-
'సీతారామం' బ్యూటీ తెలుగింటి కోడలు కానుందా?
తెలుగులో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ వాళ్లలో హిట్ కొట్టి, స్టార్స్ అయ్యేది మాత్రం ఒకరో ఇద్దరు మాత్రమే ఉంటారు. అలా గతేడాది రిలీజైన 'సీతారామం' సినిమాతో ఓవర్నైట్ స్టార్డమ్ సంపాదించిన బ్యూటీ మృణాల్ ఠాకుర్. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఈమె పెళ్లి చేసేసుకోవాలని టాలీవుడ్ బడా నిర్మాత ఆశీర్వాదించాడు. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తరఫున ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకుల్ని అలరించారు. గతంలో ఓ సందర్భంగా ఆయన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని.. హైదరాబాద్ వచ్చేయ్ అమ్మా అని ఆశీర్వదించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు లావణ్.. మెగాఫ్యామిలీకి చెందిన హీరో వరుణ్ తేజ్తో నిశ్చితార్థం చేసుకుంది. నవంబరు 1న వరుణ్-లావణ్య పెళ్లి కూడా జరగనుంది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) సరే లావణ్య పెళ్లి సెట్ అయినప్పుడు చాలామంది అల్లు అరవింద్ ఆశీర్వాదం గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆయనే.. 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్ని కూడా ఆశీర్వదించారు. సైమా అవార్డ్స్లో 'సీతారామం' సినిమాకుగానూ ఉత్తమ నటిగా మృణాల్ నిలిచింది. ఈ అవార్డుని అల్లు అరవింద్.. ఈమెకు ప్రెజెంట్ చేశారు. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'గతంలో ఓ వేదికపై హీరోయిన్తో ఓ మాట అన్నాను. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని టాలీవుడ్కి కోడలిగా వచ్చేయమన్నాను. ఆ మాటని ఆమె నిజం చేసింది. ఇప్పుడు నీతో కూడా అదే మాట అంటున్నా. టాలీవుడ్ కోడలిగా హైదరాబాద్ వచ్చేయ్' అని అల్లు అరవింద్, మృణాల్ ఠాకుర్ తో అన్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ఆ సినిమా షూటింగ్లో దౌర్జన్యం.. కత్తులు తెచ్చి నటితో అలా!) #alluaravind mawa very naughty aa... #MrunalThakur tfi lo young heroni chesesko... pic.twitter.com/kjeCzguXQM — celluloidpanda (@celluloidpanda) October 28, 2023 -
సైమా వేడుకలో రెచ్చిపోయిన మంచు లక్ష్మి
-
సైమా అవార్డ్స్- 2023.. రాజమౌళి చిత్రానికి 11 నామినేషన్స్!
సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో అవార్డుల పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2023లో పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్ అయింది. అయితే అవార్డుల నామినేషన్స్లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్, ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 11 విభాగాల్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో 10 విభాగాల్లో నామినేషన్స్తో సీతారామం చిత్రం నిలిచింది. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన జగపతిబాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) తెలుగులో ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ కార్తికేయ-2, అడవి శేష్ మేజర్తో పాటు.. మరో బ్లాక్బస్టర్ మూవీ సీతారామం పోటీలో నిలిచాయి. తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్ పొన్నియిన్ సెల్వన్-1 చిత్రానికి దక్కించుకుంది. ఆ తర్వాత కమల్హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన విక్రమ్ 9 విభాగాల్లో నామినేషన్స్కు ఎంపికైంది . కన్నడలో రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కాంతార, యశ్ యాక్షన్ మూవీ కేజీయఫ్-2 చిత్రాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి. మలయాళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముటి నటించిన భీష్మ పర్వం చిత్రానికి 8 నామినేషన్స్ రాగా, టోవినో థామస్ థల్లుమాల మూవీకి ఏడు నామినేషన్స్ వచ్చాయి. కాగా.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్స్- 2023) ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్లో జరగనున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?) #SIIMA2023 nominations are out. In Telugu RRR Directed by S.S Rajamouli Starring Jr.NTR & Ram Charan has 11 Nominations is leading while Sita Ramam Directed by Hanu Raghavapudi Starring Dulquer Salmaan & Mrunal Thakur with 10 Nominations is close Second. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/M3DsQ7btLQ — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Tamil Mani Ratnam’s Ponniyin Selvan:1 Starring Vikram, Trisha & Aishwarya Rai leads with 10 nominations while Lokesh Kanagaraj’s Vikram Starring Kamal Haasan, Vijay Sethupathi & Fahadh Faasil with 9 Nominations is close Second. #NEXASIIMA… pic.twitter.com/sXAxDz7cuk — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Kannada Kantara Directed by and Starring Rishab Shetty with 11 Nominations, while KGF Chapter 2 Directed by Prashanth Neel, Starring Yash with 11 Nominations are in top position. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/hWh4ZDrw0z — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Malayalam Bheeshma Parvam Directed by Amal Neerad Starring Mammootty is leading with 8 Nominations while Thallumaala Directed by Khalid Rahman & Starring Tovino Thomas and Kalyani Priyadarshan with 7 Nominations is close Second #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/Va8wuh2PRW — SIIMA (@siima) August 1, 2023 -
‘నాకు ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా’
ఇటీవల జరిగిన సైమా అవార్డు ఫంక్షన్లో హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విక్రమంలో సినిమాలో తాను చేసిన రోలెక్స్ పాత్ర చేయడం ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ ఏడాది వచ్చిన ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ మూవీ తమిళం, తెలుగులో విశేష ఆదరణ అందుకుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ అందించింది. చదవండి: ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే అయితే ఈ చిత్రంలో సూర్య రోలెక్స్ అనే మాఫీయా గ్యాంగ్ లీడర్గా కనిపించాడు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఆ పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. సూర్య ఎంట్రీకి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్. విలనిజానికి కేరాఫ్గా అడ్రస్గా సూర్య ఇందులో కనిపించాడు. చివరి 5 నిముషాలో రోలెక్స్ పాత్రను పరిచం చేశాడు డైరెక్టర్. కనిపించిన 5 నిమిషాలు సూర్య తన కళ్లలో చూపించిన క్రూరత్వం, నవ్వుతూనే భయపెట్టిన ఆయన నటనకు ప్రతిఒక్కరు ఫిదా అయ్యారు. అలా విక్రమ్లో ప్రేక్షకులను రోలెక్స్గా భయపెట్టిన సూర్యకు ఈ పాత్ర చేయాలంటే మొదట భయం వేసిందట. చదవండి: ‘గాడ్ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సైమా అవార్డు ఫంక్షన్లో తెలిపాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘విక్రమ్లో రోలెక్స్ పాత్ర చేయాలంటే మొదట భయంగా అనిపించింది. డైరెక్టర్ లోకేశ్ కనకరాజుకు చేయనని చెబుదామని అనుకున్న. కానీ అదే సమయంలో కమల్ సార్ ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పారు. దీంతో చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఓకే చెప్పాను. అది కేవలం ఓ వ్యక్తి కోసమే. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్’ అని చెప్పుకొచ్చాడు. కాగా కమల్ హాసన్ హీరోగా నటించి ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. I did it for one man "ulaganayagan" #kamalhassan #Rolex#southfilmfare #filmfareawards2022 @ikamalhaasan @suru #bengaluru pic.twitter.com/yK07292uRm — Civic Ranter (@deerajpnrao) October 9, 2022 -
ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నా.. విజయ్ స్పీచ్ వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్లో గ్రాండ్గా లాంచ్ అవుదామనుకున్నాడు. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా! అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా లైగర్ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడింది. దీంతో అప్పటిదాకా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేసిన విజయ్ ఫ్లాప్ టాక్ రావడంతో మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు. లైగర్ ఫ్లాప్ తర్వాత తొలిసారి సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకల్లో పాల్గొన్నాడు రౌడీ హీరో. యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా అవార్డును గెలుచుకున్నాడు. అవార్డును అందుకునే క్రమంలో విజయ్ ఎమోషనలయ్యాడు. 'ఈ వేదికపై అవార్డులు అందుకున్న అందరికీ కృతజ్ఞతలు. గొప్ప సినిమాలు, అద్భుతమైన పర్ఫామెన్స్తో మీరు ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నా, అందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. మనందరికీ మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. ఏ రోజుల్లోనైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులు కచ్చితంగా, ఎంతో జాగ్రత్తగా పూర్తి చేయాల్సిందే! ఈ ఫంక్షన్కు నేను రాకూడదనుకున్నా.. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్దామని వచ్చా! మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తానని మాటిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. The One and Only Versatile Actor 🥰😎#VijayDeverakonda 🤗@TheDeverakonda pic.twitter.com/Cvaahvh4oG — Dileep Kushi Rowdy (@Dileep35777546) October 10, 2022 చదవండి: సోషల్ మీడియాకు కరణ్ గుడ్బై అమ్మా, నిన్ను ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం: నమ్రత -
‘జనగణమన’ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయితే ఈ చిత్రం విడుదల కంటే ముందే విజయ్, పూరీ కాంబినేషన్లో రెండో చిత్రం ప్రకటించారు. పూరి జగన్నాథ్ తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ ను విజయ్తో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే లైగర్ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో.. ‘జనగణమన’ని నిర్మాతలు దూరం పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లైగర్ తర్వాత పూరీ, చార్మీలు సైతం ఈ చిత్రంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అంతేకాదు ‘జనగణమన’ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలను కూడా ఖండించలేదు. ఇలాంటి సమయంలో ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (చదవండి: బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు..ఇలా సైలెంట్ అయ్యారేంటి?) తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్ని అక్కడి మీడియా ‘జనగణమన’పై ప్రశ్నించగా.. ‘అవన్ని ఇప్పుడెందుకు? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జగణమన గురించి మర్చిపోండి. సైమా వేడుకను ఎంజాయ్ చేయండి’అని రౌడీ హీరో సమాధానం ఇచ్చాడు. దీంతో నిజంగానే జగగణమన ఆగిపోయిందని, అందుకే ఆ చిత్రంపై స్పందించడానికి విజయ్ ఇష్టపడడంలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
సైమా అవార్డ్స్ లో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
అట్టహాసంగా సైమా అవార్డు వేడుక (ఫొటోలు)
-
సైమా అవార్డు పోటీల్లో ‘పుష్ప’రాజ్ హవా.. బరిలో ఉన్న చిత్రాలివే
దక్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు ఒకే వేదికపై అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్). ఈ ఏడాది ఈ వేడుకను సెప్టెంబర్ 10,11 తేదీలలో బెంగళూరులో జరపనున్నారు. ఈ నేపథ్యంలో సైమా వేదికగా తలపడనున్న సినిమాల జాబితాను విడుదల చేశారు. తెలుగు నుంచి పుష్ప, అఖండ, జాతిరత్నాలు, ఉప్పెన చిత్రాలు ఎక్కువ విభాగాలలో నామినేట్ అయ్యాయి. తెలుగు నుంచి పుష్ప అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అవ్వడం గమనార్హం. తమిళ్ నుంచి ‘కర్ణన్(10)’, కన్నడ నుంచి ‘రాబర్డ్’, మలయాళం నుంచి ‘మిన్నల్ మురళీ’ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ పొందాయి. ఈ మొత్తం నామినేషన్స్ నుంచి విన్నర్ను ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసి అవార్డులు అందిస్తారు. ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులు, సాంకేతిక నిపుణులకు సైమా వెబ్సైట్కు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. సైమా అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలివే.. టాలీవుడ్ పుష్ప(అల్లు అర్జున్) : 12 అఖండ(బాలకృష్ణ): 10 జాతిరత్నాలు(నవీన్ పొలిశెట్టి): 8 ఉప్పెన(వైష్ణవ్ తేజ్):8 కోలీవుడ్ కర్ణన్(ధనుష్): 10 డాక్టర్(శివ కార్తికేయన్): 9 మాస్టర్(విజయ్): 7 తలైవి(కంగనా రనౌత్): 7 మాలీవుడ్ మిన్నల్ మురళీ(టోవినో థామస్): 10 కురుప్(దుల్కర్ సల్మాన్):8 మాలిక్(ఫహద్ పాజిల్):6 జోజీ(ఫహద్ ఫాజిల్):6 శాండల్వుడ్ రాబర్ట్(దర్శన్):10 గరుడ గమన వృషభ వాహన(రాజ్ బి.శెట్టి): 8 యువరత్న(పునీత్ రాజ్కుమార్): 7 -
నాని..ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఊహించావా: సమంత
Samantha Bags Best Actress Award For Oh Baby: హీరోయిన్ సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఒక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న సమంత ఏ పాత్రలో అయినా జీవించేస్తుంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) 2019-20 సంవరత్సరాలకు గాను విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ బేబీ చిత్రానికి గాను సమంత ఉత్తమ నటిగా ఎంపికైంది. అయితే ప్రస్తుతం చెన్నైలో ఉన్న సమంత అవార్డు వేడుకకు హాజరు కాలేజకపోయింది. దీంతో సామ్ స్ధానంలో హీరో నాని ఆ అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించి సమంత.. థ్యాంక్యూ నాని..నా బదులు అవార్డును తీసుకున్నందుకు. ఉత్తమ నటి అవార్డును తీసుకుంటావని అని ఎప్పుడైనా ఊహించావా అంటూ ఫన్నీగా ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక జెర్సీ మూవీకి అవార్డు రావడంపై నానికి కంగ్రాట్స్ చెప్పింది. చదవండి : ఆ ప్రశ్న అడగటంతో రిపోర్టర్పై సమంత సీరియస్ ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సామ్.. వైరల్ -
సైమా అవార్డులు: వేదికపై తారల సందడి.. ఫొటో హైలైట్స్
దక్షిణాది సినీ పురస్కారాల వేడుకలో తారలు తళుక్కుమన్నారు. 2020 ఏడాదికి గాను సైమా అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేదికపై సినీ తారలు రష్మిక మందన్నా, కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, పూజా హెగ్డే, రీతూ వర్మ, మరికొందరు నటీనటులు సందడి చేశారు. డియర్ కామ్రేడ్లో నటనకు అవార్డు అందుకున్న రష్మిక సైమా వేడుకల్లో రీతూ వర్మ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఉత్తమ నటిగా పూజా హెగ్డే (అల వైకుంఠపురములో..) డ్యాన్స్తో ఆకట్టుకున్న ఫరీయా అబ్దుల్లా క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ కథానాయికగా ఐశ్వర్యారాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్) నిక్కీ గల్రానీ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
SIIMA Awards 2021: అవార్డుల వేడుకలో మెరిసిన నటీ, నటులు( ఫోటోలు)
-
సైమా 2019 : టాలీవుడ్ విజేతలు వీరే!
దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమైంది. తొలి రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది. సైమా అవార్డ్స్ 2019 విజేతలు ఉత్తమ చిత్రం : మహానటి ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం) ఉత్తమ నటుడు : రామ్చరణ్ (రంగస్థలం) ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం) ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి) ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం) ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో) ఉత్తమ విలన్ : శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం) ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఎంత సక్కగున్నవవే - రంగస్థలం) ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా - ఆర్ఎక్స్ 100) ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం) ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్ (విజేత) ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్ రాజ్పుత్ (ఆర్ఎక్స్ 100) ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్ భూపతి (ఆర్ఎక్స్ 100) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (రంగస్థలం) ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రంగస్థలం) సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్ : విజయ్ దేవరకొండ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా సైమా వేడుకలు
-
సైమా అవార్డ్స్కు నామినేట్ అయిన ‘వాట్ ఏ అమ్మాయి’
టాలీవుడ్లో లీడింగ్ పీఆర్వోగా కొనసాగుతున్న ఏలూరు శ్రీను దర్శకుడిగా మారి లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. మా కాలని ఫిగర్, వాట్ ఏ అమ్మాయి అనే టైటిల్స్తో రూపొందిన లఘు చిత్రాలు మంచి విజయం సాధించటమే కాదు అవార్డులు రివార్డులను కూడా తెచ్చిపెట్టాయి. తొలి షార్ట్ ఫిలింకు ఓ ప్రముఖ చానల్ నిర్వహించిన కాంపిటీషన్లో ఉత్తమ నటి అవార్డు దక్కగా, తాజాగా వాట్ ఏ అమ్మాయి ఏకంగా సైమా అవార్డ్స్ బరిలో నిలిచింది. ఈ షార్ట్ ఫిలింకు సంగీతం అందించిన నరేష్ పెంట ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరిలో నామినేట్ అయ్యాడు. మెగా అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏలూరు శ్రీను తరువాత పీఆర్వోగా కొనసాగుతూనే బస్టాప్, లవర్స్, రోజులు మారాయి, ఒక్క క్షణం, కొత్త జంట, చిత్రం భళారే విచిత్రం, కొబ్బరి మట్ట చిత్రాల్లో నటించాడు. దర్శకత్వంపై మక్కువతో లఘు చిత్రాలను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఏలూరు శ్రీను పలువురు స్టార్ హీరోలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రమోషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
సైమా అవార్డ్స్ రెడ్ కార్పెట్
-
దుబాయ్లో సైమా సందడి
-
'సైమా' సన్నాహక కార్యక్రమంలో తారల సందడి
-
ర్యాపిడ్ ఫైర్లో రానా ఆన్సర్స్
సౌత్ సినీ పండుగ సైమా అబుదాబిలో ఘనంగా జరిగింది. దక్షిణాది సినీ ప్రముఖులు హాజరైన ఈ వేదికపై యంగ్ హీరో రానా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు రానా చెప్పిన సమాధానాలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. తన బ్రెస్ట్ ఫ్రెండ్, తనకు నచ్చిన చోటు, ఇష్టమైన ఫుడ్ లాంటి విషయాలను ఏ మాత్రం తడబడకుండా టక టక చెప్పేశాడు రానా. ఒకే పాటను జీవితాంతం వినాల్సి వస్తే బాహుబలి సినిమాలోని మహిష్మతి టైటిల్ సాంగ్నే వింటాడట. ఎప్పటికీ ఒకే నగరంలో ఉండాల్సి వస్తే హైదరాబాద్, ఒకే ఫుడ్ తినాల్సి వస్తే హాలీమ్, ఒకే సినిమా రోజూ చూడాల్సి వస్తే స్టార్ వార్స్ సినిమాలు చూస్తాడట. ఒకే షో ఎప్పటికీ చూడాల్సి వస్తే మాత్రం టీవీ ఆఫ్ చేసేస్తానన్నాడు రానా. ఒకే మనిషి జీవితాంతం ఫ్రెండ్గా ఉండాల్సి వస్తే ఆ ప్లేస్ రామ్ చరణ్కు మాత్రమే ఇస్తా అన్నాడు. జీవితాంతం తనకు ఒకే ప్రేక్షకుడు ఉంటే అది మా నాన్నే అన్న రానా, ఒకే స్టార్తో జీవితాంతం గడపాల్సి వస్తే అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేను అన్నాడు. తాను పుట్టిన దగ్గర నుంచి స్టార్ల మధ్యే పెరిగాను కాబట్టి ఒకే స్టార్ను ఎంపిక చేసుకోవటం కష్టమన్నాడు. -
