International Markets
-
బంగారు కొండ దిగుతోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో గురువారం 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రా ముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.77,050కి చేరింది. కాగా, 99.5 స్వచ్ఛత బంగారం ధర రూ.700 తగ్గి రూ.76,650కి దిగివచి్చంది. కిలో వెండి సైతం రూ.2,310 క్షీణించి రూ.90,190కి చేరింది. అంతర్జాతీయంగా పటిష్ట డిమాండ్కు తోడు పండుగ సీజన్ కారణంగా ఈ అక్టోబర్ 31న 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.82,400 వద్ద ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాటి నుంచి రూ.4,650 తగ్గింది. రెండు వారాల్లో 260 డాలర్లు డౌన్... అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రాములు) ధర 45 డాలర్లు తగ్గి 2,541.70 డాలర్లకు పడింది. ఈ వార్త రాస్తున్న 9 గంటల సమయానికి 13 డాలర్ల తగ్గుదలతో రూ.2,574 వద్ద ట్రేడవుతోంది. జీవితకాల గరిష్టం 2,802 డాలర్ల నుంచి 260 డాలర్లు తగ్గింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక తర్వాత ఏకంగా 4% తగ్గింది.‘‘ట్రంప్ గెలుపుతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగకపోవచ్చు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో యుద్ధ ఉద్రిక్తతలు సద్దుమణగొచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చనే అశలతో డాలర్ ఇండెక్స్(107.06) అనూహ్యంగా బలపడుతోంది. దీంతో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ట్రంప్ వాణిజ్య విధాన నిర్ణయాలు రానున్న రోజుల్లో పసిడి ధరలకు దిశానిర్ధేశం చేస్తాయి’’ అని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఆగని బుల్ పరుగు
ముంబై: ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మరో రికార్డు స్థాయిలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్ బలపరిచాయి. అధిక వెయిటేజీ మారుతీ సుజుకీ(7%), ఎంఅండ్ఎం(3%), ఐటీసీ(2%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 391 పాయింట్లు పెరిగి 80,352 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 24,433 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయం లాభాలతో మొ దలైన స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి.ఆటో, ఎఫ్ఎంసీజీతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్, రియలీ్ట, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్ డిస్రే్కషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్లో సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్ గూడ్స్, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.మారుతీ పరుగు⇒ పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల రిజి్రస్టేషన్ పన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీ సర్కా రు నిర్ణయంలో దేశంలో ఈ తరహా కార్లను ఉత్పత్తి చేసే మారుతీ సుజుకీ కంపెనీ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 6.60% పెరిగి రూ.12,820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 8% దూసుకెళ్లి రూ.12,955 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ⇒ నైరుతి రుతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా ఖరీఫ్ సందడి మొదలైంది. దీ ంతో వినియోగ ఆధారిత రంగ ఎఫ్ఎంసీ జీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈః రూ. 451.27 లక్షల కోట్లు ⇒ స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే రూ.1.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్టైం గరిష్టం రూ. 451.27 లక్షల కోట్లకు చేరింది. -
Stock Market: సెన్సెక్స్ 80000
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో బుధవారం మరో మరపురాని రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తొలిసారి 80,000 శిఖరాన్ని తాకింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, పారిశ్రామిక షేర్లు ముందుండి నడిపించాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 2% రాణించి సూచీలకు దన్నుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ముగింపులోనూ తాజా రికార్డులు నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 572 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయిపైన 80,013 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 633 పాయింట్లు పెరిగి 80,074 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 545 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయి దిగువన 79,987 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో నిఫ్టీ 183 పాయింట్లు ఎగసి 24,307 వద్ద ఆల్టైం హైని అందుకుంది. చివరికి 163 పాయింట్ల లాభంతో 24,287 వద్ద స్థిరపడింది. లార్జ్క్యాప్ షేర్లలో ర్యాలీ క్రమంగా చిన్న, మధ్య తరహా షేర్లకు విస్తరించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.86%, 0.86 శాతం రాణించాయి. → బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి పరిమితం కావడంతో బ్యాంకింగ్ షేర్లు మరింత రాణిస్తాయని విశ్లేషకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఎస్బీఐలు 2% లాభపడ్డాయి.→ బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో పాటు ఎంఎస్సీఐ ఇండెక్సు ఆగస్టు సమీక్షలో వెయిటేజీ పెంచవచ్చనే అంచనాలతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2% పెరిగి రూ.1,768 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 3.50% ఎగసి రూ.1,792 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,758 కోట్లు ఎగసి రూ.13.45 లక్షల కోట్లకు చేరుకుంది. → ఈ జూన్ 25న 78 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్... 80,000 స్థాయిని చేరేందుకు కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్ల సమయాన్ని మాత్రమే తీసుకుంది. → ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం(జూన్ 9న) నాటి నుంచి 3,294 పాయింట్లు ర్యాలీ చేసింది. → సెన్సెక్స్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ జీవితకాల గరిష్ట స్థాయి రూ.445.43 లక్షల కోట్లకు చేరింది. వ్రజ్ ఐరన్ బంపర్ లిస్టింగ్ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో 16% ప్రీమియంతో రూ.240 వద్ద లిస్టయ్యింది. ఈక్విటీ మార్కెట్ రికార్డు ర్యాలీతో మరింత కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 22% లాభపడి రూ.252 అప్పర్ సర్క్యూట్ వద్ద లాకైంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.831 కోట్లుగా నమోదైంది.సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకోవడం దలాల్ స్ట్రీట్కు దక్కిన పెద్ద విజయం. లేమన్ సంక్షోభం(2008)లో 8800 స్థాయికి దిగివచి్చంది. కానీ 16 ఏళ్లలో 9 రెట్ల ఆదాయాలు ఇచి్చంది. నాలుగేళ్ల క్రితం కరోనా భయాలతో 26,000 స్థాయికి చేరుకుంది. అయితే పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా పుంజుకుంది. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాయి అనేందుకు ఇది నిదర్శనం. – శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ -
సెన్సెక్స్ @ 78,000
ముంబై: ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 78 వేల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ ఈ ఏడాదిలో 34వ సారి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.మిడ్సెషన్ నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఊహించని రీతిలో పుంజుకున్నాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 823 పాయింట్లు ఎగసి 78,165 వద్ద ఆల్టైం హైని అందుకుంది. చివరికి 712 పాయింట్ల లాభంతో 78,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216 పాయింట్లు బలపడి 23,754 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 183 పాయింట్లు బలపడి 23,721 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ రియలీ్ట, విద్యుత్, వినిమయ, మెటల్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రికార్డుల ర్యాలీకి కారణాలు ⇒ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళికల అమలుపై మంత్రిత్వ శాఖలు దృష్టి సారించడంతో ట్రేడర్లు ఎఫ్అండ్ఓలపై బుల్లిష్ వైఖరి ప్రదర్శించారు. నిఫ్టీ జూలై సిరీస్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోకి పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకు ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఎఫ్అండ్ఓ గణాంకాలు సూచిస్తున్నాయి. ⇒ ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో ర్యాలీ మందగించడంతో మంగళవారం సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రైవేటు రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. యాక్సిస్ బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.32% కోటక్ బ్యాంక్ అరశాతం మేర రాణించాయి. అలాగే పీఎస్యూ ఎస్బీఐ బ్యాంకు షేరూ ఒకశాతానికి పైగా లాభపడింది. ⇒ మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫ్యూచర్లలో షార్ట్ పొజిషన్లను కవరింగ్ చేయడంతో పాటు క్రమంగా లాంగ్ పొజిషన్లను బిల్డ్ చేసుకున్నారు. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఇండెక్స్ ఫ్యూచర్లలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇండెక్సు ఫ్యూచర్లలో 59.08 శాతం లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. ఇది గత రెండు నెలల్లో అత్యధికం. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో మనదేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 మిలియన్ డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్బీఐ ప్రకటించింది. ఇది సానుకూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇచి్చన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచవచ్చని, రూపాయి మారకంపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. స్టాన్లీ లైఫ్స్టైల్ ఐపీవో సక్సెస్ 96 రెట్లు అధిక స్పందనలగ్జరీ ఫరీ్నచర్ బ్రాండ్(కంపెనీ) స్టాన్లీ లైఫ్స్టైల్ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు మంగళవారానికల్లా 96 రెట్లు సబ్్రస్కిప్షన్ను అందుకుంది. కంపెనీ 1.02 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. దాదాపు 98.57 కోట్ల షేర్లకు స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లు 18 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 351–369 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 537 కోట్లు సమీకరించింది.⇒ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ షేరు 19% పెరిగి రూ.1,647 వద్ద ముగిసింది. లిథియం అయాన్ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు స్లొవేకియా సంస్థ జీఐబీ ఎనర్జీఎక్స్తో ఈ సంస్థ లైసెన్సింగ్ డీల్ కుదుర్చుకోవడం ఇందుకు కారణం.⇒ ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు 2.5% పెరిగి రూ.1199 వద్ద స్థిరపడింది. దీంతో బ్యాంకు మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల (రూ.8.43 లక్షల కోట్లు) వద్ద ముగిసింది. -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు పెరిగి 73,664 వద్ద నిలిచింది. నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 22,404 వద్ద స్థిరపడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది. ఒక దశలో సెన్సెక్స్ 762 పాయింట్లు బలపడి 73,749 వద్ద, నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,432 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 1.07%, 0.85% లాభపడ్డాయి. → ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ.3.1 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 407.35 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 30కి గానూ 25 షేర్లు లాభపడ్డాయి. → అమెరికాలో పారిశ్రామిక రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే డోజోన్స్ సూచీ తొలిసారి 40వేల పాయింట్ల పైకి చేరింది. -
వరుస నష్టాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో బ్యాంకింగ్, ఆటో, ఆయిల్అండ్గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,124 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్(4%), మారుతీ సుజుకీ(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. రోజంతా లాభాలే.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 73,139 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు ఎగసి 22,193 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మళ్లీ రూ.20 లక్షల కోట్లపైకి రిలయన్స్ మార్కెట్ క్యాప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేరు 3.60% లాభపడి రూ.2988 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్మెన్ శాక్స్ రిలయన్స్ కంపెనీ షేరు టార్గెట్ ధరను పెంచడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడం ఈ షేరుకు డిమాండ్ లభించింది. ట్రేడింగ్లో 4% లాభపడి రూ.3000 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,039 కోట్లు పెరిగి రూ.20.21 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 13న కంపెనీ రిలయన్స్ క్యాప్ రూ.20 లక్షల కోట్ల స్థాయిని అందుకుంది. దేశంలో టాప్–5 మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థల్లో రిలయన్స్ అగ్రస్థానంలో నిలవగా.., టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► జ్యువెలరీ రిటైల్ కంపెనీ పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ► బజాజ్ ఫైనాన్స్కు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా కంపెనీ 10 బిలియన్ డాలర్ల(రూ. 83,000 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ► మారుతీ సుజుకీ రూ.12,256 జీవిత కాల గరిష్టాన్ని తాకింది. దీనితో ఇంట్రాడేలో మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లను అందుకుంది. -
ఐఐపీ, ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి
ముంబై: కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, బాండ్లపై రాబడులు ట్రేడింగ్పై ప్రభావం చూపొచ్చంటున్నారు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు. ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ బ్యాంకులు సమీప కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లడంతో గత వారంలో సూచీలు అరశాతం నష్టపోయాయి. ఫైనాన్సియల్, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 490 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘ అమెరికాతో పాటు బ్రిటన్, భారత్ దేశాల ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించవచ్చు. యూఎస్ పదేళ్ల బాండ్లపై రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన మద్దతు 21,800 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే దిగువున 21,690 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,500 పాయింట్ల వద్ద మరో కీలక మద్దతు ఉంది. రికవరీ జరిగి అప్ట్రెండ్ మూమెంటమ్ కొనసాగితే ఎగువున 21,800 వద్ద నిరోధం చేధించాల్సి ఉంటుంది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు రూపక్ దే తెలిపారు. నేడు రిటైల్ ద్రవ్యోల్బణం డేటా నేడు (సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ డేటా, డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) విడుదల కానున్నాయి. మరుసటి మంగళవారం(ఫిబ్రవరి 13న) అమెరికా సీఐపీ ద్రవ్యోల్బణం వెల్లడి కానుంది. ఫిబ్రవరి 14న(బుధవారం) భారత్తో పాటు బ్రిటన్ హోల్సేల్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా రిటైల్ అమ్మకాల గురువారం విడుదల కానున్నాయి. వీటితో పాటు పలు దేశాలు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, పారిశ్రాకోత్పత్తి డేటాను వెల్లడించనున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక డేటా వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. చివరి దశకు క్యూ3 ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ఘట్టం చివరి దశకు చేరింది. మహీంద్రాఅండ్మహీంద్రా, ఐషర్ మోటార్స్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, మజగాన్ డాక్ షిప్యార్డ్స్, ఫోనిక్స్ మిల్స్తో సహా సుమారు 1000కి పైగా కంపెనీలు తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనుపమ్ రసాయన్, కోల్ ఇండియా, సెయిల్, సంర్ధన్ మదర్సన్, హిందాల్కో, ఐఆర్సీటీసీ, భెల్, గ్లాండ్ ఫార్మా, ముత్తూట్ ఫైన్సాన్లూ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. 4 లిస్టింగులు, 2 పబ్లిక్ ఇష్యూలు ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ షేర్లు నేడు(ఫిబ్రవరి 12న) లిస్టింగ్ కానున్నాయి. ఎంటెరో హెల్త్కేర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ (మంగళవారం) ముగిస్తుంది. రాశి పెరిఫెరల్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు (ఫిబ్రవరి 14న) బుధవారం లిస్టింగ్ కానున్నాయి. వి¿ోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ గురువారం ముగియనుంది. డెట్ మార్కెట్లో రూ.15 వేల కోట్లు పెట్టుబడులు డెట్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐలు ఫిబ్రవరిలో ఇప్పటి వరకు (ఫిబ్రవరి 09 నాటికి) దేశీయ డెట్ మార్కెట్లో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్లో చేర్చడం పాటు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుపై విశ్వాసం ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పెట్టుబడులు జనవరిలో రూ.19వేల కోట్లుగా ఉన్నాయి. ఇక ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం నెల(జనవరి)లో రూ.25,743 కోట్లు వెనక్కి తీసుకోగా ఈ ఫిబ్రవరి 09 నాటికి రూ.3,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై రాబడులు, భారతీయ ఈక్విటీ మార్కెట్ వాల్యూయేషన్లు పెరగడంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో భిన్న ట్రెండ్ దారితీసింది’’ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
80 డాలర్ల కిందకు వస్తేనే పెట్రో ధరల సవరణ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదిన్నరగా ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 80 డాలర్ల దిగువనకు వచ్చి స్థిరపడినప్పుడే, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) తిరిగి రోజువారీ రేట్ల సవరణకు వెళ్లొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశ ఆయిల్ మార్కెట్లో ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థల వాటా 90 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 84 డాలర్ల వద్ధ చలిస్తోంది. 2022 ఏప్రిల్ 6 నుంచి రోజువారీ రేట్ల సవరణ నిలిచిపోయిన విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది ముడి చమురు బ్యారెల్కు 120 డాలర్ల వరకు వెళ్లినప్పటికీ, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయే కానీ, రేట్లను పెంచలేదు. ఆ తర్వాత బ్యారెల్ చమురు ధర 80డాలర్ల లోపునకు దిగి వచి్చనప్పటికీ, అంతకుముందు భారీ నష్టాలను చవిచూసిన కారణంగా అవి రేట్లను సవరించకుండా కొనసాగించాయి. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరల్లో చెప్పుకోతగ్గ మేర అస్థిరత నెలకొంది. ధరలు అనూహ్యంగా ఆటుపోట్ల మధ్య చలిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు లీటర్కు రూపాయి తగ్గించినా అందరూ అభినందిస్తారు. కానీ, అంతర్జాతీయంగా రేట్లు పెరిగిపోతే తిరిగి విక్రయ ధరలను అవి సవరించడానికి అనుమతిస్తారా? అన్నదే సందేహం’’అని ఓ అధికారి పేర్కొన్నారు. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ఉండే ధరలు కీలకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. సెపె్టంబర్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 93.54 డాలర్లుగా ఉంటే, అక్టోబర్లో 90 డాలర్లు, నవంబర్లో 83.42 డాలర్లకు దిగొచ్చింది. స్థిరత్వం లేనందునే.. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ విక్రయాలపై చమురు కంపెనీలకు లాభాలే వస్తున్నాయి. కానీ, ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. పైగా త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఒకవేళ అంత్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే, సవరించే పరిస్థితి ఉండదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థిరత్వం ఆధారంగా రేట్లపై ఆయిల్ కంపెనీలు నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ‘‘కొన్ని రోజులు డీజిల్ విక్రయాలపై లాభాలు వస్తుంటే, కొన్ని రోజులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకే విధమైన ధోరణి లేదు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర స్థిరంగా 80 డాలర్లకు దిగువన ఉన్నప్పుడు రేట్లను సవరించొచ్చని అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లోనూ మంచి లాభాలనే నమోదు చేశాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం నష్టపోయిన మొత్తం ఇంకా భర్తీ కాలేదని సదరు అధికారి తెలిపారు. క్రూడాయిల్ డిమాండ్కు భారత్, ఆఫ్రికా దన్ను అంతర్జాతీయంగా 2030 నాటికి రోజుకు 112 మిలియన్ బ్యారెళ్ల వినియోగం ∙ ఎస్అండ్పీ నివేదిక భారత్, ఆఫ్రికా దన్నుతో 2030 నాటికి అంతర్జాతీయంగా క్రూడాయిల్కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత 103 మిలియన్ బ్యారెళ్ల (రోజుకు) స్థాయి నుంచి 112 మిలియన్ బ్యారెళ్లకు చేరనుంది. ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వంట, వాహనాల్లో స్వచ్ఛ ఇంధనాల వినియోగం గణనీయంగా పెరగగలదని ఇండియా కంటెంట్ హెడ్ పులకిత్ అగర్వాల్ తెలిపారు. 2040 నాటికి భారత్లో క్రూడాయిల్ డిమాండ్ గరిష్ట స్థాయైన 7.2 మిలియన్ బ్యారెళ్లకు (రోజుకు) చేరుతుందని అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం ఇది రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది. నివేదిక ప్రకారం.. దేశీయంగా కెమికల్ కమోడిటీ ఉత్పత్తుల విభాగం 2023లో 7 శాతం, 2024లో 8 శాతం మేర వృద్ధి చెందనుంది. 80–90 డాలర్ల రేటు.. సమీప భవిష్యత్తులో ధరపరంగా చూస్తే బ్యారెల్కు 80 డాలర్ల స్థాయిలో తిరుగాడి 2024 మూడో త్రైమాసికం నాటికి 90 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఈడీ గౌరి జౌహర్ తెలిపారు. భారత్ వృద్ధి చెందే కొద్దీ పర్యావరణ అనుకూల ఇంధనాల వైపు క్రమంగా మళ్లుతుందని వివరించారు. ఇది టెక్నాలజీ ఆధారితమైనదిగా ఉంటుందని, ఇలాంటి సాంకేతికతలు భారీ స్థాయిలో వినియోగంలోకి రావాలంటే దేశీయంగాను, అంతర్జాతీయంగానూ నిధులు, విధానాలపరమైన మద్దతు అవసరమవుతుందని పేర్కొన్నారు. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, పారిశ్రామికోత్పత్తి ఊతంతో వచ్చే ఏడాది ఆసియాలో పెట్రోకెమికల్స్ డిమాండ్కి సంబంధించి భారత్ కాంతిపుంజంగా ఉండగలదని సంస్థ అసోసియేట్ డైరెక్టర్ స్తుతి చావ్లా వివరించారు. డిమాండ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ తగినంత సరఫరా ఉండటం, కొత్తగా ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వస్తుండటం వంటి అంశాల కారణంగా ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. ఫలితంగా మార్జిన్లపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశీ ఉత్పత్తి సంస్థలకు పెద్దగా ఊరట లభించకపోవచ్చని ఆమె పేర్కొన్నారు. -
2035 నాటికి ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ రంగం 2035 నాటికి ఎగుమతి ఆధారిత ట్రిలియన్ డాలర్ పరిశ్రమగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థర్ డి లిటిల్ నివేదిక పేర్కొంది. తయారీ, ఆవిష్కరణలు, సాంకేతికత తోడుగా పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ‘భారత వాహన పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లకు డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తికి ఆకర్షణీయ ప్రపంచ కేంద్రంగా మారవచ్చు. దీనిని సాధించడానికి ఈ రంగంలోని కంపెనీలు ప్రపంచ తయారీకి అనుగుణంగా తమ సామర్థ్యాలను విశ్వసనీయ, పోటీతత్వంగా మెరుగుపర్చుకోవాలి. జోనల్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా పరిష్కారాలను అందించడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధిలో భారత శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. నిధులతో కూడిన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో భారతదేశం వాహన రంగంలో నాయకత్వ స్థానంలో ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని వివరించింది. నాయకత్వ స్థానంగా..: దేశీ వాహన రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణల వేగాన్ని, మారుతున్న సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే భారతదేశాన్ని ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో నాయకత్వ స్థానంగా మార్చవచ్చని నివేదిక తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ పరిశోధన, అభివృద్ధి, సాఫ్ట్వేర్ మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు వృద్ధి చెంది 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశం ప్రపంచ సాఫ్ట్వేర్ హబ్గా, ఆఫ్షోర్ గమ్యస్థానంగా తన స్థానాన్ని ఉపయోగించుకోవచ్చు. భారత వాహన పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని సది్వనియోగం చేసుకోవడానికి ప్రభుత్వంతో సహా ముడిపడి ఉన్న భాగస్వాముల మధ్య బలమైన చర్చలు, సమిష్టి చర్యలు అవసరం’ అని నివేదిక వివరించింది. -
66 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో బలహీనంగా కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్పై మరింత ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 158 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 78 పాయింట్లు నష్టపోయి 66వేల దిగువున 65,945 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్లను కోల్పోయి 19,665 వద్ద నిలిచింది. పారిశ్రామిక, మెటల్, ఎఫ్ఎంసీజీ, టెలికాం షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.693 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.715 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెల్లరీ ఐపీఓకు 2.25 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 91.20 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 2.05 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. సంస్థాగతేతర కోటా 5.18 రెట్లు, రిటైల్ విభాగం 1.66 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. నష్టాల మార్కెట్లో స్మాల్ క్యాప్ షేర్లు మెరిశాయి. శ్రేయాస్ షిప్పింగ్ 20%, ఐఎఫ్సీఐ 12%, కొచి్చన్ షిప్యార్డ్ 11%, ఎన్ఐఐటీ 10%, ఓమాక్స్ 9% అశోకా బిల్డ్కాన్ 8%, ఎన్సీసీ, అపార్ ఇండస్ట్రీస్, ఎంటార్ షేర్లు 7% ర్యాలీ చేశాయి. బీఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ అరశాతం వరకు లాభపడింది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పరీస్.., షేరు టార్గెట్ ధరను రూ.4,000 నుంచి రూ.4,150కి పెంచడంతో ఐషర్ మోటార్స్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 2.5% బలపడి రూ.3471 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 4.5% ర్యాలీ చేసి రూ.3539 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు యోచన నేపథ్యంలో డిమాండ్ రికవరీ ఆలస్యం అవ్వొచ్చనే అంచనాలతో ఐటీ రంగ షేర్లు డీలాపడ్డాయి. ఎంఫసీస్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 2–1% నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా పాజిటివ్ అవుట్లుక్ కేటాయింపుతో వరుణ్ బేవరేజెస్ షేరు ఐదున్నర శాతం ర్యాలీ చేసి రూ.975 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి నాలుగున్నర శాతం లాభపడి రూ.967 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 29 లక్షల షేర్లు చేతులు మారాయి. రూపాయి విలువ రెండోరోజూ కరిగిపోయింది. డాలర్ మారకంలో 15 పైసలు బలహీనపడి 83.28 వద్ద స్థిరపడింది. క్రూడ్æ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, బలహీన ఈక్విటీ మార్కెట్ దేశీ కరెన్సీ క్షీణతకు కారణమయ్యాయి. -
అంతర్జాతీయ విపణిలోకి మహిళా స్టార్టప్లు
సాక్షి, హైదరాబాద్: మహిళలను వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నాలుగున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వి హబ్ (వుమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్) అటు గ్రామీణ, ఇటు అంతర్జాతీయ స్థాయికి కార్యకలాపాలు విస్తరించేలా ద్విముఖ వ్యూహానికి పదును పెడుతోంది. వి హబ్లో పురుడు పోసుకుంటున్న మహిళల సారథ్యంలోని స్టార్టప్లు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఓ వైపు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలను వి హబ్ సిద్ధం చేస్తోంది. ఆర్ధిక, సామాజిక అడ్డంకులను అధిగమించి మహిళలు వాణిజ్యవేత్తలుగా రాణించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు చేయూతను అందిస్తోంది. తమ వద్ద ఉన్న వినూత్న ఆలోచనలు, పరిష్కారాలకు వాణిజ్య రూపం ఇచ్చేందుకు పడుతున్న ఇబ్బందులను మహిళలు అధిగమించేందుకు అవసరమైన సాయాన్ని వి హబ్ వివిధ రూపాల్లో అందిస్తోంది. మహిళల సారథ్యంలోని స్టార్టప్లు మహిళల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలు, సంక్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారం చూపుతూ స్టార్టప్ల ద్వారా వాణిజ్యరూపంలో ఊతమిచ్చేందుకు 2018 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వి హబ్ ఏర్పాటు చేసింది. వి హబ్లో ప్రస్తుతం మహిళల సారథ్యంలోని 84 స్టార్టప్లు ఇంక్యుబేట్ అవుతుండగా, వి హబ్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 914 మహిళా స్టార్టప్లు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వి హబ్లో ఇంక్యుబేట్ అవుతున్న స్టార్టప్లలో ఎక్కువగా నిత్యావసర వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందినవి కాగా, 25 శాతం చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగాలు, 13 శాతం ఆరోగ్య, లైఫ్సైన్సెస్ రంగాలు కాగా మిగతావి ఇతర రంగాలకు చెందినవి. స్టార్టప్లు తమ ఆలోచనలకు పదును పెట్టుకునేందుకు అవసరమైన సాయంతో పాటు సాంకేతిక సాయం అందించే మెంటార్లను (మార్గదర్శకులు) కూడా వి హబ్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకు లింకేజీలు, ఈక్విటీ ఫండింగ్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ తదితరాల ద్వారా మహిళా స్టార్టప్లకు వి హబ్ రూ.83 కోట్ల మేర నిధులు సమకూర్చింది. అటు వరల్డ్ ట్రేడ్ సెంటర్తో ఒప్పందం ఇటు మారుమూల ప్రాంతాల్లో విస్తరణ మహిళా స్టార్టప్లు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా మెరుగైన వాణిజ్య అవకాశాలను పొందేందుకు వీలుగా వి హబ్ ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్తో ఒప్పందం కుదుర్చుకుంది. పలు అంతర్జాతీయ కంపెనీలతోనూ మహిళా స్టార్టప్లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక హైదరాబాద్కే కార్యకలాపాలను పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలపైనా వి హబ్ దృష్టి సారించనుంది. సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు కొన్ని గిరిజన ప్రాంతాల్లోనూ స్టార్టప్ సంస్కృతిపై అవగాహన కల్పించాలని వి హబ్ నిర్ణయించింది. మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం రాష్ట్రంలో మహిళల సారథ్యంలోని స్టార్టప్లను ప్రోత్సహించడం ద్వారా మహిళా వాణిజ్యవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. వినూత్న ఆలోచనలు కలిగిన మహిళలను గుర్తించడం, వారి ఆలోచనలకు స్టార్టప్ల ద్వారా వాణిజ్య రూపం ఇవ్వడం, వారికి అవ సరమైన పెట్టుబడి, సాంకేతిక, వాణిజ్య సల హాలు, మార్గదర్శనం ఇవ్వడంలో వి హబ్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ స్టార్టప్లు స్థానిక ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. – దీప్తి రావుల, సీఈఓ, వి హబ్ గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. ఇప్పుడు వాణిజ్యవేత్తను గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసిన నేను వి హబ్ ప్రోత్సాహంతో వాణిజ్యవేత్తగా మారాను. స్టార్టప్ ద్వారా బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, బిజినెస్ ఐడియాలు, మార్కెటింగ్ నెట్వర్క్ తదితరాల్లో ఇక్కడ మార్గదర్శకత్వం లభించింది. ప్రస్తుతం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషీన్ల వ్యాపారం చేస్తున్నా. ఎంబ్రాయిడరీ స్టూడియో నుంచి మొదలైన నా ఆలోచన ప్రస్తుతం ఎంబ్రాయిడరీ మెషీన్ల దాకా విస్తరించింది. ప్రస్తుతం రూ.1.2 కోట్ల వార్షిక టర్నోవర్తో నా వ్యాపారం సాగుతోంది. – భవ్య గుమ్మడి -
స్పోర్టీ డిజైన్తో స్కోడా ఎలక్ట్రిక్ ఎస్యూవీ: అదిరిపోయే ఫీచర్స్
సాక్షి,ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఎన్యాక్ ఐవీ వీఆర్ఎస్' (Enyaq iV vRS) పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల లాంచ్ చేసింది. స్పోర్టీ-డిజైన్తో వస్తున్న ఈ కారు కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందు కుంటుందని కంపెనీ తెలిపింది. గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. అంతేకాదు ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని స్కోడా ఆటో ప్రకటించింది. ఈ కారు ధర విషయానికి వస్తే మన దేశంలో సుమారు రూ. 48.6 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎన్యాక్ ఐవీ వీఆర్ఎస్ స్పెసిఫికేషన్స్ ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ట్రాక్షన్ అనే ఐదు డ్రైవింగ్ మోడ్లతో ఎలక్ట్రిక్ ఎస్యూవీని తీసుకొచ్చింది. తమ డ్రైవింగ్కి అనుగుణంగా వినియోగ దారులు ఈ వెహికల్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులోని 82 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 296 బీహెచ్పీ పవర్ని అందిస్తుంది. కేవలం 36 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే గ్లాసీ-బ్లాక్ ఫ్రంట్ ఏప్రాన్లు, డోర్ మిర్రర్లు, రియర్ డిఫ్యూజర్ తో పాటు మరిన్ని స్పోర్టీ ఫీచర్లను జోడించింది. ఇంటీరియర్గా ఫాక్స్ లెదర్ ఫినిషింగ్, డ్యాష్ బోర్డ్ ను కార్బన్ ఫైబర్తోనూ రూపొందించింది. 13 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 'క్రిస్టల్ ఫేస్' ఫ్రంట్ గ్రిల్, ముందువైపు ఎల్ఈడీ లైట్లు, క్రోమ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్లోయ్ వీల్స్, రూఫ్ రైల్స్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పనితీరు, చైనాలో కోవిడ్ కేసుల నమోదు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టొచ్చు. తుది దశకు చేరిన దేశీయ కార్పొరేట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను పరిశీలించవచ్చు. ప్రాథమిక మార్కెట్లో రెండు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. మరో రెండు ఐపీవోలు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణుల చెబుతున్నారు. ‘‘చివరి ట్రేడింగ్ సెషన్లో సాంకేతికంగా నిఫ్టీ 16,250 స్థాయిపై ముగిసింది. బౌన్స్బ్యాక్ ర్యాలీ కొనసాగితే 16,400 స్థాయిని.., ఆపై 16,666 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 16,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,800వద్ద మద్దతు లభించొచ్చు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్ఎంజీసీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించవచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణ పెరుగుదల, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల అస్థిరత తదితర ప్రతికూల పరిస్థితులను అధిగమించి గతవారం దేశీయ సూచీలు దాదాపు మూడుశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1,533 పాయింట్లు, నిఫ్టీ 484 పాయింట్ల లాభాలన్ని ఆర్జించాయి. మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలను మరింత విశ్లేషిస్తే.., ► గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఏప్రిల్ 26న) నిఫ్టీ సూచీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ► కార్పొరేట్ ఫలితాల ప్రభావం దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్ తుది దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,200కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. దీవీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, సెయిల్, జొమాటో, అదానీ పోర్ట్స్, గ్రాసీం, ఇప్కా ల్యాబ్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఇండిగో, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, బర్గర్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, నైకా సంస్థలు మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ► విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి వర్ధమాన దేశాల్లో పెద్ద ఎత్తున ఈక్విటీలను విక్రయిస్తున్నారు. ఈ మే నెల(20 తేదీ నాటికి)లో ఇప్పటి వరకు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ నెల చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వరుసగా ఐదో నెలలో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా మారడం ఈక్విటీ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తోంది. ► ప్రాథమిక మార్కెట్పై దృష్టి ఇటీవల ఐపీవోలను పూర్తి చేసుకున్న డెలివరీ.., వీనస్ పైప్స్అండ్ట్యూబ్స్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున ఏథర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుండగా.., గతవారంలో ప్రారంభమై ఈ ముద్ర ఐపీవో మంగళవారం ముగియనుంది. ఈ రెండు పబ్లిక్ ఇష్యూల మొత్తం పరిమాణం రూ.1,221 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్ల తీరు.., ఐపీఓ స్పందనలను ఇన్వెస్టర్లు గమనించవచ్చు. ప్రపంచ పరిణామాలు అమెరికా ఫెడ్ చైర్మన్ పావెల్.., ఈసీబీ ప్రెసిడెంట్ లాగార్డ్ ప్రసంగాలు మంగళవారం ఉన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్(బుధవారం)తో పాటు జీడీపీ వృద్ధి రేటు అవుట్లుక్(గురువారం) విడుదల కానున్నాయి. జపాన్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి అవుతుంది. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. -
Nifty: సరికొత్త శిఖరాలకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు రాణించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభంతో ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటం కూడా కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 308 పాయింట్లు లాభపడి 51,423 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 51,259 – 51,529 పాయింట్ల మధ్యలో ట్రేడైంది. మరో ఇండెక్స్ నిఫ్టీ మూడు నెలల విరామం తర్వాత ఇంట్రాడేలో 15,469 వద్ద సరికొత్త రికార్డును లిఖించింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 15,436 వద్ద ముగిసింది. ఈ ముగింపు స్థాయి కూడా నిఫ్టీకి రికార్డు గరిష్టం. అలాగే ఆరోరోజూ లాభాలను గడించినట్లైంది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.914 కోట్ల షేర్లను, విదేశీ ఇన్వెస్టర్లు రూ.661 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 882 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లు పెరిగాయి. ‘‘దేశంలో కోవిడ్ వ్యాధి సంక్రమణ రేటు క్షీణించడంతో పాటు డాలర్ ఇండెక్స్ పతనం భారత ఈక్విటీ మార్కెట్కు కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడుతూ ర్యాలీకి మద్దతుగా నిలుస్తోంది. ఆర్థిక రికవరీ ఆశలు, మెరుగైన క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో మార్కెట్ మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ మోదీ తెలిపారు. సూచీలకు మద్దతుగా రిలయన్స్ ర్యాలీ... అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు చాలాకాలం తరువాత లాభాల బాట పట్టింది. జెఫ్పారీస్తో సహా బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుకు బుల్లిష్ రేటింగ్ను కేటాయించాయి. ఇన్వెస్టర్లు ఈ షేరును కొనేందుకు ఆసక్తి చూపారు. ఎన్ఎస్ఈలో 6% లాభంతో రూ. 2,095 వద్ద స్థిరపడింది. -
మార్కెట్కు బైడెన్ జోష్
ముంబై: అందరూ అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్ష పోటీలో జో బైడెన్ ముందంజలో కొనసాగుతుండడం స్టాక్ మార్కెట్లకు జోష్నిచ్చింది. భారత సేవల రంగం ఏడునెలల తర్వాత మెరుగైన గణాంకాలను ప్రకటించడంతో ఇన్వెస్టర్లకు దేశ ఆర్థిక రికవరీ పట్ల మరింత విశ్వాసం పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగడం, రూపాయి 40 పైసలు బలపడటం, అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటన పెట్టుబడిదారులకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్ సెంటిమెంట్ను మరింత బలపరిచింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ముగిసేవరకు మార్కెట్లో విస్తృత స్థాయి కొనుగోళ్లు జరిగాయి. ఒక్క రియల్టీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. మెటల్ షేర్ల పట్ల అధిక ఆసక్తి చూపారు. దీంతో సూచీలకు వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు ఖరారైంది. సెన్సెక్స్ 724 పాయింట్లు పెరిగి 41,340 వద్ద, నిఫ్టీ 212 పాయింట్ల లాభంతో 12,120 వద్ద స్థిరపడ్డాయి. ఇరు సూచీలకిది ఎనిమిది నెలల గరిష్ట ముగింపు కావడం విశేషం. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,727 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్లను ఆర్జించాయి. తద్వారా ఈ ఏడాదిలో నమోదైన నష్టాలను పూడ్చుకోగలిగాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆరుశాతం పెరిగిన ఎస్బీఐ షేరు ఎస్బీఐ షేరు గురువారం బీఎస్ఈలో 6 శాతం లాభపడింది. రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరుతో బ్యాంకు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. క్యూ2 ఫలితాలు మార్కెట్ను మెప్పించడంతో షేరు రూ.214 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్లకు తెరతీశారు. ఒకదశలో ఏడుశాతం ఎగిసిన రూ.221 స్థాయికి చేరుకుంది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.218 వద్ద ముగిసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,397 కోట్లు పెరిగి రూ.1.95 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ‘‘ఊహించినట్లుగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ ముందంజ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేకుండా యథాతథ కొనసాగింపును ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్వార్టర్ ఫలితాలు, ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల కొనసాగింపు భారత మార్కెట్ను లాభాల్లో నడిపిస్తున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగపు అధిపతి వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్ల సంపద రూ.2.78 లక్షల కోట్లు అప్ సూచీలు భారీ ర్యాలీతో గురు వారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 2.78 లక్షల కోట్లను సంపదను ఆర్జించారు. మార్కెట్లో విస్తృత స్థాయిలో కొనుగోళ్లతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 162 లక్షల కోట్లకు ఎగసింది. -
మూడోరోజూ ముందుకే...
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో మార్కెట్ ముచ్చటగా మూడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ సూచీలకు దన్నుగా నిలిచింది. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. అధిక వెయిటేజీ రిలయన్స్తో పాటు ఐటీ షేర్ల అండతో సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 40,616 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లను ఆర్జించి 11,900 పైన 11,909 వద్ద స్థిరపడింది. వరుస మూడు ట్రేడింగ్ సెషన్లలో సెనెక్స్ 1,003 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 266 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడేలో ఫార్మా, ఐటీ, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాల షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, మెటల్, ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. 617 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్.... అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తూ బుధవారం మార్కెట్ లాభాలతో మొదలైంది. అమెరికా అధ్యక్ష పదవి పోరులో ఊహించినట్లుగానే బైడెన్ ముందంజలో ఉన్నాడనే వార్తలతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఉదయం సెషన్లో సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 40,693 గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 117 పాయింట్లను ఆర్జించి 11,929 వద్ద ఇంట్రాడే హైని తాకింది. మిడ్ సెషన్లో లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు వెనకడుగు వేశాయి. అయితే యూరప్ మార్కెట్ల పాజిటివ్ ప్రారంభం ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. అలాగే చివరి గంట కొనుగోళ్లు కూడా సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. ‘‘యూఎస్ ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈక్విటీల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారని, దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు ఆరంభలాభాల్ని కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లకు దూరంగా ఉండటమే మంచిది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ దీపక్ జెసానీ తెలిపారు. సన్ఫార్మా షేరు 4 శాతం జంప్: సన్ఫార్మా షేరు బుధవారం బీఎస్ఈలో 4 శాతం లాభపడింది. ప్రోత్సాహకరమైన క్యూ2 ఫలితాల ప్రకటన షేరును రెండోరోజూ లాభాల బాట పట్టించింది. ఒకదశలో 6.81 శాతం పెరిగి రూ.518 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.504 వద్ద స్థిరపడింది. నవంబర్ 14న దీపావళి మూరత్ ట్రేడింగ్ దీపావళి పండుగ రోజున ప్రత్యేకంగా గంటపాటు మూరత్ ట్రేడింగ్ను నిర్వహిస్తామని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది నవంబర్ 14 న దీపావళి పండుగ జరగనుంది. అదేరోజు సాయంత్రం 6:15 గంటల నుంచి 7:15 మధ్య ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తామని స్టాక్ ఎక్సే్ఛంజీలు వివరించాయి. హిందూ పంచాంగం ప్రకారం బ్రోకర్లకు, వ్యాపారులకు కొత్త సంవత్సరం దీపావళి రోజున ప్రారంభం అవుతుంది. నవంబర్ 16న (సోమవారం) బలిప్రతిపద పండుగ సందర్భంగా ఎక్సే్ఛంజీలకు సెలవు ప్రకటించారు. దీంతో మార్కెట్లు తిరిగి నవంబర్ 17న ప్రారంభమవుతాయి. -
బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ..
ముంబై: ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలను ప్రతిబింబిస్తూ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్లు నెలకొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ కూడా ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. ఫలితంగా సూచీల మూడురోజుల నష్టాలకు సోమవారం చెక్ పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో 39,758 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,669 వద్ద నిలిచింది. లాక్డౌన్ తర్వాత తొలిసారి అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లను దాటడంతో పాటు ఇదే నెలలో ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండింతల వృద్ధిని సాధించాయి. దీంతో వ్యవస్థలో తిరిగి డిమాండ్ ఊపందుకుందనే సంకేతాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. మరోవైపు ప్రపంచమార్కెట్లు నెలరోజుల కనిష్టం నుంచి కోలుకోవడం మన మార్కెట్కు కలిసొచ్చింది. చైనాతో పాటు ఐరోపా దేశాలు మెరుగైన తయారీ రంగ గణాంకాలను ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,335 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ 11,726– 11,557 పాయింట్ల మధ్య కదలాడింది. అయితే ఐటీ, ఫార్మా, మెటల్, ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రూ.లక్ష కోట్లకు పైగా రిలయన్స్ సంపద ఆవిరి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 9 శాతం పతనంతో కంపెనీ రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ను కోల్పోయింది. క్యూ2 ఫలితాలు మార్కెట్ను మెప్పించకపోవడంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో షేరు 9.50 శాతం నష్టపోయి రూ.1,860 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని పతనమైంది. చివరికి 9% నష్టంతో రూ.1,877 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంలో కంపెనీ రూ.1.19లక్షల కోట్ల విలువైన మార్కెట్ క్యాప్ను నష్టపోయింది. ఆరుశాతం పెరిగిన ఐసీఐసీఐ షేరు రెండో త్రైమాసికంలో ఐసీసీఐసీఐ నికరలాభం నాలుగు రెట్లు పెరగడంతో బ్యాంకు షేరు సోమవారం 6శాతం లాభంతో రూ.417 వద్ద ముగిసింది. దేశీయ రెండో అతిపెద్ద బ్యాంకు సోమవారం సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. కరోనా సంబంధిత కేటాయింపులు తక్కువగా ఉండడంతో పాటు ఆదాయ వృద్ధి పెరగడంతో ఈ ద్వితియా క్వార్టర్లో కంపెనీ రూ.4,882 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.16,957 కోట్లు పెరిగి రూ.2,87,668 వద్ద స్థిరపడింది. నిరాశపరిచిన ఈక్విటాస్ లిస్టింగ్... ఇటీవల పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్ ఇన్వెస్టర్లను నిరాశపరచింది. ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్ఈలో 6 శాతం తక్కువగా రూ.31 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 9 శాతం నష్టపోయి రూ.30.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్సెషన్ తర్వాత బ్యాంకింగ్ రంగ షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతులో భాగంగా నష్టాలను తగ్గించుకోగల్గింది. చివరికి 1 శాతం నష్టంతో రూ.32.75 వద్ద స్థిరపడింది. రెండు నెలల కనిష్టానికి రూపాయి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 32 పైసలు పతనంతో 74.42 వద్ద ముగిసింది. గడచిన రెండు నెలల్లో రూపాయి ఇంత తక్కువ స్థాయిని చూడలేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, డాలర్ల కోసం డిమాండ్ రూపాయి సెంటిమెంట్ను దెబ్బతీసినట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
మార్కెట్ జోరుకు రిలయన్స్ అడ్డుకట్ట
ముంబై: అధిక వెయిటేజీ గల రిలయన్స్ షేరు పతనంతో పాటు మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీ నష్టాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 540 పాయింట్లను కోల్పోయి 40,146 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 162 పాయింట్లను నష్టపోయి 11,768 వద్ద ముగిసింది. అమెరికా, ఐరోపాల్లో భారీగా నమోదైన కరోనా కేసులు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల పతనం ఆందోళనలను కలిగించాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసల క్షీణత ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ట్రేడింగ్ ఆద్యంతం మార్కెట్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ఏ ఒక్క రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఇంట్రాడేలో సెనెక్స్ 734 పాయింట్లను నష్టపోయి 39,948 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 218 పాయింట్లను కోల్పోయి 11,712 స్థాయికి దిగివచ్చింది. ఎఫ్ఐఐలు రూ.119.40 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.976.16 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4 శాతం నష్టంతో రూ.2029 వద్ద స్థిరపడింది. సోమవారం సెన్సెక్స్ 540 పాయింట్ల పతనంలోని ఒక్క రిలయన్స్ షేరువి ఏకంగా 111 పాయింట్లు కావడం విశేషం. నిఫ్టీ మెటల్, ఆటో ఇండెక్స్ 3.50శాతం నష్టపోయాయి. ఆసియాలో హాంగ్కాంగ్, తైవాన్ మినహా మిగిలిన అన్ని మార్కెట్లు అరశాతం నుంచి 1శాతం నష్టంతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు 3 నుంచి 1 శాతం పతనమయ్యాయి. అమెరికా సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి... మార్కెట్ భారీ నష్టంతో రూ.1.92 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.160.57 లక్షల కోట్ల నుంచి రూ.158.66 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘పాజిటివ్ క్యూ2 ఫలితాలతో మార్కెట్ ర్యాలీ చేసింది. ఇప్పుడు దిద్దుబాటుకు లోనైంది. స్వల్పకాలంలో మార్కెట్లో బలహీనత కొనసాగవచ్చు. కంపెనీల ద్వితియా క్వార్టర్ ఫలితాలు, అమెరికా పరిణామాలు మార్కెట్కు కీలకం కానున్నాయి’ జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. -
ఆర్బీఐ, ప్రపంచ పరిణామాలే కీలకం!
న్యూఢిల్లీ: ఆర్బీఐ పాలసీ, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్కు కీలకాంశాలని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు వాహన విక్రయ గణాంకాలు, మౌలిక, తయారీ రంగ సంబంధిత గణాంకాలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు....మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం(వచ్చే నెల2న) సెలవు కావడంతో ట్రేడింగ్ ఈ వారం నాలుగు రోజులే జరగనున్నది. మరో వైపు మంగళవారం నుంచి మూడు ఐపీఓలు–యూటీఐ ఏఎమ్సీ, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల ఐపీఓలు మొదలు కానున్నాయి. గురువారం ఆర్బీఐ పాలసీ.. మారటోరియం రుణాలపై వడ్డీకి సంబంధించిన కేసు ఈ నెల 28న (నేడు–సోమవారం)సుప్రీం కోర్టులో విచారణకు రానున్నది. బుధవారం (ఈ నెల 30న) ఆగస్టు నెలకు సంబం«ధించిన మౌలిక రంగ గణాంకాలు వెల్లడవుతాయి. వచ్చే నెల 1(గురువారం) ఆర్బీఐ పాలసీ వెల్లడి కానున్నది. అదే రోజు వాహన కంపెనీలు సెప్టెంబర్ నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. మరోవైపు సెప్టెంబర్ నెలకు సంబంధించి తయారీ రంగ పీఎమ్ఐ గణాంకాలు కూడా గురువారమే రానున్నాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లండ్ల జీడీపీ గణాంకాలు, అమెరికాకు సంబంధించి పీఎమ్ఐ గణాంకాలు వెల్లడవుతాయి. ఒడిదుడుకులు కొనసాగుతాయ్.... గత శుక్రవారం రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకున్నా, యూరప్లో కరోనా కేసులు పెరుగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో మార్కెట్లో ఒడిదుడుకులకు అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. రూ. 476 కోట్ల విదేశీ నిధులు వెనక్కి.... విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.476 కోట్లు వెనక్కి తీసుకున్నారు. గత వారంలో ఎఫ్పీఐలు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.10,491 కోట్లు నికర అమ్మకాలు జరిపారు. యూరప్, ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్ల అప్రమత్తతను ఇది సూచిస్తోందని నిపుణులంటున్నారు. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ ఈక్విటీ మార్కెట్ నుంచి నికరంగా రూ.4,016 కోట్లు ఉపసంహరించుకోగా, డెట్ మార్కెట్లో నికరంగా రూ. 3,540 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద నికరంగా రూ.476 కోట్లు ఉపసంహరించుకున్నారు. -
గోల్డ్ బాజా!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచ దేశాలను భయాందోళనలోకి నెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి, దీనితో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థలు, అనిశ్చితి పరిస్థితులు, ఈక్విటీల బలహీన ధోరణి అంతర్జాతీయంగా బంగారానికి బలాన్ని అందిస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ప్రస్తుతం ప్రధాన మార్గంగా పసిడివైపు చూస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం 26 డాలర్లకుపైగా పెరిగి 1,778.95 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటల సమయంలో 1,774 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్లో చూస్తే, అంతర్జాతీయ ధోరణికితోడు డాలర్ మారకంలో రూపాయి బలహీనత పసిడికి వరమవుతోంది. దేశీయంగా 50 వేల దిశగా... హైదరాబాద్, విజయవాడసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛత ధర ఒక దశలో రూ.50,000 దాటినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అటు తర్వాత రూపాయి బలోపేతం పసిడి ధరను కొంత తగ్గించింది. ఈ వార్త రాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)లో ధర స్వల్ప లాభంతో 48,026 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే సోమవారం 17 పైసలు బలపడి 76.03 వద్ద ముగిసింది. కరోనా భయాలు, ఈక్విటీల అనిశ్చితికి తోడు చైనాతో ఉద్రిక్తతలూ ఇప్పుడు రూపాయి విలువను భయపెడుతున్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). మళ్లీ ఆ కనిష్టాల దిశగా రూపాయి కదిలితే దేశీయంగా పసిడి ధర వేగంగా రూ 50,000 దాటేస్తుందనేది నిపుణుల అంచనా. 1,800 డాలర్లు దాటితే పరుగే... అంతర్జాతీయంగా పసిడి ధరకు 1,800 డాలర్ల వద్ద పటిష్ట నిరోధం ఉంది. ఈ స్థాయిని దాటితే పసిడి వేగంగా తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు దూసుకుపోయే వీలుందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మాంద్యంలోకి జారుకుంటున్నపలు ప్రధా న దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి అప్ట్రెండ్వైపు మొగ్గు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడి జరక్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగి, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగటివ్లోకి వెళితే... పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. ప్రపంచ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏడాది లోపు 2000 డాలర్లను అందుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మెన్ శాక్స్ ఇప్పటికే ఒక నివేదికలో పేర్కొంది. మా వద్ద 13,212 కేజీల పసిడి డిపాజిట్లు: ఎస్బీఐ పడిసి డిపాజిట్ స్కీమ్ (గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్– జీఎంఎస్) ద్వారా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొత్తం 13,212 కేజీల పసిడిని సమీకరించింది. బ్యాంక్ వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. జీఎంఎస్ కింద ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3,973 కేజీల పసిడిని సమీకరించినట్లు వెల్లడించింది. వ్యక్తులు, ట్రస్టుల వద్ద నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగానికి ప్రభుత్వం 2015 నవంబర్లో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) స్కీమ్ ద్వారా దాదాపు రూ.244 కోట్ల విలువైన 647 కేజీల పసిడిని సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. తద్వారా ఈ ఒక్క స్కీమ్తో పసిడి సమీకరణ పరిమాణం 5,098 కేజీలకు (రూ.1,561 కోట్లు) చేరినట్లు బ్యాంక్ తెలిపింది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గించడం లక్ష్యంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్జీబీని తీసుకువచ్చింది. -
అమెరికానే దాటేశాం..!
న్యూఢిల్లీ: భారత్లో స్మార్ట్ఫోన్ వినియోగం రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్గా అవతరించింది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ తెలిపింది. నివేదిక ప్రకారం.. 2019వ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలోభారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 27శాతం మార్కెట్ షేర్తో షియోమీ మొదటి స్థానంలో నిలవగా, వివో 21 శాతం వాటాతో శాంసంగ్ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక శాంసంగ్ 19 శాతం వాటాతో 3వ స్థానానికి పడిపోయింది. అలాగే 12శాతం మార్కెట్తో ఒప్పో, 8 శాతం మార్కెట్ షేర్తో రియల్మీలు 4, 5వ స్థానాల్లో నిలిచాయి. కాగా కౌంటర్ పాయింట్ రీసెర్చి ప్రకారం గడిచిన నాలుగేళ్ల కాలంలో వివో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టడంలో ఇతర మొబైల్ తయారీ కంపెనీల కన్నా ముందుందని వెల్లడైంది. అలాగే రూ.15వేల నుంచి రూ.20వేల సెజ్మెంట్లో ఫోన్లను తయారు చేయడంలో వివో విజయవంతమైందని, ఆయా ఫోన్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయని తేలింది. -
భగ్గుమన్న పెట్రోల్ ధరలు
సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో సెప్టెంబర్ డెలివరీ ఒక బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 19.5 శాతం ఎగసి 71.95 డాలర్లను తాకింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి డాలర్ల పరంగా ఒక్క రోజులో ఇంతగా ధర పెరగడం ఇదే మొదటిసారి. ఇక అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటరీ్మడియట్ (డబ్ల్యూటీఐ) ఫ్యూచర్స్ 15.5 శాతం ఎగసి 63.34 డాలర్లకు పెరిగింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ రెండు రకాల ముడి చమురు ధరలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఈ వార్త రాసే సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ నైమెక్స్ క్రూడ్ ధర 12 శాతం ఎగసి 61.38 డాలర్ల వద్ద, బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 12.4 శాతం ఎగసి 67.70 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. మన మార్కెట్లో 9 శాతం అప్... ఇక మన మార్కెట్ విషయానికొస్తే, సోమవారం మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎమ్సీఎక్స్)లో సెపె్టంబర్ డెలివరీ క్రూడ్ ధర 9.14 శాతం ఎగసి రూ.4,273 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో స్పెక్యులేటర్లు తాజాగా పొజిషన్లు తీసుకోవడంతో ధరలు పెరిగాయి. ట్రేడర్ల స్పెక్యులేటివ్ పొజిషన్ల కారణంగా సమీప భవిష్యత్తులో ధరలు అధిక స్థాయిల్లోనే ట్రేడవుతాయని నిపుణులంటున్నారు. సౌదీ సగం ఉత్పత్తికి గండి... ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ప్రాసెసింగ్ కేంద్రం, సౌదీ అరేబియాలోని సౌదీ ఆరామ్కో ఆయిల్ ప్లాంట్లపై గత శనివారం ద్రోన్లతో దాడి జరిగింది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని అబ్క్వైక్ నగరంలోని రిఫైనరీపైనా, రియాద్కు 150 కిమీ. దూరంలోని ఖురయాస్ చమురు క్షేత్రంపైనా ద్రోన్లతో దాడి జరిగింది. దీంతో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగం (ఇది ప్రపంచ రోజువారీ చమురు సరఫరాల్లో ఐదు శాతానికి సమానం) వరకూ తగ్గుతుందని అంచనా. రోజుకు 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి గండి పడుతుంది. కాగా ఈ దాడులకు కారణం ఇరాన్ అని అమెరికా ఆరోపిస్తుండగా, ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ దాడులు తామే చేశామని యెమెన్కు చెందిన హౌతి రెబెల్స్ పేర్కొన్నారు. ఇరాన్పై వైమానిక దాడులు చేసే అవకాశాలు మరింతగా పెరిగాయని, ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. సౌదీ ఆరామ్కో ఐపీఓ ఆలస్యం...! ఉగ్రవాద దాడుల కారణంగా సౌదీ ఆరామ్కో భారీ ఐపీఓ (ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్) మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. దాడుల నష్టా న్ని మదింపు చేస్తున్నామని, ఐపీఓ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ మార్కెట్లో లిస్టయ్యే ముందు సౌదీ అరేబియా స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది నవంబర్లో లిస్టింగ్ కావాలని సౌదీ ఆరామ్కో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బ్యాంకర్లనూ నియమించింది. మరింతగా వదలనున్న మన ‘చమురు’... సింగపూర్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచి్చందని సామెత. సామెత అన్వయం సరిగ్గా లేకపోయినప్పటికీ, సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై దాడుల కారణంగా భారత్కు మరింతగా చమురు వదలనున్నది. సౌదీ ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా మన దిగుమతి బిల్లు మరింతగా పెరుగుతుందని, ముందుగా రూపాయిపై దెబ్బ పడుతుందని సింగపూర్కు చెందిన డీబీఎస్ బ్యాంకింగ్ గ్రూప్ వెల్లడించింది. ముడి చమురు ధరలు 10 శాతం పెరిగితేనే, ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని, భారత కరంట్ అకౌంట్ లోటు 0.4–05 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. ఒక్కో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కో డాలర్ పెరిగితే, భారత చమురు దిగుమతుల బిల్లు 200 కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని వివరించింది. భారత్ తన అవసరాల్లో 83 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునేది ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా నుంచే. గత ఆరి్థక సంవత్సరంలో భారత్ మొత్తం 2017.3 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోగా, దీంట్లో సౌదీ అరేబి యా వాటా 40.33 మిలియన్ టన్నులుగా ఉంది. సరఫరాల్లో కొరత ఉండదు సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై దాడుల కారణంగా మనకు చమురు సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాబోవని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాడుల అనంతరం సౌదీ ఆరామ్కో కంపెనీ ప్రతినిధులను సంప్రదించామని, సరఫరాల్లో ఎలాంటి కొరత ఉండబోదని వారు భరోసానిచ్చారని వివరించారు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్కంపెనీల వద్ద సెప్టెంబర్ నెలకు సంబంధించిన చమురు నిల్వలపై సమీక్ష జరిపామని, పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని, సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండబోవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధర రూ.5–6 పైపైకి..! సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు మరో రెండు వారాల్లో రూ.5–6 మేర పెరుగుతాయని నిపుణులంటున్నారు. ఈ దాడుల కారణంగా సమీప భవిష్యత్తులో ముడి చమురు ధరలు భగ్గుమంటూనే ఉంటాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. సౌదీలో చమురు ఉత్పత్తి సాధారణ స్థాయికి రావడానికి మరికొన్ని వారాలు పడుతుందని తెలిపింది. మరోవైపు సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు సౌదీ అరేబియా అమెరికాతో కలిసి ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏతావాతా పశ్చిమాసియాలో సంక్షోభం మరింతగా ముదిరితే ముడి చమురు ధరల ర్యాలీ ఇప్పట్లో ఆగదని విశ్లేషకులు భయపడుతున్నారు. ముడి చమురు, సంబంధిత ఉత్పాదకాలు పలు పరిశ్రమలకు ముడిపదార్ధాలుగా వినియోగమవుతున్నాయని, పెయింట్లు, టైర్లు, ఆయిల్, గ్యాస్, వాహన విడిభాగాల పరిశ్రమలపై పెను ప్రభావం పడుతుందని వారంటున్నారు. ముడి చమురు ధరలు భగ్గుమంటే, అది ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రతికూలమేనని, అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పటికే వెనుజులా, ఇరాన్ల నుంచి చమురు సరఫరాలు తగ్గాయని కోటక్ ఈక్విటీస్ తెలిపింది. రూపాయి.. ‘క్రూడ్’ సెగ! ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పరుగు భయాలు సోమవారం రూపాయిని వెంటాడాయి. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 68 పైసలు పతనమైంది. 71.60 వద్ద ముగిసింది. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో లాభాల బాటన పయనించిన రూపాయి సోమవారం మొట్టమొదటిసారి నేలచూపు చూసింది. క్రూడ్ ధరల పెరుగుదల భారత్ కరెంట్ అకౌంట్లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి కీలక ఆరి్థక గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. గత వారాంతంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి కేంద్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో... సోమవారం ట్రేడింగ్లో రూపాయి బలహీనంగా 71.54 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 71.63 స్థాయినీ చూసింది. రూపాయి శుక్రవారం ముగింపు 70.92. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. స్టాక్ మార్కెట్లో ‘మంట’... సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ద్రోన్లతో దాడి కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇంట్రాడేలో 20% వరకూ క్రూడ్ ధరలు ఎగియడంతో మన స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చమురు సెగతో డాలర్తో రూపాయి మారకం విలువ 67 పైసలు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 356 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 262 పాయింట్ల నష్టంతో 37,123 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 11,004 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆరి్థక వ్యవస్థలో వృద్ధి జోష్ను పెంచడానికి ప్రభుత్వం శనివారం ప్రకటించిన రూ.70,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ(ఎగుమతులు, రియల్టీకి) చమురు దాడుల నష్టాల్లో కొట్టుకుపోయింది. ఆయిల్ షేర్లు విలవిల.... సౌదీ చమురు క్షేత్రాల దాడుల నేపధ్యంలో బీఎస్ఈ ఆయిల్ గ్యాస్ అండ్ ఎనర్జీ ఇండెక్స్ భారీగా నష్టపోయింది. చమురు సంబంధిత షేర్లు బాగా నష్టపోయాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, క్యా్రస్టాల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 7% వరకూ నష్టపోయాయి. స్పైస్జెట్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, జెట్ ఎయిర్వేస్ వంటి విమానయాన ఇంధన షేర్లు 4% వరకూ నష్టపోయాయి. ఇప్పటికే అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కుదేలైన ప్రపంచ మార్కెట్లపై సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై తాజాగా జరిగిన దాడి మరింత ప్రతికూల ప్రభావం చూపించిందని షేర్ఖాన్ బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ గౌరవ్ దువా వ్యాఖ్యానించారు. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరితే, మన ద్రవ్యోల్బణ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపగలదని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ రాహుల్ గుప్తా పేర్కొన్నారు. ప్రధాన ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. -
'బుల్' చల్.. 'బిట్' హిట్!
ఒక్క ఇండియానే కాదు. 2017లో యావత్ ప్రపంచానిదీ బుల్ పరుగే. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ జీవితకాల గరిష్ఠ స్థాయులకు చేరుకున్నాయి. ఏ ఆర్థిక వ్యవస్థకూ తీవ్రస్థాయి కుదుపులు లేవు. మొబైల్ విప్లవం కొత్త దశకు చేరింది. దీంతో కొత్త మొబైళ్లొచ్చాయి. చైనా కంపెనీలు విజృంభించాయి. పెద్ద స్క్రీన్లతో యాపిల్ తెచ్చిన ఫోన్లూ సూపర్హిట్. బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది.ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్వైపు పరిగెడుతోంది. ఆలోచించే రోబోలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. గూగుల్, టెస్లాలు అంతరిక్షంలో కాలనీలు కట్టాలని ఆలోచిస్తున్నాయి. దేశీయంగా చూస్తే... పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్మనీకి, నకిలీలకు అడ్డుకట్ట పడలేదని అర్థమైపోయింది. కాకపోతే డిజిటల్ కరెన్సీ వాడకం పెరిగింది. ఆ దెబ్బ తట్టుకుని కోలుకుంటున్న తరుణంలో జీఎస్టీ వచ్చి చిన్న వ్యాపారుల్ని కొంత ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఈ రెండింటి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోయినా.. ఏడాది చివరికి వచ్చేసరికి మాత్రం కాస్త కోలుకుంటున్న సంకేతాలు వెలువడ్డాయి. ఇక ఆరంభంలో ధరలు కాస్త శాంతించినప్పటికీ.. ఏడాది చివరికొచ్చేసరికి భయపెట్టే స్థాయికి చేరి.. ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు అడ్డంకిగా మారాయి. ఇక మొండి బకాయిలు. వీటిలో మనది ఐదో స్థానం... ఇన్ఫ్రా, మెటల్, విద్యుత్ కంపెనీలదే ఈ జాబితాలో అగ్రస్థానం. ఇక ఈ ఏడాది పోతూ పోతూ 2జీ స్పెక్ట్రం కేసు నిందితులకు పెద్ద బోనస్సే ఇచ్చింది. దీన్లో ఎలాంటి అవకతవకలూ లేవంటూ అందరినీ నిర్దోషులుగా కోర్టు వదిలేసింది. ఆయా సంఘటనల సమాహారంతో ‘సాక్షి’ బిజినెస్ విభాగం అందిస్తున్న ‘రివైండ్–2017’ ఇది.. జనవరి ♦ టాటా గ్రూపునకు మిస్త్రీ స్థానంలో కొత్త ఛైర్మన్ వచ్చారు. టీసీఎస్ సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్.చంద్రశేఖరన్ను ఆ పదవిలో నియమించారు. టీసీఎస్కు గోపీనాథన్ను నియమించారు. ♦ అంతర్జాతీయంగా పొగాకు పరిశ్రమలో భారీ డీల్ సాకారమయింది. రేనాల్డ్స్ అమెరికన్ను బ్రిటిష్ అమెరికన్ టొబాకో చేజిక్కించుకుంది. ఫిబ్రవరి ♦ సంప్రదాయానికి భిన్నంగా 1న కేంద్రం రూ.21.47 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ♦ రూ.16,000 కోట్ల విలువైన నవీ ముంబై ఎయిర్పోర్టు కాంట్రాక్టును ఆంధ్రప్రదేశ్కు చెందిన జీవీకే గ్రూపు దక్కించుకుంది. ♦ భారీ నష్టాల్లో ఉన్న టెలినార్ ఇండియాను భారతీ ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. మార్చి ♦ టాటా మోటార్స్ తన తొలి స్పోర్ట్స్ కారు ‘రేస్మో’ను జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది. ♦ అవెన్యూ సూపర్ మార్ట్స్(డీమార్ట్) షేర్లు లిస్టింగ్లో చరిత్ర. ఇష్యూ ధర రూ.299తో పోలిస్తే 102 శాతం లాభంతో రూ.604 వద్ద లిస్టయ్యాయి. ♦ ’టయోటా’ తన లగ్జరీ బ్రాండ్ ’లెక్సస్’ను భారత్లోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ ♦ శాంసంగ్.. గెలాక్సీ ’ఎస్8’, ’ఎస్8 ప్లస్’లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ♦ భారతీయ మహిళా బ్యాంక్సహా ఐదు అనుబంధ బ్యాంకులు మాతృసంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాంఛనంగా విలీనమయ్యాయి. ♦ దేశంలో వాహనాలకు సంబంధించి బీఎస్–4 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మే ♦ టాటా స్టీల్ బ్రిటన్లోని తన స్పెషాలిటీ స్టీల్ వ్యాపారాన్ని లిబర్టీ హౌస్ గ్రూపునకు రూ.850 కోట్లకు అమ్మేసింది. ♦ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ భారత్లో ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించింది. ♦ పేమెంట్స్ బ్యాంకు సేవల లైసెన్స్ పొందిన పేటీఎం కార్యకలాపాలు ప్రారంభం. జూన్ ♦ యాహూ .. రెండు దశాబ్దాల ప్రస్థానానికి తెరపడింది. 4.5 బిలియన్ డాలర్లకు యాహూను వెరిజాన్ కొనుగోలు చేసింది. ♦ డర్టీ డజన్ పై దివాలా చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. ♦ కేజీ బేసిన్లో రిలయన్స్, బ్రిటిష్ పెట్రోలియం ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక. జూలై ♦ అమల్లోకి జీఎస్టీ ♦ ఈ–కామర్స్ కంపెనీ స్నాప్డీల్ను సొంతం చేసుకోవటానికి ఫ్లిప్కార్ట్ కుదుర్చుకున్న ఒప్పందం విఫలమయింది. ♦ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంగళూరు విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ♦ హెచ్పీసీఎల్లో తనకున్న 51.11% వాటాను ఓఎన్జీసీకి విక్రయించడానికి కేంద్రం ఆమోదం. ఆగస్టు ♦ ’భారత్22’ పేరిట కొత్త ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ను ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ♦ ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ విశాల్ సిక్కా అనూహ్యంగా రాజీనామా. చైర్మన్గా నందన్ నీలేకని . – ఎస్సార్ గ్రూపు... ఎస్సార్ ఆయిల్ను రష్యాకు చెందిన రాస్నెఫ్ట్కు విక్రయించింది. డీల్ విలువ రూ.82,500 కోట్లు. సెప్టెంబర్ ♦ రెగ్యులేటరీ నిబంధనలను పాటించని 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు. ♦ హైదరాబాద్కు చెందిన గ్లాండ్ ఫార్మాలో 74% వాటా కొంటున్నట్లు చైనా ఫార్మా దిగ్గజం షాంఘై ఫోసున్ తెలిపింది. డీల్ 1.09 బిలియన్ డాలర్లు. ♦ యాపిల్ కంపెనీ ‘ఐఫోన్–ఎక్స్’ను ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.89,000. అక్టోబర్ ♦ ’హువావే’ ప్రపంచంలోనే తొలిసారిగా నాలుగు కెమెరాలతో కూడిన ’హానర్ 9ఐ’ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.17,999. ♦ ఎస్బీఐ చైర్మన్గా రజనీష్ కుమార్ బాధ్యతలు. ♦ టాటా టెలీసర్వీసెస్... తన మొబైల్ వ్యాపారాన్ని ఫ్రీగా భారతీ ఎయిర్టెల్కు అప్పగించింది. ♦ బ్యాంకింగ్కు రూ.2.11 లక్షల కోట్లు. నవంబర్ ♦ మూడీస్... దేశ సార్వభౌమ రేటింగ్ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచింది. ♦ లాజిస్టిక్స్ రంగానికి కూడా మౌలిక రంగ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ♦ మహిళా సదస్సు– జీఈఎస్కు ఆసియాలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికైంది. దీనికి ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ ♦ పథకాలు, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానించడానికి గడువును కేంద్రం 2018 మార్చి 31 వరకు పొడిగించింది. ♦ ఫెడ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. దీంతో మొత్తం ఈ ఏడాది 0.75% రేటు పెరిగినట్లయ్యింది. æ ఎయిర్సెల్ 6 టెలికం సర్కిళ్లలో కార్యకలాపాలను 2018 జనవరి 30 నుంచి నిలిపేయనుంది. సెన్సెక్స్ ⇒ 34,057 ⇒ 26,626 నిఫ్టీ ⇒ 10,531 ⇒ 8,186 రూపాయి ⇒ 63.80 ⇒ 67.90 ఆర్బీఐ రెపో రేటు ⇒ 6.75% ⇒ 6.50% ⇒ 6.25% ⇒ 6.00% బంగారం 10 గ్రాములు (రూ.లలో)... ⇒ 29,390 ⇒ 28,050 వెండి కేజీ (రూ.లలో) ⇒ 38,425 ⇒ 39,930 బ్రెంట్ క్రూడ్(బేరల్... డాలర్లలో) ⇒ 66.26 ⇒ 56.69 బిట్ కాయిన్ (డాలర్లలో) ⇒ 14,064 ⇒ 1,000 -
పసిడికి ‘అంతర్జాతీయ’ దన్ను
ముంబై మార్కెట్లో రూ.29,000పైకి ముంబై: అమెరికా–ఉత్తర కొరియా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి అంతర్జాతీయంగా పరుగులు పెడుతోంది. ఇదే ప్రభావం దేశీయంగానూ కనబడుతోంది. ముంబై ప్రధాన మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర గురువారం రూ.340 పెరిగి, రూ. 29,070కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో ఎగిసి రూ. 28,920కి చేరింది. వెండి కేజీ ధర భారీగా రూ. 1,120 ఎగసి రూ.38,995కి చేరింది. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్లో పసిడి ధర గురువారం కడపటి సమాచారం అందేసరికి ఏకంగా 10 డాలర్లకు పైగా లాభంతో 1,290 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో చురుగ్గా ట్రేడవుతున్న 10 గ్రాముల పసిడి కాంట్రాక్ట్ ధర కడపటి సమాచారం అందేసరికి రూ.300 లాభంతో రూ. 29,144 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, శుక్రవారం స్పాట్ మార్కెట్లో పసిడి ధర మరింత పెరిగే వీలుంది. -
బంగారం మెరుపు పదిలం!
♦ డాలర్ ఇండెక్స్ 100 డాలర్ల దిగువకు పడిన నేపథ్యం ♦ దేశంలోనూ ఇదే దూకుడు ♦ రెండు వారాల్లో రూ.500 అప్ న్యూయార్క్/ముంబై: అటు అంతర్జాతీయ మార్కెట్లో అందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పసిడి దూకుడు కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ పతనం కొనసాగుతుండడం దీనికి ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే 24వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో డాలర్ ఇండెక్స్ 100 డాలర్ల దిగువకు అంటే 99.59 స్థాయికి చేరింది. వారం వారీగా చూస్తే 101 డాలర్ల నుంచి ఈ స్థాయికి డాలర్ ఇండెక్స్ దిగివచ్చింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్– నైమెక్స్లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా) వారం వారీగా 14 డాలర్లు పెరిగి 1,243 డాలర్లకు చేరింది. ఈ నెల 15న అమెరికా ఫెడ్– ఫండ్ రేటును 0.25 శాతం (0.75 శాతం – 1 శాతం శ్రేణికి) పెంచిన తరువాత, అనూహ్య రీతిలో డాలర్ బలహీనత– బంగారం బలోపేతం జరుగుతున్న విషయం తెలిసిందే. 17వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి దాదాపు 25 డాలర్లు పెరిగింది. డాలర్ బలహీనత కొనసాగితే, పసిడి మరింత ముందుకు కదలడం ఖాయమని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే ఆయన అనుసరించే ‘డాలర్ బలహీనత’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడ్డాయి. కాగా పసిడికి 1,200 డాలర్ల వద్ద మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా... అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 24వ తేదీతో ముగిసిన వారంలో రూ.284 పెరిగి రూ.28,793కి చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.400 పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.255 పెరిగి రూ.28,895కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.28,745కి ఎగసింది. రెండు వారాల్లో ధర దాదాపు రూ.500 పెరిగింది. వెండి కేజీ ధర రూ. 335 పెరిగి రూ.41,660కు పెరిగింది. రెండు వారాల్లో ధర రూ.550కి పైగా ఎగసింది. -
గ్యాస్ సిలిండర్ ధర రూ.86 పెంపు
-
గ్యాస్ సిలిండర్ ధర రూ.86 పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీయేతర వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.86 పెంచాయి. దీంతో ఏడాదిలో 12 సబ్సిడీ సిలిండర్ల కోటా పూర్తిచేసుకున్న వారు, సబ్సిడీని వదులుకున్న వారు ఇకపై ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్కు రూ.737.50 చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను కూడా చమురు కంపెనీలు 13 పైసలు పెంచాయి. దీంతో 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర 434.93కి చేరింది. విమానయాన రంగంలో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరను కిలో లీటర్కు రూ.214 పెంచారు. దీంతో ఇది రూ.54293.38కి చేరింది. మార్చి 1 నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. -
డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్
* పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు * పీపుల్స్ ప్లాజాలో ప్రారంభమైన డ్వాక్రా బజార్ సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలు తమ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ లభిస్తుండటమే ఇందుకు నిదర్శనమని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకం, ప్రదర్శన నిమిత్తం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పీపుల్స్ ప్లాజా (హైదరాబాద్)లో ఏర్పాటు చేసిన తెలంగాణ డ్వాక్రా బజార్ (సరస్-2016)ను మంగళవారం మంత్రి జూపల్లి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు బలంగా ఉన్నాయని, ఆయా సంఘాలు తయారు చేసే వస్తువులు, ఆహార ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందన్నారు. అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆన్లైన్ ద్వారా డ్వాక్రా ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాయన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి కోసం ఉదారంగా రుణాలను అందించాలని బ్యాంకర్లకు మంత్రి జూపల్లి విజ్ఞప్తి చేశారు. సెర్ప్ సీఈవో అనితా రాంచంద్రన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి డ్వాక్రా బజార్ నిర్వహిస్తున్నామని.. అక్టోబర్ 7వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా బజార్ను ప్రారంభించిన మంత్రి జూపల్లి అన్ని స్టాళ్లను పరిశీలించి వసతుల కల్పన గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సెర్ప్ డెరైక్టర్లు రాజేశ్వర్రెడ్డి, వెంకటేశం, శ్రీనివాస్రావు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకుంటున్న డ్వాక్రా బజార్ స్టాల్స్: సెర్ప్ ఏర్పాటుచేసిన డ్వాక్రా బజార్ స్టాళ్లలో తెలంగాణతో పాటు దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన డాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత, పోచంపల్లి చీరలు, కొండపల్లి బొమ్మలు, సోలార్ లైట్లు, గృహ అలంకరణ వస్తువులు, వెదురు బొమ్మలు, ఆటవస్తువులు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. డ్వాక్రా బజార్లో ఏర్పాటు చేసిన 325 స్టాళ్లలో మొత్తం రూ.5 కోట్ల విలువైన వస్తువులను ప్రదర్శన, అమ్మకానికి ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
పసిడిది మెరుపుల బాటే..!
ట్రంప్ గెలిస్తే ఏకంగా 1,850 డాలర్లకు చేరుతుందన్న అంచనాలు పసిడి ఈ ఏడాది పటిష్ట బాటలోనే కొనసాగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న అమెరికా ఎన్నికలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుతం ఉన్న 0.50 శాతం నుంచి పెంచకపోవచ్చని వారు చెబుతున్నారు. దీంతో స్వల్ప ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, పసిడి న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్-నెమైక్స్లో ఔన్స్కు 1,300-1,375 డాలర్ల శ్రేణిలోనే తిరుగుతుందన్నది వారి విశ్లేషణ. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే పసిడి ధర ఏకంగా 1,850 డాలర్లకు పెరిగిపోతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం. అమెరికా ఎన్నికల ఫలితాలు పలు సందర్భాల్లో పసిడి ధరలపై గణనీయమైన ప్రభావం చూపినట్లు అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం ఏబీఎన్ ఆమ్రో ప్రతినిధి జార్జిట్ బోలే పేర్కొన్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ విజయం పొందినా... తరువాతి కాలాల్లో పసిడి ఔన్స్కు 1,650 డాలర్ల దిశగా కదిలే వీలుందని విశ్లేషించారు. గత వారంలో ధరల తీరు... శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్లో ఔన్స్ ధర స్వల్పంగా 4 డాలర్లు ఎగసి, 1,332 డాలర్లకు చేరింది. ఇక దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, రెండు వారాలు బలహీనంగా ఉన్న పసిడి ధర తిరిగి పుంజుకుంది. పండుగల సీజన్ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో శుక్రవారంతో ముగిసిన వారంలో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.330 ఎగసి, రూ.31,325కు చేరింది. (గమనిక: ప్రస్తుతం డాలర్తో రూపాయి విలువ రూ.67కు కాస్త అటూఇటుగా ఉంది. ఒక ఔన్స్కు 31.1గ్రాములు.) -
పసిడి..పరుగో పరుగు
అంతర్జాతీయ మార్కెట్లో దూకుడు ♦ రెండేళ్ల గరిష్టానికి జూమ్, 1,300 డాలర్లపైకి ♦ దేశీయంగానూ అదే ధోరణి... ♦ 4 రోజుల్లో 10గ్రా.లకు రూ. 1,100 అప్ న్యూయార్క్/ముంబై: పసిడి పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న ఆగస్టు డెలివరీ ధర ఔన్స్ (31.1గ్రా)కు కీలకమైన 1,300 డాలర్ల స్థాయిని దాటింది.ఇది రెండేళ్ల గరిష్టస్థాయి. కడపటి సమాచారం అందే సరికి క్రితం కన్నా దాదాపు 17 డాలర్లు అధికంగా 1,305 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.ఈ స్థాయిని దాటితే పసిడి మరింత బలపడుతుందన్నది కొందరు నిపుణుల విశ్లేషణ. ఇక వెండి పరిస్థితి ఇదే ధోరణిగా ఉంది. దాదాపు ఒకశాతం లాభంతో 18 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. ఇదే బాటలో భారత్లోనూ పెరుగుతోంది. సోమవారం నుంచి గడచిన నాలుగు రోజుల్లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో దాదాపు రూ.1,100 పెరిగింది. వెండి కేజీ ధర సైతం రూ.1,200కుపైగా పెరిగింది. బుధవారంతో పోల్చితే గురువారం ధరలు 99.9 స్వచ్ఛత రూ.475 ఎగిసి రూ.30,400కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో ఎగిసి రూ.30,250కి చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.670 ఎగిసి రూ.42,340కి చేరింది. కాగా ఢిల్లీ, చెన్నై మార్కెట్లలో రూ.31,000 పైకి ఇప్పటికే పసిడి చేరడం గమనార్హం. ఫ్యూచర్స్ మార్కెట్లో పరుగు దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గురువారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి పసిడి పరుగులు పెడుతోంది. 10 గ్రాముల ధర 2 శాతం పైగా (రూ.650) లాభంతో రూ.31,092 వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం 2 శాతం లాభంతో (రూ.700) రూ.42,235 వద్ద ట్రేడవుతోంది. కారణాలు ఏమిటి? అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును 0.50 శాతం నుంచి పైకి పెంచకుండా... తటపటాయిస్తుండడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనతలోనే ఉందన్న అంచనాలకు బలం చేకూరాయి. పైగా ఉపాధి కల్పన, డిమాండ్లకు సంబంధించి అమెరికా మే గణాంకాలు ప్రతికూలంగా ఉండడమూ ఆందోళన కలిగించింది. దీనితో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని భద్రమైన మార్గంగా భావించడం మొదలుపెట్టారు. దీనికితోడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే... భవిష్యత్ ఆర్థిక పరిస్థితి ఏమిటన్న అంశంపై సైతం ఆందోళనలు మొదలయ్యాయి. ఆయా అంశాలు అంతర్జాతీయంగా పసిడి దూసుకుపోడానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్కౌంట్లో బంగారం! పుత్తడి రూ. 30,000 దాటినా ప్రపంచ మార్కెట్లో పలుకుతున్న ధరకంటే మన దేశంలో తక్కువకే దొరికేస్తోంది. ఇక్కడ పుత్తడికి వున్న మోజు కారణంగా అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే గతంలో మన నగరాల్లో అధిక ధర వుండేది. అలాంటిది, అనూహ్యంగా భారత్లో డిమాండ్ లేక బులియన్ ట్రేడర్లు ఇప్పుడు 2-3 శాతం చౌకగా అమ్మేస్తున్నారు. పైగా జూన్-జూలై నెలల్లో సాధారణంగా బంగారానికి గిరాకీ తక్కువ. దాంతో ప్రపంచ మార్కెట్తో పోలిస్తే ఇక్కడ ఔన్సు బంగారం (31.1 గ్రాములు) 48 డాలర్ల డిస్కౌంట్లో లభిస్తోంది. అక్కడ రూ. 31,000, ఇక్కడ రూ. 30,000 వివిధ అంతర్జాతీయ అంశాల కారణంగా న్యూయార్క్లో గురువారం పసిడి ధర ఔన్సుకు 1,310 డాలర్లు దాటింది. అంటే పది గ్రాముల ధర 421.2 డాలర్లు. ప్రస్తుత డాలరుతో రూపాయి మారకపు విలువ 67.30 ప్రకారం ఇది రూ. 28,350 అవుతుంది. దీనికి 10 శాతం దిగుమతి సుంకాన్ని కలుపుకుంటే ధర 31,180కి చేరుతుంది. ఇదే ట్రెండ్ను అనుసరించే ఇక్కడి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో రూ.31,000పైన ట్రేడవుతున్నా, ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత గల బంగారం ధర గురువారం రూ. 30,400కే లభించింది. హైదరాబాద్లోనైతే ఇది రూ. 30,000 మాత్రమే. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్కు అనుగుణంగా వివిధ నగరాల్లో రేట్లలో స్వల్ప తేడాలుంటాయి. ఈ ప్రకారం ముంబైతో పోలిస్తే హైదరాబాద్లో సాధారణంగా ధర ఎక్కువ వుంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ నగరంలో ఇంకా ఎక్కువ డిస్కౌంట్కే బులియన్ వర్తకులు బంగారాన్ని ఆఫర్ చేస్తున్నారు. పుత్తడి కొనుగోళ్లకు ఇది సీజన్కాకపోవడం, ధర అధికస్థాయిలో వుండటంతో కొనుగోలు ఆసక్తి సన్నగిల్లడం వ ంటి కారణాలతో డిమాండ్ లేదని వర్తకులు అంటున్నారు. పడిపోతున్న దిగుమతులు... ప్రపంచంలోనే బంగారం వినియోగంలో టాప్లో వున్న భారత్కు గత నాలుగు నెలల నుంచి పుత్తడి దిగుమతులు పడిపోతున్నాయి. మే నెలలో దేశంలోకి దిగుమతుల పరిమాణం రీత్యా 51% క్షీణించి 31 టన్నులకు పడిపోగా, విలువరీత్యా 56 శాతం తగ్గుదలతో 1.47 బిలియన్ డాలర్లకు చేరినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్లోనైతే ఈ దిగుమతులు 22 టన్నులే. 2015 పూర్తి సంవత్సరంలో భారత్ 850 టన్నుల పసిడిని దిగుమతి చేసుకున్నదంటే (నెలకు సగటున 70 టన్నులు), ప్రస్తుత దిగుమతులు ఎంత క్షీణించాయో అర్థం చేసుకోవొచ్చు. -
ప్రతి ఐదుగురిలో ఒకరు హృద్రోగి
* 2020 నాటికి ఈ పరిస్థితి తప్పదు * సీఎస్ఐ ఎన్ఐసీ-2016 సదస్సు హెచ్చరిక * అంతర్జాతీయ మార్కెట్లో 4 దేశీయ స్టెంట్లకు గుర్తింపు సాక్షి, హైదరాబాద్: 2020 నాటికి దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడే ప్రమాదం ఉందని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ)-నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్(ఎన్ఐసీ)-2016 సదస్సు హెచ్చరించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 17-18 శాతం వివిధ రకాల హృద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో భారీ నష్టాలనే చవిచూడాల్సి వస్తోందని పేర్కొంది. శనివారం హెచ్ఐసీసీలో ప్రారంభమైన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ)- నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్(ఎన్ఐసీ)-2016 సదస్సుకు దేశవిదేశాల నుంచి 2,500 మంది హృద్రోగ నిపుణులు హాజరయ్యారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగంలో అందివచ్చిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, యాంజియోప్లాస్టీ ప్రొసీజర్స్ టెక్నిక్స్ వంటి అంశాలపై ఆయా రంగాల నిపుణులు చర్చించారు. గత ఏడాది యాంజియోప్లాస్టీ చేయించుకున్న వారిలో 40 ఏళ్లలోపు వారు 10 శాతం ఉంటే, 70 ఏళ్లలోపు వారు 75 శాతం.. ఆ తర్వాత ఏజ్గ్రూప్ వారు మరో 15 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది. 3.5లక్షల మందికి యాంజియోప్లాస్టీ: ఎన్ఎన్ ఖన్నా, చైర్మన్, ఎన్ఐసీ హృద్రోగ సమస్యలను అంచనా వేసేందుకు నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 2015లో దేశవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టాం. 630 ఆస్పత్రుల నుంచి వివరాలు సేకరించాం. గత ఏడాది 3.5 లక్షల మంది హృద్రోగులకు యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ చేసినట్లు తేలింది. మరో 4.75 లక్షల మంది రోగులు స్టెంట్లు వేయించుకున్నారు. వీరిలో 95 శాతం మంది డ్రగ్ కొటేడ్ స్టెంట్లు వేయించుకున్నట్లు స్పష్టమైంది. దేశీయ స్టెంట్లే ఉత్తమం: జె.శివకుమార్, ఆర్గనైజింగ్ కార్యద ర్శి, ఎన్ఐసీ దేశంలో 9 కంపెనీలు స్టెంట్లను తయారు చేస్తుండగా, వీటిలో ఇప్పటికే 4 కంపెనీల స్టెంట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉన్నట్లు గుర్తింపు లభించింది. ఇక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాలకు స్టెంట్లు ఎగుమతి అవుతున్నాయి. వీటి ద్వారా దేశానికి ఏటా 32 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. చాలామంది ఇప్పటికీ విదేశీ స్టెంట్లపైనే ఆసక్తి చూపుతున్నారు. నిజానికి దేశీయ డ్రగ్ కొటెడ్ స్టెంట్లే ఉత్తమం. జీవనశైలిలో మార్పు వల్లే: ఎస్.గుహ, అధ్యక్షుడు, ఎన్ఐసీ ప్రస్తుతం హృద్రోగ బాధితుల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు 60-70 ఏళ్ల వారిలో వెలుగు చూసే హృద్రోగ సమస్యలు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం పదమూడేళ్లకే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు పట్టణ వాసుల్లోనే ఈ సమస్యలు ఎక్కువగా కన్పించేవి. ఫాస్ట్ఫుడ్, స్మోకింగ్, ఆల ్కహాల్ కల్చర్ నేడు మారుమూల పల్లెలకూ విస్తరించడంతో వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. -
స్వల్పకాలానికి పసిడి పటిష్టం: నిపుణులు
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి, క్రూడ్ ఆయిల్ పతనం, అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగుదలపై భారీగా లేని ఆశలు... దీనితో ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరగదన్న అంచనాలు.. వెరసి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్లో పసిడి ధర రానున్న కొద్ది కాలంలో పటిష్ట ధోరణిలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. లాభాల స్వీకరణ...: అంతర్జాతీయంగా నెమైక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర అంతక్రితం వారంతో పోల్చితే... స్వల్పంగా తగ్గింది. దీనికి ప్రధాన కారణం లాభాల స్వీకరణ అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వరుసగా ఇక్కడ మార్కెట్లో నాలుగు వారాల నుంచి లాభపడుతూ వచ్చింది. వారం వారీగా ఔన్స్ (31.1గ్రా) ధర 9 డాలర్లు తగ్గి, 1,231 వద్ద ముగిసింది. వెండి కూడా స్వల్పంగా తగ్గినా... ఔన్స్కు 15 డాలర్ల ఎగువగానే ట్రేడవుతోంది. అంతర్జాతీయ ధోరణిని ప్రతిబింబిస్తూ... ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర గత శుక్రవారం అంతక్రితం వారం ఇదే రోజుతో పోలిస్తే స్వల్పంగా రూ.170 తగ్గి, రూ.29,095 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,945 వద్దకు చేరింది. అంతక్రితం వారం పసిడి 10 గ్రాములకు భారీగా దాదాపు రూ.1,700 పెరిగిన సంగతి తెలిసిందే. -
ఈక్విటీలు.. రూపాయే పసిడికి మార్గనిర్దేశం..!
వారంలో అంతర్జాతీయంగా తిరోగమనం దేశంలో అతి స్వల్ప లాభం ముంబై/న్యూయార్క్: చైనా మందగమనం... అంతర్జాతీయంగా మార్కెట్ల ప్రభావం అనూహ్యంగా పసిడిని 8వ తేదీతో ముగిసిన వారంలో భారీగా పుంజుకునేట్లు చేసినా... రెండవ వారం ఈ ధోరణి అంతర్జాతీయంగా కొనసాగలేదు. వారం వారీగా స్వల్ప నష్టాలతో ముగిసింది. పసిడి స్వల్పకాలంలో పెరిగినా... తిరిగి నెమ్మదిస్తుందని పలువురు విశ్లేషకులు పేర్కొన్న విధంగానే రెండవవారం ఫలితం వెలువడ్డం గమనార్హం. రానున్న కొద్ది రోజుల్లో కూడా పసిడికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్ల పనితీరు, దీనితోపాటు దేశీయంగా రూపాయి కదలికలు మార్గనిర్దేశం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. చైనాలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చితే మాత్రం పసిడి తిరిగి పుంజుకోవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే పలు వర్గాలు మాత్రం ఈ విలువైన మెటల్ దూకుడు స్వల్పకాలమేనని మాత్రం అంచనావేస్తున్నాయి. అంతర్జాతీయంగా... అంతర్జాతీయంగా న్యూయార్క్ కామెక్స్ ట్రేడింగ్లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర ఔన్స్ (31.1గ్రా)కు గడచిన వారంలో తొమ్మిది వారాల గరిష్ట స్థాయిలో 1,097 డాలర్ల వద్ద ముగియగా... 15వ తేదీతో ముగిసిన తాజా సమీక్షా వారంలో... తిరోగమించింది. 1,091 డాలర్లకు తగ్గింది. వెండి కూడా 13.91 డాలర్ల నుంచి స్వల్పంగా 13.89 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా తీవ్ర ఒడిదుడుకులు... మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురై... చివరకు స్వల్ప లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా మైనస్లో ఉన్నప్పటికీ స్థానిక కొనుగోళ్ల మద్దతు దీనికి ప్రధాన కారణం. 99.5 ప్యూరిటీ ధర 10 గ్రాములకు రూ.15 లాభపడి రూ.25,860 వద్ద ముగిసింది. 99.9 ప్యూరిటీ ధరా ఇంతే స్థాయిలో ఎగసి రూ.26,010 వద్ద ముగిసింది. వెండి కేజీకి రూ.120 నష్టంతో రూ.33,925 వద్ద ముగిసింది. -
తగ్గిన పెట్రో ధరలు
పెట్రోల్పై 32 పైసలు, డీజిల్పై 85 పైసలు న్యూఢిల్లీ: ఇంధన ధరలు స్వల్పంగా దిగాయి. పెట్రోల్పై లీటరుకు 32 పైసలు, డీజిల్పై 85 పైసలు తగ్గాయి. అలాగే నష్టాలు పూడ్చుకోడానికి రూ. 3,700 కోట్ల అదనపు ఆదాయం కోసం ప్రభుత్వం పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని 75 పైసలు, డీజిల్పై రూ. 2 పెంచింది. అయితే ఈ సుంకాలు పెరిగినా వీటి ధరలు తగ్గడం గమనార్హం. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు 12 ఏళ్లలో అత్యంత దిగివకు బ్యారెల్కు 30 డాలర్లకంటే తక్కువకు పడిపోవడంతో వీటి ధరలు ఇంకా తగ్గాల్సి ఉంది. అయితే తగ్గింపుతో వచ్చిన లాభాలను ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పెంచి తన ఖాతాలో వేసుకుంది. పెట్రో ధరల తగ్గింపు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో పెట్రో ధర రూ. 59.35 నుంచి రూ. 59.03కు, డీజిల్ ధర రూ. 45.03 నుంచి 44.18కి తగ్గాయి. సాధారణ పెట్రోల్పై సుంకాన్ని తాజాగా రూ. 7.73 నుంచి రూ. 8.48కి పెంచారు. అన్బ్రాండెడ్ డీజిల్పై సుంకం రూ. 7.83 నుంచి రూ. 9.83కు పెరిగింది. కాగా, ప్రస్తుతం సంవత్సరం(2016) పదివేల ఎల్పీజీ డీలర్షిప్లు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. -
సెన్సెక్స్ 378 పాయింట్లు డౌన్
ఐదో రోజూ నష్టాలే 25,743 వద్ద ముగిసిన సెన్సెక్స్ అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో మంగళవారం కూడా స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. బిహార్ ఎన్నికల్లో మోదీకి ఎదురుదెబ్బ తగలడంతో ఆర్థిక సంస్కరణలకు అడ్డంకులు ఏర్పడుతాయనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొన్నది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 378 పాయింట్లు క్షీణించి 25,743 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 7,783 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ.సెన్సెక్స్లకు ఇవి ఆరు వారాల కనిష్ట స్థాయిలు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 412 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయాయి. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 847 పాయింట్లు నష్టపోయింది. డిసెంబర్లోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనమవుతోందంటూ తాజా సంకేతాలు వెలువడడం, అంతంతమాత్రంగానే ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రభావం చూపాయి. రిఫైనరీ, లోహ, ఫార్మా, రియల్టీ, ఐటీ, టెక్నాలజీ, విద్యుత్తు షేర్లు పతనమయ్యాయి. 2071 సంవత్ సంవత్సరం చివరి రోజు స్టాక్ మార్కెట్కు నష్టాలు తప్పలేదు. 2071 సంవత్ సంవత్సరంలో సెన్సెక్స్ 1,044 పాయింట్లు (3.89 శాతం), నిఫ్టీ 213 పాయింట్లు(2.65 శాతం) చొప్పున క్షీణించాయి. సంవత్ సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటే పదేళ్ల కాలంలో సెన్సెక్స్ ఇంత అధ్వాన పనితీరు కనబరచడం ఇది మూడోసారి. స్పెషల్ మూరత్ ట్రేడింగ్ దీపావళి సందర్భంగా నేడు(బుధవారం) బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో సాధారణ ట్రేడింగ్ వుండదు. అయితే ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ జరగనున్నది. సాయంత్రం 5.45 నుంచి 6.45 వరకూ గంట పాటు ఈ ట్రేడింగ్ జరుగుతుంది. బలిపాడ్యమి కారణంగా గురువారం స్టాక్ మార్కెట్కు సెలవు. -
రెండో రోజూ నష్టాలే..
* కొనసాగుతున్న లోహ షేర్లకు లాభాలు * 254 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ * చివరకు స్వల్ప నష్టాలతో ముగింపు అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో మన స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్పనష్టాల్లో ముగిసింది. చైనా షాంగై స్టాక్ ఎక్స్ఛేంజ్ 3 శాతం వరకూ పతనమవడంతో మన మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయి 27,288 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 8,252 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలకమైన బ్లూ చిప్ కంపెనీలు మంచి ఆర్థిక ఫలితాలు వెల్లడించడంతో నష్టాలు పరిమితమయ్యాయి. డాలర్తో రూపాయి మారకం క్షీణించడం కూడా ప్రభావం చూపింది. బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా షేర్లు నష్టపోగా, లోహ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. హీరో మోటొకార్ప్ కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో కొనుగోళ్లు జోరందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 27,445 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 27,191 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్ మొత్తం మీద 254 పాయింట్ల రేంజ్లో కదలాడింది. గత వారం వెల్లడైన లార్జ్ క్యాప్ షేర్ల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయని వెరాసిటి గ్రూప్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ చెప్పారు. దీంతో సెంటిమెంట్ దెబ్బతిన్నదని పేర్కొన్నారు. నేడు మార్కెట్లకు సెలవు దసరా పండుగ సందర్భంగా నేడు (గురువారం) స్టాక్ మార్కెట్కు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఫారెక్స్, మనీ, బులియన్, ఇతర కమోడిటీ మార్కెట్లు పనిచేయవు. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల స్పందనలతో స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 26వేల 220 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్ఫలాభంతో 7950 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీల్లో హెల్త్ కేర్ 1.37శాతం , కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.04శాతం , క్యాపిటల్ గూడ్స్ 0.71శాతం లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గేయినర్స్ లిస్ట్లో ఆల్ట్రాటెక్ 3.84 శాతం , ల్యూపిన్ 3.20 శాతం, జీల్ 2.32 శాతం లాభపడగా, నిఫ్టీ టాఫ్ లూజర్స్ లిస్ట్లో హెచ్సిఎల్ టెక్ 12.54 శాతం , బిహెచ్ఇఎల్ 3.28 శాతం , గేయిల్ 2.91 శాతం ,మారుతీ 2.28 శాతం నష్టపోయాయి. -
చివర్లో కొనుగోళ్లు
చైనా గణాంకాలతో మొదట్లో భారీ నష్టాలు.. చివర్లో రికవరి - 97 పాయింట్ల నష్టంతో 25,622కు సెన్సెక్స్.. - 30 పాయింట్ల నష్టంతో 7,788కు నిఫ్టీ చైనా గణాంకాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు క్షీణంచడంతో గురువారం మన స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. రోజంతా నష్టాల్లోనే సాగిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చివర్లో జరిగిన కొనుగోళ్ల కారణంగా భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్పనష్టాలకు పరిమితమైంది. బ్లూ చిప్ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 25,622 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 7.788 పాయింట్ల వద్ద ముగిశాయి. నష్టాల తీరు: ఇంట్రాడేలో సెన్సెక్స్ 432 పాయింట్లు నష్టపోయింది. క్యాపిటల్ గూడ్స్, వాహన, కొన్ని బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల జోరు కారణంగా సెన్సెక్స్ భారీ నష్టాలకు తెరపడింది. లాభాల స్వీకరణ కూడా చోటు చేసుకుంది. చైనా వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, ఉత్పత్తిదారుల ధరలు వరుసగా 42వ నెలలోనూ తగ్గాయి. ఇది డిఫ్లేషన్కు సూచిక అనే నిపుణులంటున్నారు. ఇక స్టాండర్డ్ అండ్ పూర్స్ సంస్థ బ్రెజిల్ క్రెడిట్ రేటింగ్ను జంక్కు, ఆసియా దేశాల వృద్ధి అంచనాలను తగ్గించడం వంటి కారణాల వల్ల ఆసియా మార్కెట్లు క్షీణించాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 21 షేర్లు నష్టాల్లో ముగిశాయి. సియట్ షేర్... 3 నెలల్లో 100 శాతం వృద్ధి టైర్ల కంపెనీ సియట్ షేర్ ధర మూడు నెలల్లో దాదాపు వంద శాతానికి పైగా లాభపడింది. ఎన్ఎస్ఈలో ఈ షేర్ ఇంట్రాడేలో రికార్డ్ స్థాయిని(రూ.1,254) తాకి చివరకు 7 శాతం వృద్ధితో రూ.1,220 వద్ద ముగిసింది. ఈ ఏడాది జూన్ 9న రూ.614గా ఉన్న ఈ కంపెనీ షేర్ మూడు నెలల్లో దాదాపు వంద శాతం పెరగడం విశేషం. క్యూ1లో కంపెనీ నికర లాభం దాదాపు రెట్టింపు కావడంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. -
వారంలో భారీగా పెరిగిన పుత్తడి
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో పటిష్టమైన ట్రెండ్తో పాటు డాలరుతో రూపాయి మారకపు విలువ క్షీణించడంతో గతవారం దేశీయంగా బంగారం ధర భారీగా పెరిగింది. గతవారం ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పుత్తడి ధర అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 1,345 లాభపడి రూ. 27,225 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల బంగారం ధర అంతే లాభంతో రూ.27,075 వద్ద ముగిసింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 47 డాలర్ల వరకూ పెరిగి 1,159 డాలర్ల వద్ద క్లోజయ్యింది. చైనా కరెన్సీ యువాన్ విలువను తగ్గించడంతో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయని, దాంతో సురక్షిత సాధనంగా పుత్తడివైపు ఇన్వెస్టర్లు మళ్లుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్లో వడ్డీరేట్లు పెంచకపోవొచ్చన్న అంచనాలూ పసిడి ర్యాలీకి కారణమంటున్నారు. -
దూసుకుపోయిన పసిడి, వెండి
-
దూసుకుపోయిన పసిడి, వెండి
ముంబై : ముంబై బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల ధర గురువారం ధరతో పోల్చితే రూ.495 పెరిగి రూ.26,995కు చేరింది. 22 క్యారెట్ల ధర కూడా అంతే స్థాయిలో ఎగసి రూ.26,845కు ఎగసింది. జూన్ 19 తరువాత రేట్లు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ వెండి విషయానికి వస్తే- రూ.240 పెరిగి రూ.37,035కు చేరింది. ఈ రేటు కూడా రెండు నెలల గరిష్ట స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల ధోరణి, దేశంలో స్టాకిస్టుల డిమాండ్ పెరగడం వంటి కారణాలు పసిడి పరుగుకు కారణం. తాజా సమాచారం అందే సరికి నెమైక్స్ కమోడిటీ మార్కెట్లో పసిడి ధర (ఔన్స్ 31గ్రా)లాభాల్లో 1,160 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం కూడా భారీ లాభాలతో కడపటి సమాచారం అందే సరికి రూ.27,290 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా రూ.100కుపైగా లాభంతో రూ.36,201 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి దిగుమతులపై టారిఫ్ విలువ పెంపు
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులపై టారిఫ్ విలువ పెరిగింది. దీని ప్రకారం- ఈ రేటు 10 గ్రాములకు 354 డాలర్ల నుంచి 363 డాలర్లకు పెరిగింది. ఇక వెండి కేజీపై రేటు కూడా 498 డాలర్ల నుంచి స్వల్పంగా 499 డాలర్లకు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల మార్పులకు అనుగుణంగా సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ (సీబీఈసీ) పసిడి, వెండి టారిఫ్ విలువను నిర్ణయిస్తుంది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువనే ప్రాతిపదికగా తీసుకుంటారు. అయితే ఈ విలువలో 5 శాతం మేర మార్పు ఉంటే... అది దేశీయ స్పాట్ బులియన్ మార్కెట్పై ప్రభావం చూపుతుంది. -
పసిడి మళ్లీ జోరు పుంజుకుంది
ముంబై : పసిడి మళ్లీ జోరు పుంజుకుంది. తక్షణ అంతర్జాతీయ, జాతీయ పరిణామాలు దీనికి కారణంగా ఉన్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో రెండు రోజుల్లో పసిడి ధర 10 గ్రాములకు రూ.750 పెరిగింది. బుధవారం ఇక్కడి బులియన్ స్పాట్ మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.350 పెరిగి రూ.25,750కి చేరింది. 22 క్యారెట్ల ధర సైతం అంతే ఎగసి రూ.25,600కు చేరింది. ఢిల్లీలో ధరలు తిరిగి రూ.26,000పైబడ్డాయి. దేశంలోని పలు బులియన్ స్పాట్ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కాగా వెండి కూడా పసిడి బాటలోనే ముంబై స్పాట్ మార్కెట్లో రూ.500 ఎగసి రూ.36,240కి చేరింది. అంతర్జాతీయంగా : కడపటి సమాచారం అందే సరికి న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఔన్స్ (31.1 గ్రా) పసిడి ధర 14 డాలర్ల లాభంతో 1,122 డాలర్లు పలుకుతోంది. వెండి కూడా 15 డాలర్ల పైన ట్రేడవుతోంది. దీనికి అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో10 గ్రా. ధర రూ.550 లాభంతో రూ.25,965 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా రూ.800 లాభంతో రూ.36,091 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగి, రూపాయి బలహీనత కూడా తోడయితే గురువారం స్పాట్ బులియన్ మార్కెట్లో పసిడి భారీగా లాభపడే అవకాశం ఉంది. చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గింపు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ధోరణి, భారత్ మార్కెట్కూ నష్టాలు, రూపాయి బలహీనత వంటి అంశాలు పసిడి జోరుకు కారణమవుతున్నాయి. -
తీవ్ర హెచ్చుతగ్గులు!
ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం ఈ వారం మార్కెట్పై నిపుణుల అంచనా న్యూఢిల్లీ : జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు హెచ్చరించారు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ జూలై కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా మార్కెట్లో ఒడిదుడుకులుంటాయని, ఈక్విటీలు పటిష్టపడేందుకు అవసరమైన మద్దతును ఇచ్చే అంశమేదీ లేదని క్యాపిటల్వయా డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో సంస్కరణల బిల్లులు ఆమోదం పొందుతాయని లేదా క్యూ1 కార్పొరేట్ ఫలితాలు ఉత్సాహపరుస్తాయన్న ఆశలు ఇన్వెస్టర్లలో వున్నాయని, కానీ ఇప్పుడు మార్కెట్లో విశ్వాసం కొరవడిందని జీయోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. కొద్దికాలం దిద్దుబాటు... సంస్కరణలకు ప్రతీ స్థాయిలోనూ అడ్డంకులు ఏర్పడుతున్నందున, ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాల పట్ల ఇన్వెస్టర్లకు సందేహాలు తలెత్తుతున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ఈ కారణంగా కొద్దికాలం మార్కెట్ దిద్దుబాటు బాటలో వుండవచ్చని, విస్తృత శ్రేణిలో సూచీలు కదలవచ్చని అంచనావేశారు. వర్షపాతం మెరుగ్గాఉంటుందన్న ఆశాభావం ఇన్వెస్టర్లలో ఉందని, వర్షాలు బావుంటే ఆగస్టు 4నాటి ఆర్బీఐ పాలసీ సమీక్షలో రేట్ల కోత వుండవచ్చని ఆయన చెప్పారు. ఈ వారం కార్పొరేట్ ఫలితాలు... ఈ వారం ఐటీసీ, మారుతి సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, పీఎన్బీ, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ తదితర బ్లూచిప్ కంపెనీలు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ గమనాన్ని కొంతవరకూ నిర్దేశింప వచ్చని నిపుణులు చెప్పారు. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల ప్రభావం సోమవారం మార్కెట్ ప్రారంభంలో కన్పిస్తుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ తెలిపారు. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ మార్జిన్లు పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ నికరలాభం రూ. 6,318 కోట్లకు ఎగిసింది. గతవారం మార్కెట్... గతవారం అంతర్జాతీయ మార్కెట్లలో ట్రెండ్కు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 351 పాయింట్లు నష్టపోయి, 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితాల వెల్లడి తర్వాత ఇన్ఫోసిస్ భారీగా పెరగడంతో సెన్సెక్స్ నష్టాలు పరిమితంగా వున్నాయి. బ్యాంకులు, మెటల్, రియల్టీ షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 8,400 కోట్లు జూలై నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 8,400 కోట్లు పెట్టుబడి చేశారు. ఈక్విటీల్లో రూ. 7,261 కోట్లు, రుణపత్రాల్లో రూ. 1,154 కోట్ల చొప్పున వారు నికర పెట్టుబడి చేసినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. -
మరింత తగ్గిన బంగారం
♦ ముంబైలో నాలుగేళ్ల కనిష్టం ♦ రూ.25,000 దిగువకు 10 గ్రా. పసిడి ముంబై/న్యూయార్క్ : అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశంలో బంగారం ధర తగ్గుతోంది. ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.300 తగ్గి, రూ. 24,970కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ. 24,820కి పడింది. ధరలు ఇక్కడ ఈ స్థాయికి తగ్గడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. వరుసగా మూడు రోజుల నుంచీ బంగారం ధర కిందకు జారుతోంది. అంతర్జాతీయంగా 10 రోజుల నుంచి డౌన్ అంతర్జాతీయంగా చూస్తే... పసిడి ధర వరుసగా 10 రోజల నుంచి పతనం అవుతోంది. 1996 తరువాత వరుసగా 10 రోజులు బంగారం ధర ప్రపంచ మార్కెట్లో పడడం ఇదే తొలిసారి. బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ సంస్థ- గోల్డ్మన్ శాక్స్ అంచనావేస్తోంది. ఇన్వెస్టర్లు ఫండ్స్ ద్వారా మరింత బంగారం అమ్మకాలకు పాల్పడే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగా నెమైక్స్ కమోడిటీ డివిజన్లో పసిడి ధర ప్రస్తుతం ఔన్స్ (31.1 గ్రా)కు 1,100 డాలర్ల దిగువనే కొనసాగుతోంది. మరో 100 డాలర్లు తగ్గి, 1,000 డాలర్లకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు విశ్లేషకుల అంచనా. 2009 తరువాత పసిడి ఈ స్థాయికి జారలేదు. వెండి విషయానికి వస్తే..: అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్ ధర 15 డాలర్ల లోపే ట్రేడవుతోంది. ముంబై మార్కెట్లో కేజీ ధర రూ.35,000కు కొంచెం అటుఇటుగా ఉంటోంది. కారణాలు ఏమిటి..: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచవచ్చన్న ఊహాగానాలు అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ట్రేడర్లు భారీ అమ్మకాలకు తెగబడుతుండడం బంగారం నేల చూపుకు కారణమని కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా అంతర్జాతీయం గా, ఇటు దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో బుధవారం కడపటి సమాచారం అందేసరికి పసిడి భారీ నష్టాలో ్లనే ట్రేడవుతోంది. ఇదే పరిస్థితి ట్రేడింగ్ చివరికంటా కొనసాగితే... గురువారం దేశీయ స్పాట్ మార్కెట్లో కూడా పసిడి ధర మరింత పడే అవకాశం ఉంది. -
సంస్కరణల ఆశలతో...
ముంబై : ఇటీవల పతనంతో బాగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. దీనికి సంస్కరణలపై ఆశలు కూడా జతకావడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.2 శాతం, హెచ్డీఎఫ్సీ 2.7 శాతం పెరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 323 పాయింట్లు లాభపడి 28,505 పాయింట్ల వద్ద, నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 8,634 పాయింట్ల వద్ద ముగిశాయి. దాదాపు మూడు నెలల కాలంలో ఇదే అత్యధిక ముగింపు. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా మన మార్కెట్ మాత్రం దూసుకుపోయింది. బ్యాంక్, ఆర్థిక సేవలు, వాహన, ఆయిల్,గ్యాస్ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్ లాభపడింది. సెన్సెక్స్ లాభంలో దాదాపు సగం రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ షేర్లు పెరగడం వల్లే వచ్చాయి. ఆర్ఐఎల్ జోరు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను శుక్రవారం వెల్లడించనున్నది. ఈ ఫలితాలు అంచనాలను మించుతాయనే అంచనాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఏడాది గరిష్ట స్థాయి(రూ.1,054)ని తాకింది. చివరకు 4.2 శాతం లాభంతో రూ.1,050 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే. 30కి 22 షేర్లు లాభాల్లోనే.. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. 1,770 షేర్లు లాభాల్లో, 1,055 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,926 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,963 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.3,09.332 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.450 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.352 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. అరబిందో ఫార్మా 1:1 నిష్పత్తి బోనస్ షేర్ల కింద వాటాదారులకు 29.19 కోట్ల షేర్లను జారీ చేసింది. దీంతో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 58.39 కోట్లకు చేరింది. -
గ్రానైట్ తరలిపోతోంది!
జిల్లాలోని నీలి గ్రానైట్కు ప్రత్యేక స్థానం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి ధర పలుకుతోంది. కొంతమంది వ్యాపారులు దీన్నే అవకాశంగా మలుచుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా విలువైన గ్రానైట్ బ్లాకులను అర్ధరాత్రి వేళ ఎవరి కళ్లు పడకుండా దర్జాగా పక్క రాష్ట్రాలకు, పాలిషింగ్ యూనిట్లకు తరలించేస్తున్నారు. దీన్ని నివారించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రానైట్ వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై ఈ తంతును నడిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలి పరిసరాల్లో సుమారు 40 వరకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటిలో కొన్ని క్వారీల నుంచి అధికారుల ఆన్లైన్ పర్మిట్లతో బ్లాకులు తరలిస్తుండగా, మరికొన్ని క్వారీల్లో మాత్రం అర్ధరాత్రి సమయం ఎటువంటి అనుమతులు లేకుండా జాతీయ రహదారుల గుండా భారీ వాహనాలపై యథేచ్ఛగా బ్లాకులను తరలించే పనిలో ఉంటున్నారు. టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం సమీపంలో సుమారు 65 వరకు గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. కొన్ని బ్లాకులను ఆయా యూనిట్లకు తరలించి మరి కొన్ని బ్లాకులను టెక్కలికి సమీపంలోని ఒడిశాతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు రాత్రి సమయాల్లో తరలిస్తున్నారు. టెక్కలి పరిసర ప్రాంతాల్లోని గ్రానైట్ వ్యాపారులు బ్లాకుల పర్మిట్ల కోసం మైన్స్ కార్యాలయానికి ప్రతిరోజూ సుమారు ఐదు నుంచి 35 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బ్లూ, బ్రౌన్ గ్రానైట్లకు సంబంధించి గ్యాంగ్స్, సూపర్ గ్యాంగ్స్, కట్టర్ విభాగాలుగా ఒక్కో దరఖాస్తుకు సుమారు 2,475 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ప్రక్రియతో గత నెల సుమారు ఒక కోటీ 19 లక్షల 92 వేల 623 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులే చెబుతున్నారు. అయితే ఇదంతా కొంత మేరకు మాత్రమే జరుగుతున్న ప్రక్రియ. రాత్రి సమయాల్లో తరలిపోతున్న గ్రానైట్ వల్ల నెలకు సుమారు 50 లక్షల వరకూ ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా అర్ధరాత్రి సమయలో దాడులు లేకపోవడంతో ఎక్కడా కేసులు నమోదు చేసిన పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారాలపై అధికారులకు కొంతమంది ఫిర్యాదులు అందజేసినా వారు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. క్వారీల్లో కూడా గనులు, భూగర్భ శాఖ అధికారులతో పాటు విజిలెన్స్ తనిఖీలు సైతం లేకపోవడంతో అక్రమ వ్యాపారాలకు మరింత పెట్రేగిపోతున్నారు. ఏటా కోట్లాది రూపాయలు వ్యాపారాలు కొనసాగుతున్న గ్రానైట్ పరిశ్రమలో అక్రమ వ్యాపారాలు జోరందుకుంటున్నాయి. నీలి గ్రానైట్ చరిత్ర ఇది అంతర్జాతీయ స్థాయి గ్రానైట్ వ్యాపారంలో టెక్కలి నీలి గ్రానైట్దిప్రత్యేక స్థానం. టెక్కలితో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని 40 క్వారీల నుంచి ఏటా సుమారు 50 కోట్ల రూపాయల విలువైన నీలి గ్రానైట్ ప్రపంచ వ్యాప్తంగా సరఫరా జరుగుతోందని అధికారుల అంచనా. ఇక్కడ నీలి గ్రానైట్కు మన దేశంతో పాటు విదేశాల్లో గిరాకీ ఉంది. ఏటా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రానైట్ వస్తు ప్రదర్శనలో ఇక్కడి నీలిగ్రానైట్ ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం లభిస్తోంది. 1992 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన గ్రానైట్ వ్యాపారస్తులు ఈ ప్రాంతంలో క్వారీలను ప్రారంభించారు. ఇక్కడ నుంచి నీలి గ్రానైట్ ముందుగా బెంగళూరు, మద్రాసు, తమిళనాడు, కర్ణాటక, సేలం తదితర ప్రాంతాలకు తరలివెళ్తుంది. అక్కడ నుంచి ఇటలీ, జర్మనీ, పోలెండ్, స్విట్జర్లాండ్, చైనా, తైవాన్, సింగపూర్ తదితర ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక్కడ అధికంగా గ్రానైట్ క్వారీలు ఉండడంతో దానికి అనుసంధానంగా గ్రానైట్ పాలిసింగ్ యూనిట్లు వెలుస్తున్నాయి. 40 గ్రానైట్ క్వారీలకు గాను సుమారు 65 వరకు పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. -
సెన్సెక్స్కు 114 పాయింట్లు నష్టం
♦ వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ♦ 34 పాయింట్లు నష్టపోయి 8,329కు నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్లు రికవరీ బాట పట్టినప్పటికీ మన స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లోనే ముగిసింది. వరుసగా మూడో రోజు కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 27,574 పాయింట్ల వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 8,329 పాయింట్ల వద్ద ముగిశాయి. వాహన, ఆయిల్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోగా, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా షేర్ల నుంచి మార్కెట్కు మద్దతు లభించింది. క్యాపిటల్ గూడ్స్ షేర్ల జోరు... మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(శుక్రవారం) వెలువడనున్న నేపథ్యంలో భెల్, ఎల్ అండ్ టీ తదితర క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, హీరోమోటొకార్ప్, భారతీ ఎయిర్టెల్, లుపిన్ షేర్లు లాభాల బాట పట్టాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో టీసీఎస్ షేర్తో పాటు ఇతర ఐటీ షేర్లు-ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కూడా తగ్గాయి. వేదాంత టాటా మోటార్స్ , బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, ఎన్టీపీసీలు 1-5 శాతం రేంజ్లో తగ్గాయి. చైనా షాంఘై ఎక్స్ఛేంజ్ రికవరీ ఆసియా మార్కెట్లను బుధవారం వణికించిన చైనా షాంగై ఇండెక్స్ గురువారం శాంతించింది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలతో ఈ సూచీ 5.6% లాభపడింది. ఈ సూచీ ఒక్క రోజు ఇంత పెరగడం ఆరేళ్లలో ఇదే మొదటిసారి. మూడు వారాల్లో ఇన్వెస్టర్లు 3.2 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయిన ఉదంతంపై దర్యాప్తు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించడం ప్రభావం చూపింది. -
చివర్లో అమ్మకాలు...
గ్రీస్ అనిశ్చితి... ఇన్వెస్టర్ల జాగ్రత్త ♦ 75 పాయింట్ల నష్టంతో 27,946కు సెన్సెక్స్ ♦ 8 పాయింట్ల నష్టంతో 8,445కు నిఫ్టీ ఆద్యంతం ఊగిసలాటకు గురైన గురువారం నాటి స్టాక్ మార్కెట్ చివరకు నష్టాల్లో ముగిసింది. ట్రేడింగ్ చివర్లో లోహ, ఐటీ షేర్లలో అమ్మకాల వెల్లువ కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 75 పాయింట్లు నష్టపోయి 27,946 పాయింట్లకు, నిఫ్టీ 8 పాయింట్లు పడిపోయి 8,445 పాయింట్లకు పడిపోయాయి. గ్రీస్ అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ, లోహ షేర్లు నష్టపోగా, టెలికాం, ఎఫ్ఎంసీజీ, కొన్ని వాహన షేర్లు లాభపడ్డాయి. గ్రీస్ ఉదంతం సుఖాంతంగానే ముగుస్తుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ ఇంట్రాడేలో 28,116 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ట్రేడింగ్ చివరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ‘సాగు’ షేర్లు రయ్....సాగునీరుకు సంబంధించి ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన పథకం కింద ఐదేళ్లలో రూ.50,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ సంబంధిత కంపెనీల షేర్లు పెరిగాయి. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, శక్తి పంప్స్, కావేరి సీడ్స్, మోన్శాంటో ఇండియా, ధనుక ఆగ్రిటెక్, అద్వాంతలు 8 శాతం వరకూ పెరిగాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,711 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,286 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,47,620 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.575 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.219 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. నిఫ్టీ టార్గెట్ను తగ్గించిన ఆర్బీఎస్ ది రాయల్ బ్యాంక్ స్కాట్లాండ్(ఆర్బీఎస్) నిఫ్టీ ఈ ఏడాది చివరకు చేరే టార్గెట్ను 10,000 పాయింట్ల నుంచి 9,200 పాయింట్లకు తగ్గించింది. బీహార్లో ఎన్నికల జరగనున్నందున సంస్కరణలు ఆలశ్యమవుతాయని, కీలకమైన బిల్లులు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందుతాయని, కంపెనీల ఫలితాలు బలహీనంగా ఉంటాయని.. అందుకే నిఫ్టీ టార్గెట్ను తగ్గంచామని తెలిపింది. బీఈఎంఎల్ జోరు... ఈ ఏడాది భారత్ ఎర్త్మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) షేర్ జోరుగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.793గా ఉన్న ఈ షేర్ గురువారం రూ.1,301 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి(రూ.1,320)కి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్ 2 శాతం పెరగ్గా ఈ షేర్ 68 శాతం ఎగసింది. ఈ షేర్ను రూ.1,414 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ సిఫార్స్ చేస్తోంది. పట్టణ మౌలికవసతుల కల్పనకు, రక్షణ రంగానికి అధికంగా బడ్జెట్ కేటాయింపులు జరపడం, మైనింగ్ రంగంలో సంస్కరణలు, డిమాండ్ పుంజుకోనుండడం, కంపెనీకి దాదాపు గుత్తాధిపత్యం ఉండడం, వ్యయ నియంత్రణ పద్ధతులు అనుసరిస్తుండడం... సానుకూలాంశాలని పేర్కొంది. -
స్టాక్ మార్కెట్కు ఫెడ్ జోష్
♦ వడ్డీరేట్లను పెంచని అమెరికా ఫెడ్ ♦ విదేశీ నిధుల తరులుతాయన్న ఆందోళన తగ్గుముఖం ♦ కలసి వచ్చిన రూపాయి బలం ♦ 27,000 దాటిన సెన్సెక్స్... 8000 దాటిన నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలపాలైనా, వడ్డీరేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఫెడ్ నిర్ణయం గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ను లాభాట బాట పట్టించింది. సాధారణం కన్నా అధికంగానే వర్షాలు కురుస్తుండడం, రూపాయి బలపడడం కూడా కలసి రావడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 27,000 పాయింట్లను, నిఫ్టీ 8,100 పాయింట్లను దాటాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరబుల్స్, ఆరోగ్య సంరక్షణ, వాహన, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లు కళకళలాడాయి. సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 27,116 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 8,175 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ మార్కెట్ సూచీలకు ఇది రెండు వారాల గరిష్ట స్థాయి. లోహ, రియల్టీ సూచీలు మినహా, మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. గత అయిదు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 745 పాయింట్లు లాభపడింది. మద్దతు ధర ప్రభావం... వడ్డీరేట్లు దశలవారీగా పెంచాలని యోచిస్తున్నట్లు ఫెడ్ ప్రకటించడంతో భారత మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెళ్లిపోతాయనే ఆందోళనకు తెరపడినట్లేనని నిపుణులంటున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం కూడా ప్రభావం చూపింది. రిలయన్స్.. వారంలో 11 శాతం అప్ ఈ ఏడాది చివరికల్లా 4జీ సర్వీసులందిస్తామని వెల్లడించిన నేపథ్యంలో రిలయన్స్ షేర్ వారంలో 11 శాతం పెరిగింది. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభపడ్డాయి. ఓఎన్జీసీ 2 శాతం, మారుతీ సుజుకీ 1 శాతం, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, హిందాల్కో భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, షేర్లు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ. 2,999 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,262 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,77,226 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.785 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,110 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. సెన్సెక్స్ టార్గెట్లో కోత 33,000 నుంచి 31,000కు తగ్గించిన డాయిష్ ఈ ఏడాది చివరకు సెన్సెక్స్ చేరే టార్గెట్ను జర్మనీకి చెందిన బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ 33,000 పాయింట్ల నుంచి 31,000 పాయింట్లకు తగ్గించింది. వచ్చే రెండు క్వార్టర్లలోనూ కంపెనీల పనితీరు అంతంత మాత్రంగానే ఉంటుందని, విదేశీ నిధుల ప్రవాహం మందకొడిగా ఉంటుందని ఈ బ్యాంక్ అంచనా వేస్తోంది. కాగా ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు సెన్సెక్స్ చేరే అంచనాలను తగ్గించాయి. సిటీ సంస్థ 33,000 నుంచి 32,200కు, హెచ్ఎస్బీసీ 30,100 నుంచి 26,900కు తగ్గించగా, మోర్గాన్ స్టాన్లీ మాత్రం తన అంచనాల్లో(32,500 పాయింట్లు) ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. ఇక యూబీఎస్ సంస్థ నిఫ్టీ టార్గెట్ను 9,200 నుంచి 8,600కు తగ్గించింది. కాగా గురువారం సెన్సెక్స్ 27,116పాయింట్ల వద్ద, నిఫ్టీ 8,175 పాయింట్ల వద్ద ముగిశాయి. -
లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాలు
42 పాయింట్ల నష్టంతో 27,646కు సెన్సెక్స్ ⇒ 300 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ ⇒ 8 పాయింట్ల నష్టంతో 8,366కు నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ, లాభాల స్వీకరణ కారణంగా భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. రెండు రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆయిల్, గ్యాస్, వాహన, ప్రభుత్వ రంగ కంపెనీలు, బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 42పాయింట్లు పతనమై 27,646 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8 పాయింటు నష్టపోయి 8,366 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్రమైన ఊగిసలాటకు గురైంది. మరింత కన్సాలిడేషన్! ప్రధానమైన సానుకూలమైన సంఘటనలేమీ లేకపోవడంతో గత రెండు ట్రేడింగ్ సెషన్ల లాభాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని నిపుణులంటున్నారు. అయితే ఎంపిక చేసిన సెన్సెక్స్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్కు స్వల్పనష్టాలే వచ్చాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతుండడం మరింత కన్సాలిడేషన్కు సూచిక అని జియోజిత్ బీఎన్పీ పారిబస్ హెడ్(టెక్నికల్ రీసెర్చ్) ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. 17 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు నష్టాల్లో, 12 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ షేర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.హెచ్డీఎఫ్సీ 2% క్షీణించింది. ఇదే బాటలో టాటా మోటార్స్ 1.95 శాతం, ఓఎన్జీసీ 1.6%, బజాజ్ ఆటో 1%, హిందూస్తాన్ యూనిలివర్ 0.8% చొప్పున పడిపోయాయి. ఇక పెరిగిన షేర్ల విషయానికొస్తే హీరో మోటొకార్ప్ 2 శాతం, విప్రో 1.6 శాతం, వేదాంత 1.4% చొప్పున పెరిగాయి. 1,453 షేర్లు లాభాల్లో, 1,289 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో 3,444 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,809 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ. 2,79,809 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్ఠర్లు రూ.48 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.451 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. -
నిరోధ శ్రేణి 20,700-20,900
అంతర్జాతీయ మార్కెట్లకు స్థిరత్వం రావడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా ఇటీవల కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్నాయి. రూపాయి కూడా ఇతర వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే స్థిరంగా ఉంది. అయితే ఇప్పటి మార్కెట్ల రికవరిలో సూచీల్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న (35 శాతం) ఎఫ్ఎంసీజీ షేర్లు-ఐటీసీ, హిందుస్తాన్ యూని లివర్ లు, ముకేష్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలు బలహీనంగా కనిష్ట స్థాయి వద్దే ట్రేడవుతున్నాయి. అందుకే మార్కెట్లకు మరింత పతనమయ్యే ముప్పు పొంచి ఉన్నదని భావించాలి. కేవలం ఐటీ, కొద్దిపాటి బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతోనే సూచీలు గరిష్ట స్థాయిల్లో స్థిరపడడం కష్ట సాధ్యం. ఇక సాంకేతికాంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు ఫిబ్రవరి 21తో ముగిసిన వారంలో ఒక్క గురువారం మినహాయిస్తే, సెన్సెక్స్ క్రమేపీ కోలుకోగలిగింది. చివరకు 334 పాయింట్ల లాభంతో 4 వారాల గరిష్ట స్థాయి 20,701 పాయిట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ కీలకమైన 20,700-20,900 నిరోధ శ్రేణి వద్ద నిలిచింది. గత జనవరి చివరి వారంలో ఈ శ్రేణి వద్ద తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఏర్పడినందున రానున్న రోజుల్లో సెన్సెక్స్ అప్ట్రెండ్లోకి మళ్లాలంటే ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించాల్సి ఉంటుంది. అది జరిగితే కొద్ది వారాల్లో మళ్లీ 21,400-21,500 ఆల్టైమ్ గరిష్ట స్థాయిని సాధించే చాన్స్ ఉంటుంది. పైన ప్రస్తావించిన నిరోధం ఈ వారం దాటలేకపోతే 20,580 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 20,280 పాయింట్ల స్థాయికి పడిపోవచ్చు. ఆ లోపల క్రమేపీ 200 రోజుల చలన సగటు రేఖ సంచరించే 20,000 పాయింట్ల సమీప స్థాయికి పతనం కావచ్చు. నిఫ్టీ నిరోధం 6,180 మద్దతు 6,100 ఫిబ్రవరి 21తో ముగిసిన వారంలో 107 పాయింట్ల ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,155 పాయింట్ల వద్ద ముగిసింది. ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ మరో మూడు రోజుల్లో ముగియనున్నది. ఫ్యూచర్, ఆప్షన్ల కాంట్రాక్టుల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు జరిపే షార్ట్ కవరింగ్, షార్టింగ్, మార్చి నెలకు రోల్ ఓవర్స్ తదితర కార్యకలాపాల ఆధారంగా నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. అత్యధికమైన పుట్బిల్డప్ కలిగిన 6,000 పాయింట్ల స్థాయిని ఈ నెలలో ఇప్పటివరకూ పరిరక్షించుకుంటూ వచ్చిన ఇన్వెస్టర్లు ఇప్పుడా మద్దతు స్థాయిని కాస్త పైకి 6,100 వద్దకు జరుపుకున్నారు. ఈ 6,100 పాయింట్ల వద్ద 60 లక్షల షేర్లకు పైగా పుట్బిల్డప్ ఉన్నందున ఈ వారం నిఫ్టీకి ఇదే తక్షణ మద్దతు స్థాయి.. ఈ స్థాయి దిగువన మద్దతు స్థాయిలు... 6,060, 6,000, 5,950 పాయింట్లు. సెన్సెక్స్లాగానే నిఫ్టీ 6,135-6,180 పాయింట్ల అవరోధ శ్రేణి వద్ద జనవరి చివరి వారంలో భారీ అమ్మకాలు చవి చూసింది. ఈ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించి ముగిస్తేనే మార్కెట్లు క్రమేపీ అప్ట్రెండ్లోకి మళ్లే చాన్స్ ఉంటుంది. ఈ శ్రేణి పైన నిఫ్టీకి నిరోధ స్థాయిలు 6,210, 6,250 పాయింట్లు.