business news
-
ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...
-
బంగారం కొన్నవారికి నిద్రలేని రాత్రులు.. పాతాళానికి గోల్డ్ రేట్స్..
-
పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!
-
మాంసం ప్రియులకు షాక్! ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరలు
-
రూ. 1 లక్ష పెట్టినోళ్లకు 15 ఏళ్లలోనే 16 లక్షలొచ్చాయ్..!
-
యుద్ధ బీభత్సం 50 లక్షల కోట్ల నష్టం..
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు.. భవిష్యత్లో బంగారం లక్షకు పడిపోనుందా..?
-
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
పడిపోతున్న పసిడి ధరలు... కొనాలా? వెయిట్ చేయాలా?
-
ఇన్ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి
న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి నెమ్మదించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షీణించడంతో 2.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 3.4 శాతంగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఫిబ్రవరిలో ఎరువులు, సిమెంటు, విద్యుదుత్పత్తి వరుసగా 3.4 శాతం, 9.3 శాతం, 0.5 శాతం మేర క్షీణించింది.అయితే బొగ్గు, ఉక్కు ఉత్పత్తి మాత్రం మెరుగ్గా నమోదైంది. ఇక ఏప్రిల్–ఫిబ్రవరి మధ్యకాలంలో ఇన్ఫ్రా వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 4.4 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందు నుంచే కీలక రంగాల వృద్ధి నెమ్మదించిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. -
సిబిల్ స్కోరుపై పెరుగుతున్న అవగాహన
ముంబై: రుణాల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ట్రాన్స్యూనియన్ సిబిల్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 18.3 కోట్ల మంది భారతీయులు తమ సిబిల్ స్కోరును స్వయంగా పరిశీలించుకుంటున్నారు.తొలిసారిగా పరిశీలించుకునే వారి సంఖ్య గతేడాది డిసెంబర్ గణాంకాల ప్రకారం వార్షికంగా 27 శాతం పెరిగింది. క్రెడిట్ మానిటరింగ్ చేసుకుంటున్న వారి సగటు స్కోరు 728గా ఉంది. ఇలా పర్యవేక్షించుకుంటున్న వారిలో సుమారు 45 శాతం మంది ఆరు నెలల వ్యవధిలో తమ స్కోరును మరింత మెరుగుపర్చుకుంటున్నారు.సాధారణంగా వ్యక్తిగత రుణాల్లాంటివి అవసరమైనప్పుడు మాత్రమే వినియోగదారులు స్కోరును తెలుసుకునే వారని, కానీ ప్రస్తుతం తరచుగా తెలుసుకోవడం, దాన్ని మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నారని సంస్థ ఎండీ భవేష్ జైన్ తెలిపారు. మిలీనియల్స్, జెన్ జెడ్ తరం, మహిళలు ఈ విషయంలో ముందుంటున్నారని పేర్కొన్నారు. మెట్రోయేతర ప్రాంతాల్లో స్కోరు ను పరిశీలించుకునే ధోరణి పెరుగుతోందన్నారు. -
మినీ రత్న హోదాకు దగ్గర్లో ‘ఫ్యాక్ట్’
కోచి: ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ (ఫ్యాక్ట్) మినీరత్న హోదా పొందేందుకు కావాల్సిన దాదాపు అన్ని ముఖ్యమైన నిబంధనలను పూర్తి చేసిందని కంపెనీ డైరెక్టర్ (మార్కెటింగ్) అనుపమ్ మిశ్రా ప్రకటించారు. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోందని.. ఇది పూర్తయితే హోదా లభిస్తుందన్నారు.ఈ హోదాతో కంపెనీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎరువులు సహా ప్రతీ రంగంలోనూ స్వావలంబన దిశగా దేశం అడుగులు వేస్తోందంటూ.. ఈ దిశగా ఫ్యాక్ట్ తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు.‘‘ప్రభుత్వానికి వరుసగా మూడో ఏడాది డివిడెండ్లు చెల్లించాం. వరుసగా ఏడు సంవత్సరాల నుంచి లాభాల్లో కొనసాగుతున్నాం. ఐదేళ్లుగా కంపెనీ నికర విలువ సానుకూల స్థితిలో ఉంది. 2018–19లో కంపెనీ టర్నోవర్ రూ.18,00–1,900 కోట్లుగా ఉంటే.. నేడు రూ.5,000 కోట్లకు పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లకు చేరింది’’అంటూ సంస్థ సాధించిన పురోగతిని మిశ్రా వివరించారు. -
ఎస్బీఐకి ఐటీ శాఖ భారీ ట్యాక్స్ నోటీసు..
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్బీఐ ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.అసలు ఏం జరిగింది?ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(3), 144సి(3), 144బి కింద ఐటీ శాఖ మార్చి 19న ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి (AY24) సంబంధించి నిర్వహించిన స్క్రూటినీ అసెస్మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ పన్ను డిమాండ్ ఉత్పన్నమైందని బ్యాంక్ తెలిపింది. వివిధ అంశాల్లో ఆదాయపు పన్ను శాఖ చేసిన కోతలే (Disallowances) ఈ భారీ మొత్తానికి కారణమని తెలుస్తోంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే ఏవైనా ప్రధాన పరిణామాలు చోటుచేసుకుంటే వాటిని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పన్ను డిమాండ్ మొత్తం 'మెటీరియాలిటీ థ్రెషోల్డ్' (నిర్ణీత పరిమితి) కంటే ఎక్కువగా ఉన్నందున, పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్లో భాగంగా ఎస్బీఐ ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఎస్బీఐ తదుపరి చర్యలుఈ నోటీసుపై ఎస్బీఐ ధీమాగా ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి అంశాలపైనే బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోందని, తాజా నోటీసును కూడా అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పన్ను నోటీసు వల్ల బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణపై ఎటువంటి ప్రభావం ఉండదని ఎస్బీఐ యాజమాన్యం పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. -
లక్ష పెడితే ₹58 లక్షలు.. మ్యాన్ బ్రో ఇండస్ట్రీస్ షేర్ సంచలనం
-
నిన్న ₹7,000 పతనం.. ఇవాళ మళ్లీ పెరిగిన బంగారం ధర!
-
మార్కెట్లు పడిపోతున్నా ఈ 5 స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి..?
-
1 షేరు కొంటే 4 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.1.84 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్
-
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట.. ఇ-కేవైసీ వారికి మాత్రమే!
-
గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి నష్టం తప్పదు
-
ఘనంగా సీడీకే 'కన్వర్జెన్స్ 2026' వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ సంస్థ 'సీడీకే' (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో 'కన్వర్జెన్స్ 2026' వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడంతో పాటు, భారతీయ సంస్కృతి కుటుంబ విలువలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏడాది "మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం" అనే థీమ్తో వేడుకలు నిర్వహించారు.ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే సీడీకే సంస్థ, 2019 నుండి వరుసగా 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (GPTW) గుర్తింపును పొందుతోంది. అంతేకాకుండా, 2025 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ 100 ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయాల వెనుక ఉద్యోగుల శ్రమతో పాటు వారి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని ఈ వేడుక చాటిచెప్పింది.కన్వర్జెన్స్ 2026 వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించిన వేదికపై సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోన్ ఆకట్టుకుంది. ఇదే వేదికపై సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులకు 'రివార్డ్స్ అండ్ రికగ్నిషన్' విభాగంలో అవార్డులను అందజేసి గౌరవించారు. -
గోల్డ్ రూ.21 వేలు, వెండి లక్షన్నర పతనం.. తులం బంగారం ఎంతంటే..!
-
మళ్లీ బంగారం కొనే టైమొచ్చింది..! ఐదో రోజు పతనమైన గోల్డ్ రేట్
-
మహిళలకు ఇదే లక్కీ ఛాన్స్.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..!
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధర... ఒక్క రోజులో జంప్..
-
మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!
దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీగా పెరిగిన డేటా వినియోగం భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.జీబీకి రూ.1 పన్ను వేధించినా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వినియోగదారులపై ప్రభావంప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
రంగంలోకి రిలయన్స్! ఇక జోరుగా గ్యాస్ ఉత్పత్తి
ప్రపంచ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో దేశీయంగా వంటగ్యాస్ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న తన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ సముదాయాల్లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తిని పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ కీలక ఇంధనాలకు నిరంతర సరఫరా కొనసాగడం జాతీయ ప్రాధాన్యతగా ఉందని పేర్కొంది.అలాగే కేజీ-డీ6 బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజవాయువును ప్రాధాన్య రంగాలకు మళ్లించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. జాతీయ ఇంధన అవసరాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.“భారతదేశ ఇంధన భద్రత, కోట్లాది భారతీయ కుటుంబాల సంక్షేమం మా సంస్థకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తూ జాతీయ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉంటాం. అవసరమైన రంగాలకు ఇంధన సరఫరా నిరంతరం అందేలా చర్యలు కొనసాగిస్తాం” అని కంపెనీ తెలిపింది. అవసరమైన సమయంలో దేశానికి అండగా నిలబడటం రిలయన్స్ బాధ్యతగా భావిస్తుందని కూడా పేర్కొంది. ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో దేశ ఇంధన భద్రతకు మద్దతుగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా దేశంలోని అన్ని రిఫైనరీలు ప్రొపేన్, బ్యూటేన్, ప్రొపైలిన్, బ్యూటెన్స్ వంటి సి3, సి4 స్ట్రీమ్లను పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికి వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా ఉత్పత్తి అయ్యే వంటగ్యాస్ను దేశీయ వినియోగదారులకు మాత్రమే అందించాలని స్పష్టం చేసింది.ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే నిత్యావసర వస్తువుల చట్టం–1955చ పెట్రోలియం ఉత్పత్తుల (ఉత్పత్తి, నిల్వ, సరఫరా నిర్వహణ) ఆర్డర్–1999 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
Gold Prices: మహిళలు గుడ్ న్యూస్.. మళ్లీ పడిపోయిన పసిడి ధరలు..
-
10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
-
దేశీయ స్టాక్ మార్కెట్లు క్రాష్.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
-
ఈనెల 11 నుంచే ప్రభుత్వ సంస్థ.. ఏకంగా రూ.6000 కోట్లు.. రెడీగా ఉండండి..
-
టాటా స్టీల్ రూ. 11,000 కోట్ల పెట్టుబడులు
రాంచీ: అధునాతన గ్రేడ్ ఉక్కును తయారు చేసే దిశగా జంషెడ్పూర్ ప్లాంటుపై రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఇందుకోసం తాము రూపొందించిన టెక్నాలజీతో ఉక్కు ప్రాసెసింగ్ వేగవంతమవుతుందని, అలాగే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని చెప్పారు. నెదర్లాండ్స్లో ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయిన నేపథ్యంలో 2030 నాటికి జంషెడ్పూర్లో 1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. హైడ్రోజన్ ట్రక్కులపై కూడా టాటా మోటర్స్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. ఇక జార్ఖండ్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని టాటా గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఒక్కరోజులోనే కుప్పకూలిన బంగారం ధరలు.. ఈరోజు రేట్లు ఇవే..!
-
నౌకలు నిల్చిపోతే కీలక రంగాలపై ఎఫెక్ట్
పశ్చిమాసియాలో యుద్ధంతో (#IranIsraelUSWar) హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వారానికి పైగా నిల్చిపోతే దేశీయంగా పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో వెల్లడించింది. ఇంధన మార్కెట్ల నుంచి ఎరువుల సరఫరా, పరిశ్రమలకు ముడిపదార్థాలు, నిర్మాణ రంగ మెటీరియల్స్తో పాటు ఇతరత్రా ఎగుమతి రంగాలకు కూడా సవాళ్లు తప్పవని పేర్కొంది.‘‘దీనితో తక్షణం పెట్రోలియంపై ప్రభావం పడుతుంది. 2025లో పశ్చిమాసియా నుంచి భారత్ 70 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్రోలియం క్రూడ్, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్ వద్ద 30 రోజులకు సరిపడేంత ఇంధన నిల్వలే ఉన్నాయి. ఒకవేళ షిప్మెంట్స్లో ప్రతిష్టంభన మరింత దీర్ఘకాలం కొనసాగితే ఇంధనాల ధరలు వేగంగా పెరిగిపోతాయి. దీంతో రవాణా వ్యయాలతో పాటు మిగతా అన్నింటి ధరలూ పెరుగుతాయి. డీజిల్ రేట్ల వల్ల రైతులకు ఇరిగేషన్ పంపులు, ట్రాక్టర్ల నిర్వహణ వ్యయాల భారం పెరుగుతుంది’’ అని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. -
₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
-
Gold: వరుసగా నాలుగో రోజు పతనమైన బంగారం ధర
-
యుద్ధం దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
-
పాన్ కార్డు ఉంటే రూ.5 లక్షలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
-
NSE ఐపిఓ వచ్చేస్తోంది...టార్గెట్ రూ 23 వేల కోట్లు.. జేబులు నింపుకోడానికి రెడీగా ఉండండి
-
టాటా ఏఐజీ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్సిడెంట్ సూపర్ గార్డ్ ప్లస్’ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో సమగ్ర ఆర్థిక రక్షణను అందించే వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ఇదని, దేశంలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. వ్యక్తుల ఆదాయం, అప్పులు, జీవనశైలి రిస్క్లకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.ప్రమాద మరణం, శాశ్వత పాక్షిక, పూర్తి వైకల్యంలో ఏక మొత్తంలో బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అయ్యే ఖర్చులకు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. లోన్ షీల్డ్ (రుణాల కోసం), ఈఎంఐ ప్రొటెక్షన్, పెట్కేర్ పేరుతో ఐచ్ఛిక కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిపై వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ ప్లాన్ను తీసుకోవచ్చు. వేతన జీవులకు ప్రీమియంలో అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. -
సిమ్ బైండింగ్పై ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం లాంటి యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు తప్పనిసరిగా యాక్టివ్ సిమ్కార్డుతో లింక్ అయి ఉండాల్సిందేనంటూ (సిమ్ బైండింగ్) కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది టెలికమ్యూనికేషన్స్ చట్టాన్ని అతిక్రమించడమేనని, రాజ్యాంగవిరుద్ధమని టెలికం శాఖ కార్యదర్శి అమిత్ అగ్రవాల్కి ఫిబ్రవరి 23న రాసిన లేఖలో వ్యాఖ్యానించింది.దీని వెనుక గల అసలు కారణాలను తాము అర్థం చేసుకోగలమని, కాకపోతే నియంత్రణ సంస్థ జోక్యమనేది నిర్దిష్ట చట్టపరిధికి లోబడి ఉండాలని కోరుతున్నామని పేర్కొంది. మెటా, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలన్నీ బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరంలో సభ్యులుగా ఉన్నాయి. దేశ భద్రత రీత్యా సిమ్ బైండింగ్ నిబంధనలను మార్చే ప్రసక్తి లేదంటూ కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన నేపథ్యంలో బీఐఎఫ్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ద్రవ్యలోటు రూ.9.8 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జనవరి చివరికి (10 నెలల్లో) రూ.9.8 లక్షల కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సం బడ్జెట్ అంచనాలో ఇది 63 శాతానికి సమానం. క్రితం ఆర్థిక సంవత్సరం జనవరి చివరికి ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 74.5 శాతంగా ఉండడం గమనార్హం. 2025–26 సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (రూ.15.58 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది బడ్జెట్ అంచనా. ఈ వివరాలను కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. జనవరి చివరికి ప్రభుత్వానికి రూ.27.08 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.20.94 లక్షల కోట్లు పన్ను ఆదాయం కాగా, పన్నేతర రూపంలో రూ.5.57 లక్షల కోట్లు, రుణేతర మార్గాల్లో రూ.57,129 కోట్ల ఆదాయం సమకూరింది. -
కోడింగ్, ఎగ్జిక్యూట్ అంతా Aiతోనే.. మరి కొన్ని నెలల్లో ఐటీ ఉద్యోగాలన్నీ ఊస్ట్
-
ఈ ఒక్క స్టాక్ ఉంటే చాలు.. కాలు మీద కాలేసుకుని బతికేయొచ్చు..!
-
బ్యాంకులకు వరుస సెలవులు.. ఇదే చివరి నెల!
మార్చి నెలలో అడుగు పెడుతున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి నెల. పూర్తి చేయాల్సిన బ్యాంకు పనులు చాలానే ఉంటాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు కస్టమర్లు ఈ మార్చి నెలలో తమ బ్యాంకు బ్రాంచ్ల సందర్శనలను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పండుగలు, రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక సెలవులు, అలాగే సాధారణ ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల కారణంగా అనేక రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ముందస్తుగా షెడ్యూల్ను చూసుకోవడం ద్వారా నగదు ఉపసంహరణలు, చెక్ క్లియరెన్సులు వంటి ఇతర బ్రాంచ్ సేవలలో ఆలస్యాలను నివారించవచ్చు.మార్చిలో బ్యాంకు సెలవులు» మార్చి 1 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.» మార్చి 2: హోలికా దహన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 3: హోలి, డోల్జాతర తదితర పండుగల సందర్భంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు. మార్చి 4: యోసాంగ్ (రెండవ రోజు)తో పాటు హోలీ వేడుకల నేపథ్యంలో త్రిపుర, గుజరాత్, మిజోరం, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 8 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 13: చాప్కార్ కత్ సందర్భంగా మిజోరంలో బ్యాంకులు మూసివేత.» మార్చి 14 (రెండో శనివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 15 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 17: షాబ్ ఈ ఖదర్ సందర్భంగా జమ్మూ & కాశ్మీర్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 19: ఉగాది, గుడి పడ్వా, సాజిబు నోంగ్మా పంబా వేడుకల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, జమ్మూ & కాశ్మీర్, గోవా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.మార్చి 20: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్), జమాత్ ఉల్ విదా సందర్భంగా జమ్మూ కాశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 21: రంజాన్-ఈద్, సర్హుల్ తదితర పండుగల కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 22 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 26: శ్రీ రామ నవమి సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 28 (నాలుగో శనివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 29 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 31: మహవీర్ జయంతి సందర్భంగా ఆర్బీఐ సెలవుగా గుర్తించినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరాంత లావాదేవీల దృష్ట్యా ప్రభుత్వ వ్యాపారం నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులు ఆ రోజున తెరిచి ఉంటాయి.యథావిధిగా డిజిటల్ సేవలుబ్యాంకు బ్రాంచీలకు సెలవులు ఉన్నప్పటికీ ఏటీఎంలు, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సేవలు కొనసాగుతాయి. నిధుల బదిలీలు, బిల్లు చెల్లింపులు వంటి డిజిటల్ లావాదేవీలు అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటాయి. -
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తున్నట్లు ట్రూజాన్ సోలార్ పేరిట సౌర విద్యుదుత్పత్తుల సేవలందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు సీహెచ్ భవానీ సురేష్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 300–350 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికి రెట్టింపు స్థాయిలో రూ. 600–650 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇప్పటివరకు రెసిడెన్షియల్, కమర్షియల్ తదితర విభాగాల్లో 10,000కు పైగా రూఫ్టాప్ ఇన్స్టాలేషన్స్ చేసినట్లు ఆయన చెప్పారు.ప్రస్తుతం 600 మంది పైగా సిబ్బందితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు 5 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని సురేష్ తెలిపారు. వచ్చే నాలుగైదు నెలల్లో తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ తదితర 4 రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు దాదాపు రూ. 80 కోట్లు ఇన్వెస్ట్ చేశామన్నారు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
-
మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
-
భారీగా తగ్గిన వెండి.... దూసుకుపోతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?
-
వరల్డ్ ఫేమస్ హలీమ్ తయారీ.. పిస్తా హౌజ్ లో
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
4 రోజులుగా షాకిస్తున్న గోల్డ్ రేట్స్... రూ.7 వేల పైనే పెరిగిన బంగారం ధర..
-
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాక్..!
-
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ షాక్
-
SBI నుంచి మరో అతిపెద్ద IPO.. రూ.1.36 లక్షల కోట్లు..
-
మళ్లీ షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
-
జస్ట్ మూడేళ్లలో లక్షకు 62 లక్షలొచ్చాయ్.. లాభాల వరద పారించిన స్టాక్..
-
సైలెంట్ గా షాకిచ్చిన బంగారం, వెండి ధరలు
-
లోకల్తో పోటీకి బ్రిటానియా రెడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిన్న సంస్థలతో పోటీ పడేందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిన్న సంస్థలతో పోటీపడేందుకు స్టార్టప్ స్వభావంతో బ్రిటానియా వ్యవహరిస్తుందని.. ఈ–కామర్స్ విభాగంలో బిస్కెట్లు, రస్క్, కేక్, వేఫర్ల విభాగాల్లో మరింత బలంగా అవతరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో రక్షిత్ హర్గవే తెలిపారు.‘‘ప్రాంతీయ పోటీని ఎదుర్కొంటాం. ఈ–కామర్స్లో విస్తరణపై పెట్టుబడులు పెడతాం. అమ్మకాలు పెంచుకునేందుకు మాకు తగినన్ని అవకాశాలున్నాయని భావిస్తున్నాం’’అని వాటాదారులతో నిర్వహించిన కాల్లో భాగంగా చెప్పారు. విక్రయాలు పెంచుకునేందుకు మరింత మంది వినియోగదారులను చేరుకోవడం కీలకమని పేర్కొన్నారు. గుడ్డే, టైగర్, నూట్రిచాయిస్, మ్యారీగోల్డ్ తదితర పాపులర్ బ్రాండ్లు బ్రిటానియా ఇండస్ట్రీస్ సొంతం. చిన్న కంపెనీలను ప్రాంతీయ పోటీదారులుగానే చూస్తామంటూ.. కేవలం తూర్పునే కాకుండా దేశవ్యాప్తంగా చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీని సవాలుగా పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం వల్లే.. ద్రవ్యోల్బణం, ధరలు పెంచడంలో జాప్యం లోగడ మార్జిన్లపై ప్రభావం చూపించిందని, కమోడిటీ ధరలు దిగిరావడతో కంపెనీ లాభదాయకత మెరుగుపడినట్టు రక్షిత్ హర్గవే చెప్పారు. కీలకమైన ముడి పదార్థాలు, పాలు గోధుమల ధరలు స్థిరంగానే ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలన్నారు. చెక్కెర, కోకోవా ధరలు స్థిరంగా ఉండొచ్చన్నారు. కొనుగోళ్లకూ సై.. విస్తృతమైన పోర్ట్ఫోలియో నిర్మాణం దిశగా అవసరమైతే కొనుగోళ్ల అవకాశాలనూ బ్రిటానియా ఇండస్ట్రీస్ పరిశీలిస్తుందని చెప్పారు. అన్నీ సొంతంగానే నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు. చిన్న సంస్థలు ప్రాంతీయంగా అక్కడి ప్రజల ఇష్టాలు, అభిరుచులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలవని, అవి వాటి బలమని బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విపిన్ కటారియా తెలిపారు. వాటితో పోటీపడేందుకు బ్రాండ్ నిర్మాణంపై పెట్టుబడులు పెడుతున్నట్టు వాటాదారుల సమావేశంలో చెప్పారు. -
6 ఏళ్లలో లక్షకు రూ.14 కోట్లు.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం
-
Stock Market: ఈ ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోయినట్టే..!
-
Penny Stocks: చిన్న స్టాక్.. పెద్ద అద్భుతం.. ఐదేళ్లలో లక్షకు అరకోటి లాభం..!
-
కేవలం రూ.150 పెట్టుబడితో రూ.24 లక్షలు..
-
SBI గుడ్ న్యూస్.. రూపాయి కంటే తక్కువ వడ్డీకే Personal Loan..
-
Stock Market: దూసుకుపోతున్న టేక్ సొల్యూషన్స్ 6 నెలల్లో 416% లాభం
-
SIP Plan: 10 వేల సిప్ తో ఏకంగా 16కోట్లు లాభం
-
MRF ఇన్వెస్టర్లపై కాసుల వర్షం..
-
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఇవాళ రేట్లు ఎంతంటే..?
-
Stock Market: లక్షకు 9 లక్షలు.. 7 రూపాయల షేరు 65కు జంప్.. రాత మారిపోయింది..!
-
రూట్ మార్చిన బంగారం, వెండి.. ఇవాళ ఎంత పెరిగిందంటే
-
రిలయన్స్ చేతికి సదరన్ హెల్త్ ఫుడ్స్
న్యూఢిల్లీ: అనుబంధ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్(ఆర్సీపీఎల్) తాజాగా తమిళనాడు కంపెనీ సదరన్ హెల్త్ ఫుడ్స్ను సొంతం చేసుకుంటున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అయితే డీల్ విలువను తెలియజేయలేదు.తాజా కొనుగోలు ద్వారా తృణ ధాన్యాల(మిల్లెట్స్) ఆధారిత ఫుడ్ విభాగంలో రిలయన్స్ కన్జూమర్ విస్తరించనుంది. రెండు దశాబ్దాలుగా ఆరోగ్యకర ఆహార విభాగంలో మన్నా బ్రాండ్తో సదరన్ హెల్త్ ఫుడ్స్ విభిన్న ప్రొడక్టులను విక్రయిస్తోంది. ఆర్సీపీఎల్ ఇటీవలే ఆ్రస్టేలియా సంస్థ గుడ్నెస్ గ్రూప్ గ్లోబల్ పీటీవైను సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. తద్వారా బెటర్ ఫర్ యు బ్రాండ్ పానీయాల బిజినెస్ను సొంతం చేసుకున్న విషయం విదితమే. -
లక్షను 40 లక్షలు చేసిన స్టాక్.. జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు..
-
చైనా దూకుడు.. ఆపకుండా బంగారం కొంటున్న డ్రాగన్!
బంగారం, వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన అనంతరం తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో కొత్త కదలికలకు దారితీసింది. ధరలు తీవ్ర అస్థిరతను చూపుతున్నప్పటికీ, చైనా మాత్రం బంగారం కొనుగోలును దూకుడుగా కొనసాగిస్తోంది. చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) వరుసగా 15వ నెల కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంది.2,307 మెట్రిక్ టన్నుల బంగారంపీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా విడుదల చేసిన డేటా, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. గత జనవరి నెలలో కూడా చైనా బలమైన బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. జనవరి చివరి నాటికి చైనా మొత్తం బంగారం నిల్వలు 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు (ఒక ఫైన్ ట్రాయ్ ఔన్సు అంటే 31.1035 గ్రాములు మొత్తం 2,307.56 మెట్రిక్ టన్నులు) చేరాయి. ఇది డిసెంబర్ చివర్లో నమోదైన 74.15 మిలియన్ ట్రాయ్ ఔన్సులతో పోలిస్తే స్వల్ప పెరుగుదలే అయినప్పటికీ, నిల్వల మొత్తం విలువ మాత్రం గణనీయంగా పెరిగింది.ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకే?జనవరి చివరి నాటికి చైనా బంగారం నిల్వల మొత్తం విలువ 369.58 బిలియన్ డాలర్లకు చేరింది. గత నెలలో ఇది 319.45 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఈ భారీ పెరుగుదలకి ప్రధాన కారణాలుగా నెల ప్రారంభంలో ఉన్న అధిక బంగారం ధరలు, అలాగే చైనా నిరంతర కొనుగోలు వ్యూహాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ప్రమాదాల నేపథ్యంలో చైనా తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే భాగంగా బంగారం నిల్వలను పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చైనా నుంచి వచ్చిన బలమైన డిమాండ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జరిగిన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణంగా జనవరిలో బంగారం ధరలు ఔన్సుకు 5,600 డాలర్ల చారిత్రక గరిష్టాన్ని తాకాయి. అయితే ఈ ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్లో తదుపరి కీలక నాయకత్వ పాత్రకు కెవిన్ వార్ష్ను పరిగణనలోకి తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడడంతో మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా స్పాట్ గోల్డ్ ధరలు గణనీయంగా పడిపోయాయి.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,887 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ దిద్దుబాటు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరల దిశపై అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొనుగోలు చేస్తుండగా, అదే సమయంలో దేశీయ వినియోగదారుల బంగారం వినియోగం మాత్రం వరుసగా రెండో ఏడాది కూడా తగ్గుముఖం పట్టింది.భారత్ పసిడి నిల్వలు ఇలా..జనవరి 2026 నాటికి, భారతదేశ కేంద్ర బ్యాంకు తన విదేశీ మారక నిల్వలలో సుమారు 880 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. తాజా విదేశీ నిల్వల డేటా ప్రకారం జనవరి చివరి నాటికి భారతదేశ మొత్తం రిజర్వ్ వాల్యుయేషన్కు ఆర్బీఐ బంగారం హోల్డింగ్స్ సుమారు 123 బిలియన్ డాలర్లు దోహదపడ్డాయి. ప్రపంచ ధరల లాభాలతో భారతదేశ బంగారం నిల్వ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ తాజా పసిడి కొనుగోళ్లు గణనీయంగా మందగించాయి. -
పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన గోల్డ్ రేట్
-
గోల్డ్, సిల్వర్ రేట్స్ సీన్ రివర్స్.. ఒక్కసారే రూ. 20000 ఢమాల్
-
భారత్లో ‘ఐకియా’కు మరిన్ని నష్టాలు
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన ఫర్నిచర్, గృహ ఫర్నిషింగ్ రిటైల్ కంపెనీ ‘ఐకియా’ ఇండియా ప్రైవేటు లిమిటెడ్కు భారత్లో నష్టాలు మరింత అధికమయ్యాయి. 2024–25 సంవత్సరానికి రూ.1,325 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. విక్రయాల ద్వారా ఆదాయం 3.33 శాతం తగ్గి రూ.1,749 కోట్లకు పరిమితమైంది. ఈ సంస్థ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1,810 కోట్ల ఆదాయంపై రూ.1,299 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవైపు భారీ నష్టం ఎదురవుతున్నా కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలపై 14 శాతం అధికంగా రూ.224 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ రూపంలో చేసిన వ్యయం రూ.196 కోట్లు, ఐకియా ఇండియా రుణ భారం రూ.8,335 కోట్లకు పెరిగింది. 2024 మార్చి నాటికి రుణ భారం రూ.7,060 కోట్లుగానే ఉంది. -
ఇక స్టార్టప్ అంటే రూ. 200 కోట్లు!
న్యూఢిల్లీ: అంకుర సంస్థల నిర్వచనాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టర్నోవరు పరిధిని రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచింది. డీప్ టెక్ స్టార్టప్ల పరిధిని కూడా విస్తరించింది. ఇకపై రిజిస్టరయిన 20 ఏళ్ల వరకు, వాటిని స్టార్టప్లుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఇది పదేళ్లుగా ఉంది.టర్నోవరు పరిమితిని కూడా రూ. 300 కోట్లకు ప్రభుత్వం పెంచింది. డీప్ టెక్ సంస్థలకి భారీ స్థాయిలో పెట్టుబడులు కావాల్సి ఉంటుందని, వ్యాపార కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు సుదీర్ఘ సమయం పట్టేయొచ్చని డీపీఐఐటీ నోటిఫికేషన్లో పేర్కొంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు తదితరాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా నిర్దిష్ట కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్లకు కూడా స్టార్టప్ గుర్తింపునివ్వనుంది.ఇదే సమయంలో ఈ మార్పులతో స్టార్టప్ వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టర్నోవరు, కాలపరిమితుల పెంపుతో ఎక్కువ సంస్థలు స్టార్టప్ హోదా పొందే అవకాశం ఏర్పడనుంది. దీంతో పన్ను రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, ఫండింగ్ అవకాశాలు విస్తరించనున్నాయి. ముఖ్యంగా డీప్ టెక్, అగ్రి టెక్, క్లైమేట్ టెక్ వంటి రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ, సహకార రంగాల్లోనూ సాంకేతికత ఆధారిత వ్యాపారాలు పెరగడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. -
పాస్పోర్ట్ కొత్త రూల్స్.. పది రోజుల్లో అమల్లోకి!
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త పాస్పోర్ట్ నిబంధనలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళంగా మార్చడం, భద్రతను బలోపేతం చేయడం, అలాగే దేశవ్యాప్తంగా సేవలను వేగవంతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి 15 తర్వాత ఈ నిబంధనలు పూర్తిగా అమల్లోకి రానున్నాయి.దీంతో పాస్పోర్ట్ పొందడం లేదా పునరుద్ధరించుకోవడం మరింత సమర్థవంతంగా మారనుంది. చివరి నిమిషంలో దరఖాస్తు తిరస్కరణలు లేదా ఆలస్యాలు ఎదురుకాకుండా ఉండేందుకు, దరఖాస్తుదారులు ముందుగానే కొత్త నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.సరళీకృత పత్రాలు, వేగవంతమైన ధ్రువీకరణకొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం.. పాస్పోర్ట్ దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితాను క్రమబద్ధీకరించారు. పేపర్వర్క్ను తగ్గించేందుకు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేశారు. ఆధార్ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, తక్కువ సర్టిఫికెట్లతోనే దరఖాస్తు పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో పాస్పోర్ట్ కార్యాలయాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.అయితే అసంపూర్ణం లేదా తప్పుగా అప్లోడ్ చేసిన పత్రాలతో చేసే దరఖాస్తులు మాత్రం పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో పత్రాలు అప్లోడ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం.పోలీస్ వెరిఫికేషన్లో కీలక మార్పులుపాస్పోర్ట్ జారీ ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకునే పోలీస్ ధ్రువీకరణను కూడా సవరించారు. ఇకపై ఇది ప్రధానంగా డిజిటల్ మార్గాల్లోనే జరగనుంది. సమన్వయ వ్యవస్థల ద్వారా అనేక సందర్భాల్లో వారాల పాటు పట్టే ధ్రువీకరణను కొన్ని రోజుల్లోనే పూర్తిచేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ ముందుగా జారీ చేసి, తరువాత వెరిఫికేషన్ చేసే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. దీంతో మొత్తం ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.మరింత సులభమైన ఆన్లైన్ సేవలుప్రభుత్వ పాస్పోర్ట్ పోర్టల్ను యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో అప్గ్రేడ్ చేశారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులు లేకుండానే ఫారమ్లు పూరించడం, పత్రాలు అప్లోడ్ చేయడం, అపాయింట్మెంట్ స్లాట్లను బుక్ చేయడం చేయవచ్చు. రియల్ టైమ్ నోటిఫికేషన్లతో దరఖాస్తు స్థితిని సులభంగా ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది.మైనర్లకు సంబంధించి తల్లిదండ్రుల సమ్మతి, డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాలు లేదా పాఠశాల ఐడీలను సులభంగా అంగీకరించేలా నిబంధనల్లో స్పష్టత తీసుకొచ్చారు. దీని వల్ల పిల్లల పాస్పోర్ట్ జారీకి పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువగా సేవలుదేశవ్యాప్తంగా పాస్పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా పాస్పోర్ట్ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
-
కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
12 కంపెనీల IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్.. ఇన్వెస్టర్లకు పండగే..!
-
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
-
సిల్వర్ సునామీ.. బంగారం దూకుడు..
-
గోల్డ్ 2 లక్షలు? వెండి 3 లక్షలు? కొందామా! అమ్ముదామా!
-
మోత మోగిస్తున్న వెండి.. భయపెడుతున్న బంగారం
-
రెచ్చిపోతున్న బంగారం.. గోల్డ్ దూరం చేసిన ఘనుడు!
-
ఎలాన్ మస్క్ ఛీ కొట్టాడు.. ఇప్పుడు రూ. 6000 కోట్లకు అధిపతి
-
చిన్న పొదుపు.. పెద్ద మొత్తం.. పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్
-
చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ
-
పసిడి పరుగులు.. వెండి వెలుగులు
-
లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ
-
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. జియో ఐపీఓ జీఎంపీ అదుర్స్..
-
అదృష్టం అంటే వీళ్లదే.. లక్షకు 8 లక్షలు..
-
Gold: తగ్గిన బంగారం ధరలు
-
ప్రతీ నెలా రూ.10 వేల పొదుపుతో కోటీశ్వరులయ్యారు.. సూపర్ హిట్ స్కీమ్ మీ కోసం
-
బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?
-
ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఎప్పటినుంచంటే?
ప్రముఖ ఈ కామర్స్ అగ్ర సంస్థ అమెజాన్ రిపబ్లిక్ డే బిగ్ సేల్కు సిద్ధమైంది. ఈ మేరకు సేల్ ప్రారంభం తేదీని ప్రకటించింది. జనవరి 16న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్-2026 ప్రారంభం కానుందని వెల్లడించింది. ఈ బిగ్ సేల్లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ ప్రకటన విడుదల చేసింది.త్వరలోనే ప్రాడక్ట్స్పై అందించే డీల్స్ వివరాలను వెల్లడిస్తామని అమెజాన్ పేర్కొంది. సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, పీసీలు, గేమింగ్ కన్సోల్, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషిన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్టీవీలపై ఆఫర్లు ఉంటాయని తెలిపింది. అమెజాన్తో పాటు ఫ్లిప్కార్ట్ జనవరి 17న సేల్ను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పండగ సీజన్లో రెండు అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థల మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. -
Business: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
ఏడాది చివరికల్లా 93,918 పాయింట్లకు సెన్సెక్స్
బీఎస్ఈ ఎక్స్ఛేంజ్లోని బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 2026 డిసెంబర్ నాటికి 93,918 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ క్లయింట్ అసోసియేట్స్ అంచనా వేసింది. అంటే సెన్సెక్స్ ప్రస్తుత స్థాయి (84,961)తో పోలిస్తే 11% పెరిగే వీలుందని అభిప్రాయపడింది.‘‘దేశీయ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. కార్పొరేట్ ఆదాయాల అవుట్లుక్ మెరుగ్గానే ఉన్నాయి. అయితే షేర్ల వాల్యుయేషన్లు అధికంగా ఉండటం, అంతర్జాతీయ అనిశి్చతుల కారణంగా ఇన్వెస్టర్లు ‘క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి’ వ్యూహాన్ని అనుసరించవచ్చు. దీంతో ఈ ఏడాది భారతీయ మార్కెట్ విస్తృత స్థాయి ర్యాలీలకు స్వస్తి పలికి.., ఎంపిక చేసుకున్న, ఫండమెంటల్ ఆధారిత అవకాశాల దిశగా అడుగులు వేయోచ్చు’’ అని సంస్థ రీసెర్చ్ హెడ్ నితిన్ అగర్వాల్ తెలిపారు.రిస్క్ అంచనాలను మెరుగుపరుచుకుంటూ.., సరైన డైవర్సిఫికేషన్ విధానాలను అనుసరిస్తే ధీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీలు ప్రధాన వనరులుగా కొనసాగుతాయని అగర్వాల్ పేర్కొన్నారు.ఇంకా 2026కి సంబంధించిన క్లయింట్ అసోసియేట్స్ వార్షిక ఈక్విటీ అంచనా నివేదికలో.... పోర్ట్ఫోలియో వైవిద్యీకరణలో బంగారం, వెండి కీలకం. డాలర్ బలహీనత, భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాల్లో మార్పుల కారణంగా గతేడాదిలో విలువైన లోహాలు భారీ రాబడులు ఇచ్చాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం డిమాండి పెరిగి, వ్యూహాత్మక పెట్టుబడి సాధనగా పసిడి ప్రాధాన్యం మరింత పెరిగింది. అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు, అమెరికా–చైనా ఉద్రిక్తతలు, వెండిని కూడా కీలక లోహంగా గుర్తించే చర్చల నేపథ్యంలో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్ వృద్ధి అవుట్లుక్ మెరుగ్గానే ఉంది. బలమైన డిమాండ్, తయారీ–సేవల రంగ విస్తరణ, స్థిరమైన జీఎస్టీ వసూళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదవ్వొచ్చు. -
ఇలా చేస్తే..! 12 ఏళ్లలో 50 లక్షలు మీదే..!
-
వెండి, బంగారం కంటే ఖరీదైన కూరగాయ..! KG ఎంతంటే..?
-
2026లో గోల్డ్ దూకుడు.. తులం 1,60,000 పక్క?
-
పోటాపోటీగా.. వెండి, బంగారం ధరలు
-
జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న వెండి
-
ఐటీ ఉద్యోగాలు.. బాగానే పెరిగాయ్..
దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఈ ఏడాది హైరింగ్ మెరుగ్గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 16 శాతం పెరిగాయి. 2025లో మొత్తం ఐటీ ఉద్యోగాల డిమాండ్ 18 లక్షలకు చేరినట్లు వర్క్ఫోర్స్, టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది.దీని ప్రకారం ఐటీ హైరింగ్ మార్కెట్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అత్యధికంగా 27 శాతం వాటా దక్కించుకున్నాయి. 2024లో నమోదైన 15 శాతంతో పోలిస్తే గణనీయంగా ఉద్యోగులను తీసుకున్నాయి. ఇక ప్రోడక్ట్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) సంస్థలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో రిక్రూట్ చేసుకున్నాయి. అయితే, ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ విభాగాల్లో మాత్రం నియామకాల వృద్ధి ఒక మోస్తరుగానే నమోదైంది.నిధుల ప్రవాహం నెమ్మదించడంతో స్టార్టప్లలో హైరింగ్ కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్కి పడిపోయినట్లు నివేదిక వివరించింది. అప్పటికప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగ విధులను నిర్వర్తించేందుకు సన్నద్ధంగా ఉన్న వారితో పాటు మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ (4–10 ఏళ్ల అనుభవం) ఉన్నవారి ప్రాధాన్యం లభించింది. మొత్తం హైరింగ్లో వీరి వాటా 65 శాతానికి పెరిగింది. 2024లో ఇది 50 శాతం. నివేదికలో మరిన్ని విశేషాలు.. మొత్తం డిమాండ్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో హైరింగ్ వాటా 15 శాతంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నియామకాలు మొత్తం ఐటీ హైరింగ్లో 10–11 శాతంగా నమోదయ్యాయి. 2024లో ఇది సుమారు 8 శాతంగా నిల్చింది. ఐటీలో నెలకొన్న డిమాండ్ని బట్టి చూస్తే ఐటీ కొలువుల్లో కాంట్రాక్ట్ నియామకాల వాటా పెరిగింది. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారిపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది (2026) ఆసాంతం ఐటీ హైరింగ్ ఇదే విధంగా ఉండొచ్చు. డిజిటల్లో స్పెషలైజ్డ్ ఉద్యోగ విధులు, ద్వితీయ శ్రేణి నగరాల పరిధిని దాటి క్రమంగా విస్తరిస్తుండటం వంటి అంశాలు ఇందుకు దన్నుగా ఉంటాయి. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ, డేటా ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ నెలకొనవచ్చు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), తయారీ, సాస్, టెలికం రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండొచ్చు.సర్వీసుల్లో ఫ్రెషర్స్, మహిళల నుంచి దరఖాస్తుల వెల్లువ సర్వీసుల ఆధారిత ఉద్యోగాలవైపు మహిళలు, ఫ్రెషర్స్ మొగ్గు చూపడంతో ఈ ఏడాది ఉద్యోగాలకు దరఖాస్తులు 29 శాతం పెరిగాయి. అప్నాడాట్కో నివేదిక ప్రకారం 9 కోట్లకు పైగా జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. మెట్రోల పరిధిని దాటి హైరింగ్, డిజిటల్ రిక్రూట్మెంట్ సాధనాల వినియోగం పెరిగింది. ఫైనాన్స్, అడ్మిని్రస్టేటివ్ సర్వీసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, హెల్త్కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 36 శాతం పెరిగి 3.8 కోట్లుగా నమోదయ్యాయి.ఇది చదివారా? సత్య నాదెళ్లకు అదో సరదా..ఇక సర్వీస్, టెక్నాలజీ ఆధారిత రంగాల్లో ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు సుమారు 10 శాతం పెరిగాయి. అప్నాడాట్కో పోర్టల్లోని ఉద్యోగ దరఖాస్తుల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం ఏటా 1 కోటి మంది యువతీ, యువకులు ఉద్యోగాల్లో చేరుతున్నారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), రిటైల్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, ఐటీ సర్వీసులు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎస్ఎంబీ) జాబ్ పోస్టింగ్స్ 11 శాతం పెరిగి 10 లక్షలుగా నమోదైంది. అటు పెద్ద సంస్థల్లో జాబ్ పోస్టింగ్స్ 14 శాతం పెరిగి 4 లక్షలుగా నమోదయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల నుంచి సుమారు 2 కోట్ల దరఖాస్తులు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల నుంచి 1.8 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. మహిళల జీతభత్యాలు సగటున 22 శాతం పెరిగాయి. -
ఓయో ఐపీవోకు వాటాదారులు ఓకే
ట్రావెల్ టెక్ ప్లాట్ఫామ్ ప్రిజమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు అనుగుణంగా ఓటు వేసినట్లు ఓయో బ్రాండ్ కంపెనీ ప్రిజమ్ పేర్కొంది.ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారులు ఆమోదించినట్లు వెల్లడించింది. వెరసి తగిన సమయంలో లిస్టింగ్ సన్నాహాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది.ఈ ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో భాగాన్ని అప్పుల తగ్గింపు, టెక్నాలజీ ప్లాట్ఫామ్ బలోపేతం, కొత్త మార్కెట్ల విస్తరణతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు సూచించాయి. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన అనంతరం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) దాఖలు చేసి, ఇష్యూ టైమ్లైన్ను ఖరారు చేయనున్నట్లు తెలిపాయి. -
చైనా జేవీలో అరబిందో ఫార్మా వాటాల పెంపు
చైనా కంపెనీతో ఏర్పాటు చేసిన లువోక్సిన్ ఆరోవిటాస్ జాయింట్ వెంచర్లో అదనంగా 20 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం 5.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 46 కోట్లు) వెచి్చంచనున్నట్లు వివరించింది.దీనికోసం భాగస్వామి షాన్డాంగ్ లువోక్సిన్ ఫార్మా గ్రూప్తో తమ అనుబంధ సంస్థ హెలిక్స్ హెల్త్కేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. మూడు నెలల వ్యవధిలో ఈ లావాదేవీ ముగియనుంది. జేవీలో హెలిక్స్కి 30 శాతం, షాన్డాంగ్కి 70 శాతం వాటాలు ఉన్నాయి. 2029 నాటికి 18.86 మిలియన్ డాలర్లతో మిగతా 50 శాతం వాటాను అరబిందో ఫార్మా కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంది. -
వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే
-
లక్షకు 2లక్షలు.. ఇన్వెస్టర్లకు MEESHO కాసుల వర్షం
-
బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇకపై OTP అవసరం లేదు..!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో (UAE) బ్యాంకింగ్ లావాదేవీలు ఇకపై మరింత సురక్షితం కానున్నాయి. SMS ద్వారా వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) విధానాన్ని దశలవారీగా రద్దు చేసి, బ్యాంక్ మొబైల్ యాప్లోనే నేరుగా అనుమతి ఇచ్చే స్మార్ట్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో ఆన్లైన్ కొనుగోళ్ల సమయంలో OTP బదులు బ్యాంక్ యాప్లో పుష్ నోటిఫికేషన్ వస్తుంది.వినియోగదారులు యాప్లో లాగిన్ చేసి బయోమెట్రిక్ లేదా స్మార్ట్ పాస్ పిన్ ద్వారా లావాదేవీకి అనుమతి ఇవ్వాలి. యాప్లోనే వెరిఫికేషన్ జరుగుతుండటంతో ఫిషింగ్, సిమ్ స్వాప్ వంటి మోసాలు నివారించబడతాయి. ఎమిరేట్స్ NBD సహా ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే ఈ మార్పు ప్రారంభించాయి. కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఎలా పని చేస్తుందంటే..?కార్డ్ వివరాలు ఇచ్చిన వెంటనే యాప్లో లాగిన్ చేయమని సందేశం వస్తుంది. యాక్టివిటీస్ విభాగంలో లావాదేవీ వివరాలు చూసి, రెండు నిమిషాల్లో అనుమతి ఇవ్వాలి. స్మార్ట్ పాస్ పిన్ నమోదు చేసిన వెంటనే లావాదేవీ పూర్తవుతుంది. దశలవారీగా అమలు ప్రస్తుతం కొన్ని లావాదేవీలకు మాత్రమే ఈ సిస్టమ్ అమల్లో ఉంది. 2026 మార్చి నాటికి SMS, ఈమెయిల్ OTP విధానాలు పూర్తిగా రద్దవుతాయి. అప్పటి వరకు పాత విధానం మరియు కొత్త విధానం రెండూ కలిపి కొనసాగుతాయి. కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్తో యుఏఈలో డిజిటల్ బ్యాంకింగ్ మరింత వేగవంతం, సురక్షితం కానుంది. -
2026 లో తులం రూ.2 లక్షలకు చేరుతుందా..?
-
Gold Price: తగ్గేదేలే అంటున్న బంగారం మరో వైపు వెండికి రెక్కలు
-
నెలకు రూ.2000 పొదుపుతో.. రూ. 5 కోట్లొచ్చాయ్
-
అత్యధిక బంగారం నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే..!
-
‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత
ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్ బ్రాండ్ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.ముంబైలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ తమ ఎక్స్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లాక్మే బ్రాండ్ను భారతదేశంలో ప్రముఖ కాస్మెటిక్ కంపెనీగా అభివృద్ధి చేయడంలో సిమోన్ టాటా కృషిని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సిమోన్ టాటా కన్నుమూతపై లాక్మే ఇండియా కూడా సంతాపం తెలియజేసింది. లాక్మే వెనుక దార్శనికురాలిని కోల్పోయామంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.టాటా కుటుంబంలో చేరి..సిమోన్ టాటా.. ప్రసిద్ధ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాకు తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు సవతి తల్లి. 1930లో జన్మించిన సిమోన్ డునోయర్ జెనీవాలో పెరిగారు. 1953లో పర్యాటకురాలిగా భారత్ వచ్చిన ఆమె నావల్ హెచ్ టాటాను వివాహమాడి ఇక్కడే స్థిరపడ్డారు. 1962లో టాటా ఆయిల్ మిల్స్కు చిన్న అనుబంధ సంస్థగా ఉన్న లాక్మే బోర్డులో చేరారు. అందం లగ్జరీ కాకూడదని, ప్రతి భారతీయ మహిళకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లాక్మే ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేశారు.We mourn the passing of Simone Tata, a truly accomplished woman whose achievements and grace touched so many. Her legacy will continue to inspire generations. May she rest in peace. Our thoughts & prayers are with the Tata family 🙏#SimoneTata pic.twitter.com/y3sHlL7ngJ— Swiss Consulate Mumbai (@SwissCGMumbai) December 5, 2025 -
రెపో రేటును తగ్గించిన RBI
-
7 ట్రిలియన్ డాలర్లకు గ్రీన్ ఎకానమీ
అంతర్జాతీయ గ్రీన్ ఎకానమీ (పర్యావరణ అనుకూల రంగాలు) విలువ 2030 నాటికి వార్షికంగా 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. ఇప్పటికే ఇది 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించినట్టు తెలిపింది. భారత్ పునరుత్పాదక విద్యుత్ పరంగా అధిక వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్తో కలసి రూపొందించిన నివేదికను విడుదల చేసింది.పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థతో ఎన్నో రంగాల్లోని వ్యాపారాలు ప్రయోజనం పొందుతున్నట్టు తెలిపింది. పర్యావరణ అనుకూల పరిష్కారాలను అనుసరిస్తున్న కంపెనీలు లబ్ది పొందుతున్నట్టు వివరించింది. ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, వైవిధ్యమైన పర్యావరణ పరిస్థితుల్లోనూ గ్రీన్ టెక్నాలజీలపై పెట్టుబడులు గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. సంప్రదాయ వ్యాపార మార్గాల కంటే పర్యావరణ అనుకూల వ్యాపార ఆదాయాలు కలిగిన కంపెనీలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక వివరించింది.సంప్రదాయ కంపెనీల కంటే పర్యావరణ అనుకూల వ్యాపారాల ఆదాయాలు రెండు రెట్లు అధికంగా వృద్ధి చెందుతున్నాయని, అలాగే నిధుల వ్యయాలు కూడా పర్యావరణ అనుకూల వ్యాపార కంపెనీలకు తక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది. దీంతో ఈ కంపెనీలు 12–15 శాతం అధిక ప్రీమియాన్ని క్యాపిటల్ మార్కెట్లలో పొందుతున్నట్టు తెలిపింది. దీర్ఘకాలంలో ఈ కంపెనీల లాభాలు బలంగా కొనసాగుతాయన్న నమ్మకం ఇన్వెస్టర్లలో ఉండడమే దీనికి కారణమని వివరించింది.పునరుత్పాదక విద్యుత్లో భారత్ టాప్ పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుదుత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 9 శాతం పెరుగుతుంటే, 13 శాతం వృద్ధితో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక వెల్లడించింది. చైనాలో వృద్ధి 12 శాతంగా ఉన్నట్టు తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఏటా 10 శాతం వృద్ధి నమోదవుతుందంటూ.. 16 శాతం వృద్ధితో భారత్ ముందుంటుందని అంచనా వేసింది. 15 శాతం వృద్ధితో చైనా తర్వాతి స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. 2019 నుంచి 2024 వరకు భారత్, చైనాలో పర్యావరణ అనుకూల ఇంధనాలపై ఏటా 12 శాతం చొ3ప్పున పెట్టుబడులు పెరిగినట్టు వెల్లడించింది. భారత్లో పునరుత్పాదక విద్యుదుత్పత్తి విభాగంలో ‘రెన్యూ’ కంపెనీని ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా 28 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ సంస్థ కలిగి ఉన్నట్టు తెలిపింది. -
మళ్లీ పడిపోయిన రూపాయి
భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్తో భారత రూపాయి మారక విలువ మళ్లీ పడిపోయింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చుట్టూ ఉన్న నిరంతర ఈక్విటీ అవుట్ ఫ్లోలు, అనిశ్చితి కారణంగా డిసెంబర్ 4న రూపాయి 22 పైసలు పడిపోయింది.కీలకమైన రూ.90 మార్కును అధిగమించి మునుపటి సెషన్ ను ముగించిన తర్వాత డాలర్తో రూపాయి విలువ గురువారం రూ.90.41 వద్ద ప్రారంభమైంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిమిత జోక్యం కూడా కరెన్సీని ఒత్తిడిలో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూపాయి తగ్గితే ఏమౌతుంది? -
రూపాయి ఢమాల్.. అయినా డోంట్ వర్రీ.. ఎందుకంటే?
-
ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గిస్తుందా?
ఆర్బీఐ ఎంపీసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడంతోపాటు, జీడీపీ వృద్ధి బలంగా కొనసాగుతుండడం రేట్ల కోతకు అనుకూలించొచ్చని పేర్కొంది. ఈ నెల 5న ఆర్బీఐ ఎంపీసీ తన నిర్ణయాలను ప్రకటించనుండడం తెలిసిందే. ద్రవ్యోల్బణం దశా బ్ద కనిష్ట స్థాయి అయిన 0.3 శాతానికి అక్టోబర్లో తగ్గినట్టు కేర్ ఎడ్జ్ గుర్తు చేసింది.ఆర్బీఐ లక్ష్యం అయిన 4 శాతానికి ఇది ఎంతో దిగువన ఉందని, దీంతో పాలసీ రేట్ల తగ్గింపునకు వెసులుబాటు ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతంగా ఉంది. ‘‘బ్రెంట్ ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు ఉండడం రబీ సాగుకు అనుకూలం. చైనాలో తయా రీ అధికంగా ఉండడంతో ధరలు పెరిగే ఒత్తిళ్లు లేవు. ద్రవ్యోల్బణం ఇక్కడి నుంచి గణనీయంగా పెరగకుండా ఇవి సాయపడతాయి’’అని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ద్వితీయార్ధంలో వృద్ధి నెమ్మదించొచ్చు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.2 శాతానికి విస్తరించగా.. ద్వితీయ ఆరు నెలల్లో (క్యూ3, క్యూ4) వృద్ధి రేటు 7 శాతానికి నెమ్మదించొచ్చని కేర్ ఎడ్జ్ అంచనా వేసింది. అమెరికా టారిఫ్లు అమల్లోకి రావడానికి ముందుగా చేసిన అధిక ఎగుమతులు, పండుగల అనంతరం వినియోగం తగ్గడం వంటివి వృద్ధి రేటును నెమ్మదింపజేస్తాయని పేర్కొంది.కాకపోతే పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే 12 నెలల్లో 3.7 శాతంలోపు ఉండొచ్చని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య చర్చలు దీర్ఘకాలం పాటు కొనసాగుతుండడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. విదేశీ మారకం నిల్వలు బలంగానే కొనసాగుతున్నట్టు, నవంబర్ మధ్య నాటికి 27 బిలియన్ డాలర్లు పెరిగి 693 బిలియన్ డాలర్లకు చేరినట్టు తెలిపింది. -
ఆగ్రో కెమికల్స్కు డిమాండ్
ఆగ్రో కెమికల్స్కు (వ్యవసాయ సంబంధిత రసాయనాలు) డిమాండ్ అంతర్జాతీయంగా కోలుకుంటుండడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఆదాయం 6–7 శాతం పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా సాగుకు సంబంధించి నెలకొన్న సానుకూల సెంటిమెంట్తో ఎగుమతుల ఆదాయం 8–9 శాతం పెరుగుతుందని పేర్కొంది. అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడం, ఉత్పత్తులు వెనక్కి రావడం, సాగు సన్నద్ధత వంటి అంశాలు దేశీయ డిమాండ్కు సమస్యలుగా ఉన్నట్టు తెలిపింది.‘‘రెండు సంవత్సరాల స్థిరీకరణ తర్వాత ఆగ్రో కెమికల్స్ రంగంలో ఆదాయం 2025–26లో 6–7 శాతం పెరగొచ్చు. ఇది కూడా ధరల పెంపు ద్వారా కాకుండా అధిక అమ్మకాల రూపంలో రానుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ఇన్వెంటరీలు (స్టాక్ నిల్వలు) కూడా సాధారణ స్థాయికి చేరడం ఆదాయం వృద్ధికి అనుకూలిస్తుందని చెప్పారు.ఇక ఆగ్రోకెమికల్స్ పరిశ్రమ తన దీర్ఘకాల వృద్ధి అయిన 8–10 శాతానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. అయితే, ఎగుమతులు స్థిరంగా కొనసాగడం, దేశీ డిమాండ్ పుంజుకోవడంపై ఈ వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. పరిశ్రమ ఆదాయంలో దేశీ, విదేశీ మార్కెట్లో చెరో సగం వాటా కలిగి ఉన్నట్టు తెలిపింది. ముడి సరుకుల ధరలు స్థిరంగా ఉండడం, అమెరికా టారిఫ్ల ప్రభావంతో నిర్వహణ మార్జిన్లు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక శ్రేణి పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది.రుణ భారం నియంత్రణలోనే.. తక్కువ మూలధన వ్యయాలు, స్థిరమన మూలధన నిధులతో ఆగ్రో కెమికల్ కంపెనీల రుణభారం నియంత్రణల్లోనే ఉంటుందని, దీంతో రుణ పరపతిని మెరుగ్గా కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. లాక్డౌన్ అనంతరం పేరుకున్న నిల్వలు తగ్గిపోవడంతో దేశీయంగా ఆగ్రోకెమికల్స్ ధరలు స్థిరపడినట్టు తెలిపింది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆగ్రో కెమికల్Šస్పై కిలోకి 5 డాలర్ల ప్రయోజనం ఒనగూరుతోందని, గతేడాది స్థాయిలోనే ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇదే కొనసాగొచ్చని అంచనా అంచనా వ్యక్తం చేసింది. నిల్వలు తగ్గడం, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో సరఫరాలు స్థిరపడతాయని పేర్కొంది.‘‘ఆగ్రో కెమికల్స్ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 12.5–13 శాతంగా ఉండొచ్చు. అయినప్పటికీ కరోనా ముందున్న 15 శాతం కంటే తక్కువే. 2024లో ప్రతికూలతల అనంతరం ఈ స్థిరత్వం నెలకొంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు ఇందుకు అనుకూలిస్తున్నాయి. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఏటా రూ.5,500 కోట్ల పెట్టుబుడులు పెడుతుండడం, కొత్త ఉత్పత్తుల రిజి్రస్టేషన్లు, క్రమశిక్షణతో కూడిన మూలధన నిధుల నిర్వహణ వంటివి.. రుణ అవసరాలను తక్కువకు పరిమితం చేస్తాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ వివరించారు.అయినప్పటికీ ఈ రంగం పనితీరుపై వాతావరణ మార్పులు, నియంత్రణలను కఠినతరం చేయడం, రూపాయి మారకం విలువల ప్రభావాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. -
ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ
-
ఇండిగో సంస్థకు భారీ జరిమానా
విమానయాన సంస్థ ఇండిగోకు జీఎస్టీ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్కు సంబంధించి కేరళలోని సీజీఎస్టీ కొచ్చి కమిషనరేట్లోని సెంట్రల్ టాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ రూ .117.52 కోట్ల జరిమానా విధించారని, దీన్ని సవాలు చేస్తామని ఇండిగో తెలిపింది.ఇండిగో రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. జరిమానా 2018-19 నుంచి 2021-22 మధ్య కాలానికి సంబంధించి కంపెనీ పొందిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను డిపార్ట్మెంట్ తిరస్కరించింది. దీంతో జరిమానాతో సహా డిమాండ్ ఆర్డర్ జారీ చేసింది. ‘అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు తప్పుగా ఉన్నాయని కంపెనీ నమ్ముతోంది. అలాగే బాహ్య పన్ను సలహాదారుల సహాయంతో కేసుపై బలం తమ వైపే ఉంటుందని కంపెనీ విశ్వసిస్తోంది’ అని ఇండిగో ఫైలింగ్లో పేర్కొంది.పన్ను అధికారులు ఇచ్చిన జరిమానా నోటీసును తగిన అధికారుల ముందు సవాలు చేస్తామని తెలిపిన ఇండిగో యాజమాన్యం.. దీని వల్ల తమ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ లేదా ఇతర కార్యకలాపాలపై పెద్ద ప్రభావమేమీ ఉండదని వివరించింది.ఏమిటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్?ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అనేది వ్యాపార సంస్థలు ఇన్పుట్లపై చెల్లించిన పన్నులకు క్రెడిట్ క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను బాధ్యతను తగ్గించుకునేందుకు అనుమతించే జీఎస్టీ కింద ఒక యంత్రాంగం. ఈ అర్హతను ఆయా వ్యాపార సంస్థలు పొందాయా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలిస్తారు. ఒకే వేళ వ్యత్యాసాలు గుర్తిస్తే ఆ ట్యాక్స్ క్రెడిట్ను జరిమానాతో సహా తిరిగి వసూలు చేస్తారు. -
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ.. రూ. 10,000 కోట్లకు సై!
తాజాగా సెకండరీ మార్కెట్లు కొత్త గరిష్టాల రికార్డ్ను సాధించగా.. ప్రైమరీ మార్కెట్లు సైతం ఈ కేలండర్ ఏడాది(2025) సరికొత్త రికార్డులవైపు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 96 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్ ఎక్ఛ్సేంజీలలో లిస్టయ్యాయి. గత మూడు నెలల్లోనే 40 కంపెనీలకుపైగా ఐపీవోకు రావడం విశేషం! ఇంతక్రితం 2024లో 94 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించి రికార్డ్ నెలకొల్పాయి. కాగా.. తాజాగా మరో 4 కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధపడనున్నాయి. వివరాలు చూద్దాం..ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. దీంతో రూ. 10,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు వీలు చిక్కింది.ఈ బాటలో మరో మూడు కంపెనీల ముసాయిదా ప్రాస్పెక్టస్లకు సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో పవరికా లిమిటెడ్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, అన్ను ప్రాజెక్ట్స్ చేరాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతించమంటూ ఈ కంపెనీలు సెబీకి 2025 జూలై– సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తాజాగా అనుమతులు పొందాయి. ఈ నెలలోనే ఆఫర్ ప్రస్తుతం కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈ నెలలోనే పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 51 శాతంకాగా.. ప్రుడెన్షియల్ కార్పొరేషన్ 49 శాతం వాటా కలిగి ఉంది.ఇష్యూలో భాగంగా 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్(యూకే) ఆఫర్ చేయనుంది. దీంతో ఐపీవో నిధులు ప్రుడెన్షియల్ కార్పొరేషన్(ప్రమోటర్)కు చేరనున్నాయి. దేశీయంగా ఇప్పటికే నాలుగు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. లిస్టెడ్ ఏఎంసీలు.. హెచ్డీఎఫ్సీ, యూటీఐ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, శ్రీరామ్, నిప్పన్ లైఫ్ జాబితాలో ఐదో కంపెనీగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చేరనుంది.పవర్ సొల్యూషన్స్.. పవర్ సొల్యూషన్స్ సమకూర్చే పవరికా లిమిటెడ్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 700 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 525 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు మరికొన్ని నిధులు కేటాయించనుంది.వృథా నీటి సొల్యూషన్లు వ్యర్థ జలాల ట్రీట్మెంట్ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా 95.05 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను ప్రమోటర్ సంస్థ కార్తకేయ కన్స్ట్రక్షన్స్ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 138 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో సేవలందిస్తున్న అన్ను ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా ఐపీవో చేపట్టనుంది. 2003లో అన్ను ఇన్ఫ్రా కన్స్ట్రక్ట్(ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్గా ఏర్పాటైన కంపెనీ తదుపరి అన్ను ప్రాజెక్ట్స్గా అవతరించింది. మౌలిక రంగ సంబంధ డిజైన్, డెవలప్మెంట్, అభివృద్ధి, నిర్వహణ తదితర సరీ్వసులు సమకూర్చుతోంది.వేక్ఫిట్ @ రూ. 185–195 హోమ్, ఫర్నిషింగ్స్ కంపెనీ వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 185–195 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 8న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 377 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 912 కోట్ల విలువైన 4.67 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లతోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,289 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూ 10న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 5న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూ తదుపరి ప్రమోటర్ల వాటా 43.7 శాతం నుంచి 37 శాతానికి దిగిరానున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామలింగెగౌడ వెల్లడించారు. ఈ నెల 15కల్లా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్కానుంది. కంపెనీ విలువ రూ. 6,400 కోట్లుగా నమోదయ్యే వీలుంది.నిధుల వినియోగమిలా ఈక్విటీ జారీ నిధులలో రూ. 31 కోట్లు కొత్తగా 117 కోకో రెగ్యులర్ స్టోర్ల ఏర్పాటుకు, రూ. 15 కోట్లు మెషీనరీ తదితర కొనుగోళ్లకు, రూ. 161 కోట్లు లీజ్, సబ్లీజ్ అద్దెలుసహా ప్రస్తుత స్టోర్ల లైసెన్స్ ఫీజు చెల్లింపులకు వినియోగించనున్నట్లు వేక్ఫిట్ పేర్కొంది. మరో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ప్రకటనలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ప్రస్తుతం 130 స్టోర్లను నిర్వహిస్తున్న కంపెనీ వార్షికంగా 25–45 స్టోర్లను జత చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది.2016లో ఏర్పాటైన కంపెనీ హోమ్, ఫర్నిషింగ్ మార్కెట్లో దేశీయంగా వేగవంత వృద్ధిని సాధిస్తోంది. 2024 మార్చి31కల్లా రూ. 1,000 కోట్లుపైగా ఆదాయం అందుకుంది. 2025 సెప్టెంబర్30కల్లా 6 నెలల్లో రూ. 724 కోట్ల టర్నోవర్, రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ సొంత చానళ్లు, కోకో స్టోర్లతోపాటు.. ఇతర ఈకామర్స్ ప్లాట్ఫామ్లు, మల్టీబ్రాండ్ ఔట్లెట్ల ద్వారా విభిన్న ఫర్నీచర్, ఫర్నిషింగ్స్ ప్రొడక్టులను విక్రయిస్తోంది. బెంగళూరు(కర్ణాటక), హోసూర్(తమిళనాడు), సోనిపట్(హర్యానా)లలో రెండేసి చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది. -
Gold Prices: శాంతించిన బంగారం ధరలు.. ఇవాళ తులం ఎంతుందుంటే..!
-
ఐదేళ్లలో 10 కోట్ల కస్టమర్లు.. అపోలో ఫార్మసీ లక్ష్యం
వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది కస్టమర్ల స్థాయికి చేరుకోవాలని అపోలో ఫార్మసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రోజుకు రెండు కొత్త స్టోర్స్ ప్రారంభించే ప్రణాళికల్లో ఉంది. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో తాజాగా ప్రారంభించిన దానితో కలిపి మొత్తం 7,000 స్టోర్స్ మైలురాయిని చేరిన సందర్భంగా సంస్థ సీఈవో పి. జయకుమార్ ఈ విషయాలు వెల్లడించారు.‘ప్రతి రోజూ రెండు కొత్త స్టోర్స్ని ప్రారంభించడాన్ని కొనసాగిస్తాం. వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది కస్టమర్లకు చేరువవుతాం. తద్వారా అత్యంత నాణ్యమైన ఔషధాలను అందరికి అందుబాటులోకి తెస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. అపోలో ఫార్మసీని అపోలో హెల్త్కో నిర్వహిస్తోంది. తమ పెయిడ్ హెల్త్కేర్ లాయల్టీ ప్రోగ్రాం అయిన అపోలో సర్కిల్ సభ్యుల సంఖ్య 1 కోటి దాటిందని కంపెనీ వెల్లడించింది.మరోవైపు, 7 వేల స్టోర్స్ మైలురాయిని చేరడమనేది అసంఖ్యాక కుటుంబాలకు తమపై గల నమ్మకానికి నిదర్శనమని అపోలో హెల్త్కో ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభనా కామినేని తెలిపారు. అపోలో ఫార్మసీ ప్రస్తుతం 19,000పైగా పిన్కోడ్స్వ్యాప్తంగా రోజుకు పది లక్షల ఆర్డర్లు ప్రాసెస్ చేస్తోందని వివరించారు. -
ఖాతాల్లోనే మిగిలిపోయిన డబ్బు.. ఇక ఒకే పోర్టల్!
క్లెయిమ్ చేయకుండా ఖాతాల్లోనే మిగిలిపోయిన డిపాజిట్లు, పెన్షన్ ఫండ్, షేర్లు, డివిడెండ్లను క్లెయిమ్ చేసుకోవడంలో ప్రజలకు సహాయకరంగా ఉండేలా రిజర్వ్ బ్యాంక్తో కలిసి సమగ్ర పోర్టల్ను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.అన్క్లెయిమ్డ్ అసెట్స్ కోసం ఉద్గాం పేరుతో ఆర్బీఐ, మిత్ర పేరిట మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీమా భరోసా పేరుతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వేర్వేరు పోర్టల్స్ నిర్వహిస్తున్నాయి. ’మీ డబ్బు, మీ హక్కు’ పేరిట అన్క్లెయిమ్డ్ అసెట్స్పై అక్టోబర్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, సెబీ, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్ఏ)తో కలిసి ఆర్థిక సేవల విభాగం దీన్ని ప్రారంభించింది. ఇప్పటికే రూ. 1,887 కోట్ల మొత్తాన్ని సిసలైన యజమానులు లేదా వారి నామినీలకు అందజేసినట్లు నాగరాజు వివరించారు. అవగాహన లేకపోవడం లేదా అకౌంట్ వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల చాలా ఖాతాల్లో బీమా పాలసీ క్లెయిమ్లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉండిపోతున్నాయి. వీటిని అన్–క్లెయిమ్డ్ అసెట్స్గా పరిగణిస్తున్నారు. -
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర
-
భారీగా పెరిగిన బంగారం ధర
-
షేక్ చేస్తున్న కోకాపేట.. ఎకరం 151 కోట్లు
-
మార్కెట్ కు కొత్త జోష్.. నిఫ్టీ సరికొత్త రికార్డ్
-
త్వరలో పసిడి రుణాల్లోకి పిరమల్ ఫైనాన్స్
2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1.5 లక్షల కోట్ల ఏయూఎంని (నిర్వహణలోని అసెట్స్) లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పిరమల్ ఫైనాన్స్ రిటైల్ లెండింగ్ సీఈవో జగదీప్ మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతం రిటైల్ ఏయూఎం రూ. 75,000 కోట్లుగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇది సుమారు రూ. 8,300 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.తమ వ్యాపారంలో సుమారు 11–12 శాతం వాటా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై మరింత దృష్టి పెడుతున్నామని ఆయన పేర్కొ న్నారు. ప్రధాన నగరాల్లో 59 శాఖలు ఉన్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50–75 శాఖలు ప్రారంభించనున్నామని, వీటిలో కొన్ని ఇక్కడ కూడా ఉంటాయని జగదీప్ పేర్కొన్నారు.ప్రస్తుత గృహ, ఎస్ఎంఈ, వ్యక్తిగత, వాహన రుణాలందిస్తున్న తమ సంస్థ త్వరలో పసిడి రుణాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ పండుగ సీజన్లో సెమీ అర్బన్ మార్కెట్లలో డిమాండ్ నెలకొనడంతో రిటైల్ రుణాల మంజూరు 45 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. -
అసంఘటిత రంగంలో పెరిగిన ఉద్యోగాలు
ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో అసంఘటిత రంగ సంస్థల్లో (యూఎస్ఈ) ఉద్యోగాలు స్వల్పంగా పెరిగాయి. క్రితం క్వార్టర్లో 12,85,72,500గా ఉండగా సెప్టెంబర్ త్రైమాసికంలో 12,85,95,600కి చేరాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన సర్వే డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.తయారీ, వాణిజ్యం, ఇతర సర్వీసులు అనే మూడు వ్యవసాయేతర రంగాల గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం, ప్రత్యేకంగా చట్టబద్ధమైన సంస్థలుగా నమోదు చేసుకోని ఈ తరహా సంస్థల్లో ఉద్యోగాలు జనవరి–మార్చి క్వార్టర్లో నమోదైన 13,13,38,000తో పోలిస్తే రెండో ఏప్రిల్–జూన్ క్వార్టర్లో తగ్గాయి.ఈ రంగంలో ఇంటర్నెట్ వినియోగం జూన్ క్వార్టర్లో నమోదైన 36 శాతంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో 39 శాతానికి పెరిగింది. సెపె్టంబర్ త్రైమాసికంలో తయారీలో ఉపాధి పెరిగింది. -
ఎస్బీఐ వెంచర్స్ టార్గెట్ రూ. 2,000 కోట్లు
బ్యాంకింగ్ రంగ పీఎస్యూ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)కు చెందిన ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్ ఎస్బీఐ వెంచర్స్ మూడో పర్యావరణహిత ఫండ్ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ నిధులను సంబంధిత స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది.దీంతో పర్యావరణ పరిరక్షిత వృద్ధికి మద్దతివ్వనున్నట్లు ఎస్బీఐ వెంచర్స్ ఎండీ, సీఈవో ప్రేమ్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఐవీసీఏ గ్రీన్ రిటర్న్స్ రెండో సదస్సు సందర్భంగా ఇది కొత్త ఫైనాన్షియల్ అవకాశమని తెలియజేశారు. దీనిలో దేశ, విదేశీ ఇన్వెస్టర్లను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వచ్చే ఏడాది మొదట్లో రోడ్షోలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు.మార్చికల్లాకొత్త కేలండర్ ఏడాది(2026) తొలి త్రైమాసికం(జనవరి–మార్చి)లో క్లయిమేట్ ఫండ్ను ఆవిష్కరించడం ద్వారా రూ. 2,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభాకర్ వెల్లడించారు. నిధులను ప్రధానంగా తొలి దశ, వృద్ధిస్థాయిలో ఉన్న క్లయిమేట్ ఫోకస్డ్ స్టార్టప్లలో పెట్టుబడులకు వినియోగించనున్నట్లు వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణమైన సాంకేతికతలు, ఏఐ ఆధారిత క్లయిమేట్ ఆవిష్కరణలకు తెరతీసే స్టార్టప్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. -
హోమ్ లోన్ అంటే ప్రభుత్వ బ్యాంకే.. ఎందుకు?
గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు) తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో జారీ అయిన మొత్తం గృహ రుణాల విలువలో 50 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నట్టు క్రిఫ్ హైమార్క్ సంస్థ వెల్లడించింది. ప్రైవేటు రంగ బ్యాంక్లను ఈ విభాగంలో ప్రభుత్వరంగ బ్యాంకులు అధిగమించినట్టు తెలిపింది.ఇక మొత్తం రుణాల్లో 40 శాతం రూ.75 లక్షలకు మించిన గృహ రుణాలే ఉన్నాయి. మొత్తం యాక్టివ్ రుణాలు (చెల్లింపులు కొనసాగుతున్నవి) 3.3 శాతం పెరిగి 2.29 కోట్లకు చేరాయి. రిటైల్ రుణాల్లో అతిపెద్ద విభాగమైన గృహ రుణాల మార్కెట్ సెప్టెంబర్ త్రైమాసికంలో 11.1 శాతం పెరిగి రూ.42.1 లక్షల కోట్లకు చేరింది.కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాల విభాగంలో డిమాండ్ స్తబ్దుగా ఉందంటూ.. 10.2 శాతం వృద్ధి కనిపించినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. 31 నుంచి 180 రోజుల వరకు చెల్లింపుల్లేని వినియోగ రుణాలు జూన్ చివరికి 3.1 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 3 శాతానికి తగ్గాయి.ప్రభుత్వ బ్యాంకుల వాటా ఎక్కువ ఉండటానికి కారణాలువడ్డీరేట్లు సాధారణంగా తక్కువగా ఉండటంప్రభుత్వరంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్లు ఇస్తాయి. ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే వారి ప్రాసెసింగ్ ఫీజులు కూడా తక్కువగా ఉంటాయి.ప్రభుత్వంపై నమ్మకంఇంటి కోసం తీసుకునే రుణం ఎక్కువ సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వరంగ బ్యాంకులపై ఉన్న భద్రతా భావం కారణంగా అక్కడి నుంచే రుణం తీసుకోవాలనే భావన బలంగా ఉంటుంది.ప్రభుత్వ హౌసింగ్ స్కీములుప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి పథకాలు సాధారణంగా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో ఇస్తారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల హౌసింగ్ లోన్ డిమాండ్ పెరుగుతుంది.పెద్ద మొత్తాల రుణాలువినియోగదారులకు పెద్ద మొత్తాల రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులు ముందుంటాయి. గణాంకాల ప్రకారం.. మొత్తం రుణాల్లో 40% రూ.75 లక్షలకుపైబడినవే ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తాల రుణాలను ఇచ్చే ధైర్యం, ఫండింగ్ సామర్థ్యం ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ.రిస్క్ తీసుకునే సామర్థ్యంప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం వంటి షరతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం మధ్య తరగతి వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ఆదాయం గలవారికి కూడా రుణాలు ఇవ్వడానికి ముందుంటాయి.బ్రాంచ్ నెట్వర్క్ భారీగా ఉండటంగ్రామీణ, పట్టణాల్లో ప్రభుత్వ బ్యాంకుల శాఖలు ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే చాలా ఎక్కువ. ఫలితంగా లోన్ యాక్సెస్ సులభంగా ఉంటుంది. -
క్రాష్ తర్వాత ఎయిరిండియా కొత్త ఆశలు
వచ్చే ఏడాది (2026) ఆఖరు నాటికి కొత్తగా 26 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని ఎయిరిండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ (Air India CEO Campbell Wilson) వెల్లడించారు. అలాగే అప్గ్రేడ్ చేసిన విమానాలతో 81 శాతం ఇంటర్నేషనల్ సర్వీసులను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. అయితే, మొత్తం మీద విమాన ప్రయాణికుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వివరించారు.‘ఏఐ 171 క్రాష్ కావచ్చు లేదా ఇతరత్రా పరిస్థితులు కావచ్చు గత కొద్ది నెలలుగా ఎదురైన ప్రతికూలతలు ఎలా ఉన్నా, 2026లో ఎయిరిండియాలో సుస్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మేము పెట్టుబడుల ప్రణాళికలను కొనసాగిస్తున్నాం‘ అని విల్సన్ చెప్పారు. ‘కొత్త విమానాలు వస్తున్నా, కొన్ని విమానాలను లీజుదార్లకు తిరిగి ఇచ్చేయనుండటం, చాలా మటుకు విమానాలకు రెట్రోఫిట్ చేస్తుండటం వల్ల వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్యాపరంగా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు.ఎయిరిండియా గ్రూప్లో ప్రస్తుతం 300 విమానాలు (ఎయిరిండియాకి 187, ఎయిరిండియా ఎక్స్ప్రెస్కి 110 విమానాలు) ఉన్నాయి. ఎయిరిండియా వద్ద సుదీర్ఘ దూరాలకు ప్రయాణించగలిగే బోయింగ్ 777 విమానాలు 22, అలాగే బోయింగ్ 787 రకం విమానాలు 32 ఉన్నాయి. వచ్చే ఏడాది ఎయిరిండియాకు 20 చిన్న విమానాలు, 6 పెద్ద ఎయిర్క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తాయని విల్సన్ చెప్పారు. 2026 ఆఖరు నాటికి బోయింగ్ 787 విమానాల్లో మూడింట రెండొంతుల ఎయిర్క్రాఫ్ట్లు అప్గ్రేడ్ అవుతాయని వివరించారు. -
న్యూ ఫండ్ ఆఫర్: కొత్త మ్యూచువల్ ఫండ్స్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) తమ యులిప్ ప్లాన్స్ కింద డివిడెండ్ ఈల్డ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. అత్యధికంగా డివిడెండ్ చెల్లించే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్ లక్ష్యం. ఈ ఫండ్ ప్రధానంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీల ఈక్విటీలు, ఈక్విటీల ఆధారిత సాధ నాల్లో 80–100% వరకు, డెట్.. మనీ మార్కెట్ సాధనాల్లో 20% వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. మహీంద్రా మాన్యులైఫ్ ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్వోఎఫ్ మహీంద్రా మాన్యులైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 1తో ముగుస్తుంది. డెట్, ఆర్బిట్రేజ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. 24 నెలలకు పైబడి పెట్టుబడి కొనసాగించి, పన్నుల అనంతరం స్థిరమైన, మెరుగైన రాబడి అందుకోవాలనుకునే వారికి ఇది అనువైనదిగా ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించడం ద్వారా 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రమే వర్తించేలా ఎఫ్వోఎఫ్ స్వరూపం ఉంటుంది.యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మల్టీ అసెట్ ఎఫ్వోఎఫ్ యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ మల్టీ–అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం ప్రధానంగా.. ఈక్విటీ ఆధారిత, డెట్ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ పథకాలు, కమోడిటీ ఆధారిత ఈటీఎఫ్ల యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇది నేరుగా ఆయా సెక్యూరిటీల్లో కాకుండా వాటికి సంబంధించిన ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెడుతుందని గమనించాలి. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) 2025 నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 5న ముగుస్తుంది. -
ఇన్ఫోసిస్ బైబ్యాక్: షేరుకి రూ. 1800
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి తెరతీస్తోంది. ఈ నెల 26న ముగియనున్న బైబ్యాక్లో భాగంగా షేరుకి రూ. 1,800 ధర మించకుండా చెల్లించనుంది. ఇందుకు రూ. 18,000 కోట్లవరకూ వెచ్చించనుంది. దీనిలో భాగంగా రూ. 5 ముఖ విలువగల 10 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసే లక్ష్యంతో ఉంది.ఇది కంపెనీ ఈక్విటీలో 2.41 శాతం వాటాకు సమానంకాగా.. అర్హతగల వాటాదారులు నవంబర్ 20–26 మధ్య కాలంలో షేర్లను విక్రయించేందుకు(టెండర్) వీలుంటుంది. మధ్యకాలానికి కంపెనీ నిర్వహణ సంబంధ నగదు అవసరాలను పరిగణించాక మిగులు నిధులను వాటాదారులకు పంచే యోచనతో బైబ్యాక్కు ఉపక్రమించింది.రెండు విభాగాలుగా..కంపెనీ మూలధన కేటాయింపుల విధానం ప్రకారం బైబ్యాక్ను రెండు విభాగాలుగా చేపడుతున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. సాధారణ కేటగిరీతోపాటు.. చిన్న వాటాదారులకు రిజర్వ్డ్ విభాగాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రిజర్వేషన్ విభాగంలో వాటాదారుల ఈక్విటీ షేర్ల సంఖ్యలో 15 శాతం లేదా ఇందుకు అర్హమైన ఈక్విటీ షేర్ల సంఖ్యలో ఏది ఎక్కువైతే దానిని పరిగణిస్తుంది.ఈ నెల 14కల్లా వాటాదారులుగా నమోదై రూ. 2 లక్షల విలువకు మించకుండా షేర్లు కలిగిన వాటాదారులకు ఇది వర్తించనుంది. చిన్న ఇన్వెస్టర్లకు 2:11, సాధారణ కేటగిరీలో 17:706 నిష్పత్తిని షేర్ల బైబ్యాక్కు నిర్ణయించింది. ఇన్ఫోసిస్లో 25,85,684 మంది చిన్న ఇన్వెస్టర్లున్నారు. అంటే రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద గల ప్రతీ 11 షేర్లలో 2 షేర్లకు బైబ్యాక్ను ఆఫర్ చేస్తుంది.గత బైబ్యాక్ల తీరిలా ఇన్ఫోసిస్ గతంలో తొలిసారి 2017లో రూ. 13,000 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను చేపట్టింది. కంపెనీ ఈక్విటీలో 4.92 శాతం వాటాకు సమానమైన 11.3 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు షేరుకి రూ. 1,150 ధరను నిర్ణయించింది. తదుపరి 2019లో రూ. 8,260 కోట్లు ఇందుకు వెచ్చించింది.ఈ బాటలో మూడోసారి రూ. 9,200 కోట్లు, 2022లో మరోసారి షేరుకి రూ. 1,850 చొప్పున రూ. 9,300 కోట్లు చొప్పున బైబ్యాక్కు కేటాయించింది. కాగా.. ప్రస్తుత బై బ్యాక్లో ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ పాల్గొనబోమని ఇప్పటికే ప్రకటించారు. ప్రమోటర్లలో నందన్ నిలేకని, సుధా మూర్తిసహా ఇతర ప్రమోటర్ కుటుంబీకులు ఇందుకు నో చెప్పడం గమనార్హం! -
2.75 లక్షల యూజర్లు.. 1.3 లక్షల ఫిర్యాదులు
వినియోగదారులు ఆన్లైన్లో ఫిర్యాదులు దాఖలు చేసేందుకు తీసుకొచ్చిన ఈ–జాగృతి ప్లాట్ఫామ్కు మంచి ఆదరణ లభిస్తోంది. జనవరి 1న దీన్ని ప్రారంభించగా, ఇప్పటి వరకు 2.75 లక్షల మంది ఈ ప్లాట్ఫామ్పై తమ పేర్లను నమోదు (రిజిస్టర్డ్ యూజర్లు) చేసుకున్నారు. ఇందులో 1,388 మంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు.ఫిర్యాదుల కోసం ఓసీఎంఎస్, ఈ–దాఖిల్, ఎన్సీడీఆర్సీ సీఎంఎస్, కాన్ఫోనెంట్ పోర్టళ్లు అందుబాటులో ఉండగా, వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ ఇ–జాగృతి ప్లాట్ఫామ్ను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తీసుకురావడం గమనార్హం. దేశవ్యాప్తంగా వినియోగదారులు ఫిర్యాదులు దాఖలు చేసేందుకు, అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశారు.నవంబర్ 13 నాటికి 1,30,550 ఫిర్యాదులు దాఖలైనట్టు.. ఇందులో 1,27,058 ఫిర్యాదులకు పరిష్కారం చూపించినట్టు వినియోగ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఎన్ఆర్ఐలు విదేశాల నుంచే తమ వినియోగ హక్కులను ఈ ప్లాట్పామ్ ద్వారా కాపాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్లాట్ఫామ్తో భౌగోళిక పరమైన అవరోధాలు వారికి తొలగినట్టయిందని తెలిపింది. మీరూ ఫిర్యాదు చేస్తారా?మొదట ఇ-జాగృతి అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండితొలిసారి యూజర్ అయితే, మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్, మీరు వినియోగదారా లేక ఇతరులా అన్న వివరాలు నమోదు చేయండి.ఇప్పుడు వెరిఫికేషన్ ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంచుకోండి. చిరునామా, గుర్తింపు రుజువు వివరాలు ఇచ్చి రిజిస్టర్ పూర్తి చేయండికొత్త కంప్లయింట్ ఇలా..లాగిన్ అయిన తరువాత, మీ డ్యాష్ బోర్డ్ మీద "ఫైల్ న్యూ కేస్" ఎంచుకోండి. తర్వాత కేసు టైప్ను ఎంచుకుని ‘కన్స్యూమర్ కంప్లయింట్’పై క్లిక్ చేయండి.ఇప్పుడు ఫిర్యాదు అవసరమైన డాక్యుమెంట్లు, రుసుము వివరాలు కనిపిస్తాయి.వస్తువులు లేదా సేవల కోసం మీరు చెల్లించిన మొత్తం, ఇప్పుడు ఎంత పరిహారం కోరుకుంటున్నారు, తేదీ, మీ రాష్ట్రం, జిల్లా, కేటగిరీ, సబ్ కేటగిరి తదితర వివరాలు నమోదు చేయండి.కొనుగోలు రసీదులు, వారితో లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.చివరగా మొత్తం వివరాలను ఒకసారి సరిచూసుకుని సంబంధిత రుసుము చెల్లించి సబ్మిట్ చేయండి. -
ఆ ‘సర్దుబాటు’పైనే వొడాఫోన్ ఐడియా ఆశలన్నీ..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా(వీఐ).. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిల విషయంలో తగిన, దీర్ఘకాలిక పరిష్కారాన్ని ఆశిస్తోంది. ఈ సమస్యపై ప్రభుత్వంతో చురుగ్గా సంప్రదింపులు జరుగుతున్నాయని కంపెనీ సీఈఓ అభిజిత్ కిశోర్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దాదాపు రూ.78,500 కోట్ల ఏజీఆర్ బకాయిలు పేరుకుపోగా, దీనికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని తాజాగా సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.కాగా, క్యూ2 ఫలితాల అనంతరం అభిజిత్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. నిధుల సమీకరణ కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో సహా పలు మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఏజీఆర్ పరిష్కారంపైనే ఈ ప్రయత్నాలన్నీ ఆధారపడి ఉంటాయన్నారు. కాగా, 2025–26 సెప్టెంబర్తో ముగిసిన ప్రథమార్ధంలో వీఐ నికర నష్టం రూ.12,132 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.02 లక్షల కోట్లకు చేరింది. -
బజాజ్ ఫిన్సర్వ్ లాభం రూ. 2,244 కోట్లు
డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫిన్సర్వ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ. 2,244 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,087 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,704 కోట్ల నుంచి రూ. 37,403 కోట్లకు ఎగసింది.వడ్డీ ఆదాయం రూ. 16,572 కోట్ల నుంచి రూ. 19,599 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 27,741 కోట్ల నుంచి రూ. 30,581 కోట్లకు పెరిగాయి. అనుబంధ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ లాభం 5 శాతం పుంజుకుని రూ. 517 కోట్లకు చేరగా.. అసెట్ మేనేజ్మెంట్ ఏయూఎం రూ. 28,814 కోట్లను తాకింది.జాగిల్ లాభం జూమ్ స్పెండ్ మేనేజ్మెంట్ కంపెనీ జాగిల్ (zaggle) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 79 శాతం జంప్చేసి రూ. 33 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 42 శాతంపైగా ఎగసి రూ. 431 కోట్లను తాకింది.నిర్వహణ లాభం(ఇబిటా) 48% వృద్ధితో రూ. 44 కోట్లకు చేరింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో కలసి రిటైల్ కార్డుల విభాగంలోకి ప్రవేశించినట్లు కంపెనీ వెల్లడించింది. జాగిల్ గ్లోబల్ప్లే ఫారెక్స్ కార్డ్తోపాటు జాగిల్ మాస్టర్ కార్డ్ ప్రిపెయిడ్ కార్డ్లను ప్రవేశపెట్టినట్లు తెలియజేసింది. -
అమెరికా కంపెనీలో వాటా కొన్న హైదరాబాద్ స్టార్టప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన లీ టోంగ్ గ్రూప్లో భాగమైన రీటెక్ ఎన్విరోటెక్లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లు హైదరాబాద్కి చెందిన అంకుర సంస్థ బ్లాక్ గోల్డ్ రీసైక్లింగ్ వెల్లడించింది. పర్యావరణహితమైన విధంగా లిథియం అయాన్ బ్యాటరీలు, ప్లాస్టిక్స్, సోలార్ ప్యానెళ్లు మొదలైన వాటి రీసైక్లింగ్ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు ప్రభు రామ్ తెలిపారు.ఈ డీల్లో భాగంగా రీటెక్ ఎన్రోవ టెక్ సీఈవో పంకజ్ తిర్మన్వార్.. బ్లాక్ గోల్డ్లో సహ వ్యవస్థాపకుడిగా, బోర్డు సభ్యుడిగా చేరతారని పేర్కొన్నారు. వ్యర్ధాలను విలువైన వనరులుగా మార్చే అధునాతన సాంకేతికతలపై తాము గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు.ఏఐ హబ్ని విస్తరించిన మెల్ట్వాటర్మీడియా, కన్జూమర్ ఇంటెలిజెన్స్ సంస్థ మెల్ట్వాటర్, హైదరాబాద్లోని తమ ఏఐ హబ్ని మరింతగా విస్తరించింది. ఈ కార్యాలయం వైశాల్యం దాదాపు 14,000 చ.అ.గా ఉంటుంది. ఇందులో 60 మంది ఇంజినీర్ల ఆర్అండ్డీ (పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు) బృందం, కొత్త తరం ఏఐ సొల్యూషన్స్ను రూపొందించడంపై పని చేస్తోందని సంస్థ తెలిపింది.హైదరాబాద్లోని ఐఐటీ, బిట్స్ పిలానీ, ట్రిపుల్ఐటీలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి వీరిని రిక్రూట్ చేసుకున్నట్లు వివరించింది. 2026 నాటికి ఇంజినీర్ల సంఖ్యను 150కి పెంచుకోనున్నట్లు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆదిత్య జామీ తెలిపారు. భారత్లో రిజర్వ్ బ్యాంక్, ఎయిరిండియా, టాటా గ్రూప్, అమెజాన్ ఇండియాలాంటి దిగ్గజాలకు సర్వీసులు అందిస్తున్నట్లు వివరించారు. -
వివిధ బ్యాంకుల అకౌంట్లలో మగ్గుతున్న ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు
-
జపాన్ మొబిలిటీ షో 2025: మైమరిపిస్తున్న కొత్త వాహనాలు (ఫోటోలు)
-
బంగారం ఇక పనికిరాదు.. బాబా వంగా సంచలనం
-
ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఐక్యూ ఫోన్ డెలివరీ
-
Gold Price: భగ్గుమన్న బంగారం ధర
-
Stock Markets: దీపావళి సందర్భంగా మూరత్ ట్రేడింగ్
-
రెట్టింపైన ఐడీబీఐ బ్యాంకు లాభం
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్)లో వాటా విక్రయం ద్వారా వచి్చన లాభంతో కలుపుకొని, ఐడీబీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.3,627 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఎన్ఎస్డీఎల్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 2.22 కోట్ల ఈక్విటీలు(11.11% వాటాకు సమానం) జారీ చేసి రూ.1,698.96 కోట్లు ఆర్జించినట్లు బ్యాంకు ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఆర్జించిన రూ.1,836 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది రెట్టింపు. ఇదే క్యూ2లో నిర్వహణ లాభం 17% వృద్ధి చెంది రూ.3,006 కోట్ల నుంచి రూ.3,523 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,875 కోట్ల నుంచి రూ.3,285 కోట్లకు దిగివచ్చింది. స్థూల ఎన్పీఏ రేషియో 3.68% నుంచి 2.65 శాతానికి మెరుగుపడింది.నికర ఎన్పీఏ స్వల్పంగా 0.20% నుంచి 0.21 శాతానికి పెరిగింది. మొత్తం వ్యాపార వార్షిక వృద్ధి 12% పెరిగి రూ.5,33,730 కోట్లకు చేరింది. సెపె్టంబర్ 30 నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ రూ.1,39,036 కోట్లుగా, కాసా రేషియో 45.81% నమోదైందని పేర్కొంది. -
భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?