టాలీవుడ్లో అతడికి ఓకే చెప్తా: కత్రినా
హైదరాబాద్: అందాల యువరాణి 'మల్లీశ్వరి'గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ కత్రినా కైఫ్. ఆపై అల్లరి పిడుగు మూవీ చేసిన క్యాట్స్.. టాలీవుడ్కు గుడ్ బాయ్ చెప్పేసి బాలీవుడ్కు పరుగులు తీసింది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ అండతో వరుస ఆఫర్లతో కొన్నేళ్లపాటు అక్కడ టాప్ పొజిషన్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. దుబాయ్లోని అబుదాబిలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సైమా ( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డు వేడుకల్లో మాజీ ప్రియుడు రణబీర్ కపూర్తో కలిసి పాల్గొని సందడి చేసింది. ఒక్కసారిగా సైమా వేడుకలకు హాజరైన ఈ భామను ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చాలా కాలంగా దూరంగా కత్రినాను మళ్లీ ఇక్కడ నటించాలంటే ఏ హీరోలతో జత కడతారని మీడియా ప్రశ్నించింది. వెంటనే కత్రినా స్పందిస్తూ.. టాలీవుడ్లో నటిస్తే మాత్రం 'బాహుబలి' స్టార్ హీరో ప్రభాస్తో, కోలీవుడ్లో అయితే సీనియర్ హీరో విక్రమ్ సరసన జోడీ కట్టాలని ఉందని మనసులో మాటను వెల్లడించింది. 'బాహుబలి' మూవీ చూశాను, ప్రభాస్ ఎంతో చక్కగా నటించారు. 'చియాన్' విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అద్భుతమైన నటుడని కత్రినా కైఫ్ అభిప్రాయపడింది. మాజీ ప్రియుడు రణబీర్తో కలిసి కత్రినా నటించిన లేటెస్ట్ మూవీ 'జగ్గా జాసూస్'. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 14న విడుదలకు సిద్ధంగా ఉందని కత్రినా చెప్పింది. -
సైమా సంబరాలు
-
సెల్ఫీ అదిరింది..
ఒక్క సెల్ఫీ 1000 కన్నా ఎక్కువ మాటలు మాట్లాడుతుందంటున్నాడు టాలీవుడ్ కండలవీరుడు రానా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) 6 వ వార్షిక వేడుక సింగపూర్లో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రముఖులతో వేడుక ప్రాంగణం వెలిగిపోతుంది. వేడుకలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిరు తిరిగి సినిమాల్లో నటిస్తున్నందుకుగాను పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందనల్లో ముంచెత్తారు. చిరంజీవితో సెల్ఫీలు దిగేందుకు యువ నటీనటులతోపాటు పలువురు తారలు పోటీ పడటం చిరు క్రేజ్ను మరోసారి తళుక్కుమనిపించింది. 'బాహుబలి' సినిమాలో భల్లాలదేవగా నెగెటివ్ రోల్లో ఉత్తమ నటన కనబరిచినందుకుగాను సైమా అవార్డును అందుకున్నాడు రానా. 'జై మాహిష్మతీ' అంటూ తన సంతోషాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. సింగపూర్లో అడుగుపెట్టినప్పటి నుంచి వేడుక విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న రానా.. తాజాగా ఓ భారీ సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. చిరంజీవి, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, అల్లు అరవింద్, రాధిక, ఖుష్బూ తదితరుల నుంచి సమంత, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, మెహరీన్ లాంటి నవతరం నటుల వరకు చిరునవ్వులు చిందిస్తూ పోజిచ్చిన ఆ సెల్ఫీకి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.. Now this is a picture that speaks a 1000 words and more!! pic.twitter.com/KG0YZlo6oz — Rana Daggubati (@RanaDaggubati) 30 June 2016 -
'గమ్మునుండవోయ్.. మాట్లాడనీ'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య మరోసారి వివాదం రాజుకునేలా ఉంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుక గురువారం అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే. సింగపూర్లో రెండు రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో మొదటిరోజైన గురువారం తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను అందించగా, శుక్రవారం తమిళ, మలయాళ సినిమాలకు అవార్డులు ఇవ్వనున్నారు. కాగా చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి పాత్ర పోషించినందుకుగాను అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డు లభించింది. వేదికపై అవార్డు అందుకున్న అనంతరం బన్నీ మాట్లాడుతుండగా 'పవర్ స్టార్.. పవర్ స్టార్..' అంటూ పవన్ అభిమానులు పాట అందుకున్నారు. దీంతో కాస్త అసహనం వ్యక్తం చేసిన బన్నీ వారిని ఉద్దేశించి.. 'హే గమ్మునుండవోయ్.. మాట్లాడనీ' అంటూ తిరిగి తన మాటలను కొనసాగించారట. ఇంతకుముందు కూడా ఓ సినీ వేడుకలో పవన్ ఫ్యాన్స్ ఇలానే రెచ్చిపోతుంటే.. కాస్త పద్ధతిగా ప్రవర్తించండంటూ బన్నీ వారికి కాస్త చురకలంటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదాన్నే సృష్టించింది. బన్నీ తిరిగి వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరోసారి సైమా వేడుకలో అదే రిపీట్ అవ్వడంతో బన్నీ స్పందించక తప్పలేదట. మరి ఈసారేమవుతుందో! -
సింగపూర్లో సైమా అవార్డుల హంగామా
చెన్నై : ఈ సారి సైమా అవార్డుల హంగామా సింగపూర్లో జరగనుంది. ప్రతి ఏటా జరుగుతున్న దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన దక్షిణాది భాషలకు చెందిన ఉత్తమ కళాకారులకు అందించే సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జూన్ 30, జూలై ఒకటో తేదీన సింగపూర్లో బ్రహ్మాండంగా జరుగనుంది. సినిమా రంగానికి చెందిన 19 విభాగాల్లోని కళాకారులకు ఈ అవార్డులను అందించనున్నారు. 2015లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులను అందజేయనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక మౌంట్రోడ్డులో గల ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. ఈ సమావేశంలో నటి కుష్బు, నటుడు జయం రవి, రానా దగ్గుబాటి, దేవీశ్రీప్రసాద్, వేదిక, నిక్కీగల్రాణి పాల్గొన్నారు. కుష్బు మాట్లాడుతూ... దక్షిణ భారతీయ సినిమా చాలా గౌరవంగా భావించే అవార్డులు ఈ సైమా అవార్డులన్నారు. ఉత్తమ చిత్రాలను,కళాకారులను ఎంపిక చేసి ఈ అవార్డులను అందిస్తున్నారని నిర్వహాకులను ప్రశంసించారు. అలాగే జయం రవి ఈ సారి సైమా అవార్డు అందుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తన చిరకాల మిత్రుడు జయం రవిని ఈ వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సైమా అవార్టులను గెలుచుకునే కళాకారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ తెలిపారు. ఈ సారి సైమా అవార్డులను గతంలో కంటే బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు బృందాప్రసాద్ పేర్కొన్నారు. పలువురు సినీ కళాకారులు ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఆటాపాటా అంటూ ఈ కార్యక్రమం సింగపూర్ సినీ అభిమానులను అలరించనుందని ఆయన అన్నారు. -
సింగపూర్లో సైమా సంబరం
గత ఐదేళ్లుగా దక్షిణాసియా చలన చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సైమా అవార్డ్స్, ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జూన్ 30, జూలై 1వ తేదీల్లో సింగపూర్లో దక్షిణాది సినిమా నటుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన వందమంది పైగా నటీనటులు పాల్గొననున్నారు. అవార్డు ప్రధానోత్సవంతో పాటు తారల పర్ఫామెన్స్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గత ఏడాది సైమా అవార్డ్స్ను దుబాయ్లో నిర్వహించగా ఈ ఏడాది సింగపూర్ వేదికగా నిర్వహిస్తున్నారు. శ్రుతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, హ్యూమా ఖులషీ లాంటి ఎంతో మంది తారలు స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సైమా అవార్డ్స్ ఏర్పాట్లను హీరో రానా, హీరోయిన్ శృతిహాసన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్లు వెల్లడించారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement