breaking news
business news
-
ఇక మీ EPFO ATM నుంచే విత్ డ్రా చేసుకోవచ్చు..!
-
మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా..
ఐటీ పరిశ్రమలో ఏఐ పేరు చెబితేనే ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. కారణం ఎడాపెడా లేఆఫ్లు. ఒక కంపెనీ ఏఐపై దృష్టి పెట్టిందంటేనే ఇక ఆ సంస్థలో మానవ ఉద్యోగాలకు మూడినట్టేనన్న చర్చ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్సీఎల్ ఉద్యోగులకు మంచి మాట చెప్పారు ఆ కంపెనీ చైర్ పర్సన్ రోష్ని నాడార్.ఇటీవల జరిగిన హెచ్సీఎల్టెక్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోతలపై పెరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు. తాము మానవ ప్రతిభను మరింత పెంచడానికే తప్ప దాన్ని భర్తీ చేయడం కోసం ఏఐని వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఆ రకంగా ఉద్యోగాల తొలగింపు కాకుండా వాటి సృష్టిపై కంపెనీ దృష్టి సారించిందని ఆమె వాటాదారులకు భరోసా ఇచ్చారు.బాధ్యతాయుతమైన వ్యూహానికి కట్టుబడి ఉన్నాంమానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐని కో పైలట్ గా ప్రవేశపెడుతున్నామని, వాటి స్థానంలో కాదని ఆమె అన్నారు. ‘కొన్ని ఉద్యోగాల్లో మార్పులు ఉండొచ్చు కానీ, అధిక విలువ పనులను చేపట్టడానికి ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంపైనే మా దృష్టి ఉంది. ఉద్యోగాల కోత కంటే వాటి పెరుగుదల, ఉద్యోగ పరివర్తనకు ప్రాధాన్యమిచ్చే బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణ వ్యూహానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని రోష్ని నాడార్ సపష్టం చేశారు.ఐటీ రంగంలో నియామకాలు మందకొడిగా సాగుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో సిబ్బంది నికర చేర్పులు తక్కువగా ఉన్నాయి. ఇది నియామకంలో మరింత జాగ్రత్తగా విధానాన్ని సూచిస్తుంది. కొన్ని కంపెనీలు స్వల్ప లాభాలను నమోదు చేయగా, మొత్తం ట్రెండ్ ప్రకారం నియామకాలు చల్లబడ్డాయి.జూన్ తో ముగిసిన త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్ 1,984 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. గత త్రైమాసికంలో 2,23,420గా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆ త్రైమాసికంలో 2,23,151కి తగ్గింది. మార్చిలో 13 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు జూనలో 12.8 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్ -
కర్ణాటకలో అత్యంత ధనవంతులు - టాప్ 10 జాబితా
-
ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు.. ఎందుకంటే..
ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆగస్టు 25 నుంచి 31వ తేదీ వరకూ ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఆర్బీఐ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఈ వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఇతర సేవలకు సంబంధించి నేరుగా బ్యాంకు శాఖల్లో ముఖ్యమైన కార్యకలాపాలను ప్లాన్ చేసేవారి కోసం ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ వారం ఏయే రోజుల్లో ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉంటాయో ఆ ఆజాబితాను తెలియజేస్తున్నాం. తదనుగుణంగా ప్లాన్ చేసుకుని చివరి నిమిషంలో అసౌకర్యాన్ని నివారించవచ్చు.ఇదిగో సెలవుల జాబితా..ఆగస్టు 25 (సోమవారం) - శ్రీమంత శంకరదేవుని తిరుభవ్ తిథి కారణంగా గౌహతి (అస్సాం) లో బ్యాంకులకు సెలవుఆగస్టు 27 (బుధవారం) - వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సెలవు.ఆగస్టు 28 (గురువారం) - గణేష్ చతుర్థి (రెండవ రోజు) / నువాఖై కారణంగా భువనేశ్వర్, పనాజీలో బ్యాంకుల మూసివేతఆగస్టు 31 (ఆదివారం) - వారాంతపు సెలవు దినం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల బ్యాంకుల మూసివేతప్రాంతీయ, స్థానిక ఆచార సంప్రదాయాల కారణంగా దేశంలో సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్ను ఆర్బీఐ ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు.బ్యాంకు సెలవులు శాఖ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేసినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ మీ లావాదేవీలు సజావుగా కొనసాగేలా చేస్తుంది.నగదు అత్యవసరాల కోసం ఏటీఎంలు యథావిధిగా విత్ డ్రా చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ చెల్లింపుల కోసం సంబంధిత బ్యాంక్ యాప్, పయూపీఐని కూడా ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్.. తులానికి ఎంతంటే.. -
అనిల్ అంబానీ ‘డబుల్ ఫ్రాడ్’! మీద పడిన మరో బ్యాంక్
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని చిక్కులు వెంటాడుతున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను "ఫ్రాడ్"గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రకటించిన కొన్ని రోజులకే తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా ప్రమోటర్ అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించింది.రుణాలను దారి మళ్లించారని, మంజూరు నిబంధనలను ఉల్లంఘించారని, అంబానీతో పాటు కంపెనీలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల పేర్లను తన నోటీసులో పేర్కొన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో బ్యాంక్ పేర్కొంది. కాగా 2025 ఆగస్టు 22న ప్రభుత్వ రంగ సంస్థ బీఓఐ నుంచి తమకు లేఖ అందిందని ఆర్కామ్ అదే రోజున తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, అనిల్ ధీరూభాయ్ అంబానీ, మంజరి ఆషిక్ కక్కర్ ల రుణ ఖాతాలను రూ .724.78 కోట్లకు మోసంగా ట్యాగ్ చేసినట్లు బ్యాంక్ తన నోటీసులో పేర్కొంది.తమ అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం లిమిటెడ్ (ఆర్టీఎల్)కు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లేఖ వచ్చిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఫైలింగ్లో వెల్లడించింది. దీని ప్రకారం.. ఆర్టీఎల్, గ్రేస్ థామస్ (ఆర్టీఎల్ మాజీ డైరెక్టర్, ప్రస్తుత కంపెనీ డైరెక్టర్), మరికొందరి రుణ ఖాతాలను 'ఫ్రాడ్'గా వర్గీకరించాలని బ్యాంక్ నిర్ణయించింది.బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. ఒక రుణ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించిన తర్వాత, క్రిమినల్ చర్యల కోసం దానిని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపాలి. రుణగ్రహీత వచ్చే ఐదేళ్ల వరకు బ్యాంకులు లేదా ఇతర నియంత్రిత సంస్థల నుండి కొత్త రుణాలు తీసుకోకుండా నిషేధం ఉంటుంది.ఇప్పటికే ఎస్బీఐ..రుణ నిబంధనలను ఉల్లంఘించి ఆర్ కామ్ బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ గత జూన్ లో స్టేట్ ఎస్బీఐ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు ఆర్కామ్కు సంబంధించిన కార్యాలయాలతో పాటు అనిల్ అంబానీ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీ అక్రమాలకు పాల్పడ్డారని, రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని ఎస్బీఐ పేర్కొనడంతో కేసు నమోదు చేసినట్లు సీబీఐ ధృవీకరించింది. అయితే ఈ ఆరోపణలను అనిల్ అంబానీ తన ప్రతినిధి ద్వారా ఖండించారు.ఇదీ చదవండి: అంబానీపై అప్పు రూ.3.47 లక్షల కోట్లు! -
పదేళ్లలో వేలకొద్దీ కిలోల బంగారం సీజ్.. ఆర్థిక శాఖ లెక్కలు చూస్తే..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గత పదేళ్లలో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. 2015–16 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు పదేళ్లలో అక్రమంగా తరలిస్తున్న 31,772.34 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.ఇందుకు సంబంధించి 35,888 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. అత్యధికంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం ప్రకారం.. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 వరకు దేశవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్న కేసుల సంఖ్య 35,888కి చేరింది. మొత్తం 31,772.34 కిలోల బంగారం సీజ్ చేశారు. 2015–16లో 2,815 కేసులు నమోదు కాగా, 2,972.07 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016–17లో కేసుల సంఖ్య 1,573కి తగ్గినా, 1,520.24 కిలోల బంగారం పట్టుబడింది. 2017–18లో 3,131 కేసులతో పాటు 3,329.46 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2018–19లో కేసులు 5,092కి పెరిగి, 4,292.29 కిలోల బంగారం సీజ్ చేశారు.2019–20లో 4,784 కేసులు నమోదై 3,626.85 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2020–21లో కేసుల సంఖ్య 2,034కి తగ్గి, 1,944.39 కిలోల బంగారం మాత్రమే పట్టుబడింది. 2021–22లో 2,236 కేసులతో 2,172.11 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2022–23లో కేసులు 4,619కి పెరిగి, 4,342.85 కిలోల బంగారం సీజ్ చేశారు. అత్యధికంగా 2023–24లో 6,599 కేసులు నమోదు కాగా, 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2024–25లో కేసుల సంఖ్య 3,005గా ఉండగా, 2,600.40 కిలోల బంగారం స్వాధీనం చేశారు.ఈ గణాంకాలు చూస్తే, కొన్ని సంవత్సరాల్లో కేసుల సంఖ్య తగ్గినా, బంగారం స్వాధీనం పరిమాణం ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. ఇది అక్రమ రవాణా మార్గాల్లో మార్పులు, తనిఖీల తీవ్రత, అంతర్జాతీయ ధరల ప్రభావం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం.. కొత్త అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) ముగిసేలోగా ఐడీబీఐ బ్యాంక్లో వాటా విక్రయాన్ని పూర్తి చేసే వీలున్నట్లు దీపమ్ కార్యదర్శి అర్నుష్ చావ్లా పేర్కొన్నారు. అర్హతగల బిడ్డర్లు సాధ్యాసాధ్యాల పరిశీలనను దాదాపు పూర్తిచేసిన నేపథ్యంలో తాజా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన క్యాపిటల్ మార్కెట్ సదస్సు సందర్భంగా చావ్లా విలేకరులతో ఈ అంశాలను ప్రస్తావించారు.ఆస్తుల మానిటైజేషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 47,000 కోట్లు సమీకరించే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే రూ. 20,000 కోట్లు సమకూర్చుకున్నట్లు వెల్లడించారు. అర్హతకలిగి ఆసక్తి ప్రదర్శించిన పార్టీలు ఇప్పటికే బ్యాంక్పై ఒక అవగాహనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ప్రశ్నలకూ జవాబులు సైతం లభించినట్లు తెలియజేశారు. బ్యాంక్కు సంబంధించిన అన్ని గణాంకాలు లేదా వివరాలను సమగ్రంగా అందించినట్లు తెలియజేశారు.ఐడీబీఐ బ్యాంక్లో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీకి 95 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా దీనిలో 60.72 శాతం వాటాను ఎల్ఐసీ విక్రయించనుంది. ఇక ఎల్ఐసీలో కొంతమేర ప్రభుత్వ వాటా విక్రయ అంశంపై దీపమ్తోపాటు.. మర్చంట్ బ్యాంకర్లు, ఎల్ఐసీ ఉమ్మడిగా అంతర్మంత్రిత్వ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
ఇల్లు కొనాలంటే ఇలాంటి ప్లాన్ అవసరం
తమకంటూ ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇల్లు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాక అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. సొంతింటి కోసం ముందు నుంచి పక్కా ప్రణాళికతో ప్రిపేరైతే ఇల్లు కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకున్నాక ప్రాంతం, ప్రాజెక్ట్, బడ్జెట్తో పాటు ఆర్థికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా, వారి వారి వెసులుబాటు బట్టి ఎక్కడో ఓ చోట తమకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలనో, కొనుక్కోవాలనో అనుకుంటారు. అయితే ఇల్లు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. – సాక్షి, సిటీబ్యూరోసొంతింటిని కొంతమంది చిన్న వయసులోనే సొంతం చేసుకుంటుంటే.. మరికొందరు ఉద్యోగ విరమణ వయసు నాటికి గానీ కొనుక్కోలేరు. మరికొంతమందికి సొంతిల్లు తీరని కలగానే మిగిలిపోతుంది. కనీసం ఐదారేళ్ల ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక చేస్తేనే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోసం నగరాలు, పట్టణాలకు వలస వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈక్రమంలో ఎవరి స్థాయిలో వారు సొంతింటి కోసం ప్రయత్నిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలను పలువురు డెవలపర్లు చేపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంటి కొనుగోలు ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ముందు నుంచే పక్కా ఆర్థిక ప్రణాళికంగా వ్యహరించాలి.పొదుపు చేస్తేనే.. సొంతింటి కల ఉన్నవారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతినెలా కొంత మొత్తం పొదుపు చేయాలి. ఎన్నేళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రతినెలా సంపాదనలో కొంత మొత్తం దాచుకోవాలి. కనీసం నెలకు రూ.10 వేల నుంచి, ఆ తర్వాత ఎవరి ఆదాయాన్ని బట్టి ఎంత వీలైతే అంత మొత్తం పొదుపు చేసుకోవాలి. గృహరుణం తీసుకుంటే నెలనెలా ఎలా ఈఎంఐ చెల్లిస్తారో అలా ఇంటి కోసం మొదటి నుంచి పొదుపు రూపంలో ఈఎంఐ చెల్లించాలన్నమాట. ఇంటి కోసం డౌన్పేమెంట్కు అవసరమయ్యే 15–20 శాతం నిధులను సమకూర్చుకుంటే మిగతా మొత్తాన్ని గృహ రుణాన్ని తీసుకోవచ్చు.బడ్జెట్ను బట్టే నిర్ణయం.. ప్రతినెలా పొదుపు చేసిన మొత్తాన్ని అధిక రాబడి వచ్చే పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. ఉద్యోగస్తులైతే పీపీఎఫ్లో మదుపు చేయడం, లేదంటే బంగారం కొనుగోలు, నమ్మకమైన సంస్థల్లో చిట్టీలు వేయడం, మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేయడం వంటి మార్గాలను అన్వేషించాలి. అంతేకాకుండా బ్యాంక్లు, పోస్టల్ పథకాలు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అసలుకు హామీ ఉండి అధిక రాబడి వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి. ఇంటి బడ్జెట్ ఎంతో ముందుగా అంచనాకు రావాలి. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా ఆయా ధరల్లో ఇల్లు కొనుగోలు ప్రయత్నం చేయాలి. ఇల్లు కొన్నాక బ్యాంకు రుణానికి చెల్లించే ఈఎంఐ భారం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇల్లు అత్యవసరమని భావించకపోతే ముందు ఇంటి స్థలం కొనుగోలు చేసి, ఆ తర్వాత భవిష్యత్తులో అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలు రెండు రోజులు బంద్
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు సంబంధించిన కొన్ని సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. వాట్సాప్ ద్వారా చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి ఫీచర్లు ఆగస్టు 22, 23 తేదీల్లో స్వల్ప కాలానికి అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో బ్యాంక్ కస్టమర్ కేర్ సేవలకు కూడా అంతరాయం కలగనుంది.ఖాతాదారులకు మొత్తం బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వ్యవస్థల నిర్వహణను చేపడుతున్నందున ఈ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. "మీ బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఆగస్టు 22 రాత్రి 11:00 గంటల నుండి ఆగస్టు 23 ఉదయం 6:00 గంటల వరకు అవసరమైన సిస్టమ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తున్నాం" అని బ్యాంక్ ఒక నోటీసులో తెలిపింది.దీంతో కొన్ని బ్యాంకింగ్ సేవలు ఏడు గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ కాలంలో కస్టమర్ కేర్ సేవలు (ఫోన్ బ్యాంకింగ్ ఐవీఆర్, ఈమెయిల్ & సోషల్ మీడియా), వాట్సాప్లో చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది.మెయింటెనెన్స్ పీరియడ్ లో ఫోన్ బ్యాంకింగ్ ఏజెంట్ సేవలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేజాప్, మై కార్డ్స్ సేవలు మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం వివరించింది. -
ఆటోమొబైల్ దిగ్గజంగా నంబర్ 1 స్థానానికి భారత్
భారత ఆటోమొబైల్ పరిశ్రమను వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో నంబర్ 1గా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈఐసీఐ, కేపీఎంజీ నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. భారత ఆటో పరిశ్రమ విలువ ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లుగా ఉందన్నారు.2014లో తాను రవాణా శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పరిశ్రమ పరిమాణం రూ.7.5 లక్షల కోట్లుగానే ఉన్నట్టు గుర్తు చేశారు. అమెరికా ఆటో రంగం విలువ రూ.78 లక్షల కోట్లుగా ఉంటే, చైనా ఆటోరంగం విలువ రూ.47 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను మార్చాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.ఈ లక్ష్య సాధనాల్లో లాజిస్టిక్స్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 16 శాతంగా ఉంటే 10 శాతానికి తగ్గించగలిగినట్టు చెప్పారు. త్వరలో సింగిల్ డిజిట్కు తీసుకొస్తామని ప్రకటించారు. -
ఈపీఎఫ్వో ‘కొత్త’ రికార్డ్..
ఉద్యోగుల భవిష్య నిధి.. ఈపీఎఫ్వోకు జూన్లో నికరంగా 21.89 లక్షలమంది సభ్యులు కొత్తగా జత కలిశారు. ఇది సరికొత్త రికార్డ్కాగా.. వార్షికంగా 13.5 శాతం వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే ఈ సంఖ్య 9.15 శాతం బలపడింది. కార్మిక శాఖ వెల్లడించిన ప్రొవిజనల్ గణాంకాలివి. వీటి ప్రకారం 2018 ఏప్రిల్లో ఈపీఎఫ్వో పేరోల్ గణాంకాల విడుదల ప్రారంభించాక గరిష్టస్థాయిలో సభ్యులు జత కలడం గమనార్హం!ఉద్యోగ అవకాశాలు పుంజుకోవడం, ఉద్యోగ లబ్దిపై అవగాహన పెరగడానికితోడు ఈపీఎఫ్వో ప్రభావవంత కార్యక్రమాలు ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ పేర్కొంది. కాగా.. 2025 జూన్లో 10.62 లక్షలమంది కొత్త సబ్ర్స్కయిబర్లు ఎన్రోల్ అయ్యారు. 2025 మేతో పోలిస్తే 12.7 శాతం అధికంకాగా.. వార్షికంగా 3.6 శాతం వృద్ధి ఇది. వీరిలో 18–25 మధ్య వయసు కలిగినవారి సంఖ్య 6.39 లక్షలమంది. అంటే 60 శాతానికిపైగా వాటా వీరిదే.ఈ గ్రూపులో నికర పేరోల్ జమలు 9.72 లక్షలుగా నమోదైంది. ఇంతక్రితం వైదొలగినవారు సుమారు 16.93 లక్షలమంది 2025 జూన్లో ఈపీఎఫ్వోకు జత కలిశారు. ఈ కాలంలో 3.02 లక్షలమంది మహిళలు ఈపీఎఫ్వో కొత్త సబ్స్కయిబర్లుగా చేరారు. 2025 మే నెలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. నికర పేరోల్ జమల్లో మహిళల సంఖ్య 4.72 లక్షలుగా నమోదైంది. రాష్ట్రాలవారీగా పేరోల్ గణాంకాలు చూస్తే 20 శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితరాలు 5 శాతం చొప్పున వాటా ఆక్రమించాయి.ఇదీ చదవండి: ఉమాంగ్ యాప్లో యూఏఎన్.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్ -
ఫ్యామిలీకంతా రూ.కోటి ఉన్నా చాలు.. హెచ్డీఎఫ్సీ కొత్త ఆప్షన్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ప్రీమియం “ఇంపీరియా” ప్రోగ్రామ్కు సంబంధించి కొత్త అర్హత ప్రమాణాన్ని ప్రకటించింది. అక్టోబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు రూ.1 కోటి “టోటల్ రిలేషన్షిప్ వాల్యూ (TRV)” ఆధారంగా కూడా ఈ ప్రోగ్రామ్కు అర్హత పొందవచ్చు. ఇది వ్యక్తిగత ఖాతాలకే కాకుండా, కుటుంబ సభ్యులు లేదా బిజినెస్ గ్రూప్లతో కలిపి ఉన్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.ఇంతకు ముందు హెచ్డీఎఫ్సీ ఇంపీరియా ప్రోగ్రామ్లో టీఆర్వీ ఆధారంగా అర్హత పొందాలంటే, రూ.1 కోటి విలువను వ్యక్తిగత ఖాతా స్థాయిలో నిర్వహించాల్సి ఉండేది. అంటే, ఒక కస్టమర్కి చెందిన సేవింగ్స్, ఎఫ్డీ, పెట్టుబడులు, లోన్లు, డీమాట్, ఇన్సూరెన్స్ ప్రీమియం మొదలైనవి కలిపి రూ.1 కోటి టీఆర్వీ ఉండాలి. తాజా మార్పు ప్రకారం.. గ్రూప్ స్థాయిలో రూ.1 కోటి టీఆర్వీ ఉంటే సరిపోతుంది. కుటుంబ సభ్యులు లేదా బిజినెస్ ఎంటిటీల ఖాతాలు కలిపి ఈ విలువ చేరవచ్చు.టీఆర్వీ కాకుండా ఇతర అర్హత మార్గాల ద్వారా హెచ్డీఎఫ్సీ ఇంపీరియా ప్రోగ్రామ్లో చేరాలంటే కరెంట్ ఖాతాలో రూ.15 లక్షల సగటు త్రైమాసిక బ్యాలెన్స్ నిర్వహించాలి. అదే సేవింగ్స్ ఖాతాలో అయితే రూ.10 లక్షల సగటు నెలవారీ బ్యాలెన్స్ ఉండాలి. ఎఫ్డీ, సేవింగ్స్, కరెంట్ ఖాతాలన్నీ కలిపి అయిఏత రూ.30 లక్షల సగటు బ్యాలెన్స్ ఉండాలి. హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ ఖాతాల్లో రూ.3 లక్షల పైగా నెలవారీ జీతం జమయ్యేవారికి కూడా ఇంపీరియా ప్రోగ్రామ్ ప్రయోజనాలు లభిస్తాయి.ఇంపీరియా ప్రోగ్రామ్.. దాని ప్రయోజనాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇంపీరియా ప్రోగ్రాం అనేది హై-వ్యాల్యూ కస్టమర్ల కోసం రూపొందించిన ప్రీమియం బ్యాంకింగ్ సేవల ప్యాకేజీ. దీని ముఖ్యమైన ప్రయోజనాలు కస్టమర్కు ప్రత్యేకత, ప్రాధాన్యత, ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తాయి.ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్:వ్యక్తిగతంగా సేవలు అందించే రిలేషన్షిప్ మేనేజర్పెట్టుబడులు, లోన్లు, ఇన్సూరెన్స్ వంటి అంశాల్లో గైడెన్స్వెల్త్ అడ్వయిజరీ సేవలు:ఫైనాన్షియల్ ప్లానింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా సలహాలుఉచిత, తగ్గింపు సేవలు:చెక్బుక్, స్టాప్ పేమెంట్, ఇంటర్-బ్రాంచ్ ట్రాన్స్ఫర్ వంటి సేవలు ఉచితంమొదటి లాకర్ ఉచితం, రెండవది 50% తగ్గింపుప్రాధాన్యత ధరలు:ఫారెక్స్ ట్రాన్సాక్షన్లు, లోన్లు, ఎఫ్డీలు, ఇతర ఉత్పత్తులపై ప్రత్యేక రేట్లుప్రత్యేక ఆఫర్లు, ప్రోమోషన్లు:హెచ్డీఎఫ్సీ భాగస్వామ్య బ్రాండ్స్ వద్ద క్యాష్ బ్యాక్లు, రివార్డ్ పాయింట్లు, రివార్డ్పాయింట్లు, లైఫ్స్టైల్ బెనిఫిట్లు -
ఆ ఫీచర్ బంద్: గూగుల్ పే, ఫోన్పే.. యాప్లలో కీలక మార్పు
యూపీఐ మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 ‘పేమెంట్ రిక్వెస్ట్’ ఫీచర్ను నిలిపివేయాలని నిర్ణయించింది. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లలో ఈ మార్పు అమలులోకి రానుంది.మోసాల వెనుక ఉన్న మెకానిజం‘పేమెంట్ రిక్వెస్ట్’ అనే ఫీచర్ను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తూ, డబ్బు పంపుతున్నట్టు చూపించి, వినియోగదారుల నుంచి డబ్బు తీసుకుంటున్నారు. ఓఎల్ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో వాడుక వస్తువుల కొనుగోలు సందర్భాల్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వినియోగదారులు డబ్బు వస్తుందనుకుని, రిక్వెస్ట్ను అంగీకరించడం వల్ల వారి ఖాతాల్లోని డబ్బు మోసగాళ్లకు చేరుతోంది.యాప్లు అప్డేట్ చేసుకోవాలి..ఎన్పీసీఐ ఆదేశాల మేరకు, అక్టోబర్ 2 నుంచి ఈ ఫీచర్ను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా యూపీఐ యాప్లు తమ సిస్టమ్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచే దిశగా కీలక అడుగులుగా ఎన్పీసీఐ భావిస్తోంది.ఇదీ చదవండి: రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది -
బోనస్ వస్తుందోచ్.. ఇన్ఫీ ఉద్యోగులకు శుభవార్త
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికానికి (Q1 FY2025-26) సంబంధించిన పనితీరు బోనస్ లెటర్లను జారీ చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు బలంగా ఉండటంతో ఉద్యోగులకు కూడా మెరుగైన బోనస్ను ప్రకటించింది.2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు సగటున 80% పనితీరు బోనస్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. గత త్రైమాసికంలో ఇచ్చిన 65% సగటు బోనస్ చెల్లింపుతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన ఈ బోనస్ ఆగస్టు నెల జీతంతో పాటు ఉద్యోగులకు అందనుంది.ఉద్యోగులు తమ పనితీరు రేటింగ్ ఆధారంగా 75% నుండి 89%వరకు బోనస్ పొందారు. ఈ బోనస్ చెల్లింపు లెవెల్ 4, 5, 6 స్థాయిల్లో ఉన్న (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లు) 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులను కవర్ చేస్తుంది. పనితీరు విషయంలో ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించి బోనస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇన్ఫోసిస్ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి బలమైన ఆర్థిక ఫలితాలు సాధించింది. రూ.6,921 కోట్ల నికర లాభం (వార్షిక ప్రాతిపదికన 8.7% వృద్ధి), రూ.42,279 కోట్ల ఆదాయం (వార్షిక ప్రాతిపదికన 7.5% వృద్ధి) నమోదు చేసి, విశ్లేషకుల అంచనాలను అధిగమించింది.ఇదీ చదవండి: ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్ -
అంబానీపై అప్పు రూ.3.47 లక్షల కోట్లు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పులు భారీగా పెరిగిపోయాయి. మంచి లాభాల్లో నడుస్తున్న, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి చెందిన కంపెనీకి అప్పులేంటి అనుకుంటున్నారా? కంపెనీ ఎంత లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ వ్యాపారాలను విస్తరించడానికి అప్పులు అవసరమవుతాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ రంగాల్లో దూకుడుగా పెట్టుబడులను కొనసాగిస్తోంది. అందుకే అప్పులు పెరిగాయి.ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీ మొత్తం అప్పు రూ.3.47 లక్షల కోట్లు కాగా, నికర రుణం రూ.1.17 లక్షల కోట్లు. గతేడాది అంటే 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అప్పు రూ.3.24 లక్షల కోట్లు. బలమైన ఆర్థిక స్థితిని కొనసాగిస్తూనే వ్యాపారాలను పెంచుకునేందుకు భారీ పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.2025 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,31,107 కోట్ల మూలధన వ్యయాన్ని చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2023-24లో ఈ మొత్తం రూ.1,31,769 కోట్లుగా ఉంది. వార్షిక నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరం పెట్టుబడులలో ఎక్కువ భాగం క్రూడాయిల్ నుంచి కెమికల్స్ తయారు చేసే కొత్త ఓ2సీ ప్రాజెక్టులు, రిటైల్ స్టోర్ల ఏర్పాటు, డిజిటల్ సర్వీసుల పెంపు, నూతన ఇంధన వెంచర్లను అభివృద్ధి వైపు మళ్లించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక ఆదాయం విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.5,57,163 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ.5,74,956 కోట్లతో పోలిస్తే ఇది 3.1 శాతం తక్కువ. కంపెనీ ఎబిటా గత ఏడాది రూ.86,393 కోట్ల నుంచి 14.2 శాతం క్షీణించి రూ.74,163 కోట్లకు పరిమితమైంది. -
మహిళల కోసం టాటా ఏఐఏ కొత్త పాలసీ
జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్.. ప్రత్యేకంగా మహిళల కోసం శుభ్ శక్తి పేరిట టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రీమియం హాలిడే, పురుషుల పాలసీలతో పోలిస్తే ప్లాన్ వ్యవధి ఆసాంతం ప్రీమియంపై 15% సుమారు డిస్కౌంటు, సింగిల్ మదర్స్కి దీనికి అదనంగా 1% మేర జీవితకాల డిస్కౌంటులాంటి ఫీచర్లు ఈ పాలసీలో ఉంటాయి.అలాగే సర్వికల్ క్యాన్సర్, హెచ్పీవీ మొదలైన వాటికి టీకాలపరమైన మద్దతు, ఐవీఎఫ్ కౌన్సెలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్ల వంటి ప్రయోజనాలు ఉంటాయని సంస్థ చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్ గాయత్రి నాథన్ తెలిపారు.పాలసీ ముఖ్య లక్షణాలుప్రీమియం హాలిడే: బిడ్డ పుట్టిన తర్వాత 12 నెలల పాటు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పాలసీ వ్యవధిలో రెండుసార్లు వర్తిస్తుంది.తక్కువ ప్రీమియం: పురుషుల పాలసీలతో పోలిస్తే మహిళలకు 15% తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది పాలసీ కాలం మొత్తం వర్తిస్తుంది.ఒంటరి తల్లులకు ప్రత్యేక రాయితీ: జీవితకాల ప్రీమియంపై అదనంగా 1% తగ్గింపు.ఆరోగ్య ప్రయోజనాలు: సర్వికల్ క్యాన్సర్, హెచ్పీవీ వంటి వ్యాధులకు టీకాల మద్దతుఐవీఎఫ్ కౌన్సెలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్లుప్రీమియం వెయివర్: జీవిత భాగస్వామి ప్రమాదవశాత్తూ మరణిస్తే, తదుపరి ప్రీమియాలు చెల్లించాల్సిన అవసరం లేదు.అదనపు ప్రయోజనం: అదనపు ప్రీమియంతో పిల్లల విద్య కోసం నెలవారీ ఆదాయం పొందే అవకాశం (21 లేదా 25 ఏళ్ల వరకు) -
మీ పిల్లలను కోటీశ్వరులను చేయొచ్చు..
పిల్లల భవిష్యత్తు కోసం, వారి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి తల్లిదండ్రులూ ఆలోచిస్తారు. ఇందు కోసం ఎంతో కొంత పొదుపు చేయాలని ఆరాటపడతారు. ముఖ్యంగా ఉన్నత విద్య, ప్రత్యేక శిక్షణలు, విదేశీ కోర్సులు వంటి ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగానే వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరం. ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేస్తే తక్కువ కాలంలోనే వారికి దాదాపు కోటి రూపాయలు కూడబెట్టవచ్చు.పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టేందుకు అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచ్వల్ ఫండ్స్, బంగారం, ప్రభుత్వ పొదుపు పథకాల వంటి వివిధ పెట్టుబడి సాధనాల సమ్మిళితంతో పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను సులువుగానే కూడబెట్టవచ్చు. వీటిలో మ్యూచ్వల్ ఫండ్స్ సిప్లు (SIP) అధిక వృద్ధి అవకాశాలను అందిస్తే, పీపీఎఫ్ (PPF) లాంటి పథకాలు భద్రతతో పాటు పన్ను ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. బంగారం పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే సాధనంగా పనిచేస్తుంది.15 ఏళ్లలో రూ.కోటి కూడబెట్టే ప్రణాళికమ్యూచువల్ ఫండ్స్ – సిప్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.6,000 - ప్రతి సంవత్సరం 10% పెంపు - రాబడి అంచనా: 12% - మొత్తం పెట్టుబడి: రూ.22.87 లక్షలు - అంచనా లాభం: రూ.29.22 లక్షలు - తుది మొత్తం: రూ.52.10 లక్షలు బంగారంపై..- నెలవారీ పెట్టుబడి: రూ.5,500 - రాబడి అంచనా: 10% - మొత్తం పెట్టుబడి: రూ.9.90 లక్షలు - అంచనా లాభం: రూ.13.08 లక్షలు - తుది మొత్తం: రూ.22.98 లక్షలు పీపీఎఫ్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.7,500 - వడ్డీ రేటు: 7.1% - మొత్తం పెట్టుబడి: రూ.13.50 లక్షలు - వడ్డీ లాభం: రూ.10.90 లక్షలు - తుది మొత్తం: రూ.24.40 లక్షలు పై మూడు మార్గాల్లో చెప్పినట్లు ప్రతినెలా 15 ఏళ్లపాటు పొదుపు చేస్తే తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను చేరుకోవచ్చు. ఇది కేవలం ఊహజనిత ప్రణాళిక మాత్రమే. పైన పేర్కొన్న రాబడులు అంచనా మాత్రమే. తల్లిదండ్రులు తమకు అనువైన పెట్టుబడి మార్గాలను ప్రయత్నించవచ్చు.ఘ👉 ఇదీ చదవండి: కస్టమర్లకు వింత షాకిచ్చిన ఎస్బీఐ -
పాతిక వేలలో ఒప్పో నుంచి కొత్త ఫోన్
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా కే13 టర్బో సిరీస్ ప్రో 5జీ, టర్బో 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో అంతర్గతంగా కూలింగ్ ఫ్యాన్ ఉంటుందని, దేశీయంగా స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచరును అందించడం ఇదే ప్రథమం అని సంస్థ తెలిపింది. భారీగా మల్టీ టాస్కింగ్, గేమింగ్కి అనువుగా ఇవి ఉంటాయని వివరించింది.7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ చార్జింగ్, 1.5 అమోలెడ్ డిస్ప్లే తదితర ఫీచర్లు వీటిలో ఉన్నాయి. దీని ధర రూ. 27,999 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఆఫర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 24,999 నుంచి లభిస్తుందని సంస్థ తెలిపింది. టర్బో ప్రో 5జీ ఫోన్ల సేల్ ఆగస్టు 15 నుంచి, టర్బో 5జీ ఫోన్ల అమ్మకాలు 18 నుంచి ప్రారంభమవుతాయి.ముఖ్యమైన ఫీచర్లుఇండియాలో మొట్టమొదటి సారిగా అంతర్గత కూలింగ్ ఫ్యాన్ ఉన్న స్మార్ట్ఫోన్గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందింది.ట్రిపుల్-లెవల్ కూలింగ్ సిస్టమ్: కూలింగ్ ఫ్యాన్, ఎయిర్ డక్ట్స్, 5000mm² వేపర్ చాంబర్.ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ఎస్ఓసీర్యామ్ & స్టోరేజ్: 8జీబీ/12జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్.డిస్ప్లే: 6.8 అంగుళాల ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1500 నిట్స్ బ్రైట్నెస్.బ్యాటరీ: 7000mAh, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ (15 నిమిషాల్లో 50%).కెమెరా: 50MP + 2MP రియర్, 16MP ఫ్రంట్, 4K 60fps వీడియో సపోర్ట్.సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ఓఎస్ 15, 2 ఓఎస్ అప్డేట్లు, 3 ఏళ్లు సెక్యూరిటీ ప్యాచ్లుధర & లభ్యతకే13 టర్బో ప్రో 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 కాగా డిస్కౌంట్లో రూ. 34,999 లకు లభిస్తుంది. అలాగే కే13 టర్బో 5జీ ఫోన్ ధర రూ. 27,999 కాగా తగ్గింపులు పోగా రూ. 24,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్లు ఫ్లిప్కార్ట్, ఒప్పో ఈ-స్టోర్లు, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి. -
రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైల్వే శాఖ కొత్తగా తీసుకొస్తున్న డిజిటల్ అప్గ్రేడ్ ద్వారా టికెట్ బుకింగ్ వేగం నాలుగు రెట్లు పెరగనుంది. పండుగ కాలాల్లో, ప్రత్యేక రైళ్ల సమయంలో, లేదా జనరల్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఆలస్యం, సాంకేతిక సమస్యలు తగ్గనున్నాయి.కొత్త పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా నిమిషానికి 1 లక్ష టికెట్లు బుక్ చేయగల సామర్థ్యం కలుగుతుంది. పీఆర్ఎస్కు ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు బుక్ చేసే సామర్థ్యం ఉంది. ఈ అప్గ్రేడ్లో భాగంగా క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్, మెరుగైన నెట్వర్క్, భద్రతా వ్యవస్థలు, ఆధునిక హార్డ్వేర్ అమలు చేయబోతున్నారు.ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి రైల్వే శాఖ రైల్వన్ (RailOne) అనే కొత్త సూపర్ యాప్ను కూడా ఇటీవల ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్, పీఎస్ఆర్ స్టేటస్, కోచ్ పొజిషన్, ఫుడ్ ఆర్డర్, ఫీడ్బ్యాక్ వంటి సేవలను ఒకే చోట పొందగలుగుతారు. రైల్వన్ యాప్లో సింగిల్ సైన్-ఆన్ విధానం అమలులో ఉంది. దీని ద్వారా బయోమెట్రిక్ లేదా ఎంపిన్ ద్వారా లాగిన్ చేయవచ్చు. పలు ప్రాంతీయ భాషల మద్దతుతో, ఈ యాప్ గ్రామీణ, ప్రాంతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగిస్తోంది.అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) పరిమితిని కూడా రైల్వే శాఖ ఇదివరకే తగ్గించింది. అప్పటివరకు ప్రయాణానికి 120 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండగా, నవంబర్ 1, 2024 నుంచి దీన్ని 60 రోజులకు పరిమితం చేసింది. ఇక దీపావళి, ఛఠ్ పూజా వంటి పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఊరట కలిగించేందుకు, రైల్వే శాఖ ఫెస్టివల్ రౌండప్ ట్రిప్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద అక్టోబర్ 13–26, నవంబర్ 17–డిసెంబర్ 1 మధ్య రిటర్న్ టికెట్లపై 20% డిస్కౌంట్ అందిస్తోంది. -
విన్ఫాస్ట్ కార్ల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫైనాన్సింగ్
న్యూఢిల్లీ: ఇన్వెంటరీ, ఆటో ఫైనాన్సింగ్ సదుపాయం కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు విన్ఫాస్ట్ ఆటో ఇండియా తెలిపింది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. భారత్లో ఒక బ్యాంకింగ్ సంస్థతో కుదర్చుకున్న తొలి ఎంఓయూ ఇది.నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలకు ముందు ఎలాంటి అంతరాయాలు లేని రుణ సదుపాయాలు అందించడం ఈ ఒప్పంద లక్ష్యమని కంపెనీ వివరించింది. భారతీయ కస్టమర్లకు సౌకర్యవంతమైన, ఆధునాతన ఎలక్ట్రిక్ వాహనాలను అందించే ప్రయత్నాల్లో ఈ ఎంఓయూ మైలురాయిగా నిలుస్తుందని విన్ఫాస్ట్ ఇండియా సీఈఓ ఫామ్ సాన్ చౌ తెలిపారు.‘ఈవీల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఫైనాన్సింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కస్టమర్ల ఆకాంక్షలకు పెద్దపీట వేయడంలో బ్యాంకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిటైల్ అసెట్స్ హెడ్ అరవింద్ వోహ్రా తెపారు. విన్ఫాస్ట్ ఆటో ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్ ముందు వీఎఫ్7, వీఎఫ్6 మోడళ్లను లాంచ్ చేయనుంది. -
మస్క్ తొలగించిన సీఈవో.. మళ్లీ ‘ప్యారలల్’గా దూసుకొచ్చాడు!
ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ మళ్లీ టెక్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన స్థాపించిన కొత్త ఏఐ స్టార్టప్ ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ ఇటీవలే 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.250 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. ఖోస్లా వెంచర్స్, ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్ వంటి ప్రముఖ వెంచర్ క్యాపిటల్స్ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టాయి.ఏఐకి బ్రౌజర్ ఇచ్చినట్లే!ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ ఒక క్లౌడ్-బేస్డ్ ఏఐ రీసెర్చ్ ప్లాట్ఫారమ్. ఇది ఏఐ మోడల్స్కు రియల్ టైమ్ వెబ్ డేటాను యాక్సెస్ చేయగలిగే సామర్థ్యాన్ని కల్పిస్తుంది. సాధారణంగా AIలు ట్రైనింగ్ డేటాపై ఆధారపడతాయి. కానీ లైవ్ వెబ్ సమాచారం చదవడం, నిజమైన సమాచారం గుర్తించడం, సమాధానాలపై విశ్వాస స్థాయిని అంచనా వేయడం వంటివి ప్యారలల్ ప్రత్యేకతలు.మానవుల కంటే మెరుగైన అన్వేషణఈ స్టార్టప్ అభివృద్ధి చేసిన అల్ట్రా8ఎక్స్ (Ultra8x) అనే రీసెర్చ్ ఇంజిన్ 30 నిమిషాల పాటు లోతైన వెబ్ అన్వేషణ చేయగలదు. ఇది ఓపెన్ఏఐ జీపీటీ-5 (OpenAI GPT-5)తో సహా మానవ రీసెర్చర్ల కంటే 10 శాతం మెరుగైన పనితీరును చూపిందని సంస్థ పేర్కొంది. ట్విట్టర్ నుంచి టెక్ రీ-ఎంట్రీ2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత, సీఈవో పదవిలో ఉన్న పరాగ్ అగర్వాల్ను ఎలాన్ మస్క్ తొలగించారు. ఆ తర్వాత పరాగ్ పాలో ఆల్టోలోని కాఫీ షాపుల్లో రీసెర్చ్ పేపర్లు చదువుతూ, కోడ్ రాస్తూ గడిపారు. హెల్త్కేర్ ఏఐ స్టార్టప్ ఆలోచించినా, చివరికి ఏఐకి రియల్ టైమ్ వెబ్ డేటాను విశ్వసనీయంగా అందించాలన్న లక్ష్యంపై దృష్టి పెట్టారు.మస్క్తో రూ.420 కోట్ల సెవరెన్స్ వివాదంపరాగ్ అగర్వాల్ ఇంకా 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.420 కోట్లు) సెవరెన్స్ పేమెంట్ కోసం మస్క్తో కోర్టులో పోరాటం చేస్తున్నారు. మస్క్ “ఫర్ కాస్” అనే కారణంతో చెల్లింపును నిలిపివేశాడు. -
అమాంతం ఎగిసిన షేర్లు.. ‘ప్లాన్’గా అమ్మేసిన సీఈవో
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ జాక్పాట్ కొట్టారు. అమాంతం ఎగిసిన షేర్లను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ వారం ఆయన 2,01,404 కంపెనీ షేర్లను విక్రయించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) వద్ద ఫారం 4 ఫైలింగ్ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో తాను అనుసరించిన ముందస్తు ‘10 బి 5-1’ ట్రేడింగ్ ప్లాన్ కింద ఆగస్టు 11, 12, 13 తేదీలలో లావాదేవీలు జరిగాయి.ఈ షేర్లను 180.026 డాలర్ల నుంచి 183.6417 డాలర్ల వరకు విక్రయించి మొత్తం 40,959,534 డాలర్ల (సుమారు రూ.334 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. ఇన్వెస్టింగ్.కామ్ (Investing.com) నివేదిక ప్రకారం.. ఎన్విడియా స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి 184.48 డాలర్లకు దగ్గరగా ట్రేడ్ కావడంతో ఈ లావాదేవీలు జరిగాయి. ఎన్విడియా గత 12 నెలల్లో 86% ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఈ లావాదేవీల తర్వాత హువాంగ్ కు కంపెనీలో ఇంకా 72,998,225 షేర్లు ఉన్నాయి.ఏమిటీ 10బి5-1 ట్రేడింగ్ ప్లాన్?రూల్ 10బి5-1 అనేది యూఎస్ ఎస్ఈసీ నుండి వచ్చిన నిబంధన. ఇది పబ్లిక్ లిస్టెడ్ సంస్థలలోని ఇన్సైడర్లు తమ వాటాలను ముందుగానే విక్రయించే ప్రణాళికను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. ఈ నియమం ప్రకారం, ప్రధాన వాటాదారులు నిర్ణీత సమయంలో నిర్ణీత సంఖ్యలో షేర్ల అమ్మకాన్ని షెడ్యూల్ చేయవచ్చు. తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు ఆస్కారం ఉండదు. చాలా మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు ఈ కారణంగా 10b5-1 ప్లాన్ లను ఉపయోగిస్తారు. -
నగరం నలువైపులా భారీ లేఅవుట్లు.. కొత్త వెంచర్లు..
హైదరాబాద్లో ‘రియల్’ దూకుడు పెరిగింది. నగరానికి నాలుగు వైపులా భారీ లేఅవుట్లు, కొత్త వెంచర్లు విస్తరిస్తున్నాయి. మరోవైపు విల్లాలు, బహుళ అంతస్తుల భవనాల విక్రయాల్లో సైతం జోరు పెరిగింది. దాదాపు ఏడాది కాలంగా నెలకొన్న ‘రియల్’ స్తబ్దత క్రమంగా పటాపంచలవుతోంది. – సాక్షి, సిటీబ్యూరోమహా నగర పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడంతో పాటు ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు, మెట్రో రెండో దశ ప్రతిపాదనలు, ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. మరోవైపు ఇటీవల హౌసింగ్ బోర్డు నిర్వహించిన బిడ్డింగ్కు సైతం అనూహ్య స్పందన లభించింది. ఫ్యూచర్ సిటీ నుంచి షాద్నగర్ వరకు కొత్త వెంచర్లకు డిమాండ్ కనిపిస్తోంది. కొత్తగా విలీనమైన గ్రామాల్లో ఇప్పుడు భారీ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చల్ తదితర అన్ని జోన్లలో లే అవుట్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో కొంతకాలంగా అనుమతుల ప్రక్రియలో వేగం పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 922 అనుమతులను ఇచ్చారు. మరో ఆరు నెలల్లో అనుమతులు రెట్టింపయ్యే అవకాశం ఉంది.గత మూడేళ్లలో హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులుగతేడాది కంటే ఎక్కువే.. గత సంవత్సరం 2024లో మొత్తం 878 అనుమతులు మాత్రమే ఇచ్చారు. కానీ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 922 అనుమతులు ఇవ్వడం విశేషం. గత సంవత్సరం అన్ని అనుమతులపై హెచ్ఎండీఏకు రూ.395.13 కోట్ల ఆదాయం లభించగా ఈ సంవత్సరం జూన్ వరకు రూ.519 కోట్లకు పైగా ఆదాయం లభించింది. మరోవైపు 2023 సంవత్సరంలో 1,361 అనుమతులు ఇచ్చారు. రూ.563.32 కోట్ల ఆదాయం లభించింది.నిర్మాణ రంగంలో కొంతకాలం స్తబ్దత నెలకొన్నప్పటికీ క్రమంగా పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టీజీబీపాస్ స్థానంలో కొత్తగా బిల్డ్నౌను ప్రవేశపెట్టిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ కూడా సులభతరమైంది. క్షణాల్లోనే డాక్యుమెంట్లను అప్లోడ్ చేసే సదుపాయం లభించింది. మరోవైపు దరఖాస్తుదారులకు కూడా ఎలాంటి జాప్యం లేకుండా ‘కీ’లు లభిస్తున్నాయి. కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రక్రియ మాత్రం వేగవంతం అయినట్లు అధికారులు తెలిపారు.వేలానికి సిద్ధంగా హెచ్ఎండీఏ స్థలాలు మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూలమైన మార్పు రావడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలు, భూములను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమవుతోంది. గతంలో భూముల అమ్మకాలకు అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. కోకాపేట్, బుద్వేల్, మోకిల తదితర ప్రాంతాల్లో భారీ స్పందన లభించింది.అలాగే తుర్కయంజాల్, తొర్రూరు, బాచుపల్లి, మేడిపల్లి తదితర ప్రాంతాల్లోనూ హెచ్ఎండీఏ ప్లాట్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలిన స్థలాలతో పాటు కొత్త వెంచర్లలోనూ విక్రయాలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బహదూర్పల్లి, లేమూరు, ఇన్ముల్ నెర్వా తదితర ప్రాంతాల్లో త్వరలో వేలం నిర్వహించే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల్లో ఆన్లైన్ బిడ్డింగ్కు సిద్ధంగా ఉన్న హెచ్ఎండీఏ లే అవుట్లు -
కస్టమర్లకు వింత షాకిచ్చిన ఎస్బీఐ
రుణాలను చౌకగా చేయడానికి ఓవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రయత్నిస్తుంటే మరోవైపు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాత్రం రుణ గ్రహీతకు వింత షాకిచ్చింది. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 5.5 శాతానికి తగ్గించినప్పటికీ, ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లను పెంచి ఆశ్చర్యపరిచింది. ఈ బ్యాంక్లో కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేటు ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు పెరగనుంది.ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్ల గరిష్ట పరిమితిని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. లోయర్ ఎండ్ 7.50 శాతం వద్ద కొనసాగుతుండగా, ఎగువ బ్యాండ్ 8.45 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఈ మార్పు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు సాధారణంగా అధిక వడ్డీ రేటు పరిధిలోకి వస్తారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం 7.35 శాతం నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఎస్బీఐ బాటలో పయనించే అవకాశం ఉంది. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆర్బీఐ రెపో రేటును వరుసగా మూడుసార్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల గృహ రుణాలతో సహా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం వల్ల పరోక్షంగా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల గృహ రుణాలు చౌకగా లభిస్తాయని ఇదే ఎస్బీఐ గతంలో ఒక నివేదికను విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ సేకరించిన డేటా ప్రకారం.. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాలలో 60 శాతం ఉన్న ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)తో అనుసంధానించిన రుణాలలో ఈ మార్పు చాలా వెంటనే కనిపిస్తుంది.👉 ఇదీ చదవండి: ఎస్బీఐ ప్రత్యేక లోన్: తాకట్టు లేకుండా రూ.4 లక్షలు -
హైదరాబాద్లో ఈ-వాహనాలదే హవా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో ఈ– బండి టాప్గేర్లో పరుగులు తీస్తోంది. ఈవీలపై జీవితకాల పన్ను మినహాయింపుతో ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షకుపైగా ద్విచక్ర వాహనాలు, 22 వేల కార్లు రోడ్డెక్కాయి. కొంతకాలంగా ఈ రెండు కేటగిరీలకు చెందిన వాహనాల అమ్మకాలు ఊపందుకున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి.ఈ సంవత్సరం కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరిగేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు భారంగా మారుతున్న దృష్ట్యా సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్రమంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారుతున్నారు. గ్రేటర్లో ఈ నెల 10 నాటికి 1,88,549 ద్విచక్ర వాహనాలు, 22,365 కార్లు నమోదైనట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కొత్తగా 5,097 ఆటోలు, మరో 5,363 తేలికపాటి వస్తు రవాణా వాహనాలు రోడ్డెక్కాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,21,374 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు నమోదైనట్లు అధికారులు చెప్పారు.ఈ వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో వాహనదారులకు రూ.91.93 లక్షల రాయితీ లభించింది. ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రతి మూడు నెలలకోసారి విధించే క్వార్టర్లీ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు లభించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకాశాన్ని వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జేటీపీ రమేష్ సూచించారు. -
32 ఏళ్లుగా అలాగే బతుకుతున్నాం: ఆకాశ్ అంబానీ
దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబమైన ముఖేష్ అంబానీ కుటుంబం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్ని కోట్లున్నా ఆయన కుటుంబంలోని ప్రతిఒక్కరూ అంతే హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. తండ్రి నుంచి వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్న ఆకాశ్ అంబానీ.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్గా ఆ సంస్థను విజవంతంగా నడిపిస్తున్నారు.ప్రతిఒక్కరికీ తమ జీవితంలో ఎవరోఒకరు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇదే క్రమంలో తనకు ప్రేరణ ఎవరని అడిగితే ఆకాశ్ అంబానీ మొదట పేర్కొన్నది కార్పొరేట్ ఐకాన్లు లేదా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ కాదు.. తమ తల్లిదండ్రులేనని గర్వంగా చెబుతారు. ఆమధ్య ముంబై టెక్ వీక్ లో మాట్లాడిన సందర్భంగా గట్టి బంధం ఉన్న కుటుంబంలో పెరగడం తన పని నైతికతను, ఏకాగ్రతను ఎలా తీర్చిదిద్దిందో వివరించారు. నిస్సందేహంగా, మేము పెరిగిన కుటుంబమే అతిపెద్ద ప్రేరణ అని ఆయన అన్నారు. 32 ఏళ్లుగా తామంతా ఒకే గొడుగు కింద జీవిస్తున్నామని, ముఖ్యంగా తన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందని అన్నారు.ఇప్పటికీ తల్లిదండ్రుల నుంచి రోజువారీ క్రమశిక్షణ, వ్యక్తిగత నిబద్ధతను గమనిస్తుంటానంటారు ఆకాశ్. ముఖేష్ అంబానీ ఇప్పటికీ అర్ధరాత్రి 2 గంటల వరకు తనకు వచ్చే ప్రతి ఈమెయిల్ నూ చదివి క్లియర్ చేస్తారని, ఆ పని ఆయన నలబై ఏళ్లుగా చేస్తున్నారని, ఇక్కడి నుంచే తనకు స్ఫూర్తి వచ్చిందని ఆకాశ్ వివరించారు. ఇక తన తల్లి నీతా అంబానీ నుంచి ఏకాగ్రతతో కూడిన అంకితభావాన్ని ప్రేరణ పొందతానన్నారు. -
జీఎస్టీ స్లాబ్ల తగ్గింపునకు కేంద్రం అడుగులు!
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకరించే పనిని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు ప్రధాన స్లాబ్లను కుదించి రెండు ప్రధాన స్లాబ్లుగా మారుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. 12 శాతం, 28 శాతం, స్లాబ్లను రద్దు చేసి 5 శాతం, 18 శాతం మాత్రమే కొనసాగించాలన్న ఆలోచనను కేంద్ర ఆర్థిక శాఖ ముందుంచినట్లు సమాచారం.నూతన ప్రతిపాదనల ప్రకారం.. 28 శాతం స్లాబ్ పరిధిలోని 90 శాతం వస్తువులను 18 శాతం పరిధిలోకి, అలాగే 12 శాతం స్లాబ్ పరిధిలోని 99 శాతం వస్తువులను 5 శాతం కిందికి తీసుకురానున్నారు. ప్రస్తుతం 12 శాతం స్లాబ్లో ఉన్న టూత్పేస్ట్, మొబైల్ ఫోన్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, బట్టలు, బూట్లు వంటి మధ్యస్థాయి వినియోగ వస్తువులను 5 శాతం స్లాబ్లోకి మార్చే యోచన ఉంది. ఇదే సమయంలో, 28 శాతం స్లాబ్లో ఉన్న కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని సేవలను 18 శాతం స్లాబ్లోకి తరలించనున్నారు.ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ జీఎస్టీ పన్ను నిర్మాణంలో ప్రధానంగా రెండు స్లాబ్లే కొనసాగనున్నప్పటికీ కొన్ని హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ స్లాబ్లో తంబాకు, గుట్కా, సిగరెట్లు వంటి కేవలం 5–7 వస్తువులే ఉండే అవకాశం ఉంది.ఈ మార్పుల వల్ల నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి, వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాలపై నెలవారీ ఖర్చుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. కేంద్రం అంచనా ప్రకారం, ఈ స్లాబ్ మార్పుల వల్ల రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు రెవెన్యూ నష్టం జరగవచ్చని భావిస్తున్నప్పటికీ, వినియోగం పెరిగి, పన్ను ఆదాయం తిరిగి స్థిరపడే అవకాశం ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి లేవు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ జీఎస్టీ మార్పులను "డబుల్ దీపావళి గిఫ్ట్"గా ప్రజలకు ప్రకటించారు. పన్ను వ్యవస్థను సరళీకరించడం ద్వారా ప్రజలపై పన్ను భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. -
ఎస్బీఐ ప్రత్యేక లోన్: తాకట్టు లేకుండా రూ.4 లక్షలు
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యంలోని అగ్నివర్ల కోసం ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న అగ్నివీర్లు ఎటువంటి పూచీకత్తు లేదా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రూ .4 లక్షల వరకు రుణాలు పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ రుణాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి అగ్నిపథ్ పథకం కాలపరిమితి అంటే సైనికులు సర్వీసులో ఉండే కాలానికి అనుగుణంగా ఉంటుంది. దేశం కోసం సైన్యంలో సేవలు అందించి తిరిగి సాధారణ పౌర జీవితంలో వచ్చే సైనికులకు ఆర్థికంగా సహకారం అందించే లక్ష్యంతో ఎస్బీఐ ఈ ప్రత్యేక లోన్ స్కీమ్ను ప్రకటించింది. అలాగే 2025 సెప్టెంబర్ 30 వరకు రక్షణ సిబ్బంది తీసుకునే రుణాలకు 10.50 శాతం ఫ్లాట్ వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తోంది.‘మన స్వాతంత్య్రాన్ని కాపాడుతున్న వాళ్లకు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు మా అచంచలమైన మద్దతు అవసరమని మేము నమ్ముతున్నాం. ఈ జీరో ప్రాసెసింగ్ ఫీజు కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సాహస వీరులకు సాధికారత కల్పించే పరిష్కారాలను సృష్టించడం కొనసాగిస్తాం’ అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.ఇదే కాకుండా తమ బ్యాంక్లో శాలరీ అకౌంట్లు ఉన్న భారత సాయుధ దళాల సిబ్బందికి అనేక ప్రయోజనాలను ఎస్బీఐ కల్పిస్తోంది. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ఉచిత అంతర్జాతీయ గోల్డ్ డెబిట్ కార్డులు, దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఏటీఎంలలో అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలు, డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీల మాఫీ వంటి అనేక ప్రయోజనాలను ఈ ప్యాకేజీ అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. వీటితోపాటు రూ.50 లక్షల కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.కోటి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.50 లక్షల వరకు శాశ్వత అంగవైకల్యానికి కవరేజీ లభిస్తుంది. -
ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ సీఎక్స్ ను కొనుగోలు చేస్తోంది. ఈ రంగంలో ఇది అత్యంత భారీ ఒప్పందంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ పత్రిక ప్రకారం.. ఈ డీల్ విలువ 1 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు 5,400 కోట్లు).రాయిటర్స్ కథనం ప్రకారం.. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బీజీహెచ్ క్యాపిటల్ సైబర్ సీఎక్స్ ను విక్రయిస్తోంది. అయితే ఈ ఒప్పందంలోని ఆర్థిక నిబంధనలు మాత్రం వెల్లడి కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, హెల్త్ కేర్ నుంచి ఫైనాన్స్ వరకు కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించే, సున్నితమైన డేటాతో రాజీపడే అధునాతన బెదిరింపులతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ డీల్కు ప్రాధాన్యం ఏర్పడింది.బీజీహెచ్ క్యాపిటల్ మద్దతుతో 12 చిన్న సైబర్ సెక్యూరిటీ సంస్థల విలీనం ద్వారా మెల్బోర్న్కు చెందిన సైబర్ సీఎక్స్ 2019లో ఏర్పడింది. ఈ సంస్థ ప్రస్తుతం 1,400 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతటా భద్రతా కార్యకలాపాల కేంద్రాలను నిర్వహిస్తుంది. లండన్, న్యూయార్క్ లలో కార్యాలయాలు ఉన్నాయి.యాక్సెంచర్ 2015 నుండి ఇలాంటి 20 భద్రతా కొనుగోళ్లను పూర్తి చేసింది. వీటిలో బ్రెజిల్ సైబర్ డిఫెన్స్ సంస్థ మార్ఫస్, ఎంఎన్ఈఎమ్ఓ మెక్సికో, స్పెయిన్కు చెందిన ఇన్నోటెక్ సెక్యూరిటీ వంటివి ఇటీవల కొనుగోలు చేసిన సంస్థలు. -
‘బంగారు’ దేశం.. వంద రూపాయలకే తులం!
దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలకు బంగారమంటే మక్కువ తగ్గకుండా పెరుగుతూనే ఉంది. అందుకు అనుగుణంగా పసిడి ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి.భారతదేశం స్వాతంత్య్రం పొందిన 1947లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.88 మాత్రమే ఉండేది. కానీ 2025 నాటికి అది రూ.1,04,000 దాటింది. అంటే దాదాపు 1,100 రెట్లు పెరిగింది. ఈ గణనీయమైన పెరుగుదల వెనుక ఉన్న కారణాలు సామాన్య ప్రజలకు అర్థం కాకపోయినా, ఆర్థిక నిపుణుల దృష్టిలో ఇది దేశీయ ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి మారక రేటు, భారతీయుల సంప్రదాయాల మిశ్రమ ప్రభావం. బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ రావడంతో దీన్ని "సురక్షిత పెట్టుబడి"గా భావించే ధోరణి పెరుగుతోంది.వందల నుంచి లక్షలకు..1950లలో తులం బంగారం ధర రూ.100కు చేరగా, 1970లో రూ.184, 1980లో రూ.1,330, 1990లో రూ.3,200, 2000లో రూ.4,400గా నమోదైంది. 2010 నాటికి ఇది రూ.18,500కు పెరిగింది. 2020 నాటికి రూ.50,151గా ఉండగా, 2025 నాటికి రూ.1,04,320కి చేరింది. ఈ గణాంకాలు చూస్తే, ప్రతి దశలో బంగారం ధరలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం మార్కెట్ డిమాండ్ వల్ల మాత్రమే కాదు, అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల విధానాలు, పెట్టుబడిదారుల మానసిక ధోరణి కూడా దీనిపై ప్రభావం చూపాయి.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుద్రవ్యోల్బణం: రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది.అంతర్జాతీయ సంక్షోభాలు: యుద్ధాలు, మహమ్మారులు వంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు.రూపాయి-డాలర్ మారక రేటు: రూపాయి బలహీనత కూడా ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది.భారతీయ డిమాండ్: పెళ్లిళ్లు, పండుగలు, సంప్రదాయాల వల్ల బంగారం డిమాండ్ ఎప్పటికీ అధికంగా ఉంటోంది.కేంద్ర బ్యాంకుల విధానాలు: బంగారం నిల్వల కొనుగోలు, అమ్మకాలు ధరలపై ప్రభావం చూపుతాయి.ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. "బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఇది ఆర్థిక అస్థిరత సమయంలో పెట్టుబడిదారులకు భద్రతను కలిగించే సాధనం," అని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా తమ బంగారం నిల్వలను పెంచడం ద్వారా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్బీఐ వంటి సంస్థలు బంగారం కొనుగోలు చేయడం, నిల్వలు పెంచడం వంటి చర్యలు మార్కెట్లో దీని విలువను స్థిరంగా ఉంచుతున్నాయి. -
16 ఏళ్లకే సొంత కంపెనీ.. 18 ఏళ్లకే రూ.100 కోట్ల సామ్రాజ్యం
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త రూల్స్.. ఛార్జీలు పెంపు
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవింగ్స్, శాలరీ, ఎన్ఆర్ ఖాతాదారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సేవలపై ఛార్జీలను పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తన బ్రాంచ్లలో ఫిజికల్గా అందించే సేవలకు సంబంధించి ఛార్జీలను సవరించి కొత్త రేట్లను ప్రకటించింది. ముఖ్యంగా నగదు లావాదేవీలు, సర్టిఫికెట్ సేవలు, పాత రికార్డుల ప్రతులు, ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింపుముందుగా నగదు లావాదేవీల ఉచిత పరిమితిలో కీలకమైన మార్పు జరిగింది. ఇంతకు ముందు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలు ఉండేవి. వాటి మొత్తం పరిమితి రూ.2 లక్షలు. ఇప్పుడు అదే నాలుగు లావాదేవీలు ఉచితంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తం పరిమితిని రూ.1 లక్షకు తగ్గించారు. అంటే ఖాతాదారులు నెలకు రూ.1 లక్ష వరకు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఆ పరిమితిని మించితే, ప్రతి అదనపు లావాదేవీకి రూ.150 ఛార్జీ వసూలు చేయనున్నారు.కొత్త ఛార్జీలుఅలాగే బ్యాలెన్స్ సర్టిఫికెట్, వడ్డీ సర్టిఫికెట్, అడ్రస్ కన్ఫర్మేషన్ వంటి సేవలకు కూడా ఛార్జీలు విధించారు. రెగ్యులర్ కస్టమర్లకు రూ.100, సీనియర్ సిటిజన్లకు రూ.90 చొప్పున వసూలు చేయనున్నారు. ఇదే విధంగా పాత రికార్డులు, పెయిడ్ చెక్కుల కాపీల కోసం రెగ్యులర్ ఖాతాదారులు రూ.80, సీనియర్ సిటిజన్లు రూ.72 చెల్లించాలి. ఇంతకు ముందు ఈ సేవలు ఉచితంగా అందించేవారు. కానీ ఇప్పుడు వాటికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.ఫండ్ ట్రాన్స్ఫర్లకూ..ఫండ్ ట్రాన్స్ఫర్ సేవల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈసీఎస్,ఏసీహెచ్ రిటర్న్ ఛార్జీలను సవరించారు. మొదటి రిటర్న్కు రూ.450 (సీనియర్ సిటిజన్కు రూ.400), రెండవ రిటర్న్కు రూ.500 (సీనియర్కు రూ.450), మూడవ రిటర్న్ నుంచి రూ.550 (సీనియర్కు రూ.500) వసూలు చేయనున్నారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ వంటి డిజిటల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జీలను కూడా కొత్త రేట్లతో అమలు చేస్తున్నారు.ఉదాహరణకు, నెఫ్ట్ ద్వారా రూ.10,000 లోపు ట్రాన్సాక్షన్కు రూ.2, రూ.1 లక్ష వరకు రూ.4, రూ.2 లక్ష వరకు రూ.14, 2 లక్షల పైగా రూ.24 చొప్పున ఛార్జీలు విధించనున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షలు–రూ.5లక్షలు మధ్య ట్రాన్సాక్షన్కు రూ.20, రూ.5లక్షలకుపైగా లావాదేవీకి రూ.45 వసూలు చేస్తారు. ఐఎంపీఎస్ ద్వారా రూ.1,000 లోపు ట్రాన్సాక్షన్కు రూ.2.50, రూ.1లక్ష లోపు అయితే రూ.5, రూ.1లక్షకు పైగా లావాదేవీకి రూ.15 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. -
ఏఐ దెబ్బకి ఈ ఉద్యోగాలు పోతాయ్!
-
అనిల్ అంబానీకి భారీ విజయం
చాలా ఏళ్ల తర్వాత అనిల్ అంబానీకి భారీ విజయం దక్కింది. ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్పై రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డ్ (మధ్యవర్తిత్వ పరిహారం) పొందినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్ఫ్రా) తెలిపింది. 2018లో ఆరావళి పవర్ ఓ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంతో మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది.రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు‘ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మెజారిటీ తీర్పుతో ఆ రద్దు చెల్లదని తేల్చి, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుకూలంగా రూ.526 కోట్లు పరిహార తీర్పును ప్రకటించింది’ ఆర్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ అవార్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రోత్ క్యాపిటల్ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఏమిటీ వివాదం?రిలయన్స్ ఇన్ఫ్రాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీసీపీఎల్) 2018లో రద్దు చేసుకుంది. అయితే ఇది అసంబద్ధమంటూ రిలయన్స్ ఇన్ఫ్రా మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆరావళి పవర్ రద్దు నోటీసు జారీ చేయడం, అదే సంవత్సరం మధ్యవర్తిత్వాన్ని కూడా కోరడంతో వివాదం ప్రారంభమైంది.ఆర్ఇన్ఫ్రా సంస్థపై గత ఏడాది డిసెంబర్లో పొందిన రూ .600 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారాన్ని అమలు చేయాలని కోరుతూ ఆరావళి పవర్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఆర్ఇన్ఫ్రా ప్రతిస్పందనను కోరింది.విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ రంగాల్లో నిమగ్నమైన ఆర్ఇన్ఫ్రా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్లో కీలక సంస్థగా ఉంది. ఆగస్టు 13 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,501 కోట్లుగా ఉంది. -
జీతాల పెరుగుదల.. ఐటీ కంపెనీ శుభవార్త
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1, 2025 నుంచి అర్హులైన ఉద్యోగుల్లో 80 శాతం మందికి వేతన పెంపును అమలు చేయనుంది. 2025 ద్వితీయార్ధంలో చాలా మంది ఉద్యోగులకు మెరిట్ ఆధారిత వేతన పెంపును అందించే ప్రణాళికలను కంపెనీ తన రెండవ త్రైమాసిక ఆదాయ ప్రకటనలో ధృవీకరించింది.సీనియర్ అసోసియేట్ స్థాయి వరకు ఉన్న ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రతినిధి పీటీఐకి తెలిపారు. పెంపు శాతం వ్యక్తిగత పనితీరుతో పాటు ఉద్యోగి స్థానంపై ఆధారపడి ఉంటుంది. భారత్ ఉద్యోగులలో నిలకడ పనితీరు చూపినవారికి సింగిల్ డిజిట్లో, అసాధారణ పనితీరు కనబరిచిన వారికి గణనీయమైన ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.పెరిగిన నికర లాభంనాస్డాక్లో లిస్టైన కాగ్నిజెంట్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగి 2025 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 645 మిలియన్ డాలర్లకు చేరుకుంది. త్రైమాసిక ఆదాయం 8.1 శాతం పెరిగి 5.25 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఇతర కంపెనీల్లో ఇలా..టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెప్టెంబర్ 1 నుండి దాదాపు 80% మంది ఉద్యోగులకు వేతనాలు పెంచే ప్రణాళికలను ఇటీవలె వెల్లడించింది. నివేదికల ప్రకారం.. ఆఫ్షోర్ ఉద్యోగులు 6–8% వరకు, ఆన్షోర్ ఉద్యోగులు 2–4% వరకు పెరుగుదల ఉండవచ్చు. ఇక విప్రో, ఇన్ఫోసిస్ 2025లో వేతన పెంపు ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు.👉 ఇది చదివారా? రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్ -
జియో హాట్స్టార్ ఆ ఒక్క రోజు అందరికీ ఫ్రీ..
ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్ను ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం.. అది కూడా జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్.. ఇలా ఏ యూజర్ అయినా పర్వాలేదు. అయితే ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమ ఓటీటీ యాప్లోని కంటెంట్ మొత్తం ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది జియో హాట్స్టార్. జియో హాట్ స్టార్కు చెందిన అన్ని షోలు, సినిమాలు, వెబ్సిరీస్లు రోజంతా ఉచితంగా వీక్షించవచ్చు.ఈ బిగ్ అనౌన్స్మెంట్కు సంబంధించిన బ్యానర్ జియో హాట్స్టార్ యాప్లో కనిపిస్తోంది. ఈ బ్యానర్లలో "ప్రౌడ్ ఇండియన్ ప్రౌడ్లీ ఫ్రీ" అనే ట్యాగ్ లైన్ తో "ఫ్రీ" అని రాసి ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ జియో హాట్స్టార్ కంటెంట్ను వీక్షించవచ్చు. ఇందుకోసం మొబైల్ లేదా టీవీ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. ఆగస్టు 15న జియో హాట్స్టార్లో సలాకార్ అనే కొత్త సిరీస్ రాబోతోంది. ఇది ఒక డిటెక్టివ్ కథ. ఆగస్టు 15న ఉచితం కావడంతో ఈ సిరీస్ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.ఈ ఆఫర్ అందరికీ..ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే జియో హాట్స్టార్ను చూడటానికి జియో యూజరే అయి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే జియో హాట్స్టార్ బండిల్ ఆఫర్ ఎయిర్టెల్, వీఐ ప్లాన్లలో కూడా అందుబాటులో ఉంది. మామూలుగా ఎంపిక చేసిన కొంత కంటెంట్ జియో హాట్స్టార్లో ఎప్పుడైనా ఉచితంగా చూడవచ్చు. కానీ ఆగస్టు 15న మాత్రం 24 గంటల పాటు మొత్తం కంటెంట్ను ఉచితంగా అందించనున్నారు. -
వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్..
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిపై వెనక్కి తగ్గింది. కొత్త పొదుపు ఖాతాలకు పెంచిన కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన కనీస సగటు బ్యాలెన్స్ను రూ.50 వేల నుంచి రూ.15 వేలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనల్లో ఇటీవలె మార్పులు తీసుకొచ్చింది. బ్యాంక్ ఇదివరకు సవరించిన పాలసీ ప్రకారం.. మెట్రో, అర్బన్ కస్టమర్లకు ఎంఏబీ ఐదు రెట్లు పెరిగి రూ.50,000కు చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.25 వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రూ.10,000గా ఉంది. ఇది మునుపటి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ మార్పులు కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులపై ఈ విధానం ప్రభావం చూపదని చెప్పింది.అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఎంఏబీని అత్యంత భారీగా పెంచడంతో ఖాతాదారులు, ఫైనాన్స్ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అధిక శాతం మంది ఖాతాదారులు నెలకు రూ.25,000 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. అలాంటిది బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో స్థిరంగా నగదు మెయింటెన్ చేయాలంటే వారి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పొదుపు ఖాతాలో రూ.50,000 ఎంఏబీ చాలామంది భారతీయులకు ఆచరణీయం కాదు. 90 శాతం మంది భారతీయులు నెలకు రూ.25,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఈ మార్పు వారికి శాపంగా మారుతుంది’ అని ప్రముఖ బ్యాంకర్ జే కోటక్ తన ఎక్స్ ఖాతాలో చెప్పారు. దీనిపై ఆర్బీఐ కూడా స్పందించింది. ఎంఏబీని నిర్ణయించుకోవడం పూర్తిగా బ్యాంకుల ఇష్టమంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. -
ఆ మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాల్సిందే!
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా ఐసీఐసీఐ బ్యాంక్ బాటలోకే వచ్చేసింది. తమ బ్యాంకులో పొదుపు ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరాన్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. మెట్రో లేదా పట్టణ శాఖలో కొత్త పొదుపు ఖాతాను తెరిచే ఎవరైనా రూ .25,000 కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించాల్సి ఉంటుంది. ఇది మునుపటి అవసరం రూ .10,000 కంటే రెట్టింపు.ఈ మార్పు ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేర్కొంది. అయితే ఈ కొత్త ఎంఏబీ నిబంధన కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఇప్పటికే పొదుపు ఖాతా ఉన్న కస్టమర్లకు ఇప్పటివరకూ ఉన్న నిబంధనలే కొనసాగుతాయి. ఏదేమైనా ఆగస్టు నుంచి ఖాతాలు తెరిచే వారు అవసరమైన బ్యాంక్ బ్యాలెన్స్ను నిర్వహించకపోతే పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది.కొత్త నిబంధనలుఅప్డేట్ చేసిన నిబంధనల ప్రకారం.. ఖాతాదారులు స్థిరంగా రూ .25,000 బ్యాలెన్స్ నిర్వహించాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ ఈ పరిమితి కంటే తక్కువగా ఉంటే బ్యాంకు జరిమానా విధిస్తుంది. పట్టణ, మెట్రో శాఖలకు లోటులో 6 శాతం లేదా రూ.600లో ఏది తక్కువైతే అది జరిమానాగా లెక్కిస్తారు. ఈ సవరణకు ముందు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎంఏబీ అవసరాలు పట్టణ శాఖలకు రూ.10 వేలు, సెమీ అర్బన్ బ్రాంచ్ లకు రూ.5,000 (నెలవారీ సగటు ), గ్రామీణ శాఖలకు రూ.2,500 (త్రైమాసిక సగటు)గా ఉండేది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఈ పరిమితులు మారలేదు. తాజా సవరణ ప్రత్యేకంగా మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని కొత్త ఖాతాలకు వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంక్ మరీ భారీగా..ఓ వైపు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను రద్దు చేస్తుంటే.. ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఇప్పటికీ ఇలాంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మరింత దూకుడుగా మెట్రో, పట్టణ శాఖలలో కొత్త పొదుపు ఖాతాలకు ఎంఏబీని ఏకంగా రూ .50,000 కు పెంచేసింది. ఇది కూడా ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తుంది. కాగా విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీఐసీఐ బ్యాంక్ దిగివచ్చింది. కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) అవసరాన్ని రూ.15 వేలకు తగ్గించింది. మరి హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా అదే బాటలో తన నిర్ణయం మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.👉 చదవండి: హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్.. -
కొత్తగా 20,000 ఉద్యోగాలు..
కన్సల్టెన్సీ దిగ్గజం పీడబ్ల్యూసీ ఇండియా వచ్చే ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా 20,000 ఉద్యోగాలు కల్పించనుంది. దీనితో సంస్థలో మొత్తం సిబ్బంది సంఖ్య 50,000కు చేరనుంది. విజన్ 2030ని ప్రకటించిన సందర్భంగా పీడబ్ల్యూసీ ఇండియా చైర్పర్సన్ సంజీవ్ కృషన్ ఈ విషయం తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వార్షికాదాయాల్లో 5% టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాలపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు.దాంతోపాటు డిజిటల్ పరివర్తన, క్లౌడ్, సైబర్సెక్యూరిటీలాంటి వ్యాపార విభాగాల పై దృష్టి పెట్టనున్నట్లు సంజీవ్ చెప్పారు. సిబ్బంది, భాగస్వాములకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఆదాయాల్లో 1 శాతం భాగాన్ని వెచ్చిస్తున్నట్లు వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరిస్తూ, హైరింగ్ చేపడుతున్నామని సంజీవ్ చెప్పారు. ప్రధానంగా ఆర్థిక సేవలు, హెల్త్కేర్, ఆటో, టెక్నాలజీ, మీడియా వంటి ఆరు విభాగాలపై ఫోకస్ పెడుతున్నట్లు వివరించారు. -
‘బంగారం’ పెట్టుబడులు భారీగా తగ్గాయ్..
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి జులైలో రూ.1,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పెట్టుబడులు రూ.2,081 కోట్లతో పోల్చి చూస్తే ఏకంగా 40 శాతం తగ్గాయి. ఈ ఏడాది మే నెలలోనూ బంగారం ఈటీఎఫ్లు రూ.292 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం.పసిడి ధరలు ఆల్టైమ్ గరిష్టాల్లో ఉండడంతో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ వరుసగా మూడో నెలలోనూ గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చినట్లు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.అంతకుముందు వరుసగా రెండు నెలల్లో.. ఏప్రిల్లో రూ.6 కోట్లు, మార్చిలో 77 కోట్ల చొప్పున గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏడు నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.9,277 కోట్లుగా ఉన్నాయి.ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియోలోకి పసిడికి సైతం చోటు కల్పిస్తున్నట్లు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జూలై చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు రూ.67,634 కోట్లకు పెరిగాయి. జూన్ చివరికి ఉన్న రూ.64,777 కోట్లతో పోల్చి చూస్తే 4.4 శాతం వృద్ధి చెందాయి.78.69 లక్షల ఫోలియోలు గోల్డ్ ఈటీఎఫ్లలో మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ పెట్టుబడి ఖాతా) జూలై చివరికి 78.69 లక్షలకు చేరాయి. 2.15 లక్షల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి. ‘బంగారం గత రెండేళ్లలో బలమైన పనితీరు చూపించినప్పటికీ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఇన్వెస్టర్లకు కష్టమే. చాలా మంది ఇన్వెస్టర్లు హెడ్జింగ్ దృష్ట్యా బంగారానికి కొంత పెట్టుబడులు కేటాయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం గరిష్ట స్థాయిల్లో ఉన్న దృష్ట్యా అప్రమత్తత అవసరం’ అని జెర్మైట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ సూచించారు.స్థూల ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లలో అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోర్ట్ఫోలియో వైవిధ్యం దృష్ట్యా బంగారానికి డిమాండ్ కొనసాగుతున్నట్టు మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. -
ఫ్లిప్కార్ట్ ఒక్కరోజు ప్రత్యేక సేల్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘క్రాఫ్టెడ్ బై భారత్’ (Crafted by Bharat) పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్కార్ట్ సమర్థ్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ సేల్ 10వ ఎడిషన్ది. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశీయ కళాకారులు, చేనేతలు, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఫ్లిప్కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తోంది.ఈ ఒక్కరోజు ప్రత్యేక సేల్లో 1.4 లక్షలకు పైగా హస్తకళా ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పిస్తారు. 2,200 మందికి పైగా కళాకారులు, స్వయం సహాయక సంఘాలు, మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. వార్లీ, పటచిత్ర, మధుబని, పిచ్వాయి, టెర్రకోటా, ప్రాంతీయ చెక్క కళాకృతులు, హోమ్ డెకోర్, ఫర్నిచర్, వంటగది వస్తువులు, దుస్తులు మొదలైనవి ఈ ప్రత్యేక సేల్లో అందుబాటులో ఉంటాయి. భదోహి, హత్రాస్, మధురై, కన్నౌజ్, రామనగర, ఉజ్జయిని వంటి చిన్న పట్టణాల మహిళలు తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు ఈ సేల్ అవకాశం కల్పిస్తోంది.ఏటా నిర్వహించే ఈ సేల్లో ఈసారి 100 మందికిపైగా కొత్త విక్రేతలు చేరారు. ఎంఎస్ఎంఈలు, స్థానిక కళాకారులకు సాధికారత కల్పిస్తూ తమ ఉత్పత్తులను ఆన్లైన్లో ఈ-కామర్స్ వేదికగా విక్రయించుకునేందుకు ఫ్లిప్కార్ట్ సమర్థ్ మిషన్ సహకారం అందిస్తోంది. -
రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్కే ఆఫర్ ఇచ్చాడో భారతీయ యువకుడు. రాయిటర్స్ కథనం ప్రకారం.. పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ, భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,02,152 కోట్లు) నగదు బిడ్ చేశారు. దాదాపు 17 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థకు కేవలం మూడేళ్ల ఏఐ స్టార్టప్ ఆఫర్ ఇవ్వడం విశేషం.ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించిన పెర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లుగా ( సుమారు రూ.1,57,800 కోట్లు) ఉంది. అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఆఫర్ చేసింది. ఈ డీల్ కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు ఫండ్లు ముందుకొచ్చాయని చెబుతోన్న పెర్ప్లెక్సిటీ ఏఐ.. పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఆన్లైన్ సెర్చ్ మార్కెట్ గుత్తాధిపత్యాన్నిఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్పై ఇప్పటికే రెగ్యులేటరీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రోమ్ను వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం కానీ బ్రౌజర్ ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది. ఈ పరిణామాలు జరుగుతుండగానే పెర్ప్లెక్సిటీ ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం.ఎవరీ అరవింద్ శ్రీనివాస్?చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్. గతంలో గూగుల్లోనే పనిచేసిన శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కీలతో కలిసి 2022లో పెర్ప్లెక్సిటీ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రియల్ టైమ్లో సమాధానాలను అందించే తన సంభాషణాత్మక ఏఐ సెర్చ్ ఇంజిన్తో శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంపెనీ ఇటీవల తన సొంత ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ ను కూడా ప్రారంభించింది. క్రోమ్ ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తోంది.👉 చదవండి: ఐఐటీ హైదరాబాద్లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత -
ట్రంప్ గ్రేట్ అంటున్న ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ కియోసాకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రేట్ అంటున్నారు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి. క్రిప్టోకరెన్సీలో పెన్షన్ పొదుపు చేసే అవకాశాన్ని కల్పించినందుకు ప్రశంసించారు. అమెరికన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన 401(కె) రిటైర్మెంట్ ప్లాన్ల బ్యాలెన్స్లలో ఉన్న నిధులను డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ ఇటీవల సంతకం చేశారు.నేడు ఈ పొదుపు మొత్తం 12,5 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.కాబట్టి వర్చువల్ కరెన్సీ మార్కెట్లోకి బిలియన్ డాలర్లు ప్రవహించవచ్చు. అయితే, డిజిటల్ ఆస్తుల యజమానులు ఇప్పుడే సంతోషించడం తొందరపాటు అవుతుంది. రిస్క్ లను తగ్గించడానికి, యూఎస్ నివాసితుల ప్రయోజనాలను రక్షించడానికి పెన్షన్ పొదుపును ఖర్చు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించిన తరువాత మాత్రమే ఈ చట్టం ఆచరణలోకి వస్తుంది.క్రిప్టోకరెన్సీల్లోనే కాకుండా రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ ఆస్తుల్లో కూడా పొదుపు చేసే హక్కును రెగ్యులేటరీ చట్టం కల్పించడం గమనార్హం. అందువల్ల వర్చువల్ కరెన్సీల్లో ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తారో తెలియదు.డోనాల్డ్ ట్రంప్కు తన ఆమోదాన్ని తెలియజేస్తూ రాబర్ట్ కియోసాకి ‘ఎక్స్’(ట్విటర్)లో ఇలా పోస్ట్ చేశారు.. ‘బిట్ కాయిన్ కొనుగోలుకు ప్రజలు తమ రిటైర్మెంట్ పొదుపును ఖర్చు చేయడానికి ట్రంప్ అనుమతించడం గొప్ప వార్త. గొప్ప అధ్యక్షుడు, గొప్ప నాయకుడు. మీరు బిట్ కాయిన్ సేవ్ చేస్తున్నారా?’ అంటూ రాసుకొచ్చారు. TRUMP allowing retirement accounts to save Bitcoin is big news. Great President…great leader.Are you saving Bitcoin?— Robert Kiyosaki (@theRealKiyosaki) August 7, 2025 -
ఈ బ్యాటరీ వచ్చిందంటే టెస్లాకు చావే!
చైనా టెక్ దిగ్గజం హువావే ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) బ్యాటరీ టెక్నాలజీలో సంచలనం సృష్టించబోతోంది. తక్కువ సమయంలో ఛార్జ్ అయ్యే, ఎక్కువ రేంజ్ ఇచ్చే బ్యాటరీని రూపొందిస్తున్న ఈ కంపెనీ అందులో పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బీజీఆర్ రిపోర్ట్ ప్రకారం.. ఈ కొత్త సాలిడ్-స్టేట్ బ్యాటరీ 1,800 మైళ్ళు (సుమారు 3,000 కిలోమీటర్లు) డ్రైవింగ్ పరిధిని అందించగలదు. ఐదు నిమిషాల్లోనే 10% నుండి 80% వరకు రీఛార్జ్ అవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే టెస్లా వంటి దిగ్గజాల ఆధిపత్యానికి చావు తప్పదని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.2023లో దాఖలు చేసిన పేటెంట్ ప్రకారం.. ఈ బ్యాటరీ అధిక-సాంద్రత కలిగిన సాలిడ్-స్టేట్ ఆర్కిటెక్చర్ను ఉపయోగిస్తుంది. మెరుగైన భద్రత, దీర్ఘ మన్నిక, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ను అందిస్తుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో రెండు ఇబ్బందులు ఉంటాయి. అవి తక్కువ రేంజ్, ఛార్జింగ్కు ఎక్కువ సమయం పట్టడం. ఈ బ్యాటరీ కమర్షియల్గా పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇక రేంజ్ గురించి ఆందోళనలు అక్కర్లేదు. ఛార్జింగ్ సమయాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.టెస్లాకు ముప్పు ఎందుకంటే..టెస్లా అత్యంత అధునాతన మోడళ్లు గరిష్టంగా 400–500 మైళ్ల రేంజ్ను అందిస్తున్నాయి. వీటిని ఛార్జ్ చేయడానికి 15–30 నిమిషాలు పడుతోంది. హువావే ప్రోటోటైప్ పనితీరు, సౌలభ్యం రెండింటిలోనూ పురోగతిని సూచిస్తుంది. దీంతో బ్యాటరీ ఆవిష్కరణ కేంద్రాన్ని అమెరికా నుంచి చైనాకు మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అయినప్పటికీ, ఈ బ్యాటరీ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. వాస్తవ ప్రపంచ పనితీరు ప్రయోగశాల ఫలితాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "ఇది ఒక ఆశాజనక దశ, కానీ భారీ ఉత్పత్తి, వాహనాలలో ఇంటిగ్రేషన్ నిజమైన పరీక్ష" అని బెంగళూరుకు చెందిన ఈవీ పరిశోధకుడు డాక్టర్ అనిల్ మెహతా అన్నారు.ఈ బ్యాటరీని ఎప్పుడు లాంచ్ చేసేదీ, ఏ వాహనంతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేది హువావే ఇంకా వెల్లడించలేదు. కానీ ఇలాంటి బ్యాటరీ రాబోతోందన్న వార్తలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈవీ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్న భారత్ వంటి మార్కెట్లలో మరింత చర్చనీయాంశంగా మారాయి. -
ఐటీ సిటీలో ఇళ్లు అమ్మేస్తున్న టెకీలు..
దేశ ఐటీ రాజధానిగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, అధ్వానంగా మారుతున్న ట్రాఫిక్, క్షీణిస్తున్న గాలి నాణ్యత కారణంగా ఐటీ ఉద్యోగులు, టెక్ నిపుణులు మైసూరుకు మకాం మారుస్తున్నారు. ఇక్కడ ఇళ్లు అమ్మేసి.. అక్కడ కొంటున్నారు. ఒకప్పుడు రిటైర్మెంట్ స్వర్గధామంగా పేరొందిన మైసూరు ఇప్పుడు నిశ్శబ్ద జీవనశైలిని కోరుకునే హైబ్రిడ్, రిమోట్ వర్కర్లకు ఇష్టమైన గమ్యస్థానంగా మారుతోంది.బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్ వే, ప్రతిపాదిత రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) ద్వారా మెరుగైన కనెక్టివిటీ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది. ఈ మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ లు బెంగళూరు టెక్ వ్యవస్థతో సంబంధాలను కొనసాగిస్తూనే మైసూరులో స్థిరపడటానికి ఐటీ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు బెంగళూరులోని తమ ప్రాపర్టీలను అమ్మేసి మైసూరులో కొంటున్నారు.ఈ ప్రాంతాలకు డిమాండ్మైసూరులోని సరస్వతీపురం, జయలక్ష్మీపురం, హెబ్బాళ్ వంటి ప్రాంతాల్లో నివాస డిమాండ్ పెరుగుతోంది. 2బీహెచ్కే ఫ్లాట్ల ప్రాపర్టీ ధరలు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతున్నాయి. నెలవారీ అద్దెలు రూ.15,000 నుంచి రూ.45,000 వరకు ఉన్నాయి. ఉత్తర మైసూరు ముఖ్యంగా హెబ్బాళ్ పారిశ్రామిక కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న ఐటీ, నివాస కేంద్రంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.రింగ్ రోడ్డు, పెరిఫెరల్ జోన్లలో రూ.50-70 లక్షల మధ్య ధర కలిగిన ముడా ఆమోదం పొందిన ప్లాట్లపై ఇన్వెస్టర్లు కన్నేశారు. కొన్ని ప్రాంతాలలో వార్షిక పెరుగుదల 15–20% గా నివేదికలు చెబుతున్నాయి. విజయనగర్ స్టేజ్ 2, 3లోని లేఅవుట్లు ప్లాట్ల ఇళ్లకు ఆసక్తిని ఆకర్షిస్తున్నాయి.ఈ ట్రెండ్కు అనుగుణంగా డెవలపర్లు స్పందిస్తున్నారు. మైసూరులో 10 ఎకరాలను అభివృద్ధి చేయడానికి బ్రిగేడ్ గ్రూప్ రూ .225 కోట్ల జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్పై సంతకం చేయగా, సెంచురీ రియల్ ఎస్టేట్ ఈ ఏడాది చివర్లో ప్రణాళికాబద్ధ అభివృద్ధిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. మైసూరు సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో సమతుల్యం చేస్తుండటంతో ఇది బెంగళూరు పట్టణ విస్తరణకు ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.👉 చదవండి: ఇల్లు అమ్ముతున్నారా? ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు -
ఎస్బీఐ నుంచి స్టాక్ మార్కెట్కు 2 సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెండు అనుబంధ సంస్థల పబ్లిక్ ఇష్యూపై కసరత్తు చేస్తోందని ఎస్బీఐ గ్రూప్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి తెలిపారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వీటిలో ఉన్నాయని చెప్పారు. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్కు సంబంధించి నిర్దిష్ట గడువేదీ నిర్దేశించుకోలేదని పేర్కొన్నారు.గ్రూప్లో ప్రస్తుతం 18 అనుబంధ సంస్థలు ఉన్నాయని, వీటిపై సుమారు రూ.6,500 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, వాటి విలువ ప్రస్తుతం రూ.4 లక్షల కోట్ల పైచిలుకు ఉంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనకాపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్కు సంబంధించిన 30 హెల్త్ ఇన్సూరెన్స్ శాఖలను శనివారం ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఇవి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా సర్వీసులను అందించేందుకే ఉద్దేశించినవని శ్రీనివాసులు శెట్టి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 2,100 పైగా ఆస్పత్రుల నెట్వర్క్తో సేవలు అందిస్తున్నట్లు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ నవీన్ చంద్ర ఝా చెప్పారు. టారిఫ్ల అనిశ్చితి తొలగిపోతే మంచిది.. భారత్పై అమెరికా టారిఫ్ల వల్ల ప్రత్యక్షంగా పడే ప్రభావం తక్కువే అయినప్పటికీ, వాటి వల్ల తలెత్తిన అనిశ్చితి సాధ్యమైనంత త్వరగా తొలగిపోతే మంచిదని శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. అమెరికాకు ఎక్కువగా ఎగుమతయ్యే రసాయనాలు, టెక్స్టైల్స్, ఆభరణాలు, తెలుగు రాష్ట్రాల నుంచి ఆక్వా తదితర రంగాలకు టారిఫ్ల వల్ల సవాళ్లు తలెత్తవచ్చని చెప్పారు. అయితే, టారిఫ్ల ప్రభావిత రంగాలకు రుణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున తమ బ్యాంకుపై ప్రభావం పెద్దగా ఉండదని తెలిపారు. -
ఇల్లు అమ్ముతున్నారా? ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు
ఆర్థిక ఇబ్బందులతోనో లేక ఇతర కారణాల వల్లో చాలా మంది తమ ఇల్లు అమ్ముతుంటారు. ఇలా ఇంటిని అమ్మగా వచ్చిన ఆదాయంపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వర్తిస్తుంది. అయితే కొంత మంది చేస్తున్న పొరపాట్ల వల్ల అనవసరంగా అధిక పన్ను చెల్లించాల్సి వస్తోంది.చాలా మంది తమ ఇళ్లను విక్రయించేటప్పుడు చేసే కొన్ని ఖరీదైన తప్పులను ట్యాక్స్బడ్డీ డాట్ కామ్ (TaxBuddy.com) వ్యవస్థాపకుడు సుజిత్ బంగర్ ఎత్తి చూపారు. అవి గణనీయంగా అధిక పన్ను చెల్లింపులకు దారితీస్తాయి. ఇలాగే ఒక క్లయింట్ పన్ను మినహాయింపులను విస్మరించడంతో దాదాపు రూ .1.87 లక్షలు అదనంగా చెల్లించాల్సి వచ్చేదన్న విషయాన్ని ఇటీవల లింక్డ్ఇన్ పోస్ట్లో బంగర్ పంచుకున్నారు.‘మా క్లయింట్ (రామ్) తన ఇంటి అమ్మకంపై రూ .1,87,500 అదనంగా పన్ను చెల్లించాల్సి వచ్చేది. మేము చట్టబద్ధంగా అనుమతించిన అన్ని ఖర్చులను జోడించాం. అతని పన్ను భారాన్ని విజయవంతంగా తగ్గించాం’ అని బంగర్ పేర్కొన్నారు.మూలధన లాభాలను లెక్కించేటప్పుడు, పన్ను చెల్లింపుదారులు తరచుగా కొనుగోలు లేదా మెరుగుదల వ్యయంలో భాగంగా అర్హతను తక్కువగా అంచనా వేస్తారని ఆయన చెప్పారు. చాలా మంది దీనిని కేవలం కొనుగోలు ధరకు పరిమితం చేస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 55 కింద అనుమతించిన చట్టబద్ధమైన మినహాయింపులను కోల్పోతారు.చట్టబద్ధంగా ఏ ఖర్చులను క్లెయిమ్ చేయవచ్చు?🔸స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు🔸బ్రోకరేజీ లేదా కమిషన్🔸మూలధన మెరుగుదల ఖర్చులు🔸లీగల్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు🔸సొసైటీ బదిలీ ఫీజులు🔸గృహ రుణ వడ్డీ (సెక్షన్ 24(బి) కింద ఇప్పటికే క్లెయిమ్ చేయనట్లయితే)🔸వీటన్నింటికీ సరైన డాక్యుమెంటేషన్ ఉండాలిఆ క్లయింట్ చేసిన తప్పు ఇదే..బంగర్ పేర్కొన్న క్లయింట్ చేసిన పొరపాటు ఏంటంటే.. ఇల్లు మొత్తం అమ్మకం ధర రూ .1.2 కోట్లు కాగా వాస్తవ కొనుగోలు ధర రూ .80 లక్షలను మాత్రమే నివేదించాడు. అతను విస్మరించిన ఖర్చులు ఇవే..🔸బ్రోకరేజీలో రూ.80,000🔸రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలో రూ.4,70,000🔸ప్రధాన రిపేర్ ఖర్చులు రూ.6,00,000🔸లీగల్ ఛార్జీలు రూ.50 వేలు🔸హోమ్ లోన్ వడ్డీ రూ.3,00,000"సరైన డాక్యుమెంటేషన్ ఈ ఖర్చులను గుర్తించడానికి, అతని పన్ను పరిధిలోకి వచ్చే లాభాలను గణనీయంగా తగ్గించడానికి మాకు సహాయపడింది" అని బంగర్ పేర్కొన్నారు.👉 చదవండి: ‘ఇదే మా ఇల్లు’.. ప్రపంచంలోనే ఖరీదైన పెద్ద ప్యాలెస్ -
ఈ కంపెనీలు ఐపీవోకి వస్తున్నాయ్..
ఎలక్ట్రికల్ ఉత్పత్తుల సంస్థ సిల్వర్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. వీటి ప్రకారం రూ. 1,000 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్లు విక్రయించనున్నారు.2023–2025 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ ఆదాయం వార్షికంగా 95 శాతం వృద్ధి చెందింది. పంపులు, మోటర్ల ఉత్పత్తికి సంబంధించి 24,00,000 యూనిట్లు, 72,00,000 ఫ్యాన్ల స్థాపిత సామర్థ్యంతో సంస్థకు గుజరాత్లోని రాజ్కోట్లో ప్లాంటు ఉంది. ఐపీఓకు టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సన్నద్ధమవుతోంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా 95.05 లక్షల తాజా ఈక్విటీలు జారీ చేయనుంది. ప్రమోటర్ కంపెనీ కార్తికేయ్ కన్స్ట్రక్షన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 23.76 లక్షల షేర్లను విక్రయించనుంది.సమీకరించే రూ.138 కోట్ల నిధులను మూలధన వ్యయ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకుంటామని కంపెనీ ముసాయిదా పత్రాల్లో తెలిపింది. ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా ఖంబట్టా సెక్యూరిటీస్, రిజిస్ట్రార్గా బిగ్షేర్ సర్వీసెస్లు సంస్థలు వ్యవహరించనున్నాయి. టెక్నోక్రాఫ్ట్ 2025 జూన్ 30 నాటికి రూ.685.83 కోట్ల విలువైన ఆర్డర్లు కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం 2025లో రూ.28.20 కోట్ల నికర లాభం, రూ.279.56 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. -
ప్రభుత్వ స్కీమ్లు.. ఒకటి పొడిగింపు.. మరొకటి పునఃప్రారంభం
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్ స్కీమును కొన్ని వాహన విభాగాలకు రెండేళ్ల పాటు 2028 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎలక్ట్రిక్ బస్సులు, ఈ–అంబులెన్స్లు, ఈ–ట్రక్కులు వీటిలో ఉన్నాయి. వాస్తవానికి ఈ స్కీము గడువు 2026 మార్చితో ముగియాల్సి ఉంది.ఈ స్కీము పరిమాణం రూ. 10,900 కోట్లకు మాత్రమే పరిమితమవుతుందని, ఒకవేళ గడువు లోగా నిధులు పూర్తిగా వినియోగించేసిన పక్షంలో.. సంబంధిత సెగ్మెంట్లు లేదా స్కీము కూడా ముగిసిపోతుందని కేంద్రం వివరించింది. మరోవైపు, రిజిస్టర్డ్ ఈ–టూవీలర్లు, ఈ–రిక్షాలు, ఈ–కార్టులు, ఈ–త్రీ వీలర్లకు ఆఖరు తేదీ యథాప్రకారంగా 2026 మార్చి 31గా ఉంటుందని పేర్కొంది. టెక్స్టైల్స్ పీఎల్ఐ స్కీము పోర్టల్ పునఃప్రారంభం పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు టెక్స్టైల్స్ రంగానికి సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము పోర్టల్ను మళ్లీ తెరిచినట్లు కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. గతంలో నిర్దేశించిన మార్గదర్శకాలే కొత్త దరఖాస్తులకు కూడా వర్తిస్తాయి. ఆసక్తి గల కంపెనీలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టెక్స్టైల్స్ శాఖ సూచించింది. -
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ విస్తరణ
హైదరాబాద్: యూకే కేంద్రంగా ఉన్న ఒరాకిల్ (Oracle) భాగస్వామ్య సంస్థ ఈయాప్సిస్ (eAppSys), హైదరాబాద్లో తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను విస్తరించింది. ప్రస్తుతం ఉన్న 200 మంది ఉద్యోగుల సంఖ్యను వచ్చే రెండు సంవత్సరాల్లో 500కి పెంచే లక్ష్యాన్ని సంస్థ ప్రకటించింది. ఈ కొత్త కేంద్రాన్ని తెలంగాణ ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ విస్తరణలో భాగంగా 400 సీట్ల సామర్థ్యంతో కూడిన ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒరాకిల్ క్లౌడ్, ఈఆర్పీ, ఏఐ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల కోసం ఇది ఆసియా-పసిఫిక్ (APAC), యూరప్-మిడిల్ ఈస్ట్- ఆఫ్రికా (EMEA), నార్త్ అమెరికా ప్రాంతాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది.ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లు, ఈఆర్పీ కన్సల్టెంట్లు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు వంటి నైపుణ్యాల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ఈయాప్సిస్ సంస్థ తెలిపింది. స్థానిక ప్రతిభను అభివృద్ధి చేసేందుకు అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది.“ఈ కేంద్రం మా గ్లోబల్ వృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయి” అని ఈయాప్సిస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి బద్దం అన్నారు. “ప్రపంచ దృష్టితో ఆలోచించి, స్థానికంగా అమలు చేసే బృందాన్ని నిర్మిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఈయాప్సిస్ కంపెనీ వివిధ సంస్థలకు ఒరాకిల్ సాఫ్ట్వేర్తో సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ సేవలు అందిస్తుంది. -
భయంతోనే బంగారం కొంటున్నారా?
పెట్టుబడుల ప్రపంచంలో వారెన్ బఫెట్ అగ్రస్థానంలో ఉన్నారు. అధిక రాబడులనిచ్చే స్టాక్స్ ఎంచుకునే చాతుర్యానికి పేరుగాంచిన బఫెట్ స్టాక్ మార్కెట్లో తిరుగులేని రారాజు. మరి ఆయన సంపద ఎంతనుకుంటున్నారు..? 140 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.12 లక్షల కోట్లు. ఇంత భారీ సంపద ఉన్నా ఆయన దగ్గర రవ్వంత బంగారం కూడా లేదంటే నమ్ముతారా?బంగారంపై ఇన్వెస్ట్ చేసే విషయానికి వస్తే వారెన్ బఫెట్ చాలా క్లియర్ గా ఉంటాడు. ఆయనకు బంగారంపై ఎటువంటి పెట్టుబడులు లేవు. బంగారం వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టకూడదనేది వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్. తన వాల్యూ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీకి బంగారం సరిపోదని కొన్నేళ్లుగా ఆయన చెబుతూ వస్తున్నారు. బఫెట్కు ఏకైక బంగారు పెట్టుబడి బారిక్ గోల్డ్ అనే గోల్డ్ మైనింగ్ కంపెనీలో ఉండేది. అది కూడా ఆయన అంతర్గత మనీ మేనేజర్లలో ఎవరైనా స్వతంత్రంగా పెట్టి ఉండవచ్చు. దాన్ని తర్వాత ఆరు నెలలోనే బఫెట్ విరిమించుకున్నారు.బఫెట్ దగ్గర బంగారం ఎందుకు లేదంటే..?బఫెట్ బంగారాన్ని ఉత్పాదకత లేని ఆస్తిగా భావిస్తారు. ‘బంగారంలో రెండు ముఖ్యమైన లోపాలు ఉన్నాయి. అది పెద్దగా ఉపయోగం లేనిది అలాగే ఉత్పాదకత లేనిది’ అని 2011లో వారెన్ తన షేర్ హోల్డర్లతో అన్నారు. బంగారానికి కొంత పారిశ్రామిక ఉపయోగం, ఆభరణాలుగా పనికొస్తుంది కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఇది తప్పుడు పెట్టుబడి అనేది ఆయన అభిప్రాయం.2011లో బఫెట్ ఈ వైఖరి తీసుకున్నప్పుడు 1,750 డాలర్లుగా ఉన్న ఔన్స్ బంగారం ప్రస్తుతం 3,350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంటే పద్నాలుగేళ్లలో బంగారం ధర రెట్టింపు అయింది. దీన్ని బట్టి బఫెట్ అభిప్రాయం తప్పని చాలా మందికి అనిపిస్తుంది. కానీ కాంపౌండ్ యాన్యువలైజ్డ్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) పరంగా చూస్తే ఇది కేవలం 5 శాతం మాత్రమే. ఇదే సమయంలో యూఎస్ స్టాక్స్ 14 శాతానికి పైగా సీఏజీఆర్ పెరిగాయి. కాబట్టి బంగారం విషయంలో బఫెట్ అభిప్రాయం కరెక్టే..బంగారం ధర పెరగడానికి భయమే కారణంపెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏమిటంటే ‘ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశ పడాలి’. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందంటాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది ఆయన అభిప్రాయం. -
ఉమాంగ్ యాప్లో యూఏఎన్.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్
ఉమాంగ్ యాప్లో (UMANG App) యూఏఎన్ (UAN) యాక్టివేషన్కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO ఈపీఎఫ్ఓ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూఏఎన్ పొందడానికి, యాక్టివేట్ చేసుకునేందుకు ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (ఎఫ్ఏటీ)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త ప్రక్రియ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది.యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఈపీఎఫ్ఓ సభ్యులు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు, వివరాలను అప్డేట్ చేసేందుకు, ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకునేందుకు, ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) వంటి పథకాల కింద ప్రయోజనాలు పొందడానికి యూఏఎన్ అవసరం. యూఏఎన్ యాక్టివేట్ చేయకుండా సభ్యులు ఈ ఆన్లైన్ సేవలను పొందలేరు.ఉమాంగ్ యాప్ గురించి..యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ (ఉమాంగ్) అనేది ఒక ప్రభుత్వ యాప్. ఇది ఒకే ప్లాట్ఫామ్పై అనేక ఈ-గవర్నెన్స్ సేవలను అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా పౌరులు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు.ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు వారి యూఏఎన్ను జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ రికార్డులను అప్డేట్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండానే తమ స్మార్ట్ఫోన్ల నుండి నేరుగా వారి ఈ-యూఏఎన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ కార్మికులు, నేపాల్, భూటాన్ పౌరులకు తప్ప మిగతా ఉద్యోగులందరికీ ఆగస్టు 1 నుంచి ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ జనరేషన్ లేదా యాక్టివేషన్కు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ను ఈపీఎఫ్వో తప్పనిసరి చేసింది. -
భారతీ ఎయిర్టెల్ బల్క్ డీల్.. రూ. 11,227 కోట్ల షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్(ఐసీఐఎల్) తాజాగా 0.98 శాతం వాటా విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్డీల్ గణాంకాల ప్రకారం రెండు దశలలో 6 కోట్ల షేర్లు అమ్మివేసింది. ఒక్కో షేరుకి రూ. 1,870–1,872 ధరల శ్రేణిలో రూ. 11,227 కోట్లకు వాటా విక్రయించింది.అయితే కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. తాజా లావాదేవీ తదుపరి ఎయిర్టెల్లో ఐసీఐఎల్ వాటా 2.47 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గింది. వెరసి మొత్తం ప్రమోటర్ల వాటా 51.25 శాతం నుంచి 50.27 శాతానికి దిగివచ్చింది. ప్రమోటర్లలో భారతీ టెలికం అత్యధికంగా 40.47 శాతం వాటా కలిగి ఉంది. వాటా విక్రయం నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 1,860 వద్ద ముగిసింది. -
Pharma: భారత్ ఎగుమతులకు ఆటంకంగా అమెరికా సుంకాలు
-
Magazine Story: దూసుకుపోతున్న బంగారం ధరలు..
-
బ్యాంకులకు 15 రోజులే టైమ్.. సెటిల్ చేయాల్సిందే!
మరణించినవారి బ్యాంకు ఖాతాలు, సేఫ్ లాకర్ల క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ముసాయిదా సర్క్యులర్ జారీ చేసింది. ప్రతిపాదిత మార్గదర్శకాలు డిపాజిట్ ఖాతాలు, సేఫ్ లాకర్లు నిర్వహించే అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. ముసాయిదా సర్క్యులర్ పై ఆగస్టు 27లోగా అభిప్రాయాలు తెలపాలని సెంట్రల్ బ్యాంక్ కోరింది. వీలునామా, కోర్టు ఉత్తర్వులు లేదా వివాదం లేకపోతే వారసత్వ ధృవీకరణ పత్రాలు లేదా ప్రొబేట్ వంటి చట్టపరమైన పత్రాలపై పట్టుబట్టకుండా నామినీలు లేదా జీవించి ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు నిధులను విడుదల చేయాలని సర్క్యులర్లో పేర్కొంది. క్లెయిమ్దారులు నామినీ క్లెయిమ్ ఫారం, మరణ ధృవీకరణ పత్రం, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని సమర్పిస్తే చాలు.ఆలస్యమైతే పరిహారంఏదైనా డిపాజిట్ సంబంధిత క్లెయిమ్ గడువులోగా పరిష్కరించబడకపోతే, అటువంటి ఆలస్యానికి గల కారణాలను బ్యాంకు హక్కుదారులకు తెలియజేయాలి. “… ఆలస్యమైతే, ఆ ఆలస్య కాలానికి సెటిల్మెంట్ మొత్తంపై ప్రస్తుత బ్యాంకు రేటు సంవత్సరానికి 4% కంటే తక్కువ కాకుండా వడ్డీ రూపంలో క్లెయిమ్దారులకు బ్యాంకు పరిహారం చెల్లిస్తుంది" అని సర్క్యులర్లో పేర్కొన్నారు.ఇక సేఫ్ డిపాజిట్ లాకర్ లేదా సేఫ్ కస్టడీలో ఉన్న వస్తువులకు సంబంధించి క్లెయిమ్లను ప్రాసెస్ చేయడంలో జాప్యం జరిగితే, ఆలస్యం జరిగిన ప్రతి రోజుకు బ్యాంకు రూ .5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.నాన్-నామినీ, జాయింట్ అకౌంట్ క్లెయిమ్ల సెటిల్మెంట్మరణించిన డిపాజిటర్ నామినీని పేర్కొనకపోయి ఉన్నప్పుడు లేదా జాయింట్ అకౌంట్ల విషయంలో నామినీ లేదా సర్వైవర్ క్లాజ్ లేని సందర్భాల్లో క్లెయిమ్ల పరిష్కారానికి బ్యాంకులు సరళీకృత విధానాన్ని అవలంబించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇటువంటి క్లెయిమ్ల సెటిల్మెంట్ కోసం ఒక బ్యాంకు దాని రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థల ఆధారంగా రూ .15 లక్షల పరిమితిని నిర్ణయించాలి.బ్యాంకులు పూర్తి డాక్యుమెంట్లు అందిన 15 రోజుల్లోగా క్లెయిమ్లను సెటిల్ చేయాల్సి ఉంటుంది. సేఫ్ డిపాజిట్ లాకర్/వస్తువులు సేఫ్ కస్టడీలో ఉన్నట్లయితే, అవసరమైన అన్ని పత్రాలను అందుకున్న 15 రోజుల్లోగా, బ్యాంకు క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. -
ఏంటి టీసీఎస్లో ఇలా చేస్తున్నారు?
దేశంలో అగ్ర ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరిన ఫ్రెషర్లతో కూడా బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ తన బెంచ్ పాలసీని సవరించిన కొన్ని వారాల తరువాత ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.ఓవైపు లేఆఫ్ ఆందోళనలున్నా జీతాల పెంపు ప్రకటించి ఉద్యోగులకు కాస్త ఊరట కల్పించింది టీసీఎస్. అయితే ఈ ప్రకటనకు ఒక రోజు ముందు, ఒక రెడ్డిట్ యూజర్ తాను బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందంటూ పేర్కొన్నారు. 'టీసీఎస్ ఫైరింగ్ ఫ్రెషర్స్?' అనే శీర్షికతో ఓ పోస్టు పెట్టారు. అహ్మదాబాద్, పుణెకు చెందిన పలువురు ట్రైనీలను కేవలం నాలుగైదు వారాల పాటు బెంచ్పై ఉంచి ఆ తర్వాత ఉద్వాసన పలికారని పేర్కొన్నారు.బెంచ్ పాలసీలో మార్పు, క్రియాశీల క్లయింట్ ప్రాజెక్ట్ లేకుండా అనుమతించదగిన వ్యవధిని 35 రోజులకు తగ్గించడం వంటివాటితో ఒత్తిడి తెచ్చి చప్పుడు లేకుండా ఉద్యోగులను టీసీఎస్ వదిలించుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగాలు తగ్గించుకునేందుకు ఫ్రెషర్లను కూడా వదిలిపెట్టడం లేదన్నారు.బలవంతంగా రాజీనామా చేయించారు'నేను కొన్ని రోజుల క్రితం బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్న రెడ్డిట్ యూజర్ ఫ్రెషర్స్ కూడా జాబ్ కట్ రాడార్ లో ఉన్నారని ఆరోపించారు. హెచ్ఆర్ తనను ఒక సమావేశానికి పిలిచి, తనతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయించి ఆపై తనకు రెండు ఆప్షన్లు ఇచ్చాడని పేర్కొన్నాడు. అవి వెంటనే రాజీనామా చేయడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.రాజీనామా చేయకపోతే ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నెగటివ్ రిలీజ్ లెటర్ జారీ చేస్తామని బెదిరించారని రాసుకొచ్చారు. అదే చెప్పినట్లు రాజీనామా చేస్తే మూడు నెలల వేతనం ఇచ్చి ఎటువంటి నెగటివ్ లేకుండా మంచిగా రిలీజ్ లెటర్ ఇస్తామన్నారని వివరించాడు. తన లాగే మరో నలుగురు ఫ్రెషర్లను కూడా ఏడిపించి బలవంతంగా రాజీనామా చేయించారని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు.తనను క్రియాశీల ప్రాజెక్టుకు కేటాయించినప్పటికీ బలవంతంగా రాజీనామా చేయించి ఆ ఆకస్మిక రాజీనామాకు వ్యక్తిగత కారణాలను పేర్కొనాలని హెచ్ఆర్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజీనామా, తొలగింపు రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని, తన కుటుంబంతో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని ఫ్రెషర్ ఆరోపించారు.👉 చదవండి: హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్.. -
ప్రపంచ ఏఐని శాసించేది మనమే.. అన్ని అవకాశాలూ మనకే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తృతి అంతటా పెరిగిపోయింది. అన్ని రంగాలను, పరిశ్రమలను ఈ సరికొత్త సాంకేతికత కమ్మేస్తోంది. దీంతో ఉద్యోగాలు, పని చేసే విధానం పూర్తిగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో 16వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ 2025లో ఫిక్కీ, కేపీఎంజీలు 'నెక్ట్స్ జనరేషన్ స్కిల్స్ ఫర్ ఎ గ్లోబల్ వర్క్ఫోర్స్: ఎనేబుల్ యూత్ అండ్ ఎంపవర్ ఎకానమీ' పేరుతో ఓ కీలక నివేదికను ఆవిష్కరించాయి.కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి విడుదల చేసిన ఈ నివేదిక గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్ గా మారడానికి భారతదేశ రోడ్ మ్యాప్ ను వివరిస్తుంది.ప్రాంప్ట్ ఇంజినీర్లు, స్మార్ట్ గ్రిడ్ అనలిస్టులు వంటి సరికొత్త భవిష్యత్ ఉద్యోగాలతో ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వేగవంతమైన కృత్రిమ మేధ ఆధారిత పరివర్తనను కీలక పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి. అయితే భారతీయ యువతలో కేవలం 26.1% మంది మాత్రమే సరైన వృత్తి శిక్షణను పొందుతున్నారు. ఇది అత్యవసర నైపుణ్య అంతరాలను తెలియజేస్తోంది.రంగాల వారీగా ఏఐ శిక్షణ, ఐటీఐలను ఆధునీకరించడం, టైర్ 2, 3 నగరాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం గ్లోబల్ సర్టిఫికేషన్ అలైన్ మెంట్, నైతిక ఏఐ ప్రమాణాలు, సమ్మిళిత విధానాలు అవసరమని పేర్కొంది.కలిసొచ్చే అంశాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్న యువ జనాభా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఎకోసిస్టమ్ మనం ఏఐ వర్క్ఫోర్స్లో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగడానికి సానుకూల అంశాలుగా కేపీఎంజీకి చెందిన నిపుణులు పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, సాహసోపేతమైన సంస్కరణలతో, భారత్ ఏఐ నిపుణులను బయటి దేశాలకు అందించగలదని అభిప్రాయపడ్డారు. -
హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్..
లక్షలాది లోన్ కస్టమర్లకు ఊరట కల్పిస్తూ.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంపీఎల్ఆర్) ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 7 నుండి అమల్లోకి వచ్చిన ఈ తగ్గింపు గృహ రుణాలు, కారు లోన్లు, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలను తగ్గిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి మినహా మిగతా అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్ను 0.05 శాతం తగ్గించింది. ఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.55 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. ఇక ఆరు నెలలు, ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.70 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.80 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గింది.సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఇవే..కాలపరిమితికొత్త ఎంసీఎల్ఆర్పాత ఎంసీఎల్ఆర్ఓవర్నైట్8.55%8.60%1 నెల8.55%8.60%3 నెలలు8.60%8.65%6 నెలలు8.70%8.75%1 సంవత్సరం8.70%8.75%2 సంవత్సరాలు8.75%8.75%3 సంవత్సరాలు8.75%8.80%(మూలం: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్)ఈఎంఐలు ఎలా ప్రభావితం అవుతాయంటే..ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను ఎంచుకున్న రుణగ్రహీతలకు ఎంసీఎల్ఆర్ రేట్ల ద్వారా రుణ ఈఎంఐలు నేరుగా ప్రభావితమవుతాయి. ఎంసీఎల్ఆర్ తగ్గడం అంటే సాధారణంగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గినట్లే. ఇది ఈఎంఐలు తగ్గడానికి దారితీస్తుంది. తాజా మార్పుతో, ప్రస్తుత రుణగ్రహీతలు వారి రుణాల రీసెట్ కాలాన్ని బట్టి వారి నెలవారీ ఈఎంఐలలో స్వల్ప క్షీణతను చూడవచ్చు.👉 చదవండి: చనిపోయినవారి బ్యాంకు అకౌంట్లపై కీలక నిర్ణయం -
పెరిగిన ఎల్ఐసీ లాభం.. ఎంతంటే..
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ.10,987 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.10,461 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ.2,10,910 కోట్ల నుంచి రూ.2,22,864 కోట్లకు జంప్చేసింది. ఈ కాలంలో తొలి ఏడాది ప్రీమియం రూ.7,470 కోట్ల నుంచి రూ. 7,525 కో ట్లకు బలపడింది. రెన్యువల్ ప్రీమియం ఆదాయం రూ.56,429 కోట్ల నుంచి రూ.59,885 కోట్లకు ఎగసింది. పెట్టుబడుల నుంచి నికర ఆదాయం రూ.96,183 కోట్ల నుంచి రూ. 1,02,930 కోట్లకు బలపడింది.మొత్తం ప్రీమియం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 1,19,200 కోట్లకు చేరింది. వ్యక్తిగత విభాగంలో 15 శాతం తక్కువగా 30,39,709 పాలసీలను విక్రయించింది. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 6 శాతం మెరుగుపడి రూ. 57,05,341 కోట్లుగా నమోదైంది. -
జాక్పాట్.. కుర్రాడు రూ.కోట్లు గెలిచాడు
అదృష్టం ఎప్పుడు ఎవరినీ ఎలా వరిస్తుందో చెప్పలేం. 30 ఏళ్లుగా తల్లిదండ్రులకు దక్కని అదృష్టం వారి కొడుక్కి దక్కింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థి వేన్ నాష్ డిసౌజా 1 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8.7 కోట్లు గెలుచుకున్నాడు.ఇల్లినాయిస్ అర్బానా-చాంపైన్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యను ప్రారంభించడానికి యూఎస్ వెళ్తున్న వేన్.. వెళ్తూ వెళ్తూ జూలై 26న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాటరీ టికెట్ కొన్నాడు. లక్కీ డ్రాలో ఆ టికెట్కే (సిరీస్ 510, నంబర్ 4463) జాక్పాట్ తగిలింది.వేన్ నాష్ డిసౌజా దుబాయ్లోనే పుట్టి పెరినప్పటికీ అతని తల్లిదండ్రులు ముంబైకి చెందినవారు. వేన్కు టీనేజర్ కావడంతో సొంతంగా అకౌంట్ లేదు. 18 ఏళ్లు నిండినా ఇప్పుడిప్పుడే కావడంతో అకౌంట్ సెట్ చేసుకోలేదు. దీంతో తన తండ్రి అకౌంట్ను ఉపయోగించి వేన్ డ్రాలోకి ప్రవేశించాడు. అతని కుటుంబం 30 సంవత్సరాలకు పైగా రాఫెల్ డ్రాలో పాల్గొంటోంది. అయినా వారికి దక్కని జాక్పాట్ వేన్కు దక్కింది.వేన్ ఒక రోజు యూనివర్సల్ స్టూడియోలో నిద్రిస్తుండగా కాల్ వచ్చింది. తాను లాటరీ గెలిచినట్లు వారు తెలియజేశారు. దీంతో అతనికి ఇంక నిద్ర పట్టలేదు. ఈ విషయాన్ని వేన్ మొదట నమ్మలేదు. అంతా కల అనుకున్నాడు. ఈ ప్రైజ్ మనీని తన విద్యకు, తన సోదరి చదువుల కోసం, దుబాయ్ లో ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించాలనుకుంటున్నట్లు వేన్ తెలిపాడు. 1999లో ఈ డ్రా ప్రారంభమైనప్పటి నుంచి 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ అందుకున్న 255వ భారతీయుడిగా వేన్ నిలిచాడు. -
‘జీవితం’పై జాగ్రత్త మనవాళ్లకే ఎక్కువండోయ్..
జీవిత బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక రక్షణకు ప్రాధాన్యత అధికమవుతోంది. ఈ విషయంలో దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది ప్రాంతం ఎంతో ముందుంది. జీవిత బీమా యాజమాన్యం, ఆర్థిక రక్షణలో దక్షిణ భారతదేశం జాతీయ స్థాయిలో ముందంజలో ఉందని ఇటీవలి ఇండియా ప్రొటెక్షన్ కోషియెంట్ (ఐపీక్యూ) 7.0 నివేదిక వెల్లడించింది. పట్టణ కేంద్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో దక్షిణ భారత ప్రాంతాలలో జీవిత బీమా 84 శాతం చొచ్చుకుపోయినట్లు వెల్లడైంది. ఇది దేశంలోనే అత్యధికం.ఫైనాన్షియల్ ప్రొటెక్షన్లో రీజనల్ లీడర్ షిప్చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు కీలక సూచీల్లో జాతీయ బెంచ్ మార్క్ లను అధిగమించాయి. యాజమాన్యంలో చెన్నై అగ్రస్థానంలో, ఆర్థిక భద్రతలో హైదరాబాద్ అగ్రస్థానంలో, అవగాహనలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచాయి. నేను లేకపోతే నా కుటుంబం ఏమౌతుందో.. అన్న ఆందోళనతో ఆర్థిక ప్రణాళికకు చాలామంది సిద్ధమవుతున్నారు.ఈ నివేదిక టర్మ్ ఇన్సూరెన్స్కు పెరుగుతున్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తోంది. ఇందులో పాల్గొన్నవారిలో 77% మంది కుటుంబ రక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రదాయ పొదుపు-ఆధారిత పాలసీల నుండి స్వచ్ఛమైన రిస్క్ కవరేజీకి మారడాన్ని ఇది సూచిస్తుంది.మహిళలకు మరీ ఎక్కువజీవిత బీమా, ఆర్థిక రక్షణపై జాగ్రత్త మహిళల్లోనే మరీ ఎక్కువ కనిపిస్తోంది. గుర్తించదగిన ధోరణిలో 86% మంది దక్షిణ భారత మహిళలు జీవిత బీమాను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. ఇది పురుషల సగటు (83%), జాతీయ మహిళా సగటు (75%) రెండింటినీ అధిగమించింది. ఆర్థిక పరిజ్ఞానం, భద్రతలో కూడా మహిళలు ఎక్కువ మార్కులు సాధించారు, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో లింగ అంతరాన్ని తగ్గించారు.యువతలోనూ..టర్మ్ ప్లాన్లు, యులిప్లు, పొదుపు ఆధారిత పాలసీలతో సహా వివిధ బీమా ఉత్పత్తులను అవలంబించడంలో యువత ముందంజలో ఉంది. దీంతోపాటు పిల్లల విద్య, వివాహం, సొంతిల్లు వంటి మైలురాళ్ల కోసం చాలా మంది పెట్టుబడులు పెడుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది.సవాళ్లూ ఉన్నాయ్..అధిక మొత్తంలో బీమా యాజమాన్యం ఉన్నప్పటికీ సవాళ్లూ ఉన్నాయి. ప్రతి ముగ్గురు పట్టణ ప్రాంత దక్షిణ భారతీయులలో ఒకరు టర్మ్ ఇన్సూరెన్స్ను ఎప్పుడూ పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఇందుకు ఆర్థిక స్థోమత, అత్యవసరత లేకపోవడం వంటివి అవరోధాలుగా ఉన్నాయి. ముఖ్యంగా యువత, తక్కువ-ఆదాయ సమూహాలలో ఇది ఎక్కువగా ఉంది. -
‘అదే రిలయన్స్కు మంచిది’.. వాటాదారులకు అంబానీ లేఖ
రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తు గురించి ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు లేఖలో తెలియజేశారు. ‘భారతదేశానికి ఏది మంచిదో అదే రిలయన్స్ కు మంచిది’ అనే శీర్షికతో రాసిన ఈ లేఖ కంపెనీ వృద్ధి దేశ పురోగతితో విడదీయరానిదిగా ఉంటుందన్న ముఖేష్ అంబానీ నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.దేశానికి అమృత కాలం.. రిలయన్స్కు పునరుజ్జీవండిజిటల్ పేమెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీలో భారత్ గ్లోబల్ లీడర్గా అవతరించిందని అంబానీ కొనియాడారు. ‘భారతదేశం కేవలం గ్లోబల్ ట్రెండ్లను అనుసరించడమే కాదు.. వాటిని సెట్ చేస్తోంది’ అని రాసుకొచ్చారు. 145 కోట్ల భారతీయుల సాధికారతకు కట్టుబడి ఉన్న "జాతీయ సంస్థ"గా రిలయన్స్ అభివృద్ధి చెందుతోందన్నారు.డీప్-టెక్ పరివర్తనరిలయన్స్ ఒక కొత్త తరం డీప్-టెక్ ఎంటర్ప్రైజ్లోకి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కృత్రిమ మేధస్సు, పునరుత్పాదక శక్తి, అడ్వాన్స్ డ్ మెటీరియల్స్, డిజిటల్ ప్లాట్ ఫామ్ వంటి అత్యాధునిక ఆవిష్కరణలపై 1,000 మందికి పైగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఎనర్జీ, రిటైల్ నుంచి టెలికాం, ఎంటర్టైన్మెంట్ వరకు రిలయన్స్ విభిన్న వ్యాపారాల్లో ఈ టెక్నాలజీలను అనుసంధానించనున్నట్లు అంబానీ ఉద్ఘాటించారు.వ్యాపార పనితీరు ముఖ్యాంశాలురిటైల్: రూ.3.3 లక్షల కోట్ల టర్నోవర్, దేశవ్యాప్తంగా 19,340 స్టోర్లు.జియో: 5జీలో 191 మిలియన్లతో సహా 488 మిలియన్ల యూజర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా నెట్వర్క్.మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్: డిస్నీతో వ్యూహాత్మక భాగస్వామ్యం, రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూయర్షిప్.ఆయిల్ అండ్ గ్యాస్: అత్యధిక ఇబిటా, బలమైన దేశీయ ప్లేస్మెంట్.O2C (ఆయిల్ టు కెమికల్స్): క్రమశిక్షణతో కూడిన వ్యయ నిర్వహణ ద్వారా స్థిరమైన పనితీరు.సుస్థిరతసుస్థిరత, సర్క్యులర్ ఎకానమీ సూత్రాలు, సమ్మిళిత వృద్ధికి రిలయన్స్ నిబద్ధతను అంబానీ పునరుద్ఘాటించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగాలన్న భారత్ ఆకాంక్షకు మద్దతుగా కంపెనీ తన ఉత్పాదక మౌలిక సదుపాయాలను భవిష్యత్తులో మెరుగుపరుచుకుంటోందని ఆయన పేర్కొన్నారు.👉 చదివారా? మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో.. ఎవరీ వైభవ్ తానేజా? -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
ఐటీ, ఫార్మా స్టాక్స్ నేతృత్వంలో భారత్ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీ రికవరీని సాధించాయి. సెన్సెక్స్ 811.97 పాయింట్లు పుంజుకుని రోజు కనిష్ట స్థాయి (79,811.29) నుంచి 80,623.26 వద్ద (0.10 శాతం లేదా 79.27 పాయింట్లు) ముగిసింది. నిఫ్టీ కూడా 252 పాయింట్లు పుంజుకుని 24,344.15 పాయింట్ల వద్ద (21.95 పాయింట్లు లేదా 0.09 శాతం) 24,596.15 వద్ద ముగిసింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. గత వారం భారత దిగుమతులపై సంతకం చేసిన 25 శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా ప్రకటించిన టారిఫ్ లు 21 రోజుల నోటీసు పీరియడ్ తర్వాత ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.బీఎస్ఈలో టెక్ మహీంద్రా, ఎటర్నల్ (జొమాటో), హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా కోలుకుని పాజిటివ్ గా ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.17 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా 0.75 శాతం, ఐటీ 0.87 శాతం, మీడియా 0.99 శాతం, ఆటో 0.25 శాతం, పీఎస్ యూ బ్యాంక్ 0.29 శాతం, మెటల్ 0.13 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 0.13 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.19 శాతం చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్బస్ ప్రెసిడెంట్గా జూర్గెన్ వెస్టర్మీయర్
ప్రముఖ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ ఎయిర్బస్ భారత్, దక్షిణ ఆసియా ప్రాంతానికి ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్గా జూర్గెన్ వెస్టర్మీయర్ను నియమితులయ్యారు. ఈ నియామకం సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం ఎయిర్బస్లో ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా ఉన్న జూర్గెన్, రెమీ మైలార్డ్ స్థానంలో ఈ పదవిని చేపడతారు.రెమీ మైలార్డ్ ఎయిర్బస్లో కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, టెక్నాలజీ హెడ్గా నియమితులవుతారు. తన కొత్త పాత్రలో, జూర్గెన్ భారత్, దక్షిణ ఆసియా ప్రాంతంలో ఎయిర్బస్ వ్యాపారాన్ని నడిపిస్తారు. ఇందులో కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్, డిఫెన్స్ అండ్ స్పేస్, హెలికాప్టర్లు ఉన్నాయి. కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ అమ్మకాలకు బాధ్యత వహించనున్న జూర్గెన్ సర్వీసెస్, ఇంజనీరింగ్, డిజిటల్, ఇన్నోవేషన్, శిక్షణ రంగాలలో సంస్థ విస్తరణకు కృషి చేయనున్నారు.జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ కార్ల్స్రూహే నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసిన జూర్గెన్.. తన కెరియర్ను 1998లో బీఎమ్డబ్ల్యూలో ప్రారంభించారు. అక్కడ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, మోటార్సైకిల్స్ ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ సప్లయర్ నెట్వర్క్, కాస్ట్ ఇంజనీరింగ్ రంగాలలో వ్యూహాత్మక స్థానాలలో పనిచేశారు. జూర్గెన్ 2020లో ఎయిర్బస్లో చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా చేరారు.అక్కడ ఆయన ఎయిర్బస్ విభాగాల్లో ప్రొక్యూర్మెంట్ బాధ్యతలు చూశారు -
బ్లాక్ థీమ్లో నిస్సాన్ మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్..
నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ను భారత్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ .8.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). నిస్సాన్ డీలర్షిప్లు, నిస్సాన్ ఇండియా వెబ్సైట్లో దీని బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ.11,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ను బ్లాక్ కలర్ థీమ్ ఆధారంగా రూపొందించారు.మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ఎక్స్టీరియర్ లో పియానో బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, రెసిన్ బ్లాక్ ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, గ్లాస్ బ్లాక్ రూఫ్ రైల్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ వాహనం ఎడమ ఫెండర్ పై మాగ్నైట్ బ్రాండింగ్ కింద 'కురో' బ్యాడ్జ్ ను ఇచ్చారు.ఈ మోడల్ లో బ్లాక్ డ్యాష్ బోర్డ్, పియానో బ్లాక్ గేర్ షిఫ్ట్ గార్నిష్, పియానో బ్లాక్ స్టీరింగ్ ఇన్సర్ట్, బ్లాక్ సన్ వైజర్స్, బ్లాక్ డోర్ ట్రిమ్స్ ఉన్నాయి. లైట్సాబర్ టర్న్ ఇండికేటర్లతో కూడిన బ్లాక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్టాండర్డ్ సాబుల్ బ్లాక్ వైర్లెస్ ఛార్జర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ డిస్ప్లే ఉన్నాయి. డాష్ క్యామ్ ను యాక్ససరీగా అందిస్తున్నారు.నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ పవర్ట్రెయిన్లు మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్లో లభిస్తాయి. 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (72 పీఎస్, 96 ఎన్ఎమ్) 5-స్పీడ్ ఎంటీ లేదా ఏఎంటీతో జత చేయవచ్చు. అలాగే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (100 పీఎస్, 160 ఎన్ఎమ్)కు 5-స్పీడ్ ఎంటీ, సీవీటీ ఆప్షన్లు ఉంటాయి. -
చనిపోయినవారి బ్యాంకు అకౌంట్లపై కీలక నిర్ణయం
మరణించిన ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు, సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను ప్రామాణీకరించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ప్రకటన చేశారు.చనిపోయినవారి బ్యాంకు ఖాతాలలో ఉన్న సొమ్ము, విలువైన వస్తువులను నామినీలకు లేదా చట్టబద్ధమైన వారసులకు అప్పగించడంలో వివిధ బ్యాంకుల్లో భిన్న ప్రక్రియలను అనుసరిస్తున్నారు. దీంతో క్లయిమ్ సెటిల్మెంట్లో ఇబ్బందులు, తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. బ్యాంకులు అనుసరించే ఈ ప్రక్రియలలో ఏకరూపతను తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం.రూ .67,000 కోట్లకుపైగా అన్క్లెయిమ్ డిపాజిట్లుబ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జూలై 28న పార్లమెంటులో సమర్పించిన ప్రభుత్వ డేటా ప్రకారం, భారతీయ బ్యాంకులు జూన్ 30, 2025 నాటికి రూ .67,000 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) నిధికి బదిలీ చేశాయి.క్లెయిమ్ చేయని మొత్తం డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.58,330.26 కోట్లు. ఇందులో ఎస్బీఐ రూ.19,329.92 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.6,910.67 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.6,278.14 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2,063.45 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.1,609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,360.16 కోట్లు అన్క్లయిమ్ డిపాజిట్లు ఉన్నాయి.ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 ఏళ్ల పాటు ఇనాక్టివ్ గా ఉన్న సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, అదేవిధంగా మెచ్యూరిటీ తర్వాత 10 ఏళ్లపాటు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను డీఈఏ ఫండ్ కు బదిలీ చేస్తారు.కాగా పాలసీ రెపో రేటును యథాతథంగా 5.5 శాతంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రేటును యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బ్యాంకు కొలువుల జాతర.. ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 2025-26 కాలానికి 5,583 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సర్వీస్ & సపోర్ట్) ఖాళీలను భర్తీ చేయడానికి పెద్ద ఎత్తున నియామక డ్రైవ్ను ప్రారంభించింది. ఆన్లైన్ దరఖాస్తు విండో ఆగస్టు 6 నుండి ఆగస్టు 26 వరకు తెరిచి ఉంటుంది.ఎస్బీఐ ఇటీవలే 505 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 13,455 జూనియర్ అసోసియేట్లను నియమించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ విస్తృత శాఖలు, కార్యాలయాల నెట్వర్క్లో సేవా సరఫరా, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బ్యాంకు తాజాగా నియామకాలు చేపట్టింది. ఈ నియామక డ్రైవ్, ప్రస్తుతం 2.36 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న ఎస్బీఐ మానవ వనరుల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న కస్టమర్, సాంకేతిక అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉన్న కొత్త ప్రతిభను నియమించడం లక్ష్యంగా పెట్టుకుంది.“కొత్త ప్రతిభను నియమించడం మా మానవ వనరుల సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంలో కీలక అంశం. నిర్మాణాత్మక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, బ్యాంకింగ్ రంగాన్ని పునర్నిర్మించే క్రియాత్మక, సాంకేతిక పురోగతులతో మా ఉద్యోగులను సమలేఖనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ నియామకం వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తూ పేర్కొన్నారు. -
ఎస్బీఐ క్రెడిట్కార్డులకు ఆ ఉచిత సదుపాయం బంద్!
ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు సంబంధించి ముఖ్యమైన వార్త ఇది. ఈ కార్డుదారులకు ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్న ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఆగస్టు 11 నుండి కార్డు జారీ సంస్థ నిలిపివేయబోతోంది. ఈ మార్పు విమాన ప్రయాణంలో భద్రత కోసం ఈ సదుపాయంపై ఆధారపడిన వారిని నేరుగా ప్రభావితం చేస్తుంది.ఇప్పటివరకు ఎస్బీఐ ప్రీమియం, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై రూ.కోటి లేదా రూ.50 లక్షల వరకు కాంప్లిమెంటరీ (ఉచిత) విమాన ప్రమాద బీమా అందుబాటులో ఉండేది. ఆగస్టు 11 తర్వాత ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండదు. ఈ సదుపాయం ముగిసే కార్డులలో ఈ కిందివి ఉన్నాయి..రూ.1 కోటి ఇన్సూరెన్స్ కవర్ ఉన్న కార్డులుఎస్బీఐ కార్డ్ ఎలైట్ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ఎలైట్అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ ఎలైట్కరూర్ వైశ్యా బ్యాంక్ (కెవిబి) ఎస్బీఐ కార్డ్ ఎలైట్కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డురూ.50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న కార్డులుఎస్బీఐ కార్డ్ ప్రైమ్ఎస్బీఐ కార్డ్ పల్స్యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ప్రైమ్పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ పీఎంకేవీబీ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్కేవీబీ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుసౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుకర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుసిటీ యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్యూబీఐ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుఓబీసీ ఎస్బీఐ వీసా ప్లాటినం కార్డుఫెడరల్ బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుమీరు ఎస్బీఐ క్రెడిట్కార్డు యూజర్లు అయితే ఇప్పుడు విమాన ప్రయాణ సమయంలో మీకు ఈ అదనపు రక్షణ లభించదు. అటువంటి పరిస్థితిలో, మీరు తరచుగా ప్రయాణిస్తూ ఉచిత బీమాపై ఆధారపడి ఉంటే, ఇప్పుడు ప్రత్యేక ప్రయాణ లేదా వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవలసి ఉంటుంది. ఈ బెనిఫిట్ మీకు ముఖ్యమైతే కచ్చితంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యక్తిగత ట్రావెల్ లేదా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.చదవండి: ఏటీఎంలో రూ.500 నోట్లు కనుమరుగు! ఆర్బీఐ ఆర్డరు నిజమేనా? -
ఏటీఎంలో రూ.500 నోట్లు కనుమరుగు?
ఏటీఎంలలో రూ.500 నోట్లు కనుమరుగు కానున్నట్లు ఓ సందేశం వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 30లోగా ఏటీఎంల ద్వారా రూ.500 నోట్ల జారీని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులను ఆదేశించిదనేది ఆ సందేశం సారాంశం. అయితే ఆ వాట్సాప్ సందేశం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది.రానున్న సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో రూ.500 నోట్ల జారీని నిలిపివేయాలనేది ఆర్బీఐ లక్ష్యం అంటూ కూడా ఫేక్ మెసేజ్లో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏటీఎంల ద్వారా రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, కాబట్టి ఎవరి దగ్గరైనా రూ.500 నోట్లు ఉంటే వెంటనే మార్చేసుకోవాలని కూడా అందులో సూచించారు.వాట్సాప్లో విస్తృతంగా షేర్ అయిన ఈ తప్పుడు సందేశంపై స్పందించిన ప్రభుత్వ మీడియా విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఆర్బీఐ అలాంటి ఆదేశాలేవీ జారీ చేయలేదని, రూ.500 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైనవేనని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని, వాటిని షేర్ చేసే ముందు అధికారిక వర్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించింది.Has RBI really asked banks to stop disbursing ₹500 notes from ATMs by September 2025? 🤔A message falsely claiming exactly this is spreading on #WhatsApp #PIBFactCheck ✅ No such instruction has been issued by the @RBI✅ ₹500 notes will continue to be legal tender.… pic.twitter.com/9ia2t8Nf0K— PIB Fact Check (@PIBFactCheck) August 3, 2025 -
ఇంత జీఎస్టీ ఎగ్గొట్టారా?
గడిచిన ఐదేళ్లలో (2024-25 ఆర్థిక సంవత్సరం వరకు) సుమారు రూ.7.08 లక్షల కోట్ల పన్ను ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం కూడా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా పార్లమెంటుకు తెలిపింది.లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2.23 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేతను సీజీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు. గత ఐదేళ్లలో గుర్తించిన మొత్తం 91,370 కేసుల్లో జీఎస్టీ ఎగవేత సుమారు రూ.7.08 లక్షల కోట్లుగా ఉంది. ఈ కాలంలో స్వచ్ఛంద డిపాజిట్ ద్వారా వసూలు చేసిన పన్నులు రూ.1.29 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య 44,938 కేసుల్లో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఐటీసీ మోసం జరిగింది. 2022, 2021 ఆర్థిక సంవత్సరాల్లో జీఎస్టీ ఎగవేతలు వరుసగా రూ.73,238 కోట్లు, రూ.49,384 కోట్లుగా ఉన్నాయి. ఇందులో ఐటీసీ మోసాలు వరుసగా రూ.28,022 కోట్లు, రూ.31,233 కోట్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్ల విలువైన జీఎస్టీ ఎగవేతను సీజీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు.2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.32 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను గుర్తించామని, ఇందులో రూ.24,140 కోట్ల నకిలీ ఐటీసీ క్లెయిమ్లు ఉన్నాయని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన 30,056 జీఎస్టీ ఎగవేత కేసులలో సగానికి పైగా లేదా 15,283 కేసులు ఐటీసీ మోసానికి సంబంధించినవి. వీటి ద్వారా రూ .58,772 కోట్ల ఎగవేత జరిగింది. -
టాప్ 10 బెస్ట్ 7 సీటర్ కార్లు.. ధర ఎంతంటే..
-
ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగాలొస్తాయ్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలు రోజురోజుకూ మెరుగవుతున్నకొద్దీ మానవ ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన పెరుగుతోంది. మనుషులు చేయగలిగే పనులన్నీ ఏఐ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను త్వరలోనే ఈ కొత్త ఏఐ టూల్స్ భర్తీ చేసే ప్రమాదం ఎక్కువవుతోంది.టెక్ దిగ్గజాల సీఈవోలూ ఇదే హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ కంపెనీలోని ఉద్యోగులను ఏఐ తగ్గిస్తుందని స్వయంగా అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీనే కొన్ని వారాలుగా చెబుతూ వస్తున్నారు. ప్రతి ఒక్కరి ఉద్యోగాలు ప్రభావితమవుతాయని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఇటీవల హెచ్చరించారు.సమూల మార్పుఅయితే,ఈ క్రమంలో ఉద్యోగుల్లో ఏఐపై ఉన్న భయాల్ని పొగొట్టేలా గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఓ అడుగు ముందుకేసి ప్రస్తుతం ప్రత్యామ్నాయంగానే ఉన్న కృత్రిమ మేధస్సుతో రాబోయే ఐదు నుండి పదేళ్లలో ఉద్యోగ భావనలోనే సమూల మార్పు సంభవించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎప్పుడూ ఊహించని విధంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘వైర్డ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు."ఉద్యోగ ప్రపంచంలో చాలా మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ గతంలో మాదిరిగానే మెరుగైన కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇవి ఈ సాధనాలు లేదా కొత్త సాంకేతికతలను ఉపయోగిస్తాయి" అని హస్సాబిస్ అన్నారు.డాక్టరుకూ ముప్పు?ప్రస్తుతం మానవులు చేసే ప్రతి పనినీ ఏజీఐ లేదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చేయగలిగితే, రానున్న కొత్త ఉద్యోగాలను కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం భర్తీ చేయకుండా ఆపగలమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. దీనికి హస్సాబిస్ బదులిస్తూ ఒక వైద్యుడి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదు కానీ నర్సులను కాదు అన్నారు."సాధారణంగా డాక్టర్ ఏం చేస్తారు.. డాక్టర్ చేసే రోగ నిర్ధారణను ఏఐ టూల్ సాయంతో చేయవచ్చు. లేదా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహా డాక్టర్లు రావచ్చు. కానీ నర్సులు అలా కాదు. ఎందుకంటే నర్సుల ఉద్యోగంలో మానవ సహానుభూతి ఎక్కువగా ఉంటుంది" అని వివరించారు.చదవండి: ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్! -
పోస్టల్ బ్యాంకుల్లో ఇక ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల్లో ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయం ప్రారంభమైంది. సామాన్య ప్రజలకు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకు బ్యాంకింగ్ను మరింత సురక్షితంగా, సమ్మిళితంగా, సౌకర్యవంతంగా చేయడానికి ఈ ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చారు.యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఫ్రేమ్వర్క్ కింద అభివృద్ధి చేసిన ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా ఖాతాదారులు ముఖ గుర్తింపును ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇకపై వేలిముద్రలు లేదా ఓటీపీల వంటి భౌతిక బయోమెట్రిక్ ఇన్పుట్ల అవసరం ఉండదు."ఐపీపీబీలో, బ్యాంకింగ్ అందుబాటులో ఉండటమే కాదు.. హుందాగా ఉండాలని మేము నమ్ముతున్నాం. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా బయోమెట్రిక్ వేలిముద్రలు లేదా ఓటీపీ ధృవీకరణలో పరిమితుల కారణంగా ఏ కస్టమర్ కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. ఇది కేవలం టెక్ ఫీచర్ మాత్రమే కాదు. ఇది ఆర్థిక సమ్మిళితాన్ని పునర్నిర్వచించే దిశగా ఒక అడుగు" అని ఐపీపీబీ ఎండీ, సీఈవో ఆర్ విశ్వేశ్వరన్ పేర్కొన్నారు.ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్ కీలక ప్రయోజనాలుఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ సెన్సార్లపై ఆధారపడకుండా ఆధార్ ఆథెంటికేషన్ సురక్షితంసులువైన కస్టమర్ అనుభవం కోసం వేగవంతమైన, కాంటాక్ట్ లెస్ లావాదేవీలుఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన బ్యాంకింగ్ఖాతా తెరవడం, బ్యాలెన్స్ విచారణ, ఫండ్ ట్రాన్స్ఫర్లు, యుటిలిటీ చెల్లింపులతో సహా అన్ని బ్యాంకింగ్ సేవలకు మద్దతు. -
ఇల్లు కూడా హైటెక్గా ఉండాలిగా..
కరోనా తర్వాత నుంచి హోమ్ ఆటోమేషన్పై నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. ప్రతి ఒక్కరూ ఇల్లు ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు భాగమైపోయింది. రెండు దశాబ్దాలుగా స్మార్ట్ హోమ్స్ సేవలనేవి విలాసవంతమైన వసతుల నుంచి దైనందిన అవసరంగా మారిపోయాయి. భద్రత, ఆదా, సౌకర్యం.. హోమ్ ఆటోమేషన్ లాభాలివే. దీంతో నివసించే నగరమే కాదు ఇళ్లు కూడా హైటెక్గా ఉండాలని యువతరం కోరుకుంటోంది. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా స్మార్ట్ హోమ్స్ను నిర్మిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఇంటిలోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, ఫ్రిజ్, గీజర్, టీవీ వంటి ప్రతి ఎల్రక్టానిక్ ఉపకరణాన్ని సెల్ఫోన్తోనే నిర్వహణ చేసే వీలుండటమే స్మార్ట్ హోమ్స్ ప్రత్యేకత. ఇంటి ముందు గేటు నుంచి మొదలుపెడితే తలుపులు, కిటికీ కర్టెన్లు, లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఏసీ, గీజర్, ఫ్రిడ్జ్, గ్యాస్, హోమ్ థియేటర్, గార్డెన్ ఇలా ప్రతి ఒక్క దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతతో వినియోగించడమే హోమ్ ఆటోమేషన్. అలెక్సా, గూగుల్ హోమ్, సిరి ఈ మూడు వర్చువల్ అసిస్టెంట్ టెక్నాలజీతో మనం ఎంపిక చేసిన సమయం ప్రోగ్రామింగ్ ప్రకారం ఆయా వస్తువులు పని చేస్తుంటాయి.ఎలా పనిచేస్తాయంటే.. విప్రో, ఫిలిప్స్, హావెల్స్, ఎంఐ, క్రిస్టాన్, స్నైడర్, ల్యూట్రాన్, లెగ్గ్రాండ్, పెర్ట్ హోమ్, ఫైబరో వంటి కంపెనీలకు చెందిన వైర్లెస్, వైర్డ్ అనే రెండు రకాల హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వైఫై, బ్లూటూత్, జెడ్ వేవ్, జిగ్బీ నాలుగు రకాల వైర్లెస్ ప్రొటోకాల్స్తో ఆటోమేషన్ ఉత్పత్తులు అనుసంధానమై ఉంటాయి. ఆయా ఉత్పత్తులకు చెందిన మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని, ఇంట్లోని ఎన్ని ఫోన్లకైనా అనుసంధానిచవచ్చు. కస్టమర్లు ఇష్టాన్ని బట్టి కేవలం తన వాయిస్ను మాత్రమే గుర్తించేలా ఉపకరణాలను అనుసంధానివచ్చు. లేదా ఇంట్లోని ప్రతి ఒక్కరి వాయిస్నైనా గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు.లాభాలెన్నో.. హోమ్ ఆటోమేషన్తో విద్యుత్ వృథా ఉండదు. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్మార్ట్ హోమ్స్లో 20–30 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. సమయం, డబ్బు ఆదా అవడంతో పాటు భద్రత మెరుగవుతుంది. ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. 1,500 చ.అ. అపార్ట్మెంట్లో వీడియో డోర్ బెల్, ఒక లైట్, ఫ్యాన్, ఏసీ, గీజర్తో కూడిన బేసిక్ హోమ్ ఆటోమేషన్కు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఎలక్ట్రిషన్, ఇంజనీర్, నెట్వర్క్, సాంకేతిక నిపుణులు నలుగురు వ్యక్తులు 3–4 రోజుల్లో పూర్తిగా హోమ్ ఆటోమేషన్ పూర్తి చేస్తారు. -
టీవీఎస్ మోటార్ విక్రయాలు పెరిగాయ్..
చెన్నై: టీవీఎస్ మోటార్ విక్రయాలు 2025 జూలై నెలలో మొత్తం 29 శాతం పెరిగి 4,56,350 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే జూలైలో డీలర్లకు 3,39,676 వాహనాలు సరఫరా చేసినట్లు పేర్కొంది. దేశీయంగా(భారత్లో) 3,08,720 వాహన అమ్మకాలు నమోదవ్వగా, 2024 జూలైలో విక్రయాలు 2,54,250 యూనిట్లగా ఉన్నాయి.ఇందులో మోటార్సైకిల్ విభాగ విక్రయాల వృద్ధి 25 శాతంగా ఉంది. గతేడాది జూలైలో 1,61,074 యూనిట్లుగా ఉండగా, 2025 జూలైలో 2,01,494 యూనిట్లకు చేరాయి. ఇదే జూలైలో మొత్తం 198,265 స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైలో విక్రయించిన 1,39,995 యూనిట్లతో పోలిస్తే ఇవి 42% అధికంగా ఉన్నాయి.ఎల్రక్టానిక్ వాహన(ఈవీ) విభాగం అమ్మకాల వృద్ధి 10 శాతంగా ఉంది. మొత్తం 21,442 యూనిట్ల నుంచి 23,605 యూనిట్లకు చేరింది. జూలైలో మొత్తం 1,42,629 యూనిట్లు ఎగుమతి కాగా, గతేడాది ఇదే నెలలో 97,589 యూనిట్లు విదేశాలకు తరలించారు. -
ఈ సీఈవో శాలరీ.. ఐటీ కంపెనీల్లోనే టాప్
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్సీఎల్టెక్ సీఈవో సి.విజయకుమార్ రికార్డు స్థాయి వేతనం అందుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన 10.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.94.6 కోట్లు) సంపాదించారు. ఇది భారతీయ ఐటీ రంగంలో ఎగ్జిక్యూటివ్లు పొందుతున్న అత్యధిక వేతనంగా నిలిచింది.విజయకుమార్ వేతనం పెద్ద పోటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఛీప్ల సంపాదనను సైతం అధిగమించింది. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రస్తుత వేతనాన్ని 71 శాతం పెంచి 18.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.154 కోట్లు) పెంచుకోవడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది.ఇదే సమయంలో టీసీఎస్ సీఈఓ కృతివాసన్ వేతనం రూ.26.52 కోట్లు కాగా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం రూ.80.62 కోట్లుగా ఉంది. అలాగే విప్రో సీఈఓ శ్రీనివాస్ పలియా ఆర్జన సుమారు రూ.53.64 కోట్లు, టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి సంపాదన రూ.53.9 కోట్లుగా ఉన్నాయి.2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ అందుకున్న మొత్తం పరిహారంలో మూల వేతనం 1.96 మిలియన్ డాలర్లు కాగా పనితీరు ఆధారిత బోనస్ 1.73 మిలియన్ డాలర్లుగా ఉందని హెచ్సీఎల్టెక్ వార్షిక నివేదిక తెలిపింది.ఆయన సంపాదనలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు 6.96 మిలియన్ డాలర్ల విలువైన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్యూలు) నుంచే వచ్చింది. ఇవికాక బెనిఫిట్స్, పెర్క్విసైట్స్ కింద అదనంగా మరో 0.20 మిలియన్ డాలర్లు లభించాయి.2016లో హెచ్సీఎల్టెక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ అమెరికాలో ఉంటూ తన రెమ్యూనరేషన్ను కంపెనీకి చెందిన అమెరికా అనుబంధ సంస్థ హెచ్సీఎల్ అమెరికా ఇంక్ నుంచి తీసుకుంటున్నారు.👉ఇది చదివారా? కాగ్నిజెంట్లో జీతాల పెంపు.. సీఎఫ్వో కీలక ప్రకటన -
ఏడబ్ల్యూఎస్ కొత్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్
బెంగళూరు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కొత్తగా ఏఐ డ్రివెన్ డెవలప్మెంట్ లైఫ్సైకిల్ (ఏఐ–డీఎల్సీ) మోడల్ను ఆవిష్కరించింది. కైరో, అమెజాన్ క్యూ డెవలపర్లాంటి టూల్స్ను ఉపయోగించి, కృత్రిమ మేథ (ఏఐ)తో సాఫ్ట్వేర్ను రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.దీనితో మానవ పర్యవేక్షణలో కోడింగ్, టెస్టింగ్లాంటి పనులను ఆటోమేట్ చేయడం ద్వారా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే వ్యవధిని నెలల నుంచి రోజుల స్థాయిలోకి కుదించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే మెరుగైన ఏఐ విధానాలను షేర్ చేసుకునేందుకు ఏఐ–నేటివ్ బిల్డర్స్ కమ్యూనిటీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది.అటు ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా అంతర్జాతీయంగా 27 లక్షల మంది విద్యార్థులకు, ఉచితంగా ఏఐ ట్రైనింగ్ యాక్సెస్ అందిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ తెలిపింది. జనరేటివ్ ఏఐని ఉపయోగించి వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించే డెవలపర్లకు 2 మిలియన్ డాలర్ల విలువ చేసే క్రెడిట్స్ను ఇచ్చేలా ఏడబ్ల్యూఎస్ ఏఐ లీగ్ను కూడా ప్రకటించింది. -
పూర్తిగా మహీంద్రా చేతుల్లోకి ఎస్ఎంఎల్ ఇసుజు
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎస్ఎంఎల్ ఇసుజు లిమిటెడ్లో 58.96 శాతం నియంత్రణ వాటాను జపాన్కు చెందిన సుమిటోమో కార్పొరేషన్, ఇసుజు మోటార్స్ నుండి రూ .555 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలో భాగంగా పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి అదనంగా 26 శాతం వాటాను పొందేందుకు ఎం అండ్ ఎం తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ను ప్రారంభించనుంది.కొనుగోలు అనంతరం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి కంపెనీ పేరును 'ఎస్ ఎంఎల్ మహీంద్రా లిమిటెడ్ 'గా మార్చనున్నారు. అలాగే ఎస్ఎంఎల్ బోర్డును పునర్వ్యవస్థీకరించారు. మహీంద్రా గ్రూప్ లో ఏరోస్పేస్ & డిఫెన్స్, ట్రక్కులు, బస్సులు & సీఈ ప్రెసిడెంట్గా ఉన్న వినోద్ సహాయ్ ఎస్ఎంఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా డాక్టర్ వెంకట్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.ఈ వ్యూహాత్మక కొనుగోలుతో 3.5 టన్నులకుపైబడిన వాణిజ్య వాహన విభాగంలో మహీంద్రా సంస్థ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. ఈ విభాగంలో ప్రస్తుతం కంపెనీ 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 1983లో ఏర్పాటైన ఎస్ఎంఎల్ సంస్థ ట్రక్కులు, బస్సుల విభాగంలో దేశవ్యాప్తంగా బలమైన బ్రాండ్గా ప్రసిద్ధి చెందింది. -
యూపీఐలో కొత్త మార్పులు వచ్చేశాయ్..
యూపీఐ చెల్లింపుల్లో కొత్త మార్పులు వచ్చేశాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యాప్లలో డిజిటల్ చెల్లింపు కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడమే లక్ష్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అమలు చేస్తున్న ఈ మార్పులను తీసుకొచ్చింది. ఈ మార్పులు రోజువారీ ఉపయోగంలో పలు యూపీఐ ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. అవేంటో ఈ పథనంలో క్లుప్తంగా తెలుసుకుందాం..ఆటోపే అభ్యర్థనలకు ప్రత్యేక సమయంఇకపై ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు లేదా సిప్ ఇన్వెస్ట్మెంట్స్ వంటి సేవల కోసం యూపీఐ ఆటోపే అభ్యర్థనలు అర్ధరాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 7:00 గంటల మధ్య మాత్రమే చేసే వీలుంటుంది. పగటిపూట యూపీఐ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ ఏర్పాటు చేశారు.బ్యాలెన్స్ చెక్ లిమిట్యూపీఐ యాప్ల ద్వారా తరచూ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఇకపై రోజువారీ పరిమితికి లోబడి ఉంటుంది. పరిమితి బహిరంగంగా పేర్కొనబడనప్పటికీ, చాలా మంది వినియోగదారులు రోజుకు కొన్నిసార్లు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఎటువంటి అంతరాయం కనిపించదు.లావాదేవీ ఫెయిలైతే వెంటనే తెలుస్తుందిపేమెంట్ ఫెయిల్యూర్స్ కు సంబంధించి కీలక అప్ డేట్స్ లో ఇది ఒకటి. ఒక లావాదేవీ విజయవంతమైందా లేదా విఫలమైందా అని యూపీఐ యాప్స్ కొన్ని సెకన్లలోనే ధృవీకరించాలి. ఇది వినియోగదారులు తమ చెల్లింపులను "ప్రాసెసింగ్" గా ఎక్కువ కాలం మార్క్ చేసినప్పుడు తరచుగా ఎదుర్కొనే నిరీక్షణ సమయాలను తగ్గిస్తుంది.బ్యాంకు అకౌంట్ లింక్కు కఠిన తనిఖీలుకొత్త బ్యాంకు ఖాతాలను యూపీఐతో అనుసంధానం చేసే విషయంలో భద్రతా నిబంధనలను కఠినతరం చేశారు. లింకింగ్ ప్రక్రియలో వినియోగదారులు తమ బ్యాంకుల నుండి అదనపు ధృవీకరణను ఎదుర్కోవాల్సి రావచ్చు. అనధికారిక ఖాతా చేర్పులను నిరోధించడానికి దీన్ని అమలు చేస్తున్నారు. -
ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం!
సాక్షి, సిటీబ్యూరో: పండగలు వస్తున్నాయంటే చాలు.. రియల్టీ రంగానికి ఉత్సాహమే. ఎందుకంటే ప్రజలు ఇల్లు, ఫ్లాట్లు తీసుకోవడం శుభసూచకంగా భావిస్తారు. కరోనా తర్వాతి నుంచి ఖరీదైన గృహాలకు మళ్లీ ఆదరణ అధికమవుతోంది. వీటిని తీసుకోవడానికి కొనుగోలుదారులు ముందుకొస్తున్నారు. ఢిల్లీ, గుర్గావ్, నొయిడా, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోనూ కొనేవారి శాతం పెరుగుతోంది. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఉద్యోగావకాశాలు కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. నిర్మాణం పూర్తి కానున్న ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.నగరంలోనూ అదే పోకడ.. గతంలో ఊపు తగ్గిన లగ్జరీ విల్లాలకు ఇటీవల కాలంలో నగరంలో ఆదరణ పెరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్కు చేరువలో ఉండి సదుపాయాల విషయంలో రాజీపడని ప్రాజెక్టుల్లో విల్లాలను తీసుకోవడానికి ప్రవాసభారతీయులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఐటీ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. నార్సింగి, అప్పా జంక్షన్, తెల్లాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని విల్లాలకు గిరాకీ పెరిగింది.స్థానిక రాజకీయాంశాల వల్ల ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమే.. తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయి. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాని అనుసంధానమైన రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్, మెట్రో రైలు విస్తరణతో పాటు కొత్త నియామకాల్ని చేపడుతోన్న ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, మెరుగవుతోన్న వైద్య, విద్య, బయోటెక్ రంగాలు వెరసీ.. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆకట్టుకునే స్థాయికి హైదరాబాద్ చేరుకుంటుంది. -
ఒక్క రూపాయికే వీసా.. రెండు రోజులే ఛాన్స్
విదేశాలకు వెళ్తున్న భారతీయులకు వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ అట్లిస్ (Atlys) బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు 15 దేశాలకు కేవలం ఒక్క రూపాయికే వీసాలు ఇస్తామని తెలిపింది. 'వన్ వే అవుట్' పేరుతో ప్రకటించిన ఈ పరిమిత కాల ఆఫర్ ఆగస్టు 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణాలను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఈ సేల్ నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.వీసా సంబంధిత ఖర్చులు, తిరస్కరణలు పెద్ద ఆర్థిక భారంగా మారిన తరుణంలో అట్లిస్ రూ.1కే వీసా అందించడం విదేశీ ట్రిప్లకు వెళ్లే భారతీయులకు ఇది సువర్ణ అవకాశం. పరిశ్రమ అంచనాల ప్రకారం, భారతీయ ప్రయాణికులు 2024లో మాత్రమే నాన్-రిఫండబుల్ వీసా ఫీజుల రూపంలో రూ .664 కోట్లకు పైగా నష్టపోయారు. అంతర్జాతీయ ప్రయాణాలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలని, వీసా దరఖాస్తులతో ముడిపడి ఉన్న ఆర్థిక ఆందోళనను తొలగించాలనుకుంటున్నామని అట్లిస్ సీఈఓ మోహక్ నహ్తా పేర్కొన్నారు.ఆఫర్ వర్తించే దేశాలుయూఏఈ, యునైటెడ్ కింగ్డమ్, వియత్నాం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, ఈజిప్ట్, హాంగ్ కాంగ్, జార్జియా, ఒమన్, మొరాకో, ఖతార్, కెన్యా, తైవాన్. ఈ-వీసా దేశాలకు రూ.1 ఆఫర్ అట్లిస్ సర్వీస్ ఫీజు ప్రభుత్వ రుసుము రెండింటినీ కవర్ చేస్తుంది. అయితే వీసా కోసం వ్యక్తిగత హాజరు అవసరమైన యునైటెడ్ స్టేట్స్, కొన్ని సెంజెన్ దేశాలకు (ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మొదలైనవి)అట్లిస్ దరఖాస్తు రుసుము మాత్రమే కవర్ అవుతుంది. ఇక దరఖాస్తుదారు ప్రాసెసింగ్ కేంద్రం వద్ద కాన్సులేట్, బయోమెట్రిక్ ఫీజులు వంటి ప్రభుత్వ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్పోర్టులను కలిగి ఉండి, కంపెనీ వెబ్సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకునే భారతీయ నివాసితులు మాత్రమే ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. మీరు ఏజెంట్ లేదా థర్డ్ పార్టీని ఉపయోగిస్తే ఇది వర్తించదు. ఈ ఆఫర్ కింద మీరు ఒక వీసాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఒక్కరికి మాత్రమే రూ.1 వీసా ఆఫర్ వర్తిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుంటే వారికి రెగ్యులర్ వీసా ఛార్జీలు వర్తిస్తాయి.గ్రూప్, బల్క్ లేదా బిజినెస్ బుకింగ్స్కు ఈ ఆఫర్ వర్తించదు. దరఖాస్తు చేసుకోవడానికి, చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్పోర్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. గమ్యస్థాన దేశ నిబంధనలను బట్టి ఫైనాన్షియల్ ప్రూఫ్ లేదా ట్రావెల్ బుకింగ్స్ వంటి ఇతర అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాలి.రాయబార కార్యాలయం డాక్యుమెంట్ నిబంధనలను నిర్ణయిస్తుంది కాబట్టి, మీ పత్రాలు తప్పుగా లేదా అసంపూర్ణంగా ఉంటే మీ వీసా తిరస్కరించే అవకాశం ఉంటుంది. స్లాట్లను రాయబార కార్యాలయాలు నియంత్రిస్తున్నందున వీసా నియామకాలకు గ్యారంటీ ఉండదు.ఆఫర్ పొందండిలా.. రూ .1 వీసా ఆఫర్ పొందడానికి, అట్లిస్ వెబ్సైట్ (www.atlys.com)లో దరఖాస్తును ఆగస్టు 4 (ఉదయం 6 గంటలకు) నుండి ఆగస్టు 5 (రాత్రి 11:59 గంటలకు) మధ్య పూర్తి చేసి సమర్పించాలి. ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆఫర్ ఉంటుంది. ఎవరు ముందుగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ వెబ్ సైట్ లో సెల్ఫీ వెరిఫికేషన్ తప్పనిసరి. -
ఇంటి డాక్యుమెంట్లు బ్యాంక్ పోగొడితే?
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంక్ రుణంతో ఇల్లు కొనడం తెలిసిందే.. ఇంటి దస్తావేజులు తనఖాగా పెట్టి రుణం తీసుకోవడం కామనే! ప్రతినెలా క్రమం తప్పకుండా ఈఎంఐ కట్టేసి.. చివరకు బ్యాంక్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాక.. తనఖా పెట్టిన ఇంటి దస్తావేజులు ఎక్కడో పోయాయని బ్యాంక్ చెబితే? బ్యాంక్ అధికారులతో గొడవ పెట్టుకుంటాం. లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫైడ్ సేల్ డీడ్ కాపీ కోసం దరఖాస్తు చేస్తాం.. అంతేకదా!?మహారాష్ట్రకు చెందిన ప్రదీప్ శెట్టి అలా చేయలేదు. 2004లో ప్రదీప్ మహారాష్ట్ర పరెల్లోని స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్లో రూ.9 లక్షల గృహ రుణం తీసుకున్నాడు. అన్ని ఈఎంఐలు కట్టేశాక, బ్యాంక్ నుంచి నో– డ్యూస్ సర్టిఫికెట్ కూడా పొందాడు. ఆ తర్వాత బ్యాంక్ అందించాల్సిన సేల్డీడ్ కాపీలను ఇవ్వకుండా అవెక్కడో మిసయ్యాయని వివరించింది. దీంతో ప్రదీప్ ‘తనఖా పెట్టిన దస్తావేజులను బ్యాంక్ ఎక్కడో పోగొట్టింది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సేల్డీడ్ కాపీలు లేకపోవడంతో ఇంటిని విక్రయించలేకపోతున్నానని, పైగా ఈ ఘటనతో మానసిక వేదనకు గురయ్యాయని, విలువైన సమయం వృథా చేసినందుకు బ్యాంక్ పరిహారాన్ని చెల్లించాల్సిందేనని’ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్కు ఫిర్యాదు చేశాడు.పరిహారం సరిపోలేదు.. ప్రదీప్కు రూ.60 వేలు నష్ట పరిహారాన్ని బ్యాంకు చెల్లించాలని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పునిచ్చింది. ఇందులో రూ.50 వేలు దస్తావేజులు పోగోట్టినందుకు, రూ.5 వేలు మానసిక వేదనకు గురి చేసినందుకు, మరో రూ.5 వేలు ఫిర్యాదు దాఖలు ఖర్చులకు అని వివరించింది. అయితే ఈ పరిహారంతో సంతృప్తి చెందని ప్రదీప్ షెట్టి.. మహారాష్ట్ర స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో స్టేట్ ఫోరం.. పరిహార మొత్తాన్ని రూ.60 వేల నుంచి రూ.1.15 లక్షలకు పెంచింది. 3 నెలల్లోపు కస్టమర్కు సర్టిఫైడ్ సేల్డీడ్ కాపీని అందించాలని, లేనిపక్షంలో ప్రతి నెలా రూ.50 వేల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.ఎవరైనా సరే ఇలా చేయండి కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఇచ్చిన తీర్పు కేవలం ప్రదీప్ శెట్టికే కాదు.. మనలో ఎవరి ప్రాపర్టీ దస్తావేజులైనా సరే బ్యాంక్లు పోగోడితే.. కస్టమర్ పరిహారంతో పాటూ తిరిగి సర్టిఫైడ్ సేల్డీడ్ కాపీని కూడా అందించాల్సిన బాధ్యత బ్యాంక్లదే! ఇందుకోసం స్థానిక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ను సంప్రదిస్తే చాలు! ఒకవేళ ఇంట్లో దాచిపెట్టుకున్న ప్రాపర్టీ దస్తావేజులు దొంగలు పడో లేక ఇతర కారణాలతో మిస్ అయితే? దస్తావేజులు పోయాయని కంగారు పడకండి. మళ్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి సర్టిఫైడ్ దస్తావేజులను పొందొచ్చు. కాకపోతే కొంత శ్రమించాల్సి ఉంటుంది. సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలని కోరుతూ.. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో సేల్ డీడ్ పోయిందని ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత దస్తావేజులు పోయినట్టుగా స్థానిక వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఎవరికైనా దొరికితే సమాచారం అందించాలని కోరుతూ నోటీసు ఇవ్వాలి. గతంలో ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించారో మళ్లీ అదే కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ సేల్డీడ్ దస్తావేజులు పోయినట్లు సంబంధిత అధికారికి వివరించి సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలని కోరుతూ స్వీయ దస్తూరితో లెటర్ రాసివ్వాలి.ఫామ్–22లో పేరు, చిరునామా వంటి వివరాలన్నీ నమోదు చేసి.. ప్రాపర్టీ జిరాక్స్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ప్రాపర్టీ పేరు మీద ఉన్న ఆధార్, పాన్, రేషన్ కార్డ్, కరెంట్ బిల్లు వంటివి జత చేయాలి. వీటన్నింటికీ పోలీసు ఫిర్యాదు కాపీ, పత్రిక ప్రకటన జత చేసి సబ్ రిజిస్ట్రార్కు అందించాలి. నిర్ణయించబడిన ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. -
ఒక్క నెలలో 98 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ గత జూన్ నెలలో భారత్లో భారీ సంఖ్యలో అకౌంట్లను బ్యాన్ చేసింది. దుర్వినియోగం, హానికరమైన కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నాలలో భాగంగా జూన్ నెలలో భారత్లో 98 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వీటిలో 19.79 లక్షల ఖాతాలను యూజర్ల ఫిర్యాదులు రాకముందే బ్యాన్ చేసింది.వాట్సాప్లో అనుమానాస్పద, హానికరమైన ఖాతాలపై యూజర్ల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతుంటాయి. అందులో భాగంగా వాట్సాప్ కు భారత్ లోని యూజర్ల నుంచి 23,596 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి 1,001 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని ఖాతాలను నిషేధించడం, తప్పుగా నిషేధించిన మరికొన్నింటిని పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. వీటిలో 16,069 ఫిర్యాదులు నిషేధ అప్పీళ్లకు సంబంధించినవే కావడం గమనార్హం. ఫలితంగా 756 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇతర ఫిర్యాదులు ఖాతా మద్దతు, ఉత్పత్తి సంబంధిత సమస్యలు, భద్రతా సమస్యల గురించి ఉన్నాయి.ఖాతా క్రియేట్ చేసినప్పుడు, మెసేజ్లు పంపుతున్నప్పుడు, యూజర్ రిపోర్టులు లేదా బ్లాక్స్ వంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మూడు దశల్లో దుర్వినియోగాన్ని గుర్తిస్తామని వాట్సాప్ వివరించింది. నివారణ తమ ప్రాథమిక దృష్టి అని కంపెనీ తెలిపింది. ఎందుకంటే హానికరమైన చర్యను తరువాత గుర్తించడం కంటే అది జరగడానికి ముందు ఆపడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దుర్వినియోగం, తప్పుడు సమాచారం, భద్రతా ముప్పులతో పోరాడటానికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, భద్రతా సాధనాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. -
ఇంటికొచ్చి వంట చేస్తాడు.. రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు
ఈరోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కన్నా చిరు వృత్తులు చేసేవారే అధికంగా సంపాదిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై ముంబైకి చెందిన ఆయుషి దోషి అనే న్యాయవాది సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఆదాయ అసమానతలు , నైపుణ్యం కలిగిన కార్మికుల నిర్వచనం గురించి విస్తృతమైన చర్చకు దారితీసింది.స్థానికంగా 'మహారాజ్' అని పిలిచే ఆమె ఇంట్లో పనిచేసే వంటమనిషి కార్పొరేట్ ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఒక్కో ఇంట్లో ఆయన కేవలం 30 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాడు. ఇందుకు ఒక్కో ఇంటికి రూ.18,000 సంపాదిస్తున్నారు. ఆయన ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని 10-12 ఇళ్లలో పనిచేస్తున్నాడు. అంటే అతని నెలవారీ సంపాదన రూ .1.8 లక్షల నుంచి రూ.2.16 లక్షల మధ్య ఉంటుంది. ఇది చాలా మంది వైట్-కాలర్ నిపుణుల జీతాల కంటే ఎక్కువ.విజయానికి ఒక రెసిపీ! దోషి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) పోస్ట్లో వంటమనిషి సమర్థవంతమైన పని నమూనాను హైలైట్ చేశారు. ‘ఒక్కో ఇంటికి రూ.18,000 తీసుకుంటాడు. రోజూ 10-12 ఫ్లాట్లలో పనిచేస్తాడు. ఒక్కో ఇంటికీ 30 నిమిషాలే కేటాయిస్తాడు. భోజనం, టీలు ఉచితం. సమయానికి పేమెంట్’ అంటూ ఆమె పోస్ట్లో రాసుకొచ్చారు.అయితే అందరు వంటవాళ్లూ ఇలాగే సంపాదిస్తున్నారని కాదు.. అద్భుతమైన నైపుణ్యం, దశాబ్దానికి పైగా నిర్మించుకున్న పేరు ఆయనకు ఎక్కువ సంపాదనను తెచ్చిపెడుతోంది. మరోవైపు చాలా మంది వంటవాళ్ల సంపాదన రూ.10,000 నుంచి రూ.12,000 మించడం లేదని, వేగం, పరిశుభ్రత, స్థిరత్వానికి పేరుగాంచిన వారు గణనీయంగా ఎక్కువ సంపాదించవచ్చని దోషి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ పోస్టుపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. -
సీఈవో రాజీనామా.. కుప్పకూలిన షేర్లు
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో 17 శాతం పడిపోయాయి. బీఎస్ఈలో రూ.819.25 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకాయి. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గిరిష్ కౌస్గీ ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో ఈ పతనం చోటుచేసుకుంది. ఈ నాయకత్వ మార్పు కంపెనీ వ్యూహాత్మక దిశ, స్థిరత్వంపై పెట్టుబడిదారులలో ఆందోళనను కలిగించింది.నాయకత్వ శూన్యం2022 అక్టోబర్లో నాలుగేళ్ల పదవీకాలానికి బాధ్యతలు చేపట్టిన గిరీష్ కౌస్గీ 2025 అక్టోబర్ 28న అధికారికంగా పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ తన పదవీకాలం ముగిసేలోపు రాజీనామా చేయడం వల్ల వారసత్వ ప్రణాళిక, నాయకత్వ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది.అయితే కంపెనీ మాత్రం తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, వ్యాపార దృష్టి, వృద్ధి మార్గం యథాతథంగా కొనసాగుతాయని హామీ ఇస్తోంది. కొత్త సీఈవో కోసం బోర్డు అనుభవజ్ఞుడైన వ్యక్తిని అన్వేషించడం ప్రారంభించింది.గత పనితీరు అమోఘంకౌస్గీ నాయకత్వంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 200 శాతం వృద్ధి చెందింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే శుక్రవారం కంపెనీ షేర్లలో అమ్మకాలు 50-రోజుల సగటు కంటే 1,176 శాతం అధికంగా నమోదయ్యాయి. కొనుగోలు ఆర్డర్ల కంటే అమ్మకాలు 4:1 నిష్పత్తిలో ఉన్నాయి.బలమైన క్యూ1 ఫలితాలుపీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి జూలై 21న బలమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. రూ.534 కోట్ల నికర లాభం సాధించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 23 శాతం వృద్ధి. మొత్తం ఆదాయం రూ.2,082 కోట్లుగా నివేదించింది. ఇందులో వడ్డీ ఆదాయం రూ.1,980 కోట్లు కాగా నికర వడ్డీ ఆదాయం రూ.760 కోట్లు.ఇన్వెస్టర్లు ఏమి చేయాలి?కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ, సీఈవో రాజీనామా, టెక్నికల్ బ్రేక్డౌన్ కారణంగా తాత్కాలిక అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వేచి చూడాలనే దృక్పథాన్ని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త సీఈవో ఎవరు అవుతారు, మార్కెట్ భావన ఎలా మారుతుంది అన్నది స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు. -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
రక్షాబంధన్కు ముందు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఊరట కలిగించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా రూ .33.50 తగ్గించాయి. కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.కొత్త ధరల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ .1,631.50 కు లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ.1,665గా ఉండేది. వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపుతో క్యాటరింగ్ యూనిట్లు, హోటళ్లు-రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యాపారులకు ఉపశమనం కలుగుతుంది.దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ కొత్త రేట్లుఢిల్లీ: రూ.1,631.50కోల్కతా: రూ.1734.50ముంబై: రూ.1582.50చెన్నై: రూ.1789హైదరాబాద్: రూ.1,886.50డొమెస్టిక్ సిలిండర్ ధరలుడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.3 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025 నుండి స్థిరంగా ఉంది. ఇందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. గత నాలుగు నెలలుగా ధరలు పెంచలేదు, తగ్గించలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.853గా ఉంది. -
రూ.10 వేలకే వచ్చే లేటెస్ట్ బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు
ప్రతి నెలా ఏవో కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. అయితే వినియోగదారుడి అవసరాలకు సరిపోయే, బడ్జెట్కు తగిన స్మార్ట్ఫోన్లు కొన్నే ఉంటాయి. వాటిని ఎంచుకోవడం కష్టమైన పనిగా మారింది. ఈ నేపథ్యంలో సామాన్య వినియోగదారులకు బడ్జెట్లో అంటే రూ.10 వేల లోపు ధరలో జూలైలో వచ్చిన కొన్ని బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.శాంసంగ్ ఎం06 5జీ🔹శాంసంగ్ ఎం06 5జీ స్మార్ట్ఫోన్లో 6.7 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆర్మ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. 4/6 జీబీ LPDDR4X ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.🔹సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.ఇన్ఫినిక్స్ హాట్ 60🔹ఇన్ఫినిక్స్ హాట్ 60లో 6.7 అంగుళాల హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది 7.8 మిమీ మందంతో ఉంటుంది. వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం ఐపీ 64 రేటింగ్ పొందింది. అంటే ఇది స్ప్లాష్లు, తేలికపాటి నీటి చుక్కలు పడినా ఏమీకాదు.🔹హాట్ 60 5జీ + మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ సింగిల్ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు అదనపు స్టోరేజ్ను పెంచుకోవచ్చు.🔹హాట్ 60 5జీ ప్లస్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, ఎల్ఈడీ ఫ్లాష్ సపోర్ట్తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కొత్త ఎక్స్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.లావా స్టార్మ్ ప్లే🔹లావా స్టార్మ్ ప్లే ఫోన్లో 6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 6 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఎక్స్పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.🔹50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 752 ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.ఐక్యూ జెడ్10 లైట్ 5జీ🔹ఐక్యూ జెడ్10 లైట్ 6.74 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ఎల్ పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ ఎక్స్ టర్నల్ స్టోరేజ్ పొందవచ్చు.🔹ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.🔹ఆప్టిక్స్ విషయానికి వస్తే, జెడ్ 10 లైట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. -
UPI వాడేవారికి బిగ్ షాక్.. నేటి నుంచే కొత్త రూల్స్
-
ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ..
ఓటీటీ వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్లాన్లలో చాలా వరకు ఖరీదైనవి లేదా ఒకటీ రెండు ఓటీటీ సర్వీసులకు మాత్రమే యాక్సెస్ కల్పిస్తాయి. కానీ ఎయిర్టెల్ ఓటీటీ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది ఒకటీ రెండు కాదు నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ సహా రెండు డజన్లకు పైగా ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ పోర్ట్ఫోలియోలో ఎంపిక చేసిన ఆల్-ఇన్-వన్ ఓటీటీ ప్లాన్లను చేర్చింది. అంటే ఒక్క రీఛార్జ్ లో ఒకటీ రెండు కాదు అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ల జాబితాలో రూ .279 రీఛార్జ్ టారిఫ్ ఉంది. పూర్తి నెల వాలిడిటీతో వస్తుంది. దీనితో రీఛార్జ్ చేస్తే నెల రోజుల పాటు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది.రూ.279తో ఆల్ ఇన్ వన్ ఓటీటీ ప్లాన్ఎయిర్టెల్ యూజర్లకు అందిస్తున్న ఈ ప్లాన్ డేటా బూస్టర్ లేదా డేటా ఓన్లీ ప్లాన్. కాబట్టి ఇందులో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. అయితే ఒక నెల వ్యాలిడిటీతో 1 జీబీ అదనపు డేటా లభిస్తుంది. వినియోగదారులు ఏదైనా యాక్టివ్ ప్లాన్తో దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ అందిస్తున్న ఓటీటీ సేవల జాబితాలో నెట్ఫ్లిక్స్ బేసిక్, జియో హాట్స్టార్ సూపర్, జీ5 ప్రీమియం వంటి పెద్ద సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో వినియోగదారులు 25 కంటే ఎక్కువ ఓటీటీ సేవల కంటెంట్ను చూడవచ్చు. ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియంలో సోనీలివ్, లయన్స్గేట్ ప్లే, ఆహా, చౌపాల్, హోయిచోయ్ వంటి ప్లాట్ఫామ్లను చేర్చారు. -
ఓఎన్డీసీ, జెమ్ పోర్టల్లో పోస్టల్ సర్వీసులు
ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్ పోర్టల్తో అనుసంధానంపై ఇండియా పోస్ట్ కసరత్తు చేస్తంది. దీనితో పోస్టల్ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రాగలవని, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కంపెనీలతో పోస్టల్ విభాగం పోటీపడేందుకు వీలవుతుంది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో సమావేశమైన సందర్భంగా పోస్టల్ శాఖ అధికారులు ఈ విషయాలను వివరించారు.ఇండియా పోస్ట్ ఐటీ 2.0 ఫ్రేమ్ వర్క్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. రియల్ టైమ్లో ట్రాక్ చేసేందుకు, డిజిటల్ చెల్లింపులు మొదలైన వాటికి ఉపయోగపడేలా ప్లాట్ఫాంను కొత్తగా అప్గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు. 86వేలకు పైగా పోస్టాఫీసులు కొత్త అప్లికేషన్ ను ఉపయోగిస్తున్నాయని, ఆగస్టు 4 నాటికి, సుమారు 1.65 లక్షల పోస్టాఫీసుల నెట్ వర్క్ మొత్తం కొత్త ప్లాట్ ఫామ్ కు మారుతుందని అధికారులు మంత్రికి తెలియజేశారు. -
రేంజ్ రోవర్, డిఫెండర్లకు హైదరాబాద్లో ప్రత్యేక షోరూం
హైదరాబాద్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జేఎల్ఆర్ ఇండియా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా లగ్జరీ బొటిక్ ఆటోమోటివ్ షోరూమ్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రసిద్ధి చెందిన రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్లకు ప్రత్యేకమైన షోరూంను హైదరాబాద్లో ప్రారంభించిన జేఎల్ఆర్ ఇండియా సురేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రైడ్ మోటార్స్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూం వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో లేటెస్ట్ వెహికల్ మోడల్స్, క్యూరేటెడ్ ఆప్షన్స్, లైఫ్ స్టైల్, బ్రాండెడ్ ఐటమ్స్ కోసం ఒక విభాగం ఉన్నాయి. కన్సల్టేటివ్, ఇమ్మర్సివ్ సేల్స్ విధానంతో క్లయింట్ లకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంటారు."దేశంలోని అత్యంత డిజైన్-ఫార్వర్డ్, ఆకాంక్షాత్మక నగరాలలో ఒకటైన దానిలో మా రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్ల గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నాము. ఈ షోరూం ఆధునిక, క్యూరేటెడ్ లగ్జరీ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా హౌస్ ఆఫ్ బ్రాండ్స్, కస్టమర్-ఫస్ట్ ప్రయాణంలో తదుపరి దశను సూచిస్తుంది" అని జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా పేర్కొన్నారు. -
కాగ్నిజెంట్లో జీతాల పెంపు.. సీఎఫ్వో కీలక ప్రకటన
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్లో ఉద్యోగుల జీతాల పెంపుపై కీలక ప్రకటన చేశారు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) జతిన్ దలాల్. 2025 ద్వితీయార్థంలో చాలా మంది ఉద్యోగులకు వేతన పెంపును అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని, అయితే స్థూల ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో వేతన పెంపు తేదీని ఇంకా నిర్ణయించలేదని జతిన్ దలాల్ జూలై 31న కంపెనీ క్యూ 2 ఎర్నింగ్ కాల్ సందర్భంగా చెప్పారు.న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ సాధారణంగా ఆగస్టు 1 నుంచి వార్షిక వేతన పెంపును ప్రారంభిస్తుంది. అయితే ఈ ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్సీఎల్టెక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటి సంస్థలతో కలిసి కాగ్నిజెంట్ వేతన ఇంక్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వేతన పెంపును అమలు చేసిన ఏకైక ప్రధాన టైర్-1 ఐటీ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది.స్థూల ఆర్థిక వాతావరణం, దాని చుట్టూ ఉన్న అనిశ్చితి దృష్ట్యా వేతనాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని దలాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమలు చేసే వేతన పెంపులో మెజారిటీ ఉద్యోగులను కవర్ చేయాలనేది తమ ప్రయత్నమని చెప్పారు. అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ, కాగ్నిజెంట్ స్థిరమైన హెడ్ కౌంట్ వృద్ధిని నివేదిస్తూనే ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ వరుసగా 7,500 మంది ఉద్యోగులను చేర్చుకుంది, మొత్తం ఉద్యోగుల సంఖ్య 343,800 కు చేరుకుంది. అట్రిషన్ గత త్రైమాసికంతో పోలిస్తే 60 బేసిస్ పాయింట్లు తగ్గి పన్నెండు నెలల ప్రాతిపదికన 15.2 శాతానికి తగ్గింది. -
పేటీఎంలో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు
రాఖీ, జన్మాష్టమి తదితర పండుగల సందర్భంగా ట్రావెల్ మెగా ఫెస్టివల్ సేల్ కింద ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నట్లు పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా విమాన సర్వీసుల్లో 12%, అంతర్జాతీయ రూట్లలో 10%, బస్ బుకింగ్స్పై 20 % డిస్కౌంటు పొందవచ్చు.అలాగే యూపీఐ ద్వారా రైలు బుకింగ్స్కి పేమెంట్ గేట్వే చార్జీలు ఉండవు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ కార్డుదారులు ప్రత్యేక రాయితీలు పొందవచ్చు. పేటీఎం ద్వారా బుక్ చేసుకున్న రైలు టికెట్లను రద్దు చేసుకుంటే 100% తక్షణ రీఫండ్తో, ఉచిత క్యాన్సిలేషన్ అవకాశాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది. జూలై 31 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. -
ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో భాగంగా చాట్ జీపీటీ ప్రవేశపెట్టినప్పటి నుంచి విశ్లేషకులు, నిపుణులు, సీఈఓలు వైట్ కాలర్ రోల్స్ లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏఐ ప్రభావం కలిగించే లేదా పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉన్న 40 రకాల ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ మద్దతుతో నిర్వహించిన ఒక తాజా అధ్యయనం జాబితా చేసింది.ఉపాధ్యాయులు, పాత్రికేయులు, కాల్ సెంటర్ ఏజెంట్లు వంటి వృత్తులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఓపెన్ఏఐ, లింక్డ్ఇన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధన ప్రపంచ శ్రామిక శక్తిలోని వివిధ రంగాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత ప్రభావాన్ని ఎత్తిచూపింది.చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను వేగంగా స్వీకరించడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఈ ఏడాది ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే దాదాపు 15,000 తొలగింపులను ప్రకటించింది.ఏఐతో దెబ్బతినే ఉద్యోగాలుటెలిమార్కెటర్లు, ఉపాధ్యాయులు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, సైకాలజిస్టులు, న్యాయమూర్తులు, సామాజిక శాస్త్రవేత్తలు, న్యూస్ అనలిస్టులు, పాత్రికేయులు, టెక్నికల్ రైటర్లు, ప్రూఫ్ రీడర్లు, అనువాదకులు, సామాజిక కార్యకర్తలు, బీమా అండర్ రైటర్లు, ఆంత్రోపాలజిస్టులు, క్లినికల్ డేటా మేనేజర్లు, సర్వే పరిశోధకులు, చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్బిట్రేటర్లు, ఎపిడెమియాలజిస్టులు, హెచ్ఆర్ స్పెషలిస్టులు, మధ్యవర్తులు, కెరీర్ కౌన్సిలర్లు, క్యూరేటర్లు, కరస్పాండెంట్లు, కాపీ రైటర్లు, ఎడిటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, లీగల్ సెక్రటరీలు, ట్రైనింగ్ స్పెషలిస్టులు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు.పెద్దగా ముప్పు లేని ఉద్యోగాలుక్లీనర్లు, డిష్ వాషర్లు, కార్మికులు, కార్పెంటర్లు, పెయింటర్లు, రూఫర్లు, మెకానిక్లు, వెల్డర్లు, బచర్స్, బేకర్లు, డెలివరీ వర్కర్లు, వంటవారు, కాపలాదారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, మేస్త్రీలు, టైలర్లు. -
మోటరోలా కొత్త ఫోన్.. రూ.18వేల లోపే పవర్ఫుల్ మొబైల్
స్మార్ట్ఫోన్ బ్రాండ్ మోటరోలా తాజాగా మోటో జీ86 పవర్ ఫోన్ను ఆవిష్కరించింది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వెర్షన్ ధర రూ. 17,699గా ఉంటుంది. అదనంగా రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంటు పోగా రూ. 16,999కే లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఇందులో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ సూపర్ హెచ్డీ ఫ్లాట్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 7ఐ, 50 ఎంపీ ఓఐఎస్ సోనీ కెమెరా, రెండు రోజుల వరకు సరిపోయే 6720 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో అన్ని లెన్స్లతో 4కే వీడియో రికార్డింగ్ చేసే వీలుంటుంది.మోటరోలా జీ86 పవర్ స్పెసిఫికేషన్లు🔹మోటరోలా జీ86 పవర్ లో 6.67 అంగుళాల 1.5కే పీఓఎల్ఈడీ సూపర్ హెచ్డీ ఫ్లాట్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉన్నాయి.🔹మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ డివైజ్ 1 సంవత్సరం ఓఎస్ అప్ గ్రేడ్ లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తుంది.🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో ఫ్లిక్కర్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఏఐ ఫోటో ఎన్హాన్స్మెంట్, ఏఐ సూపర్ జూమ్, ఏఐ ఆటో స్మైల్ క్యాప్చర్, టిల్ట్ షిఫ్ట్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో మోటో ఏఐ లభిస్తుంది.🔹ఇందులోని 6,720 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 53 గంటల రన్ టైమ్ తో 2 రోజులకు పైగా పవర్ ను అందిస్తుంది. ఇందులో 33వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జర్ ను అందించారు. -
ఫ్రీగా ఇచ్చే క్రెడిట్ కార్డులు.. పైకి కనిపించని ఛార్జీలు
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి. వీటితో పలు ఇతర సంస్థలూ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డులకు సాధారణంగా వార్షిక రుసుము ఉంటుంది. ఇది కార్డు రకాన్ని, జారీ చేసే బ్యాంకు, సంస్థను బట్టి ఉంటుంది. కానీ ఎలాంటి రుసుము లేకుండా జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డులూ కొన్ని సంస్థలు లేదా బ్యాంకులు ఇస్తున్నాయి. ఉచితమే కదా చాలామంది వీటిని తీసుకుంటున్నారు. అయితే ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ కంటికి కనిపించని కొన్ని ఛార్జీలు వీటికి ఉంటాయి. 'లైఫ్ టైమ్ ఫ్రీ' అయిన క్రెడిట్ కార్డుల విషయంలో దాగిఉన్న ఖర్చులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..అధిక వడ్డీ రేట్లువార్షిక రుసుములు లేనప్పటికీ, ఈ కార్డులు అధిక వడ్డీ రేట్లను కలిగి ఉండవచ్చు. తద్వారా మీ కార్డు వాడకం మరింత ఖరీదైనదిగా మారుతుంది. 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి.విదేశీ లావాదేవీ మార్పిడి రుసుమువార్షిక రుసుము లేనప్పటికీ, ఈ కార్డులకు ఫారెక్స్ మార్క్-అప్ ఫీజు (2 నుండి 4 శాతం మధ్య) ఉండవచ్చు. ఇది యూఎస్ డాలర్ లేదా బ్రిటిష్ పౌండ్లు వంటి విదేశీ కరెన్సీలో ఏదైనా ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం చెల్లింపు సమయంలో వసూలు చేస్తారు. . 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు పొందే సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఓవర్ లిమిట్ ఫీజుమీరు నగదు ఉపసంహరణను ఎంచుకున్నప్పుడు లేదా క్రెడిట్ లిమిట్ దాటి కార్డును ఉపయోగించినప్పుడు, బ్యాంకు దానిపై ఓవర్ లిమిట్ ఫీజును విధించవచ్చు. ఇది గుర్తుంచుకోవలసిన మరొక అంశం.ఆలస్య చెల్లింపు పెనాల్టీలుకార్డు జీవితకాలం ఉచితం అయినప్పటికీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించనప్పుడు ఆలస్య చెల్లింపు పెనాల్టీలు ఉండవచ్చు. ఇది ఇతర కార్డుల కంటే ఎంత ఎక్కువగా ఉందో చూసుకోవాలి.ఇనాక్టివిటీ ఫీజులుకొంత మంది కార్డును తరచుగా ఉపయోగించరు. దీనికిగానూ కొన్ని కార్డు ప్రొవైడర్ సంస్థలు రుసుము విధించవచ్చు. మునుపటి సంవత్సరంలో మొత్తం ఖర్చు ఒక పరిమితిని దాటినప్పుడు మాత్రమే బ్యాంకులు కొన్ని కార్డులకు వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి.ప్రాసెసింగ్ ఫీజుఇది బ్యాంకులు విధించే సాధారణ రుసుము కానప్పటికీ, ప్రాసెసింగ్ లేదా నిర్వహణ ఖర్చుల కోసమంటూ దీన్ని బ్యాంకులు చేస్తాయి. ఇది మీ కార్డుకు సాధారణంగానే ఉందా లేదా మరీ ఎక్కువగా ఉందా అన్న అన్న విషయాన్ని గమనించాలి. -
ఆగస్టులో బ్యాంకులు.. వరుస సెలవులు
పలు పండుగలు, జాతీయ సెలవులు రావడంతో ఈ ఆగస్టు నెలలో దేశం అంతటా బ్యాంకులు 15 రోజుల వరకు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. బ్యాంక్ సెలవుల జాబితా, వాటి ప్రాంతీయ ప్రాముఖ్యత, సెలవుల నేపథ్యంలో వినియోగదారులు తమ లావాదేవీలను ముందుగానే ఎలా ప్లాన్ చేయవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.ఆగస్టులో బ్యాంకు సెలవుల పూర్తి జాబితారిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవుదినం, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంకుల ఖాతాల మూసివేత అనే మూడు కేటగిరీల కింద బ్యాంకులు సెలవు దినాలను పాటిస్తాయి. 2025 ఆగస్టులో గుర్తించదగిన మూసివేతలు ఇలా ఉంటాయి.ఆగష్టు 1 బ్యాంకు సెలవు (రాష్ట్రాలను బట్టి మారుతుంది)ఆగస్టు 3 - ఆదివారంఆగస్టు 8 - రక్షా బంధన్ (రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ)ఆగస్టు 9 - రెండో శనివారంఆగస్టు 10 - ఆదివారంఆగస్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం / పార్శీ నూతన సంవత్సరం (ముంబై, నాగపూర్)ఆగస్టు 16 - కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో జోనల్ సెలవుఆగస్టు 17 - ఆదివారంఆగష్టు 23- నాలుగో శనివారంఆగస్టు 24 - ఆదివారంఆగష్టు 25 జన్మాష్టమి (అనేక రాష్ట్రాలు)ఆగస్టు 31 - ఆదివారంతీజ్, హర్తాలికా, ఓనం వంటి స్థానిక పండుగల ఆధారంగా ఇతర ప్రాంతీయ సెలవులు వ్యక్తిగత రాష్ట్రాల్లో వర్తించవచ్చు.ఆన్లైన్ సేవలుబ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
ఇన్ఫోసిస్ చల్లని కబురు: తొలగించడం కాదు.. చేర్చుకుంటాం
టీసీఎస్ లేఆఫ్ల ప్రకటన తర్వాత దేశ ఐటీ పరిశ్రమలో కల్లోల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఐటీ ఉద్యోగార్థులకు దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది 20,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ధృవీకరించారు.మొదటి త్రైమాసికంలో 17,000 మందిని (స్థూల నియామకాలు) నియమించుకున్నామని, ఈ ఏడాది ఇంకా 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రీస్కిల్లింగ్లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ కాస్త ముందంజలో ఉందన్న పరేఖ్.. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 2,75,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.పోటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీఈవో నియామకాలను ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మరే ఇతర భారతీయ ఐటీ కంపెనీ కూడా ఈ స్థాయిలో లేఆఫ్లను ప్రకటించలేదు.ఏఐ ప్రభావంపై..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి పరేఖ్ మాట్లాడుతూ, "కృత్రిమ మేధ లోతైన ఆటోమేషన్, అవగాహనను అందిస్తుంది. అదే సమయంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలు, ప్రతిభ అవసరం" అని అన్నారు. ఉద్యోగులు,సాంకేతికత రెండింటి పట్ల దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఇన్ఫోసిస్ తన శ్రామిక శక్తిని విస్తరిస్తుందని పేర్కొన్నారు.వేతనాల పెంపుపై..గత ఆర్థిక సంవత్సరం క్యూ4, క్యూ1లకు వేతనాల పెంపును కంపెనీ ఇప్పటికే పూర్తి చేసిందని పరేఖ్ తెలిపారు. "ఇప్పుడు ఈ సైకిల్ పూర్తయింది. ఎప్పటిలాగే తదుపరి రౌండ్ కోసం సమయాన్ని అంచనా వేయడం ప్రారంభించాం. మా ప్రస్తుత ప్రక్రియకు కట్టుబడి ఉంటాం. సరైన సమయంలో తదుపరి రౌండ్ను ప్రకటిస్తాం" అని పరేఖ్ వివరించారు.👉 ఇదీ చదవండి: TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం! -
స్టాక్ మార్కెట్లో 10 రోజులు నో ట్రేడింగ్!
దేశంలో స్టాక్ మార్కెట్పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవారు నిరంతరం మార్కెట్ను గమనిస్తుంటారు. ఆగస్టు నెలలో వారాంతాలు మినహా రెండు రోజులు భారత స్టాక్ మార్కెట్ మూసి ఉంటుంది. శని, ఆదివారాలతో సహా మొత్తం పది రోజుల పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లకు సెలవు ఉంటుంది. అంటే ఆయా రోజుల్లో ట్రేడింగ్ జరగదు.ఎన్ఎస్ఈ ట్రేడింగ్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025లో రాబోయే మార్కెట్ సెలవు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తదుపరిది ఆగస్టు 27న వినాయక చవితి రోజున ఉంటుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్), కరెన్సీ డెరివేటివ్స్ కూడా ఆగస్టు 15, 27 తేదీల్లో మూసి ఉంటాయి.ఈ ఏడాది ఇక రానున్న స్టాక్ మార్కెట్ సెలవులుఆగష్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవంఆగష్టు 27 - వినాయక చవితిఅక్టోబర్ 2 - మహాత్మాగాంధీ జయంతి/ దసరాఅక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజఅక్టోబర్ 22 - బలిప్రతిపాదనవంబర్ 5 - ప్రకాశ్ గురుపూర్ శ్రీ గురునానక్ దేవ్డిసెంబర్ 25 - క్రిస్మస్ -
హైదరాబాద్లో ఫ్లాట్ల కొనుగోళ్లకు భారీ తాకిడి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఫ్లాట్ల కొనుగోలుకు నగరవాసుల నుంచి తాకిడి పెరిగింది. నాగోలు బండ్లగూడ ప్రాజెక్టులోని 159 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోడానికి మంగళవారం చివరి రోజు కావడంతో ఆసక్తి ఉన్నవారు డీడీలతో క్యూ కట్టారు. బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్ల కోసం సుమారు 1,900 మందికి పైగా దరఖాస్తు చేశారు. చివరి రోజు మంగళవారం 600కుపైగా దరఖాస్తులు రావడం విశేషం.సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారి నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గత తరహాలో కాకుండా లబ్ధిదారులు తమకు నచ్చిన ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ఫ్లాట్ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీలో తీసి వచ్చిన వారికి కేటాయిస్తారు. ఈ కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన లాటరీని బుధవారం బండ్లగూడ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించారు.బండ్లగూడలో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకుని లాటరీలో రానివారు, పోచారం ప్రాజెక్టులోని ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. బండ్లగూడలో ప్రాజెక్టులో ఈఎండీ చెల్లించినట్లు ఇచ్చిన రసీదును పోచారం ప్రాజెక్టులో సమర్పించి అక్కడి ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగే ఓపెన్ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలంలో.. బండ్లగూడలో పొందిన రసీదుతోనే పాల్గొనవచ్చని ఆయన వివరించారు. ఘట్కేసర్ పోచారం ప్రాంతంలోని 601 ఫ్లాట్ల కొనుగోలు దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31 కాగా.. లాటరీ ప్రక్రియ ఆగస్టు 1, 2వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గౌతం పేర్కొన్నారు. -
ఇండియాలో డిజిటల్ చెల్లింపులు జోరు
ముంబై: ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఆర్బీఐ – డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ (ఆర్బీఐ–డీపీఐ) ఈ ఏడాది మార్చి నెలకు 493.22గా నమోదైంది. దీనికి ఆరు నెలల ముందు.. 2024 సెప్టెంబర్లో ఈ సూచీ 455.5గా ఉండడం గమనార్హం. అంటే డిజిటల్ చెల్లింపుల్లో 10.7% మేర వృద్ధి నమోదైంది. చెల్లింపుల సదుపాయాలు, సరఫరా వైపు అంశాలు ఆర్బీఐ–డీపీఐ సూచీ బలపడేందుకు దారితీసినట్టు ఆర్బీఐ తెలిపంది.ఐదు అంశాల ఆధారంగా చెల్లింపుల తీరును ఆర్బీఐ మదింపు వేస్తుంటుంది. ఇందులో చెల్లింపులు చేసే వారు (25% వెయిటేజీ), చెల్లింపులు సదుపాయాలు – డిమాండ్ వైపు అంశాలు (10%) పేమెంట్ (Payment) సదుపాయాలు – సరఫరా వైపు అంశాలు (15%), చెల్లింపుల పనితీరు (45%), వినియోగదారుల కేంద్రీకరణ 5% చొప్పున వెయిటేజీ కలిగి ఉన్నాయి.విప్రో ఇన్ఫ్రా నుంచి కొత్త బిజినెస్ న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ సొల్యూషన్లు అందించే విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ (విన్) తాజాగా కొత్త బిజినెస్ విభాగానికి తెరతీసింది. విప్రో ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ పేరుతో ఏర్పాటు చేసిన విభాగంపై రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల(పీసీబీలు) తయారీలో ఉపయోగించే బేస్ మెటీరియల్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం కర్ణాటకలో కాపర్ క్లాడ్ లామినేట్(సీసీఎల్) తయారీ యూనిట్ను నెలకొల్పుతున్నట్లు వివరించింది. దీంతో సుమారు 350 మందికి ఉపాధి లభించనుంది.చదవండి: టీసీఎస్ లేఆఫ్స్తో ఆర్థిక ప్రకంపనలుపెగాసిస్టమ్స్ డెవలపర్ల కోసం ఎక్స్పర్ట్ సర్కిల్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తమ డెవలపర్ల కోసం ఎక్స్పర్ట్ సర్కిల్స్ సెషన్లను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ డెవలపర్లలో 50 శాతం మంది భారత్లో ఉన్నారని, వారు తమ నైపుణ్యాలను మరింతగా పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పెగాఇన్నోవేట్ 2025 కార్యక్రమం సందర్భంగా కంపెనీ ఎండీ దీపక్ విశ్వేశ్వరయ్య తెలిపారు. పెగా ప్రధాన టెక్నాలజీలైన బ్లూప్రింట్, యాప్ డిజైన్లాంటి టెక్నాలజీలు తదితర అంశాల గురించి ఈ సెషన్స్లో చర్చిస్తారు. ఒక్కో సెషన్లో 50 మంది వరకు పాల్గొనవచ్చని దీపక్ చెప్పారు. -
TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు చేసిన ప్రకటన దేశ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన ఆవరించింది. కాగా టీసీఎస్ లేఆఫ్ల ప్రకటన తరువాత జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.బాధిత ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఉపాధి కల్పనను పెంచడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నైపుణ్యం పెంపు, రీస్కిల్లింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయా వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది.ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలగింపులపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడానికి పరిశీలిస్తుంది.భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్ ఈ సంవత్సరం 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్న నేపథ్యంలో ఈ వైఖరి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రభావం ఎక్కువగా మిడిల్, సీనియర్ గ్రేడ్ ఉద్యోగులపై పడుతుంది. 2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులు జతయ్యారు. -
కైనెటిక్ కొత్త స్కూటర్.. తిరిగొచ్చిన మరో ఐకానిక్ బండి
లూనా తర్వాత కైనెటిక్ నుంచి మరో ఐకానిక్ బండి తిరిగి కొత్తగా మార్కెట్లోకి వస్తోంది. కైనెటిక్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్లో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ .1.12 లక్షల నుంచి రూ.1.18 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ డీఎక్స్, డిఎక్స్+ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 116 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఈ డీఎక్స్ స్కూటర్కు కైనెటిక్ గ్రీన్ మూడు సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీని అందిస్తోంది. దీంతోపాటు తొమ్మిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ ఎంచుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. వైట్, బ్లూ, బ్లాక్, సిల్వర్, రెడ్ రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటు ఉంటుంది.జూలై 28 నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుక్కోవాలనుకుంటున్నవారు రూ .1,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2025 అక్టోబర్లో డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే డెలివరీలను 40,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కైనెటిక్ గ్రీన్ వెల్లడించింది.ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన లూనాతో పాటు కైనెటిక్ తన బ్రాండ్ కింద రెండవ ఐకానిక్ నేమ్ ప్లేట్ ను పునరుద్ధరించింది. భారత్కు చెందిన కైనెటిక్ ఇంజనీరింగ్, జపాన్ కు చెందిన హోండా మోటార్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంలో 1984 నుండి 2007 మధ్య కైనెటిక్ డీఎక్స్ స్కూటర్లు ఉత్పత్తి అయ్యాయి. హోండా ఎన్హెచ్ సిరీస్ స్కూటర్ల కింద రూపొందిన ఆ స్కూటర్ 98 సీసీ టూ-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇప్పుడిది ఎలక్ట్రిక్ మోడల్గా తిరిగి రోడ్డెక్కుతోంది. -
టాటా కంపెనీకి డిమాండ్ నోటీసు.. రూ.7,800 కోట్లు బాకీ
సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలు సుమారు రూ.7,800 కోట్లు చెల్లించాలని కోరుతూ టాటా కమ్యూనికేషన్స్కు టెలికాం విభాగం (DoT) షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఇవి 2005-06 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించిన ఏజీఆర్ బకాయిలుగా డిమాండ్ నోటీసులో పేర్కొంది.‘2005-06 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.7,827.55 కోట్ల షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసులు భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం నుంచి జూన్ 30, 2005 నాడు అందాయి’ అని టాటా కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ లక్ష్మీనారాయణ్ తెలిపారు. ఇందులో ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) లైసెన్స్ కింద 2010-11 ఆర్థిక సంవత్సరానికి, ఎన్ఎల్డీ (నేషనల్ లాంగ్ డిస్టెన్స్) లైసెన్స్ కింద 2007, 2010 ఆర్థిక సంవత్సాలకు కంపెనీ క్లెయిమ్ చేసిన మినహాయింపులు రూ .276.68 కోట్లను కూడా పేర్కొన్నట్లు ఆయన చెప్పారు.అయితే ఐఎల్డీ (ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్), ఎన్ఎల్డీ, ఐఎస్పీ లైసెన్సులకు సంబంధించి టాటా కమ్యూనికేషన్స్ గతంలో దాఖలు చేసిన అప్పీళ్లు సుప్రీంకోర్టు, టెలికాం ట్రిబ్యునల్ టీడీఎస్ఏటీ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. పాత టెలికాం లైసెన్స్ విధానం యూఏఎస్ఎల్ కింద ఏజీఆర్పై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కంపెనీ అప్పీళ్లను ప్రస్తావించలేదని లక్ష్మీనారాయణ్ తెలిపారు. కాబట్టి తమ లైసెన్సులు యూఏఎస్ఎల్కి భిన్నమని కంపెనీ భావిస్తోందని, స్వతంత్ర న్యాయ అభిప్రాయాల ఆధారంగా తన స్థానాన్ని సమర్థించుకోగలదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. -
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్లు
మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్.. స్పెషల్ అపార్చూనిటీస్ ఫండ్ పేరుతో న్యూ ఫంఢ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)ను ప్రకటించింది. ఆగస్ట్ 8తో ముగుస్తుంది. తిరిగి ఆగస్ట్ 21 నుంచి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వ్యాపార పరంగా ప్రత్యేక అవకాశాలను చూస్తున్న కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్ స్థాయిలో కంపెనీ వ్యాపారాల విభజన, విలీనాలు, కొనుగోళ్లు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు, ఏదైనా రంగాల్లో కొత్తగా అవకాశాలు ఏర్పడుతుండడం, నియంత్రణపరమైన మార్పులను అవకాశాలుగా మలుచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది.కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిని మొదటి మూడు నెలల్లో వెనక్కి తీసుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ చార్జీ పడుతుంది. ఆ తర్వాత ఉపసంహరణపై ఎలాంటి చార్జీలుండవు. ఈ పథకంలో రిస్క్ ఎక్కువ. నిఫ్టీ 500 టీఆర్ఐ ఈ పథకం పనితీరుకు ప్రామాణికం. అజయ్ ఖండేల్వాల్, అతుల్ మెహ్రా, బాలచంద్ర షిండే, రాకేశ్ శెట్టి, సునీల్ సావంత్ ఫండ్ మేనేజర్లుగా సేవలు అందించనున్నారు. జెరోధా మల్టీ అస్సెట్ ప్యాసివ్ ఎఫ్వోఎఫ్ జెరోధా మ్యూచువల్ ఫండ్ కొత్తగా జెరోదా మల్టీ అస్సెట్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ప్రారంభించింది. ఈక్విటీ, డెట్ ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్లు, కమోడిటీ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆగస్ట్ 8న ఎన్ఎఫ్వో ముగుస్తుంది. ఐదు పనిదినాల అనంతరం తిరిగి క్రయ, విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. ఈక్విటీ, డెట్, కమోడిటీల్లో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుంది.పోర్ట్ఫోలియోకి రిస్క్, అస్థిరతలు తగ్గించడం ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా 50–70 శాతం పెట్టుబడులను ఈక్విటీ ఈటీఎఫ్/ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. 10–20 శాతం డెట్ ఈటీఎఫ్/ఇండెక్స్ ఫండ్స్, 20–30 శాతం కమోడిటీ ఈటీఎఫ్లకు (బంగారం, వెండి) కేటాయిస్తుంది. పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని చూసే వారి కోసం ఈ పథకం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. -
TCS Layoffs: ‘రాజీనామాలు మాత్రం చేయొద్దు’
దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపు మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.ఈ ప్రకటన ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు ప్రకటనను ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒత్తిడికి తలొగ్గి రాజీనామాలు చేయొద్దుఈటీ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తొలగింపులను చట్టవిరుద్ధమని ప్రకటించిన ఐటీ ఉద్యోగ సంఘాలు ఒత్తిడికి తలొగ్గి ఎవరూ రాజీనామా చేయొద్దంటూ టీసీఎస్ సిబ్బందికి సూచించాయి. అదే సమయంలో లేఆఫ్ ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని, ప్రభావిత ఉద్యోగాలను పునరుద్ధరించాలని కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ టీసీఎస్ యాజమాన్యాన్ని కోరింది.రాజీనామా చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి చేయొద్దని ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఎఫ్ఐటీఈ) టీసీఎస్ను కోరింది. బాధితులకు నోటీస్ పీరియడ్ పేమెంట్స్, సెవెరెన్స్ బెనిఫిట్స్, ఏడాది పాటు ఇన్సూరెన్స్ కవరేజీని అందించాలని డిమాండ్ చేసింది. టీసీఎస్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని, అనిశ్చితులేవీ లేనప్పటికీ ప్రకటించిన ఈ తొలగింపులు పూర్తిగా లాభాపేక్షతో తీసుకున్న నిర్ణయాలేనని ఎఫ్ఐటీఈ పేర్కొంది. అన్ని రికార్డులు సిద్ధం చేసుకోవాలని, స్వచ్ఛంద రాజీనామాలకు ఎవరూ వెళ్లొద్దని, నిష్క్రమించాలని ఒత్తిడి చేస్తే రాష్ట్ర లేబర్ కమిషనర్ లేదా ఎఫ్ఐటీఈ సహాయం తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. 👉 వేలాది లేఆఫ్లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో -
అమ్మకాల ఒత్తిడి.. బేర్మన్న మార్కెట్లు
బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 572.07 పాయింట్లు (0.70 శాతం) క్షీణించి 80,891 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.10 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 24,680.90 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ అనుబంధ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ మాత్రమే 1.23 శాతం వరకు లాభపడగా, మిగతావి నష్టాల్లో స్థిరపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు 1.14 శాతం నుంచి 7.31 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.26 శాతం, 0.84 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్లన్నీ రెడ్లో స్థిరపడగా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4.26 శాతం నష్టంతో ముగిసింది. -
పెన్షనర్లు.. ట్యాక్స్ ప్లానింగ్
అరవైఏళ్లు, 80 ఏళ్లు దాటిన వారు.. ఇలా వయసు పైబడిన వారికి, అంటే సీనియర్ సిటిజన్లకు బేసిక్ లిమిట్ మారుతుంది. ఇదంతా పాత పద్ధతిలో. కొత్త పద్ధతిలో సీనియారిటీతో సంబంధం లేకుండా అందరికీ ఒకే బేసిక్ లిమిట్. ఈ బేసిక్ లిమిట్లు, శ్లాబులు, రేట్లూ మీకు తెలిసినవే. పెన్షన్ని ‘జీతాల’ పరిధిలో పరిగణిస్తారు. పెన్షన్ కూడా ట్యాక్సబుల్ ఆదాయమే. రూ.10,000 పన్ను భారం దాటిన వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. సీనియర్ సిటిజన్లకు వ్యాపారం, వృత్తి మీద ఆదాయం లేకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సినవసరం లేదు.ఆదాయపు పన్ను చట్ట ప్రకారం, జీతాన్ని ఎలా ట్యాక్సబుల్గా భావిస్తారో, అలాగే పెన్షన్లను కూడా భావిస్తారు. చాలా మంది పెన్షన్ మీద మినహాయింపు ఉందనుకుంటారు. కానీ, అది నిజం కాదు. పెన్షన్ ట్యాక్సబుల్ ఆదాయమే. బేసిక్ లిమిట్ లోపు ఉంటే తప్ప.. పన్ను భారం తప్పించుకోవడం ఉండదు. గవర్నమెంటులో రిటైర్ అయిన వారికి కమ్యూటెడ్ పెన్షన్ మినహాయింపు ఉంది. ముందుగా లెక్కలు కట్టి, ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా కమ్యుటెడ్ పెన్షన్ మార్చుకోవచ్చు. పరమ్వీర్ చక్ర, మహా వీర్ చక్ర, వీర్ చక్ర మొదలైన వాటికి సంబంధించిన పెన్షన్లకు మినహాయింపు ఉంది. విదేశాల్లో సెటిల్ అయిన పెన్షనర్లకు వచ్చే పెన్షన్లను మన దేశంలోని ఆదాయంగా పరిగణిస్తారు. పెన్షన్లలో ఎరియర్స్ అంటే .. బకాయిలు వస్తే, వాటిని పన్ను పరిధిలోకి చేర్చి 89(1) సెక్షన్ కింద రిలీఫ్ పొందవచ్చు. ఈ పెన్షన్లో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంది.ఇక ఫ్యామిలీ పెన్షన్ విషయానికొద్దాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, తన పెన్షన్ని కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వొచ్చు. ఇలాంటి చెల్లింపులను ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఇక్కడ పెన్షన్ అని పేరుంది కానీ, ఇలాంటి పెన్షన్ను ‘జీతం’గా భావించరు. ఇతర ఆదాయంగా భావిస్తారు. టీడీఎస్ అంశాలు వర్తించవు. పాత పద్ధతి అయితే రూ.15,000 మినహాయింపు ఇస్తారు. కొత్త పద్ధతి అయితే, రూ.25,000 మినహాయింపు వస్తుంది. సైన్యంలోని ఫ్యామిలీ సభ్యులకు మినహాయింపు పూర్తిగా ఇస్తారు. ఈ విషయానికి సంబంధించి చాలా పరిస్థితులనే పొందుపర్చారు. కానీ విధి నిర్వహణలో ఉండగా, సైన్యంలో చనిపోతే వారి కుటుంబానికి వచ్చే పెన్షన్ మీద మినహాయింపు ఉంటుంది. పెన్షన్, ప్యామిలీ పెన్షన్కి సంబంధించి ట్యాక్స్ ప్లానింగ్ విషయాలు..పాత పద్ధతిలో వెళ్తే మంచిదా. కొత్త పద్ధతిలో వెళ్తే మంచిదా అనేది ఆలోచించుకోవాలి.వైద్యానికి సంబంధించిన మినహాయింపులను గత వారం తెలుసుకున్నాం. ఇవి పాత పద్ధతిలో ఉంటాయి. పెన్షనరీ బెనిఫిట్స్ భారీగా వస్తాయి. వాటిని సక్రమంగా, సరిగ్గా, సమగ్రంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయొచ్చు.80సీ డిడక్షన్లు అనవసరం అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వార్ధక్యంలో సేవింగ్ మీద పెద్ద మొత్తాల్ని ‘బ్లాక్’ చేసుకోవడం ఎందుకు. చేతిలో లేదా అందుబాటులో బ్యాంకు బ్యాలెన్సులు ఉంటే మంచిది. ఉదాహరణకు వైద్యంలాంటి ఏ అవసరానికైనా ఉపయోగపడుతుందనేది ఆలోచన.సీనియర్ సిటిజన్లకు ఎన్నో స్కీములు ఉన్నాయి. సరైన నిర్ణయం తీసుకోండి. ఆకర్షణీయమైన ప్రైవేట్ వ్యక్తుల చేతిల మోసపోకండి. అయితే, ఎన్నో మంచి ఇన్వెస్ట్మెంట్లు, స్కీములు ఉన్నాయి. కేవలం పాత పద్ధతిలోనే వాటిపై వడ్డీకి మినహాయింపులు ఉన్నాయి. ఎన్నారై సిటిజన్లు 15హెచ్ ఇవ్వకూడదు. కానీ రెసిడెంట్లు ఇవ్వొచ్చు. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ల మీద వడ్డీ రూ. లక్ష దాటితే, టీడీఎస్ వర్తిస్తుంది. ట్యాక్సబుల్ ఇన్కం లోపల ఆదాయం ఉంటే, 15హెచ్ ఇస్తే పన్ను రికవరీ చేయరు. బేసిక్ లిమిట్ దాటితే 15హెచ్ ఇవ్వకూడదు.గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, పీఎఫ్, సూపర్ యాన్యుయేషన్ ఫండ్ .. వీటన్నింటికీ పూర్తి మినహాయింపు ఉంది. కానీ, అవి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ/ఆదాయంపై మినహాయింపు కొత్త విధానంలో లేదు.75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఉండి, ఒకే ఒక బ్యాంకు అకౌంటులో నుంచి వడ్డీ .. ఈ రెండింటి మీదా పన్ను రికవరీ అయితే, రిటర్ను వేయనక్కర్లేదు.రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పిల్లల చదువు కోసమా, స్వంత వైద్యానికా, ఇల్లు కొనుక్కోవడమా, బంగారం కొనడమా, షేర్స్లో ఇన్వెస్ట్ చేయడమా, పిల్లలకు బహుమతిగా ఇవ్వడమా.. ఇలా ఎన్నో ఆలోచనలు.తన సొంత పెన్షన్, భార్య ఫ్యామిలీ పెన్షన్.. ఇలా రెండూ కలిపి తడిసి మోపెడై.. పన్ను భారం చెల్లించే పెన్షనర్లు ఇంకొందరు. ఆదాయం అధికంగా ఉంటే పన్ను చెల్లించడమే ట్యాక్స్ ప్లానింగ్. -
Vaibhav Taneja: ఎలోన్ మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో..
-
ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఇవి ఉండాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటివరకు ఫ్లాట్ను విక్రయించాలంటే క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్ వంటి ఆధునిక సదుపాయాలిస్తే చాలనుకునే వారు బిల్డర్లు. కానీ, ఇప్పుడలా కుదరదు. ఎందుకంటే కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆధునిక ఆస్పత్రి వంటివి కూడా ఉంటేనే ఫ్లాట్ కొంటామంటున్నారు. అవి కూడా ప్రాజెక్ట్ దగ్గర్లో కాదు ఏకంగా ప్రాజెక్ట్ ఆవరణలోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు బడిబాట పడుతున్నారు. ప్రాజెక్ట్ల్లో ఫ్లాట్లే కాదు పాఠశాల, ఆస్పత్రి వంటివి కూడా నిర్మిస్తున్నారు. నగరంలో ఈ తరహా నిర్మాణాలు క్రమంగా పెరుగుతున్నాయి.సొంతింటి ఎంపికలో విద్యాలయాలు, ఆస్పత్రులు కీలకంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్కు తమ పిల్లలు పంపించడం తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరీ ఎక్కువగా వర్షాకాలంలో బస్సుల కోసం వేచి చూడటం తల్లిదండ్రులకు చిరాకు కలిగిస్తోంది. పిల్లలు వర్షంలో తడవకుండా ఇంటి నుంచే నేరుగా పాఠశాలకు వెళ్లగలరా? హఠాత్తుగా అనారోగ్యం తలెత్తితే వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు వీలుగా ప్రాజెక్ట్లోనే ఆస్పత్రి ఉందా? వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. అందుకే ఫ్లాట్ను కొనేముందు క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ప్రాజెక్ట్ ఆవరణలోనే పాఠశాల, ఆస్పత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.శరవేగంగా అభివృద్ధి.. కొనుగోలుదారుల అభిరుచిలో వచ్చిన మార్పుతో ఆయా ప్రాజెక్ట్లు ఉండే ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఎలాగంటే కొనుగోలుదారుల కోసం, తమ వ్యాపారం కోసం తమ ప్రాజెక్ట్ ఆవరణలో పాఠశాలలు, ఆస్పత్రులు నెలకొల్పేందుకు బిల్డర్లు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని కంపెనీలైతే ప్లే స్కూళ్లు, రీసెర్చ్ సెంటర్లకూ ప్రాజెక్టుల్లోనే స్థానం కల్పిస్తాయి. దీంతో ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం విద్యాలయాలు, ఆస్పత్రులతో కళకళలాడతాయి. దీంతో దేశ, విదేశీ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ల వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆయా ప్రాంతాలు రియల్ బూమ్తో శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. -
బెంగళూరులో వర్క్ ఫ్రమ్ హోమ్? పరిశీలిస్తున్న ఐటీ సంస్థలు
దేశ ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరు మహా నగరంలో ట్రాఫిక్ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నాలుగైదు కిలోమీటర్ల ప్రయాణానికే గంటలకొద్దీ సమయం పడుతోంది. నగరంలో ట్రాఫిక్ తగ్గించడానికి ముఖ్యంగా రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంబడి దీర్ఘకాలిక ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించడానికి నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త ఆలోచనను ప్రతిపాదించారు. బుధవారాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్హెచ్) అమలు చేయాలని అక్కడి ఐటీ సంస్థలకు సూచించారు.ఎడతెగని ట్రాఫిక్బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితి చాలా కాలంగా నగరవాసులకు, ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తోంది. బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ‘ఎక్స్’లో ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ‘నేను ఇంటి నుంచి ఉదయం 9 లేదా 9:30 గంటలకు బయలుదేరితే ఏ 12 గంటలకో ఆఫీసు చేరుకుంటాన్నాను. ఇది కేవలం 6 కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే! నాకు సొంత కారు ఉన్నా ట్రాఫిక్కు భయపడి దాన్ని బయటకు తీసే ఆలోచన కూడా చేయడం లేదు. ఏ ఉబెర్ లాంటిదో బుక్ చేసుకోవాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో వాళ్లు ఒక్కో రైడ్కు రూ .500–రూ .600 తీసుకుంటున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అదృష్టవశాత్తూ మా ఆఫీస్లో హైబ్రిడ్ విధానం అనుసరిస్తున్నారు. కానీ ఆఫీస్కు బయలుదేరినప్పుడు ఈ గందరగోళాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇది పనిచేసే ఉత్సాహాన్ని హరిస్తుంది. ఎవరోఒకరు ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్ల చాలాసార్లు మీటింగ్లు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఆఫీస్కి 1-2 కిలోమీటర్ల పరిధిలో నివసించే సహోద్యోగులు కూడా క్యాబ్లలో వచ్చి ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఎందుకని నడిచి వస్తున్నారు. బెంగళూరు లాంటి నగరానికి ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు.ఉదయం విపరీత ట్రాఫిక్పలు ప్రధాన ఐటీ పార్కులు, కంపెనీలకు నిలయమైన ఓఆర్ ఆర్ పై ఒత్తిడిని తగ్గించే చర్యల్లో భాగంగానే ఈ ప్రతిపాదిత డబ్ల్యూఎఫ్ హెచ్ ప్రణాళికను రూపొందించినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ కార్తీక్ రెడ్డి తెలిపారు. ఈ ఒత్తిడిని తగ్గించడానికి కంపెనీలు ఉదయం 7.30 గంటలకే పనివేళలను ప్రారంభించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వారం మధ్యలో అంటే బుధవారం వర్క్ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ట్రాఫిక్ అధికారులు సిఫార్సు చేస్తున్నారు.వ్యూహం ఇదీ..ట్రాఫిక్ విభాగం, బీబీఎంపీ (నగర కార్పొరేషన్), బీఎంటీసీ (బస్ సర్వీస్), ఐటీ రంగానికి చెందిన కీలక భాగస్వాములతో కూడిన సంయుక్త సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించారు. ఓఆర్ ఆర్ వెంబడి పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను వేగవంతం చేయడం, ప్రత్యేక బస్ బేల ఏర్పాటు, ప్రధాన టెక్ పార్కుల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం సహా అత్యవసర మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ లపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రతిపాదనలపై ఐటీ కంపెనీలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే వారంలో ఒక్కరోజైనా నగరంలో ఎంతో కొంత ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. -
అఫర్డబుల్ ఇళ్లు.. అబ్బే లాభం లేదండీ..
సామాన్యుడి సొంతింటి కల మరింత దూరమవుతోంది. అందుబాటు గృహాల నిర్మాణాలు తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పాటు డెవలపర్లు విలాసవంతమైన ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు కూడా సామాన్య, మధ్యతరగతి కోసం వేర్వేరు పథకాల ద్వారా సొంతింటి కలను నెరవేర్చేవి. కేంద్రం ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గృహరుణ ఆధారిత వడ్డీ సబ్సిడీతో కొనుగోలుదారులకు భారం తగ్గి ఈఎంఐ చెల్లింపుల్లో కొంత వెసులుబాటు లభించేది. ఎంఐజీ విభాగంలో 1,800 చ.అ. విస్తీర్ణం వరకు ఈ పథకం అమలు చేసినప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందారు. ఇప్పుడిది ఎల్ఐజీ వరకే పరిమితమైంది. దీంతో సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. - సాక్షి, సిటీబ్యూరోప్రైవేటీకరణ.. పట్టణాల్లో హౌసింగ్ బోర్డుల ఆధ్వర్వంలో గృహ నిర్మాణం చేపట్టినప్పుడు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని కాలనీలను నిర్మించేవారు. అధిక ఆదాయం, మధ్య, తక్కువ ఆదాయ వర్గాలుగా హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీగా విభజించి ఇళ్లు, స్థలాలను విక్రయించే పరిస్థితి ఉండేది. అయితే డిమాండ్కు అనుగుణంగా, కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టడంలో హౌసింగ్ బోర్డులు వెనకబడటంతో ప్రైవేట్ రంగం విజృంభించింది. మొదట్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న ఇళ్ల నిర్మాణం చేపట్టినా.. తర్వాత డిమాండ్ ఉన్న ప్రీమియం ఇళ్లవైపు వ్యవస్థీకృత రియల్ ఎస్టేట్ మొగ్గింది. భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో సరసమైన ధరల ప్రాజెక్టులు చేపట్టలేకపోతున్నామని.. విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం చేపడితే విక్రయాలు బాగుంటున్నాయని బిల్డర్లు అంటున్నారు.తగ్గిన కొనుగోలు శక్తి.. మధ్యతరగతి వర్గాల్లో అత్యధిక శాతం మంది గృహరుణం ద్వారానే ఇల్లు కొంటుంటారు. అధిక వడ్డీ రేట్లు, రుణ లభ్యత తగ్గిపోవడంతో సొంతింటి కల సవాల్గా మారింది. భూముల ధరలు పెరగడం.. ఆ మేరకు ఇంటి ధరలను పెంచాల్సి రావడంతో అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత తగ్గిపోయింది. బిల్డర్ ఎవరైనా ముందుకొచ్చి సరసమైన ధరల ఇళ్ల నిర్మాణం చేపడితే వాటిని విక్రయించడం పెద్ద సవాల్గా మారిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆయా వర్గాల్లో మేరకు కొనుగోలు శక్తి లేకపోవడమే దీనికి కారణం. అన్ని వనరులను సమీకరించుకుని కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. -
హైదరాబాద్కు ఐసీఐసీఐ లాంబార్డ్ ‘డిజాస్టర్ రికవరీ’ మార్పు
న్యూఢిల్లీ: బీమా రంగ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తమ డిజాస్టర్ రికవరీ మౌలిక సదుపాయాలను అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో ఆసియా–పసిఫిక్ (ముంబై) నుంచి ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్కు అప్గ్రేడ్ చేసినట్లు వెల్లడించింది.నిర్వహణపరమైన రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూ, కస్టమర్లకు నిరాటంకంగా సేవలు అందించేందుకు ఇది సహాయపడగలదని పేర్కొంది. టెక్నాలజీపరమైన అంతరాయాలు, అంతర్జాతీయంగా ఐటీ పరిశ్రమలో రిసు్కలు పెరుగుతున్న నేపథ్యంలో డౌన్టైమ్ను గణనీయంగా తగ్గించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. -
మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో.. ఎవరీ వైభవ్ తానేజా?
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆర్థిక భారత సంతతికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వైభవ్ తనేజా. ప్రస్తుతం టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఉన్న ఆయనకు ఇప్పుడు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించారు మస్క్. కొత్తగా ప్రకటించిన రాజకీయ వెంచర్ అయిన అమెరికా పార్టీకి వైభవ్ తానేజాను ట్రెజరర్, రికార్డుల కస్టోడియన్గానూ చేశారు. సంప్రదాయ ఐఐటీ-ఐఐఎం నుంచి వచ్చినవాడు కాకపోయినా తనేజా రూ.1,100 కోట్ల వేతన పరిహారాన్ని అందుకుంటున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.తనేజా అధికారికంగా అమెరికా పార్టీ ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు చేపట్టినట్లు ఇటీవల ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ధృవీకరించింది. ఈ పాత్రలో ఆయన రాజకీయ నిధులు, బడ్జెట్ పంపిణీని పర్యవేక్షించడం, ఆర్థిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఇది కార్పొరేట్ ఫైనాన్స్ లో ఆయన ప్రస్తుత పాత్ర నుండి రాజకీయ రంగానికి గణనీయమైన మార్పును సూచిస్తుంది. తనేజాపై ఉన్న నమ్మకంతో మస్క్ ఇప్పుడు తన రాజకీయ పార్టీ ఆర్థిక బాధ్యతలనూ అప్పగించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మొదలై..వైభవ్ తనేజా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1999 లో కామర్స్ లో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం చార్టర్డ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. 2006లో అమెరికా వెళ్లి సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (సీసీఏ) అయ్యారు. ఇదే ఆయన ప్రపంచ ఆర్థిక జీవితాన్ని విస్తరించింది.ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ)లో ఆయన దాదాపు 17 సంవత్సరాలు పనిచేశారు. అక్కడాయన 500 మందికి పైగా క్లయింట్లకు రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్, ఐపీఓలను నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన రంగంలోకి ఆయన ప్రవేశం 2016లో సోలార్సిటీతో జరిగింది. ఈ సంస్థ తరువాత టెస్లాలో విలీనమైంది.రూ.1,100 కోట్ల వేతనం2017లో టెస్లాలో చేరిన తనేజా క్రమంగా ఎదుగుతూ 2023లో ఆ సంస్థకు సీఎఫ్ఓ అయ్యారు. 2024లో ఆయన 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,157 కోట్లు) వేతన పరిహారం అందుకున్నారు. ఇందులో మూల వేతనంగా అందుకున్నది 4 లక్షల డాలర్లే అయినప్పటికీ మిగిలినది స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ అవార్డుల ద్వారా వచ్చింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా కూడా తానేజా పనిచేశారు. -
చేతులు మారుతున్న హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ
హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ ‘ప్రాప్టైగర్’ను కొనుగోలు చేస్తున్నట్టు ఆరమ్ ప్రాప్టెక్ లిమిటెడ్ ప్రకటించింది. రూ.86.45 కోట్ల విలువ మేర షేర్లను జారీ చేయడం ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన ఆర్ఈఏ గ్రూప్ నుంచి ప్రాప్టైగర్ను సొంతం చేసుకుంటున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఆర్ఈఏ ఇండియాకు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నట్టు స్టాక్ ఎక్స్చేంజ్లకు వెల్లడించింది.ప్రాప్టైగర్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 100 శాతం షేర్లను కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఒక్కోటీ రూ.5 ముఖ విలువ కలిగిన 42,42,537 షేర్లను ఆర్ఈఏ ఇండియాకు జారీ చేయనున్నట్టు వెల్లడించింది. షేర్ల జారీ అనంతరం ఆరమ్ ప్రాప్టెక్లో ఆర్ఈఏ ఇండియాకు 5.54 శాతం వాటా లభించనుంది.ప్రాప్టైగర్ నిర్వహణలో రియల్ ఎస్టేట్ ప్రకటనల పోర్టల్ అయిన హౌసింగ్ డాట్ కామ్ ఉండడం గమనార్హం. 2023–24లో హౌసింగ్ డాట్ కామ్ ఆదాయం రూ.101 కోట్లుగా ఉంది. ఆరమ్ ప్రాప్టెక్ రియల్ ఎస్టేట్ రంగానికి సాఫ్ట్వేర్, టెక్నాలజీ పరిష్కారాలను అందిస్తుంటుంది. -
ఈసీఎం స్కీమ్.. రూ.16 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు
ఎల్రక్టానిక్స్ విడిభాగాల తయారీ స్కీమ్ (ఈసీఎంఎస్) కింద రూ. 16,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు కేంద్రానికి అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనుమతుల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, షార్ట్లిస్ట్ చేసిన ప్రాజెక్టుల పేర్లను సెప్టెంబర్లో ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దేశ, విదేశ కంపెనీల నుంచి ఈ స్కీముకు మంచి స్పందన లభించినట్లు వివరించాయి.రూ. 22,805 కోట్ల ఈసీఎంఎస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మే 1న దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల డిమాండ్కు తగ్గట్లుగా దేశీయంగా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. టాటా ఎల్రక్టానిక్స్, డిక్సన్ టెక్నాలజీస్, ఫాక్స్కాన్లాంటి సంస్థలు దీనిపై ఆసక్తి కనపర్చినట్లు సమాచారం.విడిభాగాల సెగ్మెంట్లో 2030 నాటికి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి 500 బిలియన్ డాలర్లకు చేరనుండగా, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం 248 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 21 లక్షల కోట్లు) చేరుతుందని ఎల్రక్టానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు తగు చర్యలు తీసుకోకపోతే ఈ కొరతను అధిగమించేందుకు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. -
యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే యోచన ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో స్పష్టం చేసింది. రూ.2000 దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో చెప్పారు.రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, జీఎస్టీ రేట్లు, మినహాయింపులను కేంద్రం, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులతో కూడిన రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తామని సభకు తెలిపారు. యూపీఐ ట్రాన్సాక్షన్ డేటా ఆధారంగా కర్ణాటకలోని వ్యాపారులకు దాదాపు 6,000 జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి.మరోవైపు యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్క్రూటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. -
రూ. 353 కోట్ల ఐపీవోకి హైదరాబాదీ సంస్థ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెఫ్రోప్లస్ బ్రాండ్ పేరిట డయాలసిస్ సేవలందించే హైదరాబాదీ సంస్థ నెఫ్రోకేర్ హెల్త్ సరీ్వసెస్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 353.4 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత షేర్హోల్డర్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో 1.27 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ ద్వారా నెఫ్రోప్లస్ రూ. 70.6 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇన్వెస్ట్కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ టూ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలైనవి కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 129.1 కోట్లను దేశీయంగా కొత్తగా డయాలసిస్ క్లినిక్లను ప్రారంభించేందుకు, రూ. 136 కోట్లను రుణాల చెల్లింపునకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.2009లో ఏర్పాటైన నెఫ్రోప్లస్కి దేశవ్యాప్తంగా 269 నగరాల్లో 447 క్లినిక్లు ఉన్నాయి. ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్, నేపాల్తో పాటు ఇటీవలే సౌదీ అరేబియా ద్వారా మధ్యప్రాచ్య మార్కెట్లోకి కూడా విస్తరించింది. 2025 మార్చి 31 నాటికి కంపెనీ వద్ద 5,000 పైగా డయాలసిస్ మెషిన్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 755.8 కోట్ల ఆదాయం, రూ. 67 కోట్ల లాభం ఆర్జించింది. -
ఈ బ్యాంకుల లాభాలు తగ్గాయ్..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం స్టాండెలోన్ ప్రాతిపదికన లాభం రూ. 3,282 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 3,520 కోట్లతో పోలిస్తే 7 శాతం క్షీణించింది. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించడం, ఫీజు ఆదాయాల వృద్ధి నెమ్మదించడం, ప్రొవిజనింగ్ పెరగడం వంటి అంశాలు ఇందుకు కారణం.వార్షికంగా చూస్తే మొండిబాకీలకు ప్రొవిజనింగ్ 109 శాతం ఎగిసి రూ. 1,208 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ ఆదాయం 6 శాతం పెరిగి రూ. 7,259 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 4.65 శాతంగా నమోదైంది. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ లాభం స్వల్పంగా 1 శాతం వృద్ధితో రూ. 4,472 కోట్లకు చేరింది. జనరల్ ఇన్సూరెన్స్ విభాగం విక్రయానికి సంబంధించి రూ. 3,000 కోట్లు కూడా జత కావడంతో గత క్యూ1లో లాభం రూ. 7,448 కోట్లుగా నమోదైంది. తాజాగా నిర్వహణలోని మొత్తం ఆస్తుల పరిమాణం (ఏయూఎం) 18 శాతం పెరిగి రూ. 6,36,311 కోట్ల నుంచి రూ. 7,50,143 కోట్లకు పెరిగింది. స్థూల ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో రిటైల్ కమర్షియల్ వాహన రుణాల పోర్ట్ఫోలియోలో ఒత్తిడి నెలకొన్నట్లు బ్యాంకు తెలిపింది. స్వల్పంగా పెరిగిన మొండిబాకీలు .. సమీక్షాకాలంలో అసెట్ క్వాలిటీ స్వల్పంగా క్షీణించింది. స్థూల నిరర్థక ఆస్తుల పరిమాణం (జీఎన్పీఏ) 1.39 శాతం నుంచి 1.48 శాతానికి పెరిగింది. నికర ఎన్పీఏలు స్థిరంగా 0.34 శాతంగా నమోదయ్యాయి. అటు కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) నిష్పత్తి 43.4 శాతం నుంచి 40.9 శాతానికి తగ్గింది. సగటున మొత్తం డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ. 4,35,603 కోట్ల నుంచి రూ. 4,91,998 కోట్లకు, రుణాలు 14 శాతం పెరిగి రూ. 4,44,823 కోట్లకు చేరాయి. కరెంట్ డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ. 62,200 కోట్ల నుంచి రూ. 67,809 కోట్లకు, సేవింగ్స్ డిపాజిట్లు 2 శాతం వృద్ధితో రూ. 1,22,105 కోట్ల నుంచి రూ. 1,24,186 కోట్లకు, టర్మ్ డిపాజిట్లు రూ. 2,1,298 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ. 3,00,003 కోట్లకు చేరాయి. స్లిప్పేజీలు రూ. 1,318 కోట్ల నుంచి రూ. 1,812 కోట్లకు పెరిగాయి.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లాభం 32% డౌన్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 463 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో నమోదైన రూ. 681 కోట్లతో పోలిస్తే ఏకంగా 32.07 శాతం క్షీణించింది. సమీక్షాకాలంలో అసెట్ క్వాలిటీ సైతం నెమ్మదించింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) పరిమాణం 1.87 శాతం నుంచి 1.97 శాతానికి పెరిగింది. రూ. 4,433.5 కోట్ల నుంచి రూ. 4,867.5 కోట్లకు చేరింది. అలాగే నికర ఎన్పీఏలు శాతాలవారీగా 0.53 శాతం నుంచి 0.53 శాతానికి, రూ. 1,230 కోట్ల నుంచి రూ. 1,346 కోట్లకు పెరిగాయి. వడ్డీ ఆదాయం 5 శాతం అప్.. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం రూ. 4,695 కోట్ల నుంచి రూ. 4,933 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ త్రైమాసికాలవారీగా 24 బేసిస్ పాయింట్లు క్షీణించి 5.71 శాతం నుంచి 5.95 శాతానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్ల కోత ప్రభావం ఇందుకు కారణమని బ్యాంకు తెలిపింది. క్యూ1లో కస్టమర్ల డిపాజిట్లు 25.5 శాతం పెరిగినట్లు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వి. వైద్యనాథన్ తెలిపారు. అసెట్ క్వాలిటీ విషయానికొస్తే సూక్ష్మరుణాల విభాగం మినహా అన్ని వ్యాపారాలు మెరుగ్గా రాణించినట్లు వివరించారు. అర్హులైన రుణగ్రహీతలకు, రెపో రేట్ల తగ్గింపు ప్రయోజనాలను బదలాయించడం వల్ల మార్జిన్లు తగ్గినట్లు వైద్యనాథన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి మార్జిన్లు మెరుగుపడొచ్చని వివరించారు. -
ఫోన్కి వస్తున్న మెసేజ్లలో కొత్త మార్పులు.. గమనించారా?
మన ఫోన్లకు రోజూ పదుల సంఖ్యలో వివిధ రకాల ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. వీటిలో ఎక్కువ శాతం వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రమోషనల్ మెసేజ్లే ఉంటుంటాయి. వీటి మధ్య ముఖ్యమైన మెసేజ్లను చూసుకోకుండా విస్మరిస్తుంటాం. కానీ ఈ మధ్య వస్తున్న వస్తున్న ఎస్ఎంఎస్లను గమనిస్తే కొత్త మార్పులు కనిపిస్తాయి. అదేమీ లేదండి ఏ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో సులువుగా తెలిసేలా ట్రాయ్ ఇటీవల కొత్త ఎస్ఎంఎస్ ట్యాగింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది.మనకు వచ్చే ప్రతి ఎస్ఎంఎస్ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేసేలా ఐడింటిఫికేషన్ అక్షరం ఉంటుంది. ఎస్ఎంఎస్ హెడర్లో పీ(P) అని ఉంటే ప్రమోషనల్ అంటే వివిధ కంపెనీలు తమ ప్రచారం కోసం పంపించే మెసేజ్లు అన్నమాట. ఎస్(S) అని ఉంటే సర్వేస్ అంటే సాధారణ సమాచారం తెలియజేసేవి అని అర్థం. ఇక టీ(T) అని ఉంటే ట్రాన్సాక్షనల్ అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలు, జీ(G) అని ఉంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం. ఇలా.. ఏదైనా ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తెరిచి చదవకుండానే దాని ఉద్దేశం తెలుసుకోవచ్చు.ఈ మార్పు ఎందుకంటే..దేశంలో 1.1 బిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు తరచూ స్పామ్, అవాంఛిత ఎస్ఎంఎస్ సందేశాలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది వినియోగదారులు ఏ సందేశాలు ముఖ్యమైనవి, ఏవి అసంబద్ధమైనవి అని తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వినియోగదారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడటానికి ఫిల్టర్గా పనిచేసేలా కొత్త అనుబంధ వ్యవస్థను రూపొందించారు. -
500 ఫ్లాట్లు.. రూ .1,600 కోట్లు.. వారంలో ఫినిష్!
దేశ రాజధాని ప్రాంతంలో ప్రీమియం ఇళ్లకు ఎంత బలమైన డిమాండ్ ఉందో చెప్పేందుకు నిదర్శనం ఇది. రియాల్టీ సంస్థ కౌంటీ గ్రూప్ ఘజియాబాద్లోని ఒక ప్రాజెక్టులో 500 లగ్జరీ అపార్ట్మెంట్లను రూ .1,600 కోట్లకు విక్రయించింది. ఘజియాబాద్లోని ఎన్హెచ్ 24 వెంబడి ఉన్న ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 'జేడ్ కౌంటీ' మొదటి దశను గత వారమే కంపెనీ ప్రారంభించింది. మొత్తం 500 ఫ్లాట్లను రూ.1,600 కోట్లకు విక్రయించినట్లు కౌంటీ గ్రూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.ఫ్లాట్ల ధర రూ.2.5-6 కోట్లుగా నిర్ణయించారు. ప్రాజెక్టు మొదటి దశలో 1.5 మిలియన్ చదరపు అడుగుల అభివృద్ధి చేయదగిన ప్రాంతం ఉంది. 1,000 యూనిట్లతో కూడిన ఈ హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి రూ .1,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కౌంటీ గ్రూప్ ఈ ఏడాది జూన్లో తెలిపింది. మొత్తం ప్రాజెక్టు పరిమాణం 13.33 ఎకరాలు, అభివృద్ధి చేయదగిన విస్తీర్ణం 3 మిలియన్ చదరపు అడుగులు.వేవ్ గ్రూప్ కు చెందిన పెద్ద టౌన్ షిప్ 'వేవ్ సిటీ'లోని ఈ భూమిని రూ.400 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో లగ్జరీ గృహాలకు అధిక డిమాండ్, లొకేషన్ అడ్వాంటేజ్ కారణంగా తమ ప్రాజెక్టు మొదటి దశలో బలమైన అమ్మకాలు జరిగాయని కౌంటీ గ్రూప్ డైరెక్టర్ అమిత్ మోదీ తెలిపారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడంలో కంపెనీ ట్రాక్ రికార్డ్ కూడా అమ్మకాలకు దోహదపడిందని ఆయన అన్నారు.గ్రీన్ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని, 2030 నుంచి దశలవారీగా డెలివరీ చేస్తామని అమిత్ మోదీ చెప్పారు. కౌంటీ గ్రూప్ దాదాపు 18 మిలియన్ చదరపు అడుగుల నివాస స్థలాలను 10,000 కంటే ఎక్కువ కుటుంబాలకు అందించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో 20 మిలియన్ చదరపు అడుగులకు పైగా నివాస, వాణిజ్య స్థలాలను ఈ గ్రూప్ నిర్మిస్తోంది. -
రూ.15 వేలు బోనస్.. ఆగస్టు 1 నుంచి కొత్త పథకం
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో రిజిస్టర్ చేసుకున్న మొదటిసారి ఉద్యోగులు అంటే ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారికి కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎం-వీబీఆర్వై) కింద రూ.15,000 లభిస్తాయి. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ)గా పిలిచే ఈ పథకానికి రూ.99,446 కోట్ల బడ్జెట్తో కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. పీఎం-వీబీఆర్వై పథకం యాజమాన్యాలకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ప్రోత్సహిస్తుంది. వివిధ రంగాల్లో, ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగావకాశాలను పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఉపాధి ఆధారిత అభివృద్ధి ద్వారా భారత ఆర్థిక వృద్ధిని నడిపించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.పథకం అమలు తీరు ఇలా..ఈ పథకం రెండు విధాలుగా ప్రోత్సాహాలు అందిస్తుంది. ఒకటి మొదటిసారి ఉద్యోగుల కోసం, మరొకటి యజమానుల కోసం. ఈ భాగం మొదటిసారిగా శ్రామిక శక్తిలో చేరిన (ఈపీఎఫ్ఓలో నమోదై ఉండాలి) వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. అర్హత కలిగిన ఉద్యోగులు (రూ .1 లక్ష వరకు వేతనం ఉన్నవారు) రూ .15,000 వరకు వన్ టైమ్ ఈపీఎఫ్ వేతన ప్రయోజనాన్ని పొందుతారు.దీన్ని ఉద్యోగంలో చేరిన 6 నెలల తరువాత, మళ్లీ 12 నెలల నిరంతర సర్వీస్ తర్వాత రెండు వాయిదాలలో చెల్లిస్తారు. రెండో విడత పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ పూర్తి చేయాలి. పొదుపు అలవాట్లను పెంపొందించడానికి ఈ ప్రోత్సాహకంలో కొంత భాగాన్ని పొదుపు ఖాతా లేదా సాధనానికి కేటాయిస్తారు. దాన్ని తరువాత ఉపసంహరించుకోవచ్చు.ఇక కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్న యాజమాన్యాలకూ ఈ పథకం కింద ప్రోత్సాహాలు ఉంటాయి. ముఖ్యంగా తయారీ రంగంలో కొత్త కార్మికులను నియమించుకునే యాజాన్యాలకు కనీసం ఆరు నెలల పాటు ఉద్యోగంలో కొనసాగే ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ మద్దతు రెండు సంవత్సరాలు కొనసాగుతుంది. అదే తయారీ యూనిట్లకు అయితే ప్రోత్సాహక కాలాన్ని మూడు, నాల్గవ సంవత్సరాలకు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది.ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి,ఈపీఎఫ్ఓలో నమోదైన కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుని వారిని కనీసం ఆరు నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలైతే కనీసం ఇద్దరిని, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని కొత్తగా నియమించుకోవాలి.ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)ను ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా తొలిసారి ఉద్యోగులకు చెల్లింపులు జరుగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో లబ్ధిదారు కంపెనీలకు ప్రోత్సాహకాలను నేరుగా ఆ సంస్థ పాన్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. -
రిటైల్ స్థలాల్లోనూ హైదరాబాద్ టాప్
హైదరాబాద్లో ఇళ్లు, కార్యాలయ స్థలాలకే కాదు రిటైల్ స్పేస్కు కూడా డిమాండ్ అధికంగానే ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)లో దేశంలోనే అత్యధిక రిటైల్ స్పేస్ లీజులు మన దగ్గరే ఎక్కువగా జరిగాయి. 2025 క్యూ2లో 8 లక్షల చ.అ. స్థల లావాదేవీలు పూర్తయ్యాయని, దీంతో కలిపి ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరం (హెచ్1)లో నగరంలో 15 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజులు జరిగాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. గతేడాది హెచ్1తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. 2027 నాటికి నగరంలోకి 28 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ సరఫరా అవుతుందని, ఇందులో వచ్చే రెండు త్రైమాసికాలంలో సుమారు 17 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ వినియోగంలోకి కూడా వస్తుందని అంచనా వేసింది. – సాక్షి, సిటీబ్యూరోఫుడ్ అండ్ బేవరేజెస్, ఫ్యాషన్..ఫుడ్ అండ్ బేవరేజెస్(ఎఫ్అండ్బీ) బ్రాండ్లు ఎక్కువగా రిటైల్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. ఈ విభాగం వాటా 34 శాతంగా ఉండగా.. ఫ్యాషన్ బ్రాండ్ల వాటా 14 శాతంగా ఉంది. ఈ క్యూ2లో కొత్తగా గ్రేడ్–ఏ మాల్స్ సరఫరా జరగకపోవడంతో మాల్స్లో వేకన్సీ రేట్ 1.85 శాతంగా ఉంది. ఇక, హై స్ట్రీట్ ప్రాంతాలలో రిటైల్ స్పేస్ అద్దెలకు ఆదరణ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూబ్లీహిల్స్ వంటి హై స్ట్రీట్లో అద్దెలు 13.6 శాతం మేర పెరిగాయి. అత్తాపూర్, మదీనాగూడ, చందానగర్ ప్రాంతాల్లోనూ రిటైల్ అద్దెలు ఆశాజనకంగానే వృద్ధి చెందుతున్నాయి.హాట్స్పాట్లుగా బాచుపల్లి, కొంపల్లిఈ ఏడాది రెండో త్రైమాసికం(క్యూ2)లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 22.4 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీలు పూర్తయ్యాయి. గతేడాది క్యూ2లో జరిగిన 23.9 లక్షల చ.అ. జరిగాయి. ఈ ఏడాది క్యూ1లో 23.7 లక్షల చ.అ.లు జరిగాయి. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హైస్ట్రీట్ ప్రాంతాలలో రిటైల్ స్పేస్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 89 శాతం లీజులు ఈ ప్రాంతాల్లోనే జరిగాయి. బాచుపల్లి, కొంపల్లి ప్రాంతాలు రిటైల్ స్పేస్కు హాట్ స్పాట్లుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్యూ2లో ఈ ప్రాంతాలలో 57 శాతం లీజులు జరిగాయి. అమీర్పేట, నిజాంపేట వంటి ప్రధాన ప్రాంతాలలో 43 శాతం రిటైల్ స్పేస్ లీజులు పూర్తయ్యాయి. -
ఈ బుల్లి కారు.. ఇక మరింత ప్రియం
బుల్లి ఎలక్ట్రిక్ కారు ‘ఎంజీ కామెట్ ఈవీ’ ధరలను ఎంజీ మోటార్ మరోసారి పెంచింది. ఈ ఏడాదిలో మైక్రో ఎలక్ట్రిక్ హ్యాచ్ కారు ధరల సవరణ ఇది మూడోసారి. తాజా అప్డేట్లో రూ .15,000 వరకు పెరగడంతో, కామెట్ ఈవీ ధరలు ఇప్పుడు రూ .7.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, బ్యాటరీ కలిపి) నుండి ప్రారంభమవుతాయి. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (బీఏఎస్) మోడల్ కింద కామెట్ ఈవీ ధర రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.బ్యాటరీ అద్దెలూ పెంపుబీఏఎస్ మాడ్యూల్ ప్రకారం బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ధరలను కిలోమీటరుకు రూ.2.9 నుంచి రూ.3.1కి పెంచారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సమయంలో కామెట్ ఈవీ బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.2.50గా ఉండేది. కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్ క్లూజివ్, బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎంజీ కామెట్ ఈవీ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లుధర పెరగడం మినహా కామెట్ ఈవీలో ఇతర మార్పులేమీ లేవు. ఫీచర్ల విషయానికి వస్తే, కామెట్ ఈవీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్లను కలిగి ఉంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, మాన్యువల్ ఏసీ, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), నాలుగు డిస్క్ బ్రేకులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.కోమెట్ ఈవీలో 17.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది వెనుక యాక్సిల్పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందిస్తుంది. ఇది 41 బిహెచ్పీ, 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. 7.4 కిలోవాట్, 3.3 కిలోవాట్ల ఛార్జర్లతో 0 నుండి 100 శాతం ఛార్జ్ సమయం వరుసగా 3.5 గంటలు, ఏడు గంటలు పడుతుంది. -
హాట్కేకుల్లా అమ్ముడుపోయే ఫ్లాట్లు..
ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే.. పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు జరగాలంటే.. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో గృహ ప్రవేశం చేయాలంటే.. వీటిన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్టులు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్టులు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్టులకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్టులకు మరింత కలిసొచ్చే అంశం. – సాక్షి, సిటీబ్యూరోబడా ప్రాజెక్టులు నిర్మించాలంటే రూ.కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజెక్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్లు ప్రారంభించి అమ్మకాలు లేక బోర్డు తిప్పేసిన సంస్థలు అనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా.ఏడాదిలో గృహప్రవేశం.. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్ది పాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావడం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది.వసతులకు కొదవేంలేదు..గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాకింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్లతో పాటు స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లు ఉంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్లో ఉండే కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్వాసులందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
మహిళలకు శ్రావణం శుభవార్త.. వరుసగా దిగొస్తున్న గోల్డ్ రేట్లు..
-
వేలాది లేఆఫ్లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో వేలాది లేఆఫ్లపై ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ఎమోషనల్గా స్పందించారు. ఇటీవల కంపెనీలో ఇటీవల 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించడం తనను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అంగీకరించారు. అయితే సంస్థ ఏఐ పరివర్తనకు ఈ కోతలు అవసరమని ఆయన పేర్కొన్నారు.కంపెనీ పరిణామాలపై ఆయన ఉద్యోగులకు లేఖలు పంపారు. "అన్నింటికంటే ముందుగా నేను నాపై ఎక్కువ భారం మోపుతున్న వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇటీవలి ఉద్యోగ తొలగింపుల గురించి మీలో చాలా మంది ఆలోచిస్తున్నారని నాకు తెలుసు" అంటూ సత్య నాదెళ్ల లేఖ మొదలు పెట్టారు. " ఈ నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన అత్యంత క్లిష్టమైనవి. మన సహోద్యోగులు, సహచరులు, స్నేహితులు.. మనం ఎవరితో అయితే కలిసి పనిచేశామో, నేర్చుకున్నామో, లెక్కలేనన్ని క్షణాలను పంచుకున్నామో వారిని అవి ప్రభావితం చేస్తాయి" అంటూ రాసుకొచ్చారు.మైక్రోసాఫ్ట్ 2014 తర్వాత ఈ సంవత్సరం భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దాని ప్రపంచ శ్రామిక శక్తిలో 7 శాతం మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగాల కోతలో అనిశ్చితి, అసంబద్ధత కనిపిస్తోందని అంగీకరించిన సత్య నాదెళ్ల కంపెనీ వృద్ధిపై కూడా దృష్టి సారించారు. "మార్కెట్ పనితీరు, వ్యూహాత్మక స్థానం, వృద్ధి ఇలా అంశాల్లో లక్ష్యంతో కూడిన చర్యల ద్వారా మైక్రోసాఫ్ట్ పురోగమిస్తోంది. మనం మునుపటి కంటే మూలధన పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నాం. మన మొత్తం హెడ్ కౌంట్లో పెద్దగా మార్పేమీ లేదు. మన పరిశ్రమలో, మైక్రోసాఫ్ట్ లో కొంతమంది ప్రతిభ, నైపుణ్యానికి మునుపెన్నడూ చూడని స్థాయిలో గుర్తింపు, రివార్డులు లభిస్తున్నాయి. అదే సమయంలో లేఆఫ్లూ అమలు చేస్తున్నాం" అని వివరించారు. -
యూపీఐ పేమెంట్లపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) పేమెంట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ ద్వారా పూర్తిగా ఉచిత డిజిటల్ లావాదేవీల శకం శాశ్వతంగా ఉండకపోవచ్చని సూచిస్తూ భవిష్యత్తులో యూపీఐ ఇంటర్ఫేస్ను ఆర్థికంగా సుస్థిరం చేయాల్సిన అవసరం ఉందన్నారు మల్హోత్రా.ప్రస్తుతం ఉచితంయూపీఐ వ్యవస్థ ప్రస్తుతం వినియోగదారులకు ఉచితమని, బ్యాంకులు, ఇతర భాగస్వాములకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఖర్చులను ప్రభుత్వం భరిస్తోందని ఆయన అన్నారు. ‘మనకు విశ్వవ్యాప్తంగా సమర్థవంతమైన వ్యవస్థ అవసరం. ప్రస్తుతానికి ఎలాంటి ఛార్జీలు లేవు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో బ్యాంకులు, ఇతర భాగస్వాములకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది’ అన్నారు.ఉచితం శాశ్వతం కాదుడిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను కొనసాగించాలంటే ఎవరోఒకరు ఖర్చును భరించాల్సి ఉంటుందని, ఉచిత యూపీఐ లావాదేవీలు శాశ్వతంగా ఉండవని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. 'సహజంగానే కొన్ని ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఏ ముఖ్యమైన మౌలిక సదుపాయాలైనా ఫలాలు ఇవ్వాలి. ఏ సేవ అయినా నిజంగా నిలకడగా ఉండాలంటే, దాని ఖర్చును సమిష్టిగా గానీ లేదా వినియోగదారు గానీ చెల్లించాలి' అని వ్యాఖ్యానించారు.మౌలిక సదుపాయాలపై భారంయూపీఐ లావాదేవీలు గత కొన్నేళ్లుగా విపరీతమైన వృద్ధిని సాధించాయి. గ్లోబల్ పేమెంట్స్ దిగ్గజం వీసాను అధిగమించాయి. గత జూన్లో 1839 కోట్ల యూపీఐ లావాదేవీల ద్వారా రూ .24.03 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. దీంతో వేగవంతమైన చెల్లింపులలో భారత్ గ్లోబల్ లీడర్గా మారింది. అయితే, ఈ పెరుగుదల బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వంటి బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. యూపీఐ లావాదేవీలు ఉచితం కావడంతో వాటి ద్వారా ఎటువంటి ఆదాయ ప్రవాహం లేకపోవడం వల్ల ఇది ఆర్థికంగా నిలకడలేని నమూనాగా మారింది. -
సుందర్ పిచాయ్ ఇక బిలియనీర్..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్స్ క్లబ్లోకి చేరారు. 1 బిలియన్ డాలర్ల నికర సంపద పరిమితిని అధిగమించి బిలియనీర్గా అవతరించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆల్ఫాబెట్ షేర్లు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో, భారత్కు చెందిన 53 ఏళ్ల పిచాయ్ నెట్వర్త్ 1.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.2023 ప్రారంభం నుంచి ఆల్ఫాబెట్ స్టాక్ 120 శాతానికి పైగా పెరగడం, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరగడం ఈ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమని బ్లూమ్బర్గ్ పేర్కొంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఒక వ్యవస్థాపకేతర సీఈఓకు ఇది అరుదైన ఘనత. మెటాకు చెందిన మార్క్ జుకర్ బర్గ్, ఎన్విడియాకు చెందిన జెన్సెన్ హువాంగ్ వంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లు బిలియనీర్స్గా ముందు వరసలో ఉన్నప్పటికీ వారు తమ కంపెనీల్లో ఈక్విటీ వాటాలను కలిగి ఉన్నారు.సీఈవోగా పదేళ్లుఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకుని కంపెనీలో ఎక్కువ కాలం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పిచాయ్ 2004లో ఆల్ఫాబెట్ ప్రధాన అనుబంధ సంస్థ గూగుల్ లో చేరారు. క్రోమ్, ఆండ్రాయిడ్ లకు ఆయన తొలినాళ్లలో చేసిన సేవలు 2015లో సీఈఓగా ఎదగడానికి పునాది వేశాయి. తర్వాత 2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.నిరాడంబర నేపథ్యం..సుందర్ పిచాయ్ తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రెండు గదుల అపార్ట్ మెంట్ లో పెరిగారు. వారి కుటుంబానికి కారు ఉండేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తొలిసారిగా ఇంటికి టెలిఫోన్ వచ్చింది. 1993 లో సుందర్ పిచాయ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి స్కాలర్షిప్ సాధించగా ఆయన్ను కాలిఫోర్నియా పంపించడానికి విమాన టికెట్ కోసం ఆయన తండ్రి ఏడాది మొత్తం జీతం కంటే కూడా పైగానే ఆ కుటుంబం ఖర్చుపెట్టాల్సి వచ్చింది. -
ఫాస్టెస్ట్ ఎంజీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేసింది..
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎంజీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుగా చెబుతున్న సైబర్స్టర్ను జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా విడుదల చేసింది. రూ .74.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రీ-లాంచ్ రిజర్వేషన్ చేసుకున్నట్లయితే రూ .72.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు లభిస్తుంది.స్పెసిఫికేషన్లుఎంజీ సైబర్స్టర్ 77 కిలోవాట్ల అల్ట్రా-థిన్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ పవర్ట్రెయిన్తో వచ్చే ఈ ఈవీ ఇది 510 పీఎస్, 725 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. లాంచ్ కంట్రోల్ మోడ్తో ఇది కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతేకాకుండా, బ్యాటరీ ప్యాక్ కేవలం 110 మిమీతో పరిమాణంతో పరిశ్రమలోనే స్లిమ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 580 కిలోమీటర్ల (ఎంఐడీసీ సర్టిఫైడ్) రేంజ్ను అందిస్తుంది.టాప్ స్పీడ్ఎంజీ సైబర్స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. రాజస్థాన్ లోని సాంబార్ సాల్ట్ లేక్ వద్ద గంటకు 0-100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. ఈ రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించాయి.ఎక్స్టీరియర్సైబర్స్టర్లో ఎలక్ట్రిక్ సిజర్ డోర్లు, సాఫ్ట్-టాప్ రూఫ్, సిగ్నేచర్ హెడ్ ల్యాంప్స్, కమ్బ్యాక్ రియర్, యాక్టివ్ ఏరో ఎలిమెంట్స్ ఉన్నాయి. విలక్షణమైన ఎల్ఈడీ లైటింగ్, షార్ప్ డీఆర్ఎల్స్, స్కిప్టెడ్ బానెట్తో కారు ముందు భాగాన్ని ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ఇక వెనుక భాగం ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ను కలిగి ఉంది. పిరెల్లి పి-జీరో టైర్లతో జతచేసిన 20-అంగుళాల తేలికపాటి అల్లాయ్ వీల్స్ మెరుగైన గ్రిప్, పనితీరు అందిస్తాయి.ఇంటీరియర్లోపలి భాగంలో ఎంజీ సైబర్స్టర్ ట్రిపుల్-డిస్ప్లే ఇంటర్ఫేస్తో డ్రైవర్-సెంట్రిక్ కాక్పిట్ను కలిగి ఉంది. ఇందులో సెంట్రల్ 10.25-అంగుళాల టచ్స్క్రీన్, రెండు 7-అంగుళాల డిజిటల్ ప్యానెల్స్ ఉన్నాయి. పీఎమ్ 2.5 ఫిల్టరేషన్ తో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, డ్రైవ్ మోడ్ ల కోసం స్టీరింగ్-మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్లతో తెలివైన పనితీరును మెరుగుపరుస్తుంది. వీటితో పాటు సస్టెయినబుల్ డైనమికా, ప్రీమియం వెజిటేరియన్ లెదర్ అప్హోలెస్టరీ, నాయిస్ కాంపన్సేషన్తో కూడాన బోస్ ఆడియో సిస్టమ్ హైలైట్ గా ఉన్నాయి.ఫీచర్లుఎంజీ సైబర్ స్టర్ అధిక-శక్తి హెచ్-ఆకారంలో ఉన్న పూర్తి క్రెడిల్ స్ట్రక్చర్, 1.83 స్టాటిక్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ (ఎస్ఎస్ఎఫ్) తో సురక్షితమైన డ్రైవ్ను అందిస్తుంది. రోల్ఓవర్ నిరోధకతను నిర్ధారిస్తుంది. ఇది లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఎడీఎఎస్), రియల్ టైమ్ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్, కాంబినేషన్ సైడ్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. -
రూ.10 వేల లోపు కేటగిరిలో మరో కొత్త స్మార్ట్ ఫోన్
రూ.10 వేల లోపు కేటగిరిలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. హెచ్డీ+ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ64 వాటర్ రెసిస్టెన్స్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎన్ఎఫ్సీ, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ తో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ వివో టీ4 లైట్, పోకో ఎం7, లావా స్టార్మ్ ప్లే ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 ధర.. లభ్యత ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ఫోన్ 4 జీబీ ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. దీని ధర రూ .6,799. ఐరిస్ బ్లూ, ట్విలైట్ గోల్డ్, టైటానియం సిల్వర్, స్లీక్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆగస్టు 2వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్పెసిఫికేషన్లుఇన్ఫినిక్స్ స్మార్ట్ 10లో 6.67 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.ఇది ఐపీ 64 వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది. అంటే ఫోన్పై దుమ్ము, నీటి చుక్కలు పడినా ఏమీ అవ్వదు కానీ నీటిలో పూర్తిగా మునిగిపోకుండా ఉండాలి.స్మార్ట్ 10 డీటీఎస్ ట్యూన్ చేసిన డ్యూయల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. 300% వాల్యూమ్ బూస్ట్ ను సపోర్ట్ చేస్తుంది.ఏ55 జీపీయూతో కూడిన యూనిసోక్ టీ7250 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఏడాది లాంచ్ అయిన ఇతర ఇన్ఫినిక్స్ ఫోన్ల మాదిరిగానే, ఈ స్మార్ట్ 10 ఆండ్రాయిడ్ 15 ఆధారిత కంపెనీ తాజా ఎక్స్ఓఎస్ 15 పై పనిచేస్తుంది.ఇందులో 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ను అందించారు. మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ ను 2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.ఆప్టిక్స్ విషయానికొస్తే, ఫోన్లలో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, వెనుక భాగంలో డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది. రియర్, ఫ్రంట్ కెమెరా రెండూ 2కే 30 ఎఫ్పీఎస్ వేగంతో వీడియోలను షూట్ చేయగలవు.15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. -
పతనం దిశగా మస్క్?
-
ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఇచ్చే క్రెడిట్ కార్డులు
క్రెడిట్ కార్డులు అనేవి ప్రస్తుతం ప్రతిఒక్కరికి దైనందిన జీవితంలో కనీస అవసరాలుగా మారిపోయాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అనేక రకాల క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డులు ఇప్పుడు పెద్దలకు మాత్రమే ఆర్థిక సాధనాలు కాదు.. విద్యార్థులలో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణంగా చాలా బ్యాంకులు నిరుద్యోగులు, సరైన క్రెడిట్ హిస్టరీ లేని వారికి క్రెడిట్ కార్డులు ఇవ్వవు. అయితే, విద్యార్థులు ఇందుకు మినహాయింపు.చదువుల కోసం కుటుంబాలకు దూరంగా ఉంటున్న యువత కోసం పలు బ్యాంకులు స్టూడెంట్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వివిధ బిల్లులు, కిరాణా సరుకులు లేదా రూం అద్దెలు వంటి చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది విద్యార్థులు రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి సహాయపడటమే కాకుండా మంచి క్రెడిట్ హిస్టరీని నిర్మించడానికి కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం ఏయే బ్యాంకులు విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి.. వీటిలో టాప్ ఐదు ఉత్తమ క్రెడిట్ కార్డుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఎస్బీఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. కార్డుపై ఖర్చు చేసిన ప్రతి రూ.100కు 1 రివార్డ్ పాయింట్, రూ.500 నుంచి రూ.3,000 మధ్య లావాదేవీలపై 2.5% ఫ్యూయల్ సర్చార్జ్ మినహాయింపు లభిస్తుంది. దీనితో పాటు, మీరు మీ ఇతర క్రెడిట్ కార్డుల బకాయి బిల్లులను ఈ ఎస్బీఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డుకు తక్కువ వడ్డీ రేటుతో బదిలీ చేయవచ్చు.ఐడీఎఫ్సీ ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ ఈ కార్డుకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు కాబట్టి ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ చెక్ కూడా ఉండదు. విద్యార్థులు ఎలాంటి ఆదాయ రుజువు లేకుండా ఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు 1,500 రెస్టారెంట్లలో 20% వరకు తగ్గింపును ఆస్వాదించవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ ఖర్చులపై 4 రెట్ల వరకు రివార్డులను పొందవచ్చు.కోటక్ 811 డ్రీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డు ఈ కార్డులో జాయినింగ్ లేదా వార్షిక రుసుము ఉండదు. ఇది ఆల్-ఇన్-వన్ క్రెడిట్ కార్డు. ఇది 48 రోజుల వరకు వడ్డీ లేని నగదు ఉపసంహరణలు, అన్ని కొనుగోళ్లపై రివార్డులు, మీ టర్మ్ డిపాజిట్ మొత్తంలో 90% వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది. ఇది జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డు. ఇది విద్యార్థులకు ఖర్చు లేని ఎంపిక.యాక్సిస్ బ్యాంక్ స్టూడెంట్స్ ఫారెక్స్ కార్డు ఇది విదేశీ కరెన్సీతో లోడ్ చేసిన ఫారెక్స్ కార్డు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం దీన్ని రూపొందించారు. మీరు సందర్శించే దేశం స్థానిక కరెన్సీలో సౌకర్యవంతంగా నగదును ఉపసంహరించుకోవచ్చు. ఒకే కార్డుపై 16 కరెన్సీలను లోడ్ చేయవచ్చు. లాక్-ఇన్ ఎక్స్ఛేంజ్ రేటు నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇది కరెన్సీ హెచ్చుతగ్గులపై ఎక్కువ ఖర్చు చేయకుండా నిరోధిస్తుంది.ఐసీఐసీఐ కోరల్ కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డు ఈ కార్డుతో బుక్ మైషో బుకింగ్స్, డైనింగ్, రైల్వే, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంధనం నింపిన ప్రతిసారీ ఫ్యూయల్ సర్ఛార్జ్పై 1% పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఇది చిప్, పిన్ సెక్యూరిటీతో వస్తుంది. ఇక్కడ మీరు మర్చంట్ అవుట్లెట్లలో లావాదేవీల కోసం టెర్మినల్పై మీ పిన్ నంబర్ నమోదు చేయాలి. -
గూగుల్ క్రోమ్కు సవాల్.. ఎన్విడియా ఏఐ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా వెబ్ బ్రౌజర్ల మార్కెట్ లీడర్గా కొనసాగుతున్న ఆల్ఫాబెట్కు చెందిన గూగుల్ క్రోమ్కు సవాల్ విసిరేందుకు టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్విడియాకు చెందిన పర్పెక్స్సిటీ ఏఐ సిద్ధమవుతోంది. త్వరలోనే కామెట్ పేరుతో ఏఐ ఆధారిత సామర్థ్యంగల వెబ్ బ్రౌజర్ను తీసుకురానుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్మార్కెట్.యూఎస్ అనే సంస్థ నివేదిక ప్రకారం 2024లో 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ల మార్కెట్.. 2034 నాటికి 76.8 బిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశం ఉంది. స్టాట్కౌంటర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి ప్రపంచ వెబ్ బ్రౌజర్ల మార్కెట్లో క్రోమ్ 68 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికం మంది యూజర్లు ఉపయోగిస్తున్న వెబ్ బ్రౌజర్గా మార్కెట్ను సుస్థిరం చేసుకొని ఇతర ప్రముఖ వెబ్ బ్రౌజర్లయిన సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ఫాక్స్కు అందనంత ఎత్తులో ఉంది.యూజర్లకు లభించేవి ఇవీ..సాధారణ బ్రౌజర్లతో పోలిస్తే ఏఐ ఆధారిత బ్రౌజర్లు యూజర్లు కోరిన కంటెంట్ను సంక్షిప్తంగా అందించగలవు. అలాగే టాస్క్లను ఆటోమేట్ చేయగలవు. ఉదాహరణకు ఈ–మెయిళ్లకు ఆటోమెటిక్గా రిప్లైలు పంపడం, సోషల్ మీడియా పోస్ట్లను షెడ్యూల్ చేయడం, దరఖాస్తుల్లోని డేటాను సంగ్రహించడం లాంటివి అన్నమాట.ముఖ్యంగా సందర్భానుసారంగా జవాబులు అందించగలవు. అంటే యూజర్లు అందించే ఇన్పుట్లు, డేటా హిస్టరీని పరిగణనలోకి తీసుకొని, వాటిని విశ్లేషించి జవాబులను అందించడం, వివిధ డేటా సోర్స్ల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నేరుగా సమాధానాలు ఇవ్వ డం చేయగలవు. అపాయింట్మెంట్ల బుకింగ్లు, ఉత్పత్తులను పోల్చడం వంటి సంక్లిష్ట పనులను కూడా చక్కబెట్టగలవు. -
రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. తీసుకోవాలా.. వద్దా?
ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏడాదికి రూ.75 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చింది.. తీసుకోవాలా.. వద్దా అని సందిగ్ధంలో ఉన్నానని ఇటీవల ఓ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతదేశంలో అధిక పన్ను కారణంగా ఈ ఆఫర్ను తాను స్వీకరిస్తానని ఖచ్చితంగా చెప్పలేనన్నారు.తాను ఇప్పటికే దాదాపు రూ.12 లక్షల పన్నులు చెల్లిస్తున్నానని, కొత్త జాబ్ ఆఫర్ స్వీకరిస్తే ఆ పన్ను మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ.22 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. ‘20 ఏళ్ల అనుభవంతో ప్రస్తుతం భారత్ లో ఏటా రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. ఈ మధ్యనే రూ.75 లక్షలకు ఆఫర్ వచ్చింది. ఇది గణనీయమైన పెరుగుదల అయినప్పటికీ, ప్రధానంగా పన్ను బాధ్యతలో విపరీతమైన పెరుగుదల కారణంగా దానిని అంగీకరించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం రూ.12 లక్షల వరకు పన్నులు చెల్లిస్తున్నాను. రూ .50 లక్షలకు పైగా ఆదాయంపై వర్తించే అదనపు 10% సర్ఛార్జ్ కారణంగా కొత్త ఆఫర్తో ఆ మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ .22 లక్షలకు చేరుకుంటుంది" అని యూజర్ రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు.ట్యాక్స్ ఎక్కువ కట్టేందుకు పనిచేయాలా?కొత్త వేతన నిర్మాణంలో పన్ను ఆదా చేసే అంశాలను చేర్చే వెసులుబాటు లేదని ఆయన అన్నారు. ‘కాబట్టి, నా టేక్-హోమ్ వేతనం సుమారు 50% పెరగవచ్చు, పన్ను భారం దాదాపు రెట్టింపు అవుతుంది. తక్కువ పన్ను లేదా అస్సలు చెల్లించని వారితో పోలిస్తే ఎటువంటి అదనపు స్పష్టమైన ప్రయోజనాలను పొందకుండా, ప్రభుత్వానికి ఎక్కువ పన్ను చెల్లించడానికి నేను ఎందుకు ఎక్కువగా కష్టపడాలి?" అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సదరు వ్యక్తికి వచ్చిన సందిగ్ధ పరిస్థితిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తూనే అభిప్రాయాలనూ వ్యక్తీకరించారు. నేరుగా ఉద్యోగంలో చేరకుండా కన్సల్టెంట్ గా పరిహారం అందుకుంటే పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకోవచ్చని, కానీ ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ చెల్లించడం ఇష్టం లేక వేతన పెంపు తీసుకోకపోవడం సరికాదంటూ ఓ యూజర్ సలహా ఇచ్చారు. ఇప్పుడొస్తున్న దానికంటే 50% ఎక్కువ జీతం వస్తున్నా కూడా ట్యాక్స్ పెరుగుతుంది కాబట్టి జాబ్ ఆఫర్ను వదులుకుంటాననడం మూర్ఖత్వం అని మరో వ్యక్తి పేర్కొన్నారు.దేశంలో ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ .4 లక్షల వరకు ఆదాయంపై సున్నా పన్ను ఆ తర్వాత 5% నుండి 30% వరకు పన్ను రేట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు (వేతన జీవులకు రూ.12.75 లక్షలు) అధిక రిబేట్, స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పాత విధానం ఎంచుకునేవారికి 80సీ, హెచ్ఆర్ఏ వంటి సెక్షన్ల కింద మినహాయింపులు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్ ఛార్జీలు వర్తిస్తాయి.👉 ఇదీ చదవండి: ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే! -
రియల్టీ కంపెనీలలో వాటా విక్రయం.. 2 కోట్ల షేర్లు అమ్మేసిన ఇన్వెస్కో
దేశీ రియల్టీ రంగ కంపెనీలు ఒబెరాయ్ రియల్టీ, లోధా డెవలపర్స్లో యూఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్కో తాజాగా 2 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఒబెరాయ్ రియల్టీలో 2.95 శాతం వాటాకు సమానమైన కోటికిపైగా షేర్లను అమ్మివేసింది.బీఎస్ఈ బల్క్డీల్ వివరాల ప్రకారం అనుబంధ సంస్థ ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ షేరుకి రూ. 1,754.26 ధరలో వీటిని విక్రయించింది. తద్వారా రూ. 1,883 కోట్లకు అందుకుంది. 2025 జూన్కల్లా ఇన్వెస్కో ఫండ్కు ఒబెరాయ్ రియల్టీలో 3.01 శాతం వాటా ఉంది. కాగా.. ఈ బాటలో లోధా డెవలపర్స్లోనూ 1 శాతం వాటాకు సమానమైన 95.25 లక్షల షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్డీల్ ప్రకారం షేరుకి రూ. 1384.93 ధరలో అమ్మివేయడం ద్వారా రూ. 1,319 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఎస్బీఐ ఫండ్ కొనుగోలు ఒబెరాయ్ రియల్టీలో 1.13% వాటాకు సమానమైన 40.94 లక్షల షేర్లను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సొంతం చేసుకుంది. షేరుకి రూ. 1,754.10 సగటు ధరలో రూ. 718.2 కోట్లకు కొనుగోలు చేసింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఇదేవిధంగా ఎన్ఎస్ ఈ గణాంకాల ప్రకారం లోధా డెవలపర్స్ షేర్ల కొనుగోలుదారుల వివరాలు సైతం వెల్లడికాలేదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడేసిన ఐటీ, రియల్టీ షేర్లు
ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఈఎక్స్, కోఫోర్జ్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ జూన్ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు స్పందించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 542.47 పాయింట్లు (0.66 శాతం) క్షీణించి 82,184.17 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 157.8 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 25,062.1 వద్ద ముగిశాయి.ఎటర్నల్ (జొమాటో), టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టైటాన్ షేర్లు టాప్ గెయినర్స్గా లాభపడగా, ట్రెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ వరుసగా 0.58 శాతం, 1.09 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 2.21 శాతం, నిఫ్టీ రియల్టీ 1.04 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 1.24 శాతం, నిఫ్టీ ఫార్మా 0.55 శాతం లాభపడ్డాయి. -
సరికొత్తగా రెనో ట్రైబర్...
ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం రెనో సరికొత్త ‘ఆల్–న్యూ రెనో ట్రైబర్’ను లాంచ్ చేసింది. ఈ కొత్త ట్రైబర్లో దాని ప్రత్యేకమైన 7 సీటర్ కెపాసిటీని, సీట్లను మార్చుకునే వెసులుబాటును అలాగే ఉంచుతూ డిజైన్, ఫీచర్లలో పలు మార్పులు తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.6.29 లక్షలుగా ఉంది.ఈ సందర్భంగా రెనో ఇండియా ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. భారత్లో ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థ మెరుగైన వృద్ధి సాధించిన తర్వాతే మార్కెట్లోకి ఈవీ ఉత్పత్తులను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్, నిబంధనలు, ఎకో సిస్టమ్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. సరైన సమయంలో ఈవీలను ఆవిష్కరిస్తామన్నారు.డిజైన్లో చేసిన మార్పులు ఎక్స్టీరియర్ నుంచే కనిపిస్తున్నాయి. ఫేస్లిఫ్టెడ్ ట్రైబర్ పూర్తిగా పునరుద్ధరించిన ఫ్రంట్ ఫేస్ను కలిగి ఉంది. వర్టికల్ స్లాట్లను కలిగి ఉన్న గ్లాస్ బ్లాక్ గ్రిల్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్ల్యాంప్లలోకి అనుసంధానమై ఉంటుంది.ఫ్రంట్ బంపర్ను కూడా పూర్తీగా మార్చేశారు. సిల్వర్ యాక్సెంట్లతో పెద్ద ఎయిర్ డ్యామ్, రీపోజిషన్ చేసిన ఫాగ్ ల్యాంప్లు, వర్టికల్ ఎయిర్ ఇన్లెట్లను కలిగి ఉంటుంది.కొత్త ట్రైబర్లో రెనాల్ట్ సొగసైన 2డీ డైమండ్ లోగోను తీసుకొచ్చారు. స్టైలిష్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, గ్లాస్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, పూర్తిగా నల్లటి రూఫ్ను పొందుతుంది. వెనుక భాగంలో, టెయిల్గేట్లో స్లీకర్ ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్లు, గ్లాస్ బ్లాక్ ట్రిమ్ ప్యానెల్, 'TRIBER' లెటరింగ్, రీడిజైన్ చేసిన బంపర్ ఉన్నాయి.లోపల, క్యాబిన్ పాత బ్లాక్ అండ్ సిల్వర్ లేఅవుట్ స్థానంలో ఇప్పుడు ఫ్రెష్ గ్రే అండ్ బీజ్ థీమ్ను కలిగి ఉంది. నవీకరించిన డాష్బోర్డ్ డిజైన్లో 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఉంది. ఏసీ వెంట్స్ కింద ఇచ్చారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్లైట్లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఫేస్లిఫ్టెడ్ ట్రైబర్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్బ్యాగ్లను ప్రామాణికంగా అందిస్తుంది. -
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ద్వారా ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి ఏదో క్రాష్ రాబోతోందని హెచ్చరించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ సహా అసెట్ క్లాసుల్లో బుడగలు పేలబోతున్నాయంటూ ఈ 78 ఏళ్ల ఇన్వెస్టర్, ఎంట్రాప్రెన్యూర్ సంకేతాలిచ్చారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో రాబర్ట్ కియోసాకి ఒక పోస్ట్ చేశారు. "బుడగలు పేలడం ప్రారంభించాయి.. బుడగలు పేలినప్పుడు బంగారం, వెండి, బిట్ కాయిన్ కూడా పతనమవుతాయి. గుడ్ న్యూస్’ అంటూ రాసుకొచ్చారు.క్రాష్ అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ రానున్న పతనాన్ని కొనుగోలు అవకాశంగా కియోసాకి పేర్కొన్నారు. ధరలు పడిపోతే తాను బంగారం, వెండి, బిట్ కాయిన్లలో ఎక్కువ పెట్టుబడి పెడతానని చెప్పుకొచ్చారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్తమ సమయం ధరలు తక్కువగా ఉన్నప్పుడు, భయం ఎక్కువగా ఉన్నప్పుడు అని ఆయన వివరించారు.BUBBLES are about to start BUSTING.When bubbles bust odds are gold, silver, and Bitcoin will bust too.Good news.If prices of gold, silver, and Bitcoin crash…. I will be buying.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) July 21, 2025 -
ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!
దేశంలో ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సీజన్ నడుస్తోంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడం భారతీయ పన్ను చెల్లింపుదారులందరికీ కీలకమైన బాధ్యత. అన్ని ఆదాయ మార్గాలను ప్రకటించడం, అర్హత వ్యయాలను మినహాయించడం, పన్ను బాధ్యతలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడంతో పాటు పన్ను చట్టాలను పాటించడం అవసరం.ఐటీఆర్ దాఖలుకు కొత్త డెడ్లైన్2024–25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025–26) నాన్ ఆడిట్ పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి సాధారణంగా జూలై 31 వరకూ గుడువు ఉంటుంది. అయితే ఈసారి గడువును 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఒకవేళ గడువు దాటితే ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి 2025 డిసెంబర్ 31లోగా లేట్ రిటర్న్ దాఖలు చేయవచ్చు.గడువు దాటిపోతే పర్యవసానాలుఐటీఆర్ దాఖలు చేయకుండా గడువు దాటిపోతే సెక్షన్ 234ఏ కింద తీవ్రమైన జరిమానాలు, అభియోగాలు, సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.వడ్డీ: గడువు తర్వాత మీరు మీ రిటర్న్ సబ్మిట్ చేస్తే, సెక్షన్ 234ఎ కింద చెల్లించని పన్ను మొత్తంపై నెలకు 1% లేదా ఒక నెలలో కొంత భాగం వడ్డీ చెల్లించాలి.ఆలస్య రుసుము: సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము వసూలు చేస్తారు. రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉంటే రూ.5,000, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.1,000 ఆలస్య రుసుము వసూలు చేస్తారు.నష్టాల సర్దుబాటు: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇళ్లు లేదా మీ వ్యాపారాల నుండి మీకు నష్టాలు వచ్చి ఉంటే వాటిని మరుసటి సంవత్సరం మీ ఆదాయానికి వ్యతిరేకంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల తరువాతి సంవత్సరాలలో మీరు చెల్లించాల్సిన పన్ను గణనీయంగా తగ్గుతుంది. అయితే గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఈ నష్టాలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉండదు.👉 ఇదీ చదవండి: రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. అంత ట్యాక్స్ కట్టి అవసరమా? -
2 రోజుల్లో రూ.2 వేల కోట్లు.. ‘క్విక్’ కుబేరుడు!
ఎటర్నల్ (జొమాటో) వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) నికర సంపద అమాంతం పెరిగిపోయింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.2,000 కోట్లు పెరిగింది. ఎటర్నల్ క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ లో కనిపించిన గణనీయమైన వృద్ధిని ఇన్వెస్టర్లు స్వాగతించడంతో, ఎటర్నల్ షేర్లు రెండు రోజుల్లో 21 శాతానికి పైగా పెరిగాయి. ఎన్ఎస్ఈలో తాజా ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ .311.60 ను కూడా తాకాయి.సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అయిన 42 ఏళ్ల దీపిందర్ గోయల్ ఎటర్నల్ కంపెనీలో తనకున్న 3.83 శాతం వాటా కారణంగా కొత్తతరం కంపెనీలో తన వాటా విలువ రూ.11,515 కోట్లకు పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఐఐటీయన్ నికర సంపద 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది.విప్రో, టాటా మోటార్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల కంటే ఎటర్నల్ షేర్లు రూ.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును దాటాయి. ఎటర్నల్ షేర్ల జోరు ప్రత్యర్థి స్విగ్గీపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఆరోజు ఆ కంపెనీ షేరు 7 శాతానికి పైగా పెరిగింది.నెట్ ఆర్డర్ వ్యాల్యూ (ఎన్ఓవీ) పరంగా బ్లింకిట్ ఇప్పుడు జొమాటో కంటే పెద్దది కావడంతో టాప్ బ్రోకరేజీ సంస్థలు ఇప్పుడు రూ.400పై దృష్టి సారించాయి. రూ.400 టార్గెట్ ధరతో ఎటర్నల్ను బైకి అప్ గ్రేడ్ చేస్తూ జెఫరీస్ అత్యంత దూకుడుగా వ్యవహరించింది. పోటీ ముప్పును అతిగా అంచనా వేసినట్లు కూడా అంగీకరించింది.దీపిందర్ గురించి..పంజాబ్లోని ముక్త్సర్లో 1983 జనవరి 26న జన్మించిన దీపిందర్ గోయల్.. ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్లో బీటెక్ పూర్తి చేశారు. 2008లో ఫుడీబే (Foodiebay) అనే వెబ్సైట్తో ప్రారంభమైన ఆయన వ్యాపార ప్రయాణం, తర్వాత జొమాటోగా (Zomato)గా మారింది. దీపిందర్ వ్యూహాత్మక నిర్ణయాలతో జొమాటో దేశ విదేశాల్లో విస్తరించింది. 2022లో బ్లింకిట్ (Blinkit) అనే క్విక్ కామర్స్ సంస్థను కొనుగోలు చేసి, ఆ రంగంలోనూ తన ఆధిపత్యాన్ని చూపించారు. 2025లో జొమాటో పేరును ఎటర్నల్ లిమిటెడ్ (Eternal Limited)గా మార్చారు. -
2032 నాటికి 226 విమానాలు..
విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ భారీ విస్తరణ ప్రణాళికల్లో ఉంది. 2032 నాటికి 226 విమానాలను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్షికంగా సర్వీసుల సామర్థ్యాన్ని 25–30 శాతం మేర పెంచుకోవాలని నిర్దేశించుకుంది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుర్ గోయల్ ఈ విషయాలు తెలిపారు.2022 ఆగస్టులో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ దేశీయంగా 23, అంతర్జాతీయంగా 5 గమ్యస్థానాలకు ఫ్లైట్లు నడుపుతోంది. కంపెనీ దగ్గర ప్రస్తుతం 30 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో అయిదు కొత్త విమానాలు జత కానున్నాయి. త్వరలోనే వ్యయాలను మరింతగా తగ్గించుకుని, లాభాల్లోకి మళ్లగలమని అంకుర్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎయిర్లైన్ మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో 49% పెరుగుదలను నమోదు చేసింది . పరిశ్రమ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆకాశ ఎయిర్ ఏఎస్కే (అవెలబుల్ సీట్ కిలోమీటర్స్)కి యూనిట్ ఖర్చును (ఇంధనం మినహా) 7% తగ్గించగలిగింది. అయితే ఎబిటార్ (Ebitdar) మార్జిన్లు 50% పెరిగాయి. వడ్డీ, పన్నులు , తరుగుదల, రుణ విమోచన, అద్దె ఖర్చులు మినహాయించక ముందు ఆదాయాలను ఎబిటార్ సూచిస్తుంది. విమానయాన పరిశ్రమలో కార్యాచరణ పనితీరుకు కీలకమైన కొలమానంగా దీన్ని చూస్తారు. -
టీసీఎస్ కూడా అంతేనా? కేంద్రానికి ఉద్యోగుల ఫిర్యాదు
ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి ఉద్యోగంలోకి చేర్చుకోకుండా తిప్పలు పెడుతోందంటూ దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్పై ఐటీ ఉద్యోగుల సంఘం ఆ మధ్య కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా ఇలాగే చేస్తోందని ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.600 మందికి పైగా అనుభవజ్ఞులైన ఉద్యోగుల లేటరల్ నియామకాల్లో టీసీఎస్ జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది. ఈ ఆన్బోర్డింగ్ టైమ్లైన్పై ఎటువంటి కమ్యూనికేషన్ లేదని, దీంతో చాలా మంది టెక్కీలు ఇబ్బంది పడుతున్నారని మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది.ఆన్ బోర్డింగ్ ప్రక్రియల్లో ఈ 'నిరవధిక జాప్యం' ప్రభావాన్ని ఎత్తిచూపుతూ కార్మిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని ఎన్ఐటీఈఎస్ కోరింది. అధికారిక ఆఫర్ లెటర్ ఉన్నప్పటికీ ఉద్యోగంలో చేర్చుకోకపోవడం ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ప్రభావితమైనవారిలో రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల అనుభవం ఉన్న వారు ఉన్నారని లేఖలో తెలిపింది. ఈ ఉద్యోగులు తమ మునుపటి సంస్థకు అధికారికంగా రాజీనామా చేశారని, ప్రస్తుతం వీరు ఇటు టీసీఎస్ ఉద్యోగంలో చేర్చుకోకపోవడం, వేరే ఉద్యోగమూ లేకపోవడంతో ఈఎంఐలు, అద్దెలు, వాయిదాలు చెల్లించడం కష్టమవుతోంది. దీనిపై టీసీఎస్ ఏమంటోందంటే..ఆఫర్ లెటర్ అందుకున్న ప్రతి ఒక్కరినీ ఆన్బోర్డ్ చేస్తామని టీసీఎస్ పునరుద్ఘాటిస్తోంది. ‘ఫ్రెషర్స్ లేదా అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఇచ్చిన అన్ని ఆఫర్లను గౌరవించడానికి టీసీఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మేము ధృవీకరించగలము. టీసీఎస్ నుంచి ఆఫర్ వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆన్బోర్డ్ చేస్తాం. వ్యాపార డిమాండ్ ప్రకారం జాయినింగ్ తేదీలు నిర్ణయించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, అవి వ్యాపార అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంటాం. ఈ సందర్భాల్లో అభ్యర్థులందరితో నిరంతరం టచ్ లో ఉంటామని, వారిని త్వరలోనే సంస్థలో చేర్చుకునేందుకు చూస్తుంటాం’ అని కంపెనీ తెలిపింది.ఆలస్యమైన అభ్యర్థుల ఆన్బోర్డింగ్కు సంబంధించి స్పష్టమైన కాలపరిమితి కోసం టీసీఎస్పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఎన్ఐటీఈఎస్ అధికారికంగా కార్మిక మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. వెయిటింగ్ పీరియడ్ కు ఆర్థిక పరిహారం, టీసీఎస్ ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఈఏపీ) ద్వారా మానసిక ఆరోగ్య మద్దతుకు ప్రాప్యత, బాధితులకు కంపెనీలో ప్రత్యామ్నాయ పాత్రలను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఐటీఈఎస్ డిమాండ్ చేస్తోంది.👉 ఇదీ చదవండి: ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం -
హైదరాబాద్ కంపెనీ.. రూ.1,000 కోట్ల పెట్టుబడులు
గ్లాస్ కంటైనర్ల తయారీ సంస్థ ఏజీఐ గ్రీన్ప్యాక్ సంస్థ కొత్తగా అల్యూమినియం క్యాన్ల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్లో కొత్త ప్లాంటుపై రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. రెండు దశలుగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ సీఎండీ సందీప్ సోమానీ తెలిపారు.ఇది తొలుత 95 కోట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 2028 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అందుబాటులోకి రాగలదని చెప్పారు. దీన్ని 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 160 కోట్లకు పెంచుకోనున్నట్లు సందీప్ తెలిపారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత క్యూ1తో పోలిస్తే 41%పెరిగి రూ. 63 కోట్ల నుంచి రూ. 89 కోట్లకు చేరింది.మెరిల్లో ఏడీఐఏ 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులుఅబుదాబీ ఇన్వెస్ట్మెంట్ ఆథారిటీ(ఏడీఐఏ), భారత్కు చెందిన మెడికల్ డివైజెస్ తయారీ సంస్థ మైక్రో లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(మెరిల్)లో 200 మిలియన్ డాలర్ల(రూ.1,670 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడితో మెరిల్లో ఏడీఐఏకు 3% వాటా లభించనుంది.తద్వారా మెరిల్ మార్కెట్ విలువ 6.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.56,859 కోట్లు)చేరుతుందని అంచనా. పెట్టుబడి నిధులను వ్యాపార విస్తరణ, పరిశోధన–అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలకు వినియోగించుకుంటామని మెరిల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భట్ తెలిపారు. గుజరాత్లోని వాపి కేంద్రంగా పనిచేసే మెరిల్ సంస్థ... గుండె సంబంధిత పరికరాలు, సర్జికల్ రోబోటిక్స్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు వంటి వైద్య పరికరాలు తయారు చేస్తుంది. -
ఐకియా ఇండియా కొత్త సీఈవోగా ప్యాట్రిక్ ఆంటోనీ
హోమ్ ఫర్నిషింగ్స్ దిగ్గజం ఐకియా ఇండియా కొత్త సీఈవోగా ప్యాట్రిక్ ఆంటోనీ నియమితులయ్యారు. ఆగస్టు నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. కంట్రీ రిటైల్ మేనేజర్, చీఫ్ సస్టైనబిలిటీ మేనేజర్గా (సీఎస్వో) కూడా ఆయన వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది.ప్రస్తుత కంట్రీ రిటైల్ మేనేజర్, సీఎస్వో సుసాన్ పల్వరర్ రాజీనామా చేయడంతో ఆంటోనీ నియమితులయ్యారు. ఐకియాలో సుసాన్ సుమారు 28 ఏళ్లు పనిచేశారు. అయిదేళ్ల పాటు డిప్యుటీ సీఈవోగా కూడా వ్యవహరించారు. 2018లో హైదరాబాద్లో తొలి స్టోర్ ప్రారంభించిన ఐకియా ప్రస్తుతం రెండో విడత విస్తరణపై దృష్టి పెడుతోంది. -
ఎంజీ ఎం9 ఈవీ లాంచ్.. 548 కి.మీ.రేంజ్
జెఎస్బ్ల్యు-ఎంజీ మోటార్ ఇండియా ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీని అధికారికంగా లాంచ్ చేసింది. భారత్లో రూ .69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభించే ఈ మోడల్ను రూ.1 లక్ష చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.ఎంజీ సెలెక్ట్ చైన్ ఆఫ్ డీలర్ షిప్ ల ద్వారా విక్రయించే కొత్త ఎం9 ఈవీ డెలివరీలు ఆగస్టు 10 న ప్రారంభం కానున్నాయి. కియా కార్నివాల్, టయోటా వెల్ ఫైర్ లకు పోటీగా వస్తున్న ఈ ఈవీలో 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ తో 241 బీహెచ్పీ, 350 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. 548 కిలోమీటర్ల (ఎంఐడిసి సైకిల్) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఎంజీ ఎం9 ఈవీ ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే లెవల్ 2 ఏడీఏఎస్ సూట్, ఎలక్ట్రిక్ స్లైడింగ్ రియర్ డోర్లు, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన 16-వే అడ్జస్టబుల్ సెకండ్-లైన్ సీట్లు, పవర్డ్ బాస్ మోడ్, డ్రైవర్, ప్యాసింజర్ కోసం వెల్ కమ్ సీట్ ఫంక్షన్, ఏడు ఎయిర్ బ్యాగులు, ఆటో హోల్డ్ తో కూడిన ఈపీబీ, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్, ఏడు అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే, 13-స్పీకర్ జేబీఎల్ మ్యూజిక్ సిస్టమ్ 360 డిగ్రీల కెమెరా, డ్రైవ్ మోడ్స్ (ఎకో, నార్మల్, స్పోర్ట్) వంటివి ఉన్నాయి. -
అవీవా కొత్త పాలసీ.. బాల వికాస్ యోజన
న్యూఢిల్లీ: అవీవా ఇండియా నూతనంగా అవీవా భారత్ బాల వికాస్ యోజన పేరుతో బీమా ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది ఈక్విటీ మార్కెట్తో సంబంధం లేని, నాన్ పార్టిసిపేటింగ్ జీవిత బీమా ప్లాన్. తమ పిల్లల భవిష్యత్ భద్రతకు ఇది భరోసానిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రీమియం నెలకు రూ.1,000 నుంచి మొదలవుతుంది.జీవిత బీమా రక్షణకుతోడు హామీతో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. 3 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు పరిధిలోని వారు.. 12–30 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. గరిష్ట కాల వ్యవధి పాలసీదారుడికి 80 ఏళ్ల వరకు ఉంటుంది.నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధ సంవత్సరం లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లింపు ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. గ్యారంటీడ్ సమ్ అష్యూర్డ్ పేరుతో కాల వ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే ప్రయోజనం పిల్లల భవిష్యత్ అవసరాలకు ఆర్థిక భరోసానిస్తుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వినీత్ కపాహి తెలిపారు. -
వారెన్ బఫెట్ ప్రకారం.. ఆ 5 తప్పులివే...
అమెరికాకు చెందిన వారెన్ బఫెట్, ప్రపంచంలోని అత్యాధునిక అత్యంత తెలివైన పెట్టుబడిదారుల్లో ఒకరు. ఆయన గురించి తెలియని విద్యావంతులు ఉంటారేమో కానీ ఆర్ధికవేత్తలు ఉండరు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాలపై ఆయన తరచుగా చెప్పే సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు ఓ రకంగా పాఠాల లాంటివే నని చెప్పాలి. సంపన్నులు కాలేకపోయిన మధ్య తరగతి జీవులు తరచుగా చేసే తప్పుల గురించి ఆయన చెప్పిన కొన్ని విషయాలివి...కొత్త కారు...పెద్ద వృధా..చాలా మంది తమ స్థాయి మెరుగుపరచడం కోసం కాకుండా మెరుగైందని చెప్పుకోవడం కోసం ఎక్కువ ఆరాట పడతారు. అలాంటి వారికి బఫెట్ చెబుతున్న సలహా ఏమిటంటే...కొత్త కారు షోరూం నుంచి బయటకి తీసుకొచ్చిన రెండో నిమిషం నుంచే విలువ తగ్గిపోవడం మొదలవుతుంది, ఐదు సంవత్సరాల్లో దాని విలువ 60% వరకు కోల్పోతుంది. వేల కోట్ల ఆస్తులున్న బఫెట్ 2014 మోడల్ క్యాడిల్లాక్ ఎక్స్టిఎస్ ను వినియోగిస్తుంటారు. అదీ జనరల్ మోటార్స్ వాళ్లు భారీ డిస్కౌంట్ ధరపై ఇస్తేనే కొనుగోలు చేశారు. ఆయనేమంటారంటే... ‘‘కారును ఒక విజయంలా కాదు, ఒక ప్రయాణ మార్గంగా మాత్రమే చూడాలి’’.క్రెడిట్ కార్డ్ ఓ వల...బహుశా భారతదేశంలో ఇప్పుడు క్రెడిట్ కార్డు గురించి తెలియని వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో కానీ... క్రెడిట్ కార్డ్ వల్ల వచ్చే నష్టాలు మాత్రం లెక్కలేనన్ని అంటున్నారు బఫెట్.. దాని అప్పులపై అత్యధికంగా 30% వడ్డీ చెలించాల్సి వుంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష తీసుకుంటే రూ.30 వేల దాకా వార్షిక వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ‘‘మీరు తెలివిగా ఉంటే, అప్పు బాధ వదిలిపోవచ్చు’’ అంటారాయన. క్రెడిట్ కార్డ్ను అత్యవసర సమయాల్లో ఉపకరించేదిగా మాత్రమే చూడాలి తప్ప అత్యధిక వ్యయానికి అవకాశంగా చూడకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు.లాటరీ, జూదం రెండూ ప్రమాదమే..జూదం, లాటరీలను ‘‘మ్యాథ్ ట్యాక్స్’’ అని పేర్కొంటారు బఫెట్, అంటే మ్యాథమేటిక్స్, లాజిక్ తెలియని వారికి వడ్డించే అదనపు పన్ను అని అర్ధం. ఇవి వ్యక్తుల్ని వారి మేధా శక్తిని నిర్వీర్యం చేసి చివరకు అదృష్టం మీద ఆధారపడే దుస్థితికి చేరుస్తుందని ఆయన అంటున్నారు.ఇల్లు...అవసరమా? విజయమా?అవసరానికి ఇల్లు కొనవచ్చు. అయితే అవసరానికి మించి పెద్ద ఇల్లు ఉంటే అది నష్టమే అంటున్నారు బఫెట్. ఆయన తాను 1958లో కొనుక్కున్న పాత ఇంటిలోనే ఆయన ఇప్పటికీ జీవిస్తున్నారు. ఇల్లు జీవించడానికి రెండు పడకగదుల ఇల్లు సరిపోయేవారు 4 పడక గదుల ఇల్లు కొనడం అంటే రూ.లక్షలు ఏటా వృధా చేస్తున్నట్టే వారికి పన్నులు, నిర్వహణ, సిబ్బంది ఖర్చులు, మెయిన్టెనెన్స్ అన్నీ డబుల్ అవుతాయి. కాబట్టి ఇల్లు కొనుగోలులో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని సూచిస్తున్నారాయన.అవగాహన లేని చోట ఎప్పుడూ పెట్టుబడి పెట్టవద్దుమనకు ఉన్న అదనపు సొమ్మును లాభాల కోసం రకరకాల మార్గాల్లో పెట్టుబడులుగా మార్చడం సరైనదే. అయితే మనం దేనిలో పెట్టుబడి పెడుతున్నాం? అనేది పూర్తి అవగాహన ఉండాలి. అలా కాకుండా ఏ మాత్రం తెలియని వ్యాపారం, రంగంలో పెట్టుబడి పెడితే... అది ఎప్పటికైనా నష్టాలే తెస్తుంది. ముందు పొదుపు చెయ్యి, ఆ తర్వాత ఖర్చు చెయ్యి తెలివిగా ఇన్వెస్ట్ చెయ్యి...అంటూ సూత్రీకరించే బఫెట్.. మనకు.వందల వేల కోట్ల ఆస్తులున్నా సరే.. ఆర్ధిక భధ్రత కోసం రెండే రూల్స్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అవి 1. ఎప్పుడూ డబ్బును నష్టపోవద్దు. 2.మొదటి రూల్ని ఎప్పటికీ మరచిపోవద్దు. -
మెడికల్.. ఇన్సూరెన్సూ.. సెక్షన్ 80 మినహాయింపులు
ఈ వారం సెక్షన్ 80లో పొందుపర్చిన అంశాలు... వైద్యానికి సంబంధించిన మినహాయింపులు గురించి తెలుసుకుందాం. ముఖ్య విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా కేవలం పాత పద్ధతిని అనుసరించిన వారికే మాత్రమే వర్తిస్తాయి.80డీ – మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ సెక్షన్ వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి తన కోసం, జీవిత భాగస్వామి కోసం తన మీద ఆధారపడ్డ పిల్లల కోసం చెల్లించే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 పరిమితిని మించి మినహాయింపు ఇవ్వరు. తల్లిదండ్రులు 60 సంవత్సరాల లోపు వారయితే అదనంగా రూ.25,000 వారి నిమిత్తం చెల్లించే ప్రీమియంలపై, మొత్తం మీద రూ.50,000 మినహాయింపు ఇస్తారు. కుటుంబంలో ఏ వ్యక్తి చెల్లిస్తాడో... ఆ వ్యక్తి ఇన్కంలోంచి మినహాయింపు ఇస్తారు. ఇతరులకు ఇవ్వరు. నగదులో చెల్లించిన ప్రీమియంలకు మినహాయింపు దొరకదు. చెక్కు ద్వారా, డీడీ ద్వారా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.వ్యక్తి, అతని తల్లిదండ్రులు.. అందరూ 60 సంవత్సరాల్లోపు ఉంటే మొత్తం రూ.50వేలు, వ్యక్తి 60 సంవత్సరాల్లోపు ఉండి, తల్లిదండ్రులు అరవై ఏళ్లు దాటిన వారు అయితే రూ.25,000 కాకుండా అదనంగా రూ.50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వ్యక్తి, తల్లిదండ్రులు 60 ఏళ్లు దాటితే రూ.50వేలు + 50వేలు = మొత్తం రూ. 1,00,000 ఇస్తారు. ఇవన్నీ కాకుండా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ నిమిత్తం రూ.50 వేలు ఖర్చు పెట్టొచ్చు. ఈ మేరకు నగదు చెల్లించవచ్చు. కానీ ఖర్చు మొత్తం గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది. రెండో అంశం 80డీడీ ఒక వ్యక్తి మీద ఆధారపడ్డ మనిషి దివ్యాంగుడైతే, అతని వైద్యం నిమిత్తం చేసిన ఖర్చులకు మినహాయింపు ఉంది. ఈ అంగవైకల్యాన్ని శాతాల్లో చెప్పాలంటే ... 40% లోపల ఉంటే రూ.75,000; 80 శాతానికిపైన ఉంటే రూ.1.25 లక్షల మినహాయింపు ఉంటుంది. వైద్య ఖర్చులే కాకుండా, ఈ వ్యక్తుల మీద చేసిన జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు కూడా వర్తిస్తుంది. వైద్య ఖర్చులు, నర్సింగ్, పునరావాస నిమిత్తం మొదలైనవి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. మానసిక, చెవుడు, బుద్ధి మాంద్యం, మస్తిష్క పక్షవాతం, ఆటిజం, గుడ్డితనం, చూపుతక్కువ, లోకోమోటర్ వైకల్యం (అవయవాలు లేదా శరీరభాగాలు కదలికలకు సంబంధించింది) కుష్టు వ్యాధి మొదలైన వాటికి మినహాయింపు ఉంది. ఫారం 101ఏ జతపరచాలి. వైద్య అధికారులు సర్టిఫై చేయాలి.ఇది కాకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంగవైకల్యం మారుతూ ఉంటుంది. తేడాలు వస్తాయి. సర్టిఫికెట్లలో ధృవీకరించిన శాతాన్ని బట్టే మినహాయింపు ఉంటుంది. దివ్యాంగుడు ముందుగా మరణిస్తే, స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని, ఏ వ్యక్తి అకౌంటులోకి వస్తుందో, ఆ వ్యక్తి ఆదాయంలో కలుపుతారు. దివ్యాంగుడు జీవించి ఉన్నప్పుడు, 60 సంవత్సరాలు తర్వాత వచ్చే యాన్యుటీకి మినహాయింపు ఉంది. ఈ సెక్షన్లో మినహాయింపును తీసుకున్న వ్యక్తి, ఈ ప్రయోజనాన్ని సెక్షన్ 80యూ ప్రకారం పొందకూడదు. 80 డీడీబీదీని ప్రకారం వ్యక్తి తన కోసం లేదా తన మీద ఆధారపడిన వ్యక్తి నిర్దేశిత జబ్బుల చికిత్సకు అయిన ఖర్చు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి రూ.40 వేలు (60 ఏళ్ల లోపల) రూ.1,00,000 సీనియర్ సిటిజన్లకు తగ్గిస్తారు. 11 డీడీ రూల్ ప్రకారం క్లెయిమ్ చెయ్యాలి. న్యూరాలజిస్ట్, అంకాలజిస్ట్, యూరాలాజిస్ట్, హెమొటాలాజిస్ట్, ఇమ్యూనోలాజిస్ట్, మొదలైన స్పెషలిస్టులు ధృవీకరించాలి. పూర్తి వివరాలు ఇవ్వాలి. సంతకం కచ్చితంగా ఉండాలి. అసెస్సీతో సంబంధం లేకుండా పేషెంటు వయస్సుని బట్టి మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు రూ.1 లక్ష దాకా, ఇతరులకు రూ.40,000 ఇస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినట్లయితే ఆ విలువ మేరకు మినహాయిపు తగ్గుతుంది. చివరిగా మరొకటి.. 80యూదీని ప్రకారం మినహాయింపు. మెడికల్ ఆధారిటీతో సర్టిఫై చేయిస్తే అంగవైకల్యం 40% దాటి ఉంటే రూ.75 వేలు, 80% దాటి ఉంటే రూ.1.25 లక్షల మినహాయింపు ఇస్తారు. ఫారం 101ఏ ఫైల్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లోని సివిల్ సర్జన్లు/ చీఫ్ మెడికల్ అధికారి సర్టిఫై చేయాలి. అంగవైకల్యం సర్టిఫికెట్ కొత్తది జతపర్చాలి. అంధత్వం, కుష్టు, చెవుడు, మానసిక వైకల్యం, మానసిక మాంద్యం... వీటి విషయంలోనే ఇస్తారు. డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు.చివరగా హెచ్చరిక ఏమిటంటే.. సరైన ధృవపత్రాలుండాలి. నకిలీ డాక్టర్లు, నకిలీ పత్రాలు వద్దు. అన్నింటికి రికార్డు స్పష్టంగా ఉండాలి.