-
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్స్టా పోస్ట్, వీడియో వైరల్
కన్నడ బుల్లితెర నటి పవిత్రా జయరామ్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను సహోద్యోగులు,అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రినయని తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో జవిత్ర జయరామ్ చందర్ చివరి ఇన్స్టా పోస్ట్ ఒకటి వైరల్ మారింది. నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్ నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.త్రినయని సీరియల్లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్ని చేస్తూ ఆమె చివరి ఇన్స్టా పోస్ట్ ఇది. "నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నన్ను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా" అని క్యాప్షన్ ఉన్న పోస్ట్ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar) అలాగే ‘‘ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామా, లవ్ యూ సో మచ్.. చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్కి తిను’’ అంటూ మరో పోస్ట్ ఉంది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్ చేయడం గమనార్హం. మదర్స్ డే రోజు విషాదం ఆర్ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్ సంతాపం ప్రకటించారు. త్రినయని సీరియల్లో పవిత్ర ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్గా చంద్రకాంత్ నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar)పవిత్రా జయరాం మృతిపై నటుడు సమీప్ ఆచార్య సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశారు. “మీరు ఇక లేరనే వార్తతో మేల్కొన్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. నా తొలి ఆన్స్క్రీన్ తల్లి, మీరు ఎప్పుడూ ప్రత్యేకమే.” అంటూ పోస్ట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని మెహబూబా నగర్ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చంద్రకాంత్తో అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ తదితరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. -
'ఓ సంచారి అంతరంగం'..మనసును కదిలించే పుస్తకం!
విపులాచపృథ్వీ అన్నట్టు తెలుసుకోవడానికి బయలుదేరితే భూమి చాలా పెద్దది. కంటికి నిత్యం కనపడే మానవుడు అంతకంటే లోతు . నా బాల్యంలో మా గ్రామంలో ప్రతి ఉదయాన్నే ఇళ్ల ముందుకు "అమ్మా రాత్రి అన్నం, కూరలు మిగిలి ఉంటే. ఇయ్యండమ్మా" అని సాధారణంగా నిత్యం వినపడే కేక వెనుక ఎంత ఆకలి పేగుల ఏడుపు ఉందో, అన్నపు మెతుకు ఎంత బరువైనదో తెలుసుకునే శక్తి అప్పుడు లేదు. సాహిత్యం ఎందుకు అంటే ఇందుకే అంటాను. సాహిత్యం చెవులకు కొత్తగా వినడాన్నీ, కళ్ళకు కొత్తగా చూడటాన్నీ, మనసుకు కొత్తగా అందటాన్ని సాధన చేయిస్తుంది.సాధన జీవితానికి ప్రాణవాయువు, సాధన జీవితపు ఆ దరికి చేరడానికి సులువు కానించే తెడ్డు. మా ఊళ్ళో మేము సంచార జాతి వారిని, వారి పిల్లా పీచు, గొడ్డు మేకలు సమస్తాన్ని రోజూ చూస్త్తోనే ఉండేవాళ్ళం. మా ఇంటి ముందే డేరాలు వేసుకుని ఉండేవాళ్ళు, ఆ డేరాలు ముందే వాళ్ళ ఉడుములు కట్టేసి ఉండేవి. నేను ఆ ఉడుముల్లో ఒకదానిని ఎలాగైనా తెచ్చుకుని దాని తోకకు తాడుకట్టి ఏ కోటయినా సరే దానిని ఎక్కి ఆక్రమించుకుందామా అని చూసేవాడిని తప్పా ఆ డేరాల లోపల బీద మనుషుల బ్రతుకులు ఏమా అని తొంగి చూడాలనుకున్న వాడిని కాను.ఇంట్లో పెద్దలు కూడా వారేమిటో, వారి బ్రతుకులు ఏమిటో, బ్రతుకు దారి ఎంత పొడవో, లోతో కొలత పాఠం చెప్పిన పాపానికి పోలేదు. ఈ జాతుల పిల్లలు జన్మజన్మల దారిద్య్రం, ఆకలితో క్యాట్ బెల్ చేతపట్టి కాకుల్ని కొట్టేవాళ్ళు. ఆ కాకుల్ని వాళ్ళు తింటారని తెలిసినపుడు అసహ్యం వేసింది. కాకుల్నే కాదు అవసరం, ఆకలి అయినపుడు మనిషి మనిషిని కూడా పీక్కు తింటాడని సాహిత్యమే చెప్పింది, ఒక మనిషి తన పొట్ట ఆకలిని తీర్చడానికి స్వయాన తన కాలిని తిన్న సంగతి కూడా సాహిత్యమే నేర్పింది. నా చిన్న తనంలో చిన్న మా ఊరులో రోజూ కనపడుతూ ఉండే ఈ సంచార మనుషులు ఉన్నట్టుండి, ఊర్లు బలిసి, పసిరిక పాము వంటి మెలిక దారులు అజగరల్లా వైశ్యాల్యమయి పోయి ,ప్రపంచం పెద్దదై పోయి వీరెక్కడ కానరాకుండా పోయిన కాలంలో ఒక టీచరమ్మ పూదోట శౌరీలు నాకు " ఒక సంచారి అంతరంగం" అనే ఈ పుస్తకాన్ని కానుక చేసారు.ఈ రచనను చాలా కాలం క్రితం "అమ్మ నుడి " పత్రికలో ధారావాహిక గా చూసేవాడిని. చదవలేదు. 2017 లో అచ్చు పుస్తకంగా వచ్చిన ఈ రోజు చదివే అవకాశం కలిగింది. శ్రీ రంగనాధ రామచంద్రరావు గారి అనువాదం బావుంది. మూల రచయిత కుప్పే నాగరాజుగారు తన చేయి పట్టుకుని పాఠకుడిని 192 పేజీల సంచారం చేయించారు. ఈ పుస్తకంలో కనపడే మనుష్యులకు,తాము కనపడకుండా పుస్తకం రావడానికి దోహదం చేసిన మహా మానవులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.పుస్తకం వెల: రూ. 200/-ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు, 1-2-740, హనుమాన్ మందిరం దగ్గర, రాకాసిపేట, బోధన్-503 185 నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. --అన్వర్, సాక్షి (చదవండి: సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!) -
బుల్లితెర నటికి వేధింపులు.. వాట్సాప్లో అసభ్యకర సందేశాలు!
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. స్టార్ నటీమణులు సైతం ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. తాజాగా మరో నటి క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన సంఘటన జరిగింది. ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అసభ్యకరమై సందేశాలు పంపించారని కన్నడ నటి అమూల్య గౌడ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారుతనను ఆడిషన్కు పిలిచి లైంగిక వేధింపులకు గురి చేసిన సూర్యపై పోలీసులకు నటి ఫిర్యాదు చేసింది . సినిమా పేరుతో అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అతన్ని నిలదీస్తే వెళ్లి పోలీసుకు చెప్పుకోమంటూ దారుణంగా మాట్లాడారని నటి తెలిపింది. కాస్టింగ్ డైరెక్టర్ అంటూ పరిచయం చేసుకుని వేధింపులకు గురి చేశాడంటూ వెల్లడించింది. కాగా.. అమూల్య కన్నడతో పాటు తెలుగు సీరియల్స్లోనూ నటిస్తోంది. కన్నడ బిగ్బాస్ షోలో కంటెస్టెంట్గా పాల్గొంది. -
కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
నేను వాటితో నటించాలంటే కాస్త రెమ్యునరేషన్ పెంచాల్సిందే: ట్రెండింగ్ హీరోయిన్
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం 'ప్రసన్న వదనం'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుహాస్కు జోడీగా కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్లో ఈ బ్యూటీని చూసిన వారందరూ ఫిదా అవుతున్నారు. దీంతో మే 3న విడుదల కానున్న ప్రసన్న వదనం చిత్రం కోసం ప్రేక్షకులు మరింత ఈగర్గా ఎదురుచూస్తున్నారు.మంగళూరులో పుట్టిన పాయల్ రాధాకృష్ణ మోడల్గా ఎంట్రీ ఇచ్చి ఆపై 'బెంగళూరు అండర్ వరల్డ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. బెంగళూరులో ఇంజినీరింగ్ చేరిన పాయల్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అనంతరం అమెజాన్, సఫోలా వంటి ప్రముఖ బ్రాండ్ల కోసం ఆమె పనిచేసింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా యాక్టింగ్లో డిప్లొమా చేసిన ఈ బ్యూటీ 19 ఏళ్లకే సినిమా అవకాశాలపై కన్నేసింది. తల్లి క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో పాయల్ రాధాకృష్ణ కూడా మంచి ట్రెడిషినల్ డ్సాన్సర్. ఆమె అమ్మగారు డ్యాన్స్ అకాడమీని కూడా రన్ చేస్తున్నారు.మిగతా హీరోయిన్లకు భిన్నంగా తన ఆలోచనలు ఉన్న పాయలకు పెంపుడు జంతువులు అంటే ఏ మాత్రం ఇష్టం లేదట. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఎక్కువగా కుక్కలు,పిల్లులు పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ కన్నడ బ్యూటీకి పెట్స్ అంటే ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది. తనకు సంబంధించిన యాడ్స్ , సినిమాల్లో పెంపుడు జంతువులతో ఏదైనా సీన్ చేయాలంటే అందుకు రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతానని ఈ బ్యూటీ చెప్పుకొస్తుంది.సినిమా ఇండస్ట్రీలో మొదట్లో తనకు తెలుగు భాష అంటే కాస్త ఇబ్బందిగా ఉండేదని చెప్పింది. పలు యాడ్లు చేస్తున్నప్పుడు తను తెలుగు మాట్లాడుతుంటే కొందరు కామెంట్లు కూడా చేశారని చెప్పుకొచ్చింది. దీంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నానని ఆమె తెలిపింది. టాలీవుడ్లో అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుతో ఒక సినిమాలో అయినా నటించాలనేది తన కోరిక అంటూ తెలిపింది. కోలీవుడ్లో అయితే ధనుష్తో నటించాలని ఉందని పేర్కొంది. ప్రసన్న వదనం చిత్రంతో పాటు 'చారీ పాఠం' అనే మరో సినిమాలోనూ పాయల్ రాధాకృష్ణ నటిస్తోంది. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) -
హీరోయిన్ ప్రేమతో ఉన్న వ్యక్తి ఎవరు..? ఆమె చుట్టూ రూమర్స్
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. 1995లో సవ్యసాచి అనే కన్నడ చిత్రంతో తన జర్నీ మొదలైంది. తొలి సినిమా పరాజయం పాలైనా ఓం అనే రెండో సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. కన్నడలో స్టార్ హీరోలందరితో జోడీ కట్టి టాప్ హీరోయిన్గా వెలుగొందింది. తెలుగులోనూ ధర్మచక్రం, దేవి, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, పోలీస్ పవర్ సహా పలు చిత్రాలు చేసింది. ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచును పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. దేవి సినిమాతో టాలీవుడ్లో చెరగని ముద్ర వేసిన ప్రేమ తెలుగులో తక్కవ సినిమాలే చేసినా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ప్రేమ.. తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత 2017లో ఉపేంద్ర 'మత్తే బా' చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కన్నడలో పలు సీరియల్స్లో కూడా నటిస్తుంది. ప్రేమ రెండో వివాహ చేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిలో నిజం లేదని తేల్చేసింది. తాజాగా ప్రేమతో పాటు తరుచూ ఒక వ్యక్తి కనిపిస్తున్నారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కన్నడలో సినీబజ్ వెబ్సైట్ ప్రేమ గురించి ఒక వార్తను ఫోటోతో పాటు ప్రచురించింది. ఈ ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రేమతో పాటు కన్నడ టెలివిజన్ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్గా పేరుగాంచిన అరవింద్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి కారణాలు ఏంటో అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ అరవింద్ కూడా ఉంటున్నారని తెలిపింది. రీసెంట్గా ప్రేమ కర్ణాటకలోని కొరగజ్ఞ సన్నిధికి వెళ్లినప్పుడు అరవింద్తో ప్రేమ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందా అని టాక్ కూడా వినిపించింది. తల్లిదండ్రులతో ప్రేమ అయితే ఇప్పుడు ఆ టాక్.. టాక్గానే మిగిలిపోయిందని, వారిద్దరి మధ్య అలాంటి సంబంధం లేదని, వారు మంచి స్నేహితులు మాత్రమేనని కొన్ని కన్నడ వెబ్సైట్స్ చెబుతున్న మాట. వాస్తవానికి ప్రేమ రెండో పెళ్లి గురించి పలుమార్లు రూమర్స్ వచ్చాయి. వాటిని ఆమె తిప్పి కొట్టింది కూడా.. ఇప్పుడు కూడా ఫోటో అయితే వైరల్ అవుతుంది కానీ అది ఎప్పటిది..? వారిద్దరి మంధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది పూర్తి వివరాలు లేవు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తలపై ప్రేమ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. పెళ్లి గురించి ప్రేమ గతంలో చెప్పిన మాట రెండో పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. జీవితంలో పెళ్లి ఉండాలి. నాకు తగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఎలా ఉండాలనేది నాకు తెలుసు. నా మీద ఇంకో రూమర్ కూడా సృష్టించారు. నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేశారు. అలాంటిదేమీ లేదు. డిప్రెషన్ వల్ల కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఆ సమయంలో నాకు క్యాన్సర్ ఉందని పుకార్లు వ్యాప్తి చేశారు' అని చెప్పుకొచ్చింది ప్రేమ. ఇక తనకు 70 ఏళ్లు వచ్చాక కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అప్పుడు చేసుకుంటే తప్పు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. మనకు దొరికేది ఒకటే జీవితం అని ఆ జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆమె పేర్కొన్నారు. జీవితంలో తనకు నచ్చినట్లే ఉండమని తన అమ్మగారు కూడా చెప్పారని ఆమె తెలిపింది. -
ఎన్టీఆర్ అవార్డ్ అందుకున్న ప్రముఖ నటుడు, నిర్మాత మృతి
కన్నడ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత అయిన ద్వారకీష్ (81) గుండెపోటు కారణంగా ఏప్రిల్ 16న మరణించారు. 1963లో నటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆయన సుమారు 150కి పైగా సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా 50కి పైగా చిత్రాలను నిర్మించారు. పరమానందయ్య శిష్యుల కథ ,రామాయణంలో పిడకల వేట వంటి తెలుగు సినిమాలను నిర్మాతగా కన్నడలో రీమేక్ చేశారు. తమిళ్, తెలుగులో హిట్ అయిన బిచ్చగాడు సినిమాను కూడా కన్నడలో ఆయనే రీమేక్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో కిషోర్ కుమార్ని కూడా కన్నడ చిత్ర సీమకు పరిచయం చేసింది ద్వారకీష్ కావడం విశేషం. నిర్మాతగా ఎంతో మంది కొత్తవాళ్లను సినిమాల్లోకి తీసుకొచ్చారు. నటులు, నటీమణులకే కాదు-కొత్త దర్శకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు కూడా అవకాశాలు ఇచ్చారు. అందరూ ఆయనను తమ "గాడ్ ఫాదర్"గా కన్నడ సీమలో భావిస్తారు. కన్నడ సినిమాకు వరుసగా రెండు దశాబ్దాలుగా భారీ హిట్లు అందించిన నిర్మాతగా ఆయనకు గుర్తింపు ఉంది. కన్నడ సినిమా పరిశ్రమకు అందించిన సేవలకు గాను ఎన్టీఆర్ అవార్డు ద్వారకీష్ను వరించింది. సీనియర్ ఎన్టీఆర్ పరమానందయ్య శిష్యుల కథ చిత్రం వల్ల వారిద్దిర మధ్య మంచి ఔనత్యం ఉండేది. ద్వారకీష్ గుండెపోటుతో మరణించడం వల్ల కన్నడ చిత్ర సీమలో విషాదం నెలకొంది. -
గ్లామర్ స్టిల్స్తో అలజడి రేపుతున్న స్వాతిష్ట కృష్ణన్ (ఫొటోలు)
-
8 ఏళ్ల బాలికతో వీడియోలు.. బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్
కన్నడ బిగ్బాస్ సీజన్ -1 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనూ శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో ఆమె అరెస్ట్ కావడం జరిగింది. సదరు బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని బైదరహళ్లిలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోని అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. సమాజంలో సానుభూతి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమే ఆ చిన్నారిని సోనూ శ్రీనివాస్ గౌడ దత్తత తీసుకున్నట్లు పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. వెస్ట్ డివిజన్ డిసిపి ఎస్ గిరీష్ వివరిస్తూ.. 'ప్రభుత్వ నింబంధనలు పాటించకుండా ఒక బాలికను సోనూ దత్తత తీసుకున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక అధికారి ఫిర్యాదు చేశారు. రాయచూర్కి చెందిన ఆ బాలిక వయసు 8 ఏళ్లు కాగా ఆ చిన్నారితో సోషల్ మీడియాలో రీల్స్తో పాటు.. యూట్యూబ్ కోసం పలు వీడియోలను సోనూ క్రియేట్ చేసింది. దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆ చిన్నారిని పోషిస్తానని ఆమె చెప్పింది. విచారణలో దత్తతకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో మేము అరెస్టు చేశాము.' అని ఆయన తెలిపారు. బిగ్బాస్ ఫేమ్ సోనూ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించానని చెప్పింది. సుమారు 45 రోజుల క్రితం ఆ చిన్నారిని ఆమె తీసుకొచ్చింది. అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ బాలికను తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకొని వచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వివరాలను పోలీసుల వద్ద ఆమె పంచుకుంది. అయితే, దత్తత ప్రక్రియలో పారదర్శకతతో పాటు సరైన పత్రాలు ఆమె వద్ద లేవని అధికారులు తెలిపారు. రాయచూర్కు చెందిన ఆ బాలికను దత్తత తీసుకుంటున్నట్లు మార్చి 2న సోనూ ఒక వీడియో ద్వారా ప్రకటించింది. అయితే, హిందూ దత్తత చట్టం ప్రకారం, దత్తత తీసుకున్న వ్యక్తి కుటుంబ వివరాలు పారదర్శకతతో కూడి ఉండాలి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారి.. ఇంటి వద్దే ఉంచడం నేరం. ఆపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం నేరం. ఇలాంటి విషయాలే సోనూను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారిని ప్రభుత్వ అనాథ శరణాలయానికి తరలించగా.. పోలీసులు సోనూను విచారిస్తున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హజరు పరచనున్నారు. సోనూ మీద నాన్బెయిలబుల్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. -
స్టార్ హీరో సినిమా రీరిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న సతీమణి
పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ పుట్టినరోజు సందర్భంగా 'జాకీ' సినిమా కర్ణాటక వ్యాప్తంగా మళ్లీ విడుదలైంది. ఈ చిత్రాన్ని KRG స్టూడియో రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా స్క్రీన్లలో విడుదల చేసింది. మార్చి 17న పునీత్ రాజ్కుమార్ పుట్టినరోజు ఉంది. దీంతో ఆయన అభిమానుల కోరిక మేరకు జాకీ చిత్రాన్ని నేడు రిలీజ్ చేశారు. పునీత్ రాజ్కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్కుమార్ మరణించిన తర్వాత ఆయన నుంచి రీరిలీజ అయిన తొలి సినిమా జాకీ కావడంతో చాలా వరకు థియేటర్లలో పూలతో అలంకరించారు. తెల్లవారుజామున 4.30 నుంచి 'జాకీ' స్పెషల్ షోలు వేశారు. అభిమానులతో పాటు సినిమాను చూసేందుకు పునీత్ సతీమణి అశ్విని కూడా వెళ్లారు. వెండితెరపై తన భర్తను చూసి ఆమె భావోద్వేగానికి లోనైంది. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారుజ ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశ్వినితో పాటు పునీత్ రాజ్కుమార్ కుటుంబ సభ్యులు కూడా సినిమా చూశారు. దునియా సూరి డైరెక్షన్లో 2010లో జాకీ సినిమా విడుదల అయింది. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్సెట్టింగ్ చిత్రాలలో ఒకటిగా, పునీత్ రాజ్కుమార్ కెరీర్లో ల్యాండ్మార్క్ సినిమాల్లో ఒకటిగా జాకీ చిత్రం నిలిచింది. పునీత్ రాజ్కుమార్ సరసన భావన ఇందులో నటించింది. Best ever Fan Show For me 🥺🔥👑 Stadium gintha jasthi soun ithu 🔥#Jackie #DrPuneethRajkumar pic.twitter.com/8HnpUMZDeP — Venka appu (@Venkaappu777) March 15, 2024 -
మన దేశంలో బెస్ట్ ఇంగ్లీషు ఎవరు మాట్లాడతారు? ఈ వీడియో చూడండి!
భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మేళవింపు భారత దేశం. అయితే 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించింది. అప్పటినుంచి మన దేశంలో ఇంగ్లీషు భాష ప్రభావం, ఆంగ్లం మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. భారతీయుల ఇంగ్లీషుపై హింగ్లీష్,టింగ్లీషులాంటి సెటైర్లు ఉన్నప్పటికీ, 2021 నాటి లెక్కల ప్రకారం అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో ఇంగ్లీష్ మాట్లాడే వారిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దాదాపు 10శాతం మంది భారతీయులు ఇంగ్లీషులో మాట్లాడతారు. రెండు లేదా మూడో భాషగా ఇంగ్లీషు మాట్లాడేవారు కూడా ఎక్కువే ఉన్నారు. గ్రామీణులతో పోలిస్తే పట్టణ, విద్యావంతులు, సంపన్నులు ఎక్కువగా ఇంగ్లీషు భాష మాట్లాడతారు. అయితే తాజాగా చక్కటి ఇంగ్లీషు భాష ఏ భాష ప్రజలు మాట్లాడతారు అనే అంశానికి సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం కన్నడిగులు మంచి ఇంగ్లీషు మాట్లాడతారట. మాతృభాష కన్నడగా ఉన్న ప్రజల యావరేజ్ ఇంగ్లీషు స్పీకింగ్ టెస్ట్ స్కోరు 74 శాతంగా నిలిచింది. వావ్.. ఆసక్తికరమైన పరిశోధన.. ఇంగ్లీషు నేర్చుకోవాలంటే కన్నడ నేర్చుకోవాలన్నమాట, లేదంటే కన్నడ ఫ్రెండ్ అయినా ఉండాలి అంటూ చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మాత్రమే కాదు బహుశా కన్నడ మాట్లాడేవారు ఇతర భాషలను కూడా తేలికగా నేర్చుకుంటారు. నా దృష్టిలో కన్నడ ఇటాలియిన్ ఆఫ్ ది ఈస్ట్. అంతేకాదు కన్నడిగులు దేశంలోని ఇతర రాష్ట్ర భాషలను సులభంగా నేర్చుకుంటారు అంటూ ఒకరు కమెంట్ చేయడం విశేషం. Guess who speaks the best English in India by mother tongue? 😊👏 pic.twitter.com/MfSlNAiGjR — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) March 11, 2024 మిగిలిన భాషల ర్యాంకులు పంజాబీ - 63 శాతం గుజరాతీ - 65 శాతం బెంగాల్ - 68 శాతం హిందీ,మళయాళం, తెలుగు - 70శాతం తమిళం - 71 శాతం మరాఠా- 73శాతం -
మిస్ వరల్డ్ ఫైనల్స్.. కిరీటం రేసులో ఇండియన్ బ్యూటీ
ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు భారత్లో జరుగుతున్నాయి. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగుతుంది. 71వ మిస్ వరల్డ్లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడ్డారు. భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) మిస్ వరల్డ్ కోసం బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఫైనల్ రౌండ్కు చేరుకున్న టాప్ 20లో ఉన్నారు. 1994లో మిస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ భారతీయుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ కిరీటాన్ని ఆమె అందుకుని ఇప్పటికి మూడు దశాబ్దాలు అవుతుంది. ఈ సందర్భంగా 2024 మిస్ వరల్డ్ 'టాలెంట్ ఫైనల్స్' రౌండ్లో ఐశ్వర్యారాయ్ హిట్ సాంగ్స్కు 'సినీ శెట్టి' డ్యాన్స్ చేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా నుంచి నింబుడా సాంగ్తో తాల్, బంటీ ఔర్ బబ్లీ వంటి మూవీలలోని హిట్ పాటలకు అద్భుతమైన డ్యాన్స్ చేసి ఐశ్వర్యకు అంకితం చేశారు సినీ శెట్టి. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య వారసత్వానికి గుర్తుగా భారతీయ శాస్త్రీయ, బాలీవుడ్ నృత్య రీతుల కలయికతో సినీ శెట్టి నృత్యం చేసింది. దీంతో పలువురు ఆమె ప్రతిభను పలువురు మెచ్చుకున్నారు. మార్చి 9న ముంబైలో జరగనున్న మిస్ వరల్డ్ 2024 ఫైనల్పై అందరి దృష్టి ఉంది. ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. 2017లో మానుషి చిల్లర్ 'మిస్ వరల్డ్' కిరీటాన్ని దక్కించుకున్నారు. 2024లో మన సినీ శెట్టి కూడా ఆ కిరీటాన్ని తప్పకుండా అందుకుంటారని ఊహాగానాలు మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Sini Shetty (@sinishettyy) View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
ఉపేంద్ర కల్ట్ సినిమా రీరిలీజ్.. కోటి బడ్జెట్తో విడుదల చేస్తే..
కన్నడ చరిత్రలో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మూవీ 'A'.. ఇప్పుడు ఈ కల్ట్ సినిమా రీరిలీజ్ చేసేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉపేంద్ర, చాందినీ జోడిగా నటించిన ఈ సినిమా 1998లో విడుదలైంది. మొదట కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. కేవలం కోటిన్నర రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లు రాబట్టి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఉపేంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చింది కూడా 'A' మూవీతోనే.. దీనికి కథ, డైరెక్షన్ కూడా ఆయనే అందించడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలో రివర్స్ స్క్రీన్ప్లేతో తెరకెక్కిన ఏకైక సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే ఈ కథను చూసి అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులను అనేకసార్లు చూసేలా చేసింది. చిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ వంటి చీకటి నిజాల గురించి ఓపెన్గానే 25 ఏళ్ల క్రితమే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా చెప్పాడు. చలనచిత్ర దర్శకుడు, హీరోయిన్ పాత్రల మధ్య జరిగే ప్రేమకథ చుట్టూ కథ తిరుగుతుంది. త్వరలో ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీదుల్లో ఉపేంద్ర నడుచుకుంటూ దురభిమానంతో హీరోయిన్ వెంటపడిన సీన్ ఇప్పటికీ అనేకసార్లు యూట్యూబ్లలో చూసే ఉంటారు. రియల్ సంఘటనను ఆధారం చేసుకుని ఆ సీన్ తీసినట్లు ఉపేంద్ర చెప్పాడు. ఈ సినిమాలో మితిమీరిన అడల్ట్ సీన్స్,డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ దెబ్బ గట్టిగానే పడింది. అన్నీ కట్స్ పోను కేవలం 20 నిమిషాల నిడివి మాత్రమే మిగిలింది. దీంతో మళ్లీ కొన్ని సీన్స్లలో మార్పులు చేసి సినిమాను విడుదల చేశారు.. సీన్స్లలో మార్పులు చేసి విడుదల చేస్తేనే అంత వైలెంట్గా ఉన్నాయి.. అదే ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేసి ఉంటే ... ఎలా ఉండేదో సినిమా చూసిన వారి ఊహలకే వదిలేయాలి. క్లైమాక్స్ను కాస్త తికమకగా ఉన్నా సినిమా కాన్సెప్ట్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 25 ఏళ్లు దాటింది. ఇప్పుడు 'A' మూవీని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర తర్వాత శివరాజ్కుమార్తో ఓం సినిమాను తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కూడా ఇప్పటి వరకు 550 సార్లు రీరిలీజ్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపేంద్ర డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఆయన డైరెక్షన్కు పెద్ద ఫ్యాన్ను అంటూ ఆయన చెప్పడం విశేషం. -
మూడు వందలకు పైగా పెళ్లి సంబంధాలు.. అన్నీ రిజెక్ట్ చేశా: నటి
కన్నడ బుల్లితెర నటి వైష్ణవి గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్కు టచ్లో ఉంటుంది. వైష్ణవి గౌడకు ఇప్పటి వరకు 300 వరకు పెళ్లి సంబంధాలు వచ్చినట్లు ఆమె చెప్పి అందరినీ షాక్కు గురిచేసింది. జీ కన్నడ ఛానెల్లో ప్రసారమయ్యే సీతారాం సీరియల్లో మెరిసిన వైష్ణవికి ఎన్ని పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయో తెలుసా? అంటూ కన్నడ సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది. కన్నడ బిగ్ బాస్ నందు ఈ సీజన్లో పాల్గొన్న వైష్ణవి ఎలిమినేట్ అవుతున్న సమయంలో.. మీకు ఎన్ని లవ్ ప్రపోజల్స్, పెళ్లి సంబంధాలు వచ్చాయని హీరో కిచ్చా సుదీప్ అడుగుతాడు. అందుకు సమాధానంగా వైష్ణవి కూడా కొంత సమయం ఆలోచించి దాదాపు 200 నుంచి 300 ప్రపోజల్స్ వచ్చాయని చెప్పింది. ఇది విన్న సుదీప్, 'అయ్యో.. వీటిలో ఒక్క ప్రపోజల్ కూడా మీకు కనెక్ట్ కాలేదా..? అని అడిగాడు. లేదని చెప్పేసిన ఈ బ్యూటీ ఇక నుంచి భవిష్యత్లో ఎలాంటి ప్రపోజల్స్ చూడాలని అనిపించలేదని తెలిపింది. 'నేను ఎప్పుడూ నా మనసుకు నచ్చిన పనే చేస్తాను.. కాబట్టి నా మనస్సు ఇప్పట్లో ఏ ప్రపోజల్ను చూడడానికి ప్రేరేపించలేదు. ఒకరిని ప్రేమించడం అంటే వాళ్ల మొహం చూడడం అనవసరం. ప్రేమ అంటూ చూడకుండానే మొదలు అవుతుంది. అని ఆమె చెప్పుకొచ్చింది. ఒకరి మొఖాన్ని చూడకుండా ప్రేమలో ఎలా పడుతావు అంటూ సుదీప్ షాక్ అయ్యాడు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ టాపిక్ వైరల్ అవుతుంది. -
ప్రపంచ సుందరి పోటీలు.. నా జెండా గుండెల్లో ఉంది: సినీ శెట్టి
సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగుతుంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలిచింది చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించారు. 71వ మిస్ వరల్డ్లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. నా దేశపు జెండాను గుండెల్లో పెట్టుకున్నా: సినీ శెట్టి భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) మిస్ వరల్డ్ కోసం బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఆమె దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె జాతిని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్లో ఇలా పేర్కొన్నారు. ' తూ హీ మేరీ మంజిల్ హై, పెహచాన్ తుజ్ హై సే!" అనే పోస్ట్ను పంచుకున్నారు. (నువ్వే నా లక్ష్యం, నువ్వే నా గుర్తు) ఈ ప్రయాణంలో ఈరోజు నేను నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నాను.. నా దేశపు త్రివర్ణ పతాకాన్ని చేతిలోనే కాదు, గుండెల్లో పెట్టుకున్నాను..' అంటూ గర్వం వ్యక్తం చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముంబైలో జన్మించిన సినీ శెట్టి స్వస్థలం కర్ణాటక. అకౌంటింగ్, ఫైనాన్స్లో గ్రాడ్యుయేట్ చేసిన ఈ బ్యూటీ భరతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నందున విభిన్న మార్గాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. నేను నా దేశపు గర్వాన్ని: సినీ శెట్టి 71వ మిస్ వరల్డ్ పోటీలకు తొలి అడుగు పడింది. ' నేను నా కలలతో అడుగులు వేస్తున్నాను. నేను నా దేశపు గర్వాన్ని.. ఈ క్షణం నుంచి నేను సినీ శెట్టిని మాత్రమే కాదు.. నేను భారతదేశాన్ని. నేను వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట, నన్ను పెంచిన ఈ నేల, నన్ను తీర్చిదిద్దిన భారత సంస్కృతి, నన్ను నమ్మిన ప్రజల ప్రతిబింబాన్ని. నేను మన జాతీయ జెండాను ఎంతో గర్వంగా, గౌరవంగా పట్టుకుని నిల్చున్నాను. ఇది నా కోసం, మన కోసం, భారతదేశం కోసం.' అని సినీ శెట్టి క్యాప్షన్ ఇచ్చారు. భారత్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లోకి అడుగు పెట్టిన ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. 1966లో భారత్కు చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్ 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ 'మిస్ వరల్డ్' కిరీటాన్ని దక్కించుకున్నారు. 2022లో నిర్వహించిన పోటీల్లో పోలెండ్కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు. ఈ ఏడాది గెలుపొందిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించనున్నారు. మార్చి 9న ముంబైలో జరగనున్న ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు
రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్ 2' తర్వాత నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. ఈ సినిమా షూటింగ్లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అభిమానులకు సినిమా అందించాలని ఆయన కోరుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్కు చేరుకున్న యశ్ తనతో పాటు ఉన్న వారిని మాత్రం మరిచిపోలేదని చెప్పవచ్చు. యశ్కు దగ్గరైన వ్యక్తుల కుటుంబాల్లో ఏదైన వేడుక జరిగితే ఆయన ఖచ్చింతంగా హాజరవుతారు. ఒక్కోసారి తన సతీమణితో కలిసే వెళ్తారు కూడా.. తాజాగా 'టాక్సిక్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యశ్.. ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న వ్యక్తి ఇంటికి తన సతీమణితో కలిసి వెళ్లి వారిని సర్ప్రైజ్ చేశారు. యశ్ దగ్గర చేతన్ అనే వ్యక్తి దాదాపు 12 ఏళ్లుగా అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఒక రకంగా యశ్ సినిమా కెరియర్ నుంచి అతను ఉన్నాడని చెప్పవచ్చు. చేతన్ 2021లో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో కూడా యష్, ఆయన సతీమణి రాధిక పండిట్లు చేతన్ పెళ్లి వేడుక జరిపించిన విషయం తెలిసిందే. (చేతన్ వివాహ సమయంలో.. యశ్, రాధిక పండిట్) చేతన్ దంపతులకు కొద్దిరోజుల క్రితం కుమారుడు జన్మించాడు. షూటింగ్ పనిలో బిజీగా ఉన్న యశ్ ఈ శుభ సమయంలో చేతన్ ఇంటికి చేరుకున్నాడు. వారి బిడ్డకు బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు. దీంతో చేతన్ కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. ఆయన సింప్లిసిటీని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
ప్రముఖ నిర్మాతకు చెందిన షాపింగ్ మాల్ సీజ్
కన్నడ ప్రముఖ నటుడు, నిర్మాత రాక్లైన్ వెంకటేష్కు చెందిన షాపింగ్ మాల్కు తాళం పడింది. ఈరోజు (ఫిబ్రవరి 14) ఆయనకు సంబంధించిన మాల్ను బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) అధికారులు సీజ్ చేశారు. బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ ప్రీతీ గెహ్లాట్, జోనల్ జాయింట్ కమిషనర్ బాలశేఖర్ సమక్షంలో అధికారులు దాడులు నిర్వహించారు. 2011 నుంచి 2022- 23 వరకు మాల్ మేనేజ్మెంట్ వారు బోర్డుకు చెల్లించాల్సిన పన్ను రూ. 11.51 కోట్లు ఉంది. ఇంత మొత్తంలో కార్పొరేషన్కు ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని డిమాండ్ నోటీసు జారీ చేసినా వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. రాక్లైన్ వెంకటేష్ కన్నడతో పాటు అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఆపై సినిమా పంపిణీ వ్యవహారంలో కూడా ఉన్నారు. బజరంగీ భాయిజాన్, లింగా (రజనీకాంత్), కాటేరా, పవర్ (రవితేజ), ఆటగధరా శివ వంటి చిత్రాలతో పాటు పలు కన్నడ, తమిళ్ సినిమాలను రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకటేష్ నిర్మించిన విషయం తెలిసిందే. దాసరహళ్లి జాయింట్ కమిషనర్ బాలశేఖర్ ఏం చెప్పారంటే.. 'మాల్ యాజమాన్యం పన్నులో సగం అయినా చెల్లించాలి.. అప్పటి వరకు మాల్ తెరవలేం.. ఇంతకు ముందు ఈ కేసు కోర్టులో ఉంది.. ఏడాది క్రితం కేసు పరిష్కారమైంది. అయినా పన్ను చెల్లించలేదు. ఈ కారణంగానే ఈరోజు మాల్కు తాళం వేశాం.. దానికి తాళం వేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అయినప్పటికీ మా కర్తవ్యాన్ని నిర్వర్తించాం.' అని అన్నారు. రాక్లైన్ మాల్ మేనేజర్ ప్రకాశ్ వ్యాఖ్యలు 'మాకు నోటీసులు ఇవ్వలేదు.. నిన్న రాత్రి నోటీసు ఇవ్వడానికి వచ్చారు.. రాక్లైన్ సార్ వచ్చే వరకు ఆగాలని చెప్పాం.. అయినా వెయిట్ చేయలేదు.. ఈరోజు ఉదయం వచ్చి సడన్గా మాల్కు తాళం వేశారు. కోర్టు ద్వారా డబ్బులు జమ చేయాలని చెప్పి అధికారులు వెళ్లిపోయారు.' అని తెలిపాడు. గత 10 సంవత్సరాల నుంచి రాక్లైన్ వెంకటేష్ పన్ను చెల్లించడం లేదని బీజేపీ బెంగళూరు సౌత్ జిల్లా విభాగం అధ్యక్షుడు ఎన్. ఆర్ రమేష్ ఆరోపించారు. అందుకు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా ఆయన సమర్పించారు. బీబీఎంపీ అధికారులు రాక్లైన్ మాల్ ప్రాపర్టీని కొలిచినప్పుడు అది 1,22,743 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తేలింది. అంటే సుమారు 73000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదని, పన్ను ఎగ్గొట్టారని రమేష్పై ఫిర్యాదు చేశారు. అప్పట్లో కార్పొరేషన్ జారీ చేసిన నోటీసును ప్రశ్నిస్తూ రాక్లైన్ వెంకటేష్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. కానీ కోర్టు ఆ పిటిషన్ను ఇప్పుడు కొట్టివేసింది. దీంతో పన్ను బకాయిల కారణంగా మాల్కు తాళం పడింది. - పోడూరి నాగ ఆంజనేయులు -
సౌందర్య బయోపిక్లో నటిస్తానంటున్న స్టార్ హీరోయిన్
నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సౌందర్య. ఈ కన్నడ నటి 1992లో విడుదలైన పా నానా ప్రిదీసు అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత 1993లో పొన్మణి అనే చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక్కడ రజనీకాంత్, విజయ్కాంత్, పార్తీపన్ వంటి స్టార్ హీరోలతో నటించారు. రజనీకాంత్ సరసన నటించిన పడయప్పా, అరుణాచలం చిత్రాలు సూపర్హిట్ అయ్యి సౌందర్యను స్టార్ హీరోయిన్ను చేశాయి. అదే విధంగా తెలుగు,మలయాళం భాషల్లోనూ నటించి బహుభాషా నటిగా రాణించారు. తెలుగులో చిరంజీవి,వెంకటేష్,నాగార్జున వంటి అగ్ర హీరోలతో నటించి ఆమె చెరగని ముద్ర వేసింది అలా ప్రముఖ కథానాయకిగా మంచి ఫామ్లో ఉండగానే ఆమె 2004లో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి హెలీకాప్టర్లో వెళ్తూ దుర్మరణం చెందారు. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తున్న నటి రష్మిక మందన్నా కూడా కన్నడ భామే అన్నది తెలిసిందే. ఈమె కూడా మాతృభాషలో కథానాయకిగా పరిచయం అయ్యి ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీలో కథానాయకిగా నటిస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీ ఓ భేటీలో పేర్కొంటూ తనకు నటి సౌందర్య బయోపిక్లో నటించాలని ఆశగా ఉందన్నారు. తనను చిన్నతనంలో సౌందర్యలా ఉన్నావని తన తండ్రి అనే వారని, ఆ విషయాన్ని తలచుకుంటే గర్వంగా ఉంటుందన్నారు. అవకాశం వస్తే కచ్చితంగా సౌందర్య బయోపిక్లో నటిస్తానని పేర్కొన్నారు. -
పెళ్లైన రెండేళ్లకే గొడవలు.. నేషనల్ అవార్డ్ డైరెక్టర్పై భార్య ఫిర్యాదు!
కన్నడలో ప్రముఖ దర్శకుడిగా మన్సోరాయ్కు గుర్తింపు ఉంది. కన్నడలో తనదైన శైలిలో సినిమాలకు దర్శకత్వం వహించి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆయన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మన్సోర్పై ఆయన సతీమణి అఖిల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త మానసిక, శారీరక హింసతో పాటు అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నాడని బెంగుళూరులోని సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. అఖిల ఫిర్యాదులో ఏముంది మన్సోర్ భార్య అఖిల సుబ్రహ్మణ్యపూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె భర్త మన్సోర్ (మంజునాథ్ ఎస్) కోవిడ్ సమయంలో సినిమా నిర్మించినందుకు అతని కుటుంబం నుంచి రూ. 10 లక్షల రూపాయలు అందుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. అదేవిధంగా రూ.30 లక్షల ఎస్యూవీ కారు ఇవ్వాలని మన్సోర్ తల్లి వెంకటలక్ష్మమ్మ, సోదరి హేమలత వేధిస్తున్నారని అఖిల తెలిపింది. ప్రస్తుతం కూడా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది: మన్సోర్ తన భార్య అఖిల మానసిక సమస్యలతో బాధపడుతోందని డైరెక్టర్ మన్సోర్ కూడా పోలీసులకు లేఖ ద్వారా ఇలా తెలిపాడు. 'నేను ప్రస్తుతం నా జీవితంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాను. నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దానికి కారణం నా భార్య అఖిల మానసిక సమస్యలే.. నేను దీని గురించి చాలారోజుల నుంచి ఆందోళన చెందుతున్నాను. ఆమెకు చికిత్స అందించేందుకు బెంగళూరులోని ఒక కౌన్సెలింగ్ కేంద్రానికి కూడా తీసుకెళ్లాను. అయినా ఆమెలో ఎలాంటి మార్పులు రాలేదు. అంతేకాకుండా ఆమెకు థెరపీ అవసరమని వైద్యులు చెప్పారు. ఆపై ఆమెకు కంటిన్యూగా కౌన్సెలింగ్ చేస్తూనే చికిత్స ప్రారంభించాలి. పెళ్లి సమయంలో గానీ, పెళ్లి తర్వాత గానీ నేను అఖిల కుటుంబం నుంచి ఎలాంటి కట్నం తీసుకోలేదు. ఆమె కుటుంబం నుంచి నాకు ఎలాంటి డబ్బు, నగలు, వాహనం అందలేదు. ఈ విషయంలో నా బ్యాంక్ ఖాతాను కూడా ఎవరైనా చెక్ చేయవచ్చు.' అని పోలీసులకు మన్సోర్ చెప్పాడు. జాతీయ అవార్డు కూడా తీసుకుపోయింది అఖిల మాతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లే సమయంలో బంగారు ఆభరణాలతో పాటు నాకు వచ్చిన జాతీయ అవార్డు, ఇతర పతకాలు కూడా ఎత్తుకెళ్లింది. ఫిర్యాదు చేయడానికి ముందు నా భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. దానికి సంబంధించిన వీడియో, నాపై, మా అమ్మపై జరిగిన దుర్భాషల వీడియో నా వద్ద ఉన్నాయి. వాటిని పిటిషన్తో పాటు సాక్ష్యంగా ఇస్తున్నాను.' అని ఆయన పేర్కొన్నాడు. తన భార్య దాఖలు చేసిన వరకట్న వేధింపులు, దళిత యువతిపై హింస వంటి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవద్దని అభ్యర్థించాడు. 2021లో అఖిలను మన్సోర్ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దిరోజుల నుంచి వారి వైవాహిక జీవితంలో గొడవలు రావడం జరిగింది. ప్రస్తుతం అఖిల ఫిర్యాదు విషయంలో ఫైనల్గా ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగితో ప్రముఖ హీరోయిన్ సోదరి పెళ్లి.. ఫోటోలు వైరల్
నా సామిరంగా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఆషికా రంగనాథ్ కుటుంబంలో వివాహ వేడుక జరిగింది. తన అక్క అనూషా రంగనాథ్ (32) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అనూష కూడా కన్నడ చిత్ర సీమలో హీరోయిన్గా కొనసాగుతుంది. బెంగళూరులోని ఓ రిసార్ట్లో ఈ వివాహ వేడుక జరిగింది.ఈ వేడుకకు కేవలం వారి కుటుంబ సభ్యుల మాత్రం హాజరైనట్లు సమాచారం. తాజాగా తన అక్క పెళ్లి పోటోలను హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇన్స్టాలో షేర్ చేసింది. కానీ, తన అక్క అనూష రంగనాథ్ ఎవరిని పెళ్లి చేసుకుంది..? ప్రేమ పెళ్లి లేదా ప్రేమ వివాహం.. అనే సమాచారాన్ని ఆమె వెళ్లడించలేదు. అంతే కాకుండా తన సోదరి భర్త పేరు శ్రవణ్ అని మాత్రమే చెప్పారు కానీ ఏం చేస్తాడనే విషయాన్ని కూడా వారు తెలుపలేదు. కానీ అతను బెంగళూరులో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగి అని సమాచారం. అనూషా రంగనాథ్కు కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఆమె అనేక సినిమాలు, సీరియల్స్లో నటించింది. ఈ వివాహ వేడుకలో రెండు పెళ్లిళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఎంతో గ్రాండ్గా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి కొద్దిమంది మాత్రమే హజరయ్యారు. వారందరూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కల్యాణ్ రామ్ 'అమిగోస్' చిత్రం ద్వారా ఆషికా రంగనాథ్ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంలోనే ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగా చిత్రంలో అవకాశం దక్కింది. ఈ సంక్రాంతికి విడుదల అయిన ఈ చిత్రంలో వరలక్ష్మీగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందింది. 👉: ఆషికా రంగనాథ్ కుటుంబంలో వివాహ వేడుక (ఫోటోలు వైరల్) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
మాస్ హీరో కోసం 'సప్త సాగరాలు' దాటి వచ్చేస్తున్న వైరల్ బ్యూటీ
సినిమా ప్రపంచంలోకి కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు... భాష ఏదైనా కానివ్వండి తమ వద్ద టాలెంట్ ఉంటే చాలు ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ఉ చేరుకుంటారు. ఆపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. అలాంటి స్టార్ల జాబితాలోకి తాజాగా ఓ కన్నడ ముద్దుగుమ్మ చేరింది. ఆమె పేరు రుక్మిణి వసంత్. రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమాలో నటించింది. ఆపై తెలుగు వారికి కూడా తెగ నచ్చేసింది ఈ బ్యూటీ. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే సినిమాలపై అభిమానం పెంచుకుంది. దీంతో లండన్ వెళ్లి యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఇక్కడికి వచ్చింది. కన్నడ నుంచి రెండు సినిమాల్లో నటించినా 'సప్త సాగరాలు దాటి' చిత్రం ద్వారా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రాల ద్వారా అందరినీ ఫిదా చేసింది. నటనతో పాటు తన అందంతోనూ ఈ అమ్మడు అందరినీ కట్టిపడేస్తుంది. "సప్త సాగరాలు దాటి" సినిమా రొమాంటిక్, భావోద్వేగాలను ఆకర్షించింది. యూత్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఆదరణ కరువైంది. ముఖ్యంగా, రుక్మిణి వసంత్ ప్రశంసలు అందుకుంది, చాలామంది ఆమెను ప్రశంసించడమే కాకుండా సాయి పల్లవితో పోల్చారు. (ఇదీ చదవండి: సలార్లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి) తాజాగా రుక్మిణి వసంత్ తన మొదటి తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కింది. 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు K. V. అనుదీప్ డైరెక్షన్లో రవితేజ ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాతిరత్నాలు తరహాలోనే కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. -
ప్రముఖ హీరో మంచి మనసు... ఆరుగురు ఖైదీలు విడుదల
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం ద్వారా కన్నడ హీరో దునియా విజయ్ టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డిగా ఆయన విలన్ పాత్ర పోషించాడు. అక్కడ చిత్ర సీమలో ఆయనకు తనదైన స్టార్డమ్ ఉంది. దునియా విజయ్ కొద్దిరోజుల క్రితం తన స్వగ్రామం కుంబరనహళ్లిలో పర్యటించారు. తన స్వగ్రామంలో ఎంతో ఉత్సాహంగా ప్రతి వీధి వెంట ఆయన తిరిగాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను అక్కడ స్థానికులతో పంచుకున్నాడు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపాడు. నేడు (జనవరి 20న) తన పుట్టినరోజును స్వగ్రామంలోనే జరుపుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉండగా కుంబరహళ్లిలో కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్లిన కొన్ని కుటుంబాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. తమ కుటుంబ సభ్యులను జైలు నుంచి విడుదల చేసేలా చూడాలని విజయ్ని వారు కోరారు. దీంతో ఆయన వెంటనే తన లాయర్లతో సంప్రదించి తన స్వగ్రామానికి చెందిన 6 మంది ఖైదీలను విడిపించారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఆరుగురు ఖైదీలను నటుడు విజయ్ స్వయంగా విడుదల చేపించారు. కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు తమతో లేకుండా జీవించడం చాలా కష్టం. అలాంటి బాధ ఎవరికీ రాకూడదని విజయ్ చెప్పాడు. గతంలో ఒక సినిమా షూటింగ్ కోసం మైసూర్ జైలుకు దునియా విజయ్ వెళ్లాడు. అక్కడ పలువురు ఖైదీలతో మాట్లాడి వారి కష్టాలు, సంతోషాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధ ఖైదీలు జరిమానా చెల్లిస్తే విడుదల చేసేందుకు అనుమతి ఉంది. కానీ వారి వద్ద చెల్లించేందుకు డబ్బు లేదు. ఈ విషయం తెలుసుకున్న విజయ డబ్బు సహాయం చేసి 62 మంది ఖైదీలను అక్కడి నుంచి విడుదల చేపించారు. ప్రస్తుతం వారి స్వస్థలం కుంబరనహళ్లిలోని 6 మంది ఒక కేసులో ఖైదీలుగా ఉన్న వారి పరిస్థితి కూడా అలాంటిదే. శిక్ష కాలం పూర్తి అయినా జరిమానా చెల్లించేందుకు వారి వద్ద డబ్బు లేదు. దీంతో వారు అదనపు శిక్షను అనుభవిస్తున్నారు. తన లాయర్ ద్వారా ఆ డబ్బును చెల్లించి తన స్వగ్రామానికి చెందిన ఆరుగురిని కస్టడీ నుంచి విడిపించారు. సలగ సినిమా ఘనవిజయం తర్వాత దునియా విజయ్ కన్నడ చిత్ర పరిశ్రమలో తనదైన స్టార్డమ్ని పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ భీమ్ చిత్రంలో నటిస్తున్నాడు. నేడు (జనవరి 20న) దునియా విజయ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో స్వగ్రామంలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో తన కోసం ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టవద్దని అభిమానులను ఆయన అభ్యర్థించాడు. -
‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో సైన్బోర్డు, నేమ్ప్లేట్లల వ్యవహారం విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే. కన్నడ భాషలోనే సైన్ బోర్డులు పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. అయితే ఆందోళనకు దిగిన నిరసనకారులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప మండిపడ్డారు. అరెస్ట్ చేయబడిన నిరసనకారులు నేరస్తులు కాదని.. వారంతా కన్నడ భాష పరిరక్షకులని అన్నారు. కన్నడ భాషలనే నేమ్ ప్లేట్లు, సైన్ బోర్డులు పెట్టాలని నిరసన కారులు చేసిన డిమాండ్ ఆమోదయోగ్యమైందని తెలిపారు. వారిని ఎందుకు అరెస్ట్ చేశారలో తనకు ఇప్పటికీ అర్థం కావటంలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసిన నిరసన కారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. ఇక కర్ణాటకలో వ్యాపారస్తులు తప్పనిసరిగా కన్నడ భాషలోనే సైన్ బోర్డులు పెట్టుకోవాలని అన్నారు. అయితే నిరసకారులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. నిరసన తెలిపేవారికి తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ.. చట్టం తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని తెలిపారు. చదవండి: ‘కన్నడ’ బోర్డుల రగడ -
ఇది ఇంగ్లాండ్ కాదు.. కన్నడ భాషా వివాదంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
బెంగళూరు: బెంగళూరులో భాషా ఉద్యమంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కర్ణాటకలో దుకాణాల బోర్డులు ప్రధానంగా స్థానిక భాషలో ఉండాలనే డిమాండ్తో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులో కన్నడ అనుకూల గ్రూపులు బుధవారం విధ్వంసం చేసిన తర్వాత ఆయన ఈ మేరకు మాట్లాడారు. "ప్రతి ఒక్కరూ సంకేతాలను చదవగలగాలి. అందరూ ఇంగ్లీష్ చదవలేరు. కన్నడలో అలాగే ఇంగ్లీష్ లేదా హిందీ వంటి ఇతర భాషలలో రాయడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? ఇది ఇంగ్లాండ్ కాదు. దుకాణదారులు కూడా అవసరాన్ని అర్థం చేసుకోవాలి " అని ప్రహ్లాద్ జోషి అన్నారు. కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు బుధవారం జరిగాయి. నేమ్ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్పై దాడులకు దిగాయి. దీంతో బెంగళూరు అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్ట్ బయట కన్నడ కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో నేమ్ ప్లేట్లు ఉంచడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కన్నడ రక్షా వేదిక. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆందోళకు దిగింది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ బయట ఇతర భాషల నేమ్ బోర్డుల్ని ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని నిలువరించి.. పరిస్థితి అదుపుచేసే యత్నం చేస్తున్నారు. ఇదీ చదవండి: తమిళనాడు డీజీపీ ఆఫీస్కు ‘బాంబు’ బెదిరింపు -
‘కన్నడ’ బోర్డుల రగడ
బనశంకరి: వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయంపై దర్శనమిచ్చే సైన్బోర్డు, నేమ్ప్లేట్ల(నామఫలకాల)లో 60 శాతం బోర్డులు కన్నడలోనే ఉండాలనే బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) నిబంధన తాజాగా బెంగళూరు నగరంలో బోర్డుల విధ్వంసానికి దారితీసింది. కన్నడ నగరంలో వ్యాపారం చేసే వారు ఎవరైనా సరే తమ కార్యాలయం బోర్డును కన్నడ భాషలోనే పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. ఇంగ్లి‹Ùలో కనిపించిన ప్రతీ సైన్బోర్డును ధ్వంసంచేశారు. కొన్నింటిపై నలుపు రంగు పూశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేఆర్వీ కనీ్వనర్ టీఏ నారాయణ గౌడను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్ బెంగళూరు మహానగర ఉన్నతాధికారి తుషార్ గిరినాథ్ స్పందించారు. సైన్బోర్డు, నేమ్ప్లేట్లలో 60 శాతం కన్నడలోనే ఉండాలన్న నిబంధనను ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి తెస్తామని, నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement