-
టెక్సాస్లో భారీ వర్షం.. ఎటుచూసినా వరద నీరే..
టెక్సాస్: అమెరికాలోకి టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా టెక్సాస్ను వరదలు ముంచెత్తాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.కాగా, భారీ వర్షాల కారణంగా అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 600 మంది ప్రజలను సహాయ సిబ్బంది రక్షించారు. నాలుగు నెలల్లో కురువాల్సిన వానలు ఒక్కవారంలోనే పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయని అధికారులు వెల్లడించారు. ఇక, వర్షాల కారణంగా ఒక్క చిన్నారి మృతి చెందినట్టు సమాచారం.వరదల కారణంగా వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. వరదలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 28వ రాష్ట్రం టెక్సాస్. దీని రాజధాని ఆస్టిన్. జనాభారీత్యా చూసినప్పుడు ఆస్టిన్ 9.58 లక్షలు. దీని కన్నా ఇదే రాష్ట్రంలోని డల్లాస్ ( 13 లక్షలు ), సాన్అంటానియో ( 14.45 లక్షలు ), హుస్టన్( 23 లక్షలు ) నగరాల్లో ఎక్కువ జనాభా. అయినా చారిత్రక ప్రాధాన్యాన్నిబట్టి రాష్ట్రం మధ్యలో ఉండడం వల్ల ఆస్టినే రాజధాని అయింది. ఆస్టిన్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టేట్ లెజిస్లేచర్, గవర్నర్, మంత్రుల చాంబర్లు ఉన్నాయి. యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ ఉన్నది ఆస్టిన్లోనే. తప్పక చూడాల్సింది స్పేస్ సెంటర్..ఈ నగర జనాభాలో మూడింట ఒక వంతు హిస్పానిక్స్, ఆఫ్రికన్ / ఏసియన్ అమెరికన్లు. టెక్సాస్లోని అతి పెద్ద నగరమైన హుస్టన్ సిటీలో చూడదగ్గవి ఎన్నోఉన్నాయి. హుస్టన్ సిటీలో నేను మొదటగా చూసినవి అక్వేరియం, చిల్డ్రన్స్ మ్యూజియం లాంటివి. తప్పక చూడాల్సిన సందర్శనీయ స్థలాల్లో గాల్వెస్టన్ సముద్రతీరం, నాసా (NASA) వారి స్పేస్ సెంటర్ వంటివి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న విద్యార్థి అయినా.. శాస్త్ర సాంకేతికత మీద, అంతరిక్షం మీద ఆసక్తి ఉంటే.. నాసా సెంటర్ చూడాలనుకుంటారు. లిండన్ బి. జాన్సన్ స్పేస్ సెంటర్ పేరిట హ్యూస్టన్లో నిర్మించిన NASA కేంద్రాన్ని స్పేస్క్రాఫ్ట్ సెంటర్ అని పిలుస్తారు. ఇక్కడ అంతరిక్షయాన శిక్షణ, పరిశోధన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రానికి ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ పేరు పెట్టారు. తటస్థ ప్రయోగశాల అంటే..దీన్ని నవంబర్ 1961లో పూర్తి చేశారు. క్లియర్ లేక్ ఏరియాలో 1,620 ఎకరాల్లో 100 భవనాల్లో నిర్మించిన ఈ కేంద్రంలో దాదాపు 3,200 మంది పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్.. జెమిని 4 ( అపోలో , స్కైలాబ్ , అపోలో-సోయుజ్ మరియు స్పేస్ షటిల్తో సహా ) నుంచి ప్రతి అంతరిక్ష ప్రయాణాన్ని పరిశీలిస్తుంది. అంటే ఒక స్పేస్క్రాఫ్ట్ భూమి నుంచి దాని లాంచ్ టవర్ను క్లియర్ చేసిన క్షణం నుంచి తిరిగి భూమిపైకి తిరిగి వచ్చే వరకు దాని కంట్రోల్ను ఈ కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఈ కేంద్రంలో ఆసక్తి ఉన్న వారికి అర్థమయ్యేలా ఎన్నో ఆకర్షణీయ ఏర్పాట్లు ఉన్నాయి. తటస్థ ప్రయోగశాల.. అంటే అంతరిక్షంలో ఉన్నట్టుగా గాలిలో తేలే వాతావరణాన్ని ఇక్కడ స్వయంగా తెలుసుకోవచ్చు. అలాగే సుమారు 6.2 మిలియన్ యూఎస్ గ్యాలన్ల నీళ్లు ఉన్న స్విమ్మింగ్పూల్లో వ్యోమగాములు జీరో గ్రావిటీని అనుకరిస్తూ శిక్షణ పొందుతారు. సందర్శకులను స్పేస్ సెంటర్ వరకు అనుమతిస్తారు. అక్కడ ఉంటే హైదరాబాద్లో ఉన్నట్లే..ఇక టెక్సాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది. టెక్సాస్లో చాలా చోట్ల తెలుగు వాళ్లు కనబడతారు. డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్ ఎక్కడయినా.. చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్నామా అనిపిస్తుంది. హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. ఒక్క బిర్యానీనే కాదు, సీజన్లో హాలీం కూడా దొరుకుతుంది. ఇరానీ ఛాయ్, సమోసాలు, ఇడ్లీ-దోశ సెంటర్లు.. చూస్తూ ఉంటే సరదాగా అనిపిస్తుంది. ఒక్క భోజనమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో దొరికే ఏ వస్తువు అయినా.. టెక్సాస్లో కొనుక్కోవచ్చు. జండూబామ్ నుంచి గోధుమ పిండి వరకు, బియ్యం, నుంచి బాదాంపప్పు వరకు ఏం కావాలన్నా సులువుగా దొరుకుతాయి. కిషోర్ పబరి ఇండియా బజార్, పటేల్ బ్రదర్స్ కిరాణ మార్కెట్, సరిగమప సూపర్మార్కెట్, సబ్జీ మండీలతో పాటు బంగారు, వజ్రాల దుకాణాలు బాగానే కనిపిస్తాయి. ఇండియన్ దుస్తులు పంజాబీ డ్రెస్ నుంచి లుంగీల దాకా అన్నీ దొరుకుతాయి. చాలా చోట్ల సంగీతం, భరత నాట్యం నేర్పే వాళ్లు, యోగా క్లాసులు, తెలుగు భాష, మ్యాథ్స్ క్లాసులు దర్శనమిస్తాయి. డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో మనవాళ్లే టాప్. అన్నట్టు ఇక్కడ మనవాళ్లు అప్పుడే రియల్ ఎస్టేట్ను పీక్లోకి తీసుకెళ్లారు. అలాగే ఇండియన్ ఈవెంట్స్ కూడా. డాలస్ నగరాన్ని జలవనరుల ఆధారితంగా నిర్మించారు. ట్రినిటీ నది తెల్లరాళ్ళను దాటుతున్న ప్రాంతంలో ఈ సిటీ కట్టారు. నదికి ఇరువైపులా మట్టి గోడలను కట్టి ట్రినిటీ రివర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేశారు. పార్క్లు, రెస్టారెంట్లతో వినోద విహార కేంద్రంగా మారింది. డాలస్ మొత్తం నగరం నదీతీరం పక్కనే.. దాదాపు 20 మైళ్ళు సిటీని ఆనుకుని నదీ తీరం ఉంటుంది. ప్రశాంతంగా రాజధానిడల్లాస్ ఓ రకంగా హైదరాబాద్ వాతావరణంలా అనిపిస్తుంది. హ్యూస్టన్లా గాలిలో తేమ ఉండదు. వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. హుస్టన్ కాలుష్య వాతావరణంతో పోల్చుకున్నప్పుడు ఆస్టిన్ నాకు ప్రశాంతంగా తోచింది. ఒక రాష్ట్ర రాజధాని ఇంత సింపుల్గా ఉండడం గొప్ప విషయమే అనిపించింది. మొత్తం మీద టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా.? అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సారి అమెరికా వచ్చినప్పుడు ఓ సారి ఓ లుక్కేయండి. మీరే చెబుతారు.వేముల ప్రభాకర్(చదవండి: అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !) -
US: టెక్సాస్ హ్యుస్టన్లో మేమంతా సిద్ధం!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకి మద్దతుగా టెక్సాస్లోని హ్యుస్టన్ నగరంలో సంఘీభావ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ హ్యుస్టన్ నాయకులు బ్రహ్మనంద రెడ్డి , మారుతి , పుల్లా రెడ్డి , శ్రీనివాస్ ఎర్రబోతుల ,యాదగిరి రెడ్డి కుడుముల, విశ్వ సానపరెడ్డి, నర్సి రెడ్డి మరియు దాదాపు 90 మంది వైఎస్సార్సిపి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆన్లైన్ ద్వారా కిలారి రోశయ్య , ఎంపీ అయోధ్య రామి రెడ్డి మరియు పండుగాయల రత్నాకర్ గారు జాయిన్ అయ్యి ప్రసంగించారు. బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగినందుకుగాను జగన్ గారి మేమంత సిద్ధం బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ తదితర ప్రభుత్వ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రభుత్వ బడులను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. బడుల అభివృద్ధిని పూర్తిగా వదిలేయడంతో చాలా వరకూ శిథిలావస్థకు చేరాయి. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 175 వైస్సార్సీపీ ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇక శ్రీనివాస్ ఎర్రబోతుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్లు, ఆస్పత్రి భవనాలు అని వివరించారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదింటి పిల్లలు చదువుకునే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, విద్యార్థులకు ట్యాబ్స్ వంటివి అద్భుతాలు అన్నారు. తాము ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం. ఈ ఐదేళ్లలో నాడు–నేడు ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల రూపు రేఖలే మారాయన్నారు. మారుతి మాట్లాడుతూ.. జగన్ అన్న ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు. పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా ఆయనే స్యయంగా జగన్ పాలన బాగుందని సర్టిఫికెట్ ఇచ్చినట్లే కదా అన్నారు. పుల్లా రెడ్డి మాట్లాడుతూ జగన్ గారు పేద ప్రజల కోసం అమ్మఒడి , జగన్ అన్న విద్యా కానుక, గోరు ముద్ద, సచివాలయ వ్యవస్థ, పోర్టులు నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. ప్రజలు వైస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి జగన్ గారి ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరారు . (చదవండి: ఎన్నికల తర్వాత బాబు, లోకేష్ ఎన్ఆర్ఐలే అవుతారు: రత్నాకర్) -
నిజంగా చల్లటి కబురు : ఇషికా ఆచూకీ లభ్యం
ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్న తరుణంలా అమెరికాలో భారత్కుకెందిన ఇండో-అమెరికన్ విద్యార్థి సురక్షితంగా బైటపడటం నిజంగా చల్లటి కబురు. టెక్సాస్లోని తన ఇంటినుంచి సోమవారం రాత్రి అదృశ్యమైన 17 ఏళ్ల ఇషికా ఠాకోర్ను ఫ్రిస్కో పోలీసులు సురక్షితంగా గుర్తించారు. అయితే ఎపుడు, ఎక్కడ, ఎలా కనుగొన్నారు అనే వివరాలను మాత్రం ఫియాస్కో పోలీసులు వెల్లడించలేదు. టెక్సాస్లోని ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఏప్రిల్ 8, సోమవారం తప్పిపోయింది. ఫ్రిస్కోలోని బ్రౌన్వుడ్ డ్రైవ్లోని తన ఇంటి నుండి ఇషికా అదృశ్యమైందంటూ క్రిటికల్ మిస్సింగ్ హెచ్చరికను జారీ చేశారు. ఈమేరకు ట్విటర్లో ఒకపోస్ట్ పెట్టారు. ఇటీవల తప్పి పోయిన పలువురు భారతీయ విద్యార్థులు ఆ తర్వాత శవమై కనిపించడంతో ఇషికా అదృశ్యం ఆందోళన రేపింది. అయితే ఆమె ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. CRITICAL MISSING-Frisco PD is seeking assistance in locating 17-year-old Ishika Thakore, last seen Monday, Apr 8 at 11:30p in the 11900-block of Brownwood Dr. in Frisco. She is approx 5’4” and 175 lbs, last seen wearing a black, long-sleeve t-shirt and red/green pajama pants. pic.twitter.com/L7fDV7HuEH — Frisco Police (@FriscoPD) April 9, 2024 కాగా గత కొన్ని నెలల్లో అమెరికాలో 11 మంది భారతీయ, భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు చనిపోయారు. ముఖ్యంగా గత నెల నుంచి తప్పిపోయిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) అనే భారతీయ విద్యార్థి మంగళవారం ఓహియోలోని క్లీవ్ల్యాండ్లో శవమై కనిపించాడు. అలాగే ఓహియోలోని క్లీవ్ల్యాండ్లో మరో భారతీయ సంతతి విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణించచాడు. -
టెక్సాస్లో దారుణం : వివాదంలో జీయర్ ట్రస్టు
జీయర్ ట్రస్టు అమెరికాలో ఓ వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృ సంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) USA Inc ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షుగర్ ల్యాండ్లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతోపాటు గుడికి వెళ్లిన తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధ పడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్య సేవలు కూడా అందించలేదని ఆరోపించారు. బాలుడి కుడి, ఎడమచేతిపై వాతలు పలు మీడియా నివేదికల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారంటూ ఏప్రిల్ 1 న కోర్టులో దావా దాఖలయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ న్యాయవాది ఆండ్రూ విలియమ్స్ వాదించారు. టెక్సాస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా.. లేకున్నా.. బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రు పెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది నేరమేనని తెలిపారు. ఈ కేసులో బాలుడి గాయాలను థర్డ్ డిగ్రీగా పరిగణిస్తారని, కాలిన గాయాలు వీటికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాయాలపై డాక్టర్ను సంప్రదించినపుడు ఈ గాయాలను గురించి పోలీసులకు నివేదించమని వైద్యుడు కూడా పట్టుబట్టారని లాయర్ విలియమ్స్ వివరించారు. అయితే ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ కమిటీగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్ఫ్లూ ముప్పు!
ప్రపంచమంతటా కోవిడ్–19 మహ మ్మారి సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. లక్షల మంది బలయ్యారు. అలాంటి ప్రాణాంతక మహమ్మారి మరొకటి మానవులకు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్లో బర్డ్ఫ్లూ వైరస్లో హెచ్5ఎన్1 అనే వేరియంట్ తొలుత ఆవులకు, తర్వాత ఆవుల నుంచి ఓ కార్మికుడికి వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. అతడిని పరీక్షించగా బర్డ్ఫ్లూ పాజిటివ్గా తేలింది. ఏప్రిల్ 1న ఈ కేసు బయటపడినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) నిర్ధారించింది. బాధితుడి కళ్లు ఎర్రగా మారాయి. బర్డ్ఫ్లూ లక్షణాల్లో కండ్ల కలక కూడా ఒకటి. అమెరికాలో మనిíÙకి బర్డ్ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ సోకడం ఇది రెండో కేసు. బాధితుడిని ఐసోలేషన్కు తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. వైరస్ సోకినట్లు వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ► అమెరికాలో మనుషులకు సోకిన తొలి బర్డ్ఫ్లూ కేసు 2022లో కొలరాడోలో బయటపడింది. ► బర్డ్ఫ్లూ వైరస్ గత కొన్ని దశాబ్దాలుగా మహమ్మారుల జాబితాలో తొలి స్థానంలో ఉందని పిట్స్బర్గ్కు చెందిన బర్డ్ఫ్లూ పరిశోధకుడు డాక్టర్ సురేశ్ కూచిపూడి చెప్పారు. ఇది ప్రమాదకరంగా మారుతోందని, మనుషులకు సోకే అవకాశాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ► కోవిడ్–19తో పోలిస్తే బర్డ్ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని ఫార్మా ఇండస్ట్రీ కన్సల్టెంట్ జాన్ ఫల్టన్ వెల్లడించారు. ఇందులో మ్యుటేషన్లు(మార్పులు) జరిగితే బాధితుల్లో మరణాల రేటు భారీగా పెరుగుతుందని చెప్పారు. ► నిజానికి ఇతర దేశాల్లోనూ మనుషులకు బర్డ్ఫ్లూ సోకిన సంఘటనలున్నాయి. 2003 జనవరి 1 నుంచి 2024 ఫిబ్రవరి 26 దాకా 23 దేశాల్లో 887 కేసులు బయటపడ్డాయి. వీరిలో 462 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అంటే 52 శాతం మంది మృత్యువాత పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ► మనుషులు బర్డ్ఫ్లూ బారినపడితే శ్వాస ఆడకపోవడం, చలి, అలసట, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. బాధితులకు యాంటీ వైరల్ ఔషధాలు ఇస్తుంటారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
'అరుంధతి' సినిమాని తలపించే కథ..!
సినిమాని తలపించే కథ ఈ సొరంగం స్టోరీ. వాస్తవమో కాదో తెలియదు కానీ. ప్రజలు మాత్రం అందులోకి అడుగుపెట్టాలంటే హడలిపోతారు. చూసేందుకు లోపలకి వెళ్తే బాగుండును అనేంత అందంగా ఉంటుంది. తీరా వెళ్తే మాత్రం అంతే సంగతులు. బయటి నుంచి చూడటానికి రంగురంగులుగా బాగానే కనిపిస్తుంది గాని, ఈ సొరంగంలోకి అడుగు పెట్టాలంటేనే జనాలు వణికిపోతారు. ఇందులో దయ్యాలు సంచరిస్తుంటాయని, ఇందులోకి వెళ్లే వారిని అవి ముప్పుతిప్పలు పెడతాయని స్థానికులు చెబుతారు. అమెరికాలోని టెనసీ రాష్ట్రం కింగ్స్పోర్ట్ సమీపంలో ఉంది. దాదాపు వందేళ్ల కిందట దీనిని సెన్సాబాగ్ అనే ఇంజినీర్ నిర్మించాడు. ఆయన పేరు మీదనే ఇది సెన్సాబాగ్ టన్నెల్గా పేరుపొందింది. ఒక దుండగుడు తనను వెంటాడుతున్న పోలీసుల నుంచి తప్పించుకుని సురక్షితంగా పారిపోవడానికి సెన్సాబాగ్ మనవరాలిని కిడ్నాప్ చేసి, ఈ సొరంగంలోనే దాక్కున్నాడు. పసిపిల్లకు అపకారం జరగకూడదని పోలీసులు అప్పటికి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ దుండగుడు ఇక పసిపిల్లతో తనకు పనిలేదని భావించి ఆమెను చంపేసి, అక్కడే పడేశాడు. ఇది జరిగిన కొంతకాలానికి సెన్సాబాగ్ కూడా మరణించాడు. అప్పటి నుంచి ఈ సొరంగంలో సెన్సాబాగ్, ఆయన మనవరాలి ఆత్మలు సంచరిస్తున్నాయని స్థానికుల కథనం. ఈ సొరంగంలోంచి ప్రయాణిస్తుంటే ఒక్కోసారి కారు ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోతుందని, సెన్సాబాగ్ ఆత్మ కనిపిస్తుందని, పసిపిల్ల ఏడుపు వినిపిస్తుందని కూడా చెబుతారు. (చదవండి: గుహలు అనుకుంటే పొరబడ్డట్టే.. వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది!) -
Texas: యూఎస్, మెక్సికో సరిహద్దులో హెలికాప్టర్ క్రాష్
టెక్సాస్: అమెరికా, మెక్సికో సరిహద్దులో యూఎస్ నేషనల్ గార్డ్కు చెందిన ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. టెక్సాస్లోని లా గ్రుల్లా పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కూలిన సమయంలో హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారు. హెలికాప్టర్ క్రాష్ ఘటనపై స్టార్ కౌంటీ షరీఫ్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లకోటా యూహెచ్-72 రకానికి చెందినదని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి.. గాజాలో దారుణం.. తిండి కోసం ఎదరు చూస్తున్న వారిపై పడ్డ పారాచూట్ -
Texas: విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో కొద్ది రోజులుగా కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. పానాండిల్, ఓక్లహామా ప్రాంతాల్లో దావానలంలా వ్యాపించిన అతిపెద్ద కార్చిచ్చు స్మోక్హౌజ్క్రీక్ఫైర్ కారణంగా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 4వేల 4 వందల కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని దహించి వేసిన ఈ కార్చిచ్చులో చాలా ఇళ్లు, నిర్మాణాలు లక్షల సంఖ్యలో చెట్లు కాలిపోయాయి. కార్చిచ్చు వల్ల కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని పూర్తిగా తేల్చలేకపోతున్నామని అధికారులు తెలిపారు. పానాండిల్ ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఇప్పటివరకు 500 వరకు నిర్మాణాలు మంటల్లో కాలిపోయాయని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. కార్చిచ్చు వల్ల కాలిపోయిన నిర్మాణాలను పరిశీలిస్తే అక్కడ బూడిద తప్ప ఏమీ మిగలలేదని మీడియాతో అబాట్ వ్యాఖ్యానించారు. ఈ వారాంతంలో వాతావరణపరిస్థితులు కార్చిచ్చుకు మరింత అనుకూలంగా మారుతున్నాయని, టెక్సాస్ ఓక్లహామా, కాన్సాస్, న్యూ మెక్సికోలో అగ్ని కీలలు మరింత విజృంభిస్తాయని జాతీయ వాతావరణ సేవల కేంద్రం తెలిపింది. ఇదీ చదవండి.. అమెరికాలో మరో భారతీయుడి హత్య -
చల్లటి నీరు గుండె వ్యాధికి దారితీస్తుందా?
చలచల్లటి నీరు అంటే అబగా తాగేస్తాం. గోరు వెచ్చని నీళ్లు మంచిదన్న కూడా తాగడానికే బాధపడిపోతారు కొందరూ. అనారోగ్యంగా ఉంటే తప్ప వేడినీళ్ల జోలికే పోరు. కానీ ఇలా చల్లటి వాటర్ తాగి ఓ బాడీ బిల్డర్ ఆస్పత్రుపాలై అరుదైన గుండె వ్యాధిని ఎదుర్కొన్నాడు. చివరికి చావు అంచులు దాక వెళ్లోచ్చాడు. తనలా మరోకరూ ఇలాంటి భయానక అనుభవాన్ని ఎదుర్కొనకూడదన్న ఉద్దేశ్యంతో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంతకీ అతడు ఎదుర్కొన్న భయానక చేదు అనుభవం ఏంటంటే.. అమెరికాలో టెక్సాస్కి చెందిన 35 ఏళ్ల ఫ్రాంక్లిన్ అరిబీనా ఇంటర్నేషనల్ ఫిట్నెస్ అండ్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ సభ్యుడు. పైగా బాడీ బిల్డర్ కూడా. అతను 18 ఏళ్ల వయసున్నప్పుడూ ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. అతనికి చల్లటి ఐస్ నీరు తాగడమంటే ఇష్టం. ఇలా చల్లటి నీరు తాగడంతో బాడీ ఒక విధమైన పరిస్థితికి గురవ్వుతుండేది. అయితే అతను కోల్డ్ వాటర్ అలా లోపలికి వెళ్తే ఉండే ఫీల్ అనుకుని అంతగా సీరియస్గా తీసుకోలేదు. ఒకరోజు ఎప్పటిలానే జిమ్ వర్కౌట్లు చేసి ఐస్ వాటర్ తాగుతుండగా అదే పరిస్థితి ఎదుయ్యి ఒకలా అయిపోయింది అతడి పరిస్థితి. ఆ తర్వాత కాసేపటికి స్ప్రుహ తప్పి పడిపోయాడు. అక్కడ అతని గుండె అదుపులేకుండా వేగంగా కొట్టుకుంటోంది. వైద్య పరీక్షల్లో అతడు ఒక విధమైన జన్యు పరివర్తనతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంటే కర్ణిక దడతో బాధపడుతున్నాడని అర్థం. దీనిని అఫీబ్ అని పిలుస్తారు. దీని కారణంగా ఎలక్ట్రిక్ సిగ్నల్లో అంతరాయం ఏర్పడి గుండె కొట్టుకోవడం నియంత్రలో ఉండదు. ఇలా ఎందువల్ల వస్తుందంటే..? మెదడు నుంచి ఛాతీ వరకు విస్తరించి ఉన్న వాగస్నాడిని చల్లటి నీరు తాకడం వల్ల ఒక విధమైన దడలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనిషి స్ప్రుహ కోల్పోవడం గుండె లయలో మార్పులు వేగవంతంగా జరిగిపోతాయి. ఈ స్థితిలో గుండె కొట్టుకోవడం ఛాతీ నుంచి బయటకు కనిపించేంతగా వేగంగా కొట్టుకుంటుంది. ఈ పరిస్థితి కారణంగా రోగికి శ్వాస ఆడక ఛాతిలో ఒక విధమైన నొప్పితో అల్లాడిపోతుంటాడు. వైద్యులు బాడీ బిల్డర్ ఎదర్కొంటున్న సమస్యను సకాలంలో గుర్తించి గుండెకి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతను పూర్తి స్థాయిలో కోలుకున్నాడు కానీ ఆఫీబ్ కోసం మందులు వాడుతున్నాడు. ఎందుకంటే ఈ చల్లటి నీరు గుండె, వాగస్ నాడుల మధ్య సంబంధాన్ని దెబ్బతీయడంతో జీవితాంతం ఆ మందులు వాడాల్సిందే. లేదంటే గుండె అదుపులేకుండా వేగంగా కొట్టుకుంటుంది.అంటే.. ఒక విధమైన గుండె దడలా వచ్చి..మనిషి స్ప్రుహ కోల్పోయేలా చేసి ప్రాణాంతకంగా మారుతుంది. తనలా ఎవ్వరూ ఇలా చల్లటి నీరు తాగి గుండె సమస్యలు తెచ్చుకోకూడదని తాను ఎదుర్కొన్న అనుభవాన్ని షేర్ చేస్తున్నాడు. పైగా చల్లటి నీరు తాగొద్దనే చెబుతున్నాడు. (చదవండి: క్రియెటివిటీతో లక్షల్లో సంపాదన: ఓ 'అమ్మ' సక్సెస్ స్టోరీ) -
అమెరికాలో కార్చిచ్చు
కనాడియన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అడవికి నిప్పంటుకుని లక్షల ఎకరాల్లో పచ్చదనం మటుమాయమైంది. చెట్లు కాలిబూడిదయ్యాయి. సమీప ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే 2,00,000 ఎకరాల విస్తీర్ణంలో అటవీప్రాంతాన్ని కాల్చేసిన కార్చిచ్చు మరింత పెద్దదవుతూ అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. దీంతో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ దాదాపు 60 గ్రామాల్లో విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలను ముమ్మరంచేశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అణ్వాయుధాల కేంద్రం బంద్ ఈ ప్రాంతంలో సంభవించే అతి పెద్ద కార్చిచ్చులకు ది స్మోక్హౌజ్ క్రీక్ఫైర్గా పిలుస్తుంటారు. భయంకరమైన ఎండ, వేడి, పొడి వాతావరణం కారణంగా ఉత్తర టెక్సాస్ అడవిలో కార్చిచ్చు అంటుకుంది. సోమవారం మొదలైన ఈ కార్చిచ్చు టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సంభవించిన అతిపెద్ద కార్చిచ్చు ఘటనల్లో ఐదోది కావడం గమనార్హం. ఈ కార్చిచ్చు దెబ్బకు ఆమరిల్లో పట్టణంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న అమెరికా అణ్వాయుధాల కేంద్రంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్యాన్టెక్స్ సంస్థ వెల్లడించింది. జాతీయ రహదారుల వెంట చెట్లకు సైతం మంటలు అంటుకోవడంతో ఆయా హైవేలపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఓక్లహామా రాష్ట్ర సరిహద్దుల్లోని హెమ్ఫిల్, హచిన్సన్ కౌంటీల్లోనూ కార్చిచ్చు వ్యాపించింది. మియామీ, కనాడియన్ పట్టణాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సెనేటర్ కెవిన్ స్పార్క్స్ స్థానికులకు విజ్ఞప్తిచేశారు. కనాడియన్ పట్టణాన్ని కార్చిచ్చు దాదాపు చుట్టేసింది. స్కెలీటౌన్, వీలర్, అలీసన్, బ్రిస్కో పట్టణాల నుంచీ స్థానికులు వేరే చోట్లకు వెళ్లిపోయారు. కార్చిచ్చు ఘటనల కారణంగా టెక్సాస్ రాష్ట్రంలో మొత్తంగా కోటి 10 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా అమెరికాను కార్చిచ్చులు నిత్యం వణికిస్తున్నాయి. -
USA: టెక్సాస్లో కార్చిచ్చు బీభత్సం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కార్చిచ్చు రెండింతలవడానికి కారణమైందని వాతావరణ శాఖ తెలిపింది. 780 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 2 లక్షల ఎకరాల్లో వృక్షాలు కార్చిచ్చుకు ఆహుతయ్యాయని ఎఅండ్ఎమ్ ఫారెస్ట్ సర్వీస్ తెలిపింది. వీటిలో అతి పెద్ద కార్చిచ్చు స్మోక్ హౌస్ క్రీక్ ఫైర్ లక్ష ఎకరాలు, గ్రేప్ వైన్ క్రీక్ ఫైర్ 30 వేల ఎకరాలు, విండీ డ్యూసీ ఫైర్ 8 వేల ఎకరాలను దహించి వేసింది. కార్చిచ్చు బీభత్సం కారణంగా పలు కౌంటీల్లో ప్రజలను తరలిస్తున్నారు. తూర్పు టెక్సాస్, ద మిల్స్ క్రీక్, సాన్జాసిన్టోల్లో కార్చిచ్చు ఎగిసిపడుతోంది. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. కార్చిచ్చు పరిస్థితిని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ సమీక్షించారు. ప్రజలు కార్చిచ్చు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. I have a prayer request for y’all. The Texas Panhandle is on fire with zero containment. I don’t live in the panhandle but Texas is the home I live in currently and been in. Please pray for all in the path of this. Pray for Texas 🙏♥️ pic.twitter.com/U9R5Syb2kE — Rachel Wilson (@RachelWilson94) February 28, 2024 ఇదీ చదవండి.. మాలిలో ఘోర బస్సు ప్రమాదం -
Texas: భారత సంతతి కంప్యూటర్ ఇంజినీర్కు ప్రతిష్టాత్మక అవార్డు
టెక్సాస్: భారత సంతతికి చెందిన రీసెర్చర్ కంప్యూటర్ ఇంజినీర్ను అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. టెక్సాస్లో అత్యున్నత అకడమిక్ అవార్డుగా పేరొందిన ఎడిత్ అండ్ పీటర్ ఓ డన్నెల్ అవార్డును ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్కు అందజేశారు. ఈ అవార్డును ద టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ(టామ్సెట్)ఏటా అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి ప్రతి ఏటా అందిస్తుంది. అశోక్ వీర రాఘవన్ హూస్టన్లోని రైస్ యూనివర్సిటీకి చెందిన జార్జ్ ఆర్.బ్రౌన్ స్కూల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇమేజింగ్ టెక్నాలజీలో చేసిన పరిశోధనలకుగాను వీరరాఘవన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా వీరరాఘవన్ మాట్లాడుతూ ‘అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుత ఇమేజింగ్ టెక్నాలజీలో చాలా సమస్యలున్నాయి. కాంతి ప్రసరించకుండా అడ్డంకులున్నచోట మనకు కావాల్సిన వాటిని చూడలేకపోతున్నాం. దీనిని అధిగమించేందుకు మేం చేసిన పరిశోధనలు చాలా వరకు పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఉదాహరణకు కారు నడుపుతుంటే పొగమంచు వల్ల కాంతి పడకపోవడంతో ఎక్కువ దూరం రోడ్డును చూడలేకపోతున్నాం. విజిబిలిటీకి సంబంధించి ఇలాంటి సమస్యలు ఇక ముందు ఉండకపోవచ్చు’అని తెలిపారు. అశోక్ వీరరాఘవన్ తన బాల్యాన్ని తమిళనాడులోని చెన్నైలో గడిపారు. ఇదీ చదవండి.. సౌర రేడియేషన్తో పెను ముప్పు -
వైభవంగా టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024
టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 అమెరికాలో వైభవంగా జరిగింది. అలెన్లోని రాధా కృష్ణ టెంపుల్లో జరిగిన ఆరాధన కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు, గురువులు, విద్యార్థులు పాల్గొని త్యాగరాజ కీర్తనలను ఆలపించారు. సంగీత విద్వాంసులు కలిసి త్యాగరాజ స్వామి రచించిన ఘన రాగ పంచరత్న కృతులను, గాత్రం, వేణువు, వీణ, వయోలిన్, మృదంగం వంటి వాద్య సహకారంతో కీర్తిస్తూ మనసులను రంజింప చేశారు. పంతుల రమ త్యాగరాజ స్వామికి గళార్చన చేసి.. తన గ్రాతంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. ఎఎస్ఎన్ మూర్తి, పత్రి సతీష్ కుమార్, గురువులు, విద్యార్థులచే వయోలిన్, గాత్ర కచేరీ కార్యక్రమం వీనులవిందుగా కొనసాగింది. సంగీతాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 కార్యక్రమం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని సంగీత అభిమానులు కొనియాడారు. త్యాగరాజ కీర్తనలు భక్తి పారవశ్యంలో ఓలలాడించాయి అని తెలిపారు. టెక్సాస్లోని ఇండియన్ ఆక్టేవ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!) -
టెక్సాస్లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్!
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెక్సాస్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. లెవిస్విల్లేలోని Mac స్పోర్ట్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరిగింది. నాట్స్ ప్రో కప్, నాట్స్ అడ్వాన్స్డ్ కప్, నాట్స్ ఇంటర్మీడియట్ కప్ విభాగాల్లో వాలీబాల్ పోటీలు జరిగాయి. ప్లేయర్స్ పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. యూత్ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఆద్యంత్యం ఆకసక్తిగా సాగింది. నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్ను దిగ్విజయంగా నడిపించిన ప్రతిఒక్కరికి నాట్స్ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ తెలుగు వేడుకలు మార్చి 15,16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. డల్లాస్లోని అలెన్ ఈవెంట్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరు డల్లాస్ తెలుగు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. (చదవండి: లండన్లో యాత్ర 2 సక్సెస్ మీట్) -
ఉత్తర టెక్సాస్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు!
తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్.. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఫ్రిస్కోలోని రీడీ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. సంస్థ అధ్యక్షులు సతీష్ బండారు ఆధ్వర్యంలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను బావితరం మర్చిపోకుండా సంక్రాంతి సంబరాలలో పలు కార్యక్రమాలు చేపట్టింది టాంటెక్స్. సంక్రాంతి పాటలు, ముగ్గులు, ముచ్చట్లతో పాటు అత్యంత సుందరంగా బొమ్మల కొలువుతో వేదికను అలంకరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. ప్రముఖ సింగర్స్ శ్రీకాంత్, దీప్తి తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి గొప్పతనం చాటిచెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండగ వాతారవరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు స్టాల్స్కు విశేష స్పందన వచ్చింది. ఇక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్చంద మరియు సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మార్చిలో నాట్స్ సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డల్లాస్లో జరిగే నాట్స్ తెలుగు వేడుకల్లో అందరికీ పాల్గొని విజయవంతం చేయాలని సంస్థ సభ్యులు కోరారు. ఇక సంక్రాంతి సంబరాలు గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ మద్దతుగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న దాతలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు) -
Tesla: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం!
టెస్లా విషయంలో ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి టెక్సాస్కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. భారీ ప్యాకేజీ అందుకునేందుకు మస్క్ అనర్హుడంటూ డెలావర్ కోర్టు తీర్పు ఇచ్చిన తరుణంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలాన్ మస్క్ అనర్హుడంటూ డెలావర్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. డెలావర్ రాష్ట్రంలో ఎవరూ తమ సంస్థలను రిజిస్టర్ చేసుకోవద్దని పిలుపునిచ్చారు. The public vote is unequivocally in favor of Texas! Tesla will move immediately to hold a shareholder vote to transfer state of incorporation to Texas. https://t.co/ParwqQvS3d — Elon Musk (@elonmusk) February 1, 2024 అంతేకాదు.. టెస్లా ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్కు మార్చాలా? అని పోల్ కూడా పెట్టారు. ఆ పోల్లో 80 శాతం అవునని చెప్పడంతో.. మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు సైతం టెక్సాస్లోనే తమ కంపెనీలను రిజిస్టర్ చేసుకుంటాయి. పన్ను శాతం తక్కువగా ఉండడమే అందుకు కారణం. -
Texas: తీవ్రమవుతున్న సరిహద్దు భద్రత వివాదం
టెక్సాస్: సరిహద్దు భద్రతపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి మధ్య వివాదం తీవ్రమవుతోంది. అక్రమ వలసలకు మూలంగా మారిన షెల్బీ పార్కులోకి ఎవరినీ అనుమతించేది లేదని టెక్సాస్ ప్రభుత్వం తేల్చి చెబుతుంటే సరిహద్దు ఏజెంట్లను అనుమతించాల్సిందేనని ఫెడరల్ ప్రభుత్వం పట్టుబడుతోంది. జో బైడెన్ ప్రభుత్వం సరిహద్దు భద్రతలో వైఫల్యం చెందిందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ఆరోపించారు. దేశ దక్షిణ సరిహద్దు నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు టెక్సాస్ స్టేట్ నేషనల్ గార్డ్, ఇతర బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. షెల్బీ పార్కును టెక్సాస్ ప్రభుత్వం ఇటీవలే తమ ఆధీనంలోకి తీసుకుంది. రియో గ్రాండేలో ఉన్న ఈ పార్కులోకి ఎవరినీ అనుమతించేంది లేదంటూ ఫెడరల్ ప్రభుత్వ ఆదేశాలను కూడా టెక్సాస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ వివాదం కారణంగా స్టాండ్ విత్ టెక్సాస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఇదీచదవండి.. అమెరికాలో నైట్రోజన్ గ్యాస్తో మరణ శిక్ష -
టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
అమెరికాలో ఘోర ప్రమాదం.. ఏపీ ఎమ్మెల్యే బంధువుల దుర్మరణం
కన్సాస్, సాక్షి: అమెరికా సంయుక్త రాష్ట్రం కన్సాస్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వాసులుగా తెలుస్తోంది. అయితే.. జాన్సన్ కౌంటీ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయి. మృతి చెందిన వాళ్లు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా తేలింది. టెక్సాస్ నుంచి డల్లాస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య ,కుమార్తె మనవడు, మనమరాలు, మరో బంధువు అక్కడికక్కడే మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
ఆస్టిన్(అమెరికా): అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. గతంలో జైలుకు వెళ్లొచి్చన 34 ఏళ్ల షేన్ జేమ్స్ అనే వ్యక్తి టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో నాలుగు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పోలీసులు అధికారులుసహా ముగ్గురు గాయపడ్డారు. నిందితుడిని కారులో వెంబడించి మరీ పోలీసులు అరెస్ట్చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఏడింటి దాకా ఈ కాల్పుల ఘటనలు జరిగాయి. శాన్ ఆంటోనియో ప్రాంతంలో కాల్పులు జరిపాక 129 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరో చోటా ఇతను కాల్పులకు తెగబడ్డాడు. ఎందుకు కాల్పులు జరిపాడు? మృతులతో ఈయనకు ఉన్న సంబంధం ఏంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికాలో ఈ ఏడాది ఇది 42వ కాల్పుల ఘటన. -
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం
అమెరికా, టెక్సాస్లో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ - ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ఘనంగా ప్రారంబమైంది. ఆంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరై.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ అధ్యక్షుడిగా సత్యేంద్ర వానపల్లిని ఎన్నుకున్నారు. అమెరికాలో వున్న ఏకైక ఆంధ్రప్రదేశ్ నేషనల్ సంస్థ ఏఏఏ అని, ఆంధ్రప్రదేశ్ విశిష్టతను ఆబాల గోపాలానికి సుపరిచయం చేయడమే తమ ముఖ్యోద్దేశమని సంస్థ సభ్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం పట్ల ఒక చక్కని అవగాహన కలిగించే ప్రదర్శనలను చేయడమే తమ ఆశయమన్నారు. సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలు వివరించారు. ఇంకా సంక్రాంతి సంబరాలతో బాటు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు హరి మోటుపల్లితో పాటు న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్, బోర్డు సభ్యులు, ఏఏఏ నేషనల్ కోర్ టీమ్, ఆస్టిన్ చాప్టర్ సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులు, పలువురు సంస్థ ప్రతినిధుల పాల్గొని, ప్రసంగించారు. రానున్న రోజుల్లో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి ఈ చాఫ్టర్ మీట్ ఎంతగానో దోహదపడుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. తెలుగు వారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారని వివరించారు. ఏఏఏసంస్థకు మద్ధతుగా నిలిచి, అండగా ఉంటున్న ప్రతిఒక్కరికి నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అగ్రరాజ్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!) -
వీడియో వైరల్: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ కారును.. విమానం ఢీకొట్టింది. ఇదేంటి గాల్లో ఉండే విమానం ఎలా ఢీకొట్టింది అనుకుంటున్నారా?. అదే ఇక్కడ వెరైటీ. కాగా, ఈ వింత ఘటన టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. టెక్సాస్ రాష్ట్రంలోని మెక్కిన్నేలో ఓ విమానం రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం స్థానిక ఏరో కౌంటీ ఎయిర్పోర్టులో Iv-P ప్రాప్జెట్ విమానం రన్వే పై నుంచి టేకాఫ్ అయ్యింది. కానీ, వెంటనే దానిని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ విమానం రన్వేపై చివరి వరకు వచ్చినా ఆగలేదు. దీంతో అక్కడే ఉన్న కంచెను దాటుకొని రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొంది. That’s gonna leave a mark, ouch! 🫣 T31 airport in Mc Kinney, Texas today 🎥 IG jackschneider17 via @HamWa07 pic.twitter.com/CKbgCTHOse — Thenewarea51 (@thenewarea51) November 11, 2023 దీంతో, వెంటనే అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. పైలట్, ప్రయాణికుడు, కారు డ్రైవర్ను రక్షించాయి. వీరిలో ఒకరికి స్వల్పగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటలపాటు మూసివేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు! -
టెక్సాస్లో ఘనంగా దసరా అలయ్ బలయ్.. పాల్గొన్న ప్రవాసులు
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - 'మాట'(Mana America Telugu Association) డల్లాస్ చాప్టర్ దసరా అలయ్ బలయ్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. టెక్సాస్లోని డ్రీమ్ డెస్టినేషన్ రాంచ్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో 3000 మందికి పైగా ప్రవాసులు పాల్గొని సందడి చేశారు. 'మాట' టీమ్ ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. ఈ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రావణ దహనం కార్యక్రమాన్నిఅట్టహాసంగా నిర్వహించారు. ప్రవాసుల కేరింతల నడుమ రావణ దిష్టిబొమ్మ దహనం చేశారు. మాట సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, బిజెపి నాయకులు ప్రదీప్ రవికాంత్ ముఖ్య అతిథిలుగా విచ్చేసి, ప్రసంగించారు. 'మాట' డల్లాస్ చాప్టర్ రాజ్ సారథ్యంలో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించి, సన్మానించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, నృత్యాలతో.. అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. మహిళలు ఆటా పాటలు, కోలాటాలతో సందడి చేశారు. మగవారు డప్పులతో డాన్సులు చేస్తూ.. ఆకట్టుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ సింగర్స్ శ్రీకాంత్, స్పూర్తి తమ గాత్రంతో పాటలు పాడి ఆడియన్స్లో జోష్ నింపారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైనా ప్రతిఒక్కరికీ పసందైనా విందు భోజనం అందించారు. ఇక ఈ వేడుకలు విజయవంతం అవడం పట్ల 'మాట' డల్లాస్ చాప్టర్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సేవా, సంస్కృతి, సమానత్వం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థను స్థాపించడం జరిగిందని సంస్థ సభ్యులు వివరించారు. ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మాట సంస్థకు అండగా ఉంటూ సహాయసహాకారలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రవాసుల ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. -
టెక్సాస్లో గ్రాండ్గా 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్
అమెరికా, టెక్సాక్లో జరిగిన యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ DFW 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్ కార్యక్రమానికి అనుహ్య స్పందన వచ్చింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ కర్యాక్రమానికి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, హ్యూస్టన్ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీ మంజునాథ్ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రసంగించారు. భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక వాణిజ్యాల గురించి వారు ప్రస్తావించారు. టెక్సాక్-భారత్ ఆర్థిక సంబంధాలు వృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. టెక్సాస్ వృద్ధిలో భారతీయ అమెరికన్ల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ, అమెరికన్ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమం విజయవంతం కావడంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. 1999లో ఈ ఛాంబర్ని ప్రారంభించామని, ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా వార్షిక అవార్డ్స్ బాంకెట్ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించినట్లు తెలిపారు. 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement