-
న్యూజిలాండ్తో సెమీఫైనల్.. ముంబైకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్
వన్డేప్రపంచకప్-2023 లీగ్ దశను అద్బుత విజయంతో ముగించిన టీమిండియా.. ఇప్పుడు సెమీఫైనల్లో సత్తాచాటేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా తొలి సెమీఫైనల్లో నవంబర్ 15న ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో సోమవారం(నవంబర్ 13) సాయంత్రం ముంబైలో భారత జట్టు అడుగుపెట్టింది. నేరుగా బెంగళూరు నుంచి రోహిత్ సేన ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. కాగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం జట్టుతో కాకుండా తన ఫ్యామిలీతో ముంబైకు చేరుకున్నాడు. ఇక ముంబైకు చేరుకున్న భారత జట్టు మంగళవారం నుంచి రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గోనుంది. కాగా ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: World cup 2023: కివీస్తో సెమీస్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? Team India in Mumbai. - Time to beat Kiwis and make it to the Final...!!!pic.twitter.com/dmthEhDUA1 — Mufaddal Vohra (@mufaddal_vohra) November 13, 2023 -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఫీల్డింగ్ కోచ్గా మారిన ద్రవిడ్! వీడియో వైరల్
శుక్రవారం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ క్రమంలో తొలి వన్డేకు భారత జట్టు సారథిగా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. ఇక తొలి వన్డే కోసం రెండు రోజుల ముందే ముంబైకు చేరుకున్న హార్దిక్ సేన ప్రాక్టీస్ సెషన్స్లో మునిగి తేలింది. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో భారత జట్టు తమ ప్రాక్టీస్ను పూర్తి చేసింది. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్స్లో రాహుల్ ద్రవిడ్ ఫీల్డింగ్ కోచ్గా అవతరమెత్తాడు. ప్రపంచంలోనే అద్భుతమైన స్లిప్ ఫీల్డర్గా పేరొందిన ద్రవిడ్.. తన ఫీల్డింగ్ స్కిల్స్ను ఆటగాళ్లతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ద్రవిడ్.. యువ ఆటగాడు శుభ్మన్ గిల్కు స్లిప్ ఫీల్డింగ్ మెళకువలు నేర్పిస్తున్నట్లు కన్పించింది. ఇక ఈ మ్యాచ్కు రోహిత్ దూరం కావడంతో భారత ఇన్నింగ్స్ను శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు. తుది జట్లు(అంచనా) భారత్: శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా చదవండి: Ind Vs Aus: గిల్కు జోడీగా టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించేది అతడే: హార్దిక్ పాండ్యా A perfect 'catch'-up ft. #TeamIndia Head Coach Rahul Dravid & @ShubmanGill ahead of Match Day 👌👌 #INDvAUS | @mastercardindia pic.twitter.com/TC1mw5L7fX — BCCI (@BCCI) March 17, 2023 -
దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్జోన్
ముంబై: దేశవాళీ క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీని ఈస్ట్జోన్ జట్టు కైవసం చేసుకుంది. వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో ఈస్ట్ 24 పరుగుల తేడాతో వెస్ట్జోన్పై గెలిచింది. 1973-74 సీజన్లో మొదలైన దేవధర్ ట్రోఫీని ఈస్ట్జోన్ జట్టు నెగ్గడం ఇది ఐదోసారి. చివరిసారి ఈస్ట్ జట్టు 2003-04 సీజన్లో విజేతగా నిలిచింది. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్జోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారీ (92 బంతుల్లో 75; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సామంత్రి (50 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్సర్), విరాట్ సింగ్ (84 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ధావల్, జోసెఫ్ రెండేసి వికెట్లు తీశారు. వెస్ట్జోన్ జట్టు 47.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటయింది. 37 పరుగులకే అంబటి తిరుపతి రాయుడు సహా మూడు వికెట్లు కోల్పోయిన వెస్ట్ను... కేదార్ జాదవ్ (91 బంతుల్లో 97; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. అయితే చివరి ఓవర్లలో ఈస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చేజారకుండా చూసుకున్నారు. అశోక్ దిండా నాలుగు వికెట్లు తీశాడు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
ఎస్డీఎల్సీఈ ఏడీగా గోపీనాఽథ్
మండల సర్వసభ్య సమావేశం బహిష్కరణ
హామీల అమలుపై నోరువిప్పని ఎమ్మెల్యే ‘దొంతి’
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి
మరో 22 డివిజన్లు!
ఏఆర్ఓలు స్ట్రాంగ్రూంలను పరిశీలించాలి
మలివాల్ వాంగ్మూలం నమోదు
తాడిపత్రి పల్లెల్లో భయం.. భయం
తప్పక చదవండి
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
- బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
- Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు!
- Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
Advertisement