-
రైతుల నీటి కష్టాలు తీర్చాం : రవీంధ్రనాథ్ రెడ్డి
-
దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు సీఎం జగన్
-
చంద్రబాబూ.. అలా చెప్పే ధైర్యంగా ఉందా?: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: కొన్ని వేల హామీలు ఇచ్చి అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పథకం అమలు చేశాను అని ధైర్యంగా బాబు చెప్పగలరా.. 14 సంవత్సరాల సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని మండిపడ్డారు. చదుకునే రోజుల్లో ఆయన ఆస్తులు ఎంత, ఈనాడు ఆయన ఆస్తి ఎంతో ప్రజలకు తెలుసు.. బాబు హయాంలో అవినీతి రాష్ట్రంగా పేరు గాంచిందన్నారు. లోకేష్ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని, మంగళగిరిలో ఓడిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసినా ఫలితం శూన్యమన్నారు. గత ప్రభుత్వంలో ఆఖరికి దేవాలయాల్లో స్వీపర్ పోస్టుల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. బాబు హయాంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి శూన్యం కాగా.. సీఎం జగన్ పాలనలో రెవెన్యూ డివిజనల్, కుప్పం నగర అభివృద్ధి జరిగిందని తెలిపారు. తండ్రి కొడుకులు ఉండేది హైదరాబాద్లో పోటీ చేసేది కుప్పం, మంగళగిరిలో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీళ్లు సీఎంపై ఆరోపణలు చేయడం తప్ప.. రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా 51 శాతంతో అధికారంలోకి వచ్చిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కిందన్నారు. అధికార వికేంద్రీకరణ చేయడం వల్ల సీఎం జగన్ అభివృద్ధికి నాంది పలికారన్నారు. గాలిని ఆపింది, తుఫాన్ ఆపింది నేనె అని గాలి కబుర్లు చెప్పే వ్యక్తి జగన్ కాదని.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించే వ్యక్తి అని అన్నారు. ఐదు సంవత్సరాలు పాలన చేసిన దివంగత వైఎస్సార్ను నేడు ప్రజలు దేవుడిలా పూజిస్తున్నారు... మరి 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న బాబును ఏ ఒక్కరైనా పూజిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. చదవండి: చట్టానికి లోబడే దర్యాప్తు.. ఈనాడు, ఈటీవీ ఆరోపణలు అవాస్తవం: ఏపీ సీఐడీ -
చెన్నైకి బీటెక్ రవి పరార్!.. కీలక నేత సాయంతో జంప్!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రైవేట్ వ్యక్తుల రియల్ ఎస్టేట్ వెంచర్ను ధ్వంసం చేసి అనంతరం కనిపించకుండా పోయిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసుల కళ్లుగప్పి చెన్నై చేరుకున్నట్లు సమాచారం. మారెడ్డి రవీంద్రనాథరెడ్డి అలియాస్ బీటెక్ రవి మార్చి 30 ఆదివారం వైఎస్సార్ జిల్లా చక్రాయపేటలో ఈ దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుని తన పొలిటికల్ గాడ్ఫాదర్ను ఆశ్రయించి గట్టెక్కే మార్గం సూచించాలని కోరారు. దీంతో హైదరాబాద్ నుంచి ఆ గాడ్ఫాదర్ స్పెషల్ ఫ్లయిట్లో మంగళవారం చెన్నైకి చేర్చారు. అందుకే బీటెక్ రవి దౌర్జన్యం.. పులివెందుల నియోజకవర్గంలో దౌర్జన్యం చేయగలిగామని చెప్పుకునేందుకు బీటెక్ రవికి ఇప్పుడు రాజకీయ అవసరం ఎంతో ఉంది. అందుకు.. తిరగబడే స్వభావం తక్కువగా ఉన్న చక్రాయపేట ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల వెంచర్ను ధ్వంసం చేయడానికి అసలు కారణం అదేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక గత ఆదివారం దౌర్జన్యానికి పాల్పడ్డ బీటెక్ రవిని పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన హైదరాబాద్లో తన పొలిటికల్ గాడ్ఫాదర్ను ఆశ్రయించారు. దీంతో, బీజేపీలో కొనసాగుతున్న పూర్వపు టీడీపీ నేత సీఎం రమేష్ తెరపైకి వచ్చారు. అనంతరం.. సీఎం రమేష్, ఎం.రవీందర్, పి.శ్రీనివాసరావు అనే వ్యక్తులు ప్రత్యేక విమానంలో వెళ్తున్నట్లు అనుమతులు పొంది చెన్నై చేరుకున్నారు. అయితే, పోలీసులు గుర్తించకుండా ఉండేందుకే బీటెక్ రవి తన పేరును ఎం.రవీందర్గా మార్చుకున్నట్లు సమాచారం. మరోవైపు.. చక్రాయపేట ఘటనలో 32మందిని గుర్తించి వారిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. అయితే, వీరందరినీ ముందుండి నడిపించిన బీటెక్ రవి ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడం, మరో పేరుతో ఇతర ప్రాంతాలకు పారిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘నీతి, నిజాయితీ, దమ్మూ, ధైర్యం ఉంటే సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురా.. నీ నిజాయితీ నిరూపించుకో..’ అంటూ నిజమైన్ వెంచర్ యజమానులు ఆ పోస్టులో సవాల్ విసురుతున్నారు. ఇది కూడా చదవండి: దోషులు ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి తానేటి వనిత -
సుందర నగరంగా కడప
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కడప నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా, నగర మేయర్ సురేష్బాబు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం స్థానిక నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో నగర మేయర్ కె.సురేష్బాబు అధ్యక్షతన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి ఆహ్వానితులుగా హాజరు కాగా, మున్సిపల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్చంద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నగర అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా పారిశుధ్యం, స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కడప నగరాన్ని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏమాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్ల విస్తరణ చేపడతామన్నారు. పేదవ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చెత్త పన్ను (క్లాప్ కార్యక్రమం), ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేస్తామని చెప్పారు. కడప నగర మేయర్ కె.సురేష్బాబు మాట్లాడుతూ నగరంలో తాగునీరు, పరిశుభ్రత, పారిశుధ్యంతోపాటు నగర సుందరీకరణకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. ఇంటింటి చెత్త సేకరణపై ఆయా డివిజన్ల కార్పొరేటర్లకు ఎదురైన సమస్యలపై నిర్దిష్ట ప్రణాళికతో చర్యలు చేపట్టి సానుకూల వాతావరణాన్ని సమకూరుస్తామన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు కౌన్సిల్ సమావేశం అజెండాలో పొందుపరిచిన తొమ్మిది అంశాలతోపాటు ప్రధానంగా నగరంలోని అన్ని బీటీ, సీసీ రోడ్లు పూర్తి చేసి కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు, తాగునీటి వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన మెరుగు పరిచేందుకు ఆమోదం తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు నిత్యానందరెడ్డి, ముంతాజ్బేగం, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్న వాసు, బీటెక్ రవి
సాక్షి, కడప: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం పార్టీలో రోడ్డెక్కిన రచ్చకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలే కారణమని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ క్యాడర్లోనూ వారి పెత్తనం చర్చనీయాంశంగా మారింది. దీంతో పలువురు నియోజకవర్గ ఇన్చార్జిలు ఏకమై సదరు నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లకు ఏకంగా ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి (వాసు), పులివెందులకు చెందిన బీటెక్ రవిలు పార్టీలో మితిమీరిన జోక్యంతో టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలను కాదని సదరు నేతలు వారి వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. వాసు, బీటెక్ల ప్రోత్సాహంతో కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప, బద్వేలు నియోజకవర్గాల పరి«ధిలోని రెండవ శ్రేణి నేతలు ఇన్చార్జిలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది. ఇన్చార్జిలను కాదని ఈసారి ఎన్నికల్లో మీకే టిక్కెట్లు అంటూ ఆ ఇద్దరు నేతలు ప్రచారం చేస్తుండడంతో ప్రస్తుతమున్న ఇన్చార్జిలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ►మైదుకూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్యాదవ్ ఈసారి కూడా తనకే టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేతను కలిసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాసు, బీటెక్ రవిలు పుట్టాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పుట్టా వర్గం ఆరోపిస్తోంది. ►ఎస్సీ రిజర్వుడు స్థానమైన బద్వేలు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దివంగత వీరారెడ్డి కుటుంబంతోనూ వాసు, బీటెక్ రవిలకు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న విజయమ్మ తనయుడు నితేష్కుమార్రెడ్డి వాసు వ్యవహార శైలిని తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. ►ఇక రాజంపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో చెంగల్రాయులు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీ జిల్లా అధ్యక్షుని హోదాలో వాసు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వేకోడూరు నియోజకవర్గంలోనూ గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి అక్కడున్న కొందరు నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇక్కడ కూడా వాసు మితిమీరిన జోక్యంతోనే ఆ పరిస్థితి తలెత్తినట్లు సొంత పార్టీలోనే ప్రచారం సాగుతోంది. ►కడప నియోజకవర్గంలోనూ వాసు జోక్యంతో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. రాబోయే ఎన్నికల్లో కడప పార్లమెంటు అభ్యర్థిగా వాసు పోటీలో ఉంటారని ఇప్పటికే టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే కడప అసెంబ్లీ స్థానం నుంచి మైనార్టీలను కాదని ఈసారి ఎన్నికల్లో తన సతీమణిని నిలబెట్టాలని వాసు ఉద్దేశంగా కనబడుతోంది. ఇప్పటికే కడప అసెంబ్లీ టిక్కెట్టును ఆశిస్తున్న ఆలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి, అమీర్బాబు తదితరులు వాసు తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ►పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు వాసు, అటు బీటెక్ రవిలు అన్ని నియోజకవర్గాల్లో వేలుపెట్టి వర్గాలను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఇప్పటికే పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్యాదవ్, మల్లెల లింగారెడ్డి, నితీష్కుమార్రెడ్డి తదితరులు చంద్రబాబు, లోకేష్లకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరి మితిమీరిన జోక్యంతోనే జిల్లాలో అరకొరగా ఉన్న తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ►ఉమ్మడి జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో మాజీమంత్రి పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్తోపాటు మండిపల్లి రాంప్రసాద్రెడ్డిలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. రాంప్రసాద్రెడ్డి ఇప్పటికే పలుమార్లు చంద్రబాబును కలిశారు. అయితే వాసు స్వయాన సోద రుడైన రమేష్రెడ్డి సైతం టిక్కెట్ రేసులో ఉన్నారు. వాసు, బీటెక్లు రమేష్రెడ్డికి మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ►ప్రొద్దుటూరులో వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు ప్రవీణ్కుమార్రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసిన ఆయన టిక్కెట్ తనకేనంటూ బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ తనకేనంటూ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా ఈ దఫా ఎన్నికల్లో తమ నేతకే టిక్కెట్ వస్తుందని వరదరాజులరెడ్డి వర్గం సైతం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే పొలిట్బ్యూరో సభ్యులు వాసు, బీటెక్ రవిలు ప్రవీణ్కుమార్రెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు పావులు కదుపుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ►కమలాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఓటమి చెందిన పుత్తా నరసింహారెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ లభిస్తుందని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇప్పటికే వీరశివారెడ్డి చంద్రబాబును కలిశారు. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ అభ్యర్థి తమ నేతేనని వీరశివారెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. దీని వెనుక వాసు, బీటెక్ రవి జోక్యం ఉన్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది. -
ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ ట్రెండ్ సెట్టర్స్
సాక్షి, అమరావతి: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజల కష్టాలు ఎలా తీర్చాలని బాగా ఆలోచించిన వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. అసెంబ్లీ మూడో రోజు సోమవారం ‘విద్య, వైద్యంలో నాడు–నేడు’ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ మాత్రమే ట్రెండ్ సెట్టర్లని చెప్పారు. చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇచ్చినా 14 ఏళ్ల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని అన్నారు. ప్రజలు వలస వెళ్లకూడదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని పిల్లలు బాగా చదువుకోవాలని సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఇదీ చదవండి: శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ -
పులివెందుల టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు
సాక్షి ప్రతినిధి, కడప/వేంపల్లె: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ బీటెక్ రవికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రచ్చకు దిగారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డితోపాటు పలు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్కుమార్రెడ్డితో బుధవారం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవిని రూ.20 కోట్లకు అమ్ముకోవాలని చూశారని.. అలాంటి వ్యక్తి వెంట ఎలా నడవాలని పలువురు ముఖ్య నేతలు సతీష్రెడ్డి ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. తమను బీటెక్ రవి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీటెక్ రవిని నమ్మితే నట్టేట మునుగుతామని తేల్చి చెప్పారు. మీరే పార్టీని నడిపించాలని సతీష్రెడ్డి ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్ శంకించారు: సతీష్రెడ్డి 30 ఏళ్లపాటు తాను నిజాయితీగా పనిచేసినా చంద్రబాబు, లోకేశ్ తనను శంకించారని, తాను అమ్ముడుపోయినట్టుగా మాట్లాడారని సతీష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు ఎన్ని ఇబ్బందులున్నా అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానని తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పించి మళ్లీ ఇన్చార్జిగా తననే నియమిస్తే పార్టీలో చేరతానని సతీష్రెడ్డి తేల్చి చెప్పారు. ఇందుకు చంద్రబాబును ఒప్పిస్తామని, త్వరలోనే కార్యకర్తలతో వెళ్లి చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటామని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, పార్టీని వదిలి వెళ్లిపోయిన సతీష్రెడ్డిని టీడీపీ నేతలు, కార్యకర్తలు కలవడంపై బీటెక్ రవి, ఆయన వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సతీష్రెడ్డి సమావేశ వివరాలను బీటెక్ రవి చంద్రబాబు, లోకేశ్తోపాటు పార్టీ జిల్లా నేతల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తాను కూడా చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటానని బీటెక్ రవి తేల్చి చెప్పినట్టు సమాచారం. పులివెందులలో అరకొరగా ఉన్న టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయి రచ్చకు దిగడంపై ఆ పార్టీలో కలకలం రేపుతోంది. రాబోయే రోజుల్లో పులివెందులలో టీడీపీ వర్గపోరు మరింత రోడ్డున పడే అవకాశం కనిపిస్తోంది. బుధవారం సతీష్రెడ్డితో సమావేశమైన వారిలో తొండూరు మాజీ జెడ్పీటీసీ శివమోహన్రెడ్డి, పులివెందుల టీడీపీ నాయకుడు తూగుట్ల సిద్ధారెడ్డి, టీడీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలస్వామిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, జిల్లా అధ్యక్షుడు జగన్నాథరెడ్డి, చక్రాయపేట టీడీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, భాస్కర్రెడ్డి, ఓబుళరెడ్డి, హరినాథరెడ్డిలతోపాటు మరికొందరు ముఖ్య నేతలు ఉన్నారు. -
వివేకా హత్య వెనుక మహాశక్తులను వెలికి తీయాలి
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్న మహాశక్తులను వెలికి తీయాల్సిన బాధ్యత సీబీఐ అధికారులపై ఉందని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోందని, దీని వెనుక హైలెవెల్ మేనేజ్మెంట్ జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా ఈ కేసు విషయాలు తెరపైకి వస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ని, వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టేందుకే ఇలా జరుగుతోందన్నారు. 2019 ఎన్నికలు జరిగినప్పుడు, ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ ఇదే తరహా వార్తలు ప్రసారమయ్యాయని గుర్తుచేశారు. ఎన్నికల ముందు సీన్ తయారు చేసుకుని, తర్వాత ఆర్టిస్టులు, సినిమా బయటికి వస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి దర్శకత్వం వహించేది ఎవరో తేలాల్సి ఉందన్నారు. అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా వైఎస్ అవినాష్రెడ్డి పేరు లేకపోయినా కొన్ని పత్రికలు, చానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్ వివేకా సౌమ్యుడని, బుద్ధుడికి ప్రతిరూపమని పేర్కొన్నారు. ఆయన్ని ఆ రకంగా హత్య చేయడం దురదృష్టకరమన్నారు. బెంగళూరు రియల్ ఎస్టేట్ దందా వెనుక ఎవరున్నారో వెలికితీయాలన్నారు. -
బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మేజార్టీతో గెలుస్తాం
-
అక్రమ నీటి వాడకాన్ని తెలంగాణ వెంటనే ఆపాలి
వల్లూరు: నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ చేస్తున్న అక్రమ నీటి వాడకాన్ని వెంటనే ఆపాలని కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం శ్రీశైలం నుంచి 114 టీఎంసీల నీటిని కృష్ణా ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి కేటాయించిందన్నారు. ఈ జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగు గంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, చెన్నై తాగు నీటి పథకాలతో బాటు కేసీ కెనాల్ సప్లిమెంటేషన్కు నీళ్లు అందించాల్సి ఉందన్నారు. అయితే జలాశయంలో 854 అడుగులకు నీరు చేరితేనే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. 881 అడుగుల నీటి మట్టం ఉంటే గరిష్టంగా 44 వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు మళ్లించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆ స్థాయిలో నీటి మట్టం ఏటా సగటున పక్షం రోజులు కూడా ఉండటం లేదని వివరించారు. కాగా, 800 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నా పాలమూరు– రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ ద్వారా తెలంగాణ రోజుకు దాదాపు 3 టీఎంసీల నీటిని తరలించడానికి అవకాశం ఉందన్నారు. దీనికి తోడు 796 అడుగులకు లోపు నీటి మట్టం ఉన్నా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ రోజు 4 టీఎంసీల నీటిని వాడుకుంటోందని ఆరోపించారు. దీని ఫలితంగా శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం వేగంగా తగ్గిపోతూ ఉండటంతో కేటాయింపులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ తమకు న్యాయంగా దక్కాల్సిన నీటిని కూడా వాడుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించి రాష్ట్రానికి న్యాయంగా కేటాయించిన నీటిని సద్వినియోగం చేసుకుని కరువు ప్రాంతమైన రాయలసీమకు తాగు నీటిని అందించాలనే ధ్యేయంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాలువలోకి నీటిని ఎత్తి పోయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. -
నెల రోజుల్లో వివాహం.. అర్ధరాత్రి దారుణహత్య
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ఓ యువకుడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. సరిగ్గా నెల రోజుల్లో వివాహం. ఏం జరిగిందో తెలియదు కానీ అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆ యువకుడు(బ్యాంకు ఉద్యోగి) దారుణహత్యకు గురయ్యాడు. దీంతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటన నగరంలోని కరెంట్ ఆఫీసు సెంటర్ కార్జోన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని విక్రమ్నగర్ చాముండేశ్వరి అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్–301లో మల్లిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శంకరమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆయన నగరపాలక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన మొదటి భార్య సీతారావమ్మ చాలాకాలం క్రితం మృతిచెందింది. వారికి ఇద్దరు సంతానం. మొదటి భార్య మరణాంతరం ఆయన శంకరమ్మను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు రవీంద్రనాథ్రెడ్డి(25) ఆయన చెన్నైలో బీటెక్ పూర్తి చేశాడు. రెండేళ్లుగా సంగంలోని ఫెడరల్ బ్యాంకులో లోన్స్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. రవీంద్రనాథ్రెడ్డికి గత నెలలో హరనాథపురానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. జనవరి 8వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. అందుకు తగిన ఏర్పాట్లను కుటుంబసభ్యులు చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన రవీంద్రనాథ్రెడ్డి విజయవాడలో ఆఫీసు మీటింగ్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. 6వ తేదీ సాయంత్రం విజయవాడ నుంచి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి కుటుంబసభ్యులకు తెలిపాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి నెల్లూరుకు సమీపంలో ఉన్నానని కొద్దిసేపట్లో బస్సు దిగుతానని చెప్పాడు. కుటుంబసభ్యులు అతని కోసం వేచిచూడసాగారు. చదవండి: (కన్నా..నీ వెంటే మేమంతా..!) ఈ క్రమంలో అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో రవీంద్రనాథ్రెడ్డి తన తండ్రికి ఫోన్ చేసి కరెంట్ ఆఫీసు సెంటర్ కారుజోన్ వద్ద ఉన్నానని, తనను ఎవరో కత్తులతో పొడిచారని మాట్లాడలేక ఉన్నానని చెప్పాడు. దీంతో శ్రీనివాసులురెడ్డి తన మేనల్లుడు శ్యామ్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనంతరం భార్య, మేనల్లుడుతో కలిసి శ్రీనివాసులురెడ్డి అక్కడికి వెళ్లేసరికే వేదాయపాళెం ఇన్స్పెక్టర్ టి.వి.సుబ్బారావు, ఎస్సై లక్ష్మణరావు ఘటనా స్థలంలో ఉన్నారు. తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న రవీంద్రనాథ్రెడ్డిని జీజీహెచ్కు తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ మేరకు బాధిత తండ్రి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (హుస్నాబాద్లో విషాదఛాయలు) 45 నిమిషాల్లో ఏం జరిగింది..? కొద్దిసేపట్లో బస్సు దిగుతానని రవీంద్రనాథ్రెడ్డి తన తండ్రికి రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేశాడు. 12.15 గంటలకు తనను ఎవరో పొడిచారని ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు ఆ 45 నిమిషాల్లో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. బస్సు దిగిన వ్యక్తి కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద ఎందుకు దిగాల్సి వచ్చింది?.. అతనిని హత్యచేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రవీంద్రనాథ్రెడ్డి కాల్ డీటైల్స్, హత్య జరిగిన సమయంలో సెల్ఫోన్ టవర్ డంప్లను పరిశీలిస్తున్నారు. కరెంట్ ఆఫీసు సెంటర్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా రవీంద్రనాథ్రెడ్డి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. అసలు అక్కడ ఎందుకు ఉన్నాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద రవీంద్రనాథ్రెడ్డి హత్య మిస్టరీగా మారింది. అతనికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? ఇతరత్రా వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై టీడీపీ దుష్ప్రచారం
కడప కార్పొరేషన్: కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డిపై టీడీపీ పొలిటికల్ విభాగం దు్రష్పచారానికి ఒడిగట్టింది. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. కల్తీ క్లోరిన్ నీటిలో కలవడం వల్లే ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని, నీటి శుద్ధికి కావాల్సిన రసాయనాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి సరఫరా చేస్తున్నారంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి తప్పుడు ప్రచారానికి తెరతీసింది. దీనిపై ఎమ్మెల్యే సీరియస్గా స్పందిస్తూ టీడీపీ నాయకులు ఇలా దిగజారి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తాను అలాంటి వ్యాపారమేదీ చేయలేదని, క్లోరిన్ సరఫరా, ఇతర కాంట్రాక్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్కు సోమవారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మేనమామ అయినందునే టీడీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తూ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేశామే తప్ప, ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చేయలేదని రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు. -
‘ఆర్టీసీని టీడీపీ భ్రష్టు పట్టించింది’
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే ఆర్టీసీ ఆస్తుల విక్రయానికి పునాది పడిందన్నారు. టీడీపీ హయాంలో అడ్డగోలుగా జరిగిన భూములు లీజుపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.(చదవండి: ‘ఆయనొక గాలి నేతగా మిగిలిపోయారు’) కార్మిక సంఘాలపై ఆర్టీసీ అధికారులు కక్ష ధోరణితో వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు విషయంపై కేంద్రంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. టీడీపీ.. ఆర్టీసీని భ్రష్ఠు పెట్టించిందని, ఏడు వేల కోట్లు అప్పులపాలు చేసిందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ విలీనం ద్వారా 3,600 కోట్ల రూపాయలు భారమైనా వేతనాలు చెల్లిస్తున్నామని రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. (చదవండి: ఆ ఘటనపై డిప్యూటీ సీఎం సీరియస్) -
సీఎం చిత్తశుద్ధికి నిదర్శనం టీచర్ల నియామకాలు
గుంటూరు ఎడ్యుకేషన్: పెండింగ్లో ఉన్న డీఎస్సీ–2018 ఉపాధ్యాయ నియామకాలకు మోక్షం లభించటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని ఏపీ టీచర్స్ రిక్రూట్మెంట్ కన్వీనర్ కె.రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు. గుంటూరులోని జిల్లా పరీక్షా భవన్లో శనివారం జరిగిన డీఎస్సీ–2018 కౌన్సెలింగ్ ప్రక్రియను రవీంద్రనాథ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2018 ప్రక్రియ పరీక్షలకే పరిమితమైందన్నారు. న్యాయపరమైన వివాదాలతో నిలిచిపోయిన నియామక ప్రక్రియ సీఎం వైఎస్ జగన్ చొరవతో ఎట్టకేలకు పరిష్కారానికి నోచుకుందని తెలిపారు. శనివారం రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా చేపట్టిన కౌన్సెలింగ్లో 3,524 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలోనే జాబితాల విడుదల, సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ చేపట్టి నియామకాలను పూర్తి చేశామన్నారు. -
‘కష్ట సమయంలోనూ మాట నిలుపుకున్నారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కరోనా కష్ట సమయంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు నగదును జమచేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. కమలాపురం వెలుగు కార్యాలయం ఆవరణలో ‘వైఎస్సార్ ఆసరా’ వారోత్సవాలను ఆయన శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మెగా చెక్కును ఆయన పంపిణీ చేశారు. (చదవండి: అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలా భరోసా) ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 3874 మహిళా సంఘాలకు మొదటి విడతగా 32 కోట్ల 47 లక్షల 81 వేల రూపాయలు లబ్ధి చేకూరింది. కమలాపురం మండలంలో ‘వైఎస్సార్ ఆసరా’ కింద మొదటి విడతగా 800 మహిళా సంఘాలకు గాను 6 కోట్ల 53 లక్షల 29 వేల రూపాయల విలువ కలిగిన మెగా చెక్కును డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అందజేశారు. -
'ఆయన చేసిన పనులను చరిత్ర క్షమించదు'
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే సీమకు నీటి కష్టాలు పోతాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'రాయలసీమ వాసులకు నీటి కష్టాలను పాలద్రోలేలా దివంగత నేత వైఎస్ జలయజ్ఞం ప్రవేశ పెట్టారు. ఆయన హయాంలో తెలంగాణ లో 60 శాతం ప్రాజెక్టులు నిర్మిస్తే 40 శాతం ప్రాజెక్టులు రాయలసీమలో నిర్శించారు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు నిర్మించడం వల్ల మనకు నీటి కష్టాలు ఉన్నాయి. చదవండి: ‘31 వరకు దేవాలయాల్లో దర్శనాలు రద్దు’ జాతీయపార్టీలది ద్వంద్వ వైఖరి రాబోయే రోజుల్లోనూ రాయలసీమకు నీటి కష్టాలు తప్పేలా లేవు. మిగులు జలాల విషయంలోనూ రాయలసీమ వెనుకబడి ఉంది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన విధంగా 511 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం లేదు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే రాయలసీమకు నీటి కష్టాలు పోతాయి. రాయలసీమ ప్రజల సమస్య తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవో నెంబర్ 203ను జారీ చేశారు. దీనిని తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ జీవోని అమలు చేయాలని అంటుంది. ఇలా జాతీయపార్టీలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విషయమై ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడ్డారు తప్ప నీటి సమస్య తీర్చలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకొని చంద్రబాబు అండ్ కలెక్షన్స్ చేశారు. చంద్రబాబు చేసిన పనులను చరిత్ర క్షమించదు. పార్టీలు ద్వంద రాజకీయాలు మానుకొని రాయలసీమ వాసుల నీటి కష్టాలు పోయేలా ముందుకు రావాలి. తమిళనాడు జల్లికట్టు స్ఫూర్తి మనకెందుకు రావడం లేదు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న పనులకు ప్రతిపక్ష పార్టీలు స్వాగతించి మద్దతు ఇవ్వాలి. ఈ జీవోను అడ్డుకుంటే భవిష్యత్లో ప్రజలు ఉద్యమాలు చేయక తప్పదని' అన్నారు. చదవండి: బస్లు, క్యాబ్లకు గ్రీన్సిగ్నల్ -
అన్నదాతా.. సుఖీభవ
సాక్షి: కడప అర్బన్ : ఆస్పత్రికి వచ్చే రోగుల సహాయకులు ఎవరూ ఇబ్బంది పడకూడదు. దు:ఖంలో ఉన్నవారికి కొంతయినా చేయూతనివ్వాలి... వారి ఆకలి తీర్చాలి. వసతి కల్పించాలి... ఎంత ఖర్చయినా సొంతంగానే భరించాలని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి సంకల్పించారు... అనుకున్నట్లే రోగుల సహాయకుల సౌకర్యార్థం కడప రిమ్స్లో భోజనం, వసతి కోసం శాశ్వత భవనాన్ని నిర్మించారు. రెండు పూటలా ఆకలి తీరుస్తూ, వసతి కల్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ప్రాంగణంలో రోగుల సహాయకుల కోసం శాశ్వతంగా రెండు పూటలా ఉచిత భోజనం, రాత్రి వేళ వసతి కల్పించారు. కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి సొంత ఖర్చులతో ఈనెల 1న ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే తల్లిదండ్రులు స్వర్గీయ పోచిమరెడ్డి తులశమ్మ, రామాంజులరెడ్డి జ్ఞాపకార్థం శాశ్వత భవనాన్ని నిర్మించారు. లోపలికి వెళ్లగానే కుడి, ఎడమ వైపుగా భోజనశాలకు వెళ్లేదారి ఉంటుంది. రెండువైపులా రెండేసి విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక్కో గదిలో 14 మంది విశ్రాంతి తీసుకునేలా పడకలు ఏర్పాటు చేశారు. ప్రతి బ్యాచ్కు 50 మంది చొప్పున భోజనం చేసేందుకు లోపలికి అనుమతిస్తారు. ప్రతి రోజూ భోజన వసతికే సుమారు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. రోగుల సహాయకుల కోసం వసతి గది టోకెన్ ఇలా.. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 7 గంటల లోపు రిమ్స్ ఐపీ విభాగం సిబ్బంది వార్డులలో తిరిగి, రోగుల సహాయకులకు టోకన్లు అందజేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు రాత్రి భోజనం కోసం మళ్లీ టోకన్లు ఇస్తారు. శుభ్రం.. రుచికరం అన్నం, పప్పు లేదా సాంబార్, తాళింపు, రసం లేక మజ్జిగ తప్పనిసరిగా వడ్డిస్తారు. భోజనం తయారీ కోసం వాడే నీళ్లు పరిశుభ్రంగా ఉండేందుకు భవనం పైభాగాన ప్యూరిఫైడ్ వా టర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అందులో నుంచి ప్యూరిఫై అయిన నీళ్లనే కూలింగ్ చేసి సహాయకులకు ఇస్తున్నారు. వేసవి కావడంతో బుధవారం నుంచి రసంతో పాటు, మజ్జిగను కూడా తప్పనిసరిగా భోజనంతో పాటు ఇస్తున్నారు. సాయంత్రం స్పెషల్: రాత్రి 7 నుంచి 8 గంటల లోపు పులిహోర, చిత్రన్న, పొంగలిలో ఏదోఒకటి వచ్చిన సహాయకులకు వడ్డిస్తారు. ఇందులో సాంబారు, పచ్చడిని ఇస్తున్నారు. విశ్రాంతి కోసం: రాత్రి వేళల్లో ఇక్కడ విశ్రాంతి తీసుకునే వారి జాబితాను రిమ్స్ అధికారులు పంపిస్తారు. లిస్టులో ఉన్నవారందరికీ విశ్రాంతి సౌకర్యం కల్పిస్తారు. మేయర్గా ఉన్నపుడు ఆలోచన రోగుల కోసం వచ్చే సహాయకులు, బంధువులు వసతి లేక గడ్డిపై పడుకొనేవారు. కడప మేయర్గా ఉన్న నాకు ఒక భోజన, వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దృష్టికి తీసుకుపోయాను. స్థలం కేటాయించి భూమిపూజ చేశారు. ఆయన అకాల మరణంతో ముందుకు తీసుకుపోలేకపోయాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం, కలెక్టర్ హరికిరణ్ పదే పదే కోరడంతో నా ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలనిపించింది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నా. – పి.రవీంద్రనాథ్రెడ్డి, ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే, కమలాపురం నాపేరు నాగలక్షుమ్మ. మాది కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం. నా మనవడు కొండయ్య మానసిక స్థితి సరిగా లేకపోవడంతో రిమ్స్లోనే ఉన్నాను. అప్పటి నుంచి రెండు పూటలా భోజనం ఉచితంగా చేస్తున్నాను. చాలా రుచికరంగా ఉంది. ఈ సౌకర్యం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. నా కుమారుడికి ఆరోగ్యం సరిగా లేదు. వారం రోజుల నుంచి రిమ్స్లోనే ఉంటున్నాం. ఇక్కడే భోజనం తింటున్నాం. ఎంతో రుచికరంగా ఉంది. వృథా చేయకుండా ఉపయోగించుకుంటే మంచిది. – అక్కిశెట్టి కొండయ్య, ఇడమడక, దువ్వూరు మండలం, వైఎస్ఆర్ జిల్లా -
వైఎస్సార్ సీపీలోకి వీరశివారెడ్డి
వైఎస్సార్ కడప: మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో వైఎస్సార్సీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగానే.. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఏర్పాటుకు, నూతన భవన నిర్మాణాల కోసం భూమి పూజ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, డిసీసీబీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడు నెలలకే ఇచ్చిన హామీలలో 80 శాతం నేరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమేనని దక్కుతుందన్నారు. రాజధానిపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అలా చేయకపోవడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి వదలుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో సీఎం జగన్ సమక్షంలో వెఎస్సార్సీపీలో చేరునున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. గత కొద్ది కాలంగా వీర శివారెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కమలాపురం టికెట్ను వీరశివారెడ్డి ఆశించినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచే వీరశివారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. చదవండి: బాబూ.. రేపు సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచుతాం! -
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి
-
ఇది సంక్షేమ సర్కారు
కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు, రేషన్కార్డులను తొలగిస్తోందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక ప్రతిపక్షాలు పింఛన్లు, రేషన్కార్డులు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రేషన్కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీలకు ఉన్న నిబంధనలను అందరి మేలుకోసం సరళతరం చేశారన్నారు. ఫిబ్రవరిలో రచ్చబండ కార్యక్రమం ద్వారా ఈ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో చెప్పిన హామీల్లో 80 శాతం హామీలను అమలు చేశారన్నారు. ఆటో డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్ ఉన్న వారికి ఏడాదికి రూ.10వేలు ఇచ్చారన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు చెప్పిన దానికంటే ఏడాదికి రూ.13500 చొప్పున ఐదేళ్లపాటు ఇస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ, శనగ, సుబాబుల్, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించారన్నారు. వైఎస్ఆర్ చేనేత హస్తం పేరుతో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24వేలు ఇచ్చారన్నారు. జనవరి నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు, రేషన్కార్డులు ఇవ్వనున్నారన్నారు. జనవరి 9న రాష్ట్రంలోని 46లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఉగాదికి అర్హులైనవారందరికీ ఉచితంగా ఇళ్లు ఇవ్వడమేగాక ఇంట్లో మహిళ పేరిట రిజిస్టర్ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. నాడు–నేడు పథకం ద్వారా ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చబోతున్నారని చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 4.45లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం గిన్నిస్ రికార్డు అని తెలిపారు. జనవరి 1వ తేది నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రజా రవాణా శాఖ కింద ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారన్నారు. రాజధానిపై శివరామక్రిష్ణన్ కమిటీ ఎందుకు బయటపెట్టలేదు : రఘురామిరెడ్డి రాజధానిపై శివరామక్రిష్ణన్ కమిటీ నివేదికను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు. ఆ కమిటీ నివేదికలో ఉన్న అంశాలైమైనా పాటించారా అని టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం ఐక్యంగా ఉండాలని రాజధానిని త్యాగం చేసిన రాయలసీమలో రాజధాని ఎందుకు పెట్టలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. అమరావతిలో ఐదేళ్లు గ్రాఫిక్స్ చూపారే తప్పా ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదన్నారు. అంతర్గత రహదారులూ నిర్మించలేదన్నారు. వర్షాకాలంలో అక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. శని, ఆదివారాలొస్తే ఏ ఒక్కరూ అమరావతిలో ఉండటం లేదన్నారు. హైకోర్టును కర్నూలులో పెడితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతుతోపాటు ప్రకృతి మద్దతు కూడా ఉందన్నారు. ఆరునెలలు సంక్షేమానికి కేటాయించామని, ఇకపై అభివృద్దిపై దృష్టిపెట్టనున్నామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, యువజన అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
‘ఆర్టీసీకి ప్రాణం పోసిన మహానేత వైఎస్సార్ ఒక్కరే’
సాక్షి, వైఎస్సార్ కడప : రేపటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషంగా ఉందని కమలాపురం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రంలో కార్మికుల సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడని ప్రశంసించారు. మాట ఇస్తే మడమ తిప్పని మనిషిగా, నాయకుడిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలుస్తారని అన్నారు. ఆర్టీసీకి ప్రాణం పోసిన మహానేత వైఎస్సార్ ఒక్కరేనని కొనియాడారు. ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు. గత అయిదేళ్లలో అవినీతికి పరాకాష్టగా చంద్రబాబు పాలన సాగిందని విమర్శించారు. ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం కూడా లేకుండా ప్రజా పాలన సాగుతుందన్నారు. టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని మండిపడ్డారు. అర్షులైన ప్రతి లబ్ధిదారులకు నవరత్నాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు -
బాబు ఏనాడు ఆర్టీసీకి మేలు చేయలేదు
-
‘డబ్బులు వస్తాయంటేనే శంకుస్థాపనలు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఉనికి కోసమే చంద్రబాబు నాయుడు కడపకు వచ్చాడని, డబ్బులు ఇచ్చి ప్రజలను సమావేశానికి రప్పించారని కమలాపురం వైఎస్సార్సీపీ శాసనసభ్యుడు రవీంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాధ్రెడ్డి మాట్లాడుతూ.. మా అభ్యర్థి ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే చంద్రబాబు కుప్పంలో గెలిచారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల హామీ ఇచ్చిన చంద్రబాబు తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. డబ్బులు వచ్చే ప్రాంతంలో మాత్రమే శంకుస్థాపనలు చేసి లక్షల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి ముగిసే సమయంలో 65 వేల కోట్ల రూపాయలు అప్పుచేశాడని, ప్రపంచంలో చంద్రబాబు అంత అవినీతిపరుడు లేడని పేర్కొన్నారు. ‘ప్రతీ పథకాన్ని అధికారం ముగిసే సమయానికి అమలు చేశారు. యువకులు, మహిళలు, రైతులు, సంఘాలను మోసం చేసిన చంద్రబాబును, టీడీపీని ప్రజలే భూస్థాపితం చేశార’ని తెలిపారు. ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టి, ఓడిపోయాక తన రాజ్యసభ సభ్యులను అదే పార్టీలోకి చంద్రబాబే పంపారని వెల్లడించారు. రాష్ట్రం అప్పులకుప్పగా మారిన సందర్భంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికారం ఇచ్చారని, అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని పునరుద్ఘాటించారు. -
‘ఆ ఘనత ఆయనకే దక్కుతుంది’
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాజువాకలో వైఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ స్టీల్ సిటీ డిపోలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. పేద విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పేద,బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్టీసీని మరింత బలోపేతం చేయాలని కార్మికులకు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement