Sensex
-
స్టాక్మార్కెట్లు బేర్.. ఐటీ షేర్లు విలవిల
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్ను 1 శాతానికి పైగా నష్టంతో ముగించాయి. సెన్సెక్స్ 856.65 పాయింట్లు (1.14 శాతం) క్షీణించి 74,454.41 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ సూచీ 74,907.04-74,387.44 శ్రేణిలో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 242.55 పాయింట్లు (1.06 శాతం) క్షీణించి 22,553.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం రోజు గరిష్టాన్ని 22,668.05 వద్ద, రోజు కనిష్టాన్ని 22,518.80 వద్ద నమోదు చేసింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 38 షేర్లు నష్టాల్లో ముగియగా విప్రో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ 3.70 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా వంటి 12 షేర్లు 1.54 శాతం వరకు లాభాల్లో ముగిశాయి.ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.02 శాతం, 0.94 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రెడ్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 217 పాయింట్లు నష్టపోయి 22,578కు చేరింది. సెన్సెక్స్(Sensex) 696 పాయింట్లు దిగజారి 74,634 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.17 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.35 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.71 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.2 శాతం పడిపోయింది.ఇదీ చదవండి: ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలుదేశీ స్టాక్ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ.23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రపంచ పరిణామాలు దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. టాప్ లూజర్స్ ఇవే..
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ను ప్రతికూలంగా ముగించాయి. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 424.90 పాయింట్లు లేదా 0.56 శాతం నష్టంతో 75,311.06 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 75,748.72 నుండి 75,112.41 పరిధిలో ట్రేడైంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 127.25 పాయింట్లు లేదా 0.51 శాతం తగ్గి 22,795.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,921ను నమోదు చేయగా, కనిష్ట స్థాయి 22,720 గా ఉంది. నిఫ్టీ 50లోని 50 కాంపోనెంట్ స్టాక్లలో 35 నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా మోటార్స్, విప్రో షేర్లు 6.20 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి.శుక్రవారం నిఫ్టీ మిడ్క్యాప్100, నిఫ్టీ స్మాల్క్యాప్100 సూచీలు వరుసగా 1.32 శాతం, 0.70 శాతం నష్టాలతో స్థిరపడటంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్మార్క్లను ప్రతిబింబించాయి. నిఫ్టీ మెటల్ తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో అత్యధికంగా నష్టపోయింది. ఇది 2.58 శాతం తగ్గింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, హెల్త్కేర్, రియాల్టీ, ఫార్మా, ఓఎంసీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా నష్టంతో స్థిరపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు నష్టపోయి 22,891కు చేరింది. సెన్సెక్స్(Sensex) 75 పాయింట్లు దిగజారి 75,658 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.4 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.47 శాతం పడిపోయింది.డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 203.22 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 75,735.96 వద్ద, నిఫ్టీ 19.75 పాయింట్లు లేదా 0.086 శాతం నష్టంతో 22,913.15 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు నష్టపోయి 22,864కు చేరింది. సెన్సెక్స్(Sensex) 290 పాయింట్లు దిగజారి 75,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.05 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.24 శాతం లాభపడింది. నాస్డాక్ 0.07 శాతం పెరిగింది.ఇదీ చదవండి: పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలుడొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 94.24 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 75,873.15 వద్ద, నిఫ్టీ 28.15 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 22,917.15 పాయింట్ల వద్ద నిలిచాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 96 పాయింట్లు నష్టపోయి 22,852కు చేరింది. సెన్సెక్స్(Sensex) 322 పాయింట్లు దిగజారి 75,653 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.02 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.24 శాతం లాభపడింది. నాస్డాక్ 0.07 శాతం పెరిగింది.ఇదీ చదవండి: పీఎన్బీలో రూ.271 కోట్ల ఫ్రాడ్రూ.400 లక్షల కోట్ల దిగువకు సంపద స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.2.10 లక్షల కోట్లు హరించుకుపోయాయి. గతేడాది ఏప్రిల్ 8న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్ను అందుకుంది. గత సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకుంది. నాటి నుంచి నాటి నుంచి ఏకంగా రూ.81 లక్షల కోట్లు హరించుకుపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: ఆరంభ నష్టాల నుంచి తేరుకొన్న స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 466 పాయింట్ల పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్ చివరికి 29 పాయింట్ల నష్టంతో 75,967 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 22,945 వద్ద నిలిచింది. దీంతో సూచీల లాభాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా కాసేపు లాభాల్లో ట్రేడయ్యాయి.ఇండస్ట్రియల్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెలికం, క్యాపిటల్ గూడ్స్, ఆటో, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో మిడ్ సెషన్ కల్లా సెన్సెక్స్ 466 పాయింట్లు క్షీణించి 75,531 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 22,801 వద్ద కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే మిడ్సెషన్ నుంచి ఐటీ, వినిమయ, ఆయిల్అండ్గ్యాస్, ఇంధన షేర్లు రాణించడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి.డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 10 పైసలు బలహీనపడి 86.98 వద్ద స్థిరపడింది. ⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% క్షీణించింది. మిడ్ క్యాప్ సూచీ 0.19 శాతం నష్టపోయింది. రూ.400 లక్షల కోట్ల దిగువకు సంపద స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.2.10 లక్షల కోట్లు హరించుకుపోయాయి. గతేడాది ఏప్రిల్ 8న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్ను అందుకుంది. గత సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకుంది. నాటి నుంచి నాటి నుంచి ఏకంగా రూ.81 లక్షల కోట్లు హరించుకుపోయింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 75,531 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. కానీ చివరికి 29 పాయింట్ల స్వల్ప నష్టంతో 75,967 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 22,801 కనిష్ట స్థాయిని, 22,992 గరిష్ట స్థాయిని తాకి, ఆ తర్వాత 14 పాయింట్లు తగ్గి 22,945 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 షేర్లలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3 శాతం వరకు లాభపడి టాప్ పెర్ఫార్మర్లలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, జొమాటో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇతర స్పష్టమైన కదలికలు చేశాయి. మరోవైపు, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా & మహీంద్రా, టీసీఎస్ ఒక్కొక్కటి 1 - 2 శాతం క్షీణించాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా ఫ్లాట్ నోట్తో ముగిసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 1.5 శాతం క్షీణించింది. మొత్తంగా ఈరోజు మార్కెట్ 3:1 నిష్పత్తిలో బేర్లకు అనుకూలంగా నష్టాలను చూసింది. బీఎస్ఈలో దాదాపు 3,000 స్టాక్లు క్షీణించగా , 1,000 కంటే తక్కువ షేర్లు లాభపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు నష్టపోయి 22,918కు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు దిగజారి 75,919 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.41 శాతం పెరిగింది.ఇదీ చదవండి: అడ్వైజర్లు, అనలిస్టులు అన్ని వివరాలు ఇవ్వాల్సిందేఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు. ‘ఎఫ్ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది’ అని తెలిపారు. ఎఫ్ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ.1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ.లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాది స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లోకి మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు తమ ప్రారంభ నష్టాలను తిప్పికొట్టి 8 రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి, సోమవారం సానుకూలంగా స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 57.65 పాయింట్లు లేదా మునుపటి ముగింపుతో పోలిస్తే 0.08 శాతం పెరిగి 75,996.86 వద్ద ముగిసింది. దీని ఇంట్రా-డే కనిష్ట స్థాయి 75,294.76 నుండి దాదాపు 702.10 పాయింట్లు పెరిగింది. మునుపటి ఎనిమిది వరుస ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 3.4 శాతం లేదా 2,645 పాయింట్లు పడిపోయింది.అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 30.25 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 22,959.50 వద్ద ముగిసింది. సోమవారం ఈ ఇండెక్స్ 22,974.20 నుండి 22,725.45 పరిధిలో ట్రేడయింది. నిఫ్టీ50లోని 50 కాంపోనెంట్ స్టాక్లలో 34 లాభాలతో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్ 3.93 శాతం వరకు లాభాలను ఆర్జించాయి. మహీంద్రా & మహీంద్రా, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఎస్ఈ నిఫ్టీ50లో అత్యధికంగా వెనుకబడిన వాటిలో ఉన్నాయి, 3.45 శాతం వరకు నష్టాలు సంభవించాయి. ట్రేడింగ్ సెషన్ రెండవ భాగంలో విస్తృత మార్కెట్లు కూడా కోలుకున్నాయి, నిఫ్టీ మిడ్క్యాప్ 100 0.39 శాతం లాభాలతో స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 0.04 శాతం స్వల్ప లాభాలతో ముగిసింది. అయితే, మార్కెట్ విస్తృతి ప్రతికూలంగానే ఉంది. ఎన్ఎస్ఈలో ట్రేడవుతున్న 2,955 స్టాక్లలో 1,014 లాభాలతో ముగియగా, 1,871 స్టాక్లు క్షీణించాయి. 70 స్టాక్లు మాత్రం మారలేదు. ఎన్ఎస్ఈలోని రంగాలలో, ఫార్మా, బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్కేర్, ఓఎంసీలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ లాభాలతో ముగిశాయి. గ్లెన్మార్క్ ఫార్మా , అజంతా ఫార్మా నేతృత్వంలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.27 శాతం లాభపడి ముగిసింది. కాగా నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా సూచీలు 0.71 శాతం వరకు తగ్గాయి. -
తొమ్మిది సెషన్ల నుంచి నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దాంతో సూచీలు వరుసగా తొమ్మిది సెషన్లుగా నష్టాల్లో ట్రేడవుతున్నట్లు తెలుస్తుంది. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు నష్టపోయి 22,835కు చేరింది. సెన్సెక్స్(Sensex) 309 పాయింట్లు దిగజారి 75,621 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.67 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.41 శాతం పెరిగింది.ఇదీ చదవండి: బుల్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే..డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు ముగిసిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 50 102.15 పాయింట్లు లేదా 0.44 శాతం తగ్గి 22,929.25 వద్ద ముగిసింది. ఈ రోజు ఈ ఇండెక్స్ గరిష్టంగా 23,133.7 వద్ద, కనిష్టంగా 22,774.85 వద్ద నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 199.76 పాయింట్లు లేదా 0.26 శాతం తగ్గి 75,939.21 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టం 76,138.97, కనిష్టం 75,439.64 వద్ద నమోదైంది.బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఇన్ఫోసిస్, టీసీఎస్ స్టాక్స్ టాప్ గెయినర్స్గా లాభాలను అందుకోగా, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, సన్ ఫార్మా షేర్లు టాప్ లూజర్స్గా నష్టాలను చవిచూశాయి. భారత్ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్ టారిఫ్లను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. మధ్యాహ్న సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి.నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ శుక్రవారం అధికారికంగా 'బేర్' దశలోకి ప్రవేశించింది. ఇండెక్స్ దాని గరిష్ట స్థాయి 19,716.20 నుండి దాదాపు 22 శాతం పడిపోయింది. శుక్రవారం ఇండెక్స్ దాదాపు 4 శాతం నష్టపోయి 15,373.70 స్థాయిల వద్ద ముగిసింది. శుక్రవారం నాటి పతనం విస్తృత మార్కెట్లలో అంతటా అమ్మకాల ఒత్తిడితో జరిగింది. దీంతో మిడ్క్యాప్లు కూడా బలహీనంగా ముగిశాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఇండెక్స్ శుక్రవారం ట్రేడింగ్లో దాదాపు 2.5 శాతం నష్టపోయి 18,325.40 స్థాయిల వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 2 పాయింట్లు పెరిగి 23,034కు చేరింది. సెన్సెక్స్(Sensex) 54 పాయింట్లు ఎగబాకి 76,174 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.05 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.04 శాతం పుంజుకుంది. నాస్డాక్ 1.5 శాతం పెరిగింది.ఇదీ చదవండి: వాహన జోరుకు యూవీల తోడునిన్నటి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ నేపథ్యంలో తీవ్ర ఒడిదుడులకు లోనయ్యాయి. ట్రేడింగ్లో అధిక సమయం లాభాల్లో కదలాడాయి. ఫార్మా, మెటల్, ఫైనాన్స్, విద్యుత్, టెలికం షేర్లుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా జనవరి ద్రవ్యోల్బణం అంచనాలకు మించడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు రేకెత్తాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 32.11 పాయింట్లు లేదా 0.042 శాతం నష్టంతో 76,138.97 వద్ద, నిఫ్టీ 13.85 పాయింట్లు లేదా 0.060 శాతం నష్టంతో 23,031.40 వద్ద నిలిచాయి.బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23,000 మార్కు పైనే ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ(Nifty) 26 పాయింట్లు నష్టపోయి 23,045 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 122 పాయింట్లు దిగజారి 76,171 వద్దకు చేరింది. ఇటీవల భారీగా మార్కెట్లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమయ్యాయి.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, జొమాటో, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. ఎం అండ్ ఎం, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా స్టాక్లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోనే ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్ళీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 223.97 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో.. 76,069.63 వద్ద, నిఫ్టీ 105.85 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో 22,965.95 వద్ద సాగుతున్నాయి.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మొదలైనవి నష్టాల్లో సాగుతున్నాయి.అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడటంతో దేశీ స్టాక్ సూచీలు వసరుసగా నష్టాలనే చవి చూస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, నిరుత్సా హపరుస్తున్న కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,018 పాయింట్లు పతనమై 76,294 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయి 23,072 వద్ద నిలిచింది. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,281 పాయింట్లు కోల్పోయి 76,031 వద్ద, నిఫ్టీ 395 పాయింట్లు నష్టపోయి 22,986 వద్ద కనిష్టాలు తాకాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
5 రోజుల్లో రూ.17,00,000 కోట్లు ఆవిరి
ముంబై: అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడటంతో దేశీ స్టాక్ సూచీలు అయిదో రోజూ నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, నిరుత్సా హపరుస్తున్న కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,018 పాయింట్లు పతనమై 76,294 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయి 23,072 వద్ద నిలిచింది. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,281 పాయింట్లు కోల్పోయి 76,031 వద్ద, నిఫ్టీ 395 పాయింట్లు నష్టపోయి 22,986 వద్ద కనిష్టాలు తాకాయి.⇒ మార్కెట్ వరుస పతనంతో 5 రోజుల్లో రూ.17 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మంగళవారం రూ.9.29 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.408.52 లక్షల కోట్ల(4.70 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. ⇒ సెన్సెక్స్ మొత్తం 30 షేర్లలో ఒక్క ఎయిర్టెల్ (0.19%) మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కింది. అత్యధికంగా జొమాటో 5%, టాటా స్టీల్ 3%, బజాజ్ ఫిన్సర్వ్ 2.70%, పవర్ గ్రిడ్ 2.65%, ఎల్అండ్టీ 2.60% నష్టపోయాయి. ఈ సూచీ గత రోజుల్లో 2,290 పాయింట్లు(3%) కోల్పోయింది. నిఫ్టీ ఇండెక్స్ 668 పాయింట్లు(2.81%) నష్టపోయింది. ⇒ రంగాల వారీగా రియల్టీ ఇండెక్స్ 3.14% క్షీణించింది. ఇండ్రస్టియల్ 3%, కన్జూమర్ డి్రస్కేషరీ 2.73%, క్యాపిటల్ గూడ్స్ 2.60%, ఆటో 2.50%, మెటల్ 2.23 శాతం చొప్పున పతనమయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 3.40%, 2.88 శాతం క్షీణించాయి. నష్టాలకు కారణాలు⇒ అమెరికా ఇండ్రస్టియల్ రంగాన్ని గాడిన పెట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్లు విధించారు. ఎలాంటి మినహాయింపులు, కోటాలు లేకుండా అన్ని దేశాలపై టారిఫ్లు ఫ్లాట్గా 25% ఉంటాయన్నారు. దీంతో గతంలో టారిఫ్లు అధికంగా లేని కెనడా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణ కొరియా సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ నిర్ణయం దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసేలా ఉందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ⇒ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా వాణిజ్య సుంకాల విధింపు, ద్రవ్యోల్బణం అంశాలపై సెనేట్ బ్యాకింగ్, హౌసింగ్ అర్బన్ అఫైర్స్ కమిటీ ముందు మాట్లాడనున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ⇒ విదేశీ ఇన్వెస్టర్లు 2025లోనే 9.94 బిలియన్ డాలర్లు విలువ చేసే ఈక్విటీలను విక్రయించారు. -
చిన్న షేర్లు విలవిల సిప్ పెట్టుబడులు డిప్
నాలుగేళ్లుగా దేశీ స్టాక్ మార్కెట్ల(Stock markets)లో బుల్ ట్రెండ్ కొనసాగడంతో ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను చేరాయి. అయితే ఉన్నట్టుండి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాల బాట పట్టడం, రాజకీయ భౌగోళిక అనిశ్చితులు వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బకొట్టాయి. దీంతో గతేడాది అక్టోబర్ మొదలు స్టాక్ మార్కెట్లు(Stock markets) తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్స్లో కొద్ది రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సెప్టెంబర్లో నమోదైన గరిష్టాల నుంచి 17 శాతానికిపైగా పతనమయ్యాయి. వెరసి గత ఆరు నెలల్లో పలు స్మాల్ క్యాప్ ఫండ్స్లో చేసిన పెట్టుబడులకు నష్టాలు వాటిల్లుతున్నాయి. మరోపక్క మార్కెట్ ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సైతం 12 శాతం క్షీణించాయి. సిప్ బేజారు...నిజానికి గత కేలండర్ ఏడాది(2024)లో క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్) భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్లోకి రూ. 2.89 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. యాక్టివ్ స్మాల్ క్యాప్ ఫండ్స్కు గతేడాది రూ. 35,000 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఇదే కాలంలో లార్జ్ క్యాప్ ఫండ్స్ పెట్టుబడులతో పోలిస్తే ఇవి రెట్టింపు..! అయితే గత 6 నెలలుగా పలు స్మాల్ క్యాప్ ఫండ్స్కు చెందిన సిప్ పథకాలపై రిటర్నులు ప్రతికూలంగా నమోదవుతున్నా యి. 2024 డిసెంబర్లో ఇన్వెస్టర్లు 4.5 మిలియన్ సిప్ ఖాతాలను మూసివేశారు. ఇంతక్రితం 2024 మే నెలలో మాత్రమే 4.4 మిలియన్ సిప్ ఖాతాలు నిలిచిపోయాయి. నేలచూపులో వివిధ మిడ్క్యాప్ ఫండ్స్లో సిప్ పెట్టుబడుల తీరును గమనిస్తే.. మూడేళ్ల కాలంలో మంచి పనితీరునే చూపినప్పటికీ ఏడాది కాలాన్ని పరిగణిస్తే ప్రతికూల ప్రతిఫలాలు నమోదవుతున్నాయి. వివిధ మిడ్ క్యాప్ ఫండ్స్ జాబితాలో క్వాంట్ను తీసుకుంటే గత మూడేళ్లలో 19 శాతం రిటర్నులు అందించగా.. గత 12 నెలల్లో 15.6 శాతం క్షీణతను చవిచూసింది. ఈబాటలో టారస్ మూడేళ్లలో 15 శాతం లాభపడగా.. ఏడాది కాలంలో 12 శాతంపైగా నీరసించింది. మిరే అసెట్ మూడేళ్లలో 18 శాతం పుంజుకోగా.. ఏడాదిలో 6 శాతంపైగా నష్టపోయింది. ఇదేవిధంగా టాటా గ్రోత్, యూటీఐ, ఏబీఎస్ఎల్, మహీంద్రా మాన్యులైఫ్ మూడేళ్లలో 20–24 శాతం రిటర్నులు అందించినప్పటికీ ఏడాది కాలాన్ని పరిగణిస్తే 5–4 శాతం మధ్య తగ్గాయి. ఎఫ్పీఐల అమ్మకాలు2024 అక్టోబర్ నుంచి ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో విక్రయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా అక్టోబర్ మొదలు ఇప్పటి(ఫిబ్రవరి7)వరకూ ఎఫ్పీఐలు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కొత్త ఏడాది(2025) జనవరి నుంచి చూస్తే రూ. లక్ష కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ ఏడాది కనిష్టాలకు..బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో 131 షేర్లు తాజాగా 52 వారాల కనిష్టాలను తాకాయి. ఈ జాబితాలో డెల్టా కార్ప్ హోనసా కన్జూమర్, జేకే టైర్, మిశ్రధాతు నిగమ్, టాటా కెమికల్స్, ఎన్సీసీ, రైట్స్, మదర్సన్ సుమీ, ఎస్కేఎఫ్ ఇండియా చేరాయి. గత రెండు నెలల్లో 433 చిన్న షేర్ల మార్కెట్ విలువలో 20%ఆవిరైంది. వీటిలో 100 షేర్ల విలువ 30–40% మధ్య పతనమైంది. గత నెల రోజుల్లో రెండేళ్లుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న పలు కౌంటర్లు 40–30 శాతం మధ్య పతనమయ్యాయి. జాబితాలో న్యూజెన్ సాఫ్ట్వేర్, కేన్స్ టెక్నాలజీ ఇండియా, అపార్ ఇండస్ట్రీస్, నెట్వెబ్ టెక్నాలజీస్, జూపిటర్ వేగన్స్, స్టెర్లింగ్ అండ్ విల్సన్, అనంత్రాజ్, రామకృష్ణ ఫోర్జింగ్స్ చేరాయి. -
ట్రంప్ ఎఫెక్ట్!.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1031.25 పాయింట్లు లేదా 1.31 పాయింట్ల నష్టంతో 76,296.55 వద్ద, నిఫ్టీ 309.80 పాయింట్లు లేదా 1.32 శాతం నష్టంతో.. 23,071.80 వద్ద నిలిచాయి. ఈ వారంలో రెండూ రోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాను.అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ట్రెంట్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన, ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లలో ఆందోళనలు మొదలయ్యాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా తగ్గాయి. అంతే కాకుండా అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ(Nifty) 82 పాయింట్లు నష్టపోయి 23,303కు చేరింది. సెన్సెక్స్(Sensex) 243 పాయింట్లు దిగజారి 77,065 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.4 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.67 శాతం లాభపడింది. నాస్డాక్ 0.98 శాతం ఎగబాకింది.అమెరికాకు వచ్చే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్లు విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో స్టాక్ సూచీలు నిన్నటి మార్కెట్లో భారీగానే పైగా నష్టపోయాయి. అలాగే తమపై పన్నులు విధించే దేశాలపై తిరిగి పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, రూపాయి కొత్త కనిష్టానికి చేరుకోవడమూ మరింత ఒత్తిడి పెంచాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమాయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో.. 77,311.80 వద్ద, నిఫ్టీ 182.85 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టంతో.. 23,377.10 వద్ద నిలిచాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మళ్ళీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 211.41 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,846.74 వద్ద, నిఫ్టీ 43.40 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 23,559.95 పాయింట్ల వద్ద నిలిచాయి.టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యు స్టీల్, ట్రెంట్, హిందాల్స్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఐటీసీ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.రెపో రేటు తగ్గించిన ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆర్బీఐ రేట్లపైనే గురి.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు కీలక వడ్డీ రేటు ప్రకటనలు చేయనున్న నేపథ్యంలో బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, నిఫ్టీ50 జాగ్రత్తగా కదులుతున్నాయి.సెషన్ ప్రారంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 87.80 పాయింట్లు లేదా 0.11 శాతం పెరిగి 78,145.96 వద్ద ఉంది. అలాగే నిఫ్టీ 50 (Nifty) 35.05 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 23,638.40 వద్ద ఉంది.రెండు రోజుల చర్చల తర్వాత, ఆర్థిక వ్యవస్థ స్థితి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలపై వ్యాఖ్యానాలతో పాటు, వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన మొదటి ఎంపీసీ నిర్ణయాన్ని ఈరోజు ప్రకటిస్తున్నారు.మరోవైపు యూస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరో కనిష్ట స్థాయిని తాకింది. కేంద్ర బ్యాంకు వడ్డీ రేటు నిర్ణయం వెలువడే ముందు గురువారం భారత ప్రభుత్వ బాండ్ దిగుబడి కూడా స్వల్పంగా తగ్గింది. అంతేకాకుండా, ఎంపీసీ నిర్ణయం తర్వాత బాండ్ల ద్వారా దాదాపు రూ. 14,000 కోట్లు సేకరించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రధాన సంస్థలు దేశీయ రుణ మూలధన మార్కెట్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్థిరంగా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 213.12 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టపోయి 78,058.16 వద్ద, నిఫ్టీ 92.95 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టపోయి 23,603.35 వద్ద నిలిచాయి.సిప్లా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి కంపెనీలు లాభాలను చవి చూశాయి. ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారతి ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) బుధవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (Nifty) అస్థిరమైన సెషన్ను ప్రతికూలంగా ముగించాయి. వీఎస్ఈ సెన్సెక్స్ 312.53 పాయింట్లు లేదా 0.40 శాతం తగ్గి 78,271.28 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 78,735.41 - 78,226.26 పరిధిలో ట్రేడైంది. సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 42.95 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టపోయి 23,696.30 వద్ద ముగిసింది. ఈ సూచీ ఈరోజు గరిష్ట స్థాయి 23,807.30ని నమోదు చేయగా, కనిష్ట స్థాయి 23,680.45గా ఉంది.నిఫ్టీ 50 లోని 25 షేర్లు నష్టాల్లో ముగిశాయి. వీటిలో ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. వీటి నష్టాలు 3.40 శాతం వరకు నమోదయ్యాయి. మరోవైపు ఓఎన్జీసీ, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్గా 2.90 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. ఇక విస్తృత మార్కెట్లు బెంచ్మార్క్లను అధిగమించాయి. స్మాల్-క్యాప్ షేర్లు ముందంజలో ఉన్నాయి. నిఫ్టీ స్మాల్క్యాప్100 ఇండెక్స్ 1.85 శాతం లాభపడింది. నిఫ్టీ మిడ్క్యాప్100 ఇండెక్స్ 0.68 శాతం లాభాలతో స్థిరపడింది. ఎన్ఎస్ఈలో రంగాల సూచీల్లో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్లు 1.75 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, మెటల్, ఓఎంసీలు, మీడియా ఇండెక్స్లు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి.అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(ఫిబ్రవరి7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. చాన్నాళ్ల తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితం కానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు భారీ లాభాలను చవి చూశాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,203.43 పాయింట్లు లేదా 1.56 శాతం లాభంతో 78,390.17 వద్ద, నిఫ్టీ 373.80 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో.. 23,734.85 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రెంట్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.గత కొన్ని రోజులుగా వరుస నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (ఫిబ్రవరి 4)న శుభారంభం పలికాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఇకపోతే.. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.22 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో.. 77,186.74 వద్ద, నిఫ్టీ 122.85 పాయింట్లు లేదా 0.52 శాతం నష్టంతో 23,359.30 వద్ద ఉన్నాయి.బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లార్సెన్ & టూబ్రో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బాహుబలికి కళ్లెం..!
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్టాక్ మార్కెట్ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అన్న చందంగా స్పందించింది. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోని... చివరికి ఫ్లాటుగా ముగిశాయి. వినియోగంపైనే దృష్టి సారిస్తూ.., మూలధన వ్యయాల కేటాయింపు అశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. సెన్సెక్స్ అయిదు పాయింట్ల స్వల్ప లాభంతో 77,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,482 వద్ద నిలిచింది. మార్కెట్లో మరిన్ని సంగతులు → కొత్తగా ఆరు వ్యవసాయ పథకాల ప్రకటనతో పాటు కిసాన్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు అగ్రికల్చర్ షేర్లకు భారీ డిమాండ్ లభించింది. కావేరీ సీడ్స్ , పారదీప్ పాస్ఫేట్, మంగళం సీడ్స్, నాథ్ బయో–జీన్స్, బేయర్ క్రాప్సైన్సెస్, పీఐ ఇండస్ట్రీస్ షేర్లు 7% నుంచి అరశాతం పెరిగాయి. మరోవైపు కెమికల్స్ రంగానికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహక చర్యలు లేకపోవడంతో చంబల్ ఫెర్టిలైజర్స్, ధమాకా అగ్రిటెక్, టాటా కెమికల్స్, కోరమాండల్ షేర్లు 3% నుంచి అరశాతం నష్టపోయాయి. → ఒక వ్యక్తి గరిష్టంగా రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ బడ్జెట్లో ప్రతిపాదనతో రియల్టీ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం ఒక ఇంటికే ఈ ప్రయోజనం అమల్లో ఉంది. ఫినిక్స్ మిల్స్, మాక్రోటెక్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాపరీ్టస్, శోభ షేర్లు 7% నుంచి 4 శాతం లాభపడ్డాయి. సిగ్నేచర్ గ్లోబల్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్ రియలిటి, గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు 3 నుంచి ఒకశాతం పెరిగాయి. → లెదర్ రంగంలో ఉత్పత్తి, నాణ్యత, పోటీతత్వాన్ని పెంచేందుకు త్వరలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఫుట్వేర్ షేర్లు పరుగులు తీశాయి. మీర్జా ఇంటర్నేషనల్ 20% ఎగసి అప్పర్ సర్క్యూట్ తాకింది. క్యాంపస్ ఆక్టివేర్ 7%, బాటా ఇండియా 6%, మెట్రో బ్రాండ్స్ 4%, లెహర్ ఫుట్వేర్స్ 3%, రిలాక్సో పుట్వేర్స్ ఒకశాతం పెరిగాయి. ట్రేడింగ్ సాగిందిలా...స్టాక్ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 77,501 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 23,529 వద్ద మొదలయ్యాయి. బడ్జెట్పై భారీ ఆశలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లు లాభపడి 77,899 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి వద్ద గరిష్టాలు తాకాయి. బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 893 పాయింట్లు కోల్పోయి 77,006 వద్దకు చేరింది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం 314 పాయింట్లు పతనమై 23,318 వద్ద కనిష్టాలు తాకాయి. ప్రసంగం పూర్తయిన తర్వాత తిరిగి కొనుగోళ్లు నెలకొనడంతో నష్టాలు భర్తీ చేసుకున్న సూచీలు మిశ్రమంగా ముగిశాయి.వినిమయ షేర్లు పరుగులు ప్రజల వినియోగ శక్తి పెంపు లక్ష్యంలో భాగంగా కేంద్రం వేతన జీవుల వ్యక్తిగత ఆదాయపన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చింది. దీంతో వినిమయ సంబంధిత రంగాలైన రియలిటి, టూరిజం, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్, మీడియా, రవాణా–లాజిస్టిక్స్, ఆటో, ఈవీ–కొత్త తరం ఆటోమోటివ్ షేర్లు పరుగులు పెట్టాయి. → వినిమయ సంబంధిత రంగాల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లలో అత్యధికంగా బ్లూ స్టార్ 13% పెరిగింది. క్రాంప్టన్ గ్రీవ్స్ 8%, హావెల్స్ 6%, వోల్టాస్ 5%, లాభపడ్డాయి. ఏబీ ఫ్యాషన్, వర్ల్పూల్ 3% చొప్పున, టైటాన్ 2% ఎగిశాయి. → ఎఫ్ఎంసీజీ షేర్లలో ఐటీసీ, టాటా కన్జూమర్, హెచ్యూఎల్, డాబర్, మారికో, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా షేర్లు 5% వరకు రాణించాయి. → ఆటో రంగ షేర్లలో మారుతీ సుజుకీ 5%, టీవీఎస్ మోటార్స్ 4%, ఐషర్ మోటార్స్ 3.50%, బజాజ్ ఆటో, మహీంద్రా షేర్లు 3% చొప్పున పెరిగాయి. మౌలిక రంగ షేర్లు డీలా ప్రతిసారి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పరిమితం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.21 లక్షల కోట్ల ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. మూలధన వ్యయ కేటాంపులు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో రైల్వేలు, రక్షణ, మౌలిక, ఇంధన ఆయిల్అండ్గ్యాస్, మెటల్, హౌసింగ్, ఫార్మా, బ్యాంక్ షేర్లు డీలాపడ్డాయి. . → రైల్వే రంగ షేర్లైన టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్స్, జుపిటర్ వేగన్స్ , టిటాఘర్ రైల్ సిస్టమ్స్ షేర్లు 6–10% క్షీణించాయి. ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్ వికాస్ నిగమ్ షేర్లు 7–10% పతనమయ్యాయి. ఐఆర్సీటీసీ, రీట్స్ షేర్లు 3% నష్టపోయాయి. → రోడ్లు, కస్ట్రక్షన్ షేర్లు ఎన్సీసీ 8%, ఎన్బీసీసీ, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, జీఆర్ ఇ్రన్ఫా, ఐఆర్బీ ఇన్ఫ్రా షేర్లు 2–5% పడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో ఏబీబీ, సిమెన్స్, భెల్, ఎల్అండ్టీ, అజాద్ ఇంజనీరింగ్స్ షేర్లు 3–6% క్షీణించాయి.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఊతం పన్ను ప్రతిపాదనలు క్యాపిటల్ మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తేందుకు ఊతం ఇస్తాయి. ఉద్యోగులు రూ.12.75 లక్షల వరకు వేతనంపై రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వినిమయం పెరిగేందుకు సహాయపడుతుంది. వినియమం పెరిగితే షేర్లలో పెట్టుబడులు సైతం పెరుగుతాయి. మూలధన వ్యయంలో 10 శాతం వృద్ధితో అధిక పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధికి ఊతమివ్వడమే బడ్జెట్ లక్ష్యం.బ్యాటరీల తయారీకి దన్ను ఈవీ బ్యాటరీల తయారీకి సంబంధించి మరో 35 యంత్రపరికరాలు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీ విషయంలో అదనంగా 28 యంత్రపరికరాలను సుంకాల మినహాయింపు జాబితాలోకి చేర్చినట్లు మంత్రి తెలిపారు. దీనితో దేశీయంగా లిథియం అయాన్ బ్యాటరీల (మొబైల్ ఫోన్లకు, ఎలక్ట్రిక్ వాహనాలకు) తయారీకి ఊతం లభించనుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా తెలిపారు. స్థానికంగా తయారీ వ్యయాలు తగ్గడంతో పాటు కార్యకలాపాలు విస్తరించేందుకు కంపెనీలకు ప్రోత్సాహంగా కూడా ఉంటుందని రివ్యాంప్ మోటో సహవ్యవస్థాపకుడు ప్రీతేష్ మహాజన్ చెప్పారు. బలమైన అడుగులు.. క్యాన్సర్ డే సెంటర్స్, వైద్య విద్య ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో పెరిగేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ప్రాణాధార ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతోపాటు మెడికల్ టూరిజం, హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహం ప్రకటించారు. సాంకేతికత, మౌలిక రంగంలో పెట్టుబడి, పన్ను స్లాబ్లు, సుంకాల సరళీకరణ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు దేశ నిర్మాణం వైపు బలమైన అడుగులు వేస్తుంది. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్.వైద్య సంరక్షణ కేంద్రంగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ప్రపంచ నాయకత్వం వహించేలా ఎదగడానికి ఈ బడ్జెట్ ప్లాట్ఫామ్గా నిలవనుంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాల ద్వారా మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించాలనే ప్రకటన ప్రపంచ రోగులను ఆకర్షించే స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. హీల్ ఇన్ ఇండియా మిషన్ కింద అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ కేంద్రంగా భారత్ను ఉంచు తుంది. – ప్రతాప్ సి రెడ్డి, ఫౌండర్, అపోలో హాస్పిటల్స్.పెట్టుబడులకు ఊతం.. వినియోగ ఆధారిత వృద్ధిని మధ్యతరగతి ప్రజలు నడిపిస్తారని మంత్రి విశ్వాసం ఉంచారు. వినియోగ డిమాండ్ పుంజుకోవడం మధ్యస్థ కాలంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. పర్యాటకం, టెక్స్టైల్, హస్తకళలు, పాదరక్షలు, బొమ్మ ల వంటి ఉపాధి ఆధారిత రంగాలు తదుపరి స్థాయికి చేరేందుకు తక్షణ ప్రేరణనిచ్చారు. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.వృద్ధికి ఇంధనం.. తయారీ, గ్రీన్ మొబిలిటీ, గ్రామీణ సాధికారతకు వెన్నుదన్నుగా భారత వృద్ధి వేదికలకు ఇంధనం ఇస్తుంది. ఆవిష్కరణ, ఉద్యోగ సృష్టి, ప్రపంచ నాయకత్వానికి బాటలు పరుస్తుంది. గ్రీన్ ఎనర్జీలో గణనీయ పెట్టుబడులు, ఇంధన నిల్వ పరిష్కారాలకు మద్దతు ఇచ్చే స్పష్ట విధానాలతో ఆటోమొబైల్ రంగం పురోగతికి సిద్ధంగా ఉంది. క్లీన్ మొబిలిటీ భవిష్యత్తు పరివర్తనను వేగవంతం చేస్తాయి. స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలకు దేశ నిబద్ధతను బలోపేతం చేస్తాయి. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్. కస్టమర్లకు ఉపశమనం లేదు.. విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు ప్రతిపాదన, అలాగే తయారీ రంగం వాడే యంత్ర పరికరాలపై (క్యాపిటల్ గూడ్స్) పన్ను మినహాయింపు దేశీయ మొబైల్ తయారీ వ్యయాన్ని తగ్గిస్తుంది. వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం లేదు. బడ్జెట్లో ప్రకటించిన మొత్తం చర్యలు భారతదేశంలో పోటీతత్వాన్ని పెంచుతాయి. పంకజ్ మొహింద్రూ, చైర్మన్, ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్.ఇంధన శక్తిలో అగ్రగామిగా.. ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి ప్రైవేట్ రంగం నుండి ఆవిష్కరణలను పెంచుతూ.. స్థిర ఇంధన శక్తిలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా ఉంచాలనే ప్రభుత్వ ఆశయాన్ని నొక్కి చెబుతోంది. విద్యుత్ పంపిణీ రంగాన్ని బలోపేతం చేయడం, స్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన స్మార్ట్ మీటరింగ్ వంటి క్లిష్ట సంస్కరణల అమ లుకు రాష్ట్రాలను ప్రోత్సహించడం సానుకూలాంశం. – నారా విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. -
బడ్జెట్ 2025-26.. నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది ఆమెకు ఎనిమిదో బడ్జెట్, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడవ పర్యాయం ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రెండవ పూర్తి స్థాయి బడ్జెట్.బడ్జెట్ ప్రకటన కారణంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఫిబ్రవరి 1వ తేదీ శనివారం అయినప్పటికీ ఉదయం 9:15 గంటల నుండి ప్రారంభమయ్యాయి. సానుకూల అంచనాలతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు మధ్యాహ్నం 12 ప్రాంతంలో నష్టాల్లోకి జారుకున్నాయి.మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు పతనమయ్యాయి. మరోవైపు హెల్త్కేర్ ఇండెక్స్ మాత్రం లాభాల్లో చలిస్తోంది. -
స్టాక్ మార్కెట్కు ఆర్థిక సర్వే ఊతం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2024-25ను సమర్పించిన అనంతరం దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా నాల్గవ సెషన్లో లాభాలను కొనసాగించాయి. ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి 77,549.92 పాయింట్లకు చేరుకున్న తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 740.76 పాయింట్లు లేదా 0.97 శాతం పెరిగి 77,500.57 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 258.90 పాయింట్లు లేదా 1.11 శాతం పెరిగి 23,508.40 స్థాయిల వద్ద ముగిసింది. ఈరోజు ఇండెక్స్ 23,530.70-23,277.40 రేంజ్లో ట్రేడయింది. నిఫ్టీ50లో టాటా కన్స్యూమర్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, లార్సెన్ & టూబ్రో, కోల్ ఇండియా నేతృత్వంలోని 47 స్టాక్లు 6.24 శాతం వరకు లాభాలను చూశాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ హోటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ 0.82 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీలు వరుసగా 1.89 శాతం, 2.11 శాతంతో బెంచ్మార్క్లను అధిగమించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ నేతృత్వంలోని అన్ని రంగాల సూచీలు వరుసగా 2.04 శాతం, 2.44 శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో, పీఎస్యూ బ్యాంక్, రియల్టీ, మెటల్, ఓఎంసీలు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు శుక్రవారం 1 శాతంపైగా లాభాలతో ముగిశాయి.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ 2024-25 కోసం డి-స్ట్రీట్ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ కారణంగా భారతీయ ఈక్విటీ మార్కెట్ శనివారం ట్రేడింగ్కు తెరిచి ఉంటుంది. -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 134.73 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 76,894.55 వద్ద, నిఫ్టీ 46.20 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,295.70 వద్ద కొనసాగుతున్నాయి. యూనియన్ బడ్జెట్ సమావేశాల వేళ నేడు స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగానే ముందుకు సాగుతున్నాయి.లార్సెన్ & టూబ్రో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. భారతి ఎయిర్టెల్, కోల్ ఇండియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస లాభాలు.. సెన్సెక్స్ హ్యాట్రిక్
దేశీయ స్టాక్మార్కెట్లు (Stock Market ) గురువారం లాభాల్లో ముగిశాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో సెషన్లోనూ పైకి కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 226.85 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 76,759.81 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు గరిష్టంగా 76,898.63 వద్ద ట్రేడవగా, కనిష్ట స్థాయి 76,401.13 వద్ద నమోదైంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ (Nifty) 86.40 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 23,249.50 వద్ద ముగిసింది. గురువారం ఈ ఇండెక్స్ 23,311.15 నుంచి 23,139.20 రేంజ్లో ట్రేడ్ అయింది.భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్ నేతృత్వంలోని టాప్ గెయినర్ స్టాక్లు 4.87 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. నిఫ్టీ50లోని 35 సానుకూలంగా ముగిశాయి. మరోవైపు టాటా మోటార్స్, ఐటీసీ హోటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ 6.98 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి. ఈ ఇండెక్స్లోని 17 స్టాక్లు నష్టాలను చవిచూశాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 0.12 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ స్వల్పంగా 0.01 శాతం తగ్గింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించింది. ఈ ధఫా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ శనివారం రోజున వెలువడుతుండడంతో ఆరోజు మార్కెట్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని సెబీ తెలిపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 వరుసగా రెండవ సెషన్లోనూ లాభాలను నమోదు చేశాయి. 30-షేర్ల సెన్సెక్స్ 631.55 పాయింట్లు లేదా 0.83 శాతం పురోగమించి రోజు గరిష్ట స్థాయి 76,589.93కి చేరిన తర్వాత 76,532.96 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 205.85 పాయింట్లు లేదా 0.90 శాతం లాభపడి 23,163.10 వద్ద ముగిసింది. ఈ సూచీ బుధవారం 23,181.35 నుంచి 22,976.50 రేంజ్లో ట్రేడయింది.విస్తృత మార్కెట్లు బెంచ్మార్క్లను అధిగమించాయి. నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 3.32 శాతం పెరగడంతో స్మాల్క్యాప్ షేర్లు ఛార్జ్లో ముందంజలో ఉన్నాయి. కాగా నిఫ్టీ మిడ్క్యాప్ 100 2.31 శాతం లాభంతో ముగిసింది.శనివారం పనిచేయనున్న మార్కెట్లుకేంద్ర బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నందున వచ్చే శనివారం (ఫిబ్రవరి 1) దేశీయ స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) రెండూ శనివారం పూర్తి ట్రేడింగ్ సెషన్లను నిర్వహించనున్నట్లు ధ్రువీకరించాయి .తాజాగా జారీ చేసిన సర్క్యులర్లో ఈక్విటీ మార్కెట్లు ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు తెరిచి ఉంటాయని, కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ సాయంత్రం 5:00 గంటల వరకు ట్రేడింగ్ ఉంటుందని ఎక్స్ఛేంజీలు వివరించాయి. అయితే, సెటిల్మెంట్ సెలవు కారణంగా "T0" సెషన్ షెడ్యూల్ మాత్రం ఉండదు. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ ఉదయం 9:00 నుండి 9:08 వరకు జరుగుతుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 535.23 పాయింట్లు లేదా 0.71 శాతం లాభంతో 75,901.41 వద్ద, నిఫ్టీ 128.10 పాయింట్లు లేదా 0.56 శాతం లాభంతో.. 22,957.25 వద్ద నిలిచాయి.బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, HDFC బ్యాంక్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
డీప్సీక్.. మార్కెట్ షేక్!
ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపు భయాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 76వేల స్థాయి దిగువన 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23,000 స్థాయిని కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 263 పాయింట్లు పతనమై 22,829 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 923 పాయింట్లు క్షీణించి 75,267 వద్ద, నిఫ్టీ 306 పాయింట్లు పతనమై 22,786 వద్ద కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 86.31 స్థాయి స్థిరపడింది. → ప్రధాన సూచీలు ఒకశాతమే పడినా.. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు భారీగా క్షీణించాయి. అధిక వాల్యుయేషన్ల భయాలతో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5%, మిడ్ క్యాప్ సూచీ 2.7% పడింది. → స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.9.28 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.410.23 లక్షల కోట్ల(4.75 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచి్చంది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. → ఐటీసీ లిమిటెడ్ నుంచి విడదీసిన ఐటీసీ హోటల్స్ షేర్లు జనవరి 29న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1న ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ ప్రత్యేక సంస్థగా విడిపోయింది. ప్రతి పది ఐటీసీ షేర్లకు ఒక ఐటీసీ హోటల్ షేరు ధరను కేటాయించారు.ఎందుకీ పతనం...→ అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. → చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ఆర్1 ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమను కుదిపేస్తుంది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్పై పడింది. → అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి. → ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. యూఎస్ టెక్ దిగ్గజాలలో కలవరం యూఎస్ ఏఐకు పోటీగా చైనీస్ ఆర్1 టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు 3 శాతం పతనమైన నాస్డాక్ చాట్జీపీటీకి పోటీగా చైనీస్ డీప్సీక్ మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, గూగుల్ తదితర యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్స్, చాట్జీపీటీకి పోటీగా చైనా రంగంలోకి దిగింది. స్టార్టప్ డీప్సీక్.. అమెరికా ఏఐలకు దీటుగా ఆర్1ను విడుదల చేస్తోంది. దీంతో టెక్నాలజీ వర్గాల్లో ఆందోళనలకు తెరలేచింది. చైనా కారుచౌకగా ఏఐ సేవలు అందించనున్న అంచనాలు యూఎస్ ఇన్వెస్టర్లలో భయాలను కల్పించింది. దీంతో టెక్ కంపెనీలు లిస్టయిన నాస్డాక్ ఇండెక్స్ ప్రారంభంలోనే 3 శాతం పతనమైంది. మ్యాగ్నిఫిషియంట్ 7గా పేర్కొనే ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఏఎండీ తదితరాలు అమ్మకాలతో డీలా పడ్డాయి. ప్రధానంగా ఏఐ అవకాశాలపై అంచనాలతో ఇటీవల భారీ ర్యాలీ చేస్తున్న ఎన్విడియా షేరు 17 శాతంపతనంకాగా.. మైక్రోసాఫ్ట్ 3 శాతంపైగా క్షీణించింది. ఫలితంగా ఒక్కరోజులోనే ఎన్విడియా మార్కెట్ విలువలో సుమారు 500 బిలియన్ డాలర్లు ఆవిరైంది. ఆర్1 ఎఫెక్ట్..: చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఆర్1.. అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్డ్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్ను ఆర్1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 838.43 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 75,352.03 వద్ద.. నిఫ్టీ 274.90 పాయింట్లు లేదా 1.19 శాతం నష్టంతో 22,817.30 వద్ద నిలిచాయి.ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందూస్తాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
Stock Market: చివరికి నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ ( NSE) నిఫ్టీ50 వారాంతపు ట్రేడింగ్ సెషన్ను లోయర్ నోట్తో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 329.92 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 76,190.46 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 76,985.95 - 76,091.75 రేంజ్లో ట్రేడయింది.సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 113.15 పాయింట్లు లేదా 0.49 శాతం తగ్గి 23,092.20 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,347.30 వద్ద నమోదు చేయగా, కనిష్ట స్థాయి 23,050 వద్ద కనిపించింది. నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 31 స్టాక్లు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా 4.90 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇదిలా ఉండగా హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ 2.52 శాతం వరకు లాభాలతో గ్రీన్లో ముగిసిన 19 స్టాక్లలో ఉన్నాయి.స్మాల్-క్యాప్ షేర్లు విస్తృత మార్కెట్లలో అత్యంత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ స్మాల్క్యాప్ 100 2.35 శాతం దిగువన, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 1.55 శాతం దిగువన ముగిసింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ ఇటీవల అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం మూలధన పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. కొన్ని ప్రారంభ ఒడిదుడుకుల తర్వాత, బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు సానుకూల ధోరణిని ప్రదర్శించాయి. ఆటో, ఐటీ, సిమెంట్తోపాటు కొన్ని హెల్త్కేర్ షేర్లపై ఆసక్తిని పెంచాయి.బీఎస్ఈ బెంచ్మార్క్ సూచీ అయిన సెన్సెక్స్ (Sensex) ప్రారంభ డీల్స్లో 76,202 కనిష్ట స్థాయిని తాకింది. ఆపై స్థిరంగా కనిష్ట స్థాయి నుండి 543 పాయింట్లు పెరిగి 76,743 గరిష్ట స్థాయికి ర్యాలీ చేసింది. చివరకు 115 పాయింట్ల లాభంతో 76,520 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (Nifty) వరుసగా 23,271, 23,091 వద్ద గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. 50 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 23,205 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30లో అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 7 శాతం ఎగబాకి రూ. 11,400 స్థాయిలకు చేరుకుంది. ఇక జోమాటో 2.5 శాతం లాభపడగా, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్ ప్రధాన లాభపడిన షేర్లలో ఉన్నాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ 1 శాతంపైగా క్షీణించాయి.విస్తృత మార్కెట్లో, బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం జంప్ చేయగా, స్మాల్క్యాప్ 0.7 శాతం పెరిగింది. మిడ్క్యాప్ ఐటీ వంటి కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటివి ఒక్కొక్కటి 10 శాతానికి పైగా పెరిగాయి. రంగాల వారీగా ఆటో, ఐటీ, హెల్త్కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1 - 2 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. కాగా బ్యాంకింగ్ సంబంధిత సూచీలు తగ్గుముఖం పట్టాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market: ఒడిదుడుకులు.. ఎట్టకేలకు లాభాలు
ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు బుధవారం ఇంట్రా-డే డీల్స్లో రోలర్-కోస్టర్ రైడ్ను తలపించాయి. స్థిరంగా ప్రారంభమైన బెంచ్మార్క్ సూచీలు క్రమంగా లాభాలను తగస్తూ నష్టాల్లోకి జారిపోయాయి. తర్వాత ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో లాభాల కారణంగా తిరిగి బలంగా పుంజుకున్నాయి.బీఎస్ఈ (BSE) సెన్సెక్స్ 76,114 వద్ద ప్రారంభమైన తర్వాత, లాభాలను తగ్గించి 75,817 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 76,461 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. 567 పాయింట్ల లాభంతో 76,405 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రా-డేలో వరుసగా రెండో రోజు 23,000 మార్క్ దిగువకు పడిపోయింది. సూచీ 22,981 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే చివరకు 131 పాయింట్ల లాభంతో 23,155 వద్ద ముగిసింది.ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మధ్యాహ్న డీల్స్తో పుంజుకుంది .ఇతర సెన్సెక్స్ 30 షేర్లలో ఇన్ఫోసిస్క, టీసీఎస్ ఒక్కొక్కటి 3 శాతం పెరిగాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో 1-2 శాతం మధ్య ఎగిశాయి. మరోవైపు టాటా మోటార్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. నష్టాలను చవిచూసిన ఇతర ముఖ్యమైన స్టాక్స్లో పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఉన్నాయి. విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ 1.6 శాతం పడిపోయింది. రెండు సూచీలు రోజు ద్వితీయార్ధంలో నష్టాల్లో కొంత భాగాన్ని తిరిగి పొందాయి. సెక్టోరియల్ ఇండెక్స్లలో - బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ కూడా దాదాపు 2 శాతం క్షీణించింది. మిగతా వాటిలో బుధవారం ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా ర్యాలీ చేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రంప్ టారిఫ్ టెర్రర్
ముంబై: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య టారిఫ్ పెంపు భయాలకు తోడు అధిక వెయిటేజీ షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకటిన్నరశాతానికి పైగా కుప్పకూలాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మరింత ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 1,235 పాయింట్లు పతనమై 75,838 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి 23,025 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఏడు నెలల కనిష్టం. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,432 పాయింట్లు క్షీణించి 75,642 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లు పతనమై 22,976 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. డాలర్తో రూపాయి విలువ 13 పైసలు బలహీనపడి 86.58 వద్ద స్థిరపడింది.⇒ అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. రియల్టీ ఇండెక్స్ 4.2% క్షీణించింది. కన్జూమర్ డ్యూరబుల్స్ 4%, సర్విసెస్, విద్యుత్, టెలికం, యుటిలిటీ ఇండెక్సులు 2.5% పడ్డాయి.నష్టాలకు 4 కారణాలు⇒ ‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.⇒ దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్ (ఎర్కింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ అంచనా వేసింది.⇒ జొమాటో (–11%)తో సహా అధిక వెయిటేజీ షేర్లు ఐసీఐసీఐ బ్యాంకు (–3%), ఎస్బీఐ (–2.57%), రిలయన్స్ (–2.50%), ఎంఅండ్ఎం (–2.25%) షేర్లు భారీగా క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ మొత్తం పతనంలో ఈ షేర్ల వాటాయే 640 పాయింట్లు. కాగా ఒక్క జొమాటో షేరు వాటా 150 పాయింట్లు కావడం గమనార్హం.⇒ విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దలాల్ స్ట్రీట్పై మరింత ఒత్తిడి పెంచాయి. ఈ కొత్త ఏడాది జనవరి 20 నాటికి ఎఫ్ఐఐలు మొత్తం రూ.48,023 కోట్ల విలువైన భారత ఈక్విటీలు అమ్మేశారు. 7.5 లక్షల కోట్లు ఆవిరిమార్కెట్ భారీ పతనంతో సోమవారం ఒక్కరోజే రూ.7.52 లక్షల కోట్లు హరించుకుపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.424 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్లోని మొత్తం 30 షేర్లలో అల్ట్రాటెక్(0.39%), హెచ్సీఎల్ టెక్(0.33%) మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. -
లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,071.98 పాయింట్లు లేదా 1.39 శాతం నష్టంతో 76,001.46 వద్ద, నిఫ్టీ 299.45 పాయింట్లు లేదా 1.28 శాతం నష్టంతో.. 23,045.30 వద్ద నిలిచాయి.ట్రెంట్, అదానీ పోర్ట్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), JSW స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల విజయ పరంపరకు బ్రేక్ వేస్తూ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వారంలో చివరి ట్రేడింగ్ సెషన్ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 403.24 పాయింట్లు లేదా 0.52 శాతం క్షీణించి 76,639.58 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 77,069.19-76,263.29 రేంజ్లో ట్రేడయింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 108.60 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 23,203.20 వద్ద ముగిసింది. నిఫ్టీ50 23,292.10 వద్ద గరిష్ట స్థాయికి చేరుకోగా, రోజు కనిష్ట స్థాయి 23,100.35 వద్ద నమోదైంది. నిఫ్టీ50లోని 50 స్టాక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, బిపిసిఎల్, హిందాల్కో, హిందాల్కో, కోల్ ఇండియా నేతృత్వంలోని 29 లాభాలతో గ్రీన్లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో వంటి 21 షేర్లు నష్టాల్లో ముగిసి 5.75 శాతం వరకు నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ హ్యాట్రిక్
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 గురువారం వరుసగా మూడవ సెషన్లో సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 318.74 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 77,042.82 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 77,319.50 నుండి 76,895.51 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 98.60 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 23,311.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.65కి చేరుకోగా, కనిష్ట స్థాయి 23,272.05 వద్ద నమోదైంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ , అదానీ పోర్ట్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా ఉన్నాయి. వీటి లాభాలు 7.99 శాతం వరకు పెరగడంతో నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 33 గ్రీన్లో ముగిశాయి.మరోవైపు ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ నేతృత్వంలోని 17 భాగస్వామ్య స్టాక్లు 2.90 శాతం వరకు క్షీణించి నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్క్యాప్ 100, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీలు 1 శాతంపైగా పెరగడంతో విస్తృత మార్కెట్లు బెంచ్మార్క్లను అధిగమించాయి. ఇదిలా ఉండగా, మార్కెట్ అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ 1.35 శాతం పెరిగి 15.17 పాయింట్ల వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 273.66 పాయిట్లు లేదా 0.36 శాతం లాభంతో.. 76,773.30 వద్ద, నిఫ్టీ 51.75 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 23,227.80 వద్ద నిలిచాయి.ట్రెంట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు లాభపడి 23,229కు చేరింది. సెన్సెక్స్(Sensex) 252 పాయింట్లు ఎగబాకి 76,767 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 109.23 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 80 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.79 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.1 శాతం లాభపడింది. నాస్డాక్ 0.2 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’రూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 631.88 పాయింట్లు లేదా 0.82 శాతం నష్టంతో 76,747.02 వద్ద, నిఫ్టీ 206.50 పాయింట్లు లేదా 0.88 శాతం నష్టంతో 23,225.00 వద్ద కొనసాగుతున్నాయి.ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS), బ్రిటానియా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అపోలో హాస్పిటల్, SBI లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ, ట్రెంట్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో రోజూ క్షీణించాయి. శుక్రవారం వారాన్ని ప్రతికూల నోట్తో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ (Sensex) 241.30 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 77,378.91 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 77,099.55 - 77,919.70 రేంజ్లో ట్రేడయింది.ఇక ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 (Nifty) 95 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 23,431.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,596.60 వద్ద కనిపించగా, కనిష్ట స్థాయి 23,426.55 వద్ద ఉంది.శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టిపిసి, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్ నేతృత్వంలోని నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 36 నష్టాలతో ముగిశాయి. మరోవైపు టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్ 6 శాతం వరకు లాభాలతో గ్రీన్లో ముగిసిన 14 స్టాక్లలో ఉన్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్క్యాప్ 100 2.08 శాతం నష్టంతో 54,585.75 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 2.61 శాతం నష్టాలతో 17,645.55 వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: 1000 పాయింట్లు దాటిన సెన్సెక్స్
గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1,436.30 పాయింట్లు లేదా 1.83 శాతం లాభంతో 79,943.71 వద్ద, నిఫ్టీ (Nifty) 445.75 పాయింట్లు లేదా 1.88 శాతం లాభంతో 24,188.65 వద్ద నిలిచాయి.ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒడిదుడుకుల్లో స్వల్ప నష్టాలు
ముంబై: స్టాక్ సూచీల లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 78,473 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు పతనమై 23,728 వద్ద నిలిచింది. విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా తరలిపోతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 78,398–78,877 శ్రేణిలో... నిఫ్టీ 23,868–23,685 రేంజ్లో ట్రేడయ్యాయి.ఫైనాన్సియల్స్, ఐటీ, మెటల్, విద్యుత్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కన్జూమర్ డి్రస్కిషనరీ, ఇంధన, ఫార్మా, టెలికం, ఆటో, ఆయిల్అండ్గ్యాస్, సరీ్వసెస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా బుధవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు సెలవు ప్రకటించాయి. బులియన్, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. ఐపీఓలకు భారీ స్పందన సెనోరెస్ ఫార్మా ఐపీఓకు చివరిరోజు నాటికి 93.69 రెట్ల స్పందన లభించింది. ఆఫర్లో భాగంగా 85.34 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 79.95 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ విభాగం 90.46 రెట్లు సబ్స్రై్కబ్ అయింది. వెంటివ్ హాస్పిటాలిటీ ఐపీఓ 9.82 రెట్ల స్పందన దక్కింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.44 కోట్ల షేర్లను జారీ చేయగా 14.17 కోట్ల ఈక్విటీలకు దరఖాస్తులు వచ్చాయి. రిటైల్ విభాగానికి 5.94 రెట్ల స్పందన లభించింది. ఇక కరారో ఇండియాకు 1.12 రెట్ల స్పందన నమోదైంది. ఆఫర్లో 1.30 కోట్ల ఈక్విటీలను జారీ చేయగా 1.46 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ విభాగం 2.21 రెట్లు, రిటైల్ విభాగం 71% సబ్స్క్రైబ్ అయ్యాయి. -
శుభారంభం పలికిన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 456.91 పాయింట్లు లేదా 0.59 శాతం లాభంతో 78,498.50 వద్ద, నిఫ్టీ 135.15 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 23,722.65 వద్ద కొనసాగుతున్నాయి.శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యు స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్స్, భారతి ఎయిర్టెల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వంటివి నష్టాలను చవి చూశాయి.ఇదీ చదవండి: షార్ట్ కవరింగ్ లావాదేవీలకు అవకాశం(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
షార్ట్ కవరింగ్ లావాదేవీలకు అవకాశం
గత వారం స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు చుక్కలు చూపించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ దాదాపు 3700 పాయింట్లు నష్టపోయి 78000 పాయింట్ల స్థాయిలో స్థిరపడగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 1200 పాయింట్లు కోల్పోయి 23600 దరిదాపుల్లో ముగిసింది. అంటే సెన్సెక్స్, నిఫ్టీలు ఒకవారం రోజుల వ్యవధిలో 5 శాతం నష్టపోయాయన్నమాట.ప్రధాన సూచీలు ఈస్థాయిలో పడిపోవడం మామూలు విషయమేమీ కాదు. పైగా కేవలం గత గురు, శుక్రవారాల్లో భారీగా నష్టపోయాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా. కిందటి బుధవారం రాత్రి (మన కాలమానం ప్రకారం) అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వడ్డీ రేట్లను పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోతలు చాలా పరిమిత సంఖ్యలో ఉంటాయన్న ప్రకటన మార్కెట్లకు నచ్చలేదు. దీంతో అక్కడి డోజోన్స్, నాస్డాక్స్ సూచీలు భారీగా నష్టపోయాయి. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ఆసియా, ఐరోపా మార్కెట్లూ ఊచకోతకు గురయ్యాయి. ఇందుకు మన మార్కెట్లూ మినహాయింపు కాలేదు.విదేశీ మదుపర్లుడిసెంబర్ చివరి వారానికి వచ్చేశాం. సాధారణంగా డిసెంబర్లో విదేశీ మదుపర్ల లావాదేవీలు మందగిస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ వారంలో వీరి కొనుగోళ్ల స్థాయి పడిపోతుంది. దీంతో సూచీలు చాలా స్తబ్దుగా కొనసాగుతాయి. ఇప్పటికే వీరి విధ్వంసాన్ని మార్కెట్లు కళ్లజూశాయి. మళ్ళీ వీళ్ళు జనవరి రెండో వారంలో మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెడతారు. అప్పటి దాకా దూకుడు కొంత తగ్గవచ్చు.గత వారం విదేశీ మదుపర్లు దాదాపు రూ. 20,000 కోట్ల షేర్లను నికరంగా విక్రయించారు. ఈ నెల మొత్తానికి మాత్రం వీరి నికర విక్రయాలు సుమారు రూ.4,100 కోట్లుగా ఉన్నాయి. దీనికి కారణం అంత క్రితం రెండు వారాల్లో వీళ్ళు నికర కొనుగోళ్లు జరపడమే.ఈ వారం అంచనాలుఈ వారం కూడా మార్కెట్లలో జోరు ఉండకపోవచ్చు. కొన్నాళ్ల పాటు నష్టాల బాటలోనే కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. నిఫ్టీకి 23500 వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు. ఒకవేళ ఆ స్థాయిని కూడా బ్రేక్ చేసి దిగజారితే 23370 వరకు పడిపోవచ్చు. ఒకవేళ అక్కడి దాకా చేరితే.. మార్కెట్కు మద్దతు దొరికి మళ్ళీ సూచీలు బలంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అదీ కాని పక్షంలో 23000 వరకు పతనం కొనసాగవచ్చు. ఒకవేళ సూచీలు ముందుకు కదిలితే 23700 వద్ద మొదటి నిరోధం ఎదురవుతుంది. దాన్ని అధిగమిస్తే తదుపరి నిరోధం 23800 వద్దఎదురవుతుంది. దీన్నీ దాటుకుని ముందుకెళ్తే 24000 వరకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.ఇప్పటికే మార్కెట్లు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయి. ముఖ్యంగా సూచీల్లో ఎక్కువ స్థాయిలో షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి. గత వారమంతా అమ్మకాలు కొనసాగడం, డిసెంబర్ నెల కాంట్రాక్టులకు సంబంధించి ఇదే చివరి వారం కావడం వంటి కారణాల వల్ల వారంలో ఏ సమయంలోనైనా షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక బ్యాంకు నిఫ్టీ విషయాని కొస్తే.. 50500 దిగువన కొనసాగితే మాత్రం 49000 వరకు క్షీణించే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్లు ముందుకెళ్తే 52000 వరకు సూచీ దూసుకెళ్ళవచ్చు. షార్ట్ కవరింగ్ లావేదేవీలు సహకరిస్తే 53000 వరకు పరుగులు తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.జీఎస్టీ మండలి నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై విధిస్తున్న పన్ను రేట్ల తగ్గింపు. గత సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం వెలువడవచ్చని భావించినప్పటికీ.. ఇది వాయిదా పడటం ఒక రకంగా ఇన్సూరెన్సు కంపెనీల షేర్లపై స్వల్ప స్థాయిలోనే అయినా ప్రతికూల ప్రభావం చూపించడానికి ఆస్కారంఉంది. ఆటోమొబైల్, చమురు షేర్లు నష్టాల్లోనే కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో ఎలాటి ప్రభావిత వార్తలు లేకపోవడంతో సిమెంట్ షేర్స్ మందకొడిగా కొనసాగవచ్చు.ఇక ఎఫ్ఎంసీజీ, టెలికాం రంగాల షేర్లలోనూ స్తబ్దత తప్పదు. యంత్ర పరికరాల రంగానికి సంబంధించిన షేర్లకు నష్టాల బాట తప్పక పోవచ్చు. సాధారణంగా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు సురక్షిత రంగంగా ఫార్మాను భావిస్తూ ఉంటారు. గతవారం లాభాల్లో నడిచిన ఫార్మా షేర్లు ఈ వారం కూడా అదేస్థాయిలో జోరు కొనసాగించవచ్చు. క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు బుధవారం సెలవు.- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు -
ఇన్వెస్టర్లకు ఫ్రై డే
ముంబై: దేశీయ స్టాక్ సూచీలను వరుసగా అయిదో రోజూ నష్టాలు వెంటాడాయి. వచ్చే ఏడాదిలో ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో శుక్రవారమూ కుప్పకూలాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,176 పాయింట్లు క్షీణించి 79 వేల పాయింట్ల స్థాయి దిగువన 78,042 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 364 పాయింట్లు నష్టపోయి 23,588 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ. 10 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. సెన్సెక్స్ 1,344 పాయింట్లు క్షీణించి 77,875 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు కోల్పోయి 23,537 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో ఇండోనేషియా మినహా అన్ని దేశాల సూచీలు 3% వరకు పతనయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. డాలర్తో రూపాయి విలువ 9 పైసలు బలపడి 85.04 వద్ద ముగిసింది. 5 రోజుల్లో రూ.18.43 లక్షల కోట్ల నష్టం స్టాక్ మార్కెట్ వరుసగా 5 రోజుల్లో సెన్సెక్స్ 4,091 పాయింట్ల (5%) కుదేలవడంతో రూ.18.43 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.440.99 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,064.12 పాయింట్లు లేదా 1.30 శాతం నష్టంతో 80,684.45 పాయింట్ల వద్ద, నిఫ్టీ 332.25 పాయింట్లు లేదా 1.35 శాతం నష్టంతో 24,336.00 వద్ద నిలిచాయి.సిప్లా, విప్రో, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటీసీ కంపెనీ, ఇన్ఫోసిస్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, జేఎస్డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
–1,207 నుంచి +843 పాయింట్లకు సెన్సెక్స్
ముంబై: ప్రారంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న స్టాక్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదుచేశాయి. టెలికం, ఐటీ, కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1,207 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అనూహ్యంగా రికవరీ అయ్యి చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద నిలిచింది. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద స్థిరపడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ ప్రభావంతో ప్రారంభంలో సెన్సెక్స్ 1,207 పాయింట్లు క్షీణించి 80,083 వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 24,181 వద్ద కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్ల సంబంధిత షేర్లు ఫైనాన్స్, రియలీ్ట, ఆటో షేర్లు రాణించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల తీవ్రత మరింత పెరగడంతో లాభాలు ఆర్జించగలిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 924 పాయింట్లు పెరిగి 82,213 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు బలపడి 24,792 వద్ద గరిష్టాలు అందుకున్నాయి. మెటల్, సర్వీసెస్, కమోడిటీస్, ఇండ్రస్టియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.29%, 0.08 శాతం చొప్పున నష్టపోయాయి. -
సూచీలు అక్కడక్కడే..!
ముంబై: ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో స్టాక్ సూచీలు మంగళవారం అక్కడిక్కడే ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ రెండు పాయింట్ల లాభంతో 81,510 వద్ద నిలిచింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 24,610 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ప్రథమార్థంతా లాభాల్లో కదిలాయి. మిడ్సెషన్లో లాభాల స్వీకరణతో నష్టాలు చవిచూశాయి.ట్రేడింగ్ చివర్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు రాణించడంతో నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 543 పాయింట్ల పరిధిలో 81,508 – 81,726 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 24,678 వద్ద కనిష్టాన్ని, 24,511 గరిష్టాన్ని తాకింది. రియలీ్ట, ఐటీ, మెటల్, కమోడిటీ, ఫైనాన్స్ సర్వీసెస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, పవర్, సర్విసెస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
3 రోజుల్లో 1,802 పాయింట్లు అప్
ముంబై: ప్రధానంగా పీఎస్యూ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లకు పెరిగిన డిమాండ్తో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ 598 పాయింట్లు జంప్చేసి 80,846 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్ల వృద్ధితో 24,457 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,802 పాయింట్లు జమ చేసుకుంది. మరోసారి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 701, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున ఎగశాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 81,000 సమీపాని(80,949)కి చేరింది. గ్లోబల్ మార్కెట్ల సానుకూలతలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్ కౌంటర్లు వెలుగులో నిలిచినట్లు పేర్కొన్నారు.బ్లూచిప్స్ బలిమి..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, మీడియా 2.5 శాతం జంప్చేయగా.. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ప్రయివేట్ బ్యాంక్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఆటో, ఐటీ 0.5 శాతం బలపడగా.. ఎఫ్ఎంసీజీ 0.4 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్ 6 శాతం జంప్చేసింది. ఎన్టీపీసీ, అదానీ ఎంటర్, యాక్సిస్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, అ్రల్టాటెక్, ఓఎన్జీసీ, సిప్లా, బీఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.7–1 శాతం మధ్య లాభపడ్డాయి.అయితే ఎయిర్టెల్, హీరోమోటో, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ 1.5–0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. మార్కెట్ల బాటలో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1% ఎగశాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి రూ. 3,665 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయడం గమనార్హం! దేశీ ఫండ్స్ రూ. 251 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ⇒ వారాంతాన 40 శాతం ప్రీమియంతో లిస్టయిన ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్ ఇంట్రాడేలో మరో 19 శాతం జంప్చేసి రూ. 264ను తాకింది. చివరికి ఈ షేరు 16 % లాభంతో రూ. 258 వద్ద ముగిసింది.⇒ గత నెల 27న లిస్టయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 142 వద్ద నిలిచింది. ఈ షేరు ఐపీవో ధర రూ. 108.బంపర్ లిస్టింగ్లుసీ2సీ అడ్వాన్స్డ్ చిన్న తరహా కంపెనీ(ఎస్ఎంఈ).. సీ2సీ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ బంపర్ లిస్టింగ్ సాధించింది. ఇష్యూ ధర రూ.226తో పోలిస్తే 90% ప్రీమియంతో రూ.429 వద్ద ప్రారంభమైంది. చివరికి 99.5 శాతం లాభంతో రూ.451 వద్ద ముగిసింది.రాజ్పుటానా బయోడీజిల్ ఎస్ఎంఈ సంస్థ రాజ్పుటానా బయోడీజిల్ లిస్టింగ్ అదిరింది. ఇష్యూ ధర రూ. 130తో పోలిస్తే 90% ప్రీమియంతో రూ. 247 వద్ద ప్రారంభమైంది. చివరికి 99.5% లాభంతో రూ. 259 వద్ద ముగిసింది. -
రెండో రోజూ మార్కెట్ జోరు
ముంబై: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి మందగించినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. గత 7 త్రైమాసికాలలోనే ఆర్థిక వ్యవస్థ కనిష్ట వృద్ధికి పరిమితమైనప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు లాభాలతో నిలిచాయి. ఆర్థిక వృద్ధి మందగించిన కారణంగా స్వల్ప వెనకడుగుతో ప్రారంభమైన మార్కెట్లు వెనువెంటనే కోలుకున్నాయి. మిడ్సెషన్ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 445 పాయింట్లు లాభపడింది. 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 145 పాయింట్లు బలపడి 24,276 వద్ద నిలిచింది. రియల్టీ జూమ్..: ఎన్ఎస్ఈలో రియల్టీ అత్యధికంగా 3 శాతం ఎగసింది. కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అ్రల్టాటెక్, అపోలో, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, టెక్ఎం, టైటన్, డాక్టర్ రెడ్డీస్, ఆర్ఐఎల్, సన్, మారుతీ, హెచ్సీఎల్టెక్, కోల్ ఇండియా 4–1.3 శాతం మధ్య బలపడ్డాయి.అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, హెచ్యూఎల్, బ్రిటానియా, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ 2.7–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. మధ్య, చిన్నతరహా షేర్లలో 463 కౌంటర్లు అప్పర్ సర్క్యూట్ను తాకాయి. ఈ జాబితాలో రామ్కో సిస్టమ్స్, గోల్డియామ్ ఇంటర్నేషనల్, అతుల్ ఆటో, కొచిన్ షిప్యార్డ్ తదితర కంపెనీలు ఉన్నాయి.అదానీ గ్రూప్ నేలచూపు:మార్కెట్లు లాభపడినప్పటికీ అదానీ గ్రూప్లోని ఆరు కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర షేర్లలో ఎన్డీటీవీ, అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్ 1–0.5 శాతం మధ్య నీరసించాయి. -
సూచీలకు స్వల్ప నష్టాలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 80,004 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 24,194 వద్ద నిలిచింది. యుటిలిటీస్, పవర్, ఆటో, ఆయిల్అండ్గ్యాస్, సర్వీసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.ఐటీ, టెక్, టెలికమ్యూనికేషన్, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రంప్ తన ప్రమాణ స్వీకారం రోజు జనవరి 20న మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25%, చైనాల నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై పది శాతం పన్ను విధింపునకు అవసరమైన పత్రాలపై సంతకం చేస్తానంటూ తెలపడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్ ఐపీఓ చివరి రోజు నాటికి 89.90 రెట్ల స్పందన వచ్చింది ఇష్యూలో భాగంగా కంపెనీ 3.07 కోట్ల షేర్లు జారీ చేయగా, 277 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీ విభాగం 157 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 24 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 378.88 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 77,199.50 వద్ద, నిఫ్టీ 167.85 పాయింట్లు లేదా 0.71 శాతం నష్టంతో 23,350.65 వద్ద నిలిచాయి.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రా టెక్ సిమెంట్, హిందాల్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 189.28 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 77,528.29 వద్ద, నిఫ్టీ 46.45 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,500.25 పాయింట్ల వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, రిలయన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిఫ్టీకి ఏడోరోజూ నష్టాలే..
ముంబై: ఐటీ, ఆయిల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో నిఫ్టీ ఏడోరోజూ నష్టాలు చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77,339 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయి 23,454 వద్ద నిలిచింది. ప్రథమార్థంలో సెన్సెక్స్ 615 పాయింట్లు క్షీణించి 76,965 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు కోల్పోయి 23,350 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.అయితే మిడ్సెషన్ నుంచి మెటల్, రియలీ్ట, ఆటో, సరీ్వసెస్, కన్జూమర్ బ్యాంకులు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర భర్తీ అయ్యాయి. రంగాలవారీగా.., ఐటీ ఇండెక్స్ 2.50%, ఆయిల్అండ్గ్యాస్ 2%, ఫార్మా, మీడియా సూచీలు 1% చొప్పున పతనమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున తక్షణ వడ్డీరేట్ల తగ్గింపు ఇప్పట్లో అవసరం లేదంటూ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ డిసెంబర్లో ఫెడ్ రేట్ల కోత ఉండకపోవచ్చనే సంకేతాలతో టీసీఎస్, ఎంఫసీస్, ఎల్టీఐఎం షేర్లు 3% క్షీణించగా.. ఇన్ఫీ 2.50% విప్రో 2% పడ్డాయి. ⇒ డిసెంబర్ నుంచి చైనా కమోడిటీలకు సంబంధించి ఎగుమ తులపై పన్ను రాయి తీలను తగ్గించడం లేదా రద్దు చేయాలనే ప్రతిపాదనలతో మెటల్ షేర్లు మెరిశాయి. నాల్కో 9 శాతం, హిందాల్కో 4%, వేదాంత 3%, టాటా స్టీల్ 2%, ఎన్ఎండీసీ 1.50%, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకశాతం లాభపడ్డాయి. ⇒ ప్రభుత్వం నేచరల్ గ్యాస్ సరఫరాను నెలలో రెండోసారి తగ్గించడంతో గ్యాస్ పంపిణీ సంస్థల షేర్లు పతనమయ్యాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ 20% క్షీణించి రూ.325 వద్ద, మహానగర్ గ్యాస్ 14% పడి రూ.1,131 వద్ద ముగిశాయి. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 210.39 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,369.92 వద్ద, నిఫ్టీ 72.75 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 23,459.95 వద్ద నిలిచాయి.హిందాల్కో, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ట్రెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 69.52 పాయింట్లు లేదా 0.089 శాతం నష్టంతో 77,621.44 వద్ద, నిఫ్టీ 9.75 పాయిట్లు లేదా 0.041 శాతం నష్టంతో 23,549.30 వద్ద నిలిచాయి.ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, రిలయన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), నెస్లే వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 23,622కు చేరింది. సెన్సెక్స్ 164 పాయింట్లు ఎగబాకి 77,825 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం పెరిగింది. నాస్డాక్ 0.14 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది. శుక్రవారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
24,000 దిగువకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. దేశీయ అక్టోబర్ ద్రవ్యల్బోణ, సెపె్టంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి దిగిరావడమూ ఒత్తిడి పెంచింది. ఫలితంగా సెన్సెక్స్ 821 పాయింట్లు నష్టపోయి 79 వేల దిగువన 78,675 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 258 పాయింట్లు క్షీణించి 24 వేల దిగువన 23,883 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, ఐటీ మినహా అన్ని రంగాల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఆటో, విద్యుత్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 948 పాయింట్లు క్షీణించి 78,548 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 23,839 వద్ద కనిష్టాలు తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.25%, 1% నష్టపోయాయి. సెమికండక్టర్ల షేర్లతో పాటు చైనా మార్కెట్ వరుస పతనంతో ఆసియా మార్కెట్లు 3% పడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.5% క్షీణించాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఎస్బీఐ 2.50%, ఏషియన్ పెయింట్స్ 2%, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్ 1% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళలనల తో ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీఐ 10% పతనమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గెయిల్ 4.50%, భెల్, ఎన్ఎల్సీ 4%, ఎన్సీఎల్ 3.50% క్షీణించాయి. ⇒ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.437.24 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ సాగిలిటీ ఇండియా లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.30)తో పోలిస్తే 3.50% ప్రీమియంతో రూ.31 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% పెరిగి, చివరికి 2% నష్టంతో రూ.29.36 వద్ద ముగిసింది. -
మిశ్రమ ఫలితాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 9.83 పాయింట్లు లేదా 0.012 శాతం లాభంతో 79,496.15 వద్ద, నిఫ్టీ 6.90 పాయింట్లు లేదా 0.029 శాతం నష్టంతో 24,141.30 వద్ద నిలిచాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాలను పొందగా.. నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ముగిసింది.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్, సిప్లా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 55.47 పాయింట్లు లేదా 0.070 శాతం నష్టంతో 79,486.32 వద్ద, నిఫ్టీ 51.15 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,148.20 వద్ద నిలిచాయి.మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నెస్లే, అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రెంట్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మోస్తరు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో భారతీయ బెంచ్ మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ 328.04 పాయింట్లు లేదా 0.41% నష్టంతో 79,213.75 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 112.30 పాయింట్లు లేదా 0.46% నష్టపోయి 24,087.05 వద్ద చలిస్తున్నాయి.ట్రెంట్, కోల్ఇండియా, బీపీసీల్, రిలయన్స్, టాటా మోటర్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు ఐటీ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్గా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 849.86 పాయింట్లు లేదా 1.06 శాతం తగ్గి 79,528.27 వద్ద, నిఫ్టీ 289.45 పాయింట్లు లేదా 1.18 శాతం తగ్గి 24,194.60 వద్ద నిలిచాయి.అపోలో హాస్పిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, టీసీఎస్, లార్సెన్ & టూబ్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందాల్కో, ట్రెంట్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 గంటలకు సెన్సెక్స్ 97.18 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 79,573.81 వద్ద, నిఫ్టీ 34.85 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,279.70 వద్ద ముందుకు సాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో అపోలో హాస్పిటల్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, డీఎల్ఎఫ్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. టైటాన్ కంపెనీ, హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల బాట పట్టాయి.యూఎస్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డోజోన్స్, నాస్డాక్ సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ట్రంప్' షేర్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు సైతం లాభాల్లోనే సాగుతున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్న సమయంలో స్టాక్ మార్కెట్ జోరందుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 649.37 పాయింట్ల లాభంతో.. 79,431.61 వద్ద, నిఫ్టీ 202.95 పాయింట్ల లాభంతో 24,198.30 పాయింట్ల వద్ద నిలిచాయి.జేఎస్డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ మొదలైనవి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ కంపెనీ, జేకే సిమెంట్ వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యూఎస్ ఎలక్షన్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 964.41 పాయింట్ల నష్టంతో.. 78,759.70 వద్ద, నిఫ్టీ 314.00 పాయింట్ల నష్టంతో 23,990.35 వద్ద నిలిచాయి. అమెరికాలో రేపు జరగనున్న ఎన్నికల కారణంగానే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవి చూస్తోంది.'మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, సిప్లా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. హీరో మోటోకార్ప్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) వంటి సంస్థలు నష్టాలను చవిచూసాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీగా పడుతున్నాయి. ఉదయం 11:25 నిమిషాల సమయం వరకు ఏకంగా సుమారు రూ.7.5 లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైనట్లు తెలిసింది. మార్కెట్లు పడిపోతుండడంపై నిపుణులు కొన్ని అంతర్జాతీయ అంశాలు కారణమని విశ్లేషిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.అమెరికా ఎన్నికలుఅమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు(మంగళవారం 5న) జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.యూఎస్ ఫెడ్ సమావేశంమరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నాయి. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) బుధ, గురువారాల్లో(6–7వ తేదీన) మానిటరీ పాలసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నాయి. 7న యూఎస్ ఆర్థిక వ్యవస్థ తీరు, ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం(2.4 శాతం), అక్టోబర్ ఉపాధి గణాంకాల ఆధారంగా వడ్డీ రేట్లలో సవరణలకు తెరతీయనుంది. గత సమావేశంలో నాలుగేళ్ల తదుపరి ఎఫ్వోఎంసీ తొలిసారి 0.5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతంగా అమలవుతున్నాయి.క్యూ2 ఫలితాలుఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ వేడెక్కింది. పలు దిగ్గజాలు పనితీరును వెల్లడిస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మార్కెట్లు కింది చూపులు చూస్తున్నాయి. ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాల జాబితాలో డాక్టర్ రెడ్డీస్, టైటన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ పీఎంఐ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. దేశ, విదేశీ గణాంకాలను ఈ వారం స్టాక్ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నాయి.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?ఎఫ్పీఐల అమ్మకాల రికార్డ్దేశీ స్టాక్స్లో ఉన్నట్టుండి గత నెలలో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) కొత్త చరిత్రకు తెరతీశారు. అక్టోబర్లో నికరంగా రూ.94,000 కోట్ల(11.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నెలవారీగా దేశీ స్టాక్ మార్కెట్లలో ఇవి అత్యధిక అమ్మకాలుకాగా..కొవిడ్–19 ప్రభావంతో ఇంతక్రితం 2020 మార్చిలో ఎఫ్పీఐలు రూ.61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీయంగా ఒక నెలలో ఇవి అత్యధిక విక్రయాలుగా నమోదయ్యాయి. ఎఫ్పీఐలు సెప్టెంబర్లో రూ.57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇవి గత 9 నెలల్లోనే గరిష్టంకావడం గమనార్హం. అయితే చైనాలో ఆకర్షణీయ ఈక్విటీ విలువలు, ప్రభుత్వ సహాయక ప్యాకేజీలు ఎఫ్పీఐలను అమ్మకాలవైపు ఆకర్షిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
పదేళ్లలో భారీగా మార్కెట్లు పడింది ఎప్పుడంటే..
గడిచిన పదేళ్లలో మార్కెట్లు భారీగా కుదుపులకు లోనయ్యాయి. ఈక్విటీ మార్కెట్లంటేనే ఒడిదొడుకులు సహజం. వాటికి దూరంగా ఉంటూ లాభాలు పొందాలంటే ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్లు పడుతున్నప్పుడు దాన్నో అవకాశంగా మలుచుకుని మరిన్ని ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మరింత ఎక్కవ రాబడులు పొందే వీలుంటుందని సూచిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో మార్కెట్లు ఏయే నెలలో భారీగా కుదేలయ్యాయో.. తర్వాత ఎంత పుంజుకున్నాయో కింద తెలియజేస్తున్నాం.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు? -
లాభాలతో ముగిసిన ముహూరత్ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా ఈరోజు జరిగిన స్టాక్ మార్కెట్ ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లో ముగిసింది. సాయంత్రం 7 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 335.06 పాయింట్లు లేదా 0.42% లాభపడి 79,724 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు బలపడి 24,34.35 వద్ద స్థిరపడ్డాయి.సాయంత్రం 6 గంటలకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో సెషన్ను ప్రారంభించాయి. అన్ని రంగాలు గ్రీన్లో ట్రేడయ్యాయి. కంపెనీలు తమ నెలవారీ విక్రయాల సంఖ్యను విడుదల చేయడంతో ఆటో స్టాక్లలో కొనుగోళ్లు కనిపించాయి. ముహూరత్ ట్రేడింగ్ అనేది హిందూ క్యాలెండర్ సంవత్సరం (సంవత్ 2081) ప్రారంభాన్ని సూచిస్తూ దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్. సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కొసాగింది.మహీంద్రా అండ్ మహీంద్రా, ఒఎన్జిసి, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. నష్టపోయిన స్టాక్స్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్సిఎల్ టెక్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, విప్రో ఉన్నాయి. ఆటో ఇండెక్స్ 1 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 1 శాతం చొప్పున పెరిగాయి. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 తమ రెండు రోజుల విజయ పరంపరను ముగించాయి. ప్రపంచ మిశ్రమ సూచనల మధ్య బుధవారం నష్టాల్లో స్థిరపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 426.85 పాయింట్లు లేదా 0.53 శాతం క్షీణించి 79,942.18 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ కూడా 125.99 పాయింట్లు లేదా 0.51 శాతం క్షీణించి 24,340.85 వద్ద ముగిసింది.50 షేర్లలో 31 నష్టాల్లో ముగిశాయి.సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ట్రెంట్ టాప్ లూజర్స్గా 4.03 శాతం వరకు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 24,466 వద్దకు చేరింది. సెన్సెక్స్ 363 పాయింట్లు ఎగబాకి 80,369 వద్ద ముగిసింది.వరుస నష్టాలతో ముగిసిన మార్కెట్లు గడిచిన రెండు సెషన్లలో లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్మార్కెట్ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తన ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. బారీగా పడిన మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా మారడంతో రిటైల్ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడి పెడుతున్నట్లు తెలిసింది. రానున్న యూఎస్ ఎన్నికలు మార్కెట్ను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!సెన్సెక్స్ 30 సూచీలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్యూఎల్, టీసీఎస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
సోమవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం మళ్ళీ నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 243.95 పాయింట్ల నష్టంతో 79,761.09 వద్ద, సెన్సెక్స్ 56.85 పాయింట్ల నష్టంతో 24,282.45 పాయింట్ల వద్ద సాగుతున్నాయి.నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ & టూబ్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెదలైనవి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్, హీరోమోటోకార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం ఫ్లాట్గా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 602.75 పాయింట్ల లాభంతో 80,005.04 వద్ద, నిఫ్టీ 158.35 పాయింట్ల లాభంతో 24,339.15 వద్ద నిలిచాయి. గత వారం భారీ నష్టాల్లో అడుగులు వేసిన స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంది.శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐచర్ మోటార్స్, విప్రో, కెనరా బ్యాంక్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)