ఆగని బుల్‌ పరుగు | Stock market: Stocks that hit 52 week highs on NSE | Sakshi
Sakshi News home page

ఆగని బుల్‌ పరుగు

Published Wed, Jul 10 2024 12:07 AM | Last Updated on Wed, Jul 10 2024 4:32 PM

Stock market: Stocks that hit 52 week highs on NSE

మార్కెట్ల సరికొత్త రికార్డులు

ఆటో, ఎఫ్‌ఎంసీజీ, అధిక వెయిటేజీ షేర్ల దన్ను

ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు

జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద

ముంబై: ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు మరో రికార్డు స్థాయిలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్‌ బలపరిచాయి. అధిక వెయిటేజీ మారుతీ సుజుకీ(7%), ఎంఅండ్‌ఎం(3%), ఐటీసీ(2%), ఐసీఐసీఐ బ్యాంక్‌(1%) రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 391 పాయింట్లు పెరిగి 80,352 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 24,433 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయం లాభాలతో మొ దలైన స్టాక్‌ సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి.

ఆటో, ఎఫ్‌ఎంసీజీతో పాటు కన్జూమర్‌ డ్యూరబుల్స్, రియలీ్ట, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్‌ డిస్రే్కషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్‌ గూడ్స్, టెక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

మారుతీ పరుగు
⇒ పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం హైబ్రిడ్‌ కార్ల రిజి్రస్టేషన్‌ పన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీ సర్కా రు నిర్ణయంలో దేశంలో ఈ తరహా కార్లను ఉత్పత్తి చేసే మారుతీ సుజుకీ కంపెనీ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో 6.60% పెరిగి రూ.12,820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 8% దూసుకెళ్లి రూ.12,955 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే.  

⇒ నైరుతి రుతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా ఖరీఫ్‌ సందడి మొదలైంది. దీ ంతో వినియోగ ఆధారిత రంగ ఎఫ్‌ఎంసీ జీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. 

బీఎస్‌ఈః రూ. 451.27 లక్షల కోట్లు 
⇒ స్టాక్‌ సూచీలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే రూ.1.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ. 451.27 లక్షల కోట్లకు చేరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement