-
‘సీఎం రేవంత్కు ఆగస్టు సంక్షోభం తప్పదు’
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్రెడ్డి అత్యుత్సాహంతో ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కావటం ఖయమని అన్నారు. -
కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. అంతే స్థాయిలో కాంగ్రెస్, బీఅర్ఎస్.. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. శనివారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘‘సీఎం రేవంత్, కేసిఆర్.. తెలంగాణ ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారు. మీరు ఏది చెప్పినా నమ్మేస్తారని ఊహాలోకంలో ఉన్నారు. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. మీ ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రజాకార్లతో విరోచిత పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి. పచ్చ కామెర్లు ఉన్నోడికి అంత పచ్చగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ దేశంలో అవినీతిని పెంచి పోషించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి చేసిందేమీ లేదు కాబట్టి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు రేవంత్ నిజస్వరూపం తెలిసిపోయింది. కేసిఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి. అధికారం కోసం ఎంతకైనా తెగించి... అబద్ధాలు అవలీలగా చెప్తారు. రేవంత్, కేసీఆర్ దొందూ దొందే. ఇద్దరు అబద్దాల ఆడటంలో ఆరిదేరారు.కాంగ్రెస్ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకొని 75 ఏళ్లుగా రాజకీయం చేస్తుంది. ఏనాడు కాంగ్రెస్కి భద్రత దళాల మీద నమ్మకం లేదు. వారిని అవమాన పరిచే విధంగా అనేక సార్లు మాట్లాడారు.పాకిస్తాన్ దగ్గర ఆటంబాంబులు ఉన్నాయి.. వారికి మనం అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్ నేత ఒకాయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఢిల్లీలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. బీజేపి ప్రభుత్వం. పాకిస్థానీ ఎత్తుగడలను తిప్పికొట్టి.. వాళ్ల తొక కట్ చేసి నడ్డి విరిచాం. కాంగ్రెస్ అసమర్థతతో పాకిస్తాన్ ఆడింది ఆటగా సాగింది. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే భారత్ భయపడదు. అసమర్థతతో కాంగ్రెస్ పాకిస్తాన్ను పెంచి పోషించింది. ఇటువంటి కాంగ్రెస్ పుల్వామ మీద మాట్లడటామా?. కాంగ్రెస్ కూటమి వ్యక్తీ ఫరూఖ్ అబ్దుల్లా దేశంలో ఉంటూ.. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ.. పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడతారా?’’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు. -
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: చీరకట్టుకొని జూబ్లీహిల్స్లో బస్ ఎక్కి టికెట్ తీస్కో.. హామీలు అమలవుతున్నయా.. లేదా చెప్పు అన్న సీఎం రేవంత్రెడ్డి మాటలకు బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ ఆదివారం(మే5) ట్వీట్ చేశారు. ‘చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?తెలంగాణలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు నెలకు రూ.2500 ఏవి అని. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్ని బొంద పెట్టేది కూడా తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం.కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి నిలిచింది.తులం బంగారం అడ్రస్ లేదు.ఫ్రీ బస్సు అని బిల్డప్,అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి.అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్కు మహిళల ఓట్లడిగే హక్కు లేదు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది’ అని కేటీఆర్ రేవంత్కు చురకలంటించారు. -
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)ను బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు రేవంత్రెడ్డిపై సీఈవోకు బీఆర్ఎస్ నేతలు బుధవారం(మే1) ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షనేత బీఆర్ఎస్పై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా పవర్ కట్ ఘటనను ఉదాహరిస్తూ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. కాగా, కాం గ్రెస్ ఫిర్యాదుతో ఈసీ కేసీఆర్పై ఇప్పటికే చర్య తీసుకుంది. 48 గంటల పాటు ప్రచారాన్ని ఆపాలని ఆదేశించింది. -
ఎన్నికల తర్వాత రేవంత్ అక్కడికే: కేటీఆర్
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమైన మార్పులు జరుగుతాయని, ఇందులో ప్రధానమైన మార్పు సీఎం రేవంత్రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం(ఏప్రిల్16) ఆదిలాబాద్లో జరగిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్లో గెలిచిన ఎంపీలను తీసుకుని రేవంత్ బీజేపీలోకి పోవడం ఖాయమన్నారు. ‘రాహుల్ గాంధీ మోదీ ని చౌకీదార్ చోర్ హై అంటే..రేవంత్రెడ్డి మాత్రం మా పెద్దన్న అంటున్నాడు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ అంటే.. రేవంత్రెడ్డి తెలంగాణను గుజరాత్ చేస్తానంటున్నాడు. రాహుల్ అదానీ చొర్ అంటే రేవంత్ అదానీ ఫ్రెండ్ను అంటాడు. రాహుల్గాంధీ లిక్కర్ స్కామ్ జరగలేదు,కేజ్రీవాల్ అరెస్ట్ తప్పు అంటే రేవంత్ లిక్కర్ స్కాం జరిగింది కవితను,కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం సబబే అంటాడు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ కొసం పనిచేస్తున్నాడా లేక బీజేపీ కోసం పనిచేస్తున్నాడా?తెలంగాణలో జరగనున్న అన్ని ఎన్నికల్లో ఎగిరేది గులాబి జెండానే. జేబుల్లో కత్తెర పెట్టుకొని రేవంత్రెడ్డి తిరుగుతున్నాడు. పేగులు మెడలో వేసుకుంటా అంటున్నావ్.. అసలు నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోడివా? మేం మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం అని ప్రచారం చేస్తున్నావ్.. నువ్వు అయిదేళ్ళు ఉండాలి. ప్రజలు నిన్ను తరిమికొట్టాలి. బీజేపీ మేకిన్ ఇండియా అని మాటలు చెప్పి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది. శ్రీరాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి.. కవితకు బ్యాడ్టైమ్.. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా -
బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి, హైదరాబాద్: బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్హౌస్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు.. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా వచ్చిన వ్యక్తిని కాదని ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘నిజాయితీకి కట్టుబడి ఉన్నా. ఓ వైపు మంచివాడు అంటూ నన్ను రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. స్వార్దం కోసం ఎన్ని కోట్లు తీసుకొని వెళ్తున్నావు అంటూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.డబ్బు కోసం ఆశపడిన వాడిని అయితే కాంగ్రెస్లో చేరుతా. బీఆర్ఎస్ కాదు. టీఎస్పీఎస్సీ చైర్మర్ ఆఫర్ ఇస్తే.. తిరస్కరించా. నా గుండెల్లో ఎప్పుడూ బహుజన వాదం ఉంటుంది. నేనెప్పుడూ బహుజనులు సంక్షేమం కోసమే పోరాడుతా. రేవంత్ రెడ్డే కాదు నేను కూడా పాలమూరు బిడ్డనే’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర టీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు అభిమానులు ఉన్నారు. -
చేవెళ్ల సభలో సీఏం రేవంత్ హాట్ కామెంట్స్
చేవెళ్ల: నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్డ్డి అన్నారు. కేసీఆర్ మనిషివా.. మానవ రూపంలో ఉన్న మృగానివా? అని సూటిగా ప్రశ్నించారు. చేవెళ్ల కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ‘నీళ్ళ ముసుగులో భారీ దోపిడీ జరిగింది. మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఏ ఆడబిడ్డ కళ్లలో కట్టెల పొయ్యితో నీళ్ళు రావొద్దని.. రూ.500కే గ్యాస్ సిలెండర్ అందిస్తున్నాం. పథకాలు రాలేదని బాధపడోద్దు. ఎమ్మార్వో, ఎంపీడీవో దగ్గరకు వెళ్ళి ఉచిత విద్యుత్ పథకం, రూ.500లకే గ్యాస్ సిలెండర్ అందించే పథకం అందివ్వాలని కోరుతున్నా. కార్యకర్తలు కష్టపడితేనే మేము నాయకులం అయ్యాం. 14 ఎంపీలను గెలిపించే బాధ్యత మనది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత నాది. 5 మంది సభ్యులతో ఇందిరమ్మ కమిటీతో పథకాలు అమలు చేస్తాం. ... అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను మరిచిపోతారనీ అంటారు. నేను మాత్రం కార్యకర్తల కోసం పనిచేస్తా. జిల్లాలు,నియోజకవర్గాల్లో తిరుగుతా. బీజేపీ చెబుతున్న గుజరాత్ మోడల్ అంటే ఎంటి?. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు ఏమైంది?. మా ఊర్లో వడ్లు కొనేవారు లేదు. తాండూరులో కందులు కొనేవాళ్లు లేరు. గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలు పడగొట్టడమా!. ఎన్నికలు వస్తె బీజేపీ నేతలు ఈడి, సీబీఐలను పంపుతారు. బీజేపీ వాళ్లకు ఓటు వేయడం దండగ. కార్యకర్తలు గెలిచినప్పుడే కాంగ్రెస్ది నిజమైన గెలుపు’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మరో ఔరంగజేబులా హరీశ్: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్, హరీశ్రావుపై సీఎం రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్కు కాళ్ల నొప్పులొస్తాయని ఎద్దేవా చేశారు. నల్గొండకు వెళ్లడానికి మాత్రం ఎలాంటి నొప్పులు ఉండవని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేసే కార్యక్రమంతో పాల్గొని మాట్లాడారు. హరీశ్కు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాల్సిందేనని అన్నారు. పదేళ్లు చేసిందేమీ లేదు.. మేము రాగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు. ‘ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్ నిర్లక్ష్యం వహించింది. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. 30లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించాం.త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నాం. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీశ్ అంటుండు. హరీశ్రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. పదేళ్లు మంత్రిగా ఉండి హరీశ్ ఏం చేశారు?. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రు. దశ బాగుంటే దిశతో పని లేదు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలి. ...3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?. మా ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా?. మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపరు. బీఆరెస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే ఒకే గొడుకు కిందకు తీసుకోస్తాం. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కొడంగల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఈ మోడల్ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశిస్తున్నా’ అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు: సీఎం రేవంత్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: గత ప్రభుత్వంలో మెడిగడ్డకు ఎవ్వరినీ చూడనివ్వలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలకు పాల్పడ్డారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సీఎం రేవంత్రెడ్డితో సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి బృందం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రజల ముందు దొషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే కేసీఆర్ నల్గొండ సభ పెట్టారు. కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము.మెడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు. కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మెడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నం అయింది. మెడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమాణించారు. ...కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్ రావు మద్దతు పలికారు. తీర్మానంపై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. భయపడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్కు ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుతం అంటూ న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టును చూపించారు. కేసీఆర్ నల్గొండలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి రావాలి. ఇరిగేషన్పై రేపు శ్వేతపత్రం పెడతాం.. కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మెడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. ...కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మెడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది. రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి. ఎల్ అండ్ టీ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలా వద్దా అనేది కేసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు. ప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు.. అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. ...భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటనకు వెళ్ళాలి. వస్తానన్న బీజేపీ ఎమ్మెలను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. కేసీఆర్ అవినీతిని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
పీవీకి భారత రత్న: రాజకీయ ప్రముఖుల హర్షం
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావును దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి శుక్రవారం భారత రత్న ప్రకటించింది. పీవీకి భారత రత్న దక్కటంపై పలువురు రాజకీయ ప్రముఖలు హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారత రత్న దక్కటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ‘తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ గార్లకు భారతరత్న రావడం సంతోషకరం.’అని ఆయన ఎక్స్ అకౌంట్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ,… pic.twitter.com/yNme5aBsjg — Revanth Reddy (@revanth_anumula) February 9, 2024 తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారత రత్న దక్కడం పట్ల బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ ను గౌరవించి పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మోదీకి ధన్యవాదాలు: ఎమ్మెల్యే కేటీఆర్ ‘దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించడం సంతోషకరం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పీవీఎన్ఆర్ శత జయంతి ఉత్సవాల నుంచి ఈ గౌరవం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’అని ట్విటర్లో పేర్కొన్నారు. Glad that the Union Government has honoured Former Prime Minister Sri PV Narasimha Rao with Bharat Ratna 🙏 I thank PM Sri @narendramodi Ji for this decision We have been demanding the Union Government for this honour since the centenary celebrations of Sri PVNR held by… https://t.co/RPmwHtWo06 — KTR (@KTRBRS) February 9, 2024 భారత రత్న ఇవ్వటం సంతోషంగా ఉంది: పీవీ కుమార్తె.. ఎమ్మెల్సీ సురభీ వాణి దేవి ‘తెలంగాణ గడ్డ మీద పుట్టిన తొలి తెలుగు ప్రధాని మన పీవీ నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పీవీ గారికి భారత రత్న ఇవ్వడంతో భారత రత్న విలువ మరింత పెరిగింది. 1991 నుంచి 1992 భారత దేశ పరిస్థితి ఏ రకంగా ఉండేదో అందరూ ఆలోచించాలి. ప్రజల క్షేమంమే తన జీవితం అని పీవీ గారు అనుకున్నారు. కొంచం లేట్ అయిన పీవీ గారికి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషం. ... అయిన కుటుంబ సభ్యులుగా అందరం ఆనంద పడుతున్నాం. పీవీ గారి శత జయంతి ఉత్సవాలు కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ పీవీ గారిని గుర్తించి భారత రత్న ఇవ్వడం ప్రధానీ మోదీ సంస్కారంకు నిదర్శనం. రాజకీయాలు పక్కన పెట్టీ ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి’ అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ఠీవీ పీవీకి భారతరత్న భేష్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ‘తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవమిది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడం ఆ జిల్లావాసిగా నేను నగర్వపడుతున్నా. దేశం కోసం ఎంతో సేవ చేసిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది. పీవీని కేవలం రాజకీయ లబ్దికే వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ది. రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదములు. .. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తున్నా. మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించడం సముచిత నిర్ణయం’అని బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న దక్కటం దేశప్రజలందరికీ గర్వకారణం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వారి కుటుంబ సభ్యులు ఏనాడూ పీవీ గారిని గౌరవించలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు పీవీ పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. పీవీ తుదిశ్వాస విడిచాక కూడా పార్టీ కార్యాలయంలోకి పార్థివదేహాన్ని రానివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ పీవీ గారిని దారుణంగా అవమానించింది. ఢిల్లీలో పీవీ స్మృతి కేంద్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటుచేయలేదు. ... చివరకు పీవీ అంతిమ సంస్కారంలోనూ ఆటంకాలు కల్పించారు. యూపీఏ పదేళ్ల హయాంలో ఏనాడూ.. పీవీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేయలేదు. దేశానికి పీవీ చేసిన సేవలను బీజేపీ పార్టీ నేతృత్వంలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించి.. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో వారిని గౌరవించడం గొప్ప విషయం’అని కిషన్రెడ్డి తెలిపారు. పీవీకి భారత రత్న ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ‘తెలంగాణ బిడ్డ పివి కి భారత రత్న అవార్డు దక్కడం తెలుగు వారందరికీ గర్వ కారణం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీవీకి భారత రత్న ఇవ్వాలని పలు మార్లు కేంద్రాన్ని కోరారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తెలంగాణ ఠీవి మన పీవీ అని కేసిఆర్ సగర్వంగా అన్ని వేదికల మీద చెప్పారు. పీవీ కూతురు వాణి దేవికి ఎమ్మెల్సిగా అవకాశం కల్పించి వారి కుటుంబానికి సమున్నత గౌరవాన్ని ఇచ్చారు. ట్యాంక్ బండ్ మీద పీవీ విగ్రహం, నెక్లెస్ రోడ్కు పీవీ మార్గ్గా నామకరణం, అసెంబ్లీలో చిత్ర పటం పెట్టిన ఘనత కేసీఆర్దే’అని ప్రశాంత్రెడ్డి తెలిపారు. -
TS: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Updates... పోచారం శ్రీనివాస్ రెడ్డి నేను - సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో కలిసి కష్టపడి పనిచేశాము నేను బీఆర్ఎస్లో అప్పుడే చేరిన. 2011లో రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఎమ్మెల్సీ రేసులో కిరణ్ కుమార్ రెడ్డి లేరు మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ , మహమూద్ అలీ బీఆర్ఎస్ నుంచి రేసులో ఉన్నారు రేవంత్ చెప్పిన ముగ్గురు ఎమ్మెల్యేలు లాలూచీ పడి కాంగ్రెస్కు ఆనాడు ఓటు వేశారు ఆనాడు బీజేపీ లేదు.. మాకు బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవు సీఎం కుర్చీ మార్చాలంటే మేమే వంద మందికి పైగా ఉన్నాము మోడీతో మాకు చర్చలు అవసరం లేదు నిజాలు మాట్లాడితే బాగుంటుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్రెడ్డి కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది 2014-24 వరకు పార్లమెంట్లో ఎవరి పక్షాన నిలిచారు? బీజేపీ, బీఆర్ఎస్ ఒకే ఆలోచనతో నడుస్తున్నాయి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రజా పాలన అంటారు అసెంబ్లీ చుట్టూ ఇనుప కంచెలు వేశారు. ప్రజా ప్రభుత్వంలో దిగ్బంధం ఎందుకు చేస్తున్నారు. పోలీసుల సంఖ్య ఎందుకు పెంచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మాజీ స్పీకర్ సభ ఆర్డర్ లో ఉండటం లేదు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చిన్న వయసులో రేవంత్ సిఎం అయ్యారు. ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. చిల్లర మల్లర రాజకీయాలు, కామెంట్స్ వద్దు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి. ► సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఈ రాత్రికి శాసన మండలిలోనే ఉండే ఆలోచన లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ► కచ్చితంగా శాసన మండలి కి రావాలి, క్షమాపణ చెప్పాలి ఐటి అంశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు గతంలో దావోస్ వెళ్తే విమర్శలు చేసింది కాంగ్రెస్ - పల్లా ఇప్పుడు సిఎం దావోస్ పర్యటనలో అదానీ గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నారు అధానిపై ఆరోపణలు చేస్తూనే ...మరోవైపు ఒప్పందాలు చేసుకుంటుంది కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తాము. నిబంధనల ప్రకారమే పరిశ్రమల ఒప్పందాలు జరిగాయి. ఐటి అభివృద్ధి పై సలహాలు సూచనలు తీసుకుంటాము. ► తెలంగాణ శాసమండలికి భోజన విరామం శాసన మండలిలో గందరగోళం బీఆర్ఎస్ నేతల చిట్టా మా దగ్గర ఉంది: జూపల్లి కృష్ణా రావు ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలపకుండ అడ్డుకోవడం మంచిది కాదు: మంత్రి తుమ్మల సభ గౌరవం పాటించక పోవడం సబబు కాదు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఆర్టీసి బస్సులను పెంచాలి. ఆర్టీసి అంశంపై మాట్లాడుతుండగా అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసి, ఆటోలను పట్టించుకోలేదు. ఆటో, ఆర్టీసి కార్మికులు 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు. ఆటో కార్మికులకు కనీసం 1000 రూపాయలు ఇవ్వని వాళ్ళు బీఆర్ఎస్ ఫ్యూడల్స్ ఆటోలలో వస్తున్నారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కావాలా వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి. ఆర్టీసి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఆర్టీసి అభివృద్ధి పై ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి సీతక్క మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే BRS ఓర్వలేక పోతున్నారు. ఆర్టీసి ఉచిత ప్రయాణం కావాలా వద్దా అనేది సూటిగా చెప్పాలి. BRS మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలు పెట్టింది. గతంలో అగ్గిపెట్టె దొరక్క యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసి ఆస్తులను అమ్ముకున్నది BRS ప్రభుత్వం ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సమావేశం సమావేశం వివరాలను మంత్రులకు చైర్మన్కు వివరిస్తున్న ఎమ్మెల్సీ భాను ప్రసాద్ సీఎం మండలికి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న ఎమ్మెల్సీలు సీఎం రేవంత్రెడ్డి వెంటనే కౌన్సిల్ సభ్యులకు క్షమాపణలు చెప్పే వరకు మండలి నిర్వహించొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు సీఎం డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలు మరోసారి 10 నిమిషాలు మండలిని వాయిదా వేసిన కౌన్సిల్ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కౌన్సిల్ ను బీఆర్ఎస్ సభ్యులు అగౌరపరుస్తున్నారు భారాస ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు పెద్దల సభలో ఓపిక ఉండాలి జూపల్లి కృష్ణారావు మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఈ విషయంలో ప్రొటెక్ట్ చేసే హక్కులేదు అనవసరంగా సభను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పు దోవ పట్టిస్తున్నారు ► కౌన్సిల్ హాల్ ముందు నల్ల కండువాలతో బైటాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ► తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన ► బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా పడింది ► సీఎం రేవంత్రెడ్డి మండలి సభ్యులను అవమానించారని.. మండలి సభ్యులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ► బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నిరసన తెలిపే హక్కు లేదు: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్రెడ్డి బలపరిచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఎసీ అజెండాను టేబుల్ చేయనున్నారు. -
సీఎం రేవంత్రెడ్డి పసలేని ఆరోపణలు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చాక కూడా కాంగ్రెస్ అబద్ధాలు ఆడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. విభజన చట్టాన్ని తయారుచేసింది.. ఆనాటి కాంగ్రెస్ నాయకులు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంతో తమకేం సంబంధం లేదని తెలిపారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమపై సీఎం రేవంత్రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని అన్నారు. రుణమాఫీ, రైతు బంధు, ఉద్యోగాల నోటీఫికేషన్లపై మాట తప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకావటంలేదని ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్పై నెట్టే కుట్రలు: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ నేతల కేటీఆర్, హరీశ్రావు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఆయన సచివాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణ ఇతర అంశాలపై స్పష్టత ఇచ్చారు. ప్రజలను గందరగోళానికి గురిచేసి బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్పై నెట్టే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే విభజన చట్టంలో ఈ అంశాలు పొందుపర్చారని గుర్తుచేశారు. కేసీఆర్ సూచన మేరకే అప్పట్లో ఈ చట్టాన్ని రూపొందించారని అన్నారు. ఇప్పుడు విభజన చట్టం వల్ల రాష్ట్రానికి ఏదైనా నష్టం జరిగితే దానికి కేసీఆరే బాధ్యులని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వంకు అప్పగించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 89 వరకు విధివిధానాలను ఖరారు చేసే రూల్స్ ఫ్రేమ్ చేశారని తెలిపారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే పక్రియకు పునాది రాయి వేసింది 2014లోనని అప్పుడు కేసీఆర్ ఎంపీగా మద్దతు ఇచ్చారని తెలిపారు. -
కుమారి ఆంటీ ఎపిసోడ్లో ట్విస్ట్!
Kumari Aunty News: సోషల్ మీడియాతో వచ్చిన పాపులారిటీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదనే విషయం దాసరి సాయికుమారి అలియాస్ కుమారి ఆంటీకి బోధపడినట్లు ఉంది. ఫేమ్ కోసమో.. తన వ్యాపారం నడవాలనో.. లేక అమాయకత్వంతోనో అడ్డగోలుగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఎక్కడెక్కడి నుంచో జనం క్యూ కట్టడంతో.. ఆమె దుకాణం ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తోందని, మరో చోటుకి తరలించాలని ట్రాఫిక్ పోలీసలు ఆదేశించడం వార్తలెక్కింది. అయితే.. ఈ విషయం అదే సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. కుమారి ఆంటీ వ్యాపారానికి ఇబ్బంది కలిగించవద్దని డీజీపీ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద ఎక్కడైతే ఆమె స్ట్రీట్ఫుడ్ కోర్టు నడుస్తుందో.. అక్కడే నడిపించుకునేందుకు వీలు కల్పించారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె ఇంతలా పాపులర్ కావడానికి కారణమైన ‘ఎక్స్ట్రా టూ లివర్స్’ కస్టమర్తో సహా మళ్లీ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈసారి ఆమె తన సంపాదనతో సోషల్ మీడియాలో ఇంకా నానుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు.. త్వరలో ఆమె ఫుడ్కోర్టును సీఎం రేవంత్రెడ్డి స్వయంగా సందర్శిస్తారని ప్రచారం ఒకటి బయటకు వచ్చింది. ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టి తెగ ఇబ్బంది పెట్టారు.. పాపం. తనకు ఇవేవీ తెలియవని.. దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేయడం వీడియోలో చూడొచ్చు. అయితే.. వాళ్లలో కొందరు సీఎం రేవంత్ రెడ్డి మీ వద్దకు వచ్చినప్పుడు ఈ దరఖాస్తు ఇవ్వాలంటూ ఆమె చేతికి ఇవ్వబోయారు. ఈ ఘటనతో ఇప్పటికే మీ సమస్యను ఆయన(సీఎం రేవంత్) విని ఉంటారని చెబుతూ ఆమె ఆ దరఖాస్తును స్వీకరించేందుకు ఇష్టపడలేదు. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జీవో 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులను మినహాయించాలని గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాంగ్రెస్ కూడా నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. Unemployed protest at Kumari Aunty's food stall! Unemployed protest that Revanth Reddy said he will come to your food stall, tell him to cancel Jivo 46. #KumariAunty #RevanthReddy pic.twitter.com/NZhG4iVU4L — MD HAJI (@MDHAJI63535465) February 3, 2024 Video Credits: MD HAJI ఇదీ చదవండి: సామాన్యులకు సోషల్ మీడియా వరమా? శాపమా? -
TS: రాష్ట్రంలో టెస్లా, బీవైడీ తయారీ ప్లాంట్..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో తయారీ ప్లాంట్ల ఏర్పాటు గురించి టెస్లా, బీవైడీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్లోని భారత హైకమిషన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలను హైదరాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై ‘స్మార్ట్ఫోన్ జాంబీ’లున్నాయి జాగ్రత్త..! ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన బీవైడీ సంస్థకు కేంద్రం గత ఏడాది అనుమతి నిరాకరించింది. టెస్లా రెండు సంవత్సరాలుగా భారతదేశంలోకి ప్రవేశించాలని చూస్తోంది. ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలని టెస్లా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే అందుకు కేంద్రం ఒప్పకోవడం లేదనే వాదనలున్నాయి. -
సీఎం రేవంత్కు మల్లారెడ్డి స్పెషల్ రిక్వెస్ట్..ఏంటంటే..?
సాక్షి,హైదరాబాద్:మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను సోమవారం మల్లారెడ్డి పరామర్శించారు. కేటీఆర్ను కలిసి కేసీఆర్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇంకా రెండుమూడు రోజులు తర్వాత కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ కేసీఆర్ తెలంగాణను ఒక మోడల్గా తయారు చేశారు. కేటీఆర్ లేని హైదరాబాద్ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు’ అని మల్లారెడ్డి అన్నారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో అన్ని సదుపాయాలు మెరుగుపడ్డాయి.లోకల్గా ఎమ్మెల్యే కి ఓటు వెయ్యకూడదని ప్రజలు అనుకున్నారు కానీ సీఎంగా కేసీఆర్ ఉండరని వారు అనుకోలేదు. కేసీఆర్ సీఎంగా లేనందుకు ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నా’ అని మల్లారెడ్డి చెప్పారు. ఇదీచదవండి..సీఎం రేవంత్తో భేటీ..జానారెడ్డి కీలక వ్యాఖ్యలు -
కాటిపల్లి..కామారెడ్డి డబుల్ జెయింట్ కిల్లర్..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. మొత్తంగా కేసీఆర్పై రేవంత్రెడ్డి పైచేయి సాధించారు. అయితే కేసీఆర్, రేవంత్రెడ్డిలు ఇద్దిరినీ ఓడించిన కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి డబుల్ జెయింట్ కిల్లర్గా అవతరించారు. కామారెడ్డిలో పోటీచేసిన ఇరు పార్టీల అధినేతలపై సంచలన విజయం సాధించి వెంకటరమణారెడ్డి పాపులర్ అయ్యారు. కామారెడ్డిలో ఎవరికి ఎన్ని ఓట్లు... ఆదివారం ఉదయం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కామారెడ్డి ఫలితం రౌండ్ రౌండ్కు తీవ్ర ఉత్కంఠ రేపింది. తొలుత ఈ స్థానంలో వెంకటరమణారెడ్డి లీడ్లో ఉండగా తర్వాత రేవంత్రెడ్డి లీడ్లోకి వచ్చారు. చివరి రౌండ్లు లెక్కబెట్టే టైమ్కు రేవంత్రెడ్డిని వెనక్కి నెట్టేసి మళ్లీ వెంకటరమణారెడ్డి లీడ్లోకివచ్చారు. తర్వాత ఒక్కసారిగా కేసీఆర్ ముందుకు దూసుకువచ్చి రేవంత్ను మూడో స్థానానికి నెట్టారు. చివరగా కౌంటింగ్ ముగిశాక కేసీఆర్పై వెంకటరమణారెడ్డి 6741 వేల ఓట్లతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో వెంకటరమణారెడ్డికి 66652 ఓట్లు రాగా, రెండవ స్థానంలో ఉన్న కేసీఆర్కు 59911 ఓట్లు, రేవంత్రెడ్డికి 54916 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి.. ఒకప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్న వెంకటరమణారెడ్డి తర్వాత బీజేపీలో చేరారు.ఈ ఎన్నికల్లో టికెట్ రాకముందు నుంచే ఆయనే బీజేపీ పార్టీ అభ్యర్థి అని కన్ఫామ్ అయిపోయింది. అయితే తర్వాత నియోజకవర్గానికి ఏకంగా ఇటు కేసీఆర్, అటు రేవంత్రెడ్డి పోటీకి వచ్చారు. దీంతో వెంకటరమణారెడ్డిని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఎక్కడా కుంగిపోకుండా, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో వెంకటరమణారెడ్డి తన ప్రచారం చేసుకుంటూ వెళ్లారు. పనిచేసిన లోకల్ కార్డు.. ఎన్నికల ప్రచారంలో వెంకటరమణారెడ్డి వ్యూహాత్మకంగా లోకల్ కార్డును తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ప్రచారంలో వాడి వేడి డైలాగులు ప్రయోగించారు. ‘గజ్వేల్ డిపో నుంచి వచ్చిన బస్సులు గజ్వేల్కు, కొడంగల్ నుంచి వచ్చిన బస్సులు కొడంగల్కు వెళ్లిపోతాయి. కామారెడ్డి డిపో బస్సులు మాత్రం ఇక్కడే ఉంటాయి’ అని తాను స్థానికుడిని అని పరోక్షంగా చెప్పేలా ప్రచారం చేశారు. వెంకటరమణారెడ్డి చెప్పిన ఈ మాటలు అక్కడి ప్రజలను ఆకర్షించింది. కేసీఆర్,రేవంత్రెడ్డిలలో ఎవరు గెలిచినా నియోజకవర్గంలో ఉండరని కామారెడ్డి ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు. ఇదే ఆయన ఇద్దరు బడా నేతలపై విజయానికి కారణమైందని పొలిటికల్ అనలిస్టులు అభిపప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ తరపున గంప గోవర్ధన్ విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగిన విషయం తెలిసిందే. -
విజయశాంతికి ధన్యవాదాలు
-
కేటీఆర్ది మేనేజ్మెంట్ కోటా : రేవంత్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది మేనేజ్మెంట్ కోటా అని, తనది మెరిట్ కోటా అని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్కు ఒకరోజు ముందు శనివారం రేవంత్ ఇంటి వద్ద ఆయన అభిమానులు రేవంత్ సీఎం సీఎం అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు, కేటీఆర్కు మధ్య ఎలాంటి పోలికా లేదని కాంగ్రెస్ రాజకీయ పోరాటమంతా కేసీఆర్తోనేనని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే వెల్లడైన తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీలోనే కొందరు రేవంత్రెడ్డి సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. బక్క జడ్సన్ లాంటి ఎస్సీనేత రేవంత్కు సీఎం పదవి ఇవ్వొద్దు అని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ప్లకార్డులు ప్రదర్శించి మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్కు మద్దతిచ్చిన వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల కూడా పరోక్షంగా రేవంత్ సీఎం అభ్యర్థిత్వాన్ని తోసిపుచ్చారు. పార్టీలో ఆయనకన్నా విశ్వసనీయత కలిగిన నేతలున్నారని మీడియా సమావేశంలోనే డైరెక్టుగా చెప్పారు. ఇదీచదవండి..రంగంలోకి డీకే.. స్పెషల్ ఫ్లైట్లు రెడీ! -
మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్కు మీరు ఓ లెక్కా: రేవంత్రెడ్డి
సాక్షి,నర్సాపూర్ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. నర్సాపూర్లో జరిగిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు. ‘ఇక్కడి ఎమ్మెల్యే మదన్ రెడ్డి , కేసీఆర్ స్నేహితులు అంటారు. మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్కు మీరు ఓ లెక్కా. మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే. పార్టీ ఫిరాయించిన సునీతా లక్ష్మా రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని సిరిసిల్ల జోన్లో కలిపి నిరుద్యోగులను మోసం చేశారు. మేం అధికారంలోకి వస్తే చార్మినార్ జోన్లో కలిపే అవకాశాన్ని పరిశీలిస్తాం. నర్సాపూర్ గడ్డ..లంబాడీల అడ్డ మేం అధికారంలోకి వస్తే తండాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు బంగారు పళ్లెంలో తింటూ బంగారు తెలంగాణ అంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో, బెల్టు షాపుల్లో తెలంగాణ నెంబర్ వన్ చేసిండు కేసీఆర్. పార్టీ మారి మోసం చేసిన సునీతా లక్ష్మా రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి. ఆమె కోసం ప్రచారం చేస్తే నాపై కేసులు పెట్టారు. ఆమె మాత్రం కేసీఆర్ పార్టీలో చేరారు. నమ్మక ద్రోహులు ఎవరైనా సరే బండకేసి కొట్టాలి. అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులకు, గిరిజనులకు భూములు పంచి ఇచ్చిన రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం 12 లక్షల పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం నాగార్జున సాగర్, శ్రీ శైలం కట్టింది. ఇందిరమ్మ రాజ్యం ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది. ఇందిరమ్మ రాజ్యం రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర నువు బిచ్చం ఎత్తుకుని బతికేటోడివి’ అని రేవంత్రెడ్డి కేసీఆర్పై ఫైర్ అయ్యారు. ఇదీచదవండి..కాంగ్రెస్ తెచ్చేది భూ మాత కాదు..భూ మేత : కేసీఆర్ -
ఆయన రేవంత్ రెడ్డి కాదు..రైఫిల్ రెడ్డి : సీఎం కేసీఆర్ ఫైర్
సాక్షి, జనగాం : రేవంత్రెడ్డికి ఆయన పార్టీ నేతలే రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ రేవంత్రెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్రెడ్డి ఉద్యమకారులపై తుపాకులు పట్టుకుని తిరిగాడని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రోళ్ల బూట్లు మోశాడని మండిపడ్డారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, పిచ్చికుక్కలు మొరిగితే పట్టించుకుంటామా అని దుయ్యబట్టారు. ‘ మన దేశంలో ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదు. ఎన్నికలు వస్తే అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి సభలు జరగవు. అక్కడ టీవీల్లో చర్చలు పెడతారు. ప్రజాస్వామ్యంలో పరిణితి సాధించిన దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాయి. మనదగ్గర ఎన్నికలు వస్తే నేరాలు ఘోరాలు, అబాంఢాలు పుట్టుకొస్తాయి. ఎన్నికల్లో ఎవరో చెప్పారని నిర్ణయం తీసుకోవద్దు. అన్ని విషయాలపై చర్చించి ఓటు ఎవరికేయాలో నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల్లో అభ్యర్థితో పాటు పార్టీ చరిత్రను పరిశీలించాలి. మనం వేసే ఓటు ఐదేళ్ల తలరాతను మారుస్తుంది. 2004 ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ తెలంగాణను మోసం చేసింది. బీఆర్ఎస్ను చీల్చాలని ప్రయత్నం చేసింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఇప్పుడు బచ్చన్నపేట చెరువు నిండుగా కనిపిస్తోంది. రైతులకు రైతు బంధు ఇచ్చిందెవరు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. ఎవరికి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయించాలి. 3 గంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ అంటున్నాడు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ అంటున్నడు. ధరణిని బంగాళాఖాతంలో పారేద్దామని భట్టి విక్రమార్క అంటున్నాడు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా 3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోవాలి. ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం. పల్లారాజేశ్వర్రెడ్డి నాతోనే ఉంటాడు. జనగామను అభివృద్ధి చేసే బాధ్యత నాది’అని కేసీఆర్ అన్నారు. ఇదీచదవండి.. అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో రూ. 6.5 కోట్ల పట్టివేత.. ఆ లీడర్వేనని అనుమానాలు? -
150 కోట్ల మంది చూపు కామారెడ్డి వైపే : రేవంత్రెడ్డి
సాక్షి, కామారెడ్డి : పది సంవత్సరాలు కష్టాలు పడ్డామని, కేసీఆర్కు తిరిగి చెల్లించే సమయం వచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. ఇవాళ కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి ఎన్నికల తీర్పు భారత దేశ చరిత్రలో గొప్ప తీర్పుగా నిలవాలన్నారు. 150 కోట్ల మంది కామారెడ్డి వైపు చూస్తున్నారన్నారు. ‘డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెట్టి గెలవాలనుకుంటున్నాడు కేసీఆర్. తెలంగాణలో ఉచిత కరెంట్, మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనతో లేరు కానీ ఆయన హయాంలో 12 వేల కోట్ల రూపాయల కరెంటు బకాయిల రద్దు చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీ , ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ, మేడిగడ్డ, పాలమూరు ప్రాజెక్టు గురించి కేసీఆర్ మాట్లాడతలేడు. ప్రపంచం మొత్తం కామారెడ్డి వైపు చూస్తోంది. ఎమ్మెల్యేగా ఎక్కడైనా గెలుస్త కానీ కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి కామారెడ్డికి వచ్చిన. కామారెడ్డి రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోంది. కర్ణాటకలో గెలిచినట్లుగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ జెండా ఎగురవేస్తుంది 24 గంటల ఉచిత విద్యుత్పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధం. తెలంగాణలో 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్లో, ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటా. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉంది. లాగ్బుక్లు తీసుకుని కామారెడ్డికి రా’ అని రేవంత్ సవాల్ విసిరారు. దొరల రాజ్యానికి..ప్రజల రాజ్యానికి పోటీ.. షబ్బీర్ అలీ ‘కామారెడ్డిలోని పచ్చని భూములపై కేసీఆర్ కన్ను పడింది. కామారెడ్డిలో కేసీఆర్పై రేవంత్రెడ్డి పోటీ చేయలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టం. కామారెడ్డిలో దొరల రాజ్యానికి ప్రజల రాజ్యానికి మధ్య పోటీ జరుగుతోంది. ప్రతి కార్యకర్త నేనే రాహుల్ గాంధీ, నేనే సోనియా గాంధీ, నేనే రేవంత్ రెడ్డి, నేనే షబ్బిర్ అలీ అని భావించుకొని పనిచేయాలి’ అని షబ్బీర్ అలీ కోరారు. ఇదీచదవండి..శుభకార్యాలు.. ప్రచారాలు -
రేవంత్ కంటే కేసీఆరే మంచోడు: ఎంపీ అర్వింద్
సాక్షి, మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆదివారం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆరే మంచోడని అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కోరుట్లలో అర్వింద్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించి దూసుకుపోతున్నారు. ఇంట్రస్టింగ్ కామెంట్లతో పాటు తిట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే అర్వింద్ రేవంత్ కంటే కేసీఆర్ మంచోడని అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ పోరు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగగ్రెస్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే రేవంత్ కంటే కేసీఆర్ బెటరని అర్వింద్ అన్నట్లు తెలుస్తోంది. -
ఈనెల 4న సుప్రీకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
తెలంగాణ కాంగ్రెస్ లో రగులుతున్న బీసీ చిచ్చు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement