి. నేను పెట్టుబడి దృష్ట్యా ఇంటిని కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. ఇది మెరుగైన ఎంపికేనా? – శివమ్ ఇల్లు అన్నది కేవలం నివాసం కోసమే. రాబడి దృష్ట్యా కాకుండా దీర్ఘకాలంలో భూముల ధరలు పెరుగుతాయన్న అంచనాలతో చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఒక కుటుంబ నివాస అవసరాలకే ఇల్లు. దీన్ని పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అదే పెట్టుబడి కోణం నుంచి చూస్తే రియల్ ఎస్టేట్కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అధిక మొత్తంలో పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో సవాళ్లూ ఉంటాయి. ప్రాపర్టీని అద్దెకు ఇస్తే కిరాయిదారు రూపంలో ఆదాయం వస్తుంది. అలా చూస్తే చాలా మందికి ఇల్లు మంచి పెట్టుబడిగా కనిపిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. 20 ఏళ్లు గడిచిన తర్వాత పాతదిగా మారడంతో అద్దెకు డిమాండ్ తగ్గుతుంది. అప్పటి వరకు వసూలు చేసినంత అధిక అద్దెకు కిరాయిదారులు ముందుకు రాకపోవచ్చు. మెరుగైన అద్దెతో అధునికమైన, కొత్త ఇంటికి వారు మొగ్గు చూపించొచ్చు. ప్రాపర్టీ విలువ పెరిగినా, అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.సమాధానాలు: ధీరేంద్రకుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
స్థిరమైన ఆదాయం కోసం కొత్త ఫండ్
ముంబై: యూనియన్ మ్యూచువల్ ఫండ్ ‘యూనియన్ ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్వోఎఫ్’ను ప్రవేశపెట్టింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్). వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో పన్ను ప్రయోజనకరమైన ఆదాయాన్నిచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది.జూన్ 5 వరకు పెట్టుబడులకు ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) అందుబాటులో ఉంటుంది. ఆర్బిట్రేజ్, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో ఆదాయాన్నిచ్చే లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తుంది.రెండేళ్లకు మించి పెట్టుబడులు కలిగి ఉన్న వారికి ఈక్విటీ ఆధారిత పన్ను ప్రయోజనాలు వర్తించేలా ఈ పథకం ఆర్బిట్రేజ్ పెట్టుబడుల విధానాన్ని అనుసరిస్తుంది. సంపద సృష్టించడమే కాకుండా దాన్ని కాపాడుకోవడం అన్నది అస్సెట్ అలోకేషన్కు కీలకంగా యూనియన్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. -
ఇలా అయితే బంగారం అందరూ కొనుక్కోవచ్చు..!
బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. నెల రోజుల క్రితం అయితే ఏకంగా రూ.లక్షను దాటేసింది. ఆ తర్వాత కాస్త తగ్గినా ఇప్పటికీ రూ.లక్షకు చేరువలోనే ఉంది. దీంతో బంగారం కొనుక్కోవాలని ఆశ ఉన్నప్పటికీ సామాన్యులు మనం కొనలేములే అని ఆగిపోతున్నారు.సాధారణంగా బంగారం అంటే ఆభరణాల రూపంలోనే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అసలే పెరిగిపోయిన ధరకు తోడు ఆభరణాలకు విధించే తరుగు, తయారీ చార్జీలతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది. దీంతో కాస్తంత బంగారం కొనాలన్నా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే దీనికో పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు.అధిక బంగారం ధర ద్రవ్యోల్బణం వంటిది. డబ్బులు అవే కానీ వాటికి వచ్చే వస్తు ప్రతిఫలం తగ్గిపోతుంది. 2020లో మీ దగ్గర రూ.50,000 ఉంటే పది గ్రాముల బంగారాన్ని కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు 5 గ్రాములు మాత్రమే వస్తుంది. బంగారం కొనడం అనేది ఒక్కసారి చేసే వ్యాయామం కాదు. ఆర్థిక ప్రణాళికలో భాగంగా కాలక్రమేణా దానిని కూడబెట్టుకుంటూ ఉండాలి.అయితే బంగారాన్ని ఎందుకు కొనాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. అంటే పెట్టుబడి ప్రయోజనాల కోసమా లేదా నగల కోసమా లేకుంటే వివాహ నిమిత్తమా అన్నది ఎరుక ఉండాలి. బంగారాన్ని ఆభరణాల రూపంలో కొంటే 5 నుండి 20 శాతం 'మేకింగ్ ఛార్జీలు' ఉంటాయి. అదే నాణేల రూపంలో కొంటే ఈ అనవసరమైన భారం ఉండదు.బంగారు నాణేలు కొంటే ప్రయోజనాలు🔸బంగారు నాణేలు ధ్రువీకరించిన స్వచ్ఛతతో వస్తాయి. సాధారణంగా ఇవి 24 కేరట్లు (99.99 శాతం స్వచ్ఛత)లలో లభిస్తాయి.🔸కావాల్సినప్పుడు అమ్మి నగదుగా మార్చుకోవచ్చు. వీటిని సులువుగా విక్రయించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వీటిని తీసుకుంటారు.🔸బంగారం ఆభరణాలతో పోలిస్తే వీటిని భద్రపరచుకోవడం సులువు.🔸బంగారు నాణేలు ధ్రువీకరణతో రావడం వల్ల స్వచ్ఛత, బరువుకు సంబంధించి ఎలాంటి భయం ఉండదు.🔸ఆర్థిక అనిశ్చితి సమయాలలో బంగారం విలువకు ఢోకా ఉండదు.🔸బంగారు నాణేలు అర గ్రాము నుంచి 100 గ్రాముల వరకు వివిధ బరువుల్లో లభిస్తాయి. కాబట్టి స్తోమతను బట్టీ ఎవరి ఎంత కావాలో అంత కొనుక్కోవచ్చు.🔸నగల దుకాణాలు, ప్రభుత్వ సంస్థల నుంచి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. -
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
జీవితం అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు.. ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి నిచ్చెనెక్కించి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఊహించని విధంగా కిందకు పడేస్తుంది. ఉన్నత స్థాయికి చేరి ఉత్తమ జీవనం గడుపుతున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అందుకే అన్నింటికీ సిద్ధమై ఉండాలి. ఏది ఎదురైనా ఆనందంగా స్వీకరించాలి.. సంతోషంగా ఆస్వాదించాలి.. ఈ ఫుడ్ డెలివరీ ఉద్యోగి జీవితం చెబుతున్న పాఠం ఇదే..ఒక ఫుడ్ డెలివరీ రైడర్ తనకు ఆహారం మాత్రమే కాదు.. జీవిత పాఠాన్ని అందించారంటూ ఆయన స్ఫూర్తిదాయకమైన కథను ఫేస్బుక్లో షేర్ చేశారు పుణెకు చెందిన శ్రీపాల్ గాంధీ. ఈ జీవితగాథ సోషల్ మీడియాలో నెటిజనులను హత్తుకుంటోంది. ప్రశంసలు వెల్లువను అందుకుంటోంది. ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఆహారం తెప్పించుకుంటుంటారు. ఏదైనా మిస్ అయినా, పొరపాటు జరిగినా ఆ తెచ్చిన వ్యక్తి మీద అరుస్తుంటారు. కానీ శ్రీపాల్ గాంధీ డెలివరీ రైడర్ను మెల్లగా కదిలించి అతని జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.శ్రీపాల్ గాంధీ సబ్వే నుండి లంచ్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ డెలివరీ రైడర్ ఆహారాన్ని తీసుకొచ్చాడు. కానీ పాకెట్ చూడగానే అందులో శాండ్విచ్ మాత్రమే ఉందని, మిగిలిన పదార్థాలు మిస్ అయ్యాయని శ్రీపాల్ గుర్తించి డెలివరీ రైడర్కు చెప్పారు. కాసేపు కంగారు పడిన డెలివరీ రైడర్ "రెస్టారెంట్ లేదా జొమాటోకు కాల్ చేయండి సార్" అంటూ వినయంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీపాల్ సబ్వే వారిని సంప్రదించగా క్షమాపణలు చెప్పి 'రైడర్ ను వెనక్కి పంపగలరా?' మిస్ అయిన వాటిని తిరిగిపంపుతాం.. అతనికి రూ.20 చెల్లిస్తాం' అని బదులిచ్చారు.ఎంత వినయం?ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ జొమాటో ఆదేశిస్తే తప్ప డెలివరీ భాగస్వాములు రెస్టారెంట్కు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమ రైడర్లకు చెల్లించేది జొమాటో. రెస్టారెంట్ కాదు. అయినా ఈ డెలివరీ ఏజెంట్ ఏమాత్రం వెనుకాడలేదు. "సార్, అది నా బాధ్యత. కస్టమర్ సంతోషమే తాను కోరుకుంటాను" అంటూ మళ్లీ రెస్టారెంట్కు వెళ్లి మిస్ అయిన వాటిని తిరిగి తీసుకొచ్చాడు. సబ్వే వాళ్ల నుంచి రూ.20 పరిహారాన్ని కూడా ఆయన తీసుకోలేదు. "దేవుడు నాకు ఎ౦తో ఇచ్చాడు. ఒకరు చేసిన పొరపాటుకు నేను ఈ డబ్బు ఎందుకు తీసుకోవాలి? అంటూ అతను శ్రీపాల్ను ఆశ్చర్యానికి గురిచేసింది.జీవిత గమనాన్ని మార్చిన కారు ప్రమాదంరైడర్ తన గతం గురించి శ్రీపాల్ గాంధీ వద్ద ఓపెన్ అయ్యాడు. షాపూర్జీ పల్లోంజీలో కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తూ నెలకు రూ.1.25 లక్షల జీతం అందుకునేవారు. కానీ ఒక కారు ప్రమాదం అతని జీవిత గమనాన్ని మార్చేసింది. ఎడమ చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. తన ఉద్యోగాన్ని, స్థిరత్వాన్ని, కొంతకాలానికి ఆశను కోల్పోయాడు. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అతనికి తోడ్పాడు అందించింది. ఫుడ్ డెలివరీ పార్ట్నర్గా అవకాశమిచ్చింది.తన కుమార్తె ఇప్పుడు దంతవైద్యం చదువుతోందని శ్రీపాల్తో ఫుడ్ డెలివరీ రైడర్ అన్నారు. కేవలం ఆదాయం కోసమే కాకుండా తన కలను సజీవంగా ఉంచుకోవడానికి ఆయన రైడ్ చేస్తున్నారని శ్రీపాల్ గాంధీ తన పోస్ట్లో పేర్కొన్నారు. "అతను జీవితాన్ని నిందించలేదు. ఫిర్యాదులు చేయలేదు. సాకులు చెప్పలేదు" అని రాసుకొచ్చారు. స్వామి సమర్థ్ను విశ్వసించే అతను 'దేవుడు నాతో ఉన్నాడు. నేనెందుకు కంగారు పడాలి?" అని నవ్వుతూ అన్నాడని శ్రీపాల్ వివరించారు."ఈ రోజు నాకు శాండ్ విచ్ వచ్చింది. కానీ కృతజ్ఞత, స్థిరత్వం, ఆశావాదం నా దగ్గరే నిలిచిపోయాయి" అంటూ తన పోస్ట్ ను ముగించారు. అతనికి ఉపాధి కల్పించిన జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ వైరల్గా మారి నెటిజనుల ప్రశంసలు అందుకుంది. అలాంటి వారికి సెల్యూట్.. వావ్, అద్భుతం.. నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు పెట్టారు. -
హోండా నుంచి రెండు కొత్త బైకులు
గురుగ్రాం: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన ప్రీమియం పోర్ట్ఫోలియోలో సీబీ750 హార్నెట్, సీబీ1000 హార్నెట్ ఎస్పీ పేర్లతో రెండు మోటార్స్సైకిళ్లను విడుదల చేసింది. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ.8,59,500లు, రూ.12,35,900గా ఉన్నాయి. ఈ రెండు మోడళ్లకు బుకింగ్లు ప్రారంభమయ్యాయి.హోండా సీబీ750 హార్నెట్755సీసీ, సీబీ1000 హార్నెట్ ఎస్పీ 999సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్లు కలిగి ఉన్నాయి. ఈ బైకుల్లో 6–స్పీడ్ గేర్బాక్స్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి. డ్యూయల్ చానల్ ఏబీఎస్ ఫీచర్ ఉంది. అయిదు అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ –బై –టర్న్ నావిగేషన్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ (హోండా రోడ్సింక్), యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.రెండు బైకుల్లో స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, యూజర్ అనే నాలుగు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్తో 3 స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. సీబీ750 హార్నెట్ బిగ్వింగ్ టాప్లైన్, బిగ్వింగ్ డీలర్షిప్లో అందుబాటులో ఉంచగా, సీబీ 1000 హార్నెట్ ఎస్పీ మాత్రం ప్రత్యేకంగా బిగ్వింగ్ టాప్లైన్ డీలర్íÙప్ల ద్వారా మాత్రమే విక్రయిస్తుంది. -
ఎల్ఐసీ గిన్నిస్ బుక్ రికార్డు..
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అరుదైన ఘనత సాధించింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో జీవిత బీమా పాలసీలను విక్రయించినందుకు గిన్నిస్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.‘‘ఈ ఏడాది జనవరి 20న మొత్తం 4,52,839 మంది ఏజెంట్లు 5,88,107 జీవిత బీమా పాలసీలను జారీ చేశారు. తద్వారా గిన్నిస్ రికార్డు సొంతమైంది. ఇది చరిత్రాత్మక విజయం. అంకితభావం గల ఏజెన్సీ నెట్వర్క్ అసాధారణ పనితీరును గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించింది’’ అని వివరించింది.జనవరి 20న ’మ్యాడ్ మిలియన్ డే’ సందర్భంగా ఒక్కో ఏజెంట్ కనీసం ఒక్క పాలసీ అయినా జారీ చేయాలని ఎల్ఐసీ ఎండీ, సీఈఓ సిద్దార్థ మొహంతి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకే గిన్నిస్ఫీట్ను ఎల్ఐసీ సొంతం చేసుకుంది. అరుదైన మైలురాయిని సాధించడం పట్ల కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు మొహంతి కృతజ్ఞతలు తెలిపారు. -
ఓలా రోడ్స్టర్ ఎక్స్ బైక్ల డెలివరీలు ప్రారంభం
ముంబై: తొలి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 ఆఫర్తో రోడ్స్టర్ ఎక్స్ పోర్ట్ఫోలియో మోటార్ సైకిళ్ల డెలివరీలను ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ‘‘మోటార్ సైకిల్ విభాగంలోకి ప్రవేశించే క్రమంలో ‘రోడ్స్టర్ ఎక్స్’ అనేది ఒక సాహసోపేతమైన ముందడుగు. ఈ డెలివరీతో ద్విచక్రవాహన కేటగిరిలో ఈవీ సామర్థ్యం అన్లాక్ అవుతుంది. ఈవీల వినియోగం, మరింత పుంజుకుంటుంది’’ అని ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ ఎండీ భవీష్ అగర్వాల్ తెలిపారు.ఓలా కంపెనీ రోడ్స్టర్ ఎక్స్ సిరీస్లో మోటార్సైకిల్స్ను 2.5కేడబ్ల్యూహెచ్, 3.5కేడబ్ల్యూహెచ్, 4.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్లలో అందిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ.99,999, రూ.1,09,999, రూ.1,24,999గా ఉన్నాయి. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్లో సిరీస్లో 4.5కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.1,29,999, మరో వేరియంట్ 9.1కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ మోటార్ సైకిల్ ధర రూ.1,99,999గా ఉన్నాయి. -
చిన్న కార్లు.. ప్రీమియం ఫీచర్లు
న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా తగ్గుతున్న చిన్న కార్ల అమ్మకాలను మళ్లీ పెంచుకునేందుకు వాహనాల కంపెనీలు కొత్త వ్యూహాలను ఎంచుకుంటున్నాయి. ప్రీమియం ఫీచర్లను పొందుపరుస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొదటిసారిగా కారు కొనుగోలు చేస్తున్న వారు బేసిక్ వేరియంట్ కన్నా కాస్తంత ఎక్కువ ఫీచర్లుండే వాహనాలను ఎంచుకుంటున్న నేపథ్యంలో కొత్త మోడల్స్ను ప్రవేశపెడుతూ మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.పదేళ్ల క్రితం మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా దాదాపు 50 శాతం వరకు ఉండేది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో ఇది 22 శాతానికి పడిపోయింది. ఈ సెగ్మెంట్లో అంతర్గతంగా చూస్తే ఎంట్రీ స్థాయి హ్యాచ్బ్యాక్లపై ప్రతికూల ప్రభావం అత్యధికంగా ఉంది. నియంత్రణలపరంగా వివిధ నిబంధనలను అమలు చేయాల్సి వస్తుండటంతో వీటి ధరలు భారీగా పెరిగిపోవడమే ఇందుకు కొంత కారణంగా నిలుస్తోంది. కఠినతరమైన ఉద్గారాల నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించాల్సి రావడంతో గత కొన్నేళ్లలో చిన్న కార్ల ధరలు దాదాపు రూ. 90,000 వరకు పెరిగాయి. ఇక, కాస్తంత ఎక్కువ వెచ్చించగలిగే స్థోమత ఉన్న వాళ్లు మరింత ప్రీమియంగా అనిపించే, మరిన్ని ఫీచర్లు ఉండే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలో రూ. 4.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఖరీదు చేసే ఎంట్రీ స్థాయి హ్యాచ్బ్యాక్ల అమ్మకాల వాటా 10 శాతం లోపునకు క్షీణించగా ప్రీమియం హ్యాచ్బ్యాక్ల వాటా 32 శాతానికి పెరిగినట్లు పరిశ్రమ వర్గాల తెలిపాయి. రూ. 7.5 లక్షల నుంచి రూ. 13.5 లక్షల వరకు ఖరీదు చేసే ప్రీమియం హ్యాచ్బ్యాక్లు దేశీయంగా ఏటా 3,00,000–3,50,000 వరకు అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా 20–22 శాతం నుంచి పెద్దగా పెరగకపోయినా .. ప్రీమియం మోడల్స్కి డిమాండ్ నెలకొనడంతో మార్కెట్ పరిధి పెరిగి, వాల్యూమ్స్ సైతం పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కొత్త ఉత్పత్తుల రాకతో ఈసారి ప్రీమియం హ్యాచ్బ్యాక్ల అమ్మకాలు మరికాస్త మెరుగుపడొచ్చని వివరించాయి. వడ్డీ రేట్ల కోతలతో దన్ను .. ఆదాయ పన్ను శ్లాబ్లలో మార్పులు, వడ్డీ రేట్ల తగ్గింపు తదితర పరిణామాలనేవి ప్రజలు వినియోగంపై మరికాస్త ఎక్కువ వెచ్చించేందుకు దోహదపడే అవకాశం ఉంది. అయితే, వారు దేనిపై వెచ్చిస్తారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ, ఆ తర్వాత రోజుల్లోనూ ఒక్కసారిగా వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరిగింది. అది ప్రస్తుతం కాస్త తగ్గింది. ఇప్పుడు కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు వెళ్లడంలాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర దిగ్గజాలు అంచనా వేస్తున్నట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్ వృద్ధి 1–2 శాతానికే పరిమితం కాకుండా 5 శాతం మేర నమోదయ్యే అవకాశం ఉందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడమనేది పొదుపునకు కాస్త దారి తీసినా .. ప్రస్తుతం రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల చిన్న కార్ల అమ్మకాలకు పెద్దగా తోడ్పడకపోవచ్చని భార్గవ చెప్పారు. అఫోర్డబిలిటీ సమస్య.. కార్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడమనేది చిన్న కార్ల అమ్మకాలకు సవాలుగా మారుతోందంటూ మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది మొత్తం ఆటో మార్కెట్పై ప్రభావం చూపుతోందని చెప్పారు. ‘రూ. 10 లక్షల కారు కొనాలంటే కుటుంబ వార్షికాదాయం రూ. 12 లక్షల పైగా ఉంటే తప్ప కొనే పరిస్థితి లేదు. దేశంలో ఆ స్థాయి ఆదాయాలు ఉండే వాళ్లు సుమారు 12 శాతం ఉండొచ్చు. మిగతా 88 శాతం మంది వార్షికాదాయం చాలా తక్కువే ఉంటోంది. ఇలాంటప్పుడు కార్ల మార్కెట్ అధిక వృద్ధి సాధించడం సవాలుగా ఉంటోంది‘ అని ఆయన పేర్కొన్నారు.అఫోర్డబిలిటీ సమస్య కారణంగా 66 శాతం మంది వినియోగదారులకు కార్ల కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారని వివరించారు. చిన్న కార్లు పుంజుకుంటే తప్ప దేశీ పరిశ్రమ వృద్ధి ఒక మోస్తరు వృద్ధితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని భార్గవ తెలిపారు. దేశీయంగా 20 కోట్లకు పైగా కుటుంబాల వార్షికాదాయం రూ. 5,00,000 లోపే ఉంటోందంటూ ఇటీవల ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలు భార్గవ అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి. -
ఇంటికి ఫైర్ ప్రూఫ్ ఉండాల్సిందే..
నివాసం, వాణిజ్యం, కార్యాలయం.. నిర్మాణం ఏదైనా సరే అగ్ని ప్రమాద నివారణ ఉపకరణాలు తప్పనిసరి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జరిగే ప్రమాదం వెలకట్టలేనిది. ఆస్తి, ప్రాణ నష్టాన్ని భర్తీ చేయలేనిది. అందుకే ప్రతీ భవనంలోనూ ఫైర్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వాటిని నిర్వహణ చేయాలి లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు అవి పనిచేయవు. ఈమధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, సిలిండర్ పేలుళ్లు.. ఇలా కారణాలనేకం.🔸 హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యా, వైద్య సదుపాయాలు, కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక వసతులు ఇలా రకరకాల కారణాలతో నగరంలో జనాభా, వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నివాస, వాణిజ్య భవనాలలో అగ్ని ప్రమాద భద్రతా నిబంధనలు, ఉత్పత్తులు మనశ్శాంతి ఇవ్వడమే కాకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. చిన్న మంట ఒక గదిని దహించేందుకు సగటున మూడు నిమిషాల సమయం పడుతుంది. అందుకే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేగవంతమైన ప్రతిస్పందన అత్యవసరం. ప్రతిస్పందనలో సెకన్ల సమయం ఆలస్యమైనా.. విపత్తు తీవ్రత పెరుగుతుంది. – సాక్షి, సిటీబ్యూరోఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి..? అపార్ట్మెంట్లు: 🔸 ప్రతీ ఫ్లాట్ లోపల స్మోక్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలి. 🔸 మంటలను ఆర్పే పరికరం, యంత్రం ఉండాలి. ముఖ్యంగా వంట గదిలో తప్పనిసరి. 🔸 మంటలను నియంత్రించే తలుపులు, కిటికీలు ఉండాలి. కనీసం 30–60 నిమిషాల పాటుతట్టుకునే శక్తి ఉండాలి.లిఫ్ట్: 🔸 లిఫ్ట్ డోర్లకు అగ్నిని తట్టుకునే శక్తి ఉండాలి. 🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలలో ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బందిని నియమించుకోవాలి. 🔸 లిఫ్ట్ ముందు భాగంలో ‘అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్ను వినియోగించరాదు’, ‘మెట్ల మార్గం’.. తదితరాలను సూచించే సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి.బేస్మెంట్, పార్కింగ్ ఏరియా 🔸 ఆటోమెటిక్ స్ప్రింక్లర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 🔸 పొగను గుర్తించే పరికరాలు, అలారం ఉండాలి. 🔸 పార్కింగ్, ప్రధాన భవనం మధ్య భాగంలో మంటలను నియంత్రించే తలుపులను ఏర్పాటు చేయాలి. 🔸 ఇంధనం, రంగులు, వార్నిష్ వంటి మండే గుణం ఉన్న వస్తువులను భద్ర పర్చకూడదు. 🔸 అగ్ని ప్రమాదం జరిగే తప్పించుకునే సైన్ బోర్డులు, లైటింగ్లను ఏర్పాటు చేయాలి. కారిడార్లు, కామన్ ఏరియాలు: 🔸 ప్రతీ 30 మీటర్ల దూరంలో ఒక మాన్యువల్ కాల్ పాయింట్ల (ఎంసీపీ) ను ఏర్పాటు చేయాలి. 🔸 కారిడార్లలో 2 గంటల పాటు మంటలను తట్టుకునే గుణం ఉన్న గోడలు, తలుపులను ఏర్పాటు చేయాలి. 🔸 ఫైర్ అలారం స్పీకర్లు, అత్యవసర లైట్లు, మెరిసే ఎగ్జిట్ గుర్తులను పెట్టాలి. అసెంబ్లీ ఏరియా 🔸 ఓపెన్ స్పేస్, గ్రౌండ్ ఫ్లోర్లో సురక్షితమైన అసెంబ్లీ జోన్లను గుర్తించాలి. 🔸 లిఫ్ట్, మెట్ల దగ్గర అగ్నిమాపక సంకేతాలు, గుర్తులను ఏర్పాటు చేయాలి. 🔸 బేస్మెంట్, లిఫ్ట్ లాబీలలో పొగ తొలగింపు వ్యవస్థను పెట్టాలి. 🔸 సహజ, యాంత్రిక వెంటలేషన్ తప్పనిసరి. అగ్నిమాపక మౌలిక సదుపాయాలు 🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనంలో ప్రతీ అంతస్తులోనూ నీటిని సరఫరాను అందించే పైప్లు, హోస్ రీల్ ఉండాల్సిందే. 🔸 ఫైర్ హైడ్రంట్ సిస్టమ్ ఉండాలి. 🔸 అండర్గ్రౌండ్, ఓవర్హెడ్ ఫైర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లను ఏర్పాటు చేయాలి. 🔸 డీజిల్ లేదా ఎలక్ట్రిక్తో నడిచే ఫైర్ పంప్ రూమ్ తప్పనిసరి.రూఫ్, టెర్రర్.. 🔸 అగ్నిమాపక సిబ్బంది వెళ్లేందుకు వీలుగా ఉండాలి. 🔸 మంటలను ఆర్పేందుకు ప్రత్యేకంగా వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తప్పనిసరి. 🔸 హైరైజ్ భవనాలతో ప్రతీ 24 మీటర్ల దూరంలో అత్యవసర సమయంలో ఆశ్రయం పొందేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. మెట్లు..🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు రెండు మెట్ల మార్గాలు తప్పనిసరి. 🔸 అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు ప్రత్యేకంగా మెట్ల మార్గం ఉండాలి. 🔸 మెట్ల మార్గంలోని తలుపులు కనిష్టంగా 1–2 గంటల పాటు మంటలను నియంత్రించే గుణం ఉన్న వాటినే ఏర్పాటు చేయాలి. 🔸 పొగ ప్రవేశించకుండా నిరోధించే మెట్లను నిర్మించుకోవాలి. చేయాల్సినవి.. 🔸 తప్పించుకునే మార్గాలు, మెట్ల మార్గాలు, అగ్ని ప్రమాద హెచ్చరికలు, సూచికలను గుర్తించుకోవాలి. 🔸 ఇంట్లో లేనప్పుడు విద్యుత్ మెయిన్స్ను ఆపివేయాలి. 🔸 ఇంట్లో అగ్ని మాపక యంత్రం ఉంచుకోవాలి. 🔸 ఇసుకతో నిండిన అగ్నిమాపక బకెట్ను ఏర్పాటు చేసుకోవాలి.చేయకూడనివి🔸 అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫర్నీచర్ వెనుక లేదా టాయిలెట్లతో దాక్కోకూడదు. 🔸 ఐఎస్ఐ ప్రమాణాలు ఉన్న ఉత్పత్తులను మాత్రమే వాడాలి. 🔸 అనధికారి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దు. మీటర్ను ఓవర్లోడ్ చేయకూడదు. 🔸 ప్రమాదకర పదార్థాలు, ఉత్పత్తులను నిల్వ చేయకూడదు. 🔸 ఫైర్ ఎగ్జిట్ పాయింట్లకు అడ్డంగా ఏమీ పెట్టరాదు. 🔸 విద్యుత్ వ్యవస్థల మరమ్మతులు, నిర్వహణ తప్పనిసరి. -
ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..
దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్. జారీ చేసినప్పటి నుంచి వీటిని ఇంత వరకూ అప్డేట్ చేసుకోనివారు వెంటనే చేసుకోవాలి. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)అవకాశం కల్పించింది. ఇందుకోసం గతేడాది గడువును విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ 14 వరకు గడువు విధించారు. ఆ తర్వాత రూ .50 రుసుమును చెల్లించి ఆధార్ కేంద్రాల వద్ద అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి గుర్తింపు రుజువు (పీఓఐ), చిరునామా రుజువు (పీఓఏ) అప్డేట్ చేసుకోవాలి. రెగ్యులర్ అప్డేట్లు ఆధార్ లోని సమాచారం, ప్రస్తుత డాక్యుమెంటేషన్కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి.ఆధార్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పొందేటప్పుడు, బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు లేదా ఇతర అవసరమైన కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసేటప్పుడు సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా ఆధార్ సమాచారాన్ని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవడం వల్ల డెమోగ్రాఫిక్ డేటాబేస్లో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అధికారులకు వీలవుతుంది. తద్వారా దుర్వినియోగాలు, మోసాలు నివారించడంతోపాటు ప్రజా సేవల్లో జాప్యాలు, తిరస్కరణలను తగ్గించడానికి ఆస్కారం కలుగుతుంది.ఆన్లైన్లో ఏమేమి అప్డేట్ చేయవచ్చు?ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని యూఐడీఏఐ అందిస్తున్నప్పటికీ, ఆధార్లోని కొన్ని రకాల వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. యూఐడీఏఐ ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అనుమతిస్తోంది. అవి ఏమిటంటే..🔹పేరు (చిన్న మార్పులు చేసుకోవచ్చు)🔹పుట్టిన తేదీ (కొన్ని పరిమితులున్నాయి)🔹చిరునామా🔹జెండర్🔹భాష ప్రాధాన్యతలుబయోమెట్రిక్ సమాచారం మారదుఆన్లైన్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారం అప్డేట్ చేసేందుకు వీలులేదు. ఫోటో, వేలిముద్రలు, ఐరిస్ (కనుపాప) స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే, భౌతికంగా ఆధార్ నమోదు కేంద్రంలో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే బయోమెట్రిక్ వివరాలను ధ్రువీకరించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అవసరమైన పరికరాలు కేంద్రాల వద్ద మాత్రమే ఉన్నాయి.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఇలా..👉అధికారిక పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ను సందర్శించండి.👉"లాగిన్" బటన్ పై క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.👉రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయడానికి దానిని నమోదు చేయండి.👉లాగిన్ అయిన తర్వాత పేజీ పై కుడివైపున ఉన్న 'డాక్యుమెంట్ అప్డేట్'పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ప్రస్తుత గుర్తింపు రుజువు, చిరునామా రుజువును ధ్రువీకరించి అప్డేట్ చేస్తారు.👉డ్రాప్డౌన్ మెనూ నుంచి తగిన డాక్యుమెంట్ రకాలను ఎంచుకుని స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఫైళ్లు JPEG, PNG లేదా PDF ఫార్మాట్ లో, 2MB కంటే తక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోండి.👉వివరాలన్నీ సరిచూసుకుని డాక్యుమెంట్ లను సబ్మిట్ చేయండి. తర్వాత మీకొక సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు (SRN) వస్తుంది. దీనితో అప్డేట్ స్థితిని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..
‘కొనేటప్పుడు తక్కువకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువకు పోవాలి’ అని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే రాబడి ఎక్కువగా ఉన్న చోట కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్సే ఎక్కువ రాబడి వస్తుందని ఓ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి ఏటా స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తుందని పేర్కొంది. - సాక్షి, సిటీబ్యూరోస్థలాల కొరతే కారణం.. పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని ఓ సంస్థ సీఈఓ తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం,అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని ఓ సంస్థ రీసెర్చ్ హెడ్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసిక కాలంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ. 2018–21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్ చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్బల్లాపూర్, హోస్కేట్, కొంబల్గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 🔸2018–21 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్ప్రెస్వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
IPO: కొత్త షేర్లు.. కొనుక్కుంటారా?
న్యూఢిల్లీ: స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్స్, పైపుల తయారీ కంపెనీ స్కోడా ట్యూబ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 130–140 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 27న షేర్లను విక్రయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 220 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 220 కోట్లు అందుకోనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 100 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.ఇష్యూ నిధులను సీమ్లెస్, వెల్డెడ్ ట్యూబ్స్, పైప్స్ ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. అంతేకాకుండా వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను కేటాయించనుంది. ధరల శ్రేణి ప్రకారం కంపెనీ విలువను రూ. 840 కోట్లుగా బ్రోకరేజీలు అంచనా వేశాయి. ఈపీసీ, ఇండస్ట్రియల్ కంపెనీలకు ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, విద్యుత్ తదితర రంగాలలో వీటిని వినియోగిస్తారు.27 నుంచి బ్లూ వాటర్ లాజిస్టిక్స్ ఐపీవో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ బ్లూ వాటర్ లాజిస్టిక్స్ ప్రతిపాదిత ఐపీవో మే 27న ప్రారంభమై 29న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు మే 26 బిడ్డింగ్ తేదీగా ఉంటుంది.పబ్లిక్ ఇష్యూ కోసం ఒక్కో షేరు ధర శ్రేణి 132–135గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా రూ. 40.50 కోట్లు సమీకరించనున్న బ్లూ వాటర్ సంస్థ ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫాంలో లిస్ట్ కానుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వాహనాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించుకోనుంది. -
విస్తరణపై హైదరాబాద్ కంపెనీ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ (ఎస్జీఎల్టీఎల్) సామర్థ్యాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఉత్పత్తి సామర్థ్యాల పెంపుపై వచ్చే 2–3 ఏళ్లలో రూ. 130 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం 60 టన్నుల క్రేన్, 60 మి.మీ. మందం ఫ్యాబ్రికేషన్ సామర్థ్యం ఉండగా .. 100 టన్నుల క్రేన్, 100 మి.మీ. మందం ఫ్యాబ్రికేషన్ స్థాయికి పెంచుకోనున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే ప్రస్తుతమున్న 5 వెల్డింగ్ రోబోల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకోనున్నట్లు పేర్కొంది. తద్వారా అంతర్జాతీయంగా హెవీ ఇంజినీరింగ్ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోనున్నట్లు వివరించింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 3 శాతం పెరిగి రూ. 16 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 171 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని కీలకాంశాల్లోనూ రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు కంపెనీ ఎండీ నాగేశ్వరరావు కందుల తెలిపారు. జీఎల్ హక్కా జపాన్, ఐపీపీ యూఎస్ఏతో భాగస్వామ్యాలు, పటిష్టమైన ఆర్డర్ బుక్, కొత్త ప్రొడక్ట్ లైన్స్తో ఈసారి మరింత మెరుగ్గా రాణించగలమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు 1% క్షీణించి రూ. 169 వద్ద క్లోజయ్యింది. -
అశోక్ లేలాండ్ బోనస్ షేర్లు
ముంబై: వాణిజ్య వాహన రంగ దిగ్గజం అశోక్ లేలాండ్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 33 శాతంపైగా జంప్చేసి రూ. 1,246 కోట్లను తాకింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 934 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 13,542 కోట్ల నుంచి రూ. 14,696 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 12,037 కోట్ల నుంచి రూ. 13,097 కోట్లకు పెరిగాయి. ఈ నెల(మే) 22న చెల్లించిన(రెండో) రూ. 4.25 డివిడెండ్ను తుది డివిడెండ్గా ప్రకటించింది. మరోవైపు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. దీంతో ప్రతీ షేరుకి మరో షేరుని ఉచితంగా జారీ చేయనుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం రూ. 2,696 కోట్ల నుంచి రూ. 3,383 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 45,703 కోట్ల నుంచి రూ. 48,535 కోట్లకు ఎగసింది. వెరసి క్యూ4తోపాటు పూర్తి ఏడాదిలో రికార్డ్ ఆదాయం సాధించినట్లు కంపెనీ చైర్మన్ ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. గతేడాది మొత్తం వాణిజ్య వాహన విక్రయాలు 1,95,093 యూనిట్లను తాకాయి. కంపెనీ ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో షేను అగర్వాల్ పేర్కొన్నారు. 2025 మార్చికల్లా రూ. 4,242 కోట్ల నగదు నిల్వలున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.4 శాతం బలపడి రూ. 240 వద్ద ముగిసింది. -
చమురుకు మరింత డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా చమురు వినియోగం వచ్చే దశాబ్ద కాలం పాటు గణనీయంగా పెరగనుంది. వార్షికంగా 4 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. ఎస్అండ్పీ గ్లోబల్లో భాగమైన ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఈ మేరకు అంచనాలు వెలువరించింది. దీని ప్రకారం 2025లో ఇప్పటివరకు ఆయిల్ వినియోగం రోజుకు 4.8 మిలియన్ బ్యారెళ్లుగా (ఎంబీపీడీ) ఉంది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.3 శాతం పెరిగింది.చమురు ఎగుమతి దేశాల నుంచి సరఫరా పెరగడం, అంతర్జాతీయంగా డిమాండ్ కాస్త మందగించడం వంటి అంశాల కారణంగా ఈ ఏడాది చమురు రేట్లు కొంత నెమ్మదించినట్లు సంస్థ హెడ్ ఆఫ్ ఇండియా కంటెంట్ (క్రాస్ కమోడిటీస్) పులకిత్ అగర్వాల్ తెలిపారు. మెరుగైన ఆర్థిక వృద్ధి వంటి సానుకూలాంశాలతో భారత్లో ఆయిల్కు డిమాండ్ పెరుగుతోందన్నారు. అంతర్జాతీయంగా భారత్కి మరింత ప్రాధాన్యం లభిస్తోందని వివరించారు. రష్యా నుంచి వరుసగా నాలుగో ఏడాది కూడా నిరాటంకంగా సరఫరా కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు కొనుగోళ్లకు మనకు మరిన్ని వనరులు అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. పర్యావరణహిత ఇంధనాల వ్యయాలు తగ్గాలి.. పర్యావరణహిత ఇంధనాల వ్యయాలు ఎంత తక్కువగా ఉంటే అంత వేగంగా వాటి వైపు మళ్లడం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరి జోహర్ చెప్పారు. ఈ విషయంలో వివిధ టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వ విధానాలు, నియంత్రణ సంస్థల నిబంధనలు, కార్పొరేట్ల చొరవ మొదలైన అంశాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే, హరిత ఇంధనాల వైపు మళ్లినంత మాత్రాన పాత ఇంధనాల వినియోగం పూర్తిగా నిల్చిపోతుందనడానికి లేదని తెలిపారు. బొగ్గు నుంచి చమురుకు మారినప్పటికీ ప్రపంచంలో బొగ్గు వినియోగం ఆగిపోలేదన్నారు. వాస్తవానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత పెరిగిందని గౌరి తెలిపారు. మరోవైపు, టారిఫ్లపై ఆందోళనలతో దేశీ మార్కెట్లలో నిల్వలు పెరగడం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోవడం వంటి అంశాలపై ఆందోళన నెలకొన్నప్పటికీ 2025–26లో జీడీపీ వృద్ధికి మించి పెట్రోకెమికల్స్కు డిమాండ్ ఉంటుందని అసోసియేట్ డైరెక్టర్ స్తుతి చావ్లా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెమ్మదిస్తుండటం, టారిఫ్లపై అనిశ్చితి, మార్జిన్లు తగ్గడం, ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగిపోవడంలాంటి అంశాలతో సతమతమవుతున్న అంతర్జాతీయ పెట్రోకెమికల్ ఉత్పత్తిదారులు భారత్పై ఆశలు పెట్టున్నట్లు తెలిపారు. -
బంగారానికి కావాలా లాకర్? టాప్ బ్యాంకుల్లో చార్జీలివే..
బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారమే రూ.లక్ష వరకూ పలుకుతోంది. బంగారం సాధారణంగా చాలా మంది దగ్గర ఆభరణాల రూపంలోనే ఉంటుంది. వీటిని ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో తప్ప మిగిలిన సమయాల్లో పెద్దగా ధరించరు. ఈ నగలను ఇంట్లోని బీరువాల్లోనే భద్రపరుచుకుంటుంటారు. అయితే విలువైన బంగారు ఆభరణాలను ఇలా ఇంట్లో పెట్టుకుంటే వల్ల చోరీకి గురవుతాయేమోనన్న ఆందోళన చాలా మందిలో ఉంటుంది. అందుకే అనేక బ్యాంకులు బంగారంతోపాటు విలువైన డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు సేఫ్ డిపాజిట్ లాకర్ల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.ఈ సేఫ్ డిపాజిట్ లాకర్లలో బంగారం, డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు బ్యాంకులు కొంత చార్జీలను వసూలు చేస్తాయి. లాకర్ పరిమాణం, బ్రాంచ్ లొకేషన్ (గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ లేదా మెట్రో), బ్యాంక్ అంతర్గత విధానాల ఆధారంగా ఈ లాకర్లకు అద్దె ఛార్జీలు మారవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని నాలుగు టాప్ బ్యాంకులలో సేఫ్ డిపాజిట్ లాకర్ల చార్జీలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాకర్ పరిమాణం, స్థానాన్ని బట్టి మారుతూ ఉండే అంచెల ధరల నిర్మాణాన్ని అందిస్తుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు వర్తిస్తుంది. ఇది చిన్న, మధ్యతరహా లాకర్లకు రూ .500, పెద్ద, ఎక్స్ట్రా లార్జ్ లాకర్లకు రూ .1,000. వీటికి జీఎస్టీ అదనం.వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా):చిన్న లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.1,000 అర్బన్/ మెట్రో: రూ.1,500మీడియం లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.2,000 అర్బన్/ మెట్రో: రూ.3,000పెద్ద లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.5,000అర్బన్/ మెట్రో: రూ.6,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.7,000 అర్బన్/ మెట్రో: రూ.9,000పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సేఫ్ లాకర్ల కోసం అందుబాటు చార్జీలను వసూలు చేస్తోంది. కొన్ని నిర్దిష్ట మెట్రో శాఖలలో 25% ప్రీమియం వర్తిస్తుంది. కస్టమర్లు సంవత్సరానికి 12 సార్లు ఉచితంగా తమ లాకర్ను సందర్శించవచ్చు. ఆ తర్వాత ప్రతి అదనపు సందర్శనకు రూ .100 వసూలు చేస్తారు.వార్షిక ఛార్జీలు ఇలా.. (జీఎస్టీ కాకుండా)చిన్న లాకర్లు: రూరల్: రూ.1,000 సెమీ అర్బన్/ అర్బన్: రూ.1,250 అర్బన్/ మెట్రో: రూ.2,000మీడియం లాకర్లు: గ్రామీణం: రూ.2,200 సెమీ అర్బన్/ అర్బన్: రూ.2,500 అర్బన్/ మెట్రో: రూ.3,500పెద్ద లాకర్లు: రూరల్, సెమీ అర్బన్: రూ.3,000 అర్బన్/ మెట్రో: రూ.5,500ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: రూరల్, సెమీ అర్బన్: రూ.6,000 అర్బన్/ మెట్రో: రూ.8,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: అన్ని ప్రాంతాల్లో: రూ.10,000ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): చిన్న లాకర్లు: గ్రామీణం: రూ.1,200 సెమీ అర్బన్: రూ.2,000 అర్బన్: రూ.3,000 మెట్రో: రూ.3,500 మెట్రో+: రూ.4,000మీడియం లాకర్లు: గ్రామీణం: రూ.2,500 సెమీ అర్బన్: రూ.5,000 అర్బన్: రూ.6,000 మెట్రో: రూ.7,500 మెట్రో+: రూ.9,000పెద్ద లాకర్లు: గ్రామీణం: రూ.4,000 సెమీ అర్బన్: రూ.7,000 అర్బన్: రూ.10,000 మెట్రో: రూ.13,000 మెట్రో+: రూ.15,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: గ్రామీణం: రూ.10 వేలు సెమీ అర్బన్: రూ.15,000 అర్బన్: రూ.16,000 మెట్రో: రూ.20,000 మెట్రో+: రూ.22,000హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): ఎక్స్ట్రా స్మాల్ లాకర్లు: మెట్రో: రూ.1,350 పట్టణ: రూ.1,100 సెమీ అర్బన్: రూ.1,100 గ్రామీణం: రూ.550చిన్న లాకర్లు: మెట్రో: రూ.2,200 పట్టణ: రూ.1,650 సెమీ అర్బన్: రూ.1,200 గ్రామీణం: రూ.850మీడియం లాకర్లు: మెట్రో: రూ.4,000 అర్బన్: రూ.3,000 సెమీ అర్బన్: రూ.1,550 గ్రామీణం: రూ.1,250ఎక్స్ట్రా మీడియం లాకర్లు: మెట్రో: రూ.4,400 పట్టణ: రూ.3,300 సెమీ అర్బన్: రూ.1,750 రూరల్: రూ.1,500పెద్ద లాకర్లు: మెట్రో: రూ.10,000 అర్బన్: రూ.7,000 సెమీ అర్బన్: రూ.4,000 గ్రామీణం: రూ.3,300ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: మెట్రో: రూ.20,000 పట్టణ: రూ.15 వేలు సెమీ అర్బన్: రూ.11,000 గ్రామీణం: రూ.9,000🔶 లాకర్ సదుపాయాన్ని ఎంచుకునేటప్పుడు ధర మాత్రమే ముఖ్యం కాదు. లభ్యత, ఎంత దగ్గరలో ఉంది, లాకర్ పరిమాణం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. ముందస్తు సరెండర్ పాలసీలు లేదా రిజిస్ట్రేషన్ ఫీజులు వంటివి ఏవైనా అదనపు నిబంధనలు ఉన్నాయేమో చూసుకోవాలి. -
ఇవిగో కొత్త ఐపీవోలు.. కొనుక్కుంటారా షేర్లు?
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ కంపెనీ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 413–435 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. లీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బ్రాండుతో కంపెనీ ఆతిథ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2025 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 3,900 కోట్లుగా నమోదైంది. లీలా బ్రాండ్ సంస్థ 12 హోటళ్ల ద్వారా మొత్తం 3,382 గదుల పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. ఏజిస్ వొప్యాక్లాజిస్టిక్స్ రంగ సంస్థ ఏజిస్ వొప్యాక్ టెర్మినల్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 223–235 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. ప్రయివేట్ రంగ దిగ్గజం ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఇది. ఇష్యూలో భాగంగా రూ. 2,800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.తొలుత రూ. 3,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసినప్పటికీ రూ. 2,800 కోట్లకు కుదించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 63 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 2,016 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 671 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనుంది. ఈ నిధులతో మంగళూరులో క్రియోజెనిక్ ఎల్పీజీ టెర్మినల్ను కొనుగోలు చేయనుంది.కాగా.. కంపెనీ విలువను రూ. 26,000 కోట్లుగా బ్రోకరేజీలు మదింపు చేశాయి. 2024 జూన్కల్లా కంపెనీ రుణ భారం రూ. 2,584 కోట్లుగా నమోదైంది. కంపెనీ దేశవ్యాప్తంగా పెట్రోలియం, లూబ్రికెంట్స్, కెమికల్స్, ఎల్పీజీ, ప్రొపేన్ తదితర లిక్విడ్స్, గ్యాస్ సంబంధ స్టోరేజీ సౌకర్యాలను కలిగి ఉంది. కీలక పోర్టులకు సమీపంలో టెర్మినళ్లను ఏర్పాటు చేసింది.షిప్రాకెట్ ఐపీవో బాట Shiprocket IPO: ఈకామర్స్ సంస్థలకు సర్వీసులందించే షిప్రాకెట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా ప్రాస్పెక్టస్ వివరాలను తొలి దశలో రహస్యంగా ఉంచేందుకు వీలుంటుంది.కాగా.. టెమాసెక్, జొమాటో తదితర దిగ్గజాలకు పెట్టుబడులున్న కంపెనీ ఐపీవో ద్వారా రూ. 2,000–2,500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇష్యూ నిధులను ప్రొడక్ట్ డెవలప్మెంట్, వ్యూహాత్మక కొనుగోళ్లు, లాజిస్టిక్స్తోపాటు, వేర్హౌసింగ్ ఇన్ఫ్రా విస్తరణ తదితరాలకు వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాఆలు పేర్కొన్నాయి. -
పాదరసంలా పసిడి ధరలు! తులం ఇప్పుడు..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) పాదరసంలా కదులుతున్నాయి. క్రితం రోజున సర్రున ఎగిసిన పసిడి ధరలు నేడు (మే 22) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు మరింత భారం తప్పదు. మే 22 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.👉ఇది చదివారా? ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,060🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి. వెండి ధరలూ..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.1000 పెరిగి రూ.1,12,000 వద్దకు చేరింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.1000 ఎగిసి రూ. 1,01,000 లను తాకింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఫ్లైట్ జర్నీ.. 1.43 కోట్ల మంది విమానమెక్కారు
న్యూఢిల్లీ: దేశీయంగా ఏప్రిల్లో 1.43 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1.32 కోట్లతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 8.45 శాతం పెరిగింది. మార్కెట్ వాటాపరంగా చూస్తే 64.1 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఎయిరిండియా గ్రూప్ (27.2 శాతం), ఆకాశ ఎయిర్ (5 శాతం), స్పైస్జెట్ (2.6 శాతం) ఉన్నాయి. 2025 జనవరి–ఏప్రిల్ మధ్యకాలంలో దేశీ విమానయాన సంస్థలు 5.75 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నెలవారీ రిపోర్టులో వెల్లడించింది. వార్షికంగా చూస్తే ఈ సంఖ్య 9.87 శాతం, నెలవారీగా చూస్తే 8.45 శాతం పెరిగినట్లు వివరించింది. సమయ పాలనపరంగా (ఓటీపీ) చూస్తే 80.8 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. 77.5 శాతం ఓటీపీతో ఆకాశ ఎయిర్, 72.4 శాతంతో ఎయిరిండియా గ్రూప్ .. ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. స్పైస్జెట్ సమయ పాలన అత్యంత కనిష్ట స్థాయిలో 60 శాతంగా నమోదైంది. -
హోండా కొత్త స్కూటర్.. రూ.12 లక్షలు
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఎక్స్-ఎడివి మ్యాక్సీ స్కూటర్ను భారత్లో విడుదల చేసింది. దీని ధర రూ .11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). అడ్వెంచర్ మోటార్ సైకిల్లాగా ఉంటూ మరోవైపు స్కూటర్ లాంటి సౌకర్యం ఉండేలా ఈ మ్యాక్సీ స్కూటర్ ను రూపొందించినట్లు హోండా పేర్కొంది. ఎక్స్-ఏఏడీవీ మ్యాక్సీ స్కూటర్ కోసం హోండా బిగ్ వింగ్ డీలర్ షిప్లలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూన్ నుండి ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.హోండా ఎక్స్-ఏడీవీ ప్రత్యేకతలుఇంజిన్& పవర్ ట్రయిన్: హోండా ఎక్స్-ఏడీవీ 745 సీసీ లిక్విడ్-కూల్డ్ ఎస్ఓహెచ్సి 8-వాల్వ్ పారలల్-ట్విన్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 6,750 ఆర్పీఎం వద్ద 57 బీహెచ్పీ శక్తిని, 4,750 ఆర్పీఎం వద్ద 69 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.డిజైన్ & హార్డ్వేర్: అడ్వెంచర్ అప్పీల్ వచ్చేలా ఎక్స్-ఏడీవీ మొత్తం డిజైన్ను రూపకల్పన చేశారు. డ్యూయల్ ఎల్ఈడీ హెడ్లైట్స్, డీఆర్ఎల్ ఇచ్చారు. ముందు భాగంలో 17-అంగుళాల స్పోక్ వీల్, వెనుక భాగంలో 15-అంగుళాల స్పోక్ వీల్ ఉన్నాయి. సస్పెన్షన్ డ్యూటీ ముందు భాగంలో 41 ఎంఎం యూఎస్డీ ఫోర్కులు, వెనుక భాగంలో స్ప్రింగ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్లో డ్యూయల్ రేడియల్ మౌంట్ ఫోర్-పిస్టన్ కాలిపర్ ముందు భాగంలో 296 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్తో సింగిల్-పిస్టన్ కాలిపర్ ఉన్నాయి.ఫీచర్లు: హోండా ఎక్స్-ఏడీవీలో యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, 5-అంగుళాల ఫుల్-కలర్ టీఎఫ్టీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషషన్ , మ్యూజిక్, వాయిస్ కమాండ్ కంట్రోట్ వంటి ఫీచర్లున్న హోండా రోడ్ సింక్ యాప్ను ఈ స్కూటర్కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, గ్రావెల్ అనే నాలుగు డిఫాల్ట్ రైడింగ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. -
టీసీఎస్కు రూ. 2,903 కోట్ల ఆర్డర్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 2,903 కోట్ల యాడ్–ఆన్ అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డరు (ఏపీవో) దక్కించుకుంది. దీని ప్రకారం బీఎస్ఎన్ఎల్కు 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్వర్క్ ప్లానింగ్, ఇంజినీరింగ్, సరఫరా, ఇన్స్టాలింగ్, టెస్టింగ్, వార్షిక మెయింటెనెన్స్ మొదలైన సర్వీసులను టీసీఎస్ అందించాల్సి ఉంటుంది.ఏపీవోలో పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలకు లోబడి సవివర పర్చేజ్ ఆర్డర్లను (పీవో) బీఎస్ఎన్ఎల్ జారీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించి తాము టీసీఎస్కు సరఫరా చేసే రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ఆర్ఏఎన్), ఇతరత్రా పరికరాల విలువ సుమారు రూ. 1,526 కోట్లుగా ఉంటుందని తేజాస్ నెట్వర్క్స్ పేర్కొంది. నిర్దిష్ట షరతులకు లోబడి టీసీఎస్ సవివర పీవోలను జారీ చేస్తుందని వివరించింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్కు నష్టాలు.. అవకతవకల ఎఫెక్ట్!
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో లాభాలనువీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 2,329 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఖాతాల అవకతవకలతో ప్రొవిజన్లు పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది. 2023–24 ఇదే కాలంలో రూ. 2,349 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు కొంతమంది ఉద్యోగుల పాత్రపై అనుమానాలతో బ్యాంక్ బోర్డు దర్యాప్తు ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలకు ఖాతాల మోసాలపై నివేదించమని బ్యాంక్ను ఆదేశించింది. ఖాతాల లోపాలు, మైక్రోఫైనాన్స్ పోర్ట్ఫోలియోలో మోసం, బ్యాలెన్స్షీట్లో పొరపాటు అంశాలతో బ్యాంక్ సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అంతర్గత ఆడిట్కు ఆదేశించడం తెలిసిందే. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇండస్ఇండ్ నికర లాభం 71% పడిపోయి రూ. 2,576 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 8,977 కోట్ల లాభం సాధించింది. ప్రొవిజన్లు రూ. 3,885 కోట్ల నుంచి రూ. 7,136 కోట్లకు పెరిగాయి.ప్రొవిజనింగ్ జూమ్ క్యూ4లో ఇండస్ఇండ్ బ్యాంక్ రూ. 2,522 కోట్లమేర ప్రొవిజనింగ్ చేపట్టింది. అంతక్రితం క్యూ4లో ఈ పద్దు రూ. 950 కోట్లు మాత్రమే. 2023–24 క్యూ4లో రూ. 12,199 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో రూ. 1,979 కోట్లమేర ఖాతాలలో లోపం, మైక్రోఫైనాన్స్ బిజినెస్లో రూ. 674 కోట్ల వడ్డీ తప్పుగా నమోదు చేసినట్లు అంతర్గత ఆడిట్లో గుర్తించడం, బ్యాలెన్స్షీట్లో రూ. 595 కోట్ల ఇతర ఆస్తుల అక్రమ పద్దు తదితరాలను బ్యాంక్ మార్చిలో వెల్లడించింది.ఏప్రిల్ 29న సీఈవో సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా రాజీనామా చేశారు. దీంతో బ్యాంక్ బోర్డు కార్యకలాపాల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్ల కమిటీ ఏర్పాటు చేసింది. 2025 జూన్30లోగా కొత్త సీఈవో ఎంపికకు వీలుగా ప్రతిపాదనలు పంపమని బ్యాంక్ను ఆర్బీఐ ఆదేశించినట్లు ఇండస్ఇండ్ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు 1.4% క్షీణించి రూ. 771 వద్ద ముగిసింది. -
ఇండిగో లాభం ‘హై’జంప్
న్యూఢిల్లీ: దేశీ విమానయాన దిగ్గజం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 3,067 కోట్లను అధిగమించింది. ఇది క్యూ4లో కంపెనీ సాధించిన రికార్డ్ లాభంకాగా.. ఇందుకు విమాన ప్రయాణికులు పెరగడం సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 1,895 కోట్లు ఆర్జించింది. ఇండిగో బ్రాండ్ విమాన సర్వీసుల కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 18,505 కోట్ల నుంచి రూ. 23,098 కోట్లకు ఎగసింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ప్రయాణికుల జోరు మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇండిగో నికర లాభం రూ. 7,258 కోట్లను అధిగమించింది. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే దాదాపు రూ. 8,868 కోట్ల లాభం ఆర్జించింది. గతేడాది 11.8 కోట్లమంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేసినట్లు సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. కాగా.. క్యూ4లో ఇండిగో ప్రయాణికుల టికెట్ ఆదాయం 25% జంప్చేసి రూ. 19,567 కోట్లను దాటింది. అనుబంధ విభాగాల ఆదాయం 25 శాతం అధికమై రూ. 2,153 కోట్లకు చేరింది. మొత్తం నగదు నిల్వలు రూ. 48,170 కోట్లను అధిగమించగా.. విమానాల సంఖ్య 400ను దాటింది. ఇండిగో షేరు బీఎస్ఈలో 0.4% లాభంతో రూ. 5,466 వద్ద ముగిసింది. -
మళ్లీ బంగారం రయ్..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలతో పసిడికి మరోసారి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,910 పెరిగి రూ.98,450 స్థాయికి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,870 లాభపడి రూ.98,000 స్థాయిని అందుకుంది.‘‘బలహీన డాలర్ పసిడి ధరలకు మద్దతునిచ్చింది. యూఎస్ క్రెడిట్ రేటింగ్ను మూడీస్ డౌన్గ్రేడ్ చేయడంతో సావరీన్ రిస్క్ను సైతం ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. రేటింగ్ డౌన్గ్రేడ్తో దీర్ఘకాలంలో యూఎస్ ఆర్థిక స్థిరత్వంపై అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.మరోవైపు వెండి ధరలకు సైతం కదలిక వచ్చింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.1,660 పెరిగి రూ.99,160 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం 3,300 స్థాయిని దాటేసింది. స్పాట్ గోల్డ్ 22 డాలర్ల లాభంతో 3,312 డాలర్ల స్థాయికి చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు అమెరికా ఆర్థిక ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలతో బంగారం 3,300 డాలర్లను తిరిగి అందుకున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
జియో, ఎయిర్టెల్, వీఐ.. చవకైన రీచార్జ్ ప్లాన్లు ఇవే...
టెలికాం కంపెనీలు టారీఫ్లు పెంచిన తర్వాత మొబైల్ రీఛార్జ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో చవకైన రీచార్జ్ ప్లాన్ల కోసం వినియోగదారులు చూస్తుంటారు. అటువంటివారి కోసం కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటి అవసరమైన అన్ని ప్రయోజనాలను తక్కువ ధరలో అందించే రీచార్జ్ ప్లాన్లను ఇక్కడ అందిస్తున్నాం. జియో, ఎయిర్ టెల్, వీఐలు రూ.200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్, అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో, వినియోగదారులు మొత్తం 2 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), ఏ నెట్వర్క్లోనైనా లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అపరిమిత కాల్స్ పొందుతారు. ఈ ప్లాన్లో మొత్తం 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 2 జీబీ డేటా, మొత్తం 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అలాగే, ఈ ప్లాన్ అపరిమిత కాల్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియా రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 18 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా, ఏ నెట్వర్క్కైనా అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్విఐ రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. -
తయారీలో భారత్ ముందడుగు
న్యూఢిల్లీ: తయారీ రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఎంతో ఆకర్షణీయంగా మార్చిందని ఎస్అండ్పీ గ్లోబల్ అధ్యయనం పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు దీర్ఘకాలంలో భారత్కు ప్రయోజనం కలిగిస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఎస్అండ్పీ గ్లోబల్ రీసెర్చ్ అధ్యయన నివేదికను విడుదల చేసింది.అభివృద్ధి చెందుతున్న పరిణామాలు, వాణిజ్య సవాళ్లకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలు మారుతున్నందున.. ఈ అవకాశాన్ని భారత్ సది్వనియోగం చేసుకుని తన తయారీ వృద్ధిని వేగవంతం చేసుకోగలదని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో మరింత బలంగా అనుసంధానం కాగలదని ఈ నివేదిక అంచనా వేసింది. స్థానికంగానే విడిభాగాల సమీకరణ, తుది మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా ఉండడం, ప్రాంతీయ అనుసంధానత పెంచుకోవడం ద్వారా భారత్ తయారీ రంగం మరిన్ని అదనపు పెట్టుబడులను ఆకర్షించొచ్చని సూచించింది.భారత్ అత్యాధునిక టెక్నాలజీ సామర్థ్యాలను, తయారీ పోటీతత్వాన్ని పెంచుకోవడం ద్వారా తయారీలో అదనపు ఉపాధి అవకాశాలను కల్పించొచ్చని పేర్కొంది. సరఫరా వ్యవస్థ వైవిధ్యంలో భాగంగా మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో భారత్కు ప్రయోజనం లభిస్తుందని వివరించింది. 2024–25లో భారత జీడీపీ వృద్ధి నిదానించినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్టు గుర్తు చేసింది.భారత వృద్ధిలో ఎగుమతులపై ఆధారపడడం మోస్తరుగానే ఉన్నట్టు తెలిపింది. ఈ సానుకూలత వల్లే అంతర్జాతీయ వాణిజ్యం, టారిఫ్ విధానాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న మార్పుల ప్రభావం భారత్పై పెద్దగా ఉండబోదని పేర్కొంది. భారత స్థూల జీడీపీలో తయారీ విలువ 17.2 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఇటీవలి తయారీ పీఎంఐ గణాంకాలు పటిష్టంగా ఉండడాన్ని ప్రస్తావించింది. -
కలరా వ్యాక్సిన్ మూడో దశ విజయవంతం
హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్ బయోటెక్ కలరా వ్యాక్సిన్ పరీక్షల్లో పురోగతి సాధించింది. 1800 మందిపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ అధ్యయనంలో తమ ఓరల్ కలరా వ్యాక్సిన్ హిల్కోల్ విజయం సాధించందని, పెద్దలు, పిల్లలలో కలరాకు సంబంధించిన ఒగావా, ఇనాబా సెరోటైప్స్ రెండింటికీ వ్యతిరేకంగా పనిచేసిందని భారత్ బయోటెక్ తెలిపింది.కలరా అనేది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా కలిగించే అతిసార వ్యాధి. కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల ఇది సంక్రమిస్తుంది. ఏటా 28.6 లక్షల కేసులు నమోదవుతుండగా 95,000 మరణాలు సంభవిస్తున్నాయని అధ్యయనాలు అంచనా వేశాయి. ఓరల్ కలరా వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 10 కోట్ల డోసుల డిమాండ్ ఉందని, కేవలం ఒక తయారీదారు మాత్రమే వాటిని సరఫరా చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడిందన్నారు. హైదరాబాద్, భువనేశ్వర్లోని భారత్ బయోటెక్ కేంద్రాలు 20 కోట్ల డోసుల హిల్కోల్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది.ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని 18 ఏళ్లు పైబడిన పెద్దలు, 5 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలు, సంవత్సరం నుండి ఐదేళ్లలోపు చిన్నపిల్లలు మూడు గ్రూపులుగా విభజించి వ్యాక్సిన్ ప్రయోగించారు. అధ్యయన ఫలితాలు సైన్స్ డైరక్ట్ అనే వ్యాక్సిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. హిల్కాల్ వ్యాక్సిన్ ఒగావా, ఇనాబా సెరోటైప్లకు వ్యతిరేకంగా విబ్రియోసిడల్ యాంటీబాడీలను 4 రెట్లు అధికంగా తయారు చేసింది.ఈ అధ్యయన ఫలితాలు కఠినమైన పరిశోధన, సమగ్ర క్లినికల్ ట్రయల్స్, నమ్మదగిన క్లినికల్ డేటాతో వ్యాక్సిన్లను తీసుకొస్తున్న తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. సమర్థవంతమైన, అందుబాటు ధరల్లో వ్యాక్సిన్లను అందించడంలో తమ నిబద్ధత నిరంతరం కొనసాగుతుందన్నారు. -
యూపీఐ యాప్లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..
దేశంలో జరిగే డిజిటల్ లావాదేవీల్లో అత్యధికం యూపీఐ (UPI) ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి అనేక యూపీఐ యాప్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో లోపాల ద్వారా వినియోగదారులు డబ్బులు పోగుట్టుకుంటున్న సంఘటనలూ అక్కడక్కడా జరగుతున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా యూపీఐ యాప్లలో కొత్త మార్పులు త్వరలో రానున్నాయి.యూపీఐ లావాదేవీలో డబ్బులు అంతిమంగా ఎవరికి చేరుతున్నాయన్నది తప్పనిసరిగా ప్రదర్శించాలని యూపీఐ పేమెంట్, భారత్ బిల్ పే, రూపే కార్డ్లతోపాటు దేశంలోని అన్ని రిటైల్ చెల్లింపులను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.అంతిమ లబ్ధిదారు ఎవరన్నది పేయర్ యాప్లో అలాగే లావాదేవీ స్టేట్మెంట్, హిస్టరీలోనూ ప్రదర్శించాలని ఎన్పీసీఐ సర్క్యులర్లో తెలిపింది. సరైన లబ్ధిదారునికి డబ్బు పంపుతున్నామని వినియోగదారుల్లో విశ్వాసం కలిగించడానికి, సంభావ్య ప్రమాదాన్ని నివారించడానికి యూపీఐ యాప్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.చేయాల్సిన మార్పులివే..యూపీఐ యాప్లు లావాదేవీకి ముందు వివరాల పేజీలో డబ్బు ఎవరికి వెళ్తుందో అంతిమ లబ్ధిదారుని పేరు (ధ్రువీకరించిన ఏపీఐ అడ్రెస్ ద్వారా సంగ్రహించిన లబ్ధిదారు బ్యాంకింగ్ పేరు) మాత్రమే వినియోగదారునికి కనిపించాలి. అలాకాకుండా క్యూఆర్ కోడ్ ల నుంచి సేకరించిన పేర్లు, చెల్లింపుదారు నిర్వచించిన పేర్లు లేదా మరే ఇతర పేర్లను యూపీఐ యాప్ లో పేయర్ కు ప్రదర్శించకూడదు.యాపీఐ యాప్లలో లావాదేవీలకు బెనిఫీషియరీ పేరును మార్చేందుకు వీలు కల్పించే ఫీచర్లు ఉంటే వాటిని తప్పనిసరిగా తొలగించాలి. ఆయా యూపీఐ యాప్లన్నీ జూన్ 30 నాటికి ఈ మార్పులు అమలు చేయాలి. లేకుంటే నిబంధనల ఉల్లంఘనగా భావించి చర్యలు తీసుకుంటామని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
అనుమతులు ఆలస్యం కారాదు: ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అనుమతుల్లో జాప్యం అనిశ్చితికి దారితీయడంతోపాటు, వాణిజ్యపరమైన ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కఠినమైన పర్యవేక్షణ కొనసాగిస్తూనే వేగవంతమైన, పోటీకి హాని చేయని సులభ అనుమతులు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 16వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతారామన్ పాల్గొని మాట్లాడారు.సమర్థతను పెంచే పోటీని ప్రోత్సహిస్తూ సరళీకరణ స్ఫూర్తిని కాపాడడంలో, ఆవిష్కరణలు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంలో సీసీఐ కీలక సంస్థగా అవతరించినట్టు మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ విధానాలు, చట్టాలు, నియంత్రణలు సైతం అవరోధాలుగా మారి పోటీని ప్రభావితం చేయరాదన్నారు. నేటి వేగవంతమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నియంత్రపరమైన అనుమతుల్లో జాప్యం అనిశ్చితులకు దారితీస్తాయని, సకాలంలో వాణిజ్య కార్యకలాపాలకు అవరోధం కల్పిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతిమంగా లావాదేవీల ప్రయోజనానికి నష్టం కలిగిస్తాయన్నారు.‘‘ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తున్నప్పుడు.. నియంత్రణ సంస్థల చురుకుదనం, సన్నద్ధతను ఇన్వెస్టర్లు గమనిస్తారు’’అని మంత్రి పేర్కొన్నారు. న్యాయపోరాటం, పరిష్కారానికి పట్టే సమయం లేక నియంత్రణ సంస్థలు తక్కువ పారదర్శకంగా ఉండే పరిస్థితుల్లో చర్చలు సంక్లిష్టంగా మారే అవకాశముంటుందన్నారు.అమెరికా, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ చర్చలు నిర్వహిస్తున్న తరుణంలో మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. స్వేచ్ఛాయుత, పారదర్శక మార్కెట్ కేవలం ఆర్థిక అవసరాల కోసమే కాకుండా, ప్రజాస్వామికంగానూ అవసరమేనన్నారు. ఎగుమతులు, ఇంధన, పర్యావరణ సవాళ్ల మధ్య దేశీ వృద్ధి చోదకాలపై ఎక్కువగా ఆధారపడుతున్నప్పుడు నియంత్రణలు, స్వేచ్ఛ మధ్య సరైన సమతూకం అవసమని అభిప్రాయపడ్డారు. -
దుబాయ్లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
దుబాయ్కు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ రాత్రికి రాత్రే గల్లంతైంది. రూ.కోట్ల కొద్దీ ఇన్వెస్టర్ల సొమ్ముతో ఆచూకీ లేకుండా మాయమైంది. దుబాయ్ లోని బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్లో అప్పటి వరకూ ఆ కంపెనీ ఉన్న ఆఫీస్ బయట ఒక బకెట్, అందులో ఒక మాప్, చెత్త సంచి మాత్రమే కనిపించాయి. కొన్ని వారాల క్రితం ఈ స్థలంలో గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ కార్యాలయం ఉండేదని, అదే ఇప్పుడు అదృశ్యమైనట్లు కనిపిస్తోందని ఖలీజ్ టైమ్స్ నివేదిక తెలిపింది.గల్లంతైన సంస్థ..గత నెల వరకు గల్ఫ్ ఫస్ట్ దుబాయ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్ 302, 305 సూట్ లలో సుమారు 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. ఔత్సాహిక ఇన్వెస్టర్లను సంప్రదించడం, ఫారెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించడం వారి పని.క్యాపిటల్ గోల్డెన్ టవర్లోని ఆ రెండు గదులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఫోన్ లైన్లు తెగిపోయి ఫ్లోర్లు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. తాళాలు తిరిగి ఇచ్చి, అన్నీ క్లియర్ చేసి హడావుడిగా వెళ్లిపోయారని క్యాపిటల్ గోల్డెన్ టవర్ సెక్యూరిటీ గార్డు ఒకరు మీడియాకు తెలిపారు. ఇప్పుడు రోజూ జనం వచ్చి వారి గురించి అడుగుతున్నారని చెప్పారు.నష్టపోయిన భారత ఇన్వెస్టర్లుగల్ఫ్ ఫస్ట్ బాధితుల్లో భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు బాధితులు చెబుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ పొయిల్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ బ్యాంకర్స్ ద్వారా 75,000 డాలర్లు అంటే రూ.64 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేసి మోసపోయారు.మరో భారతీయ ఇన్వెస్టర్ అయితే ఏకంగా 2,30,000 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లు నష్టపోయారు. ఇన్వెస్ట్ చేసే సయమంలో కంపెనీ రిలేషన్షిప్ మేనేజర్ తనతో తన మాతృ భాష కన్నడంలో మాట్లాడారని చెప్పుకొచ్చారు. మొదట చిన్న చిన్న లాభాలను చూపించి డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించిన కంపెనీ ఆ తర్వాత ఉపసంహరణలకు వీలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించారని బాధితుడు పేర్కొన్నారు.కంపెనీ సిబ్బంది తనతో మాట్లాడేటప్పుడు గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ పేర్లను మార్చి మార్చి చెప్పారని, అవి రెండూ ఒకే కంపెనీగా ఉన్నాయని 50,000 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్టపోయిన మహమ్మద్ అనే మరో ఇన్వెస్టర్ వివరించారు. రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు సిగ్మా-వన్ క్యాపిటల్ కు డీఎఫ్ఎస్ఏ లేదా ఎస్సీఏ అనుమతి లేదని నిర్ధారించారు. -
ఆర్బీఐ మరో విడత రేట్ల కోత.. 6.5% మించి వృద్ధి!
న్యూఢిల్లీ: ఆర్బీఐ త్వరలోనే మరో విడత రేట్ల కోతను చేపడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ అంచనా 6.5 శాతం మించి వృద్ధి రేటు నమోదవుతుందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ) సెక్రటరీ జనరల్, సీఈవో రంజిత్ మెహతా అభిప్రాయపడ్డారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ) అందుబాటు ధరలపై రుణాలు, టెక్నాలజీ, మార్కెట్ అవకాశాల పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.ఈ అంశాలను ఆర్బీఐ తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. కనుక సమీప కాలంలోనే మరో విడత రేట్ల కోత ఉంటుందని అంచనా వేశారు. జూన్ 4–6 మధ్య ఆర్బీఐ ఎంపీసీ తదుపరి సమీక్ష జరగనుండడం గమనార్హం. ఎస్ఎంఈ మార్కెట్ సెంటిమెంట్ ఇండెక్స్ విడుదల కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ సూచీ మార్చితో ముగిసిన త్రైమాసికంలో సానుకూలంగా ఉండడం గమనార్హం. 2024 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఉన్న 50 స్థాయిలోనే మార్చిలోనూ కొనసాగింది. ఎస్ఎంఈ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మాత్రం 57.7 పాయింట్లతో బలంగా నమోదైంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సానుకూల వాతావరణంలో స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో 82,021 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 410.19 పాయింట్లు (0.51 శాతం) పెరిగి 81,596.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 129.55 పాయింట్లు లేదా 0.52 శాతం లాభపడి 24,813.45 వద్ద ముగిసింది.బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు 1.87 శాతం వరకు నష్టపోయాయి.బీఎస్ఈలో ట్రేడైన 4,115 షేర్లలో 2,304 షేర్లు లాభాల్లో ముగియగా, 1,674 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.78 శాతం, 0.38 శాతం లాభాలతో ముగిశాయి.రంగాలవారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా ఎన్ ఎస్ ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు లాభాల్లో స్థిరపడగా, నిఫ్టీ రియాల్టీ, ఫార్మా సూచీలు వరుసగా 1.72 శాతం, 1.25 శాతం లాభపడ్డాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.93 శాతం పెరిగి 17.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తుంటారా? అందులోనూ వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారా? అయితే మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన అప్డేట్ ఒకటి ఉంది. ఇండియన్ రైల్వే తాజాగా ఒక పెద్ద మార్పు చేసింది. స్లీపర్ క్లాస్ టికెట్లు ఇకపై ఖాళీగా ఉన్నప్పటికీ ఫస్ట్ ఏసీకి అప్గ్రేడ్ అవ్వవు. ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు ఒక వేళ సీట్లు అందుబాటులో ఇతర క్లాస్లలో సీట్లు కేటాయించేవారు. ఇకపై ఆ సౌకర్యం ఉండదు.ఆటో అప్గ్రేడ్ విధానం ఎలా పనిచేస్తుందో తాజగా జారీ చేసిన సర్క్యులర్లో రైల్వే బోర్డు స్పష్టం చేసింది. మీరు ఒక నిర్దిష్ట తరగతిలో టికెట్ బుక్ చేసుకుంటే అందులో సీట్లు అందుబాటులో లేకపోతే మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. ఒకవేళ ఇతర ఉన్నత తరగతులలో లభ్యత ఉంటే మీ సీటు ఆటోమేటిక్గా ఆ క్లాస్లోకి అప్గ్రేడ్ అవుతుంది. అయితే ఇది రెండు తరగతులకు మాత్రమే.సీట్ల అప్గ్రేడ్ ఇలా..స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, అప్గ్రేడ్ కొత్త క్రమం ఇలా ఉంటుంది.. 2S → 3E → 3A → 2A → 1Aఅయితే 2ఏ ప్రయాణీకులను మాత్రమే 1ఏ (ఫస్ట్ ఏసీ)గా అప్ గ్రేడ్ చేయవచ్చని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. మీరు స్లీపర్ లేదా 3ఈలో ఉంటే ఇకపై ఫస్ట్ ఏసీకి అప్గ్రేడ్ కాలేరు.సీటింగ్ క్లాస్ కోచ్లతో అప్గ్రేడ్ క్రమం ఇలా ఉంటుంది.. 2S → VS → CC → EC → EV → EAఇక్కడ కూడా సీసీ (చైర్ కార్) టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈసీ, ఈవీ లేదా ఈఏ వంటి ప్రీమియం తరగతులకు అప్ గ్రేడ్ అయ్యేందుకు అర్హులు. అలాగే సీటింగ్ క్లాస్, స్లీపర్ క్లాస్లకు మధ్య ఎలాంటి అప్గ్రేడ్కు అవకాశం ఉండదు.అప్గ్రేడ్ కోసం ఏమైనా చేయాలా?ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ‘ఓకే విత్ ఆటో అప్గ్రేడ్’ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ "యస్" క్లిక్ చేస్తే, మీ టిక్కెట్ అర్హత అప్గ్రేడ్కు పొందుతుంది. "నో" ఎంచుకుంటే, అప్గ్రేడ్ కాదు. ఒక వేళ మీరు ఏ ఆప్షన్నూ ఎంచుకోకపోతే సిస్టమ్ దానిని డిఫాల్ట్గా "యస్" గా తీసుకుంటుంది. -
అలా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్క్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్ విభాగం మధ్య ఏ ఫండ్స్ మెరుగైనవి? – వీణారాణి దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన ఆ ఐదేళ్ల కాలంలోనూ మార్కెట్ సైకిల్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్క్యాప్ మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛతో ఉంటుంది. మార్కెట్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంలో పెట్టుబడుల ద్వారా దీన్ని చక్కగా అధిగమించగలరు. నేను అధిక పన్ను శ్లాబులోకి వస్తాను. ఎఫ్డీలపై ఆదాయం సైతం పన్ను పరిధిలోకి వస్తుంది. అత్యవసర నిధిని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – జగన్నాథ స్వామిమీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. అత్యవసర నిధిని మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొదటి భాగం అత్యవసర నిధిని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకోవచ్చు. లేదా వెంటనే నగదుగా మార్చుకోగలిగిన మరొక సాధనంలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగా ప్రత్యేక అనుకూలతలు ఏవీ లేవు. ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగా కాకుండా.. డెట్ ఫండ్స్లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ ఆదాయాన్ని పన్ను చెల్లింపుదా రు తన వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను పడుతుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్లోనూ 2023 ఏప్రిల్ 1 తర్వాత చేసిన పెట్టుబడులను విక్రయిస్తే.. ఎంతకాలం అన్నదానితో సంబంధం లేకుండా లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఈ ఆదాయంపైనా మీరు గరిష్ట పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులిస్తాయి. కానీ, డెట్ ఫండ్స్లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి ఒక్కో ఇన్వెస్టర్కు గరిష్టంగా రూ.5 లక్షల పెట్టుబడికి బీమా రక్షణ హామీ కూడా ఉండదు. లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
లేఆఫ్ తప్పు తెలిసొచ్చిందీ కంపెనీకి...
ఇప్పుడు ఎక్కడ చూసినా లేఆఫ్లు పెరిగిపోయాయి. అదేమంటే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేషన్ అంటున్నారు. ఖర్చు పేరు చెప్పి నైపుణ్యంతో పనిచేసే మానవ ఉద్యోగులను తొలగించి ఏఐ సిస్టమ్లతో భర్తీ చేసేస్తున్నాయి చాలా కంపెనీలు. ఇలా అన్నింటికీ ఏఐని నమ్ముకుని ఉన్న ఉద్యోగులను తొలగిస్తే ఏమవుతుందో తెలిసొచ్చిందీ స్వీడన్ కంపెనీకి...స్వీడిష్ ఫిన్టెక్ కంపెనీ క్లార్నా (Klarna) 2022లో ఏకంగా 700 ఉద్యోగులను తొలగించి, ఓపెన్ఏఐ (OpenAI) సహాయంతో ఏఐ (AI) వ్యవస్థలను ఉపయోగించడం ప్రారంభించింది. 2023 నాటికి, కంపెనీ మానవ ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేసింది.అప్పట్లో ఈ కంపెనీ లేఆఫ్లను అమలు చేసిన తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల తొలగింపులను ముందుగా రికార్డ్ చేసిన వీడియో ద్వారా ప్రకటించడం, వారి వ్యక్తిగత డేటా లీక్ చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.తప్పు తెలిసొచ్చింది..ఏఐ ఆధారిత కస్టమర్ సేవలు అంచనాలకు తగినట్లుగా ఫలితాలను ఇవ్వలేదు. ఇవి కస్టమర్ సంతృప్తి తగ్గడానికి దారితీశాయి. మరోవైపు ఉద్యోగుల తొలగింపును అధ్వానంగా నిర్వహించడం, వారి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయడం క్లార్నా ఇమేజ్ను ప్రభావితం చేసింది.అంతేకాకుండా ఆర్థికంగానూ కంపెనీకి పెద్ద దెబ్బే తగిలింది. 2021లో 45.6 బిలియన్ డాలర్లున్న క్లార్నా వ్యాల్యుయేషన్ 2022లో 6.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏఐ ఆధారిత విధానం పెట్టుబడిదారుల ఆందోళనలకు కారణమైంది.ఏఐ ఆధారిత కార్యకలాపాలు సేవా నాణ్యతను ప్రభావితం చేశాయని క్లార్నా అంగీకరించింది. లేఆఫ్కు వెళ్లడం తప్పేనని కంపెనీ సీఈవో సెబాస్టియన్ సీమియట్కోవ్స్కీ అంగీకరించారు. ఖర్చు తగ్గింపునకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని, కానీ ఇది సేవా ప్రమాణాలను దెబ్బతీసిందని ఒప్పుకొన్నారు.తిరిగి నియామకాల వైపు..నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తొలగించిన తర్వాత భారీ నష్టాన్ని చవిచూసిన క్లార్నా సంస్థ తన వైఖరి మార్చుకుంది. ఇప్పుడు మళ్లీ నియామకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కస్టమర్ సర్వీసు విభాగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులే లక్ష్యంగా రిమోట్ వర్క్ ఆఫర్ చేస్తోంది. -
మరింత ఖరీదైన బంగారం.. నేడు తులం..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మళ్లీ ఎగిశాయి. రెండు రోజులు నిలకడగా ఉన్న పసిడి ధరలు నేడు (మే 19) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులు కాస్త ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. మే 19 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి.👉ఇది చదివారా? ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,660🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,700ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి.వెండి ధరలూ..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.1000 పెరిగి రూ.1,08,000 వద్దకు చేరింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.1000 ఎగిసి రూ. 98,000 లను తాకింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
త్రీవీలర్ ఈవీలకు కేరాఫ్ భారత్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా భారత్ వరుసగా రెండో ఏడాది గుర్తింపును సొంతం చేసుకుంది. 2024లో వీటి అమ్మకాలు 20 శాతం పెరిగి 7 లక్షల యూనిట్లుగా ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది. ప్రపంచ ఈవీ మార్కెట్పై ఐఈఏ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్ మార్కెట్ గురించి కీలకంగా ప్రస్తావించింది.అంతర్జాతీయంగా త్రిచక్ర ఈవీల వృద్ధిలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా త్రిచక్ర వాహన అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలి్చతే 5 శాతం క్షీణించినప్పటికీ.. తిచక్ర ఈవీల విక్రయాలు మాత్రం 10 శాతం పెరిగి మిలియన్ యూనిట్లను దాటినట్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయ త్రిచక్ర వాహనాలతోపాటు త్రిచక్ర ఈవీల్లో 90 శాతం వాటా చైనా, భారత్ చేతుల్లోనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.‘‘చైనాలో తిచక్ర వాహన అమ్మకాల్లో గత మూడేళ్ల నుంచి ఈవీలు 15 శాతంలోపే ఉంటున్నాయి. 2023లో చైనాను వెనక్కి నెట్టేసి ప్రపంచ అతిపెద్ద తిచక్ర ఈవీ మార్కెట్గా భారత్ అవతరించింది. 2024లోనూ 7 లక్షల త్రిచక్ర ఈవీ అమ్మకాలతో అతిపెద్ద మార్కెట్ స్థానాన్ని కాపాడుకుంది’’అని ఈ నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్త త్రిచక్ర ఈవీల అమ్మకాల్లో భారత్ వాటా 57 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2023తో పోల్చి చూస్తే 3 శాతం వాటాను పెంచుకున్నట్టు తెలిపింది. పీఎం ఈ–డ్రైవ్ పథకం మద్దతును ప్రస్తావించింది. కేంద్ర సర్కారు ఈ పథకం ద్వారా ఈవీలకు సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తుండడం తెలిసిందే. ద్వి, త్రిచక్ర వాహనాలకు బడా మార్కెట్ అంతర్జాతీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాల్లో చైనా, భారత్, దక్షిణాసియా దేశాలు 80 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐఈఏ నివేదిక వెల్లడించింది. ప్రైవేటు ప్యాసింజర్ రవాణాకు ఇవి ప్రాథమిక వినియోగంగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఎలక్ట్రిక్ టూవీలర్లకు భారత్ చురుకైన మార్కెట్గా ఉంటోంది. 220కు పైగా ఓఈఎంలకు (వాహన తయారీ సంస్థలు) కేంద్రంగా ఉంది. 2023లో ఉన్న 180 కంటే పెరిగాయి. 2024లో మొత్తం ద్విచక్ర ఈవీల అమ్మకాలు 1.3 మిలియన్ యూనిట్లలో 80 శాతం వాటా టాప్–4 కంపెనీలు కలిగి ఉన్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది.అధిక ధరలు, తీవ్ర పోటీ సంప్రదాయ ద్విచక్ర వాహనలతో పోల్చి చూసినప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలు ధర అధికంగా ఉన్నట్టు.. అదే సమయంలో పోటీ పెరగడంతో ఓఈఎంలు అందుబాటు ధరలపై మోడళ్లను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఓలా ఎస్1ఎక్స్ మోడల్ను నిదర్శనంగా పేర్కొంది. 2కిలోవాట్హవర్ బ్యాటరీ, 6కిలోవాట్ పీక్ పవర్ సామర్థ్యంతో 70,000కే అందిస్తున్నట్టు గుర్తు చేసింది.విధానపరమైన మద్దతు (సబ్సిడీలు) కూడా సంప్రదాయ, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మధ్య ధరల అంతరాన్ని తగ్గిస్తున్నట్టు ఐఈఏ నివేదిక తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2024లో కేవలం 2 శాతం పెరిగి 1,00,000 యూనిట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ఇక ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు క్రితం ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి 35,000 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది.