-
ఇండిగోకు భారీ షాక్: నిబంధనలు పాటించడం లేదని!
బడ్జెట్ కారియర్ ఇండిగోకు భారీ షాక్ తగిలింది. ల్యాండింగ్ సమయంలో తలెత్తిని సాంకేతిక ఇబ్బంది కారణంగా ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో నాలుగు టెయిల్ స్ట్రైక్స్ చేసినందుకు ఇండిగోపై శుక్రవారం ఈ జరిమానా విధించింది. కార్యకలాపాలు, శిక్షణ , ఇంజినీరింగ్ విధానాలకు సంబంధించిన ఎయిర్లైన్ డాక్యుమెంటేషన్లో కొన్ని లోపాలను గుర్తించిన చోట పరిశోధనలు నిర్వహించినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది. బెంగళూరు నుండి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో విమానం టెయిల్ స్ట్రైక్ను ఎదుర్కొన్న పైలట్, కో-పైలట్ లైసెన్స్లను రెగ్యులేటర్ సస్పెండ్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రెగ్యులేటర్ దర్యాప్తు ప్రారంభించింది. సిబ్బంది నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ల్యాండింగ్ చేసినట్లు తాము గుర్తించామని, ఆ తర్వాత పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్ మూడు నెలలు , కో-పైలట్ లైసెన్స్ను ఒక నెల పాటు సస్పెండ్ చేసినట్లు DGCA తెలిపింది. (క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్కేసులో డెడ్బాడీ ముక్కలు) కాగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్ (తోకలాగా ఉండే వెనుక భాగం) తాకినప్పుడు లేదా రన్వేకి తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది. ఇండిగో ఎయిర్లైన్స్ 2023 సంవత్సరంలో ఆరు నెలల వ్యవధిలో A321 విమానం ల్యాండింగ్ సమయంలో నాలుగు టెయిల్ స్ట్రైక్ సంఘటనలను ఎదుర్కొంది. దీనిపై రెగ్యులేటరీ ప్రత్యేక ఆడిట్ను నిర్వహించింది. దీనికి సంబంధించి నిర్ణీత వ్యవధిలోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రత్యుత్తరాన్ని సమీక్షించిన తర్వాత, అవి సంతృప్తికరంగా లేవని డీజీసీఏ గుర్తించింది.దీంతో 30 లక్షల జరిమానాతో పాటు,నిబంధనలు, OEM మార్గదర్శకాలకు అనుగుణంగా పత్రాలు, విధానాలను సవరించాలని కూడా ఇండిగోను ఆదేశించింది. (ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) -
డ్రగ్ టెస్టులో పైలట్ ఫెయిల్.. విధుల నుంచి ఔట్
న్యూఢిల్లీ: డ్రగ్ పరీక్షలో విఫలమైన ప్రముఖ విమానయాన సంస్థ పైలట్ను ఫ్లైట్ డ్యూటీ నుంచి తొలగించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం వెల్లడించారు. పైలట్లకు డ్రగ్ టెస్టు నిర్వహించడం ఈ ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమయ్యింది. తాజా కేసుతో కలుపుకొని ఇప్పటిదాకా నలుగురు పైలట్లు, ఒక ఏటీసీ అధికారి ఈ టెస్టులో ఫెయిలయ్యారు. విమానయాన సిబ్బంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలితే మొదట డి–అడిక్షన్ సెంటర్కు పంపిస్తారు. రెండోసారి కూడా పరీక్షలో ఫెయిలైతే మూడేళ్లపాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. మూడోసారి సైతం ఫెయిలైతే లైసెన్స్ రద్దు చేస్తారు. -
అదిగో ఆయేషా అజీజ్!
కొన్నింటిని అతిశయోక్తిగా చెప్పకపోతే, చెప్పడం మానడమే మేలు! అకాశంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తే తమక్కూడా రెక్కలు ఉంటే బాగుండుననుకుంటారు పిల్లలెవరైనా. శ్రీనగర్లోని ఆడపిల్లలు మాత్రం ఆయేషా అజీజ్ గురించి వినగానే పక్షులైపోయి ఆకాశంలో విహరిస్తారు! ఆయేషా కమర్షియల్ పైలట్. దేశంలోనే అతి చిన్న వయసులో పైలట్ అయిన అమ్మాయి! పదిహేనేళ్ల వయసుకే ఆమెకు పైలట్ లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఐదు. భారతదేశ ప్రసిద్ధ వార్తా సంస్థ ఎ.ఎన్.ఐ. (ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్) ఆయేషా పదేళ్ల పైలట్ జర్నీ గురించి ఇంటర్వ్యూ చేయడంతో తాజాగా ఆమె వార్తల్లోకి వచ్చారు. ఆయేషా అజీజ్ పేరు మొదటిసారి 2011 లో దేశానికి తెలిసింది. అది ఆమె పైలట్ లైసెన్స్ సాధించిన సంవత్సరం. శిక్షణ కోసం లైసెన్స్ అది. శిక్షణ రష్యాలోని సొకోల్ వైమానిక స్థావరంలో! ప్రారంభంలోనే ఎం.ఐ.జి.–29 జెట్ను నడపడం నేర్చుకున్నారు ఆయేషా. ఆ తర్వాత ఆమె సాధించవలసింది కమర్షియల్ లైసెన్స్. బాంబే ఫ్లయింగ్ క్లబ్లో చేరి విమానయానంలో డిగ్రీ సాధించాక ఆ లైసెన్స్ కూడా వచ్చేసింది. అది 2017లో. 2011లో లైసెన్స్ పొందాక తన ఈ పదేళ్ల ప్రస్థానం గురించి ఎ.ఎన్.ఐ. తో మాట్లాడుతున్నప్పుడు ఆయేషా తన గురించి కాక, కశ్మీర్లో ఇప్పుడు చక్కగా చదువుకుని పైకొస్తున్న ఆడపిల్లల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. ‘వాళ్లలో పైలట్ అవాలనుకున్న అమ్మాయిలకు మీరే ఇన్స్పిరేషన్ అయుండొచ్చు కదా..’ అన్న మాటకు, ‘కావచ్చేమో!’ అని నవ్వారు ఆయేషా. పైలట్ గా ఆమె తన కెరీర్ను ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. ‘‘ఎందుకంటే నాకు 9–5 ఉద్యోగం పడదు. నాకే కాదు.. అసలు ఏ అమ్మాయికీ అలాంటి ఉద్యోగం ఇష్టం ఉండదు. అవకాశం ఉండాలే కానీ, ఖండాలన్నీ తిరగాలనుకుంటుంది. అంతుకు తల్లిదండ్రులే లాంచింగ్ స్టెప్ అవాలి..’’ అంటారు ఆయేషా. ∙∙ ఆయేషాకు ఆకాశంలో ఎగరాలని మరీ చిన్న వయసులోనే మనసులో పడిపోయింది. వందల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యం చేర్చే ఉద్యోగం ఎంత థ్రిల్గా చెప్పడానికే ఆమె ఏ సమయంలోనైనా ఉత్సాహం చూపుతారు. తల్లిదండ్రులిద్దరూ రెండు చేతులతో భద్రంగా పైకి ఎగరేసిన పైలట్ పావురం ఆయేషా. వారు పెద్ద సపోర్ట్ ఆమె కెరీర్కు. ‘యంగెస్ట్ స్టూడెంట్ పైలట్’ అనే రికార్డు కూడా ఇప్పటికీ ఆమె పేరు మీదే ఉంది. ఆయేషా పుట్టింది కశ్మీర్లో. పెరిగింది ముంబైలోని వర్లీలో. తల్లితో కలిసి ముంబై నుంచి అమ్మమ్మ వాళ్లుండే జమ్ముకశ్మీర్లోని బారాముల్లాకు తరచు విమానంలో వెళ్లివస్తుండంతో తనూ విమానాన్ని నడపాలని అనుకుంది ఆయేషా! ఆ మాటే అమ్మానాన్నకు చెబితే.. ‘తప్పకుండా.. అయితే అందుకు కష్టపడి చదవాల్సి ఉంటుంది’ అని చెప్పారు. టెన్త్ పూర్తి చేయగానే ఆమె ఆశకు పైలట్ కోర్సుతో రెక్కలు కట్టారు. పైలట్ అయ్యాక తొలిసారి అమ్మానాన్న ఉన్న విమానాన్ని నడపడం ఆయేషా జీవితంలోని మరపురాని అపురూప ఘటన. ఇక తల్లిదండ్రులు గర్వ పడకుండా ఉంటారా.. కూతురు కూర్చోబెట్టి తమను, ఇంకా మరికొంతమందిని గాల్లో తేలియాడిస్తుంటే! బాంబే ఫ్లయింగ్ క్లబ్లో లైసెన్స్ సాధించాక 2012లో ‘నాసా’లో కూడా రెండు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు ఆయేషా! అక్కడ ఆమెకు జాన్ మెక్బ్రైడ్ అనే నాసా రిటైర్డ్ వ్యోమగామి పరిచయం అయ్యారు. స్పేస్ షటిల్ మిషన్, మైక్రో గ్రావిటీ, మాన్డ్ మానోవరింగ్ (విన్యాసాలు), మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ.. వీటన్నిటిలో మెక్బ్రైడ్ ఆమెకు మెళకువలు నేర్పారు. ∙∙ జాన్ మెక్బ్రైడ్ తర్వాత ఆమెలో పూర్తి స్థాయి స్ఫూర్తిని నింపినవారు నాసాలోని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. స్వయంగా వెళ్లి సునీతను కలుసుకున్నారు ఆయేషా. నీటిలో స్కూబా డైవింగ్, నింగిలో మూన్ వాక్లలో తన అనుభవాలను ఆయేషాతో పంచుకుని ఆమె కలలకు ఇంధనాన్ని నింపారు సునీత. 1960లో ప్రైవేట్ పైలట్ లైసెన్స్తో ప్రయాణీకుల విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ రబియా ఫతే అలీ దగ్గర కూడా ఆయేషా ఆసక్తి కొద్దీ మరికొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నారు. పైలట్ శిక్షణ లైసెన్స్ సంపాదించాక 2012లో శిక్షణలో భాగంగా తొలిసారి ఎం.ఐ.జి జెట్ను నడిపినప్పుడు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనని అంటారు ఆయేషా. ఆనాటి చిన్న పిల్ల ఇప్పుడు ‘ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్’ లో ప్రతిష్టాత్మక సభ్యురాలు. అయితే స్టూడెంట్ పైలట్గా, పైలట్గా, అసోసియేషన్ సభ్యురాలిగా ఘనమైన గుర్తింపు కలిగి ఉన్న ఆయేషాకూ కొన్ని ఒత్తిడిలు తప్పలేదు. సంప్రదాయ శిరోవస్త్రాన్ని (హిజబ్) ఎందుకు ధరించరనే ప్రశ్నను ఆమె ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు! అందుకు ఆమె దగ్గర సమాధానం కూడా ఉంది. ‘‘ప్రవక్త భార్య హజ్రత్ ఆయేషా యుద్ధంలో ఒంటెను స్వారీ చేయించగా లేనిది, నేను విమానాన్ని నడిపేందుకు సంప్రదాయాలు ఎందుకు అడ్డపడాలి?’’ అంటారు ఆయేషా. 2018 జనవరిలో ఢిల్లీలోని రాజ్భవన్లో ఆర్మీ చీఫ్, రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫస్ట్ లేడీస్’ టైటిల్ను అందుకున్న ఆయేషా.. పైలట్లు కావాలన్న ఉత్సాహం ఉండీ, ఆర్థికంగా వెలుసుబాటు లేని అమ్మాయిల్ని పైలట్లుగా ప్రోత్సహించేందుకు ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్ తరఫున కృషి చేస్తున్నారు. -
ఇండియన్ నేవీలో పైలట్ కొలువు
అర్హత:అవివాహిత అభ్యర్థులు మాత్రమే అర్హులు. 70 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (ఇంటర్మీడియెట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి). వయసు: 19 నుంచి 24 ఏళ్లు (జూలై 2, 1991- జూలై 1, 1996 మధ్యలో జన్మించి ఉండాలి). పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి (అబ్జర్వర్ కోసం పురుషులు, మహిళ అభ్యర్థులూ అర్హులే). నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలుండాలి. కమర్షియల్ పైలట్ లెసైన్స్ అభ్యరులు: అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (ఇంటర్మీడియెట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి). వయసు: 19 నుంచి 25 ఏళ్లు (జూలై 2, 1990 - జూలై 1, 1996 మధ్యలో జన్మించి ఉండాలి). నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలుండాలి. ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తుల్లోంచి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి నిర్వహించే సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ: సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూలను ఐదు రోజులపాటు డిసెంబర్, 2014-మార్చి, 2015 మధ్య నిర్వహిస్తారు. ఇందులో రెండు దశలు ఉంటాయి. అవి.. స్టేజ్-1: ఇందులో ఇంటలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్, డిస్కషన్ టెస్ట్ వంటి పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు స్టేజ్-2 పరీక్షలకు హాజరు కావాలి. ఇందులో సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ టాస్క్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షలు ఉంటాయి. ఈ దశల తర్వాత పైలట్ అభ్యర్థులకు పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఏవియేషన్ మెడికల్ ఎగ్జామినేషన్, అబ్జర్వర్ ఔత్సాహికులకు ఏవియేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రమే నిర్వహిస్తారు. శిక్షణ-కెరీర్: ఎంపికైన అభ్యర్థులకు షార్ట్ సర్వీస్ కమిషన్ హోదా ఇస్తారు. వీరు 10 ఏళ్లపాటు నేవీలో సేవలందించాల్సి ఉంటుంది. తర్వాత నిబంధనల మేరకు సర్వీసును పొడిగిస్తారు. వీరిలో పైలట్ అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ-ఎజిమాలా (కేరళ)లో శిక్షణనిస్తారు. ఈ సమయంలో వీరికి సబ్ లెఫ్టినెంట్ హోదా ఇస్తారు. తర్వాత ఇండియన్ ఎయిర్ఫోర్స్ అకాడమీ/నేవల్ ఎస్టాబ్లిష్మెంట్లలో రెండు దశల శిక్షణ ఉంటుంది. ఈ రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి పూర్తి స్థాయి పైలట్ బాధ్యతలు అప్పగిస్తారు. అబ్జర్వర్ అభ్యర్థులకు కూడా ఇండియన్ నేవల్ అకాడమీ-ఎజిమాలా (కేరళ)లో శిక్షణనిస్తారు. తర్వాత నేవల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్లలో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఉంటుంది. కెరీర్ పరంగా ఉండే పదోన్నతులు, జీతభత్యాల వివరాలు.. వీటికి తోడు వివిధ అలవెన్సులు అదనంగా లభిస్తాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ప్రింట్ అవుట్ తీసుకున్న దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నిర్దేశిత చిరునామాకు పంపాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: అక్టోబర్ 3, 2014. ప్రింట్ అవుట్ దరఖాస్తు, సంబంధిత సర్టిఫికె ట్ల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 13, 2014. చిరునామా: పోస్ట్ బాక్స్ నెంబర్-2, సరోజినీ నగర్, న్యూఢిల్లీ-110023. ప్రైమ్మినిస్టర్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ డాక్టోరల్ రీసెర్చ్ పరిశోధనల దిశగా విద్యార్థులను ప్రోత్సహించడం.. వారిలో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు వీలుగా ప్రైమినిస్టర్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్షిప్ను ప్రారంభించారు. ప్రైవేట్-పబ్లిక్ పార్టిసిపేషన్ (పీపీపీ) పద్ధతిలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్ఈఆర్బీ), కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) సంయుక్తంగా ఈ స్కాలర్షిప్ను నిర్వహిస్తున్నాయి. ప్రైమినిస్టర్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ డాక్టోరల్ రీసెర్ పథకం కింద 100 ఫెలోషిప్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన వారికి నాలుగేళ్లపాటు సంవత్సరానికి రూ. 6 లక్షల మొత్తాన్ని స్కాలర్షిప్గా ఇస్తారు. ఇందులో 50 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తే.. మిగతా 50 శాతాన్ని స్పాన్సర్ చేసే కంపెనీ మంజూరు చేస్తుంది. అందిస్తున్న విభాగాలు: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్/మెడిసిన్. విద్యావేత్తలు, ప్రభుత్వ, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుంది. వీరికి స్కాలర్షిప్ మొత్తాన్ని ఏప్రిల్ నుంచి నెల వారీగా చెల్లిస్తారు. అర్హత: దరఖాస్తు చేసే నాటికి ఏదైనా గుర్తింపు ఉన్న భారతీయ యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్/రీసెర్చ్ లేబొరేటరీ నుంచి పీహెచ్డీలో చేరి 14 నెలలు అయి ఉండాలి. తన రీసెర్చ్ ప్రాజెక్ట్ను ఆర్థికంగా, సాంకేతికంగా ఏదైనా ఒక పరిశ్రమ స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రీసెర్చ్ ప్రాజెక్ట్ నిర్దేశించిన ప్రమాణాలను కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు అవసరమైన పక్షంలో స్పాన్సర్ చేస్తున్న కంపెనీలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.చేపట్టే ప్రాజెక్ట్ కొత్త అంశానికి చెంది, సృజనాత్మకంగా ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.తుది గడువు: పీహెచ్డీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న 14 నెలలలోపు. ఏడాది పొడవున ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. టీఐఎఫ్ఆర్.. గ్రాడ్యుయేట్ స్కూల్ ఎగ్జామ్ క్యాంపస్లు: ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణే. అందిస్తున్న కోర్సులు: పీహెచ్డీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సిస్టమ్ సైన్స్, సైన్స్ ఎడ్యుకేషన్). ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్డీ (ఫిజిక్స్, బయాలజీ, మ్యాథమెటిక్స్) ఎంఎస్సీ (బయాలజీ) కోర్సుల వ్యవధి: పీహెచ్డీ: ఐదేళ్లు; ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - పీహెచ్డీ: ఆరేళ్లు; ఎంఎస్సీ: మూడేళ్లు. అర్హతలు: పీహెచ్డీ మ్యాథమెటిక్స్ (ముంబై క్యాంపస్): సంబంధిత సబ్జెక్టుతో ఎంఎస్సీ/బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంఏ/బీఏ/బీఎస్సీ. పీహెచ్డీ (బెంగళూరు క్యాంపస్): సంబంధిత సబ్జెక్టుతో ఎంఏ/ ఎంఎస్సీ/ఎంటెక్. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్డీ: సంబంధిత సబ్జెక్టుతో బీఏ/బీఎస్సీ/బీఈ /బీటెక్. ఎంఎస్సీ విద్యార్థులు అర్హులు కాదు. పీహెచ్డీ (ఫిజిక్స్): ఎంఎస్సీ (ఫిజిక్స్)/బీటెక్ (ఇంజనీరింగ్ ఫిజిక్స్). ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ: బీఎస్సీ/బీఈ/ఎంఈ/ఎంటెక్/ బీ.కెమ్ లేదా సైన్స్/ఇంజనీరింగ్/మెడిసిన్లో తత్సమాన డిగ్రీ.కెమిస్ట్రీ పీహెచ్డీ: ఎంఎస్సీ/బీఈ/బీటెక్/ఎంటెక్/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ. సంబంధిత అంశాలపై చక్కని పట్టు ఉన్న బీఎస్సీ విద్యార్థులు కూడా అర్హులే.బయాలజీ పీహెచ్డీ: బేసిక్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ లేదా అప్లయిడ్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ (ఎంఎస్సీ-అగ్రికల్చర్, బీటెక్, బీఈ, బీవీఎస్సీ, బీఫార్మసీ, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంఫార్మసీ తదితరాలు). ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పీహెచ్డీ: బ్యాచిలర్స్ ఇన్ బేసిక్ సైన్స్. కంప్యూటర్ అండ్ సిస్టమ్ సైన్స్ (కమ్యూనికేషన్స్ అండ్ అప్లయిడ్ ప్రొబబిలిటీ): పీహెచ్డీ-బీఈ/బీటెక్/ఎంఈ/ ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/బీఎస్సీ. డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఈసీఈ/ఈఈఈ) ప్రతిభావంతులు కూడా అర్హులే. ఎంపిక విధానం: సైన్స్ ఎడ్యుకేషన్ మినహాయించి మిగిలిన సబ్జెక్టులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా 2015 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జేజీఈఈబీఐఎల్ఎస్: బయాలజీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షను జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బయాలజీ అండ్ ఇంటర్డిసిప్లినరీ లైఫ్ సెన్సైస్ (జేజీఈఈబీఐఎల్ఎస్)గా వ్యవహరిస్తారు. ఈ పరీక్ష ద్వారా కే వలం టీఐఎఫ్ఆర్ క్యాంపస్ల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో బయాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అవి.. ఐఐఎస్ఈఆర్ క్యాంపస్లు- భోపాల్; కోల్కతా; మొహాలీ; పుణే; తిరువనంతపురం; సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) - హైదరాబాద్; సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ - హైదరాబాద్; నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ - మనేసర్; నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్-బెంగళూరు; నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ-న్యూఢిల్లీ; ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్-బెంగళూరు; నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్-పుణే; అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్-ముంబై; నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-భువనేశ్వర్; రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ-ఫరీదాబాద్. ఈ ఇన్స్టిట్యూట్లు జేజీఈఈబీఐఎల్ఎస్ స్కోర్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రవేశప్రక్రియలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఆయా ఇన్స్టిట్యూట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2015 పరీక్షలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చక్కని స్కోర్ సాధించిన విద్యార్థులు సిస్టమ్ సైన్స్ విభాగంలో రాత పరీక్షతో నిమిత్తం లేకుండా పీహెచ్డీ కోర్సులకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా గేట్/నెట్/జెస్ట్ ఆధారంగా కూడా ఫిజిక్స్ విభాగంలో కొన్ని అడ్మిషన్లను స్వీకరిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2014. {పవేశ పరీక్ష: డిసెంబర్ 14, 2014. ఫలితాల ప్రకటన: జనవరి 15, 2015
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement