-
48 గంటల్లో 9.5 కోట్ల మంది విజిటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్ను సందర్శించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ఫోన్లు, టీవీలు) రంజిత్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాలవారీగా హైదరాబాద్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్ కనిపించగా, 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, పెద్ద స్క్రీన్ టీవీలవైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని గురువారమిక్కడ ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించిన అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరీనా (ఏఎక్స్ఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్ బాబు వివరించారు. -
ఈసారి రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: డిమాండ్ గణనీయంగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయంగా ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కావచ్చని టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) శైలేష్ చంద్ర తెలిపారు. 38 లక్షల పైచిలుకు యూనిట్లు అమ్ముడు కావచ్చని అంచనాలు ఉన్నట్లు వివరించారు. మూడో త్రైమాసికంలో కాస్త మందగించినా, నాలుగో త్రైమాసికంలో విక్రయాలు తిరిగి పుంజుకుంటాయని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 19 లక్షల విక్రయాలతో ప్యాసింజర్ వెహికల్స్ విభాగం పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు తెలిపారు. భారతీయ వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం 2021–22లో పీవీల అమ్మకాలు 30.69 లక్షలుగా నమోదయ్యాయి. అంతక్రితం 2018–19లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 33.77 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సెమీ–కండక్టర్లు వంటి కీలక భాగాల సరఫరా సమస్యలతో కొన్నాళ్లుగా డెలివరీలు నెమ్మదించి, డిమాండ్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు, 2023–24లో వాహన విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరం తరహాలో ఉండకపోవచ్చని చంద్ర చెప్పారు. ఇప్పటికే పేరుకుపోయిన డిమాండ్కు దాదాపు సరిపడేంత అమ్మకాలు జరిగాయని, ఇక నుండి కొత్తగా ఆవిష్కరించేవి మార్కెట్కు ఊతంగా ఉండగలవని పేర్కొన్నారు. ఉద్గార ప్రమాణాలకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్ 6 రెండో దశ అమల్లోకి రానుండటంతో రేట్లు పెంచాల్సి వస్తే కొన్ని సెగ్మెంట్లు.. ముఖ్యంగా ఎంట్రీ స్థాయి విభాగంపై కొంత ప్రతికూల ప్రభావం పడవచ్చని చంద్ర చెప్పారు. తమ ఎలక్ట్రికల్ వాహనాల విషయానికొస్తే.. సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధికంగా 12,000 యూనిట్లు విక్రయించినట్లు, 87 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నట్లు ఆయన వివరించారు. -
9 శాతం పెరిగిన జేఎల్ఆర్ విక్రయాలు
లండన్: టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి అమ్మకాలు(4,62,678) సాధించింది. 2013 అమ్మకాలతో పోల్చితే ఇది 9 శాతం అధికమని, 2008 అమ్మకాలతో పోల్చితే ఇది రెట్టింపని జేఎల్ఆర్ సీఈఓ రాల్ప్ స్పెత్ చెప్పారు. జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 6 శాతం వృద్ధితో 81,570 అమ్ముడయ్యాయని, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 9 శాతం వృద్ధితో 3,81,108కు పెరిగాయని వివరించారు. చైనాలో అమ్మకాలు 28 శాతం, ఇంగ్లండ్లో 7 శాతం, ఉత్తర అమెరికాలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది 5 లక్షల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ఏడాది 12 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నామని... వీటిల్లో జాగ్వార్ ఎక్స్ఈ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫోర్డ్లు కూడా ఉన్నట్లు చెప్పారు. 1,300 కొత్త కొలువులు... జేఎల్ఆర్ సంస్థ కొత్తగా 1,300 ఉద్యోగాలివ్వనున్నది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న కొత్త మోడల్ కారు కోసం ఈ కొత్త కొలువులు ఇవ్వనున్నామని రాల్ఫ్ స్పెత్ చెప్పారు. ఇంగ్లండ్లోని సోల్హిల్ ప్లాంట్లోని ఈ ఉద్యోగాల కోసం ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించామని పేర్కొన్నారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- ఛాయాచిత్రం
- రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
- ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
- బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
- 'పాలిటెక్నిక్' లో నవోదయం
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement