బుల్‌ బ్యాక్‌ ర్యాలీ | Sakshi
Sakshi News home page

బుల్‌ బ్యాక్‌ ర్యాలీ

Published Fri, May 17 2024 6:34 AM

Global Trends Lift Sensex and Nifty

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు 

40 వేల పాయింట్ల పైకి డోజోన్స్‌

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 677 పాయింట్లు పెరిగి 73,664 వద్ద నిలిచింది. నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 22,404 వద్ద స్థిరపడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్‌ రిజర్వ్‌ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది. ఒక దశలో సెన్సెక్స్‌ 762 పాయింట్లు బలపడి 73,749 వద్ద, నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,432 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ సూచీలు వరుసగా 1.07%, 0.85% లాభపడ్డాయి. 

→ ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ.3.1 లక్షల కోట్లు పెరిగి బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ. 407.35 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 30కి గానూ 25 షేర్లు లాభపడ్డాయి.    
→ అమెరికాలో  పారిశ్రామిక రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే డోజోన్స్‌ సూచీ తొలిసారి 40వేల పాయింట్ల పైకి చేరింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement