-
ఖైదీల నుంచి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు
న్యూఢిల్లీ: జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు సుకేశ్ చంద్ర శేఖర్ వంటి హై ప్రొఫైల్ ఖైదీల నుంచి ఢిల్లీ జైళ్ల శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆ శాఖ మాజీ డీజీ సందీప్ గోయెల్ కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు వారిపై కేసు నమోదుకు అనుమతివ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కోరింది. సత్యేందర్ జైన్తోపాటు జైలు అధికారి రాజ్కుమార్లపై కేసు నమోదు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు, సస్పెండైన ఐపీఎస్ అధికారి గోయెల్, రిటైర్డు ఐఏఎస్ ముకేశ్ ప్రసాద్లపై చర్యలకు కేంద్ర హోం శాఖకు వినతి పంపినట్లు సీబీఐ వివరించింది. వసూళ్లకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది గోయెల్ను కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది. జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ 2018–21 సంవత్సరాల మధ్య సుమారు రూ.12.50 కోట్లను వేర్వేరు మార్గాల్లో వీరికి ముట్టజెప్పినట్లు తమకు సమాచారం ఉందని సీబీఐ అంటోంది. -
ఇక నేరగాళ్ల ఆటకట్టు
న్యూఢిల్లీ: నేరగాళ్ల ఆట కట్టించే దిశగా నగర పోలీసు శాఖ అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా ఇటీవల జీపీఎస్ ఆధారిత ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సంబంధిత సిబ్బంది పకడ్బందీగా గస్తీ విధులను నిర్వర్తిస్తున్నారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ఉత్తర ఢిల్లీలో ఇంటరె నట్ ఆధారిత గస్తీని నిర్వహిస్తోంది. ఈ వాహనాలను సివిల్స్లైన్స్ స్టేషన్లో పోలీసు శాఖ జాయింట్ కమిషనర్ సందీప్ గోయల్ ప్రారంభించిన సంగతి విదితమే. జీపీఎస్ పరికరాలను అమర్చిన ఈ వాహనాలను ఇంటర్నెట్ పోర్టల్తో అనుసంధానం చేశారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగించారు. ఈ సాఫ్ట్వేర్ కారణంగా ద్విచక్ర వాహనాలు గస్తీ చేస్తున్న ప్రాంతాలను స్టేషన్ హౌస్ అధికారి (ఎస్హెచ్ఓ)తోపాటు ఉన్నతాధికారులు కూడా నేరుగా తిలకించేవీలుంది. ఈ విషయమై ఉత్తర విభాగం డీసీపీ మాధుర్ వర్మ మాట్లాడుతూ ‘పాస్వర్డ్ను టైప్చేసిన తర్వాత ఈ పోర్టల్ను తిలకించేందుకు వీలవుతుంది. గస్తీ విధుల్లో పాల్గొంటున్న వాహనాలు ఏయే ప్రాంతా ల్లో సంచరిస్తున్నాయనే విషయం తక్షణమే తెలిసిపోతుంది. గస్తీ విధుల్లో ఉన్న సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మరికొంతమందిని తక్షణమే అక్కడికి పంపేందుకు కూడా వీలవుతుంది. ఒక్కో బైక్ను ఒక్కో ప్రాంతానికి కేటాయించడం జరుగుతుంది. ఈ బైక్లు తమ పరిధిని దాటి అవతలికి పోతే తక్షణమే ఎస్హెచ్ఓ. ఏసీపీలకు ఓ సందేశం అందుతుంది. దీంతో ఈ వాహనాలు ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాయనే దానిపై ఆరా తీయగలుగుతాం’ అని అన్నారు. కాగా ఈ విధానం తూర్పు, ఈశాన్య ఢిల్లీ పరిసరాల్లో ఇప్పటికే అమలులో ఉంది. అక్కడ విజయవంతంగా నడుస్తోంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల తోపాటు చిన్న చిన్న వీధుల్లో గొలుసు దొంగతనాలు, నేరాలు జరిగితే తక్షణమే సమాచారం అందుతోంది. వేకువజామునగానీ లేదా బాగా పొద్దుపోయిన తరువాతగానీ జరిగే నేరాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుతోంది. నేరగాళ్లను వెంటనే అదుపులోకి తీసుకోగలుగుతున్నారు. తదుపరి చర్యలకు ఉపక్రమించేందుకు వీలవుతోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణ నలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఈ విధానాన్ని నగరంలోని మిగతా అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసే దిశగా ముందుకుసాగుతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement