-
కేంద్ర వ్యవసాయ మంత్రిగా మాజీ సీఎం? ప్రధాని మోదీ లేఖలో స్పష్టం?
గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా, శివరాజ్సింగ్ చౌహాన్ను బీజేపీ తిరిగి ముఖ్యమంత్రిని చేయలేదు. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవల శివరాజ్సింగ్ చౌహాన్కు ప్రధాని మోదీ రాసిన లేఖ ఇటువంటి వార్తలకు కారణంగా నిలుస్తోంది. ‘దేశంలోని వ్యవసాయరంగంలో మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని మోదీ.. శివరాజ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయని కూడా మోదీ ఆ లేఖలో శివరాజ్ను ప్రశంసించారు.ప్రధాని మోదీ మాజీ సీఎం శివరాజ్ సింగ్కు రాసిన లేఖలో ‘మీకు విద్యార్థి రాజకీయాలలో అపారమైన రాజకీయ అనుభవం ఉంది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ పదవీకాలంలో మధ్యప్రదేశ్ అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మీరు రాష్ట్రంలో సానుకూల అభివృద్ధిని తీసుకువచ్చారు. మహిళలు, పిల్లలు, యువత సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు మిమ్మల్ని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. మిమ్మల్ని ‘మామాజీ’ అని పిలుస్తూ, గౌరవిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయి.సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులను వృద్ధి చేయడం, ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం నూతన మార్గాలు ఏర్పాటు చేయడం లాంటి పనులు చేపట్టారు. వ్యవసాయంలో స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేశారు. విదిశ నుండి మీరు వరుసగా ఐదు సార్లు ఎన్నిక కావడం అనేది ప్రజలకు సేవ చేయాలనే మీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. త్వరలో మీరు పార్లమెంటుకు చేరుకుంటారని, కొత్త ప్రభుత్వంలో మనమందరం కలిసి దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తామని నేను నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు. -
బీజేపీకి 20 ఏళ్ల కంచుకోట.. ఈసారి కష్టమేనా?
మధ్యప్రదేశ్. బీజేపీకి కంచుకోట వంటి రాష్ట్రం. మధ్యలో ఓ 15 నెలలు మినహాయిస్తే గత 18 ఏళ్లుగా అక్కడ బీజేపీదే అధికారం. అదే ఈసారి కొంప ముంచవ చ్చని ఆ పార్టీ భయపడుతోంది. అందుకే ముందుజాగ్రత్తగా సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. తద్వారా వ్యతిరేక ఓటు కాస్తయినా తగ్గుతుందన్నది బీజేపీ ఆశ. ఇక కాంగ్రెస్ గత 20 ఏళ్లలో బీజేపీ కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించింది 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే. ఏకైక పెద్ద పార్టీగా అధికారం చేపట్టినా అది 15 నెలల ముచ్చటగానే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీతో అధికారాన్ని ఒడిసిపట్టాలని కాంగ్రెస్ గట్టిగా పోరాడుతోంది. బీజేపీ కూడా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ క్రమంలో సీఎం శివరాజ్ అనేకానేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. మరెన్నో హామీలు గుప్పించారు. ప్రచారంలో ఇరు పార్టీలూ హోరాహోరిగా తలపడ్డాయి. చివరికి ప్రచార పర్వం ముగిసింది. ఇక అందరి దృష్టీ శుక్రవారం జరగనున్న కీలక పోలింగ్పైనే నెలకొంది. ఈ నేపథ్యంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే. విశేషాలు... మధ్యప్రదేశ్లో మొత్తం ఓటర్లు 5.5 కోట్లు పురుష ఓటర్లు 2.88 కోట్లు మహిళా ఓటర్లు 2.72 కోట్లు 2008 ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 143 అసెంబ్లీ స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంది. శివరాజ్సింగ్ చౌహాన్ వరుసగా రెండోసారి సీఎం అయ్యారు. 2005లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఆయన ఈ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బీజేపీకి 37.64 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు 32.39 శాతమే వచ్చాయి. ఆ పార్టీ 71 స్థానాల్లో నెగ్గింది. ఇక బీఎస్పీ 8.27 శాతం ఓట్లతో 7 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. మరోసారి ఓటమి పాలైనా, 2003 అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించిన సంతృప్తి కాంగ్రెస్కు మిగిలింది. 2003లో ఆ పారీ్టకి కేవలం 38 స్థానాలే రాగా బీజేపీ ఏకంగా 173 సీట్లు నెగ్గింది. 2013 ఈసారి బీజేపీ ఏకంగా 44.88 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం 36.38 శాతానికి పరిమితమైంది. బీఎస్పీకి 6.29 శాతం వచ్చాయి. బీజేపీ 165 సీట్లతో సత్తా చాటగా కాంగ్రెస్ కేవలం 58 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. శివరాజ్సింగ్ చౌహాన్ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అంతటి బీజేపీ హవాలోనూ 30 మంది మంత్రుల్లో ఏకంగా ఏడుగురు ఓటమి చవిచూడటం విశేషం! బీఎస్పీ 4 అసెంబ్లీ స్థానాలు సాధించి ఉనికి చాటుకుంది. అనంతరం 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మధ్యప్రదేశ్లో బీజేపీ హవాయే నడిచింది. 29 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 27 నెగ్గగా కాంగ్రెస్ రెండింటికి పరిమితమైంది. 2018 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలతో అతి పెద్ద ఏకైక పార్టీగా నిలిచింది. బీజేపీకి 109 సీట్లొచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒక గమ్మత్తు చోటుచేసుకుంది. కాంగ్రెస్కు 40.89 శాతం ఓట్లు రాగా బీజేపీకి అంతకంటే కాస్త ఎక్కువగా 41.02 శాతం వచ్చాయి! బీఎస్పీ 5.01 శాతం ఓట్లు సాధించింది. ఒక సమాజ్వాదీ ఎమ్మెల్యే, ఇద్దరు బీఎస్పీ, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో 15 ఏళ్ల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ దాదాపుగా క్లీన్స్వీప్ చేసింది. 29 స్థానాలకు గాను ఏకంగా 28 సీట్లు నెగ్గింది. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అదే ఊపులో మరుసటి ఏడాదే కాంగ్రెస్కు బీజేపీ గట్టి షాకిచి్చంది. 2020 మార్చిలో ప్రపంచమంతా కరోనా లాక్డౌన్ గుప్పెట్లోకి వెళ్లేందుకు కాస్త ముందు ఏకంగా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు! అసంతృప్త నేత జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో వారంతా బీజేపీ గూటికి చేరారు. దాంతో కమల్నాథ్ సర్కారు 15 నెలల్లోపే కుప్పకూలింది. బీజేపీ అధికారంలోకి రావడం శివరాజ్సింగ్ చౌహాన్ మరోసారి సీఎం కావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం జరిగిన ఉప ఎన్నికల ఫలితాల అనంతరం అసెంబ్లీలో బీజేపీ బలం 128కి పెరిగితే కాంగ్రెస్ బలం 98 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది. -
పొమ్మనలేక పొగ!
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుతోంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీలో ముగ్గురు కీలక నేతల పరిస్థితి ఆసక్తికరంగా మారింది. శివరాజ్సింగ్ చౌహాన్, వసుంధర రాజె సింధియా, రమణ్సింగ్ గతంలో అన్నీ తామై ఒంటి చేత్తో ఎన్నికల భారం మోసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బీజేపీ అధిష్టానం కొత్తగా తెరపైకి తెచ్చిన సమష్టి నాయకత్వ సూత్రాన్ని మూడు రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దీని అసలు ఉద్దేశం వారు ముగ్గురినీ పక్కన పెట్టడమేనని చెబుతున్నారు. అక్కడ సీఎం అభ్యర్థులుగా ఎవరినీ ప్రకటించకపోవడం అందులో భాగమేనని అంటున్నారు. శివరాజ్కు బై బై...! మధ్యప్రదేశ్లో శివరాజ్ రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముఖ్యంగా సీఎంగా ఉమాభారతి దారుణమైన పనితీరు అనంతరం బాబూలాల్ గౌర్కు అవకాశమిచ్చి భంగపడ్డాక చివరికి శివరాజ్కు ప్రభుత్వ పగ్గాలను పార్టీ అప్పగించింది. దాన్ని ఆయన రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. వరుసగా రెండుసార్లు పార్టీని గెలిపించి 13 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నరేంద్ర మోదీ ప్రాభవానికి ముందు జాతీయ స్థాయిలో బీజేపీలో కీలక నేతగా ఎదిగేలా కనిపించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైంది. కమల్నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలి 2020లో నాలుగోసారి శివరాజ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇమేజీ, ఆదరణ ఈ మూడు సంవత్సరాల్లో క్రమంగా తగ్గుముఖమే పడుతూ వచ్చాయి. దాంతో మోదీ–అమిత్ షా ద్వయం ఆయనపై బాగా అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అందుకే ఈసారి శివరాజ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లరాదని నిర్ణయించారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికలకు కొద్ది నెలల ముందునుంచే శివరాజ్ ప్రాధాన్యం మరింత తగ్గుతూ వచి్చంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు సీనియర్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం ఆ దిశగా మరింత బలమైన సంకేతాలే అని చెప్పొచ్చు. ► ఈసారి బీజేపీ నెగ్గినా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ వర్గీయ ముఖ్యమంత్రి అభ్యర్థులవుతారని చెబుతున్నారు. ► లేదంటే మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడం ద్వారా కమల్నాథ్ సర్కారు పుట్టి ముంచిన జ్యోతిరాదిత్య సింధియాకు కుర్చీ దక్కినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. వసుంధరకు వీడ్కోలే..! రాజస్తాన్లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకురాలు వసుంధర రాజె సింధియాదీ దాదాపు అదే పరిస్థితిలా ఉంది. భైరాన్సింగ్ షెకావత్ అనంతరం రాష్ట్రంలో పార్టీని సమర్థంగా నడిపిన నాయకురాలిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఈ రోజుకూ రాజస్తాన్ బీజేపీలో కరిష్మా ఉన్న నాయకురాలు వసుంధరా రాజె మాత్రమే. అంతేగాక ప్రజాదరణ విషయంలో ఇప్పటికీ ఆమెకు తిరుగులేదనే చెప్పాలి. ఆమెకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నాయకత్వం తెరపైకి తెస్తున్న అర్జున్రామ్ మెఘ్వాల్, సతీశ్ పునియా, సీపీ జోషీ, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా తదితరులెవరూ సామాన్య ప్రజానీకంలో మంచి ప్రజాదారణ ఉన్న నాయకులు కాదు. పైగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వారికి పెద్ద ఆదరణ లేదు. అయినా సరే, బీజేపీ ఈసారి వసుంధరకు పెద్దగా ప్రాధాన్యమివ్వకుండానే ఎన్నికల బరిలోకి దిగింది! కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఆయన మంత్రివర్గ సహచరులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలకు ప్రధానిగా మోదీ కరిష్మా తోడై సులువుగా గెలుస్తామని నమ్ముతోంది. అనంతరం రాష్ట్రంలో కొత్త నాయకులను తీర్చిదిద్దుకోవడం కష్టమేమీ కాదనే భావనలో ఉంది. రమణ పర్వానికి తెర! కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో బీజేపీ పరిస్థితి మరీ ఆశావహంగా ఏమీ లేదు. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ దూకుడు మీదున్నారు. రకరకాల సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల హామీల సమర్థ అమలు ఆయనకు మరింతగా కలిసొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 15 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా చేసిన రమణ్సింగ్ను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టినట్టుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగించేదే. ఫలితంగా బీజేపీకి ఒకరకంగా రాష్ట్రాస్థాయి కీలక నాయకత్వమంటూ లేకుండా పోయింది. ఏదేమైనా రాష్ట్రంలో పారీ్టకి కొత్త రక్తాన్ని ఎక్కించడమే మోదీ–అమిత్షా ద్వయం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఫలితంగా ఇక్కడ కేవలం మోదీ కరిష్మా మీదే భారం వేసి బీజేపీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. కానీ హిమాచల్ ప్రదేశ్లోనూ, అనంతరం కర్ణాటకలోనూ ఇదే ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న వైనాన్ని తలచుకుని బీజేపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల వేళ.. మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ
భోపాల్: అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా బీజేపీకే చెందిన ఎమ్మెల్యేలు రాజేందర్ శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధిలను కేబినెట్లోకి తీసుకున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాల్లో సమతూకం పాటించే లక్ష్యంతో ఒక బ్రాహ్మణ, ఇద్దరు ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) వీరికి తాజాగా ప్రమోషన్ ఇచి్చనట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముగ్గురితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. తాజా విస్తరణతో మంత్రుల సంఖ్య 34కు చేరింది. -
వలంటీర్ వ్యవస్థ బాగుంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇంటి వద్దే ప్రభుత్వ పథకాలు, సేవలను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించడం, 2.62 లక్షల మందికి గ్రామస్థాయిలో సేవ చేసే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. దీనిపై తక్షణం అధ్యయనం నిర్వహించి నివేదిక సమరి్పంచాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. సీఎం శివరాజ్సింగ్ ఆదేశాల మేరకు ఆయన ఓఎస్డీ లోకేష్ నవరత్నాలు, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ గురించి ‘సాక్షి’ ప్రతినిధి నుంచి వివరాలను సేకరించారు. మరి కొద్ది నెలల్లో మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి భోపాల్లోని తన అధికారిక నివాసంలో మీడియాతో సీఎం శివరాజ్సింగ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీలో అమలవుతున్న పలు పథకాల గురించి ఆరా తీశారు. ఆ వివరాలివీ.. ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 500కిపైగా సేవలందించడం, ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరు చొప్పున నియమించడం వినూత్నం, అభినందనీయం. యువతకు స్థానికంగా తోటివారికి సేవలందించే అవకాశం లభిస్తుంది. ► ఎలాంటి పడిగాపులు లేకుండా ఇంటివద్దే రేషన్ సరుకులు అందించడం కూడా బాగుంది. ► ప్రజాస్వామ్యంలో అందరినీ స్వాగతిస్తాం. బీఆర్ఎస్ పార్టీ మరింత జోరుగా మా రాష్ట్రానికి రావచ్చు. అయినా తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి దేశం మొత్తానికి తెలుసు. -
ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు
భోపాల్: హిందీలో వైద్య విద్యను అందించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రికార్డు సృష్టించనుందని ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. హిందీలో వైద్య విద్య పూర్తిచేసిన డాక్టర్లు ఇకపై ప్రిస్కిప్షన్లపై తొలుత ‘శ్రీహరి’ అని రాసి తర్వాత మందుల పేర్లు రాయొచ్చన్నారు. ‘‘పిల్లల్లో హిందీ పట్ల అభిమానాన్ని పెంచాలి. ఇంగ్లిష్ మందుల పేర్లను హిందీలో రాస్తే వచ్చి ఇబ్బంది ఏమిటి?’’ అన్నారు. మధ్యప్రదేశ్లో వైద్య విద్యను హిందీ భాషలో బోధించేందుకు రంగం సిద్ధమయ్యింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం భోపాల్లో హిందీలో వైద్య పాఠ్యపుస్తకాలను విడుదల చేయనున్నారు. -
‘సూపర్ మామ్’ కాలర్వాలీ ఇక లేదు.. సీఎం చౌహాన్ విచారం
సియోని (మధ్యప్రదేశ్): ఆవు, గేదె లాంటివి తమ జీవితకాలంలో అధికసంఖ్యలో పిల్లలను కంటే దాని యజమానుల ఆనందమే వేరు. సంతాన లక్ష్మి, అంటూ సగర్వంగా చెప్పుకుంటారు. అలాంటిది ఏకంగా 29 పిల్లల్ని కంటే. ఈ పులి అదే చేసింది. 29 పులి పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వు (పీటీఆర్)కు గర్వకారణంగా నిలిచిన ఈ విఖ్యాత పులి పేరు ‘కాలర్వాలీ’. ఈ సూపర్ మామ్ 17 ఏళ్ల వయసులో శనివారం కన్నుమూసింది. పులి సాధారణ జీవితకాలం 12 ఏళ్లు. కాలర్వాలీ దానికి మించి ఐదేళ్లు బతికి వృద్ధా్దప్య సమస్యలతో మరణించింది. చివరిసారిగా ఈనెల 14న సందర్శకులకు కనిపించిన కాలర్వాలీ చాలా బలహీనంగా ఉందని, వారం రోజులుగా దాని ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని పెంచ్ టైగర్ రిజర్వ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకే కాన్పులో ఐదు పిల్లలు... కాలర్వాలీ మొత్తం ఎనిమిది కాన్పుల్లో 29 పులి పిల్లలకు జన్మనివ్వగా... ఇందులో 25 బతికాయి. 2008లో మొదటిసారిగా తల్లి అయిన కాలర్వాలీ మూడు పిల్లలను కన్నది. దురదృష్టవశాత్తు ఇందులో ఒక్కటీ బతకలేదు. 2010 అక్టోబరులో ఒకే కాన్పులో ఐదు పిల్లలకు (నాలుగు మగ కూనలు, ఒక ఆడపులి పిల్ల) జన్మనిచ్చింది. చివరిసారిగా 2018 డిసెంబరులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దాంతో ఈ మహాతల్లి కడుపున పుట్టిన పులి పిల్లల సంఖ్య 29కి చేరింది. అడవిలో పులుల సంఖ్య గణనకు, వాటి ప్రవర్తనను గమనించేందుకు, జాడను కనిపెట్టేందుకు రేడియో సిగ్నల్స్ను పంపే పట్టీలకు పులుల మెడకు కడతారు. 2008లో కట్టిన పట్టీ పనిచేయకపోవడంతో 2010 మరో పట్టీని ‘టి15’గా పిలిచే ఈ పులికి కట్టారు. దాంతో దీనికి కాలర్వాలీ అనే పేరొచ్చింది. మధ్యప్రదేశ్లో 526 పులులున్నాయి. 2018లో అత్యధిక పులులున్న రాష్ట్రంగా అవతరించిన మధ్యప్రదేశ్ భారతదేశపు ‘టైగర్ స్టేట్’గా గుర్తింపు పొందింది. కాలర్వాలీ పెంచ్ రిజర్వు పెద్ద ఆకర్షణగా ఉండేది. ‘సూపర్ మామ్ కాలర్వాలీకి నివాళులు. 29 పిల్లలతో మధ్యప్రదేశ్కు గర్వకారణంగా నిలిచింది. అని రాష్ట్ర సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఓ ట్వీట్లో విచారం వ్యక్తం చేశారు. मप्र को टाइगर स्टेट का दर्जा दिलाने में महत्वपूर्ण भूमिका निभाने वाली, मध्यप्रदेश की शान व 29 शावकों की माता @PenchMP की ‘सुपर टाइग्रेस मॉम’ कॉलरवाली बाघिन को श्रद्धांजलि। पेंच टाइगर रिजर्व की 'रानी' के शावकों की दहाड़ से मध्यप्रदेश के जंगल सदैव गुंजायमान रहेंगे। pic.twitter.com/nbeixTnnWv — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 16, 2022 -
వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లు..
సాక్షి, సిద్దిపేట: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్పై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని విమర్శించే నైతిక హక్కు శివరాజ్సింగ్ చౌహాన్కు లేదని నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియా మీడియాతో మాట్లాడుతూ, విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలన్నారు. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని.. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లు ఉంది. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం పదవి పొందిన శివరాజ్కి సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు లేదు. సీఎంగా నాలుగేళ్లలో ఏం సాధించావు. ఏ రంగంలో మధ్యప్రదేశ్ అభివృద్ధి సాధించింది’’ అంటూ దుయ్యబట్టారు. వ్యాపం సంగతేంటి? మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం జరిగింది. ఆ కేసులో ఎవరికైనా శిక్ష పడిందా..? విచారణ నీరుగార్చేందుకు మనుషులనే మీరు చంపేశారు. ఈ విషయంలో మీ కుటుంబం మీద, మీ పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. అలాంటి మీరా తెలంగాణలో అవినీతి ఉందంటూ ఆరోపణలు చేసేది అంటూ దుమ్మెత్తిపోశారు. రాజకీయ దురుద్దేశాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టంగా చెప్పారు. విమర్శలు చేసే ముందు ఓ సారి నిజానిజాలు పరిశీలించుకోవాలని’’ హరీశ్రావు అన్నారు. ఉద్యోగాలు రావొద్దా ? 317 జీవో రద్దు చేయాలంటున్నారు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా ? ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని సీఎం ప్రయత్నిస్తుంటే.. ఇక్కడి వారికి ఉద్యోగాలు రావద్దన్నట్టుగా బీజేపీ కుట్ర చేస్తోందంటూ హరీశ్ మండిపడ్డారు. -
అసెంబ్లీలో ‘పప్పూ’ ‘దొంగ’ పదం నిషేధం
భోపాల్: వాస్తవంగా నాలుగు నెలలకోసారి చట్టసభల సమావేశాలు జరగాలి. కానీ ప్రభుత్వాలు రాజకీయాలతో చట్టసభల ప్రాధాన్యం తగ్గిస్తున్నాయి. ఒకవేళ సమావేశాలు నిర్వహిస్తే అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కైనట్టు ఒక్కనాడు కూడా సక్రమంగా జరగవు. ఈ సమావేశాల్లో వాగ్వాదాలు ఏర్పడి ఒక్కోసారి తీవ్రస్థాయిలో వాదనలు ఉంటాయి. ఈ సమయంలో పచ్చిబూతులు కూడా వస్తుంటాయి. స్పీకర్ వాటిని వినలేకపోతుంటారు. తూక్కెత్తా అంటే తూక్కెత్తా అంటూ మాటల దుమారం ఏర్పడుతుంది. ఇలా సభలో అన్పార్లమెంటరీ భాష వినియోగం అధికమవుతుండడంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సభలో కొందరు సభ్యులు పలికిన పదాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఆ విధంగా నిషేధించిన పదాల వివరాలతో ఓ పుస్తకం విడుదల చేసింది. ఈ క్రమంలో కొన్ని పదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో పప్పూ అనే పదం కూడా నిషేధం ఉండడం గమనార్హం. ఈ పదంతో తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఒకరు గుర్తుకు వస్తుంటారు. తమ నేతను ఆ పదంతో సంబోధిస్తున్నారనే ఉద్దేశంతో ఈ పదాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. మొత్తం 38 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో 1,161 పదాలు నిషేధంలో ఉన్నాయి. దొంగ, చెడిన, అవినీతిపరుడు, నియంత, గూండా, వ్యభిచారి, అబద్ధాలకోరు, మామ తదితర పదాలు నిషేధం. ఈ పుస్తకాన్ని ఆదివారం ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సోమవారం నుంచి ఈ పుస్తకాలను అసెంబ్లీ సభ్యులకు పంపిణీ చేయనున్నారు. ప్రారంభమైన వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ్యులు సంయమనంతో సభలో పాల్గొనేలా ఆ పుస్తకం మార్పు తెస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విలువలతో విలువైన సభా సమయాన్ని వృథా చేయొద్దని సీఎం పిలుపునిచ్చారు. -
‘ఆ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు మద్దతిస్తున్న పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహన్ విమర్శించారు. సోమవారం ఆయన నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ‘‘గతంలో శరద్పవార్ నాకు లేఖ రాశారు. వ్యవసాయ మార్కెట్ యాక్ట్లో సవరణలు తేవాలని లేఖలో రాశారు. సోనియా, రాహుల్, శరద్పవార్ ప్రైవేట్ మార్కెట్ల ఓపెన్కు అనుకూలంగా మాట్లాడారు.ఇప్పుడు బీజేపీ అదే నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకిస్తున్నారని’’ ఆయన మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవేనని శివరాజ్సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. -
దివ్యసాకేతాలయంలో మధ్యప్రదేశ్ సీఎం పూజలు
శంషాబాద్ రూరల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దంపతులు శుక్రవారం ముచ్చింతల్లోని దివ్యసాకేతాలయంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా సీఎం చౌహాన్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ముచ్చింతల్లో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం దివ్యసాకేతాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. చినజీయర్స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. 216 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న శ్రీ భగద్రామానుజుల వారి సమతాస్ఫూర్తి కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడి గురుకుల వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆలయంలో వంట పనులు చూసుకునే మనోజీ కూతురు ఆకాంక్ష మిశ్ర పదో తరగతిలో 9.8 జీపీఏ మార్కులు సాధించడంపై సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్రావు దంపతులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలు రద్దు.. సీఎం కీలక నిర్ణయం
భోపాల్ : పదో తరగతి పరీక్షలకు సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు నిర్వహించిన పరీక్షల ఆధారంగా పదో తరగతి మెరిట్ జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రద్దైన పరీక్షలకు సంబంధించి ‘పాస్’ రిమార్క్తో విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్టు చెప్పారు.(చదవండి : భిన్నంగా లాక్డౌన్ 4.0) మార్చి 19 నుంచి లాక్డౌన్ ముగిసేవరకు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. మరోవైపు మిగిలిపోయిన ఇంటర్ పరీక్షలను మాత్రం జూన్ 8 నుంచి జూన్ 16 మధ్యలో నిర్వహించాలని మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసకుంది. కాగా, మధ్యప్రదేశ్లో మార్చి 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత.. కరోనా లాక్డౌన్తో మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. (చదవండి : 60 మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్) -
కరోనా కాలంలో కేబినెట్ విస్తరణ
భోపాల్ : ఓ వైపు మధ్యప్రదేశ్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రాజకీయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం మంత్రివర్గాన్ని విస్తరించారు. రాష్ట్ర మంత్రులుగా ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ వీరితో ప్రమాణం చేయించారు. వీరిలో జ్యోతిరాదిత్యా సింధియా వర్గానికి చెందిన ముగ్గురు తిరుగుబాటు నేతలకు మంత్రివర్గంలో చోటుదక్కింది. కాగా 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కమల్ సర్కార్ కూలిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజులు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా ఐదుగురు మంత్రులకు అవకాశం కల్పించారు. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1450కి చేరింది. వైరస్ కారణంగా 78 మంది మృతి చెందారు. -
బలపరీక్ష నెగ్గిన చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు హాజరుకాలేదు. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో సభా విశ్వాసం కోరుతూ ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానానికి సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. ప్యానెల్ స్పీకర్గా ఉన్న బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే జగ్దీశ్ దేవ్డా స్పీకర్గా వ్యవహరించారు. శివరాజ్సింగ్ చౌహాన్ సారథ్యంలోని ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు దేవ్డా ప్రకటించారు. బహుజన్ సమాజ్పార్టీకి చెందిన ఇద్దరు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యేలు సురేంద్ర సింగ్, విక్రమ్సింగ్ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఈ బలపరీక్షలో మద్దతు తెలిపారు. స్వతంత్ర ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరు గైర్హాజరయ్యారు. విశ్వాస పరీక్ష అనంతరం సభను ఈ నెల 27వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు దేవ్డా ప్రకటించారు. సభకు ముందు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. -
మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్
భోపాల్ : మధ్యప్రదేశ్లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్(61) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ఆయనతో సోమవారం రాత్రి 9 గంటలకు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన కమల్నాథ్ కూడా హాజరయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలెవరూ హాజరు కాలేదు. మధ్యప్రదేశ్లో నాలుగో సారి సీఎం పదవి స్వీకరించిన వ్యక్తిగా చౌహాన్ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. శాసనసభాపక్ష నేతగా.. సోమవారం సాయంత్రం చౌహాన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీనియర్ బీజేపీ నేత గోపాల్భార్గవ శివరాజ్సింగ్ చౌహాన్ను శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదించగా మరి కొందరు ఎమ్మెల్యేలు ఆయన్ను బలపరిచారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్.. చౌహాన్ను బీజేపీ శాసనసభాపక్ష నేతగాప్రకటించారు. అనంతరం చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం అనంతరం కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు విక్టరీ గుర్తును చూపిస్తూ కనిపించారు. కేవలం చౌహాన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంతో వచ్చే వారంలో మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. 107 మంది ఎమ్మెల్యేలతో.. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ను వీడటంతో, ఆయన వెంట ఉన్న 22 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. దీంతో కమల్నాథ్ ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం లేకపోయింది. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్లో బీజేపీకి ప్రస్తుతం 107 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా అనంతరం ఆ పార్టీకి కేవలం 92 మంది సభ్యుల బలం మాత్రమే మిగిలింది. 230 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించగా, 22 మంది రాజీనామా చేశారు. దీంతో సభ బలం 206కు తగ్గగా, మెజారిటీ 104కు పడిపోయింది. దీంతో బీజేపీకి ఎవరి అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం వచ్చింది. సింధియా రాజీనామా అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో కమల్నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ సీఎం పీఠాన్ని చేరడానికి మార్గం సుగమమైంది. -
ఎమ్మెల్యేలను నిర్బంధించవద్దు
భోపాల్/న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వేదికగా మధ్యప్రదేశ్ రాజకీయం బుధవారం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లు దాఖలు చేసిన పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగాయి. కమల్నాథ్ ప్రభుత్వం మనుగడ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల చేతుల్లో ఉందని కోర్టు అంగీకరిస్తూనే.. బలపరీక్షను నిర్ణయించే అసెంబ్లీ కార్యకలాపాల్లోకి తాము రాదల్చుకోలేదని స్పష్టంచేసింది. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలు వారి ఇష్టప్రకారం స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఎలాంటి పరిస్థితులు కల్పిస్తారని ప్రశ్నించింది. ‘రెబెల్ ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లాలా లేదా అనేది వారి ఇష్టం. వారిని నిర్బంధంలో ఉంచారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వారు స్వేచ్ఛగా ఉన్నారా లేదా అనేది మేము చూడాలి. వారిని నిర్బంధంలో ఉంచకూడదు’అని స్పష్టంచేసింది. రెబెల్ ఎమ్మెల్యేలను గురువారం జడ్జి చాంబర్లో హాజరుపరుస్తామని మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ చేసిన ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చింది. వారు నిర్బంధంలో లేరని ఎలా నమ్మాలో చెప్పాలంటూ చౌహాన్ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీని అడిగింది. అయితే వారు స్వచ్ఛందంగానే బెంగళూరులో ఉన్నారని, నిర్బంధంలో లేరని ఆయన సమాధానం ఇచ్చారు. రెబెల్ ఎమ్మెల్యేల లాయర్ మణిందర్ సింగ్ కల్పించుకొని, స్పీకర్ ముందుకు తమ ఎమ్మెల్యేలు రాబోవడం లేదని, కొందరి రాజీనామాలను స్వీకరించి మరికొందరివి ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచిందని, వారిని కలిసేందుకు అనుమతించేలా కేంద్రానికి, కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేయగా.. రాజ్యాంగపరంగా ఎదురయ్యే అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేగానీ.. కాంగ్రెస్ నేతలతో కలవబోమని తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాదించారు. బీజేపీ హిట్లర్ పోకడ: కమల్నాథ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలున్న∙రిసార్ట్ వద్ద ఆ పార్టీ నేత దిగ్విజయ్సింగ్ ఆందోళనకు దిగగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిగ్విజయ్ను అరెస్ట్ చేయడం బీజేపీ హిట్లర్ తరహా నియంతృత్వ పోకడలకు నిదర్శనమని సీఎం కమల్నాథ్ అన్నారు. ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్.. అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతిని కొనియాడారు. -
ఉత్కంఠగా బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు
భోపాల్ : రాజకీయ సంక్షోభం నేపథ్యంలోనే మధ్యప్రదేశ్లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి కమల్నాథ్ సర్కార్ సంకటంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాల మేరకు సోమవారం శాసనసభలో విశ్వాసపరీక్ష జరుపనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. కమల్నాథ్పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 22 మంది ఎమ్మెల్యేలు ఆదివారం భోపాల్ చేరుకున్నారు. జ్యోతిరాదిత్యా సింధియా అనుకూల వర్గంగా భావిస్తున్న వీరంతా బెంగళూరులోని రిసార్టులో ఇన్నిరోజులు గడిపారు. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ వెంట ఉన్న శాసన సభ్యులను సీఎం కమల్నాథ్ జైపూర్ క్యాంపుకు తరలించారు. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో బీజేపీ భేరసారాలు నుంచి తమ సభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. (విశ్వాస పరీక్షకు సిద్ధం) సోమవారం అసెంబ్లీలో స్పీకర్ నర్మద ప్రసాద్ ప్రజాపతి సమక్షంలో బలపరీక్ష జరుగనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కమల్నాథ్ మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి.. బలపరీక్షపై అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులతో చర్చించారు. బల పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసింది. మరోవైపు తమ ఎమ్మెల్యేలతో బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ భోపాల్లోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏ పార్టీకి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తమకు సింధియాపై అభిమానం మాత్రమే ఉందని, ఆయనతో పాటు బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఓ తిరుగుబాటు ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ రేకిత్తిస్తున్నాయి. దీంతో 22 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు లభిస్తుందని భావించిన కమళ దళానికి భంగపాటు ఎదురైంది. (ఆ 22 మందికి నోటీసులు) మరోవైపు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్న ఎస్పీ, బీఎస్సీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో శివరాజ్సింగ్ చౌహాన్ ఇదివరకే సంప్రదింపులు జరిపి.. వారిని బీజేపీ గూటికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆరుగురు మంత్రులను కమల్నాథ్ ఇదివరకే మంత్రిమండలి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వీరంతా తమ రాజీనామా పత్రాలను స్పీకర్కు సమర్పించారు. కాగా మొత్తం 228 సభ్యులు గల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 114, బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే 22 మంది కాంగ్రెస్ సభ్యుల రాజీనామాతో కమల్నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. (జ్యోతిరాదిత్య సింధియాకు షాక్..!) -
దమ్ముంటే ఆ పనిచేయండి : ఎంపీ సీఎం
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని భీరాలు పలుకుతున్న బీజేపీ నేతలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వట్టి మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఇండోర్లో శనివారం జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్-2019 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘మా ప్రభుత్వాన్ని కూల్చుతామని మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహన్, కైలాష్ విజయ్వార్గియా పలు సందర్భాల్లో హెచ్చరించారు. మరి అంత దమ్ముంటే ఎందుకు ఆగుతున్నారు. మాపై కనికరం చూపుతున్నారా. ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు కాబట్టే అధికారంలో ఉన్నాం. కార్యకర్తల్లో జోష్ పెంచడానికే బీజేపీ నేతలు పసలేని మాటలు చెప్తున్నారు’అన్నారు.మరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలెందుకు ఆదరించలేదన్న ప్రశ్నకు.. ‘రాష్ట్ర, జాతీయ రాజకీయాలు ఒకేలా ఉండవు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించినంత మాత్రాన లోక్సభ ఎన్నికల్లో అలాగే జరగాలని లేదు. లోక్సభ ఎన్నికల్లో జాతీయవాదం ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే, బీజేపీ ఒక్కటే జాతి కోసం పనిచేస్తున్నట్టు కాదు’అన్నారు. -
ఇలాంటి సీఎంను చూడలేదు
సాక్షి, హైదరాబాద్: ‘నేను 15 ఏళ్లు సీఎంగా ఉన్నాను. సచివాలయానికి వెళ్లని ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకూ చూడలేదు. ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ సభ్యత్వ ప్రముఖ్ శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. వచ్చే నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేసేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చారు. బుధవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో మాట్లాడారు. అంతకంటే ముందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెక్రటేరియట్కే వెళ్లని సీఎంకు కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ కావాలట అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజల సంక్షేమంపై దృష్టి ఉంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. అంతా టీంగా పనిచేద్దామని ప్రధాని నరేంద్రమోదీ నీతి ఆయోగ్ సమావేశం పెడితే, ఎంతో ముఖ్యమైన ఆ భేటీకి సీఎం కేసీఆర్ హాజరుకాలేదన్నారు. తెలంగాణలో కుటుంబపాలనకు ప్రజలు స్వస్తి పలుకుతున్నారని, అందులో భాగంగానే నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపించారన్నారు. తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు, ఒక సీటు వస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో 20 శాతం ఓట్లతో నాలుగుసీట్లు వచ్చాయన్నారు. జూలై 6 నుంచి సభ్యత్వ నమోదు.. జూలై 6వ తేదీన జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జన్మదినాన్ని పురస్కరించుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆగస్టు 11వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో 8 వేల శక్తి కేంద్రాల్లో 8 వేల మంది విస్తారక్కులు వారం రోజులపాటు పనిచేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు అందరినీ కలుస్తామని, పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. సమావేశానికి అ«ధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెచ్చిన పథకాలను మధ్యప్రదేశ్లో ఎప్పుడో అమలు చేశారన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్రావు, కేంద్ర మాజీమంత్రి బండారు దత్రాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
'బుధ్నీ' మే సవాల్
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత నియోజకవర్గం బుధ్నీలో నువ్వా నేనా అన్నట్టుగా రసవత్తర పోటీకి తెరలేచింది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బలమైన అభ్యర్థి బరిలో లేకపోవడంతో చౌహాన్ విజయం నల్లేరు నడకలా సాగింది. కానీ ఈ సారి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఓబీసీ నాయకుడు అరుణ్ యాదవ్ను బరిలోకి దింపడంతో చౌహాన్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. పదిహేనేళ్లుగా అధికారంలో ఉండడంతో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గంలో నెలకొన్న రైతు సమస్యలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరిగా లేకపోవడం వంటి సమస్యలతో చౌహాన్కు విజయం అంత సులభంగా దక్కేలా కనిపించడం లేదు. మామ మంచోడే.. కానీ! శివరాజ్ సింగ్ చౌహాన్ రైతు బిడ్డ. కిరార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గత పదమూడేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి చాలా చేశారు. ఇప్పుడు అక్కడ విద్యుత్ కోతలు లేనే లేవు. అద్దంలాంటి రోడ్లు తళతళలాడిపోతున్నాయి. బుధ్నీ నుంచి ఎవరు సీఎం కార్యాలయానికి పని నిమిత్తం వచ్చినా వెంటనే ఆ పని జరిగేలా స్వయంగా చౌహానే చూస్తారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గానికే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తారు. రోజుకి 20 గంటలు కష్టపడతారు. ఇవన్నీ చౌహాన్కు కలిసొచ్చే అంశాలే. అయితే కొన్ని పల్లెల్లో నీటి సంక్షోభం తీవ్రంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేకపోవడంతో వైద్య చికిత్స కోసం కొన్ని పల్లెల్లో ప్రజలు మైళ్లకి మైళ్లు నడవాల్సి వస్తోంది. పక్కనే నర్మదా నది ప్రవహిస్తున్నప్పటికీ ఎన్నో పొలాలకు నీరు అందడం లేదు. తాను రైతు బిడ్డనని ఎన్నికల ప్రచారంలో పదే పదే చౌహాన్ గుర్తు చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో రైతులే చౌహాన్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. సాగునీరు లేక, పంటలకు మద్దతు ధర రాక ప్రభుత్వంపై అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక నర్మద నదిలో ఇసుక మాఫియాకు అండగా ఉంటారన్న ఆరోపణలు చౌహాన్పై వ్యతిరేకతను పెంచాయి. యాదవ ఓట్లపై నమ్మకంతో.. దిగ్విజయ్ సింగ్ హయాంలో ఉపముఖ్యమంత్రిగా పని చేసిన సుభాష్ యాదవ్ కుమారుడే అరుణ్ యాదవ్ . 46 ఏళ్ల అరుణ్ యాదవ్.. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్గా కూడా పని చేశారు. ఇటీవలే అరుణ్ యాదవ్ ను తప్పించి కమల్నాథ్కు ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో అరుణ్ యాదవ్ తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పుకున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సీఎంపై యాదవ్ను నిలబెట్టింది. ఎందుకంటే బుధ్నీ నియోజకవర్గంలో చౌహాన్ సామాజికవర్గానికి చెందిన కిరార్ ఓట్లరు ఎంత మంది ఉన్నారో యాదవులు కూడా అంతే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం యాదవ్ను ఏరికోరి రంగంలోకి దింపింది. నర్మద నది తీరం నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించిన అరుణ్ యాదవ్ చౌహాన్ సర్కార్ను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఇసుక మాఫియాకు చౌహాన్ కుటుంబం అండగం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. యాదవ్ పీసీసీ చీఫ్ పదవిని లాగేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయనను బలిపశువుని చెయ్యడానికే తనపైన నిలబెట్టిందంటూ శివరాజ్ చౌహాన్ దీటుగా విమర్శలు చేస్తున్నారు. ప్రచారం భాబీదే! ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. అలాగే చౌహాన్ విజయాల వెనుక ఆయన భార్య సాధనా సింగ్ చౌహాన్ కృషి ఎంతైనా ఉంది. బుధ్నీ నియోజకవర్గం ప్రజలు ఆమెను ప్రేమగా భాబీ అని పిలుస్తారు. చౌహాన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండడంతో సాధన బుధ్నీపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య చెప్పుకున్నా వెంటనే పరిష్కరిస్తారు. ‘సాధన ఎన్నడూ సీఎం భార్యగా ప్రవర్తించలేదు. అందరినీ సమానంగా చూస్తారు. మాకే సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తారు’ అని స్థానిక మహిళలు చెబుతారు. ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఆమె ఒక అధికార కేంద్రంగా ఎదిగారు. చౌహాన్ గత కొన్నేళ్లుగా తన నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడకపోయినా సాధన ఆ లోటు తెలీకుండా వ్యవహారాలను చక్కచెట్టుకుంటూ వస్తున్నారు. కుమారుడు కార్తికేయ చౌహాన్ కూడా నియోజకవర్గంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. చౌహాన్ వెంటే నీడలా ఉంటూ సాధనా అన్ని అంశాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. బాబూలాల్ గౌర్ను సీఎంగా తప్పించి చౌహాన్ను సీఎంను చేసిన తర్వాత 2006లో బుధ్నీలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలోనే తొలిసారిగా సాధన కనిపించారు. అప్పట్నుంచి భర్తను గెలిపించే బాధ్యతను తన భుజస్కంధాలపైనే మోశారు. సాధనకూ గ్రహణశక్తి చాలా ఎక్కువ. దీంతో ప్రభుత్వ వ్యవహారాల్లో చాలా తొందరగా పట్టు సాధించారు. ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేపట్టాలన్నా, వద్దనుకున్నా నిర్ణయం ఆమెదే. ఇక అధికారుల బదిలీలు కూడా ఆమె కనుసన్నల్లోనే సాగుతాయన్న ఆరోపణలూ ఉన్నాయి. సాధనను పార్టీ కార్యకర్తలు హాఫ్ చీఫ్ మినిస్టర్ అని పిలుస్తూ ఉంటారు. అదే ఇప్పుడు విపక్షాలకు ప్రచారాస్త్రంగా కూడా మారింది. సాధన అత్యుత్సాహంతో ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చడం తమకు మేలే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన వ్యాపమ్ సహా ఎన్నో కుంభకోణాల్లో సాధన ప్రమేయమున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ సారి కూడా చౌహాన్ విజయాన్ని ఒక సవాల్గా స్వీకరించిన సాధన తాను ఏదైనా సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో చౌహాన్ను గెలిపించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో చౌహాన్ 84వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 20 మంది మంత్రుల మోహరింపు ముఖ్యమంత్రి భార్య సాధనా సింగ్ చౌహాన్, ఆయన కుమారుడు కార్తికేయ చౌహాన్ కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి మరీ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. అయితే చాలా చోట్ల వారు ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. దశాబ్దాలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించరా.. అంటూ ప్రచార సభల్లో మహిళలు నిలదీస్తున్నారు. చౌహాన్ను మామా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే నియోజకవర్గ ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఎదురు కావడంతో చౌహాన్ ఏకంగా 20 మంది మంత్రుల్ని రంగంలోకి దింపారు. లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం చౌహాన్ బుధ్నీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1990 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత లోక్సభకు వెళ్లిపోయారు. తిరిగి 2003 అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్పైన పోటీ చేసి ఓడిపోయారు. రెండేళ్లు తిరక్కుండానే ఆయనకు సీఎం పగ్గాలు అప్పగించారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో 36 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఇక 2008 ఎన్నికల నాటికి తన పట్టును పెంచుకొని 41 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2013 ఎన్నికల నాటికి చౌహాన్ ఇమేజ్కు తిరుగే లేకుండా పోయింది. కాంగ్రెస్ నేత మహేంద్ర సింగ్ చౌహాన్పై 84వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నారు. -
బలమే బలహీనతై
మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్సింగ్ చౌహాన్ పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నారు. అత్యంత వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. అన్నిరంగాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర పగ్గాలు తీసుకున్న సమయంలో ఉన్న పప్పు అని ఇమేజ్ నుంచి రాష్ట్రమంతా మామ అని ఆప్యాయంగా పిలిపించుకునే స్థాయికి ఎదిగిన చౌహాన్ గత రెండు ఎన్నికల్లో బీజేపీని సులభంగా గట్టెక్కించారు. అయితే ఏకంగా మూడుసార్లు అధికారంలో ఉండటంతో ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత కాస్తంత ఎక్కువగానే కనబడుతోంది. వరుసగా నాలుగోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి అంత సులభం కాదనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇన్నాళ్లూ చౌహన్కు బలం అనుకున్న అంశాలే ఇప్పుడు బలహీనతలుగా మారుతున్నాయి. దళితులు, ఆదివాసీలు, రైతులు శివరాజ్పై తిరుగుబాటు బావుటీ ఎగరేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలు.. మధ్యప్రదేశ్లో పార్టీకి నష్టం చేస్తాయనే భావన వినిపిస్తోంది. ఈ చట్ట సవరణలతో అటు దళితులు, ఇటు అగ్రవర్ణాలు కూడా బీజేపీపై గుర్రుగా ఉన్నారు. బీజేపీకి సంప్రదాయంగా మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాలు సొంతం పార్టీలు పెట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్ఏపీఏకేఎస్ ఏర్పాటు మధ్యప్రదేశ్లో అగ్రవర్ణాలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలే కాదు, ప్రభుత్వంలో పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం వారిలో అసంతృప్తిని పెంచింది. దీంతో వారు ఓబీసీలతో చేతులు కలిపి సామాన్య పిఛ్డా ఔర్ అల్పసంఖ్యాక వర్గ కర్మచారి సంస్థ (ఎస్ఏపీఏకేఎస్) ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 230 స్థానాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. ఓటర్లలో అగ్రవర్ణాలు 15%, ఓబీసీ ఓటర్లు 37%. గత 30 ఏళ్లుగా బీజేపీకే మద్దతుగా ఉన్నాయి. దళితుల్లో అసంతృప్తి బీజేపీ ప్రభుత్వం దళితులకు పలు పథకాలు తీసుకొచ్చినా.. రోహిత్ వేముల ఉదంతం, గుజరాత్లోని ఉనాలో దళిత యువకులపై దాడుల వంటి ఘటనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మధ్యప్రదేశ్ ఓటర్లలో 16% దళితులే. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ సమయంలో మధ్యప్రదేశ్లో ఎక్కువగా నిరసన స్వరాలు వినిపించాయి. జై ఆదివాసీ యువ సంఘటన్ మధ్యప్రదేశ్లో ఆదివాసీ ఓటర్లు 23%. గత రెండు సార్లు వీరంతా బీజేపీకి అండగా నిలిచారు. గత ఎన్నికల్లో ఎస్టీల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీయే మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి ఆదివాసీల సంక్షేమం కోసం డాక్టర్ హీరాలాల్ ఏర్పాటు చేసిన జై ఆదివాసీ యువ సంఘటన్ (జేఏవైఎస్) బీజేపీకి పక్కలో బల్లెంలా మారుతోందనే అంచనాలున్నాయి. ఒక సామాజిక సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా మారిన జేఏవైఎస్తో కాంగ్రెస్ పార్టీ జతకట్టింది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అన్నదాతల ఆగ్రహం శివరాజ్సింగ్ చౌహాన్ రైతు బిడ్డ. అయినా ఆ రైతులే ఆయనకు వ్యతిరేకంగా మారారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఏడాది మందసౌర్ నిరసనల్లో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించడం బీజేపీకి తీవ్ర నష్టం చేయనుందని అంచనా. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని ప్రకటించడంతో రైతులు కాంగ్రెస్ వైపు మరలుతారని భావిస్తున్నారు. కేంద్రంపై వ్యతిరేకత గత ఎన్నికల్లో బీజేపీ విజయానికి మోదీ మ్యాజిక్ ప్రధాన కారణం. యూపీఏపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు బీజేపీకి ఓటేశారు. కానీ ఈ సారి కేంద్రంపై వ్యతిరేకత పెరిగిందని విశ్లేషకుల అంచనా. ఈ వ్యతిరేకత ఈ సారి చౌహాన్కు నష్టం చేకూరుస్తుందంటున్నారు. బలాలు ♦ ప్రజలతో మమేకం కావడం ♦ పని రాక్షసుడని పేరు ♦ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బలహీనతలు ♦ ప్రభుత్వ వ్యతిరేకత ♦ రైతుల్లో అసంతృప్తి ♦ వ్యాపమ్ సహా పలు కుంభకోణాలు ♦ బంధుప్రీతి ఎక్కువన్న ఆరోపణలు చెక్ పెట్టగలరా? చౌహాన్ జోరును ఆపేందుకు విపక్షం విశ్వప్రయత్నం ప్రభుత్వ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ భరోసా పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మధ్యప్రదేశ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కనపెట్టి సొంత ఇమేజ్తో మళ్లీ గెలవాలని శివరాజ్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా ప్రవేశపెట్టిన పథకాలు గట్టెక్కిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అటు, ఇంటిపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ కూడా.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రచారం చేస్తోంది. అయితే కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే.. అది ప్రభుత్వ వ్యతిరేకతే తప్ప కాంగ్రెస్ నేతల గొప్పదనమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరుపార్టీల్లోనూ నిరసనల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్లో అగ్రనేతలే తమ వర్గానికి టికెట్లు ఇవ్వాలంటూ బహిరంగంగా విమర్శలు చేసుకుంటుంటే.. టికెట్ల పంపిణీ బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ప్రజలతో ఆప్యాయంగా మామా అనిపించుకుంటున్న చౌహాన్ను ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. వివాదంలో కాషాయ నేతలు బీజేపీలో నాయకుల మధ్య సమన్వయం ఏ మాత్రం కనిపించడం లేదు. సీనియర్ నాయకులెందరో వివాదాల్లో ఇరుక్కున్నారు. నరోత్తమ్ మిశ్రా పెయిడ్ న్యూస్ కేసులో ఇరుక్కుంటే, ఎమ్మెల్యే మఖాన్ సింగ్ జాటవ్ హత్య కేసులో.. లాల్ సింగ్ ఆర్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రుణాలకు సంబంధించిన కేసులో ఇరుక్కున్న సురేంద్ర పాత్వా, కోడలు ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్పాల్ సింగ్.. ఇలా కాస్త పేరున్న నాయకులందరూ వివాదాల్లో చిక్కుకొని పార్టీకున్న ఇమేజ్ను చెరిపేస్తున్నారు. ఇతర సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, సర్తాజ్ సింగ్, కుసుమ్ మహ్దెలేలు టిక్కెట్లు నిరాకరించడంతో తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. బహిరంగంగానే పార్టీకి డ్యామేజ్ జరిగేలా వ్యాఖ్యలుచేశారు. తన కోడలు కృష్ణకు టిక్కెట్ ఇచ్చిన తర్వాత బాబూలాల్ గౌర్ శాంతించారు. సర్తాజ్ సింగ్ ఏకంగా పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అటు, పార్టీకి గట్టిపట్టున్న ఇండోర్, విదిశ, మహూ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీలో అంతర్గత పోరు పెరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ, పార్లమెంటు స్పీకర్ సుమిత్ర మహాజన్లకు పడడం లేదు. కాంగ్రెస్ విశ్వప్రయత్నం ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్నట్లుగా మారాయి. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పోటీ చేయడానికి ఈ రాష్ట్రంలో గెలుపు చాలా ముఖ్యం. అందుకే అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను ప్రకటించింది. రైతులు, మహిళలు, యువత, పారిశ్రామిక రంగం ఇలా అత్యధిక జనాభా ఉన్న ఏ రంగాన్ని విడిచిపెట్టకుండా వారిని తమవైపు తిప్పుకునే వ్యూహాలు పన్నుతోంది. ఆ ముగ్గురిపై నమ్మకం కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో నాయకత్వ లేమితో సతమతమవుతోంది. ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. కానీ మధ్యప్రదేశ్లో పరిస్థితి వేరు. ఒక్కరిద్దరు కాకుండా ముగ్గురు బలమైన నేతలుండటం పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. అంతర్గత పోరు ఉన్నప్పటికీ.. ఒక్కో నాయకుడికి ఒక్కో ప్రాంతంలో పట్టుండడం విశేషం. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్కు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో మంచి పట్టు ఉంది. పీసీసీ చీఫ్ కమల్నాథ్కు మహాకౌశల్ ప్రాంతంలో తిరుగేలేదు. ఇక ఎన్నికల ప్రచార సారథి జ్యోతిరాదిత్య సింధియాకు గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో మంచి ఇమేజ్ ఉంది. టిక్కెట్ల పంపిణీలో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించింది. ప్రాంతీయ, కుల సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకొని నేతలందరూ ఇంచుమించుగా సంతృప్తి చెందేలా టిక్కెట్లు ఇచ్చింది. -
ఆ 5 నగరాలే కీలకం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీఎన్ఎక్స్ నిర్వహించిన ఎన్నికల ముందస్తు సర్వేలో అంచనా వేసింది. సాధారణంగా భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిన్లు బీజేపీ, కాంగ్రెస్లకు కీలకం. ఈ ఐదు నగరాల్లో ఎన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే అంత ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. ఈసారి బీజేపీ గెలిచినా గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెజారిటీ బాగా తగ్గుతుందనీ, 230 సీట్లున్న శాసన సభలో బీజేపీ 122, కాంగ్రెస్ 95 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే నివేదిక వెల్లడించింది. 2013 ఎన్నికల్లో బీజేపీకి 165, కాంగ్రెస్కు 65 సీట్లు వచ్చాయి. ఈ నెల 28న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. పట్టణ ప్రాంతంలో ఉండే సీట్లలో 70శాతం బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనీ, కాంగ్రెస్ 27శాతమే దక్కించుకోగలదని సర్వే వెల్లడించింది. చౌహాన్ ముఖ్యమంత్రి కావాలని 40.11% ఓటర్లు కోరుకోగా, కమల్నాథ్కు 20.32%, జ్యోతిరాదిత్య సింధియాకు 19.65% మద్దతు పలికారు. ప్రాంతాల వారీగా చూస్తే చంబల్ మినహా మల్వా నిమార్, బఘేల్ఖండ్,భోపాల్, మహాకౌశల్లలో ఇతర పార్టీల కంటే బీజేపీదే పైచేయిగా ఉంది.సర్వేలో భాగంగా 77 నియోజకవర్గాల్లో 9240 మంది అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని గత ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఐదు నగరాలు... భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిన్లు రెండు పార్టీలకూ కీలకం. ఈ ఐదు నగరాల్లో మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇంతవరకు ఈ నగరాలు బీజేపీకి కంచుకోటలుగా ఉన్నాయి. కాంగ్రెస్ ఈ కోటల్ని బద్దలు కొట్టగలిగితేనే చౌహాన్ అధికారంలోకి రాకుండా నిరోధించగలుగుతుంది. ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నగరాల్లో బీజేపీదే పై చేయి. గత ఎన్నికల(2013)విషయానికి వస్తే ఇక్కడున్న 36 సీట్లలో బీజేపీ 30 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఆరింటితో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇవి కాకుండా సత్నా, సాగర్ వంటి వాణిజ్యప్రధాన ప్రాంతాలు కూడా పార్టీ గెలుపులో కీలక భూమిక వహిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి 51 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ వశమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి సీట్లే కాక ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి. ఇటీవలి సర్వేలో పట్టణాల్లో బీజేపీ ఓట్ల శాతం 40 నుంచి 45 శాతానికి పెరిగిందని, కాంగ్రెస్ ఓట్ల శాతం 25–35 శాతాల మధ్య ఊగిసలాడుతోందని వెల్లడయింది. ఓట్ల శాతంలో తక్కువ తేడా ఉన్నా సీట్ల సంఖ్యలో తేడా వస్తుంది. ఈ కారణంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరుగుతోందని టైమ్స్ నౌ తేల్చింది. ఏబీపీ–సీఓటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్కు 42శాతం ఓట్లు, బీజేపీకి 40శాతం వస్తాయని అంచనా వేసింది. ఈ తేడాను క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే 117 సీట్లు గెలుచుకోవడం కష్టం కాదని ఆ సర్వే పేర్కొంది. అయితే, ఈ లక్ష్యం సాధించాలంటే కాంగ్రెస్ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓట్లను కొల్లగొట్టి ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంటుందనీ, అదంత సులభం కాదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం, వ్యవసాయ సంక్షోభం, బీజేపీ ప్రభుత్వ నేతలపై అవినీతి ఆరోపణలు వంటి అంశాలను ఉపయోగించుకుని, విభేదాల్ని తాత్కాలికంగానైనా పక్కనపెట్టి గట్టి అభ్యర్ధులను పోటీకి దింపితే–ముఖ్యంగా ఈ ఐదు నగరాల్లో– ఫలితాలను తిరగరాసే అవకాశాలు కాంగ్రెస్కు ఉన్నాయని సర్వే నివేదిక తెలిపింది. -
నాణేలు.. ‘పది’వేలు
మధ్యప్రదేశ్లో నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్గా 10 వేల ‘రూపాయి’ బిల్లలు(నాణేలు) చెల్లించి అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు దీపక్ పవార్ అనే అభ్యర్థి. ఇండోర్–3 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి స్వర్ణిమ్ భారత్ ఇంక్విలాబ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పవార్ నామినేషన్ పత్రాలతోపాటు ఓ సంచీలో ఒక రూపాయి నాణేలు పదివేలు తీసుకువచ్చారు. వీటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. చేసేదేమీ లేక చివరకు...ఐదుగురు సిబ్బందితో దాదాపు 90 నిమిషాల పాటు నాణేలు లెక్కించారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశ్వత్ శర్మ మాట్లాడుతూ ‘నామినేషన్కు అఖరు తేదీ కావడంతో పవార్ చెల్లించిన 10 వేల రూపాయి బిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. వాటిని మా సిబ్బంది లెక్కించారు. నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్కు సంబంధించిన రశీదును ఆయన ఇచ్చాం’ అన్నారు. ఇంతవరకు ఎన్నికల నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఎవరూ ఇలా రూపాయి నాణేలను ఇవ్వలేదన్నారు. పదివేల రూపాయి నాణేలు ఇవ్వడంపై అభ్యర్థి దీపక్ పవార్ మాట్లాడుతూ ..‘నేను విరాళాల ద్వారా స్వీకరించిన మొత్తం రూపాయి నాణేలే. అందుకే అవే సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాను’ అని చెప్పకొచ్చారు. ‘బుధ్నీ’కా రాజా! మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లా బుధ్నీ నియోజవకర్గం.. ఆ రాష్ట్ర సీఎం శివ్రాజ్ సింగ్ చౌహాన్కు పెట్టని కోట. 1990లో ఇక్కడినుంచే ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వాజ్పేయి తప్పుకోవడంతో ఖాళీ అయిన విదిశ ఎంపీ స్థానం నుంచి 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1996, 1992, 1999, 2004ల్లో విదిశ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. 2005లో మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2006లో బుధ్నీ నుంచే ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత రాజ్కుమార్ పటేల్పై 36వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008లో (41వేల మెజారిటీ), 2013లో (84వేలు)నూ బుధ్నీలో సాధించిన ఘన విజయంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. -
s/o సన్నాఫ్..
మధ్యప్రదేశ్ వారసత్వానికి ఒక లక్షణం ఉంది. అదే పేరు, అదే వంశం,.. ఉంటే చాలు ఏ కాస్త క్వాలిటీ ఉన్నా రాణించేయొచ్చు. రాజకీయాల్లో ఇది ఇంకా ఎక్కువ. మధ్యప్రదేశ్లో మరీ ఎక్కువ. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బడా నేతలంతా పొలిటికల్ పుత్రోత్సాహంతో మురిసిపోతున్నారు. మరి ఈ వారసుల్లో మహావృక్షంగా మారేవారెవరు? మర్రిచెట్టు కింద మొక్కలా మిగిలేవారెవరు? చూడాలి.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి వారసుల జోరు ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గర నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్నాథ్ వరకు అన్ని కుటుంబాల్లో పుత్రోత్సాహం పొంగిపొరలుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే వయసు రాకపోయినా ఈ నయా లీడర్లు వచ్చే ఎన్నికలకు పునాదిగా తండ్రుల నియోజకవర్గాల్లో వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. ఈ సారి రాష్ట్ర ఓటర్లలో 55 శాతం వరకు 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఉంటే, ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది వృద్ధులే. అందుకే వారసుల్ని రంగంలోకి దింపి యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారు నేతలు. వారసత్వ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ మధ్యప్రదేశ్ అంటేనే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. కొంతమంది మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, మనవలు ఇప్పటికీ వంశం పేరు చెప్పుకునే ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకుంటున్నారు. రవిశంకర్ శుక్లా కుమారుడు శ్యామ్ చరణ్ శుక్లా, మనవడు అమిత్ శుక్లా, మోతీలాల్ ఓరా కుమారుడు అరుణ్ ఓరా, దిగ్విజయ్సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్, దివంగత కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్, ఇలా ఎందరో ఉన్నారు. వీళ్లంతా తండ్రులు, తాతల పేరు చెప్పుకునే రాజకీయాల్లో రాణించారు. ఒకసారి బలపడ్డాక క్రమంగా లీడర్లుగా స్వీయ ప్రతిభ చూపుతున్నారు. చక్రం తిప్పుతున్న సింధియా కుటుంబం సింధియా రాచ కుటుంబం అటు మధ్యప్రదేశ్, ఇటు రాజస్థాన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. విజయ రాజే సింధియా బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె కుమారుడు, దివంగత నేత మాధవరావు సింధియా భారతీయ జనసంఘ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిపోయారు. ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. విజయ రాజే సింధియా కుమార్తె వసుంధరా రాజె రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ లోక్సభ ఎంపీ. కుమార్తె యశోధర రాజె సింధియా మధ్యప్రదేశ్ లో మంత్రిగా ఉన్నారు. నయా లీడర్స్ కార్తికేయ సింగ్ చౌహాన్: ముఖ్యమంత్రిగా పార్టీని ముందుండి నడిపించాల్సిరావడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ తన సొంత నియోజకవర్గం బుధ్నీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో ఈ బాధ్యతల్ని ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వయసు ఇంకా రాకపోయినప్పటికీ ప్రచారంలో తనదైన ముద్ర చూపుతున్నాడు. బుధ్నీ నియోజకవర్గంలో స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక పక్క భోపాల్లో పూలు, పాల వ్యాపారాలు చూసుకుంటూనే తండ్రి నియోజకవర్గంలో పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. మహానర్యామన్ : కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానర్యామన్కి పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. డూన్ స్కూలులో గ్రాడ్యుయేషన్ చేసిన మహానర్యామన్ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీకి సెలవులు కావడంతో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ప్రచార బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నారు. నకుల్నాథ్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమలనాథ్ కుమారుడు నకుల్ నాథ్. తండ్రి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడే నకుల్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఢిల్లీలో నైట్ లైఫ్కు బాగా అలవాటు పడిన నకుల్ ఎన్నికల వేళ మాత్రం భోపాల్లోనే ఉంటూ తెగ తిరిగేస్తున్నారు. బోస్టన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన నకుల్ బేతల్ నుంచి పోటీ పడే అవకాశాలున్నాయి. అభిషేక్ భార్గవ్ : మధ్యప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపాల్ భార్గవ్ కుమారుడైన అభిషేక్ రాజకీయాల్లో బాగా పట్టు సంపాదించారు. రెహిల్ నియోజకవర్గం నుంచి గోపాల్ భార్గవ్ గత ఏడుసార్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అభిషేకే తండ్రి తరఫు పొలిటికల్ మేనేజర్గా వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రచార వ్యూహాలన్నీ అభిషేకే రచించారు. విక్రాంత్ భూరియా: కాంగ్రెస్ నాయకుడు కాంతిలాల్ భూరియా 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన కుమారుడు విక్రాంత్ భూరియా తండ్రి నియోజకవర్గమైన రట్లామ్ బాధ్యతలు తీసుకున్నారు ప్రజా సంబంధాలు ఏర్పరచుకొని కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తండ్రిని గెలిపించుకున్నారు. పైన చెప్పినవాళ్లే కాకుండా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మంధర్ మహాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ వార్గియా కుమారుడు ఆకాశ్ , ప్రజా సంబంధాల శాఖా మంత్రి డా. నరోత్తమ్ మిశ్రా కుమారుడు సుకర్ణ మిశ్రా, ఆర్థిక మంత్రి జయంత్ మాలవీయ కుమారుడు సిద్ధార్థ మాలవీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడు దేవేంద్ర సింగ్ తోమర్ తదితరులు సైతం రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో వీరిలో పలువురు తమ సత్తా చూపాలని భావిస్తున్నారు. -
‘థర్టీన్’ చౌహాన్..యూత్ మహాన్..
పదమూడేళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సారి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలో ఆయన పట్ల బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో వీరిని ఆకర్షించేందుకు చౌహాన్ పలు యత్నాలు చేస్తున్నారు. ఈ సారి రాష్ట్ర ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారు 56.09%. అంటే సగానికి పైగా ఓటర్లు యువతే. అందుకే వారి వ్యతిరేకత బీజేపీని భయపెడుతోంది. అసంతృప్తితతో ఉన్న యూత్ను ఆకర్షించడానికి చౌహాన్ ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడం లేదు. రెండునెలల్లో ఎన్నికల నియామవళి అమల్లోకి వస్తుందనగా మెగా ఎంప్లాయిమెంట్ డ్రైవ్స్, స్టార్టప్ ఫెయిర్స్ నిర్వహించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే మేధావి విద్యార్థి యోజన పథకాన్ని అన్ని కులాలకు వర్తింపజేశారు. మొదటి సారి కాలేజీలో అడుగు పెడుతున్న 3 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, మరో 22 వేల మందికి ల్యాప్ట్యాప్ల కోసం 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎందుకీ అసంతృప్తి ? రెండేళ్లుగా మధ్యప్రదేశ్లో నిరుద్యోగం భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యువత నైపుణ్యం పెంచుతూ వారిని పారిశ్రామిక రంగం వైపు మళ్లేలా చేస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ నిరుద్యోగంపై గణాంకాలు నివ్వెరపరుస్తున్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. పట్టణప్రాంతాల్లో నిరుద్యోగులు 46శాతం, గ్రామాల్లో44 శాతం ఉన్నారు. నికరంగా నిరుద్యోగం 43 శాతంగా ఉంది. 13 ఏళ్ల పాలనలో చౌహాన్ సర్కార్ ఏడాదికి సగటున 17,600 ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. యువతలో నిరుద్యోగిత, అల్పుఉద్యోగిత(చదువుకు తగ్గ ఉద్యోగాలు రాకపోవడం) కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 60 నుంచి 62కి పెంచడం కూడా నిరుద్యోగాన్ని పెంచిందనే విమర్శలూ ఉన్నాయి. యువ నేతలకు ప్రోత్సాహం సామాజికంగా యువతను ఆకట్టుకునే పథకాలతో పాటు రాజకీయంగా యువనేతలను ప్రోత్సహించేందుకు బీజేపీ నడుం బిగించింది. మధ్యప్రదేశ్లో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ యువ నేతల్ని ప్రోత్సహిస్తోంది. అనురాగ్ ఠాకూర్, పూనమ్ మహాజన్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వంటి నేతలు ప్రచార బాధ్యతల్ని తమ భుజస్కంధాల మీద మోస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ని తీసుకువస్తూ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. గ్వాలియర్లో మారథన్ రన్లు, బుందేల్ ఖండ్లో జానపద నృత్యాల ఫెస్టివల్, భోపాల్లో కవి సమ్మేళనాలు, కుస్తీ పోటీలు నిర్వహిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. - మేధావి విద్యార్థి యోజన: అఖిలభారత ఎంట్రన్స్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఉన్నత విద్యలో ఫీజు మినహాయింపు. - యువ కాంట్రాక్టర్ ఇంజనీర్ యోజన: మౌలిక సదుపాయాల రంగంలో యువ ఇంజనీర్లకు ఉచిత శిక్షణనిచ్చి, ఉచితంగా కాంట్రాక్ట్ లైసెన్స్ ఇస్తారు. - ప్రతిభ కిరణ్ యోజన: సాధికారత కోసం మహిళలకు ఉన్నతవిద్యలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. - గావోంకీ బేటీ యోజన: పన్నెండో తరగతి ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు పైచదువుల కోసం ఆర్థిక సాయం. - లాడ్లీ లక్ష్మి యోజన: అమ్మాయిలు విద్యార్థి దశలో ఉన్నప్పట్నుంచి బాండ్ల రూపంలో ఆర్థిక సాయం. - కన్యావివాహ్ యోజన: సామూహిక వివాహాలు జరిపించి పెళ్లీడు ఆడపిల్లల పెళ్లికి 15 వేల ఆర్థిక సాయం - యువ స్వరోజ్గార్ యోజన: చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా యువతకు రుణాల్లో సబ్సిడీ, బ్యాంకు గ్యారంటీ. మధ్యప్రదేశ్లో మొత్తం ఓటర్లు 5.39కోట్లు తొలిసారి ఓటు వేస్తున్నవారు 15 లక్షలకు పైగా 18 –29 ఏళ్ల ఓటర్లు 1.53 కోట్లు 30–39 ఏళ్ల ఓటర్లు 1.28 కోట్లు కాంగ్రెస్లో కిరార్ కిరికిరి! మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు గులాబ్ సింగ్ కిరార్ని కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ, కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా పార్టీలోకి ఆహ్వనించారు. అయితే వ్యాపం స్కాంతో కిరార్కు సంబంధం ఉన్నదంటూ గతంలో తనను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగిన విషయం తెలుసుకుని నాలుక్కరుచుకుంటున్నారు. నాటి విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. మొదట కిరార్ని కాంగ్రెస్లోకి ఆహ్వనిస్తూ అధికారిక వెబ్సైట్ లో చేసిన ట్వీట్ని తొలగించడమే కాకుండా.. గులాబ్ సింగ్ కిరార్ తమ పార్టీలో చేరారన్న వాదనను కాంగ్రెస్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి తోసిపుచ్చడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ గందరగోళంలోనే కిరార్ కాంగ్రెస్లో చేరినట్టు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి స్పష్టం చేయడం జరిగింది. అయితే తనగురించి కాంగ్రెస్ ఎలా అనుకున్నా, నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తాననీ, ఎందుకంటే తాను కాంగ్రెస్ సభ్యుడిననీ గులాబ్ సింగ్ చెప్పుకుంటున్నాడు. కిరార్ వ్యవహారంతో కాంగ్రెస్ బుద్ధి బట్టబయలైందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ శర్మ వ్యాఖ్యానించారు. కిరార్ కిరికిరి కాంగ్రెస్ నైజాన్ని బహిర్గతం చేసిందన్న ఆనందంలో బీజేపీ ఉంది. కిరార్ మధ్యప్రదేశ్ బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కమిషన్ మాజీ సభ్యుడు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. 2011 పీజీ వైద్య ప్రవేశ పరీక్ష సందర్భంగా జరిగిన అవకతవకల్లో కిరార్కీ, అతని కుమారుడికీ సంబం«ధం ఉందని సీబీఐ ఆరోపించింది. వ్యాపం స్కాంతో ఆయనకు సంబంధమున్నట్లు బయటపడడంతో మూడేళ్ల క్రితమే బీజేపీ అతన్ని పార్టీనుంచి తొలగించింది. తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. మహిళలకే మీ ఓటు! మిజోరంలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువఉన్నప్పటికీ.. శాసనసభలో వీరి భాగస్వామ్యం తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని మార్చి ఈసారి మహిళా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచేందుకు ఈ రాష్ట్రంలోని ఏకైక మహిళా సంస్థ ’మిజో మీచే ఇన్సుయిఖ్వామ్ పాల్’ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఉధృతంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఏ పార్టీ అనేది ముఖ్యం కాదని.. అన్ని పార్టీల్లోని మహిళా అభ్యర్థులను అసెంబ్లీకి పంపిద్దామంటూ ప్రజలను చైతన్యపరుస్తోంది. మహిళలు తమ శక్తిని చాటేందుకు ఇంతకన్నా మంచి సమయం రాదంటోంది ఈ సంస్థ. ’మాకు పార్టీ ముఖ్యం కాదు. మహిళలు ఎమ్మెల్యేలుగా గెలవడమే ముఖ్యం’ అని ఈ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. 1978 నుంచి ఇప్పటివరకు నలుగురు మహిళలు మాత్రమే మిజో శాసనసభకు ఎన్నికయ్యారు. గిరిజన ప్రాంతాల్లో బీజేపీకి పట్టు మధ్యప్రదేశ్లో గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజవర్గాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నాలుగు ఎన్నికలుగా బీజేపీ పట్టు సాధిస్తోంది. గిరిజనులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్లు మాత్రం కమలంపైనే విశ్వాసం ఉంచుతున్నారు. మధ్యప్రదేశ్లో 47 ఎస్టీ నియోజకవర్గాల్లో గత రెండు ఎన్నికల్లో పరిస్థితిని ఓసారి గమనిస్తే.. ఇటలీ, స్వీడన్.. ఇవన్నీ ఓటర్ల పేర్లే మేఘాలయలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇటలీ, అర్జెంటైనా, స్వీడన్, ఇండోనేసియాలు దిగ్విజయంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. దేశాలేంటి, మేఘాలయ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడమేంటి అనుకుంటున్నారా.. అవి దేశాల పేర్లు కాదండీ బాబూ.. అవి మేఘాలయకు చెందిన ఉమ్ని– మర్ఎలాకా గ్రామ ప్రజల పేర్లు. అవేం పేర్లు అని ఆశ్చర్యపోకండి, ఆ ఊర్లో అందరి పేర్లూ విచిత్రంగానే ఉంటాయి. ఈ ఊళ్లో జనాలకు ఇంగ్లీష్ రైమ్స్పై ఆసక్తి కాస్త ఎక్కువంట. కానీ వాటి అర్ధాలు మాత్రం తెలియవట. అందుకే శబ్దం బాగుంటే పేరుగా పెట్టుకుంటూ ఉంటారు. కేవలం పదాలు బాగున్నాయనే ఏకైక కారణంతో ఇలాంటి పేర్లు పెట్టుకుంటారని అక్కడి సర్పంచ్ ప్రీమియర్ సింగ్ చెప్పారు. టేబుల్, గ్లోబ్, పేపర్, శాటరన్, అరేబియన్ సీ, రిక్వెస్ట్, లవ్లీనెస్, హ్యాపీనెస్, గుడ్నెస్, యూనిటీ, స్వీటర్, గోవా, త్రిపుర.. లాంటి పలు నామధేయులు ఆ ఊర్లో మీకు ఎదురవుతారు. అన్నింటికనా విచిత్రంగా ఆ ఊర్లో ఒకామె పేరు ‘‘ఐ హావ్ బీన్ డెలివర్డ్’’. ఇవన్నీ చదువుతుంటే మనకు సరదాగా ఉంది కానీ అక్కడ ఎన్నికలు నిర్వహించే అధికారులు మాత్రం ఈ పేర్లతో గజిబిజి పడుతున్నామని వాపోతుంటారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement