stock
-
స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్
-
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
అలాంటి పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం..!
నేను ఒక విశ్రాంత ఉద్యోగిని. నా సర్వీస్ మొత్తం కష్టపడి దాచుకున్న డబ్బుని ఒక ప్రైవేటు స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వారు లిస్టింగుకు సిద్ధంగా ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడితే బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ వస్తుందని నమ్మించడంతో అందులో పెట్టుబడులు పెట్టాను. 18 నెలల లోపు సదరు కంపెనీలు స్టాక్ లిస్టింగ్ అవ్వకపోతే, తామే తిరిగి మా స్టాక్ కొనుక్కుంటాము అని అగ్రిమెంట్లు కూడా రాసి ఇచ్చారు. నాలాగే చాలామంది చేత కూడా పెట్టుబడులు పెట్టించారు. ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతోంది కానీ ఏం లాభం లేదు పైగా మా స్టాక్ అమ్మేస్తాము అంటే తిరిగి కొనుక్కోవట్లేదు. ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పగలరు.– ఒక విశ్రాంత ఉద్యోగి, హైదరాబాద్ పూర్వ అనుభవం, వ్యాపార పెట్టుబడులలో నైపుణ్యం కలిగిన వారు అన్లిస్టెడ్ షేర్లు కొంటూ ఉండటం, స్టార్టప్ కంపెనీలలో ముందుచూపుతో పెట్టుబడులు పెట్టడం కూడా ఒక వ్యాపారమే. ఏంజెల్ ఇన్వెస్టర్స్, క్యాపిటల్ ఇన్వెస్టర్స్ అంటూ వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు అవలంబిస్తుంటారు. నచ్చిన సంస్థలలో వారు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అది వారి హక్కు.అన్లిస్టెడ్ కంపెనీలలో కొన్న షేర్లకు రిస్కు కూడా అధికంగానే ఉంటుంది. దీనిని ఒక వ్యాపారం లాగా చేసే వారు నష్టాలకు కూడా సిద్ధపడి పెట్టుబడులు పెడుతుంటారు. కానీ మీలాగా జీవితం మొత్తం కష్టపడి సంపాదించి రిటైర్ అయిన తర్వాత, కేవలం లాభాలు ఆశించి మాత్రమే అధిక మొత్తంలో ఇలాంటి పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఐన కంపెనీలు ఏమైనా ఆర్థిక నేరాలు చేసినా, అవకతవకలు జరిగినా, సెబీకి ఫిర్యాదు చేయవచ్చు. వారిపై కఠిన చర్యలు ఉంటాయి. కంపెనీ నష్టపోతే లేదా దివాలా తీస్తే దానికి ఎవరూ ఏమీ చేయలేరు. మీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చింది మీరు షేర్లు కొన్న కంపెనీ అయి ఉండి, మీకు, సదరు కంపెనీ మేనేజ్మెంట్ వ్యవహారాలకు మధ్య ఏదైనా సమస్యలు తలెత్తితే, మీరు కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ద్వారా కూడా కేసు వేయవచ్చు. మీకు అగ్రిమెంట్లు చేసింది మధ్యలో వున్న బ్రోకింగ్ కంపెనీ అయితే, NCLTని ఆశ్రయించలేరు. ఇటీవలే ఒక కంపెనీ వారు మీలాంటి వారి వద్ద అధిక మొత్తంలో పెట్టుబడులను సేకరించి, అగ్రిమెంట్లు చేసి కూడా ఎవరికీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో, హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదయి, కొందరిని అరెస్టు కూడా చేశారు. ఆ కేసు ఇంకా విచారణ దశ లోనే ఉంది. మీరు కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. మీరు ఏ కంపెనీ షేర్లు అయితే కొన్నారు, వారి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే దిశలో దర్యాప్తు చేయవలసిందిగా కోరండి. సివిల్ కేసు ద్వారా కూడా మీ డబ్బులు తిరిగి పొందవచ్చు.గమనిక ఇటీవల కాలంలో ఒక్క హైదరాబాదులోనే సైబర్ నేరగాళ్లు కూడా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అంటూ చాలా కేసులే నమోదయ్యాయి. ఆర్థికంగా ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అనుభవం కలిగిన వారి సలహా మేరకు, చట్టరీత్యా చేస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. )(చదవండి: పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!) -
బిలీయనీర్లకు బ్యాడ్ ఫ్రైడే
స్టాక్ మార్కెట్ ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేము. కొన్ని సార్లు భారీ లాభాలను తెచ్చిపెడితే, మరికొన్ని సార్లు చావుదెబ్బ కొడుతుంది. ఇదంతా సంపన్నులకు సర్వసాధారణమే.. అయినప్పటికీ తాజాగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఒక్కరోజులోనే (శుక్రవారం) 15.2 బిలియన్ డాలర్లు నష్టపోయారు.బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్.కామ్ ఇంక్ షేర్లు భారీగా పతనమవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది ధనవంతులు సంపద 134 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇందులో గరిష్టంగా జెఫ్ బెజోస్ 15.2 బిలియన్ డాలర్లు నష్టపోగా.. ఈయన నికర విలువ 191.5 బిలియన్లకు పడిపోయింది.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4 శాతం పడిపోవడంతో.. టెస్లా బాస్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్ ఇద్దరూ నష్టాలను చవి చూసారు. దీంతో వీరి సంపద 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు మాత్రమే కాకుండా.. చాలామంది పెట్టుబడిదారులు గందరగోళానికి గురయ్యారు.వ్యక్తిగత సంపద పరంగా మస్క్ తర్వాత స్థానంలో నిలిచిన బెజోస్ ఏడాది పొడవునా అమెజాన్ షేర్లను స్థిరంగా విక్రయించారు. ఒక్క ఫిబ్రవరిలో తొమ్మిది ట్రేడింగ్ రోజులలో సుమారు 8.5 బిలియన్ల విలువైన స్టాక్ను విక్రయించారు. గత నెలలో ఒక రోజు అమెజాన్ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో బెజోస్ 5 బిలియన్స్ విలువైన 25 మిలియన్ అదనపు షేర్లను విక్రయించే ప్రణాళికను వెల్లడించారు. కానీ ఇటీవల భారీగా నష్టపోయారు. -
ఆగని బుల్ పరుగు
ముంబై: ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మరో రికార్డు స్థాయిలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్ బలపరిచాయి. అధిక వెయిటేజీ మారుతీ సుజుకీ(7%), ఎంఅండ్ఎం(3%), ఐటీసీ(2%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 391 పాయింట్లు పెరిగి 80,352 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 24,433 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయం లాభాలతో మొ దలైన స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి.ఆటో, ఎఫ్ఎంసీజీతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్, రియలీ్ట, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్ డిస్రే్కషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్లో సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్ గూడ్స్, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.మారుతీ పరుగు⇒ పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల రిజి్రస్టేషన్ పన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీ సర్కా రు నిర్ణయంలో దేశంలో ఈ తరహా కార్లను ఉత్పత్తి చేసే మారుతీ సుజుకీ కంపెనీ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 6.60% పెరిగి రూ.12,820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 8% దూసుకెళ్లి రూ.12,955 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ⇒ నైరుతి రుతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా ఖరీఫ్ సందడి మొదలైంది. దీ ంతో వినియోగ ఆధారిత రంగ ఎఫ్ఎంసీ జీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈః రూ. 451.27 లక్షల కోట్లు ⇒ స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే రూ.1.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్టైం గరిష్టం రూ. 451.27 లక్షల కోట్లకు చేరింది. -
రికార్డుల ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ మూడో రోజూ కొనసాగింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడి ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులు లిఖించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే., ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. సెన్సెక్స్ ఉదయం 242 పాయింట్ల లాభంతో 77,235 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 374 పాయింట్లు పెరిగి 77,366 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 308 పాయింట్ల లాభంతో 77,301 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 23,579 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 92 పాయింట్లు 23,558 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఐటీతో పాటు రియలీ్ట, కన్జూమర్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 1శాతం, అరశాతం చొప్పున రాణించాయి. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రయ్...సెన్సెక్స్ నాలుగోరోజూ రాణించడంతో బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టానికి చేరింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.42 లక్షల కోట్లు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 437.24 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం 4 రోజుల్లో రూ.10.29 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.⇒ అమెరికా ఫ్యాషన్ దుస్తుల సంస్థ హానెస్ బ్రాండ్స్తో వ్యాపార కాంట్రాక్టు కొనసాగింపుతో పాటు జీబీఎస్టీతో కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో విప్రో షేరు 3% పెరిగి రూ.492 వద్ద ముగిసింది. ⇒ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోళ్ల ఆర్డర్ దక్కించుకోవడంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షేరు 6 శాతం పెరిగి రూ. 5,533 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 7% ఎగసి రూ. 5,565 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. -
ఇక ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ ఫ్యూచర్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది. మూడో రోజూ సూచీలు ముందుకే... స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫాలోఆన్ఆఫర్(ఎఫ్పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత 'ముఖేష్ అంబానీ' సబ్స్క్రిప్షన్ బేస్డ్ శాటిలైట్ టీవీ అండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన టాటా ప్లేలో 29.8% వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్లు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశ టెలివిజన్ పంపిణీ రంగంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్, జియోసినిమా పరిధిని విస్తరించడానికి ముఖేష్ అంబానీ ఈ వ్యహాత్మక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్కు టాటా ప్లేలో 50.2 శాతం వాటా ఉంది. దేశీయ దిగ్గజానికి మాత్రమే కాకుండా సింగపూర్ ఫండ్ టెమాసెక్కు టాటా ప్లేలో 20 శాతం వాటా ఉంది. ఇప్పటికే టాటా ప్లేలో తన వాటాను టాటా గ్రూప్కు విక్రయించడానికి టెమాసెక్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల సారాంశం ఇంకా బయటపడలేదు. అయితే ఇప్పుడు రిలయన్స్, టాటాల మధ్య ఒప్పందం కుదిరితే.. టాటా గ్రూప్, రిలయన్స్ మధ్య కుదిరిన మొదటి ఒప్పందం ఇదే అవుతుంది. ఒప్పందం కుదిరితే.. రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ జియోసినిమా పరిధిని టాటా ప్లే కస్టమర్లకు అందించనుంది. ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - దినదినగండంగా టెకీల పరిస్థితి! -
కుప్పకూలిన దిగ్గజ కంపెనీ స్టాక్..
-
ఆరంభ లాభాలు ఆవిరి
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద ఆఖరి గంటలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఆరంభంలో ఆర్జించిన భారీ లాభాలను కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 680 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 31 పాయింట్ల స్వల్ప లాభంతో 71,386 వద్ద నిలిచింది. నిఫ్టీ ట్రేడింగ్లో 211 పాయింట్లు ఆర్జించింది. ఆఖరికి 32 పాయింట్లు్ల పెరిగి 21,545 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరమైన లాభాలతో ముందుకు కదిలాయి. అయితే ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు ఒక శాతం దిగివచ్చాయి. బ్యాంకింగ్, మీడియా, ఎఫ్ఎంసీజీ, సర్విసెస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆటో, మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.37% లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.991 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.104 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్ (1%), సింగపూర్ (0.50%), చైనా (0.20%) మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు అరశాతం మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతానికి పైగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అధిక వాల్యుయేషన్ ఆందోళనలు, ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో 10 బిలియన్ డాలర్ల విలీనంపై సందిగ్ధత నెలకొనడంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు 8% పతనమైన రూ.256 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 13% క్షీణించి రూ.242 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2,036 కోట్లు నష్టపోయి రూ.24,613 కోట్లకు దిగివచ్చింది. ► బజాజ్ ఆటో రూ.4,000 కోట్ల బైబ్యాక్ ప్రకటించడంతో కంపెనీ షేరు 2% పెరిగి రూ.7,094 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.7,420 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ► జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ ఐపీఓకు తొలి రోజు విశేష స్పందన లభించింది. ఇష్యూ ప్రారంభమైన తొలి కొన్ని గంటల్లోనే షేర్లు పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 4.40 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజే 2.51 రెట్ల ఓవర్ సబ్స్రై్కబ్ అయ్యింది. ఇందులో రిటైల్ విభాగం 8.25 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం 3.63 రెట్లు, క్యూఐబీ కోటా 2 రెట్లు సబ్స్రై్కబ్ అయ్యాయి. -
15 గంటలుగా మండుతూనే...
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డు సమీపంలోని పప్పు బజార్లో ఉన్న కాయర్ రోప్ మర్చంట్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున సునీల్ కాయర్ రోప్ మర్చంట్స్ గోడౌన్లో మంటలు వ్యాపించాయి. ఒంగోలు ఫైర్ ఇంజన్లతో పాటు టంగుటూరు, కొండపి, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి 8 ఫైర్ ఇంజన్లు తీసుకువచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. 15 గంటలకు పైగా మంటలు దట్టంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. భారీగా స్టాక్ ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ ప్రమాదంలో రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు సమాచారం. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమై అదేచోట ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన మూడు రోజులుగా నష్టాల్లో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం దాదాపుగా ప్రారంభ స్థాయిల వద్దే ముగిశాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. పావెల్ ప్రకటనతోపాటు వారంతంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గ్లోబల్ ఇండియన్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 231.36 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 82.05 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 32 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 454 పాయింట్లు పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.7 శాతం మేర నష్టపోయింది. ఎన్ఎస్ఈలో కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టీసీఎస్, ఎన్టీపీసీ, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఐటీసీ, టాటా స్టీల్, బీపీసీఎల్, దివీ ల్యాబ్స్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, హీరో మోటార్స్, యూపీఎల్, హిందాల్కొ, ఎస్బీఐ, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ప్రముఖ సంస్థపై కేసులు.. ఉత్పత్తులపై క్యాన్సర్ ఆరోపణలు!
డాబర్ కంపెనీకి సంబంధించిన మూడు అనుబంధ సంస్థలపై యూకే, కెనడాలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. సంస్థ తయారుచేస్తున్న హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్కు కారణమవుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డాబర్ కంపెనీ ఆయా దేశాల్లో ఈ ఉత్పత్తులను వివిధ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలపై ఇప్పటికే 5,400 కేసులు నమోదయ్యాయి. డాబర్ అనుబంధ సంస్థలైన నమస్తే లేబొరేటరీస్, డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్, డాబర్ ఇంటర్నేషనల్ సంస్థలపై వివిధ కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీనికి తోడు ఇటీవల డాబర్ ఇండియా రూ.320.6 కోట్లకు జీఎస్టీ డిమాండ్ వడ్డీ, జరిమానా నోటీసును అందుకుంది. క్యాన్సర్ ఆరోపణలపై కంపెనీ స్పందిస్తూ.. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సరైన పరిశోధన చేయకుండానే అనుబంధ సంస్థలపై కేసులు పెట్టారని పేర్కొంది. కేసుల పరిష్కారానికి కంపెనీ లీగల్ వాభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో డాబర్ స్టాక్స్ మార్కెట్లో నష్టపోయాయి. అయితే ఈ అంశం వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ పేర్కొంది. డాబర్..చ్యవన్ప్రాష్, హోనిటస్ దగ్గు సిరప్, లాల్ దంత్ మంజన్ టూత్పేస్ట్, అశోకరిష్ట టానిక్, రియల్ జ్యూస్లు, ఓడోమాస్, వాటికా హెయిర్ ప్రొడక్ట్స్, పుదిన్ హర, హజ్మోలా వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. -
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..లాభాల్లో డిఫెన్స్ స్టాక్స్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపధ్యంలో డిఫెన్స్ రంగ స్టాక్లు కొంత లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాకు చెందిన వాటితోపాటు ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయిన డిఫెన్స్స్టాక్లో ర్యాలీ కనబడుతుంది. యుద్ధంలో వాడే వార్హెడ్ల్లో ఉపయోగించే టెక్నాలజీ సంబంధించిన కంపెనీలు సహా ఆయుధాలు తయారు చేసే కంపెనీల షేర్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో లిస్టయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మజగావ్డాక్ షిప్బిల్డర్స్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వంటి రక్షణరంగ స్టాక్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ డెఫెన్స్ స్టాక్స్లో మంచి ర్యాలీ కనిపించింది. అయితే కొన్ని విమానయాన కంపెనీలు ఇజ్రాయెల్కు రాకపోకలను నిలిపివేయడంతో ఎయిర్లైన్ స్టాక్స్ పడిపోయాయి. బ్లూమ్బెర్గ్ వరల్డ్ ఎయిర్లైన్స్ ఇండెక్స్ మార్చి తర్వాత 2.6శాతం మేర క్షీణించింది. డెల్టా ఎయిర్ లైన్స్ ఇంక్, యునైటెడ్ ఎయిర్లైన్స్ హోల్డింగ్స్ ఇంక్, అమెరికన్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఇంక్ కంపెనీలు ఇజ్రాయిల్కు తమ సేవలను రద్దు చేసుకున్నాయి. -
నష్టాల్లోంచి లాభాల్లోకి...
ముంబై: ఆఖరి గంటలో అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం ఇంట్రాడే నష్టాలను భర్తీ చేసుకొని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచీ సానుకూల సంకేతాలు అందిపుచ్చుకున్నాయి. ట్రే డింగ్లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 79 పాయింట్ల లాభంతో 65,402 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 170 పాయింట్ల పతనం నుంచి తేరుకొని ఆరు పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద ముగిసింది. మెటల్, బ్యాంక్స్, ఫైనాన్స్, ఇంధన, ఫార్మా, కన్జూమర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. ► అదానీ పోర్ట్స్ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ ని్రష్కమణతో అదానీ గ్రూప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా అంబుజా సిమెంట్స్ షేరు 3.50% పతనమైంది. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 3.26% నష్టపోయింది. అదానీ ట్రాన్స్మిషన్స్ 2.50%, ఏసీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 2% వరకు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 1.50%, ఎన్డీటీ 1.30%, అదానీ పవర్ ఒక శాతం పతనయ్యాయి. ► రూ.880 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో గతవారం ఐపీఓకు వచి్చన టీవీఎస్ సప్లై చివరి రోజు నాటికి 2.78 రెట్ల సబ్్రస్కిప్షన్ సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.51 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా మొత్తం 6.98 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
ఆ ఒక్క మాటతో.. ఎలాన్ మస్క్కు రూ.1.64 లక్షల కోట్లు నష్టం!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు భారీ షాక్ తగిలింది. టెస్లా కార్ల ధరల్ని తగ్గిస్తామంటూ మస్క్ చేశారు. అంతే ఆ నిర్ణయంతో టెస్లా షేర్ వ్యాల్యూ భారీగా క్షీణించింది. మస్క్ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు (రూ.1.64లక్షల కోట్లు) కోల్పోయారు. బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..ఎలాన్ మస్క్ మొత్తం సంపద 234.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి మస్క్ ప్రతీరోజు 530 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, మస్క్ నెట్ వర్త్ను మొత్తంలో ఏడు సార్లు కోల్పోయారు. అయినప్పటికీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రముఖ లగర్జీ గృహోపకరణాల సంస్థ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. మస్క్కు ఆర్నాల్ట్ల మధ్య వ్యత్యాసం కేవలం 33 బిలియన్ డాలర్లు మాత్రమే. మస్క్తో పాటు ఒక్కరోజులోనే భారీ మొత్తంలో సంపద కోల్పోయిన జాబితాలో టెస్లా సీఈవోతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీల అధినేతలు సైతం ఉన్నారు. వారిలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బల్మెర్, మెటా బాస్ మార్క్ జుకర్ బర్గ్, ఆల్ఫాబెట్ కోఫౌండర్ లారీ పేజ్,సెర్గీ బ్రిన్ ఇలా టెక్ కంపెనీల సంపద 2.3శాతంతో 20.3 బిలియన్ డాలర్ల సంపద నష్టపోయినట్లు అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ 100 ఇండెక్స్ తెలిపింది. ఒక్కరోజే 9.7 శాతం న్యూయార్క్ కేంద్రంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెస్లా షేర్ల విలువ ఏప్రిల్ 20 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. జులై 20న 9.7 శాతంతో టెస్లా షేర్ ధర 262.90 డాలర్ల వద్ద కొనసాగుతూ వస్తుంది. ఇక, ఏప్రిల్ 20 నుండి టెస్లా భారీ నష్టాల్ని చవిచూస్తున్నట్లు మస్క్ ఓ సందర్భంలో తెలిపారు. టెస్లా మదుపర్లలో అలజడి అంతేకాదు ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో నాలుగు సంవత్సరాల కనిష్టానికి పడిపోయి గ్రాస్ మార్జిన్పై ప్రతికూల ప్రభావం చూపించాయి. తాజాగా, అమెరికా ప్రభుత్వం ఆర్ధిక మాంద్యాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతే టెస్లా ధరలను తగ్గించాల్సి ఉంటుందని కంపెనీ మస్క్ హెచ్చరించారు. మస్క్ చేసిన ఈ ప్రకటనతో టెస్లా షేర్ హోల్డర్లలో తీవ్ర అలజడిని రేపింది. షేర్లను అమ్ముకోవడంతో ఎలాన్ మస్క్ సంపద భారీ క్షిణీంచింది. చదవండి👉 భారత్లో టెస్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు -
టెలికాంకు మంచి భవిష్యత్?
-
వామ్మో రూ.4 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్టాక్ ఇదే..
దేశీయ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ షేర్ విలువ రూ.లక్ష వద్ద ట్రేడ్ అయిందని తెలిసి ముక్కున వేలేసుకున్నాం. ఇదే భారత్లో ఖరీదైన షేర్ అని భావిస్తుండగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్ గురించి తెలిసింది. వారెన్ బఫ్ఫెట్కు చెందిన బెర్క్షైర్ హతావే క్లాస్ A షేర్లు దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక్కొక్కటి 5,00,000 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడ్ అయ్యాయి. అంటే భారతీయ కరెన్సీలో రూ.4 కోట్లకుపైనే. జూన్ 13న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ షేరు 513,655.58 డాలర్ల వద్ద ముగిసింది. ఐదేళ్లుగా షేరును కలిగి ఉన్న ఇన్వెస్టర్లు దాని విలువలో 80 శాతం మేర పెరుగుదలను చూశారు. అధిక ధర కారణంగా కొంత మంది ఇన్వెస్టర్లు స్టాక్ కొనుగోలు చేసేందుకు ముందుకురానప్పటికీ కేవలం త్వరగా లాభాలు ఆర్జించడం కంటే ఓపికగా, దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని బెర్క్షైర్ హతావే సీఈవో వారెన్ బఫ్ఫెట్ చెబుతున్నారు. అలాంటివారే తనకు కావాల్సిందని ఆయన పేర్కొన్నారు. అస్థిరత ఎక్కువగా ఉండే తక్కువ ధరల స్టాక్లలో ప్రోత్సాహకం ఉండదని బఫెట్ తెలిపారు. ఇన్వెస్టర్లకు మరింత అంతర్గత విలువను సృష్టించే స్టాక్కు ఆయన ప్రాధాన్యతనిస్తారు. బఫెట్ 1996లో 517,500 క్లాస్ B షేర్లను పరిచయం చేశారు. ఆ స్టాక్ ధర సుమారు 30,000 డాలర్లు. క్లాస్ A బెర్క్షైర్ షేర్ల మాదిరిగా కాకుండా క్లాస్ B షేర్ల విషయంలో స్టాక్ స్ప్లిట్ జరగవచ్చు. 2010 జనవరి 21న ఒక స్టాక్ స్ప్లిట్ 50:1 నిష్పత్తిలో జరిగింది. బెర్క్షైర్ హతావే మార్కెట్ క్యాపిటలైజేషన్ 737.34 బిలియన్ డాలర్లు. క్లాస్ A షేర్ల ద్వారా 15 శాతం, క్లాస్ B షేర్ల ద్వారా 0.01 శాతం కంపెనీని బఫెట్ కలిగి ఉన్నారు. MRF stock today hit the ₹1,00,000 mark. It became the 1st stock in the Indian Market to ever touch the 6 figure mark. The most expensive stock in the world is Berkshire Hathaway at 400,000$ (around 3.2Crore per stock). Long way to go, but hope MRF crosses that mark one day. — Akshat Shrivastava (@Akshat_World) June 13, 2023 -
వ్యాల్యూ స్టాక్ గుర్తించడం ఎలా?
అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్ను గుర్తించడం ఎలా? – కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్ను గుర్తించం కూడా ఒక కళేనని చెప్పుకోవచ్చు. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. కంపెనీ నిధులను నిజాయితీగా నిర్వహిస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి. నేను మూడు, నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నందున, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నందున లాంగ్టర్మ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? దీనికంటే మరేదైనా మెరుగైన ఆప్షన్ ఉందా? – అంకిత్ ముద్రా వడ్డీ రేట్లు, వీటికి సంబంధించిన సైకిల్ (కాల వ్యవధి) అనేవి ఊహించనివి. పరిస్థితులు, సూక్ష్మ ఆర్థిక అంశాల ఆధారంగా ఇవి మార్పులకు లోనవుతుంటాయి. కరోనా మహమ్మారి రాకతో ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు 2020 మార్చి–మేలో వడ్డీ రేట్ల కోతను గుర్తుకు తెచ్చుకోండి. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఇటీవల వరుసగా చేపట్టిన రేట్ల పెంపులు కూడా ఒక నిదర్శనమే. కచ్చితంగా వడ్డీ రేట్ల సైకిల్ను అంచనా వేయడం ఎవరి వల్లా కాదు. ఆ విధమైన అంచనాలతో పోర్ట్ఫోలియో ఏర్పాటు చేసుకోవడం రిస్క్ తీసుకోవడమే అవుతుంది. కనుక స్థూల ఆర్థిక అంశాల కంటే మీ పెట్టుబడుల కాలవ్యవధికి అనుగుణమైన సాధనాలపై దృష్టి సారించడమే మంచిది. మూడు నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అప్పుడు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో పెట్టుబడికి రక్షణ ఉండాలి. అటువంటప్పుడు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలం. ఈ పథకం కాల వ్యవధి, మీ పెట్టుబడుల కాల వ్యవధికి ఒకే రకంగా ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో (డెట్ సాధనాలు) పెట్టుబడులు పెట్టడం వెనుక ఉద్దేశ్యం స్థిరమైన రాబడులు ఆశించడమే. ఈక్విటీల్లో మాదిరి అస్థిరతలు లేకుండా, పెట్టుబడికి రక్షణ కల్పించుకోవడం. లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ చూడ్డానికి ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ అవి ఎంతో అస్థిరతలతో ఉంటాయి. దీర్ఘకాలంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో మాదిరే రాబడులను ఇస్తాయి. డెట్ ఫండ్స్ ఎంపిక చేసుకునేప్పుడు అనుసరించాల్సిన సూత్రం మీ పెట్టుబడుల కాల వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనం పెట్టుబడుల కాలవ్యవధి ఒకే విధంగా ఉండాలి. ఇక మీ పెట్టుబడుల కాలవ్యవధి మూడు నాలుగేళ్లు కనుక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ను కూడా చూడొచ్చు. ఈక్విటీలతో వచ్చే రిస్క్ కొంత ఇందులో ఉంటుంది. ఇవి ఈక్విటీలు, డెట్, ఆర్బిట్రేజ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చే స్తాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ కంటే ఎక్కువ రాబడులు ఇస్తాయి. అచ్చమైన ఈక్విటీలతో పోలిస్తే తక్కువ అస్థిరతలతో మెరుగైన రాబడులు ఇస్తాయి. ధీరేంద్ర కుమార్ - సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
యూట్యూబర్లూ బీ కేర్పుల్: నటుడికి, ఆయన భార్యకు సెబీ షాక్
సాక్షి, ముంబై: షేర్ మార్కెట్ , స్టాక్ సంబంధిత అంశాలపై తప్పుడు సమాచారంతో మోసం చేస్తున్న యూ ట్యూబర్లకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ భారీ షాకిచ్చింది. సోషల్ మీడియా ద్వారా మార్కెట్ మానిప్యులేషన్కు పా ల్పడుతున్న సాధన బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లతో సహా, 31 యూట్యూబర్లను గురువారం బ్యాన్ చేసింది. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ చర్య తీసుకుంది. అమాయక పెట్టుబడిదారులను మోసంచేస్తూ యూట్యూబర్లు కుమ్మక్కయ్యారని మండిపడింది. ముఖ్యంగా యూట్యూబ్లో తప్పుదోవ పట్టించే వీడియోలను అప్లోడ్ చేయడం ద్వారా సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను మానిప్యులేట్ చేశారంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టిని కూడా మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధించింది. అర్షద్ వార్సీ రూ.29.43 లక్షలు, ఆయన భార్య రూ.37.56 లక్షల లాభం ఆర్జించారని సెబీ పేర్కొంది. అంతేకాదు ఆయా సంస్థలనుంచి రూ. 41.85 కోట్ల అక్రమ లాభాలను రెగ్యులేటర్ స్వాధీనం చేసుకుంది. షేర్ పంప్ అండ్ డంప్ స్కీమ్లో అర్షద్తో సహా 45 మంది యూట్యూబర్లను సెబీ దోషులుగా గుర్తించింది. నిందితుడు అర్షద్ వార్సీతో సహా చాలా మంది యూట్యూబర్లు పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడం ద్వారా వారి వాల్యూమ్ను పెంచుతున్నారని తద్వారా ప్రతి నెలా రూ.75 లక్షల వరకు సంపాదిస్తున్నారని సెబీ తెలిపింది. యూట్యూబ్ క్రియేటర్లతో కలిసి స్టాక్లను షార్ప్లైన్ బ్రాడ్కాస్ట్ షేర్ల మానిప్యులేషన్స్కు పాల్పడుతున్నారంటూ 24 ఎంటిటీలను కూడా స్టాక్ మార్కెట్ నుండి సెబీ నిషేధించింది. షార్ప్లైన్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ స్క్రిప్లో ఏప్రిల్ నుండి ఆగస్టు 2022 వరకు తప్పుడు వాల్యూమ్లకు దారితీసిందనీ, దీంతో కొంతమంది వాటాదారులు భారీ లాభాలను బుక్ చేసుకున్నారని , ఇది ట్రేడ్ ప్రాక్టీస్ నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది. సాధనా బ్రాడ్కాస్ట్కి సంబంధించి ఏప్రిల్ 27, 2022 నుండి సెప్టెంబర్ 30, 2022, షార్ప్లైన్ బ్రాడ్కాస్ట్ ఏప్రిల్ 12, 2022 నుండి ఆగస్టు 19, 2022 మధ్య లావాదేవీలను సెబీ విచారించింది. సెబీ తన రెండు మధ్యంతర ఉత్తర్వుల్లో, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నేరస్తులందరినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానైనా సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా డీల్ చేయకుండా నిరోధించింది. అలాగే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ డెరివేటివ్ కాంట్రాక్ట్లలో వారు ఏదైనా ఓపెన్ పొజిషన్లు ఉంటే ఈ ఆర్డర్ తేదీ నుండి లేదా అటువంటి కాంట్రాక్టుల గడువు ముగిసే మూడు నెలలలోపు, ఏది ముందుగా అయితే, అటువంటి పొజిషన్లను మూసివేయవచ్చు/స్క్వేర్ ఆఫ్ చేయాలని కూడా ఆదేశించింది. కాగా సెబీ చాలా కాలంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రించేందుకు సిద్దమవుతోంది. రెండేళ్ల క్రితమే ఈ విషయంలో నిబంధనల రూపకల్పన కసరత్తు మొదలైంది. -
రూ.2,500 కోట్ల షేర్లను బైబ్యాక్ చేశాం, బజాజ్ ఆటో ప్రకటన
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో తన వాటాదారుల నుంచి 64,09,62 షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ.2,500 కోట్లు వెచ్చించినట్టు ప్రకటించింది. జూలై 4న బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్ను ప్రారంభించింది. సోమవారం సమావేశమైన బైబ్యాక్ కమిటీ, అక్టోబర్ 10తో బైబ్యాక్ ముగించేందుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో షేరును రూ.4,600కు మించకుండా కొనుగోలు చేయా లని ఈ ఏడాది జూన్ 27న బజాజ్ ఆటో నిర్ణయించడం గమనార్హం. బైబ్యాక్ తర్వాత ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు మొత్తం వాటా 53.77 శాతం నుంచి 54.98 శాతానికి పెరిగింది. -
యాంఫీ చైర్మన్గా బాలసుబ్రమణియన్ పునర్నియామకం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ చైర్మన్గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ మరోసారి ఎన్నికయ్యారు. ఎడెల్వీస్ ఏఎంసీ ఎండీ, సీఈవో రాధిక గుప్తా వైస్ చైర్పర్సన్గా కొనసాగనున్నారు. సెప్టెంబర్లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యాంఫీ వెల్లడించింది. తదుపరి వార్షిక సమావేశం వరకూ ఇద్దరూ తమ తమ పదవుల్లో కొనసాగుతారు. బాలసుబ్రమణియన్ యాంఫీ ఫైనాన్షియల్ లిటరసీ కమిటీకి ఎక్స్–అఫీషియో చైర్మన్గా కూడా ఉంటారు. అటు ఆపరేషన్స్, రిస్క్ల కమిటీకి గుప్తా చీఫ్గా వ్యవహరిస్తారు. ఇక ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) కమిటీ చైర్మన్గా నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ సందీప్ సిక్కా ఎన్నికయ్యారు. యాంఫీలో 43 ఏఎంసీలకు సభ్యత్వం ఉంది. -
తెలివంటే ఇదే మరి..రూ.2150కి అమ్మి రూ.640కి షేర్లు కొన్న పేటీఎం సీఈవో!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం డైరెక్టర్ విజయ్ శేఖర్ శర్మ రూ.11 కోట్లకు 1.7 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇదే విషయాన్ని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. పేటీఎం సంస్థ గతేడాది నవంబర్లో ఐపీవోకి వెళ్లింది. ఐపీవోలో ఒక్కో షేరు రూ.2150 వద్ద పలికింది.ఆ సమయంలో విజయ్ శేఖర్ శర్మ పేటీఎం షేర్లను కొనుగోలు చేసే అధికారం లేదు. ఒకవేళ కొనుగోలు చేయాలని పేటీఎం ఐపీవో వచ్చిన ఆరునెలల ఎదురు చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మే 30న విజయ్ శేఖర్ శర్మ 1,00,552 షేర్లను రూ.6.31 కోట్లకు, మే 31వ తేదీన 71,469 షేర్లను రూ.4.68 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో వీటి వాల్యూ మొత్తంగా రూ.11 కోట్లుగా ఉందని కంపెనీ పేర్కొంది. -
రాజకీయాల నుంచి ''ఆ ముసలోళ్లను ఎలిమినేట్ చేయండి సార్''..!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. 70 ఏళ్ల వయస్సు పైబడిన వారిని రాజకీయ పదవులకు పోటీ చేయకుండా నిషేధించాలని పిలుపునిచ్చారు. ట్వీట్లో చట్టసభ సభ్యులు ఎవరనేది ప్రస్తావించనప్పటికీ, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, ఇద్దరూ 70 ఏళ్లు పైబడిన వారు. కొద్ది రోజుల క్రితం ఎలన్ సెటైర్లు వేసిన సెనేటర్ సాండర్స్ వయస్సు 80 సంవత్సరాలు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎలన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Let’s set an age limit after which you can’t run for political office, perhaps a number just below 70 … — Elon Musk (@elonmusk) December 2, 2021 ఎలన్ మస్క్ అమెరికా నేతల్ని పరోక్షంగా కర్ర కాల్చి వాత పెడుతున్నారు. నవంబర్ 13న వాషింగ్టన్లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్, మార్క్ జుకర్బర్గ్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అదే సమయంలో అమెరికా సెనేట్ బడ్జెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సాండర్స్ అమెరికాలోని 0.1 శాతం ఉన్న అత్యంత ధనవంతులు కుటుంబాలపై వార్షిక పన్నును ప్రతిపాదించారు. ‘‘అత్యంత ధనవంతులు వారి వంతు పన్నులను సక్రమంగా చెల్లించాల్సిందిగా మనం డిమాండ్ చేయాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్పై ఎలన్ తనదైన స్టైల్లో సాండర్స్ పై సెటైర్లు వేశారు. ‘‘ సాండర్స్ నువ్వు బతికున్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను..ఇప్పుడేమంటావ్.. నేను మరింత స్టాక్ అమ్ముకోవాలని నువ్వు కోరుకుంటున్నావా.. చెప్పు’’ అంటూ ఎలన్ మస్క్ విరుచుకుపడ్డాడు. అయితే తాజాగా ఎలన్ చేసిన 'ఎలిమినేట్' వ్యాఖ్యలకు కారణం సెనెటర్లు బిలియనీన్లు పన్నులు కట్టాలని సెనెటర్లు చేసిన డిమాండ్లేనని తెలుస్తోంది. బిలియనీన్లు పన్నులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఎలన్..టెస్లాలోని తన శాతం షేర్లను అమ్మకానికి పెడుతున్నట్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దెబ్బకు టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో లక్షకోట్లుకు పైగా నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని తట్టుకోలేకనే ఈ బిలియనీర్ 70ఏళ్లకు పై బడిన వారిని రాజకీయాల్లో పదవులకు పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తించాలని ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం అమెరికాలో చర్చాంశనీయం కాగా..ఆ వ్యాఖ్యల ప్రభావం ఎలన్పై భారీగా ఉండొచ్చనేది విశ్లేషకులు చెబుతున్నమాట. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 -
అదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది..! లక్ష పెట్టుబడి..లాభం రూ.20 లక్షలు..!
అదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ రావడం' అంటే ఇదేనేమో..! కరోనా వేరియంట్తో దేశీయ మార్కెట్లో లక్షల కోట్లు బూడిదపాలవుతుంటే..అదే మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ మాత్రం కనకవర్షం కురిపిస్తున్నాయి. మల్టీ బ్యాగర్లో పెన్నీస్టాక్స్ 'రాధే డెవలపర్స్' కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు వరంగా మారింది. కేవలం మూడు నెలల్లో ఆ స్టాక్స్పై 1,904శాతం రాబడితో ముదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 26,2021న ఈ స్టాక్ వ్యాల్యూ రూ.17.07 ఉండగా.. నవంబర్ 26 నాటికి రూ.342.30కి పెరిగింది. దీంతో మూడు నెలల క్రితం ఈ స్టాక్స్ లో రూ.1లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు రూ.20.04 లక్షలు సంపాదించారు. లక్షల కోట్లు ఆవిరి కానీ కరోనా వేరియంట్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు 8% క్షీణించి దాదాపు రూ.14 లక్షల కోట్లు బూడిపాలయ్యాయి. అదే సమయంలో శుక్రవారం రోజు రాధే డెవలపర్స్ షేర్లు గురువారం నాడు మార్కెట్లు ముగిసే సమయానికి రూ.325.95తో పోలిస్తే 4.99% పెరిగి శుక్రవారం రోజు రూ.342.2 ఆల్ టైమ్ హైని తాకాయి. స్టాక్ పనితీరు బిఎస్ఈలో రాధే డెవలపర్స్ స్టాక్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.861.66 కోట్లకు పెరిగింది. మొత్తం 1.30 లక్షల షేర్లు రూ.4.44 కోట్ల టర్నోవర్తో చేతులు మారాయి. పనితీరు 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల సగటు కంటే ఎక్కువగా ఉంది. షేర్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి 3,603% లాభపడింది. ఒక సంవత్సరంలో వ్యాల్యూ 3,540% పెరిగడంపై ముదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
స్టాక్ మార్కెట్ కుబేరులు.. వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న కంపెనీలు ఇవే
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తు పట్ల నిశ్చింతంగ ఉండాలంటే మంచి కంపెనీలను ఎన్నుకోవడం ఎంతో ముఖ్యం. ఎప్పుడు ఒకే సంస్థపై కాకుండా నాలుగైదు విభిన్న రంగాలకు చెందిన బెస్ట్ కంపెనీలు సెలక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం మేలు. షేర్ మార్కెట్కి సంబంధించిన ప్రాథమిక సూత్రాల్లో ఈ రెండు ఎంతో ముఖ్యం. వీటిని తూచా తప్పకుండా పాటించిన వారికి స్టాక్ మార్కెట్లో కలిసి వచ్చింది. కాసుల వర్షం కురిపించింది. పట్టు పెంచుకోవాలి అయితే మంచి కంపెనీలను ఎంచుకోవడం, భవిష్యత్తు ఉన్న రంగాలను ముందుగానే పసిగట్టడం వంటి పనులు చేయాలంటే ఎంతో నేర్పు, మార్కెట్ పట్ల అవగాహన ఉండాలి. లేదంటే చాన్నాళ్లుగా మార్కెట్లో కొనసాగుతూ తమ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ లాభాలను ఆర్జిస్తున్న వారిని పరిశీలించడం బెటర్. తద్వారా మార్కెట్ మీద పట్టు పెంచుకోవచ్చనేది ఆర్థిక నిపుణుల సలహా. పోర్ట్ఫోలియో రాకేశ్ ఝున్ఝున్వాలా, రాధాకిషన్ దమానీ, అజీమ్ ప్రేమ్జీ ఇలా స్టాక్ మార్కెట్లో చాలా కాలం నుంచి కొనసాగుతూ తమ పొర్ట్ఫోలియోలో వివిధ సెక్టార్లకు చెందిన కంపెనీల స్టాక్లను మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో కొన్సి షేర్ల ధరలు మార్కెట్ ఎంట్రీ లెవల్లో ఉన్న వారు భరించలేని ధరతో ఉన్నాయి. మరికొన్ని కొంచెం తక్కువ ధరలలో అందుబాటులో ఉన్నాయి. బిగినర్లు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అనువుగా ఉన్నాయి. అందులో కొన్నింటి వివరాలు .. అజీమ్ ప్రేమ్జీ మన దేశంలో ఉన్న అపర కుబేరుల్లో ఒకడైన అజీమ్ ప్రేమ్జీ పోర్ట్ఫోలియోలో విప్రో, ట్యూబ్ ఇండియా, జైడస్ వెల్నెస్, ట్రెంట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో విప్రోలో బ్రాండ్ కింద హోంకేర్, పర్సనల్ కేర్, వెల్నెస్, మేల్గ్రూమింగ్, ఆఫీస్ సొల్యూషన్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఆ తర్వాత హెల్త్కేర్లో జైడస్, దుస్తుల విభాగంలో టాటా సబ్సిడరీ ట్రెంట్, ఆటోమొబైల్ విభాగంలో టీఐ కంపెనీల షేర్ల తన పోర్ట్ఫోలియోలో ఉంచుకున్నారు అజీమ్ ప్రేమ్జి. - విప్రో షేరు ధర ప్రస్తుతం రూ.652లుగా ఉంది. గతేడాది ఈ షేరు ధర కేవలం రూ.351గా నమోదు అయ్యింది - ట్యూబ్ ఇండియా (టీఐ) షేరు ధర ప్రస్తుతం రూ.83.60లు ఉండగా ఏడాది కిందట రూ. 16.90లుగా ఉంది. - జైడస్వెల్ షేర్ ధర రూ.2050 ఉండగా ఏడాది కిందట రూ.1720గా ఉంది. - ట్రెంట్ షేర్ ధర రూ.1095 ఉండగా ఏడాది కిందట రూ. 681గా ట్రేడ్ అయ్యింది. రాకేశ్ అండ్ రాధకిషన్ - మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝన్ఝున్వాలా విషయానికి వస్తే ఆయన పోర్ట్ఫోలియోలో టైటాన్, ఎన్సీసీ, క్రిసిల్, టాటా కమ్యూనికేషన్స్లు ఉన్నాయి. రాకేశ్ ఝున్ఝున్వాలా అసోసియేట్స్ పోర్ట్ఫోలియోలో పైన పేర్కొన్న మూడింటితో పాటు ఎస్కార్ట్ కూడా ఉంది. - డీమార్ట్ సంస్థల అధినేత ఒకప్పటి మార్కెట్ బేర్ రాధాకిషన్ దమానీ పోర్ట్ఫోలియోలో డీమార్ట్, ది ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్లు ఉన్నాయి. - ఆశీష్ దావన్ పోర్ట్ఫోలియోలో బిర్లాసాఫ్ట్, మ్యాక్స్ హెల్త్కేర్, ఐడీఎఫ్సీ, గ్లెన్మార్క్లు ఉన్నాయి - ముఖుల్ అగర్వాల్ పోర్ట్ఫోలియోలో ఇంటెలెక్ట్, రెలిగేర్, మాస్టెక్, ఏపీల్ అపోలోలు ఉన్నాయి. -
కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్దేవ్.. సెబీ సీరియస్
యోగా గురువు రామ్దేవ్ బాబా మరోసారి చిక్కుల్లో పడ్డారు. యోగా క్లాసుల సందర్భంగా ఆయన చెప్పిన ఆర్థిక పాటాలపై సెబీ సీరియస్ అయ్యింది. అభ్యంతర వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలంటూ వివరణ అడిగింది. ఈ షేర్లు కొనండి కరోడ్పతి కండి ఇటీవల యోగా తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి బాబా రామ్దేవ్ ప్రసంగించారు. ‘ ఈ సందర్భంగా మీ అందరికీ కోటీశ్వరులు అయ్యే మంత్రం చెబుతాను జాగ్రత్తగా వినండి. మీరంతా ఈ రోజే డీ మ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. స్టాక్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహించేందుకుద అన్నీ ఏర్పాట్లు చేసుకోండి. నేను చెప్పినప్పుడు రుచి సోయా కంపెనీకి చెందిన షేర్లు కొనండి. అలా కొన్న వాటిని తిరిగి అమ్మడం , కొనడం వంటి పనులు చేయకండి. వాటిని కొన్న వెంటనే ‘సమాధి’ చేయండి. ఎక్కువ కాలం మీ దగ్గరే ఉంచుకోండి. పతంజలి తర్వాత లక్ష కోట్ల రూపాయల కంపెనీ అయ్యే అర్హతలు రుచి సోయాకు ఉన్నాయి’ అంటూ చెప్పారు. సెబీ సీరియస్ స్టాక్ మార్కెట్లో జరిగే లావాదేవీలను సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సంస్థ నిర్వహిస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం సరైన నైపుణ్యం, సర్టిఫైడ్కాని వ్యక్తులు షేర్ల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన సలహాలు ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మార్కెట్పై అవగాహన లేని వారు తమ డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. కానీ బాబా రామ్దేవ్ ఈ నిబంధనను పట్టించుకోకుండా బహిరంగగా సలహా ఇవ్వడంపై సెబీ సీరియస్ అయ్యింది. దీనిపై రామ్దేవ్ బాబాను వివరణ కోరింది. సోయా రుచికి నోటీసులు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ సోయారుచికి ప్రమోటర్గా ఉంది. ఇటీవల అదనపు నిధులు మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)కి వెళ్లేందుకు ఆగస్టులో సెబీ నుంచి అనుమతులు సాధించింది. త్వరలో ఈ సంస్థ ఎఫ్పీవో ద్వారా రూ. 4300 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. అయితే ఇంతలో రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఈ సంస్థను చిక్కుల్లో పడేశాయి. రుచితో పాటు ఎప్పీవోకి మర్చంట్బ్యాంకర్లు ఉన్న వారికి సెబీ నోటీసులు జారీ చేసింది. లభించని వీడియో కరోడ్పతి మంత్ర, సోయా రుచి షేర్లకు సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు రావడం తప్పితే సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా లభించడం లేదు. అయితే యోగా తరగతుల్లో బాబా మాట్లాడే సమయంలో కొందరు వీడియో తీశారని, ఆ ఫుటేజీ సెబీకి చేరిందని తెలుస్తోంది. సెబీ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత ఆ వీడియోను తొలగించినట్టు సమాచారం. చదవండి : IIFL Wealth Hurun India 2021: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్జున్వాలా..అతని తర్వాతే..! -
అమెరికా షేర్లలో పెట్టుబడి ఈజీ..!
‘గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే బుట్టలో పెట్టరాదు’ అని ఇన్వెస్ట్మెంట్లో ప్రాథమిక సూత్రం ఒకటి ఉంది. ఇన్వెస్టర్లు అందరూ పాటించాల్సిన సూత్రం ఇది. కానీ, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని అందరూ పాటించరు. కొంత మంది మాత్రం ఈక్విటీల్లో, బాండ్లలో, బంగారంలో ఇలా భిన్నమైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించుకునే సూత్రాన్ని అనుసరిస్తుంటారు. ఇలా పెట్టుబడులను ఒకటికి మించిన వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఒక్కో సమయంలో ఒక్కో సాధనం చూపించే అసాధారణ పనితీరు నుంచి ప్రయోజనం పొందొచ్చు. పైగా కొన్ని సందర్భాల్లో ఒక్కో విభాగం నష్టాలను చూడాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో రిస్క్ను తగ్గించుకున్నవారు అవుతారు. ఈక్విటీ పెట్టుబడులను సైతం అన్నింటినీ మన మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేయడం కాకుండా, కొంత భాగాన్ని యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా వైవిధ్యమే అవుతుంది. ఒకప్పుడు లేని ఈ అవకాశాన్ని నేడు పలు బ్రోకరేజీ సంస్థలు తమ ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి. భౌగోళికంగా భిన్న మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒకే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంతో పోలిస్తే ఆటుపోట్లను అధిగమించి మెరుగైన రాబడులకు వీలు కల్పిస్తుంది. పైగా మన ఈక్విటీ మార్కెట్లలో అందుబాటులో లేని వినూత్న అవకాశాలు యూఎస్ ఈక్విటీల్లో ఉన్నాయి. ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఈ తరహా సంస్థలు మన మార్కెట్లలో లిస్ట్ అయి లేవు. కానీ, ఈ దిగ్గజాలు ఎప్పటికప్పుడు మరింత బలపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూజర్లను కలిగి ఉన్నవి కావడంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వృద్ధి ఫలాలను పొందొచ్చు. అమెరికాలో సెక్యూరిటీల నియంత్రణ మండలి అయిన ‘ఎస్ఈసీ’ ఫ్రాక్షనల్ షేర్లలోనూ ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. ఉదాహరణకు చాలా ఖరీదైన షేరును కొనుగోలు చేయాలనుకునే వారి దగ్గర తక్కువ పెట్టుబడే ఉన్నట్టయితే.. అప్పుడు ఆ స్టాక్లో కొంత భాగాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. తమవద్దనున్న ఫ్రాక్షనల్ షేర్ల విలువకు తగినట్టు ఓటింగ్ హక్కులతోపాటు డివిడెండ్కు అర్హులవుతారు. తమ పిల్లలను అమెరికాలో ఉన్నత విద్యకు పంపించాలనుకుంటుంటే అమెరికన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆలోచన అవుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా వారి విద్యకు అవసరమైన మొత్తాన్ని స్టాక్స్ పెట్టుబడుల రూపంలో సమకూర్చుకోవచ్చు. ఇన్వెస్ట్ చేయడం ఎలా..? దేశీయంగా ఈక్విటీల్లో నేరుగాను, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నట్టే.. యూఎస్ స్టాక్ మార్కెట్లలోనూ నేరుగా స్టాక్స్ కొనుగోలు చేసుకోవచ్చు. లేదా అక్కడి స్టాక్స్లో పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ వేదికలు అయిన వెస్టెడ్ ఫైనాన్స్, స్టాకాల్, విన్వెస్టా ఉన్నాయి. భారత్కు చెందిన బ్రోకరేజీ సంస్థలు ఐసీఐసీఐ డైరెక్ట్, యాక్సిస్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యూఎస్ బ్రోకరేజీ సంస్థలతో ఒప్పందం చేసుకుని అమెరికా స్టాక్స్లో పెట్టుబడుల సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో ఐసీఐసీఐ డైరెక్ట్.. ఇంటరాక్టివ్ బ్రోకర్స్ ఎల్ఎల్సీతోను, యాక్సిస్ సెక్యూరిటీస్ వెస్టెడ్ ఫైనాన్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి విదేశాల్లో ట్రేడింగ్ అకౌంట్ ప్రారంభానికి కేవైసీ డాక్యుమెంట్లతోపాటు దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. పాన్, గుర్తింపు ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. అకౌంట్ ఓపెనింగ్ చార్జీలు, బ్రోకరేజీ చార్జీలు, కమీషన్లు సంస్థలను బట్టి మారిపోతాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ అయితే అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్పై అకౌంట్ ప్రారంభానికి ఎటువంటి చార్జీలను వసూలు చేయడం లేదు. కానీ, వార్షిక సబ్స్క్రిప్షన్ చార్జీగా రూ.999–9,999 మధ్య చెల్లించుకోవాలి. బ్రోకరేజీ కింద ఒక షేరుకు యూఎస్ సెంట్ నుంచి 2.99 డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాయి. అంటే కస్టమర్లు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా చార్జీల్లో మార్పు ఉంటుంది. ఐసీఐసీఐ డైరెక్ట్ కస్టమర్లకు ‘గ్లోబల్ స్టార్టర్’, ‘గ్లోబల్ అడ్వాంటేజ్’ అనే రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వెస్టెడ్ ఫైనాన్స్ బేసిక్ ప్లాన్ అకౌంట్ ప్రారంభానికి రూ.399 చార్జీ వసూలు చేస్తోంది. ఇది మినహా ఇతరత్రా బ్రోకరేజీ లేదా కమీషన్లను వసూలు చేయడం లేదు. మోడల్ పోర్ట్ఫోలియో తదితర విలువ ఆధారిత సేవలతో కూడినప్రీమియం ప్లాన్ను ఎంచుకున్న వారికి అకౌంట్ ప్రారంభ చార్జీల మినహాయింపు ఉంటుంది. నిధుల బదిలీ.. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశాల్లో తమ ట్రేడింగ్ ఖాతాలకు నిధులను బదిలీ చేసుకోవచ్చు. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2,50,000 డాలర్లను పంపుకునేందుకు అనుమతి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ మార్గంలో నిధుల బదిలీ సేవలను చాలా వరకు బ్రోకర్లు అందిస్తున్నారు. మరి ఒకవేళ అక్కడి స్టాక్స్ను విక్రయించి ఆ నిధులను తిరిగి వెనక్కి పొందాలంటే అందుకు కొంత సమయం తీసుకుంటుంది. బ్యాంకుల వద్ద ప్రాసెసింగ్కు పట్టే సమయంతోపాటు, అమెరికాలో టీ ప్లస్ 3 సెటిల్మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే విక్రయించిన నాటి నుంచి నాలుగో రోజు నిధులు అకౌంట్లో జమ అవుతాయి. మన దేశంలో టీప్లస్ 2 విధానం అమల్లో ఉంది. మినహాయింపులు.. భారతీయ ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి యూఎస్ ఈక్విటీల్లో, లిస్టెడ్ బాండ్లలో, ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అమెరికన్ స్టాక్ ఎక్సే్చంజ్ల్లో ఇతర దేశాల కంపెనీల లిస్టింగ్కు కూడా అనుమతి ఉంది. ప్రస్తుతానికి 465 అమెరికాయేతర కంపెనీలు యూఎస్ ఎక్సే్చంజ్ల్లో క్రాస్లిస్డ్ అయి ఉన్నాయి. వీటిల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో వచ్చే ఐపీవోలకు దరఖాస్తు చేసుకునే అవకాశం మాత్రం లేదు. భారత్లో నివసించే వారు అంతర్జాతీయ మార్కెట్లలో మార్జిన్ ట్రేడింగ్, లెవరేజీ ట్రేడింగ్కు ఆర్బీఐ అనుమతించడం లేదు. దీనికి అదనంగా కొన్ని బ్రోకరేజీ సంస్థలు అదనపు నియంత్రణలు పెడుతున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ అయితే అంతర్జాతీయ ట్రేడింగ్ అకౌంట్ ప్రారంభించే ఇన్వెస్టర్కు కనీసం 5,000 డాలర్ల నెట్వర్త్ ఉండాలంటూ నిబంధన అమలు చేస్తోంది. అంటే కనీసం రూ.3.7 లక్షల నెట్వర్త్ అయినా ఉండాలన్నమాట. ఇక రాబడులపై పన్నుల భారం కూడా మోయాల్సి ఉంటుంది. అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడులపై అందుకునే డివిడెండ్పై 25 శాతం విత్హోల్డింగ్ ట్యాక్స్ పడుతుంది. అయితే, ఇటువంటి పన్నులను ఫామ్ 67ను దాఖలు చేయడం ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నేరుగా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు తగినంత నైపుణ్యం ఉంటే ఫర్వాలేదు. లేకుంటే చేతులు కాల్చుకున్నట్లే. కనుక కొత్త ఇన్వెస్టర్లు, తగినంత సమయం వెచ్చించలేని వారికి ఫండ్స్, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (విదేశీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే పథకాలు) అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్, నిప్పన్ ఇండియా యూఎస్ ఈక్విటీ అపార్చునిటీస్ ఫండ్, డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్, ఎడెల్వీజ్ యూఎస్ వ్యాల్యూ ఈక్విటీ ఆఫ్షోర్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఇలా ఎన్నో పథకాలు అమెరికా స్టాక్స్లో పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నాయి. టీసీఎస్ పడుతుంది.. విదేశీ స్టాక్స్లో పెట్టుబడులు నిజంగా మంచి అవకాశమే. ఇందులో సందేహం లేదు. కానీ పైన చెప్పుకొన్నట్టు పన్నుల భారాన్ని కూడా గమనించాలి. అక్టోబర్ 1 నుంచి ఒక ఏడాదిలో రూ.7లక్షలకు మించి నిధులు పంపించుకుంటే (విదేశీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కు పంపుకునే నిధులపైనా) 5 శాతం మూలం వద్ద పన్నును బ్యాంకులు వసూలు చేయాలని (టీసీఎస్) కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఆధార్, పాన్ కార్డు ఇవ్వని వారి విషయంలో టీసీఎస్ 10 శాతం అమలవుతుంది. ‘‘ఈ నిబంధన తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం పన్ను పరిధిని పెంచడమే. ప్రభుత్వం వద్దనున్న సమాచారం ప్రకారం చూస్తే చాలా మంది వ్యక్తులు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉపయోగించుకుని ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు’’ అని వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరమ్ షా పేర్కొన్నారు. విదేశీ స్టాక్స్, బాండ్లు, ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసే భారతీయులకు ఈ నిబంధన వల్ల వ్యయాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, నిజాయితీపరులైన వారు రిటర్నులు దాఖలు చేసి టీసీఎస్ను రిఫండ్గా పొందొచ్చని సూచిస్తున్నారు. ‘‘విదేశీ లావాదేవీల ప్రారంభ వ్యయాలను ఇది అధికం చేస్తుంది. అయితే, ఈ వ్యయాలను పన్ను రిటర్నులను దాఖలు చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఏడాదిలో రూ.7లక్షల్లోపు నగదు పంపుకునే ఇన్వెస్టర్లపై ఈ నిబంధనలు ఎటువంటి ప్రభావం చూపించవు’’ అని విన్వెస్టా సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ తెలిపారు. విదేశీ విద్య కోసం, విదేశీ పర్యటనల కోసం నిధుల వ్యయాలపై నిబంధనల్లో మార్పు ఉంది. ఒకవేళ విదేశీ విద్య కోసం బ్యాంకులో రుణం తీసుకుని పంపిస్తున్నట్టు అయితే.. అది కూడా రూ.7లక్షలు మించిన సందర్భంలో 0.5 శాతాన్ని టీసీఎస్గా మినహాయిస్తారు. అదే విదేశీ పర్యాటక ప్యాకేజీలను బుక్ చేసుకుంటే ఎంత విలువ అన్నదానితో సంబంధం లేకుండా 5 శాతం టీసీఎస్ అమలవుతుంది. ఒకవేళ సొంతంగా విదేశీ పర్యటనను (ట్రావెల్ ఏజెన్సీలతో సంబంధం లేకుండా) బుక్ చేసుకుంటే ఈ పన్ను పడదు. -
వాటాను విక్రయించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవో
దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య పురి ఇదే బ్యాంకులో కొంత మొత్తంలో తన వాటాను విక్రయించారు. ఆదిత్య ఈ జూలై 21-24 తేదిల మధ్య 74.2లక్షల ఈక్విటీ షేర్లను రూ.843 కోట్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆదిత్య గతకొన్నేళ్లుగా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్(ఈఎస్ఓపీ)ద్వారా దాదాపు 78లక్షల షేర్లను దక్కించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020లో ఈఎస్ఓపీ ద్వారా 6.82 లక్షల ఈక్విటీ షేర్లను పొందారు. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో స్టాక్ ఆప్షన్లను మినహాయించి ఆదిత్య రూ.18.92 కోట్ల జీతాభత్యాన్ని అందుకున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకును 1994లో స్థాపించారు. నాటి నుంచి ఆదిత్యపురి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పనిచేస్తారు. ఏడాది అక్టోబర్ 20తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్లో తదుపరి సీఈవో ఎంపిక కోసం బ్యాంకు బోర్డు సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో 6గురు సభ్యులున్నారు. ఈ పదవిలో రేసులో శశిధర్ జగ్దీషన్, కైజద్ బరుచా, సునీల్ గార్గ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బ్యాంక్ షేరు 3.50శాతం క్రాష్: బ్యాంక్ సీఈవో వాటా విక్రయంతో నేడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు సోమవారం 3.50శాతం నష్టాన్ని చవిచూసి రూ.1079.30 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మిడ్సెషన్ కల్లా 3.22శాతం నష్టంతో రూ.1082.80 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.738.90, రూ.1304.10గా ఉన్నాయి. ఈ మార్చి 24లో రూ.765 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. నాటి నుంచి ఏకంగా నేటి వరకు 46శాతం రికవరిని సాధించింది. -
వోడాఫోన్ ఐడియాలో లాభాల స్వీకరణ
టెలికాం రంగానికి చెందిన వోడాఫోన్ ఐడియా షేరు మంగళవారం ట్రేడింగ్లో 21.50 శాతం నష్టాన్ని చవిచూసింది. సెర్చింగ్ సంస్థ గూగుల్ ఈ కంపెనీలో 5శాతం వాటాను కొనుగోలు చేయవచ్చనే వార్తలు వెలుగులోకి రావడంతో గత 10ట్రేడింగ్ సెషన్ల్లో ఈ షేరు ఏకంగా 129శాతం లాభపడింది. ఈ నేపథ్యంలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘గతంలో నమోదైన వాల్యూయేషన్లను పరిశీలిస్తే.., కంపెనీ దివాళా తీసేందుకు ఎక్కువగా అవకాశాల ఉండేవి. కానీ ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నప్పటికీ.., కంపెనీ మనుగడ సాగించగలదని మార్కెట్ తొందరగానే గ్రహించింది. కంపెనీలో వాటా కొనుగోలుకు గూగుల్ ప్రయత్నాలు చూస్తుందనే నివేదికలతో షేరులో అప్మోవ్ ప్రారంభమైంది. ఈ రోజు మనం చూస్తున్నది లాభాల బుకింగ్.’’ అని పీఎంసీ ప్రభుదాస్ లిల్లాధర్ సీఈవో అజయ్ తెలిపారు. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.12.49 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభం నుంచి షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఒక దశలో షేరు 21.50శాతం నష్టపోయి రూ.9.41 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 3గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.11.99)తో పోలిస్తే 15.50శాతం నష్టంతో రూ.10.12 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.2.61, రూ.13.54గా నమోదయ్యాయి. -
లాభపడిన టాటా మోటర్స్ షేరు
కంపెనీ అన్ని ప్లాంట్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో టాటామోటర్స్ షేరు మంగళవారం 7.70శాతం లాభంతో ముగిసింది. కేంద్రం నిర్దేశించిన లాక్డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఝంషేడ్పూర్ ప్లాంట్తో సహా దేశవ్యాప్తంగా అన్ని ప్లాంట్లలో 2020 మే 27 నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డిమాండ్ క్రమంగా పుంజుకుంటుంది. అయితే సప్లై నుంచి కమర్షియల్ వాహన విభాగంలో 90శాతం సప్లయర్లు అనుమతులు పొందారు. 80శాతం కార్యకలాపాలు ప్రారంభించారు. మొత్తం డిమాండ్కు కేవలం 60శాతం మాత్రమే తక్షణ సప్లైకు సిద్ధంగా ఉన్నారు. లాక్డౌన్ సడలింపు తర్వాత చైనాలో వాహన అమ్మకాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రజలు షోరూమ్లకు తిరిగి వస్తుండంతో చాంగ్షు (చైనా)లోని కంపెనీ జాయింట్-వెంచర్ ప్లాంట్ మార్చి నుండి పనిచేస్తోంది. అలాగే బ్రిటన్లో సోలిహుల్ ఇంజిన్ ప్లాంట్లు, స్లోవేకియా ప్లాంట్, ఆస్ట్రియాలోని కాంట్రాక్ట్ అసెంబ్లీ లైన్లలో క్రమంగా ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాయి. ప్లాంట్ల పునఃప్రారంభ వార్తలతో షేరు మార్కెట్ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒకదశలో షేరు 8.50శాతానికి పైగా లాభపడి రూ.97.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 7.70శాతం లాభంతో రూ.96.50 వద్ద స్థిరపడింది. -
నేడు ఐటీసీ,ఆర్ఐఎల్పై ఫోకస్
క్యూ4 ఫలితాలు: 8కె మైల్స్, బ్లూ డార్ట్, కోరమాండల్ ఇంటర్నేషనల్, దీపక్ నైట్రైట్, జయప్రకాశ్ పవర్, వండరెల్లా హాలిడేస్, వీఐపీ ఇండస్ట్రీస్, టొరంట్ ఫార్మాసూటికల్స్, ఎస్హెచ్ కేల్కర్, మ్యాక్స్ ఫైనాన్షియల్లు మంగళవారం మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎవెన్యూ సూపర్ మార్ట్స్: 2019 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 41.6 శాతం పెరిగి రూ.271.28 కోట్లకు చేరిందని ఈ కంపెనీ వెల్లడించింది.అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.191.57 కోట్లుగా నమోదైంది. ఆన్మొబైల్ గ్లోబల్: కెనేడియన్ సబ్సిడరీ కంపెనీ ద్వారా టెక్నాలజీస్ రోబో కంపెనీలో 25 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఆన్మొబైల్ గ్లోబల్ వెల్లడించింది. మొబైల్స్కు కొత్త టెక్నాలజీతో గేమ్స్ అందించే లక్ష్యంతో ఈ వాటా కొనుగోలు జరిపినట్లు ఈ కంపెనీ తెలిపింది. ఐటీసీ: సన్రైజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను పూర్తిస్థాయిలో సొంతం చేసుకోనున్నట్లు ఐటీసీ వెల్లడించింది. డీసీబీ బ్యాంక్: మార్చితో ముగిసిన క్యూ4లో నికర లాభం28 శాతం తగ్గి రూ.69 కోట్లుగా నమోదైనట్లు డీసీబీ బ్యాంక్ తెలిపింది. హెచ్ఐఎల్: ఇరాన్లో మిడతలను సంహరించేందుకు 25 టన్నుల పురుగు మందులను సరఫరా చేయనున్నట్లు హెచ్ఐఎల్ వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఎంఎస్ఎంఈ, సెల్ప్హెల్ప్ గ్రూప్, అగ్రికల్చర్ అండ్ రిటైల్ రుణగ్రహీతలకు రూ.2,789 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెల్లడించింది. యూపీఎల్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.617 కోట్లకు చేరిందని యూపీఎల్ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.250 కోట్లుగా ఉంది. జేఎస్డబ్ల్యూ: 2020-21 క్యాపెక్స్ ప్రణాళికను 45 శాతం తగ్గి రూ.9,000 కోట్లుగా నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరం-21లో క్యాపెక్స్ ప్రణాళికను రూ.16,340 కోట్లుగా నిర్ణయిచింది. ట్రెంట్: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.321.64కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం రూ.418.99 కోట్లుగా ఉంది. బేయర్ క్రాప్సైన్సెస్: 2019-20 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.31.5 కోట్లుగా నమోదైనట్లు ఈ కపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.57.1 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్: కేజీ-డీ6 ఉత్పత్తికి సంబంధించి తొమ్మిదేళ్లుగా ఎదుర్కోంటున్న వివాదం నేపథ్యంలో ప్రభుత్వానికి లయబిలిటీకింద రూ.3,000 కోట్లు చెల్లించాల్సిఉంటుందని ఆర్ఐఎల్ అంచనావేస్తోంది. -
లాభాలతో మొదలైన మార్కెట్
దేశీయ మార్కెట్ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 66 పాయింట్లు పెరిగి 30262 వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు లాభంతో 8887 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. సూచీలకిది వరుసగా రెండో రోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్ 328 పాయింట్ల లాభంతో 30,524.53 వద్ద నిఫ్టీ 96 పాయింట్లు పెరిగి 8,975.50 వద్ద ట్రేడ్ అవుతోంది. అటో, ఐటీ రంగాలకు చెందిన షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ 0.79శాతం లాభంతో 17, 625 వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ పరిమితులను చాలా దేశాలు సడలించినప్పటికీ.., ఆయా దేశాలు వెలువరించిన ప్రతికూల ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహరిచాయి. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్ కొంత బలహీనంగా ఉంది. గత 2 ట్రేడింగ్ సెషన్ల నుంచి ఎఫ్పీఐల అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తుండటం మన మార్కెట్కు కలిసొచ్చే అంశంగా మారింది. ఇక బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ తో 22 కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. కోవిద్-19 వైరస్ వ్యాధి నివారణకు మోడ్నెర్ ఔషధ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయిందని అమెరికా అధికారిక మెడికల్ న్యూస్ వెబ్సైట్ ఎస్టీఏటీ ప్రకటించింది. ఫలితంగా మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్ నష్టాలను చవిచూసింది. ఈ దేశ ప్రధాన ఈక్విటీ సూచీలైన డౌజోన్స్ ఇండెక్స్ 1.50శాతం, ఎస్అండ్పీ ఇండెక్స్ 1శాతం, నాస్డాక్ ఇండెక్స్ అరశాతం నష్టంతో ముగిశాయి. ఇక ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్, తైవాన్, కొరియా దేశాల సూచీలు 1శాతం నుంచి అరశాతం వరకు లాభపడగా, చైనా, సింగపూర్, ఇండోనేషియా దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి. క్రూడాయిల్ను ఉత్పత్తి చేసే దేశాలు ఉత్పత్తిలో కోత విధించవచ్చనే అంచనాలున్పటికీ అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలతో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ చమురు ధర 34.55డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. గెయిల్, శ్రీ సిమెంట్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. కోల్ ఇండియా, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరోమోటోకార్ప్, ఇన్ఫ్రాటెల్ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. -
ఫీవర్లో మందుల్లేవ్..
నల్లకుంట: కొన్ని ఖరీదైన మందుల్లేక ఫీవర్ ఆస్పత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. డిప్తీరియా, బుల్నెక్, టెటానస్ రోగులకు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేక చిక్సితలు అందిస్తారు. ఆయా వ్యాధులతో బాధపడుతున్న రోగి గొంతు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. అలాంటి ప్రాణపాయస్థితిలో ఉండే డిప్తిరీయా రోగులకు యాంటి డిఫ్తీరియా సీరం(ఏడీఎస్ )తో పాటు క్రిస్టల్ పెన్సిలిన్(సీపీ) యాంటి బయోటిక్ తప్పని సరిగా ఇవ్వాలి. కాగా ఏడీఎస్ సీరంను మహబూబ్నగర్లోని విన్స్ బయోఫాం నుంచి ఫీవర్ ఆస్పత్రికి సరఫరా చేస్తున్నారు. సీపీ మందులను ఉత్తరాదికి చెందిన ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. దీని ఖరీదు రూ. 750 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది. సీపీ ఖరీదు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే ఆ మందులు సరఫరా చేయాలనే నిబంధనల నేపథ్యంలో నార్త్కు చెందిన ఫార్మా కంపెనీ సరఫరాను అర్థాంతరంగా నిలిపి వేసినట్లు సమాచారం. దీంతో గత నెల రోజులుగా ఆ మందులు స్టాక్ లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే డిఫ్తీరియా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం బహిరంగ మార్కెట్లో కూడా ఈ మందులు లభించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో చిన్నారులు కొందరు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. ఎంతో ముఖ్యమైన సీపీని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. బెటాడిన్ గార్గిల్ ,కార్నిటారేట్యాబ్లెట్లు నో స్టాక్.. అదే విధంగా డిఫ్తీరియా రోగులకు ఇవ్వాల్సిన బెటాడిన్ గార్గిల్ లిక్విడ్, కార్నిటారే(గుండెపై ఒత్తిడి పడకుండా చేస్తుంది) ట్యాబ్లెట్లు కూడా స్టాక్ లేదు. కార్నిటారే ట్యాబ్లెట్లకు బదులుగా ఇంజక్షన్లు ఇస్తుండడంతో కాస్తా ఊరట లభిస్తోంది. అయినా డిఫ్తీరియా రోగులు నోరు శుభ్రం చేసుకునేందుకు వినియోగించే బెటాడిన్ గార్గిల్ స్టాక్ లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. డిఫ్తీరియా బాధితుల్లో పలువురు నిరక్షరాస్యులు, మురికి వాడలకు చెందిన వారే ఉంటున్నారు. దీంతో ఈ జబ్బు బారిన పడిన వారి క్రిస్టల్ పెన్సిలిన్(సీపీ), బెటాడిన్ గార్గిల్ ,కార్నిటారే ట్యాబ్లెట్లు కూడా వాడాలని తెలియదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రిస్టల్ పెన్సిలిన్(సీపీ) మందును తెప్పించాలని రోగుల బంధువులు కోరుతున్నారు. -
కోరుకున్న బీరు బ్రాండ్ దొరకడం కష్టమే...
సాక్షి సిటీబ్యూరో: ఎండల వేడి తారాస్థాయికి చేరింది. ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బీరు తాగి ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాలనుకున్న మద్యం ప్రియులకు మద్యం దుకాణాలు, బార్లలో బీర్లు నో స్టాక్ అనే సమాధానం వినిపిస్తుంది.దీంతో నిరాశకు లోనవుతున్నారు. వేసవిలో బీర్ల అమ్మకాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. వేసవిలో పలువురు విస్కీ, రమ్ము తదితరాలకంటే బీర్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత ఉన్నప్పటికీ గ్రేటర్ పరిధిలో సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఉత్పత్తి తగ్గినందునే ఎండాకాలంలో బీర్లకు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ అందుకు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో మద్యం ప్రియులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీర్ల ఉత్పత్తికి అధికంగా నీరు అవసరం అవుతుంది. ఎండలతో జలాశయాలు, నదులు ఎండిపోవడంతో బీర్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి 5 బీర్లు ఉత్పత్తి చేసే కంపెనీలకు నీటి సరఫరా జరుగుతుంది. అయితే జలాశయంలో నీరు లేకపోవడంతో కంపెనీలకు సరఫరా నిలిపివేశారు. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాల్సి వస్తోంది. 10 నుంచి 20 శాతం మాత్రమే సరఫరా.. గతంలో బేవరేజెస్ కార్పోరేషన్ ద్వారా 100 కార్టన్ల బీర్లు సరఫరా చేసే వైన్స్, బార్లకు ఆర్డర్ చేసిన మొత్తంలో 10 నుంచి 25 శాతం వరకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. గతంలో వారానికి రెండు సార్లు బేవరేజెస్ గోదాంల నుంచి బీర్ల సరఫరా జరిగేది. ప్రస్తుతం ఇండెంట్ పెట్టినా ఒకేసారి సరిపడిన స్టాక్ ఇవ్వకపోవడం, ఆర్డర్ చేసిన దాంట్లో కొంత మాత్రమే స్టాక్ ఇవ్వడంతో ప్రతి రోజు బీర్ల స్టాక్ కోసం గోదాంలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో దుకాణ దారులపై చలాన్, గేట్ పాస్, రవాణా ఇతర చార్జీల పేరుతో అదనపు భారం పడుతోంది. బీర్ల ప్రియులు అధికంగా ఇష్టపడే బ్రాండ్ల బీర్లు దొరకడం కష్టంగా మారింది. వైన్స్, బార్లకు 10 నుంచి 25 శాతం వరకే సరఫరా చేస్తుండటంతో కొన్ని గంటల వ్యవధిలోనే స్టాక్ అయిపోతోంది. దీంతో దుకాణాల యజమానులు బీర్ల ప్రియులు అడిగిన బ్రాండ్ను ఇవ్వలేకపోతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందాలనుకునే వారు ఇష్టపడే బ్రాండ్ దొరకకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వాటితో సరిపెట్టుకుంటున్నారు. వర్షాలు కురిసి జలాశయాల్లో నీరు చేరి బీర్ల ఉత్పత్తి పెరిగితేనే సమస్య తీరుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
ఫలితాల దెబ్బ: పీఎన్బీ షేరు పతనం
సాక్షి, ముంబై: అతిపెద్ద బ్యాంకు కుంభకోణంలో ఇరుక్కున్న దేశీయ రెండో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ను నష్టాలు వదిలిపెట్టడం లేదు. వరుసగా రెండవ క్వార్టర్లో కూడా నష్టపోవడంతో పీఎన్బీ షేరు భారీగా నష్టపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆ బ్యాంకు భారీగా నష్టాలను చవి చూవడడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో పీఎన్బీ షేరు ఒక దశలో దాదాపు 9శాతం కుప్పకూలింది.. చివరికి 7శాతం నష్టంతో రూ.82.90 వద్ద ముగిసింది. జూన్ 30తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.940 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పీఎన్బీ నికర లాభం కేవలం రూ.343 కోట్లు మాత్రమే. ఇక మొత్తం ఆదాయం రూ.15,072 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది పీఎన్బీ ఆదాయం రూ.14,468గా ఉంది. మార్చితో ముగిసిన గత త్రైమాసికంలో బ్యాంక్ 13,417 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఇక మొండి బకాయిలు 18.26 శాతం పెరిగినట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. -
వరదలో చిక్కుకున్న పోలీసు వాహనం
-
పీసీ జువెల్లరీ షేర్ బైబ్యాక్, స్టాక్ ర్యాలీ
న్యూఢిల్లీ : ప్రముఖ జువెల్లరీ సంస్థ పీసీ జువెల్లరీ షేర్ బైబ్యాక్ ప్రకటించింది. రూ.424 కోట్ల విలువైన బైబ్యాక్ చేపడుతున్నట్టు పీసీ జువెల్లరీ పేర్కొంది. ఒక్కో యూనిట్ ధర రూ.350గా నిర్ణయించింది. ఇది గురువారం స్టాక్ ముగింపు ధర 209 రూపాయలకు 67 శాతం అధికం. గురువారం జరిగిన బోర్డు మీటింగ్లో 1.21 కోట్ల షేర్ల బైబ్యాక్ను ఆమోదించినట్టు ఈ జువెల్లరీ సంస్థ తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్లో ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూప్ పాల్గొనదు. మార్చి క్వార్టర్ డేటా ప్రకారం ఈ కంపెనీలో ప్రమోటర్లు 57.63 శాతం వాటాను కలిగి ఉన్నారు. షేర్ బైబ్యాక్ ప్రకటనతో కంపెనీ స్టాక్ ప్రారంభ ట్రేడింగ్లోనే 18 శాతం పైకి ఎగిసింది. ఇంట్రాడేలో రూ.247 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. గత కొన్ని సెషన్లలో ఈ కంపెనీ షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. కానీ ఆరు ట్రేడింగ్ సెషన్ల నుంచి మాత్రం పీసీ జువెల్లరీ స్టాక్ సుమారు 88 శాతం ర్యాలీ జరుపుతూ వస్తోంది. మే 2న రూ.110.65గా ఉన్న పీసీ జువెల్లరీ స్టాక్, మే 10 తేదీకి రూ.209కు పెరిగింది. కానీ మే 3 తేదీన మాత్రం స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయిలకు పడిపోయింది. మరోవైపు మరికొన్ని రోజుల్లో కంపెనీ తన మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించబోతోంది. 2018 మే 25న బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ సమావేశంలోనే 2017 ఏప్రిల్ నుంచి 2017 సెప్టెంబర్ 1 మధ్య వరకు ఉన్న ప్రిఫరెన్స్ షేర్లపై డివిడెండ్ ప్రతిపాదనలను నిర్ణయించనున్నారు. పీసీ జువెల్లరీ ప్రస్తుతం మార్కెట్లో జువెల్లరీలను తయారీచేయడం, రిటైల్ చేయడం, ఎగుమతి చేయడం వంటి వ్యాపారాలను చేస్తోంది. 2005లో ఏర్పాటైన ఈ సంస్థ, దేశీయంగా రెండో అతిపెద్ద లిస్టెడ్ జువెల్లరీ రిటైలర్గా ఉంది. -
మెగాస్టార్ సంపద ఎంత పెరిగిందంటే..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ పెట్టుబడుల్లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ పెట్టుబడుల ద్వారా ఆర్జనలో కూడా బిగ్ బి అనిపించుకున్నారు. అటు నటలోనూ, ఇటు సంపదని నిర్మించుకోవడంలోనూ మెగాస్టార్గా నిలిచారు. బిగ్ బి కుటుంబానికి చెందిన షేర్ల పెట్టుబడి విలువ రెండున్నర సంవత్సరాలలో భారీ పెరుగుదలను నమోదు చేసింది. రెండు సంవత్సరాల క్రితం 250,000 డాలర్లుగా ఉన్న సంపద కాస్తా ఇపుడు 17.5 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరైజ్డ్ రెమిటన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) ద్వారా విదేశీ కంపెనీలో తొలి ముఖ్యమైన ఈక్విటీ పెట్టుబడులు పెట్టారు. తండ్రి-కొడుకు ద్వయం, (అమితాబ్,అభిషేక్)లు మెరీడియన్ టెక్ పిటీ లిమిటెడ్ 250,000డాలర్ల (దాదాపు రూ. 1.57 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. ఇటీవల ఈ స్టాక్ బాగా పుంజుకోవడంతో సంపద 17.5మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.113కోట్లకు) చేరింది. అమితాబ్ ఖాతా ద్వారా 150,000 డాలర్లు, అమితాబ్ , అభిషేక్ల జాయింట్ అకౌంట్ ద్వారా లక్ష డాలర్ల పెట్టుబడులున్నాయని మెరిడియన్ టెక్ స్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట శ్రీనివాస్ మీనావల్లి ప్రకటించారు. అయితే మెరిడియన్ టెక్ అంత పాపులర్ స్టాక్ కాదు. ఇటీవల మెరీడియన్కు చెందిన జిద్దు.కామ్ను మరో విదేశీ సంస్థ లాంగ్ ఫిన్ కార్ప్ కొనుగోలు చేసింది. అమెరికన్ స్టాక్మార్కెట్ నాస్డాక్లో లిస్ట్ అయిన రెండు రోజుల తర్వాత ఈ స్టాక్ అనూహ్యంగా లాభపడింది. దీంతో లాంగ్ ఫిన్ కార్ప్ లో బిగ్ బి కుటుంబం షేర్ విలువ అమాంతం పెరిగింది. కాగా 2017, డిసెంబరు లో జిడ్డు.కామ్ బ్లాక్ చైన్ లేదా క్రిప్టోకరెన్సీ టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్స్ ప్రొవైడర్గా స్వయంగా ప్రకటించుకుంది. అంటే క్రిప్టోకరెన్సీ ద్వారా వివిధ ఖండాల్లో సూక్ష్మ రుణాలను అందిస్తుంది. కాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రిప్టోకరెన్సీ మానియా నేపథ్యంలో లాంగ్ఫిన్ స్టాక్ వెయ్యి శాతం కంటే ఎక్కువ లాభపడింది. -
అమెజాన్ సీఈవో బెజోస్ కీలక నిర్ణయం
అంతరిక్షంలోకి టూరిస్టులను షికారు కొట్టించేందుకు ఉరకలు పెడుతున్న అమెజాన్ సహ వ్యవస్తాపకుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కలల ప్రాజెక్టు బ్లూ ఆరిజన్ రాకెట్ కంపెనీ కోసం అమెజాన్ భారీ వాటాలను విక్రయించనున్నారు. సంవత్సరానికి సుమారు రూ.65వేలకోట్లు (1 బిలియన్ డాలర్లు) విలువైన అమెజాన్ షేర్లను విక్రయించనున్నట్టు బుధవారం బెజోస్ ప్రకటించారు. ఈ నిధులను బ్లూ ఆరిజన్ కోసం వెచ్చించనున్నట్టు ప్రపంచ కుబేరుల్లో ఒకడు, వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అధిపతి కూడా అయిన బెజోస్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మనుషుల్ని చంద్రుడిపైకి తీసుకెళ్లే సర్వీసులను అందుబాటులోకి తేనుంది. భూమికి వంద కిలోమీటర్ల ఎత్తువరకూ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 2017 లో 11 నిమిషాల అంతరిక్ష యాత్రను లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వచ్చే ఏడాది వరకు ఇది సాధ్యంకాకపోవచ్చని బెజోస్ తెలిపారు. కొలరాడో స్ప్రింగ్స్ (అమెరికా)లో 33వ స్పేస్ సింపోజియం సందర్భంగా మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్పేస్కి చేరడానికి చాలా సమయం పడుతుందనీ, అయినా బ్లూ ఆరిజన్ లో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. చివరికి బ్లూ ఆరిజిన్ స్వీయ-సమృద్ది తో లాభదాయంగా ఉండాలనేది తమ లక్ష్యమని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు అతితక్కువ ఖర్చుకే అంతరిక్ష విమాన సౌకర్యాన్ని కల్పించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో ఉన్నట్టు బెజోస్ చెప్పారు. స్పేస్ ఎక్స్ సంస్థ సిద్ధం చేసిన క్రూడ్రాగన్ క్యాప్సూల్ తో పోలిస్తే న్యూషెపర్డ్ ఇంజనీరింగ్ కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పారు. శాటిలైట్లను, మానవులను ఆర్బిట్ లోకి తీసుకెళ్లేందుకు బ్లూ ఆరిజన్ స్పేస్ ఎక్స్ఫాల్కన్ 9, డ్రాగన్ క్యాప్సూల్ లాంటి రెండవ అంతరిక్షనౌక ను సిద్ధం చేస్తోంది. న్యూ గ్లెన్ అని చెబుతున్న దీనికయ్యే ఖర్యును 2.5 బిలియన్డాలర్లుగా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫోర్బ్స్ పత్రిక ప్రకారం, బెజోస్ నికర సంపద 78 బిలియన్ డాలర్లు. న్యూషెపర్డ్గా పిలిచే అంతరిక్ష నౌకను ఇప్పటికే ఐదుసార్లు విజయవంతంగా పరీక్షించి చూశారు. మొత్తం ఆరుగుర్ని తీసుకెళ్లకలిగే షెపర్డ్ టికెట్ల అమ్మకాలను బ్లూఆరిజన్ ఇకా మొదలు పెట్టలేదు. -
38 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జంగారెడ్డిగూడెం : స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని ఒక షాపులో అక్రమంగా నిల్వచేసిన 38 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎస్ఐ ఎం.కేశవరావు తమ సిబ్బందితో దాడిచేసి బుధవారం పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. సివిల్ సప్లయిస్ డీటీ డి.వి.సత్యనారాయణ, వీఆర్వోలు రవి, గఫూర్ , ఎస్కే వలి, కె.రవి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు డీటీ సత్యనారాయణ వెల్లడించారు. -
బాణాసంచా అక్రమ నిల్వలపై దాడులు చేయండి
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశం కర్నూలు: దీపావళికి లైసెన్స్ లేకుండా బాణాసంచా అక్రమంగా నిల్వ ఉంచిన గోదాములపై దాడులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం అన్ని జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాయలసీమ ఐజీ శ్రీధర్రావు, ఎస్పీ ఆకే రవికృష్ణ, అదనపు ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నేరాల అదుపునకు అధునాతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్లలో పనితీరులో మార్పు రావాలన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడరాదన్నారు. ఆర్ఎఫ్ఎస్ఎల్లో విలువైన ప్రాపర్టీని నిరుపయోగంగా ఉంచుకోకుండా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ రిక్రూట్మెంట్కు శిక్షణ కేంద్రాలను సిద్ధం చేయండి రాబోయే పోలీసు రిక్రూట్మెంట్ శిక్షణకు డీటీసీ, పీటీసీ శిక్షణ కేంద్రాలను సిద్ధం చేసి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రాబోయే పోలీస్ రిక్రూట్మెంట్ డిజిటలైజ్గా జరగాలని ఆదేశించారు. జేఎన్టీయూ కాకినాడ వారు ఈ పరీక్షలను నిర్వహిస్తారని వెల్లడించారు. ఏపీఎస్ఎల్ పీఆర్బీ పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ అతుల్సింగ్ వీడియో కాన్ఫరెన్స్లో పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పోలీస్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ వివరాలను జిల్లాల వారీగా పోలీసు అధికారులకు వెల్లడించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, ఏజీ కృష్ణమూర్తి, రాజశేఖర్రాజు, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు కృష్ణయ్య, పవన్కిషోర్, పార్థసారధి, రామాంజనేయులు, సూపరింటెండెంట్ చంద్రశేఖరయ్య, ఆర్ఐలు రంగముని, జార్జి, ఈకాప్స్ ఎస్ఐ రాఘవరెడ్డి, డీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ నిల్వదారులపై కేసు
కొవ్వూరు : వాడపల్లి ర్యాంపులో ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై డి.గంగాభవానీ తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. కూనల రెడ్డి, మెల్లిన హనుమంతరావు, కరుటూరి రాంబాబు, కరుటూరి కాశీవిశ్వనాథం, ప్రగడ నాగయ్య, ప్రగడ వీర్రాఘవులు, బొల్లా ఆంజనేయులు ప్రభుత్వ ఉత్తర్వులను లెక్క చేయకుండా మూసివేసిన వాడపల్లి ర్యాంపులో ఇసుక నిల్వ చేస్తూ.. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. శుక్రవారం వీరు ఏడు పడవల్లో కూలీలను పెట్టి ఇసుక తవ్వకాలు చేసి ర్యాంపుల్లో గుట్టలుగా పోశారు. దీనిపై వాడపల్లి వీఆర్ఏ చెల్లె జగజ్జీవన్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
కార్లలో ‘లగ్జరీ’ వాటా పెరగాలి..
-
కార్లలో ‘లగ్జరీ’ వాటా పెరగాలి..
ఆడి ఇండియా హెడ్ జో కింగ్ • దేశీయంగా వృద్ధికి అపార అవకాశాలు • తృతీయ శ్రేణి పట్టణాలపైనా దృష్టి • స్వల్పకాలిక నిర్ణయాలతో పరిశ్రమలో అనిశ్చితి • విధానాల్లో స్పష్టత ఉంటే ప్రయోజనకరం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా ప్యాసింజర్ కార్ల మార్కెట్లో లగ్జరీ కార్ల మార్కెట్ 15 శాతం దాకా ఉంటుండగా.. ఇండియాలో మాత్రం ఇది కేవలం ఒక్క శాతంగానే ఉంది. అందుకే దేశీ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా మొబైల్ టెర్మినల్ తదితర ప్రయోగాలతో కస్టమర్లకు చేరువయ్యేందుకు జర్మనీ కార్ల దిగ్గజం ‘ఆడి’ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపైనా మరింతగా దృష్టి సారిస్తోంది. దేశీ లగ్జరీ కార్ల మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునే క్రమంలో ఎదురవుతున్న సవాళ్లు, అనుసరిస్తున్న వ్యూహాలపై ‘ఆడి’ ఇండియా హెడ్ జో కింగ్.. సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ప్రత్యేక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... దేశీ లగ్జరీ కార్ల మార్కెట్ ఎలా ఉంది? దేశీయంగా మొత్తం కార్ల మార్కెట్లో లగ్జరీ కార్ల విక్రయాలు దాదాపు 35,000 యూనిట్ల మేర .. అంటే సుమారు 1.3 శాతం స్థాయిలో ఉన్నాయి. మిగిలిన దేశాల్లో ఇవి 10-15% మధ్య ఉన్నాయి. కాబట్టి మున్ముందు ఈ సెగ్మెంట్ బాగా పెరుగుతుంది. సరైన ఉత్పత్తులు, పటిష్టమైన డీలర్ నెట్వర్క్, బ్రాండ్తో కస్టమర్లకు అనుబంధాన్ని పెంచడం వంటి వ్యూహాలను పాటిస్తే విక్రయాలు పెంచుకోవచ్చు. నియంత్రణలు, డిమాండ్ పరమైన సవాళ్లు ఎక్కువే ఉన్నట్టున్నాయి!! అవును! విధానాలపరంగా స్వల్పకాలిక నిర్ణయాల వల్ల తయారీ సంస్థలు, డీలర్లు, కొనుగోలుదారులు అనిశ్చితి ఎదుర్కొంటున్నారు. విధానాల్లో స్పష్టత ఉంటే కస్టమర్ల డిమాండ్కి తగినట్లుగా మా వ్యూహాలను సవరించుకునే వీలుంటుంది. వ్యాపార వాతావరణం దెబ్బతినకుండా పర్యావరణ సమస్యల పరిష్కారంపై బహుళవిధాన వ్యూహం అమలు చేయాల్సిన అవసరముంది. బడ్జెట్లో ఇన్ఫ్రా సెస్సు విధించడం పరిశ్రమకు కాస్త ప్రతికూలమే. అయితే జీఎస్టీ అమల్లోకి వస్తే ఎకానమీకి మంచి జరుగుతుంది. ఢిల్లీలో డీజిల్ కార ్లను నిషేధించారు కదా? ఆ ప్రభావం మీపై ఉంటుందా? ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దాదాపు ఏడాది పాటు డీజిల్ కార్లపై నిషేధం కొనసాగినపుడు మార్కెట్ గణనీయంగా క్షీణించి 10-15 శాతం మేర తగ్గింది. ఇది అనిశ్చితికి దారి తీసింది. నిజం చెప్పాలంటే ఒక్కసారిగా ఈ మార్పును ఎదుర్కొనడం మాకూ కష్టమే. అప్పటికప్పుడు అన్ని మోడల్స్లోనూ పెట్రోల్ వెర్షన్లను ప్రవేశపెట్టడానికి మా ఉత్పత్తి షెడ్యూల్స్ సహకరించే పరిస్థితి లేదు. ఈ విధంగా .. ఏడాదంతా సవాలుగానే గడిచింది. కాకపోతే మా మెజారిటీ మోడల్స్లో పెట్రోల్ ఇంజిన్లుండటం మాకు కలిసొచ్చే అంశం. పెట్రోల్ కార్ల డిమాండ్ను అందుకునేలా మా ఉత్పత్తిని సవరించుకుంటున్నాం. బీఎస్4 కాలుష్య ప్రమాణాలను స్వాగతిస్తున్నాం. దీనివల్ల సంక్లిష్టత.. అలాగే ఖరీదు గణనీయంగా తగ్గుతుంది కాబట్టి ఇది మాకు ప్రయోజనకరమే. దేశంలో తయారీ, అసెంబ్లింగ్ను పెంచుకునే అవకాశాలున్నాయా? గతేడాది భారత్లో విక్రయించిన కార్లలో దాదాపు 95% పైగా ఇక్కడ నిర్మించినవే. ప్రస్తుతం ఔరంగాబాద్ ప్లాంటులో ఆడి ఏ3 సెడాన్, ఏ4, ఏ6, క్యూ3, క్యూ5, క్యూ7 మోడల్స్ను అసెంబుల్ చేస్తున్నాం. సింగిల్ షిఫ్టులో ఏటా 14,000 యూనిట్ల సామర్ధ్యంతో పనిచేస్తున్నాం. స్థానికంగా తయారీ పరిమాణాన్ని పటిష్టంగా, లాభదాయకంగా పెంచే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పండుగల సీజన్లో కొత్త కార్లేమైనా తెస్తున్నారా? ఆఫర్లు లాంటివి... ఈ సీజన్లో మా పాపులర్ మోడల్ ఆడి క్యూ3పై వివిధ నగరాల్లో ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాం. కొత్త కార్ల విషయానికొస్తే.. అత్యంత శక్తిమంతమైన నెక్ట్స్ జనరేషన్ ఆడి ఆర్8 వీ10 ప్లస్ను, అత్యంత సురక్షితమైన ఏ8 ఎల్ సెక్యూరిటీ మోడల్స్ను ఆటో ఎక్స్పో 2016లో ఆవిష్కరించాం. అటుపైన ఏ6 35 మేట్రిక్స్ టీఎఫ్ఎస్ఐ, సరికొత్త ఆడి ఏ4ను ఇటీవలే ప్రవేశపెట్టాం. త్వరలో మరిన్ని ఆకర్షణీయమైన కార్లను తేబోతున్నాం. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో లగ్జరీ కార్లకు డిమాండ్ ఎలా ఉంది? ప్రస్తుతం చిన్న పట్టణాల్లోనూ ఆడి వంటి లగ్జరీ కార్లను కొనే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రో నగరాలపైనే కాకుండా ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల్లోని డీలర్షిప్లపైనా దృష్టి పెడుతున్నాం. హైదరాబాద్ మాకు కీలక మార్కెట్. ఇక్కడ పుష్కలంగా వ్యాపార అవకాశాలున్నాయి కనక అధిక ప్రాధాన్యమిస్తున్నాం. సర్టిఫైడ్ కార్ల విభాగం ఎలా నడుస్తోంది? ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. 2012లోనే మేం ‘ఆడి అప్రూవ్డ్:ప్లస్’ పేరిట గుర్గావ్లో ప్రీ-ఓన్డ్ కార్ల షోరూమ్ను ప్రారంభించాం. ఇటీవలే బైబ్యాక్ స్కీమ్ ప్రవేశపెట్టాం. కస్టమర్ తన పాత కారునిచ్చేసి కొత్త కారు ఈజీగా కొనుక్కునేలా ఈ స్కీమ్ను రూపొందించాం. మార్కెట్ వాటా పెంచుకోవటానికి మీ వ్యూహమేంటి? వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటువంటి లగ్జరీ కార్లను సొంతం చేసుకోవాలని భారత్లో కార్ల కొనుగోలుదారులు భావిస్తున్నారు. వారికి కావాల్సిన వాహనాలివ్వటానికి ప్రయత్నిస్తున్నాం. పారిశ్రామికవేత్తలే కాదు... వారి పిల్లలూ మా కార్లు కొంటున్నారు. మా బ్రాండ్పై ఆసక్తి ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కస్టమర్ల ముంగిటకే షోరూమ్ను అందుబాటులోకి తెచ్చేలా ఆడి మొబైల్ టెర్మినల్ను ప్రవేశపెట్టాం. అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్ ఈవెంట్స్లో పాలుపంచుకునే అవకాశం కల్పించే ఆడి క్లబ్ ఇండియాను ప్రారంభించాం. మా కార్లలో డ్రైవింగ్ అనుభూతిని తెలియజేసేటువంటి క్యూ డ్రైవ్, ఆర్డ్రైవ్ వంటి ప్రోగ్రామ్లు నిర్వహిస్తున్నాం. -
అప్పుడు లేవన్నారు.. ఇప్పుడు పారేశారు
జూలైతో వాడకం గడువు ముగిసిన ఔషధాలు పడేసిన వైనం మందులు ఉన్నా.. రోగులకు అందించని వైద్య సిబ్బంది ములుగు : అది ములుగు ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి. అక్కడికి వెళితే డాక్టర్ పరీక్షించి మందులు రాస్తారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత జరిగే కథే వేరు. చిన్నపాటి జ్వరానికి సంబంధించిన ఇంజక్షన్ కూడా బయట వేయించుకోమంటూ ఉచిత సలహాలను రోగుల మెుహాన పడేస్తారు. మందులను ప్రైవేట్ మెడికల్ షాపుల్లో తీసుకోమంటూ దవాఖాన సిబ్బంది ప్రబోధాలుచేసేస్తారు. ఎవరైనా రోగులు ధైర్యం చేసి నిల దీస్తే మాత్రం.. ఆస్పత్రి సిబ్బంది ‘మందుల స్టాక్ లేదు’ అంటూ కుండబద్దలు కొట్టేస్తారు. గత గురువారం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ దవాఖానను సందర్శించారు.lఆ సమయంలో ములుగు ఆస్పత్రిలో ఔషధాల పంపిణీ పడకేసిన తీరుపై రోగులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గత జూలైతో వాడకం గడువు(ఎక్స్పరీ డేట్) ముగిసిన మందులను ఆస్పత్రి వెనుకభాగంలో పారవేశారు. అంటే ఆస్పత్రిలో మందులు ఉన్నా.. రోగులకు ఇవ్వడం లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమా ధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. -
పాతవే ఖాళీ.. కొత్తవెందుకు మళ్లీ?
జిల్లాలో 92,500 మెట్రిక్ టన్నుల సామర్థ్య గోదాంలు పూర్తికావొచ్చిన 45 నూతన గోడౌన్ల నిర్మాణం కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తేనే రైతులకు ఉపయోగం వరంగల్ సిటీ : ఏ పనైనా అవసరం మేరకు చేస్తేనే ఉపయోగం ఉండడమే కాకుండా.. ఆ పని చేసినందుకు ఫలితం దక్కుతుంది. కానీ ప్రభుత్వం మంజూరు చేసింది కదా అని అవసరం లేదనే చెప్పే ధైర్యం లేకో.. మరేదైనా కారణమో తెలియదు కానీ భారీగా సరుకులు నిల్వ చేసే గోదాంల నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ అధికారులు సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఇప్పటికే పెద్దసంఖ్యలో గోదాంలు.. అదీ వేల మెట్రిక్ టన్నుల సరుకులు నిల్వ చేసే సామర్థ్యం గల గోదాంలు ఉన్నాయి. ఇందులో చాలావరకు సరుకులు నిల్వ చేయకపోగా.. వృథాగా మారాయి. అయినా మరో 45 గోదాంలు నిర్మాణం చేపడుతుండడం గమనార్హం. ఇవి కాకుండా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి నిల్వ చేసుకునేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తే అటు రైతులకు ఉపయోగం.. ఇటు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి పేరు దక్కేది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. 93 గోదాంలు... జిల్లాలో ఇప్పటికే 92,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన 93 గోదాములు ఉన్నాయి. వీటన్నింటిల్లో ఎప్పుడు కూడా 50వేల మెట్రిక్ టన్నుల పంట సరుకులు నిల్వ చేసిన పరిస్థితి లేదు. అయినా జిల్లాలో మరో 45 భారీ గోదాంలు నిర్మిస్తున్నారు. దాదాపు 5వేల నుంచి 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల వీటి నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ఇవన్నీ పూర్తయితే 2,17,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యానికి పాతవి కలిస్తే 3లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాంలు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ఇప్పటికే గోదాంలు వృథాగా ఉంటుండగా.. కొత్తవి నిర్మాణం జరిగాక ఇందులో ఏం నిల్వ చేస్తారో అధికారులే చెప్పాల్సి ఉంది. మార్కెట్లోనే 44వేల మెట్రిక్ టన్నులు వరంగల్ వ్యవసాయ మార్కెట్లోనే 34వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాంలు ఉన్నాయి. దీనికి తోడు మార్కెట్ సమీపంలోని ముసలమ్మకుంట ప్రాంతంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భారీ గోదాం నిర్మాణం పూర్తికావొస్తోంది. ఇప్పటికే ఉన్న గోదాంలను ఎన్నికల సమయంలో ఈవీఎం స్ట్రాంగ్ రూంలుగా, భద్రతా సిబ్బందికి షెల్టర్లుగా ఉపయోగిస్తున్నారు. ఆ ఆలోచన ఎందుకు రాలేదు? అవసరం లేకున్నా గోదాంలు నిర్మాణానికి సిద్ధమైన మార్కెటింగ్ శాఖ అధికారులు కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ఎందుకు దృష్టిసారించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పెద్దమెుత్తంలో గోదాంలో ఖాళీగా ఉంటుండగా.. కొత్త వాటి నిర్మాణంతో రైతులకే కాదు ఎవరికీ ఉపయోగం ఉండదనేది సుస్పష్టం. వీటికి బదులుగా కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తే పత్తి, మిర్చి తదితర పంటలకు తక్కువ ధర ఉన్నప్పుడు రైతులు నిల్వ చేసుకునే వీలు కలిగేది. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో ఎక్కువ కిరాయి చెల్లిస్తూ ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా మార్కెటింగ్ అధికారులు కోల్డ్ స్టోరేజీలు కాకుండా.. పెద్దసంఖ్యలో గోదాంల నిర్మాణానికి సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. -
వారికి మద్యం స్టాకు విడుదల చేయాలి
ఎక్సైజ్ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మద్యం సీసాలపై బార్ కోడ్ నిమిత్తం షాపుల్లో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకుని, కోర్టును ఆశ్రయించిన వారికి మద్యం స్టాకు విడుదల చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సాఫ్ట్వేర్ ఏర్పాటుకు సంబంధించి కార్వీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్తో ఒప్పందం చేసుకోవాలంటూ పిటిషనర్లను బలవంతం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. బార్కోడ్ నిమిత్తం స్కానర్లు, సాఫ్ట్వేర్ ఏర్పాటు కోసం కార్వీ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తూ మద్యం స్టాకులు విడుదల చేయటం లేదని పలువురు మద్యం దుకాణాల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. -
స్టాక్ మార్కెట్లకు బిహార్ షాక్
-
స్టాక్ మార్కెట్లకు బిహార్ షాక్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎన్డీయేకు ఊహించని ఓటమి ఎదురవడంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనం దిశగా పయనిస్తున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచే నష్టాల దశగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత ఇంత భారీ పతనం ఇదే తొలిసారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 26వేల మార్కు కంటే కూడా 600 పాయింట్ల దిగువకు సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ కూడా 180 పాయింట్లు నష్టపోయి 7,790 వద్ద ట్రేడయింది. రూపాయి కూడా బాగా దెబ్బతింది. ఉదయం ట్రేడింగులో 1 శాతం నష్టపోయి డాలర్తో పోలిస్తే 66.50 వద్ద ట్రేడయింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే దారుణ ఓటమితో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉందని ట్రేడర్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా మోదీ కూటమి గెలుస్తుందనే అంచనాలతో మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నాయని, కానీ తాజా ఫలితాల తర్వాత ఒక్కసారిగా పడ్డాయని మార్కెట్ నిపుణుడు అంబరీష్ బాలిగ అన్నారు. అయితే ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమేనని, త్వరలోనే మార్కెట్లు కోలుకుంటాయని భావిస్తున్నారు. ఉదయం 10.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 292 పాయింట్ల నష్టంతో 25973.20 వద్ద, నిఫ్టీ 91.70 పాయింట్ల నష్టంతో 7862.60 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. -
ఆర్కామ్ చేతికి ‘సిస్టెమా’
ఒప్పందం విలువ దాదాపు రూ. 4,500 కోట్లు * స్టాక్, స్పెక్ట్రమ్ ఫీజు చెల్లింపు రూపంలో డీల్ న్యూఢిల్లీ: దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) .. తాజాగా సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ను (ఎస్ఎస్టీఎల్) కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ దాదాపు 690 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,500 కోట్లు)గా ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. స్టాక్ మార్పిడి, రూపంలో ఈ డీల్ ఉంటుందని ఆర్కామ్ సోమవారం తెలిపింది. దీని ప్రకారం సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ (ఎస్ఎస్టీఎల్)కు ఆర్కామ్లో 10 శాతం వాటాలు దక్కుతాయి. డీల్ పూర్తి కావడానికి ముందు తనకున్న దాదాపు 500 మిలియన్ డాలర్ల రుణాలను తీర్చేసేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రం ఎస్ఎస్టీఎల్ ద్వారా వచ్చే స్పెక్ట్రమ్కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాయిదాలను ఏటా రూ. 392 కోట్లు చొప్పున పదేళ్ల పాటు ఆర్కామ్ కడుతుంది. సిస్టెమా శ్యామ్ ప్రస్తుతం తొమ్మిది సర్కిల్స్లో ఎంటీఎస్ బ్రాండ్ కింద సర్వీసులు అందిస్తోంది. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ దేశీ టెలికం రంగం పురోగమిస్తోందనడానికి రెండు సంస్థల విలీన మే నిదర్శనమని సిస్టెమా ప్రెసిడెంట్ మిఖాయిల్ షమోలిన్ పేర్కొన్నారు. విలీనంతో రెండు కంపెనీలకు పరస్పర ప్రయోజనం చేకూరగలదని ఆర్కామ్ సీఈవో గుర్దీప్ సింగ్ చెప్పారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో డీల్ పూర్తి కాగలదని అంచనా. ఆర్కామ్కు ప్రయోజనాలు.. ఈ ఒప్పందంతో ఆర్కామ్ ఖాతాలో సుమారు 90 లక్షల కస్టమర్లు, దాదాపు రూ. 1,500 కోట్ల వార్షికాదాయాలు దఖలుపడతాయి. తద్వారా సంస్థ మొత్తం యూజర్ల సంఖ్య 11.8 కోట్లకు చేరుతుంది. అలాగే, 4జీ సేవలకు ఉపయోగపడే 850 మెగాహెట్జ్బ్యాండ్ స్పెక్ట్రం కూడా ఆర్కామ్కు లభిస్తుంది. భారీ ఆదాయాన్నిచ్చే ఢిల్లీ, గుజరాత్ తదితర 8 సర్కిల్స్లో సంస్థ లెసైన్సు కాలం సైతం 12 సంవత్సరాల మేర 2021 నుంచి 2033 దాకా పెరుగుతుంది. ఇక డీల్ ముగిసిన తర్వాత ఎస్ఎస్టీఎల్లోని మైనారిటీ ఇన్వెస్టర్లు.. తమ షేర్లకు బదులుగా ప్రో-రేటా ప్రాతిపదికన ఆర్కామ్ షేర్లను పొందే వెసులుబాటు ఉంటుంది. ఎస్ఎస్టీఎల్లో రష్యాకు చెందిన ఏఎఫ్కే సిస్టెమాకు 56.68 శాతం, రష్యా ప్రభుత్వానికి 17.14%, భారతీయ సంస్థ శ్యామ్ గ్రూప్నకు 23.98% వాటాలు ఉన్నాయి. మిగతా వాటాలు చిన్న ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. ఎస్ఎస్టీఎల్ రుణభారం, ఇతరత్రా చెల్లించాల్సినవి సుమారు రూ. 3,200 కోట్ల మేర ఉండగా, ఆర్కామ్ రుణ భారం రూ. 32,000 కోట్లుగా ఉంది. 2014-15లో ఆర్కామ్ ఆదాయాలు రూ. 21,423 కోట్లు కాగా, నికర లాభం రూ. 620 కోట్లు. అన్లిస్టెడ్ కంపెనీ అయిన ఎస్ఎస్టీఎల్ 2014 ఆదాయాలు రూ. 1,347 కోట్లు. -
ఆరంభ లాభాలు ఆవిరి
- 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,610కు సెన్సెక్స్ ముంబై: పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెలువడనున్న (మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి)నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడంతో స్టాక్మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. ఫెడ్ భయాలు కూడా ప్రభావం చూపాయి. ఒక దశలో 250 పాయింట్లకు పైగా లాభపడిన సెనెక్స్ చివరకు 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,610 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 1 పాయింటు లాభపడి 7,789 పాయింట్ల వద్ద ముగిసింది. యాపిటల్ గూడ్స్, లోహ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు తమ ప్రారంభ లాభాలను కోల్పోయాయి. కాగా టెక్నాలజీ, కొన్ని ఫార్మా షేర్లు మాత్రం లాభపడ్డాయి. కాగా నాలుగు వారాల నష్టాలకు ఈ వారంలో బ్రేక్ పడింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 408 పాయింట్లు(1.62 శాతం), నిఫ్టీ 134 పాయింట్లు(1.75 శాతం) లాభపడ్డాయి. పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, సోమవారం వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్బీఐ పాలసీకు మార్గం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు.30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు నష్టాల్లో ముగిశాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
బ్లూచిప్స్ హవా.. లాభాల్లో మార్కెట్
ముంబై: బ్లూచిప్స్ స్టాక్స్లో ఆఖర్లో కొనుగోళ్లతో స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం సెన్సెక్స్ 53 పాయింట్లు పెరిగి 28,439 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 8,494 వద్ద ముగిశాయి. నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజు ట్రేడింగ్ ఆసాంతం అటూ, ఇటూగా సాగింది. శుక్రవారం జీడీపీ గణాంకాల విడుదల, తర్వాతి వారంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష మొదలైన పరిణామాలు చోటుచేసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, బీహెచ్ఈఎల్, డాక్టర్ రెడ్డీస్ మొదలైన స్టాక్స్ ఊతంతో సెన్సెక్స్ లాభపడింది. అటు యూరప్లో సానుకూల సంకేతాల నడుమ విదేశీ నిధులు నిలకడగా వస్తుండటం సైతం మార్కెట్లకు తోడ్పడిందని ట్రేడర్లు వివరించారు. మరోవైపు ఆసియా సూచీలు మిశ్రమంగా ముగియగా...యూరోప్ సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. థాంక్స్గివింగ్ డే సందర్భంగా గురువారం అమెరికా మార్కెట్లకు సెలవు. స్టాక్ బ్రోకర్లకూ రేటింగ్ న్యూఢిల్లీ: స్టాక్మార్కెట్లను మరింత సమర్ధవంతంగా నిర్వహించే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పర్యవేక్షణ నిబంధనల్లో మార్పులు చేసింది. స్టాక్బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, కస్టోడియన్స్, మర్చంట్ బ్యాంకర్స్, పోర్ట్ఫోలియో మేనేజర్స్, రిజిస్ట్రార్స్, ట్రాన్స్ఫర్ ఏజంట్స్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు వంటి వివిధ మార్కెట్ ఇంటర్మీడియరీలకు రిస్కు స్థాయిని బట్టి రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. దానికి తగ్గట్లే వాటిపై నిఘా, పర్యవేక్షణ ఉండనుంది. రిస్కు ఆధారిత పర్యవేక్షణ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. దీని ప్రకారం ఇంటర్మీడియరీలను అత్యంత తక్కువ రిస్కు, తక్కువ రిస్కు, మధ్యస్థ రిస్కు, అధిక రిస్కు పేరిట నాలుగు గ్రూప్లుగా విభజిస్తారు. ఈ రిస్కును మదింపు చేయడంలో కూడా రెండు అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. సదరు సంస్థ వ్యాపార కార్యకలాపాలపరమైన రిస్కు ఒకటి కాగా, దివాలా వంటి పరిణామాలు తలెత్తితే ప్రభావాలపరమైన రిస్కు రెండోది. -
నో స్టాక్
అక్టోబర్లో దసరా, బక్రీద్, దీపావళి పండుగలు ఆరు నెలలుగా పంపిణీ లేని పామాయిల్ రెండు నెలలుగా అందని కందిపప్పు కర్నూలు: అక్టోబర్ నెలలో దసరా, బక్రీద్, దీపావళి పండుగలు ఉన్నాయి. పండుగ వేళ పిండి వంటలు చేసుకోవడానికి కావాల్సిన వంట నూనె, కంది పప్పు పంపిణీ లేకపోవడంతో పేదలు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో ఆరు నెలలుగా వంట నూనె సరఫరా కాకపోయినా పట్టించుకునే వారే లేరు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన ఈ సమస్యను అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో పేదలకు పామాయిల్ అందని పరిస్థితి నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్డు వినియోగదారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే కందిపప్పు కూడా రెండు నెలలుగా సరఫరా చేయడం లేదు. కందిపప్పు ఎప్పుడొస్తుందోనని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని 11.50 లక్షల పేద కుటుంబాల్లో పండుగ కళ కన్పించడంలేదు. జిల్లాలో 11.50 లక్షల తెల్ల రేషన్కార్డుదారులుండగా వీరికి ప్రతి నెల బియ్యం, కిరోసిన్, పంచదార, పామాయిల్, కందిపప్పు వంటివి సరఫరా చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బియ్యం, కిరోసిన్ యధావిధిగా సరఫరా చేస్తున్న పౌర సరఫరాల శాఖ పామాయిల్, కందిపప్పును మాత్రం పట్టించుకోవడం మానేసింది. కార్డుకు కేజీ పామాయిల్ చొప్పున 11.50 లక్షల కిలోల పామాయిల్ సరఫరా చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో పామాయిల్ రూ.65 వరకు ధర పలుకుతుండగా రేషన్ దుకాణాల్లో మాత్రం రూ.40కే విక్రయిస్తారు. వీటికి కూడా రాయితీల విధానం ఉంది. సాధారణ ధరకే అంటే బహిరంగ మార్కెట్లో ఎంత ధర ఉందో అంతే ధరకు దీనిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అందులో రూ.10 రాయితీని కేంద్ర ప్రభుత్వం రూ.13 రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. ఇలా రూ.23 పోగా మిగిలిన సొమ్ముకు అంటే రూ.40 కి కిలో పామాయిల్ను పేదలకు అందిస్తున్నారు. గత ఆరు నెలలుగా పేదలకు పామాయిల్ అందడం లేదు. సాధారణంగా మలేషియా నుంచి కాకినాడ పోర్టుకు పామాయిల్ దిగుమతి అవుతండగా ఇక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సరఫరా జరుగుతోంది. కాకినాడ రీఫైనరీల్లో కావాల్సినంత పామాయిల్ అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ రాకపోవడం వల్ల సరఫరా ఆగిపోయింది. కేంద్రం భరించాల్సిన రూ.10 సబ్సిడీపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సమాచారం అందించకపోవడంతో పామాయిల్ సరఫరా జరగడం లేదని ఉన్నతాధికారులు తెలిపారు. కందిపప్పు పరిస్థితి ఇదే.. పేదలకు ఇచ్చే సబ్సిడీ సరుకుల్లో కందిపప్పు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పామాయిల్ మాదిరిగానే కందిపప్పు కూడా జిల్లాలో 11.50 లక్షల కిలోలు సరఫరా చేయాలి. రేషన్ దుకాణంలో కందిపప్పు కిలో రూ.50కి ఇస్తుండగా బహిరంగ మార్కెట్లో ధర రూ.70 పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఒకే కాంట్రాక్టర్కు కందిపప్పు సరఫరా అప్పగించారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ కందిపప్పు సరఫరా చేయలేకపోవడంతో పేదలకు అందడం లేదు. పంచదార సరఫరాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క కార్డుదారునికి అర కిలో చొప్పున పంపిణీ జరుగుతుండగా ముందుగా ఎవరు వస్తే వారికే అనే రీతిలో పంపిణీ చేస్తుండటంతో కార్డుదారులందరికీ అందడం లేదు. ఇటువంటి చిన్న ఇబ్బందులు పరిష్కరించడం ద్వారా పేదలకు లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. దీనిపై అధికారులు కూడా దృష్టి సారించడం లేదు. జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే దసరా, బక్రీద్, దీపావళి పండుగలకు సబ్సిడీ సరుకులు అందుకోవచ్చునని కార్డుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జన్మభూమిలో నిలదీసేందుకు వామపక్షాలు సిద్ధం.. అధికారుల పర్యవేక్షణ లేక జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈనెల 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో నిలదీసేందుకు వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. చౌక డిపో డీలర్లు నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకోవడం, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో కొంతకాలంగా పామాయిల్, కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ సక్రమంగా జరగడంలేదు. జన్మభూమిలో అధికార యంత్రాంగాన్ని నిలదీయడం ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లేందుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సీపీఐ, సీపీఎం వాటి అనుబంధ ప్రజా సంఘాల నాయకులు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి జన్మభూమిలో అధికారులను నిలదీసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. -
స్టాక్ వస్తే.. క్యాష్ కట్టాల్సిందే
- అంగన్వాడీలపై ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్ల ఒత్తిడి - ఒక్కో కేంద్రం నుంచి రూ.400 చొప్పున బలవంతంగా వసూలు - డబ్బులు కట్టలేమంటూ బెంబేలెత్తుతున్న అంగన్వాడీలు ఒంగోలు టౌన్ : సాధారణంగా షాపులకు స్టాక్ వచ్చిందంటే దానికి సంబంధించిన యజమాని క్యాష్ కట్టడం ఆనవాయితీ. ఏ రోజు స్టాక్ వస్తే ఆ రోజు క్యాష్ కట్టి వస్తువులను స్వాధీనం చేసుకుంటాడు. అయితే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారం వచ్చిందంటే అంగన్వాడీలు క్యాష్ కట్టాల్సిందే. కొన్ని ప్రాజెక్టులకు చెందిన సీడీపీఓలు, సూపర్వైజర్లు కేంద్రాల ఆధారంగా రేట్ నిర్ణయించేశారు. ఒక్కో కేంద్రం నుంచి గరిష్టంగా రూ. 400 వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇందులో సీడీపీఓకు రూ.250, సూపర్వైజర్కు రూ.150 అందుతాయన్నది బహిరంగ రహస్యం. కొంతమంది అంగన్వాడీలు క్యాష్ కట్టేందుకు ఇష్టపడకపోతే వారిపై తనిఖీల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పైఅధికారులు అడిగిన క్యాష్ ఇవ్వకుంటే ఎక్కడ కన్నెర్ర జేస్తారోనని అంగన్వాడీలు హడలిపోతూ వారు అడిగినంత చేతుల్లో పెట్టేస్తున్నారు. ఇదేదో ఒకటీ అరా నెల అయితే సర్దుకుపోవచ్చని, స్టాక్ వచ్చిన ప్రతిసారీ క్యాష్ కట్టాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలని కొంతమంది అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. 21 ప్రాజెక్టులు జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు పరిధిలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వాటి పరిధిలో 4300కుపైగా అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా గతంలో పౌష్టికాహారంతో పాటు కోడిగుడ్లు అందించేవారు. గతేడాది ద్వితీయార్థం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని హక్కుదారులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంఖ్య ఆధారంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. హక్కుదారుల సంఖ్యను ఆధారం చేసుకొని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి బియ్యం, కందిపప్పు, వంట నూనె, తాలింపు గింజలు తదితర సరుకులను అందజేస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన స్టాక్ వచ్చిందంటే క్యాష్ సిద్ధం చేసుకోవాల్సి వస్తోందని పలువురు అంగన్వాడీలు బహిరంగంగానే వాపోతున్నారు. యూ టర్న్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకులు సరఫరా చేసిన సమయంలో గతంలో కొన్ని ప్రాజెక్టులకు చెందిన సీడీపీఓలు, సూపర్వైజర్లు కందిపప్పు, వంటనూనె ప్యాకెట్లు తీసుకెళ్లేవారు. వాటి నిల్వలు ఇళ్లల్లో పేరుకుపోవడంతో యూ టర్న్ తీసుకున్నారు. నిత్యావసరాల కంటే నగదు రూపంలో తీసుకుంటే వాటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చన్న ఉద్దేశంతో ట్రెండ్ మార్చారు. ఒక్కో ప్రాజెక్టులో జనాభా ఆధారంగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాజెక్టులకు చెందిన సీడీపీఓలు, సూపర్వైజర్లు డబ్బులకు కక్కుర్తిపడి అంగన్వాడీలను టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘అమ్మ గార్లు’ అడిగినంత ఇవ్వాలంటే అడ్డదారులు తొక్కాల్సిందేనన్న నిర్ణయానికి కొంతమంది అంగన్వాడీలు వచ్చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించి హక్కుదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా కార్యకర్తలు, ఆయాలను చైతన్యపరచాల్సిన అధికారులు వారిని పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ‘స్టాక్కు క్యాష్’కు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. -
కౌలురైతుకుదేలు
ఖరీఫ్ ముంచుకొస్తున్నా కౌలు రైతుల గుర్తింపు లేదు రుణ అర్హత కార్డుల జారీ నిల్ అప్పులివ్వని బ్యాంకర్లు పంట రుణ లక్ష్యంలో కానరాని ప్రస్తావన కౌలు రైతులు వడ్డీ వ్యాపారుల ఉచ్చులో విలవిల్లాడుతున్నారు. మూడేళ్లుగా చవిచూసిన నష్టాలను దిగమింగుతూ మళ్లీ సాగుకు సిద్ధమవుతున్న వీరిని పట్టించుకునేవారే లేకుండాపోయారు. ఖరీఫ్ తరముకొస్తున్నా..వీరి గుర్తింపు ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. రుణ అర్హత కార్డులు ఎప్పుడిస్తారో ఎవరికీ స్పష్టత లేదు. పరిస్థితి చూస్తుంటే ఈ సీజన్లో కూడా కౌలు రైతులకు మొండి చెయ్యేలా ఉంది. బ్యాంకుల నుంచి ఒక్క రూపాయి కూడా పంట రుణంగా వచ్చే అవకాశం కనిపించడం లేదు. విశాఖ రూరల్, న్యూస్లైన్: జిల్లాలో సుమారు 5 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో సుమారు 70 వేల మంది కౌలు రైతులుగా అంచనా. గత ఖరీఫ్లో కేవలం 5336 మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు ఇవ్వాలని లక్ష్యాంగా పెట్టుకుని 3,341 మందికి మాత్రమే కార్డులు అందజేశారు. కార్డులున్న అందరికీ రుణాలివ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లక్షలు మాత్రమే ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకున్నాయి. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సీజన్కు ముందే ఏప్రిల్, మే నెలల్లో రెవెన్యూ అధికారులు కౌలు రైతులను గుర్తించాలి . ఎన్నికలు కారణంగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియవైపు దృష్టిసారించలేదు. కొత్త వారి ఎంపిక మాటెలా ఉన్నా పాత వారి కార్డుల రెన్యువల్ గురించి కూడా పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఒకవేళ రుణ అర్హతకార్డులు ఇచ్చినా కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపించడం లేదు. కొందరు కార్డులు తీసుకోక ముందే భూయజమానులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. కొత్త కార్డుల జారీలో రెవెన్యూ సిబ్బంది శల్యసారథ్యం, వ్యవసాయశాఖ సహకారం లేకపోవడం తదితర కారణాలనూ ఇక్కడ ఉదహరించవచ్చు. మూడేళ్లుగా ఇదే దుస్థితి. మంగళవారం జిల్లా రుణప్రణాళికను ఆమోదించిన అధికారులు కౌలు రైతులకు ఎంత మందికి ఎంతమేర రుణమిస్తారన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అంటే ఈ ఖరీఫ్లో వీరికి రుణాలు ఉండవా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బ్యాంకుల కొర్రీలను తట్టుకోలేక అన్నదాతలు ప్రైవేటు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దిగుబడులు ఆశించిన మేర రాకపోవడం, మదుపులు పెరగడం, ప్రకృతి వైపరిత్యాలతో ప్రతీ ఏటా వీరు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ విషయంపై దృష్టిసారించకపోతే కౌలు రైతులకు ఈ ఖరీఫ్ మరింత భారం అవుతుంది. ఎప్పుడూ అన్యాయమే ప్రభుత్వ పరంగా రాయితీలు కౌలు రైతులకు దక్కడం లేదు. సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు అందకపోవడంతో బహిరంగ మార్కెట్లో వీటిని అధిక ధరలకు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి. ఈ క్రమంలో నకిలీ, నాసిరకం విత్తనాలు కారణంగా రైతులు భారీగా నష్టపోతున్నారు. విపత్తుల సమయంలో పంటనష్టం పరిహారానికి నోచుకోవడం లేదు. దీనిని పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా చెల్లిస్తుండడంతో కౌలు రైతులు దూరమవుతున్నారు. ఏటా ఇబ్బందులే... నాది మునగపాక. రెండెకరాలు కౌలుకు తీసుకుని చెరకు పండిస్తున్నాను. రోజుల తరబడి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి పోరాడితేనే రుణ అర్హత కార్డును ఇచ్చారు. దాని ఆధారంగా ఏడాదికి రూ.35వేలు రుణమివ్వాలి. బ్యాంకువారు కేవలం రూ.17వేలు ఇచ్చారు. మదుపులు పెరగడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద మరి కొంత తెచ్చాను. వారికి వడ్డీలకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. ఏటా ఇదే పరిస్థితి. - పెంటకోట సూరిబాబు, కౌలు రైతు -
ఇక దిశ-దశ విదేశీయమే!
న్యూఢిల్లీ: దేశీయ కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాల సీజన్ దాదాపు ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ అంశాలపైనే ఆధారపడనున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరు ఈ వారం స్టాక్ మార్కెట్ల నడకను నిర్దేశించనున్నాయని పేర్కొన్నారు. అయితే రూపాయి కదలికలు కూడా కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఫలితాల అంచనాలు కూడా సెంటిమెంట్ను ప్రభావితం చేయవచ్చునని వివరించారు. వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న సాధారణ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉంటుందన్నది నిపుణుల అంచనా. నిఫ్టీకి 5,900 పాయింట్ల స్థాయి కీలకం ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి గరిష్ట శ్రేణిలో 5,900-6,000 పాయింట్లు కీలక మద్దతు స్థాయిలుగా నిలుస్తాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ డెరైక్టర్ రజత్ రాజ్గారియా పేర్కొన్నారు. అయితే సమీప కాలానికి మార్కెట్లు స్వల్పస్థాయి కదలికలకే పరిమితం కావచ్చునని చెప్పారు. ఆర్థిక వృద్ధి గాడినపడుతున్న సంకేతాలు, ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు ట్రెండ్ను నిర్దేశించవచ్చునని అంచనా వేశారు. పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లకు ఎలాంటి ప్రోత్సాహాన్నివ్వలేదని బొనాంజా పోర్ట్ఫోలియో సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు నిధి సరస్వత్ అభిప్రాయపడ్డారు. దీంతో విదేశీ సంకేతాలు, కరెన్సీ కదలిక లే సమీప కాలానికి ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చునని చెప్పారు. మేలు చేసిన యెలెన్: సహాయక ప్యాకేజీలు కొనసాగుతాయంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్కు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్న జానట్ యెలెన్ చేసిన వ్యాఖ్యలు వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రోత్సాహాన్నిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యెలెన్ను ఫెడ్ చైర్మన్గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బెన్ బెర్నాంకీ స్థానంలో యెలెన్ బాధ్యతలను స్వీకరించనుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకున్న బలమైన సంకేతాలు కనిపించేటంత వరకూ నెలకు 80 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోలుతో చేపడుతున్న సహాయక ప్యాకేజీని కొనసాగిస్తామని యెలెన్ గురువారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రివ్వున ఎగశాయి. సెన్సెక్స్ 205 పాయింట్లు పుంజుకుని 20,399 వద్ద నిలవగా, నిఫ్టీ 67 పాయింట్లు జంప్చేసి 6,056 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ప్యాకేజీ ఉపసంహరణ ఆందోళనలతో వారం మొత్తంలో నికరంగా 267 పాయింట్లను సెన్సెక్స్ కోల్పోయింది. కాగా, శుక్రవారం ట్రేడింగ్లో డాలరుతో మారకంలో రూపాయి కూడా కాస్త(0.3%) బలపడి 63.11 వద్ద ముగిసింది. కరెంట్ ఖాతా లోటు అంచనాలకంటే తక్కువగానే నమోదవుతుందంటూ ఆర్బీఐ గవర్నర్ రాజన్ ఇచ్చిన హామీ ఇందుకు దోహదపడింది. కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు ఈ నెలలోనూ రూ. 4,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయ్. ఈ నెలలో ఇప్పటి వరకూ నికరంగా రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలు, నెలకు 80 బిలియన్ డాలర్లతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు ఇకపై కూడా కొనసాగుతాయన్న అంచనాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ నెల 1-12 కాలంలో 64.5 కోట్ల డాలర్ల(రూ. 4,002 కోట్లు) విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ బాటలో గత రెండు నెలల్లోనూ రూ. 28,700 కోట్ల పెట్టుబడులను స్టాక్స్ కొనుగోలుకు వెచ్చించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటివరకూ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 92,936 కోట్లకు(16.8 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి. సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. అయితే మరోవైపు ఇదే కాలంలో డెట్ మార్కెట్ల నుంచి రూ.54,225 కోట్లను పసంహరించుకున్నారు. -
రూపాయిపైనే ఫోకస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని తెలిపారు. మరోవైపు అమెరికన్ కరెన్సీ డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఆహార భద్రతసహా పలు బిల్లులు చర్చకు రానుండటంతో వీటికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. కంపెనీల ఫలితాల సీజన్ ముగియడంతోపాటు, మార్కెట్లను ప్రభావితం చేయగల దేశీయ అంశాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లపైనే చూపు నిలుపుతారని ఇన్వెంచర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీస్ చైర్మన్ నాగ్జీ కె.రీటా చెప్పారు. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బుధవారం విడుదల చేయనున్న పాలసీ సమీక్ష వివరాలు(మినిట్స్) ప్రపంచ స్టాక్ మార్కెట్లకు కీలకంకానున్నాయని తెలిపారు. క్యాపిటల్ కంట్రోల్ భయాలు: ప్రభుత్వం 1991 తరహాలో పెట్టుబడులపై నియంత్రణలను(క్యాపిటల్ కంట్రోల్) తీసుకువస్తుందన్న ఆందోళనలతో గడిచిన శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒక్కసారిగా 62కు పడిపోయింది. కొత్త చరిత్రాత్మక కనిష్టస్థాయి 61.65 వద్ద ముగిసింది. దీంతోపాటు స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ కూడా 770 పాయింట్లు పతనమైంది. ఇటీవల భారీ ఒడిదొడుకులకు లోనవుతున్న రూపాయి విలువ కారణంగా ఈక్విటీ మార్కెట్లు కూడా హెచ్చుతగ్గులను చవిచూస్తున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ తెలిపారు. ఇది ఇంతటితో ఆగేదికాదని వ్యాఖ్యానించారు. చార్టుల ప్రకారం చూస్తే ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి సమీప మద్దతు స్థాయి 5,450 పాయింట్ల వద్ద ఉన్నదని చెప్పారు. ఈ స్థాయిని కోల్పోతే అమ్మకాలు మరింత ఉధృతమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇది జరిగితే నిఫ్టీ 5,300 స్థాయికి దిగజారుతుందని అంచనా వేశారు. ఫలితంగా ట్రేడర్లు ట్రెండ్కు విరుద్ధమైన రీతిలో పొజిషన్లు తీసుకోవడం ప్రమాదకరమని సూచించారు. కాగా, రానున్న రోజుల్లో నిఫ్టీకి 5,480 స్థాయి కీలకంగా నిలవనున్నదని బొనాంజా పోర్ట్ఫోలియో సీనియర్ వైస్ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలకు మరింత అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. జోష్లో యూఎస్: ఇటీవల ఆర్థిక వ్యవస్థ పుంజు కుంటున్న సంకేతాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్కు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. గత వారం విడుదలైన నిరుద్యోగం తదితర గణాంకాలు జీడీపీ పురోగమిస్తున్న సంకేతాలను వెల్లడించడంతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను వచ్చే నెల నుంచే ఉపసంహరించవచ్చునన్న అంచనాలు పెరిగాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను తరలించే అవకాశముంది. దీంతో ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్ బలపడింది. ఇది రూపాయి పతనానికి కూడా కారణమైంది. భారతీయులు, దేశీయ కంపెనీలు విదేశాలలో పెట్టేపెట్టుబడులపై రిజర్వ్ బ్యాంకు పరిమితులు విధించడంతో సెంటిమెంట్ దెబ్బతిన్నదని నిపుణులు పేర్కొన్నారు. దీంతో విదేశీయులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంపై నియంత్రణలు విధించే ఆలోచన లేదని ఆర్బీఐ, ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రూ. 6,000కోట్లు వెనక్కి న్యూఢిల్లీ: దేశీయ రుణ(డెట్) మార్కెట్ల నుంచి ఈ నెల తొలి 2 వారాల్లో ఎఫ్ఐఐలు నికరంగా 96.2 కోట్ల డాలర్ల(రూ. 6,000 కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ తరహా పెట్టుబడులపై లభించే రిటర్న్లకు సంబంధించి పన్ను నిబంధనల్లో స్పష్టత లేకపోవడం దీనికి కారణంగా నిలుస్తోంది. మరోవైపు రూపాయి బలహీనపడటం కూడా ఇందుకు సహకరిస్తోంది. కాగా, సెబీ గణాంకాల ప్రకారం జూన్ నుంచి చూస్తే డెట్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు మొత్తంగా రూ. 51,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అయితే 2013 జనవరి మొదలు తొలి 5 నెలల్లో నికరంగా రూ. 25,000 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.